-
అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు. ఇన్చార్జ్లదే పెత్తనం వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్చార్జ్లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.సీటిచ్చినా పార్టీ మారారంట..! ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే.. రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు.. జిల్లాలో హాట్ సీట్..ఇన్కం క్రియేట్ సీట్గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులకు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్తోనే సీటు దక్కింది.. ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం.. ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే.. పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల పర్వం షురూ.. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వెండితొడుగు బహూకరణ పామర్రు మండల పరిధి రాపర్లలో వేంచేసియున్న వీరాంజనేయస్వామి దేవాలయానికి భక్తులు వెండి సర్వాంగాన్ని బహూకరించారు. బెజవాడలో భారీ అగ్ని ప్రమాదంవిజయవాడలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. మందుల, వస్త్రాల గోడౌన్లో ప్రమాదం సంభవించింది. u8లో 7 -
జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి
బంటుమిల్లి: రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటి ముందుకు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నాయకులు, కార్యకర్తలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా హారిక, రాము ఇద్దరు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రామును, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వి. చినబాబు, వైస్ ఎంపీపీ ఒ.చిన్నారి బాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టి.శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్చైర్మన్ పి. బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు కమాల్ బాషా, పి.వీరబాబు, ఆలీం, కె. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్. మహేష్, నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం.రాజబాబు, ఎం.వెంకటేశ్వరరావు, జి.బాల, సీహెచ్ రాధాకృష్ణ, బి. గాంధీ, పి.నాని పాల్గొన్నారు. ప్రజాదీవెనలో జెడ్పీ చైర్పర్సన్ హారిక -
టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది
ఎమ్మెల్సీ అరుణకుమార్ నందిగామ టౌన్: తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నందిగామలోని ఏడోవార్డుకు చెందిన 80మంది పెద్దముఠా సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి ఆపార్టీలో చేరిన పెద్దముఠా సభ్యులు, టీడీపీ వారి మోసపూరిత హామీలను గ్రహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నాయకులు మాడుగుల మనోహర్, బోజవాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కంచికచర్లలో 42కుటుంబాలు చేరిక కంచికచర్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల ద్వారా లబ్ధిపొంది, అభివృద్ధిపథంలో పయనిస్తున్న మహిళలే ఈ ఎన్నికల్లో జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. కంచికచర్ల అరుంధతీ, అంబేడ్కర్నగర్ నుంచి 42కుటుంబాలు టీడీపీని వీడి గురువారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నందిగామ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావును మరోసారి గెలిపించాలని వారికి సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు మహిళలు నమ్మించి మోసం చేయగా, సీఎం జగనన్న మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు అన్నిరంగాల్లో సముచితస్థానం కల్పించారన్నారు. అందుకే మళ్లీ ప్రతి మహిళ జగనన్నకు అండగా ఉంటామని చెబుతున్నారన్నారు. అందరికీ మేలు చేసిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కంచికచర్ల పట్టణ కన్వీనర్ వేమా సురేష్బాబు, నాయకులు అమర్లపూడి యోహాన్, మహిళలు పాల్గొన్నారు. -
స్వామిదాసు వార్షికాదాయం రూ.5.50 లక్షలు
ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన నల్లగట్ల తిరువూరు: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు గురువారం తన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తులు, అప్పుల వివరాలు తెలుపుతూ అఫిడవిట్ను రిటర్నింగ్ అధికారి మాధవికి సమర్పించారు. తనకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షికాదాయం రూ.5.50 లక్షలని, తన భార్య సుధారాణి ఆదాయం రూ.4.80 లక్షలుగా చూపారు. స్వామిదాసు పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ.13 లక్షలు, తియ్యగూర కోల్డ్స్టోరేజీలో రూ.7.85 లక్షలు పెట్టుబడి, నగదు రూ.5 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయని, తన భార్య పేరుతో రూ.4 లక్షల నగదు, బ్యాంకులలో డిపాజిట్ రూ.8 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఉన్న చరాస్తుల విలువ కోటీ 46 లక్షల 37 వేల 353 రూపాయలుగా పేర్కొన్నారు. స్థిరాస్తుల విలువ రూ.కోటీ 59 లక్షలుగా తెలిపారు. బ్యాంకులు, సహకార సంఘాల్లో రూ.17.50 లక్షల అప్పులు ఉన్నాయని ప్రకటించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం –1 పబ్లిక్ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ● తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఒక సెట్ మాత్రమే సమర్పించారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి యలమంచలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య, అయన సతీమణి శ్రీరాం శ్రీదేవి నామినేషన్లు వేశారు. బహుజన సమాజ్ పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ● నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీ అభ్యర్థి రెండు సెట్లు , ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ● విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ● విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) అభ్యర్థి గుజ్జుల లలిత రెండు సెట్లు, తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన అర్జున్ చేవేటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వీరు తమ నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని పార్లమెంట్ రిటర్నింగ్ కార్యాలయంలో ఆర్వో, కలెక్టర్ ఢిల్లీరావుకు సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత.... నామినేషన్ల సందర్భంగా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో నలుగురుని మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. ఆర్వో కార్యాలయానికి 100, 200 మీటర్ల వరకు పోలీసు బందోబస్తు కల్పించారు. 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అభ్యర్థుల కార్లను అనుమతించారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం ఎన్టీఆర్ జిల్లాలో తొలి రోజు అసెంబ్లీకి 11 నామినేషన్లు పార్లమెంట్కు రెండు నామినేషన్ల దాఖలు -
ఆటో డ్రైవర్పై పోక్సో కేసు
బల్లికురవ: బాలికను మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు బల్లికురవ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సి.బాలకృష్ణ గురువారం తెలిపారు. మండలంలోని కూకట్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ అవినాష్ కూలీలను ఆటోలో వ్యవసాయ పనులకు వివిధ గ్రామాలకు తీసుకువెళ్తుంటాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన బాలిక ఆటోలో పనులకు వస్తోంది. ఆమెకు మాయమాటలు చెప్పి ఈనెల 15న బయటకు తీసుకెళ్లాడు. మూడు రోజులైనా గ్రామానికి రాకపోవటంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గురువారం ఇంటికి వచ్చిన బాలిక తనపై అవినాష్ అత్యాచారం చేశాడని తల్లిదండ్రులకు వివరించటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు. -
అగ్నిప్రమాదంలో రూ.కోటి ఆస్తినష్టం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జనరిక్ మందుల గోడౌన్, వస్త్రాల గోడౌన్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సేకరించిన వివరాల మేరకు.. బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జీప్లస్2 కమర్షియల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసు, జనరిక్ మందుల గోడౌన్, సెకండ్ ఫ్లోర్లో వస్త్రాల గోడౌన్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో బిల్డింగ్ టెర్రస్పై నున్న వర్కర్లు మెట్ల మార్గం గుండా కిందికి వస్తూ కిటికీల్లోంచి దట్టమైన పొగ వస్తుంటాన్ని గమనించి, దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. నగరంలోని ఎనిమిది అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపుచేశారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రూ.కోటి వరకు నష్టం వాట్లిల్లి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంట్ పోయిందని ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని, పూర్తి స్థాయిలో ఆస్తినష్టం అంచనా వేస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
కూటమి షో అట్టర్ ఫ్లాప్
● జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన ● గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు ● మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు ● మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు ● బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పెడన, మచిలీపట్నంలో... ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం.. మచిలీప ట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి. జనం లేక ఆలస్యంగా సభలు జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు.జగన్కు అడుగడుగునా జన ప్రవాహం సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి. -
గ్రూపుల గోల
● వెనిగండ్లను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ● టీడీపీ ప్రచారానికి స్పందన కరువు ● నిస్తేజంలో తెలుగు తమ్ముళ్లు ● మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న కొడాలి నాని గుడివాడ టీడీపీలోగుడివాడ రూరల్: గుడివాడ టీడీపీ గ్రూపుల గోలతో సతమతమవుతోంది. రాజకీయాలకు కొత్త అయిన వెనిగండ్ల రాముకు టీడీపీ సీటు దక్కగా...ఆ టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు తీవ్రఅసంతృప్తితో ప్రచారంలో అంటీముట్టనట్లు ఉంటుండటంతో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన ఊపుతో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారానికి జనం స్పందన అంతంత మాత్రంగానే ఉండటం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల గుడివాడ పట్టణంలో మచిలీపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలసి వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రచార ర్యాలీలో పట్టుమని 50మంది కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఎంపీ అభ్యర్థి వల్లభనేని సైతం అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్ఆర్ఐగా ఎన్నికల బరిలో దిగుతున్న వెనిగండ్ల రాము విచ్చలవిడిగా డబ్బు వెద జల్లుతూ ప్రచారానికి వచ్చేవారికి రోజువారీగా తగినమొత్తం ఇస్తామని చెబుతున్నప్పటికీ జనం రాకపోతుండటంతో టీడీపీ కేడర్ రోజురోజుకు డీలాపడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా గుడివాడలో పార్టీకి ఇంకా ఓ ఊపురావడం లేదని రాము వర్గీయులతోపాటు తెలుగుతమ్ముళు మథనపడుతున్నారు. రావి వర్గీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత.... గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వర్గీయుల నుంచి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యాపారాలు వదిలేసి అధినేత ఆదేశాల మేరకు కోట్లు ఖర్చుచేసి పార్టీని నిలబెట్టిన రావికి సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతుడైన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు సీటు కేటాయించినప్పటీ నుంచి రావి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలతో పాటు పట్టణంలో కూడా రావికి బలమైన వర్గం ఉంది.అదేసమయంలో వెనిగండ్ల రాము, రావి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతుండటంతో కూడా వారు దూరంగా ఉండటానికి మరో కారణమని చెప్పవచ్చు. ఇటీవల టీడీపీ ఎన్నికల కార్యాలయంలో రావి వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడుపై నాయకులంతా చూస్తుండగానే వెనిగండ్ల వర్గానికి చెందిన ఓ మహిళ కుర్చీతో దాడిచేయడంపై రావి వర్గీయులు రగిలిపోతున్నారు. రావి కుటుంబానికి అత్యంత సన్నితంగా ఉండే బీసీ నాయకుడు దేవరపల్లి కోటి కూడా వెనిగండ్ల వర్గీయులతో ఇమడలేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ఇటీవల పార్టీలో చేరడం గమనార్హం. ఒంటెద్దు పోకడలే కారణం.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నేతలతోనూ అంటీముట్టనట్లుగా ఉంటుండటంతో వారు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. జనసేనలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, మిగిలినవారిని పట్టించుకోకపోతుండటంతో ఆపార్టీ నాయకులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో దళితులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల జనసేన దళిత నేతలు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోకపోతుండటంతో కూటమి అభ్యర్థి రాముతీరుపై వారు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇలా ఒంటెద్దు పోకడల కారణంగానే కూటమి పార్టీల నాయకులు రాముకు దూరమవుతున్నారని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న కొడాలి.. ప్రతిష్టాత్మక గుడివాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కొడాలి నానికి నియోజకవర్గంపై గట్టిపట్టు ఉంది. సాయం కావాలని ఎవరూ వచ్చినా, వారికి సాయం చేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పడంతోపాటు వారికి అండగా నిలబడటం కొడాని నాని ప్రత్యేకత. ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైనశైలిలో కృషిచేస్తూ, ప్రజలకు అండగా ఉంటుండటంతో ఎన్నికల ప్రచారంలో ఏవార్డు..గ్రామానికి వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో కూడా ఎమ్మెల్యే కొడాలి నానికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుడివాడలో ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన మేమంతా సిద్ధం సభతో వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అభివృద్ధి, సంక్షేమం ఆయన విజయానికి దోహదపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గత 20ఏళ్లుగా ప్రజాబలంతో అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానితో తలపడే విషయంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటుండటం గమనార్హం. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానదిలో రైల్వేట్రాక్ కింద రెండు, మూడు నంబర్ల ఫిల్లర్ మధ్యన ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిపే వివరాలేవి లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని, ఎరుపు, తెలుపు, బ్లూ, బ్లాక్ డిజైన్ గుర్తులు కలిగిన తెలుపురంగు పుల్హాండ్స్ చొక్కా, నలుపురంగు జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. కాళ్లకు ఆరెంజ్, తెలుపు, బ్లాక్ రంగు కలిగిన షూ వేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మరణించాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్యచేసి నదిలో పడేసి ఉంటారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ యువకుడు.. మృత్యుంజయుడు హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం బొమ్ములూరులో 150 అడుగుల లోతైన వ్యవసాయ గాడిబావిలో ప్రమాదవశాత్తూ పడిన ఓ యువకుడిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షించారు. వివరాల్లో వెళ్లితే..గ్రామానికి చెందిన కత్తుల పవన్ అనే యువకుడు గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ వ్యవసాయ గాడిబావిలో పడిపోయాడు. గమనించిన తోటిమిత్రులు భయాందోళనతో హనుమాన్జంక్షన్ పోలీసులకు సమాచారం అందించగా, ఎస్ఐ ఏడీఎల్ జనార్దన్ హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే హనుమాన్జంక్షన్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఆఫీసర్ గరికపాటి రామ్మోహనరావు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని 150అడుగుల లోతైన గాడిబావిలో పడిన యువకుడిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న కత్తుల పవన్ను చినఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్యశాలకు చికిత్సనిమిత్తం తరలించారు. రాత్రివేళలో పవన్, అతని మిత్రులు వ్యవసాయ గాడిబావి వద్దకు ఎందుకు వెళ్లారు?, ప్రమాదవశాత్తూ గాడిబావిలో పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో హనుమాన్జంక్షన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీకి చిక్కిన ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు తెనాలి రూరల్: ఏసీబీ వలకు ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు, మరో ప్రైవేట్ బిల్డింగ్ ప్లానర్ చిక్కారు. ఓ భవన నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా దొరికిపోయారు. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే వివరాల మేరకు.. చేబ్రోలు మండలం వడ్లమూడికి చెందిన ఓ వ్యక్తి జీ ప్లస్ టూ భవన నిర్మాణం కోసం తెనాలిలోని సీఆర్డీఏ జోనల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్న లీల చంద్రశేఖరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సాయినాథ్ అతనిని రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. నగదును తెనాలిలోని ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్ ఇమ్రాన్ ఖాన్ ద్వారా పంపాలని షరుతు పెట్టారు. అనుమతులకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తి, సమీప బంధువు రత్నబాబుతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగానే నగదును ఇమ్రాన్ఖాన్కు గురువారం అందజేయగా అతను తీసుకెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో ఉన్న చంద్రశేఖరరావు, రాజేంద్రసాయినాథ్కు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులతో పాటు ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్పైనా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు సత్యానంద్, ప్రతాప్కుమార్, ఆరుగురు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. రూ.1.01లక్షల విరాళం కోడూరు: కోడూరులో నూతనంగా నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి అల్లంశెట్టి రాజేంద్రప్రసాద్–లక్ష్మి, నందకిషోర్–సుమప్రియ దంపతులు రూ.1,0,1,116 నగదును విరాళంగా అందజేశారు. ఈ మేరకు నగదును గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. పూర్తి గ్రానైట్తో నిర్మిస్తున్న ఆలయానికి తమవంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్, నందకిషోర్ దంపతులు తెలిపారు. కమిటీ సభ్యులు అన్నం వెంకటసుబ్బారావు, బూరగడ్డ హరినాథ్బాబు, జూపూడి సుభాష్చంద్రబోస్, బడే భావన్నారాయణ, అన్నం శివరామకృష్ణ, ఉల్లి రంగారావు పాల్గొన్నారు. భవన నిర్మాణ అనుమతులకు రూ.30వేలు లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు మరో ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్పై కూడా కేసు నమోదు -
యార్డులో 88,176 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 88,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 83,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 19,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 68,946 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. -
19 నుంచి 23 వరకు
ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ద్వాదళ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 9–30 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు మంగళస్నానాలను నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ చేస్తారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఉత్సవాలకు అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్నిప్రతిష్టాపన, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. -
నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళం
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కేతినేని రత్నాకరరావు, లక్ష్మీ శమంతకమణి దంపతులు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. గురువారం ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఈ విరాళాన్ని ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. దాత కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రతిభపెనమలూరు: జాతీయ స్థాయిలో జరిగిన చిత్రలేఖన పోటీల్లో పోరంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పతకాలు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మలినేని సుమలత గురువారం వివ రాలు తెలుపుతూ ఉగాది పండుగ సందర్భంగా నెల్లూరు అమీర్జాన్ అకాడమీ, విజయవాడ డ్రీమ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ, ఏపీ కల్చరల్ కమిషన్ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎ.మణికంఠ, జె.చరణ్ కుమార్, పి.వరుణ్, కె.నాగమణి, వి.భార్గవి బంగారు పతకాలు, బి.సాత్విక్, ఎ.అఖిల, ఎన్.ఉమామహేశ్వరరావు వెండి పతకాలు సాధించారని తెలిపారు. పోరంకి పాఠశాలలో డ్రాయింగ్ మాస్ట్టారు పోస్టు ఖాళీగా ఉన్నందున విశ్రాంత డ్రాయింగ్ మాస్టారు ఆరేపల్లి అప్పారావు విజయవాడ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారన్నారు. పవిత్రతకు చిహ్నాలు ఆలయాలు పామర్రు: పవిత్రతకు చిహ్నాలు మన ఆలయాలు అని వాటిని మనం అందరం కలిసి కాపాడుకోవాలని దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.శాంతి అన్నారు. స్థానిక ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో గురువారం ఆమె పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన దేవాలయాల పరిరక్షణకు దేవదాయ ధర్మదాయ శాఖ ఎంతో కృషి చేస్తోందని అన్నారు. జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. తొలుత ఆలయానికి వచ్చిన ఏసీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్.సత్యవతి, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం రామాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): అత్మహత్య చేసుకోవాలని ఇంటి నుంచి వెళ్లిన బాలుడిని రైల్వే అధికారులు, జీఆర్పీ పోలీసులు కాపాడారు. ఆ బాలుడిని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..కాకినాడకు చెందిన రేష్మన్(17) ఈనెల 12న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మన్ ఈనెల 16వతేదీన ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా కనిపించకపోవడంతో బస్టాండ్, రైల్వేస్టేషన్లోనూ బాలుడి ఫొటో చూపించి వాకబు చేశారు. ఈ క్రమంలో కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్లో బాలుడు ఎక్కినట్లు అక్కడి రైల్వే పోర్టర్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయగా, వారు శేషాద్రిలో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ, జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో రాజమండ్రి రైల్వేస్టేషన్లో రైలు ఆగినపుడు, రైలులోని ఎస్–11 బోగిలో ఫుట్బోర్డుపై రేష్మన్ కూర్చొని ఉండటాన్ని టీటీఈ ఎస్.చంద్రమౌళి గుర్తించారు. బాలుడిని రాజమండ్రి రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వేపోలీసులు ఆ బాలుడిని బుధవారం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాలుడిని ఆచూకీ కనుగొన్న టీటీఈ చంద్రమౌళి, జీఆర్పీ సిబ్బందిని ఈసందర్భంగా విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ గురువారం అభినందించారు. -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో రమేష్బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతితో పరిసమాప్తం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఆది దంపతులకు మంగళ స్నానాలు ధ్వజారోహణతో దేవతలకు ఆహ్వానం -
20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 20, 21 తేదీల్లో విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని మనసు ఫౌండేషన్ స్థాపకులు ఎం.వి.రాయుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందులో సాధారణ గ్రంథాలతో పాటు తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మిక, సాంఘిక, భాష, ఇంజినీరింగ్, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంథాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం తదితర పుస్తకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలానే పదవ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్తో కలిపి దాదాపు 35 వేలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారితోపాటు, వత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారికి కూడా ఉపయోగపడే వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పౌరులందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి వి.జస్టిన్ నియమితులయ్యారు. విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సౌరభ్ శర్మ, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి మదన్ కుమార్ నియమితులయ్యారు. గురువారం వీరిని పంచాయతీరాజ్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జేసీ పి.సంపత్ కుమార్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛాన్ని అందజేశారు. -
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
కోనేరుసెంటర్: సాధారణ ఎన్నికల సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయానికి ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ కేంద్రంలో సెగ్మెంట్ల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలతో వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రాంత చదును పనులను పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయ భవనాలకు నలువైపులా ఏర్పరచిన మార్గాలకు వాహనాలు చేరేలా చదును చేయాలని సిబ్బందికి సూచించారు. నియోజకవర్గాల వారీగా మార్గ సూచికలు (సైనేజ్ బోర్డులు) ఏర్పాటు చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ పనులను మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్వో కె. చంద్రశేఖరరావు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సర్వే ఏడీ మనీషా త్రిపాఠి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, కృష్ణా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ సుందరకృష్ణ, తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు బందోబస్తు ఏర్పాట్లపై ఆదేశాలు -
మళ్లీ సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలి
ఎలకుర్రు(పామర్రు): రానున్న ఎన్నికల్లో లంచాలు లేని ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. మండలంలోని ఎలకుర్రు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత పామర్రులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఎలకుర్రు గ్రామం బయలుదేరారు. ఎలకుర్రు, కొరిమెర్ల ప్రాకర్ల గ్రామాల్లో ఉదయం, నిమ్మలూరు, మలయప్పన్నపేట, కాపవరం, సప్తర్ఖాన్పాలెం, మల్లవరం, పరిశేపల్లి, పసుమర్రు గ్రామాల్లో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యేగా తనను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. పెత్తందార్లు పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. కార్యక్రమంలో పామర్రు, మొవ్వ ఎంపీపీలు దాసరి అశోక్కుమార్, కుందేటి ఇందిర, పామర్రు, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యులు కె. స్వరూపరాణి, జొన్నల రామ్మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, నాగమల్లేశ్వరరావు, కాకొల్లు రాజ్యలక్ష్మీ, నాయకులు కాకర్ల వెంకటేశ్వరరావు, పెయ్యల రాజు, ముప్పిడి సురేష్రెడ్డి, ఆరుమళ్ల శ్రీనాఽథ్రెడ్డి, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పామర్రు ఎమ్మెల్యే అనిల్కుమార్ -
ఇక ఆంధ్రా రైతు బ్రాండ్!
అన్నదాతకు తీరని కల ఒకటి ఉంది. తన పంటను నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు విక్రయించుకోవడం! దీనిని సుసాధ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. పండించిన పంటను ప్రీమియం ధరకు అమ్ముకునేందుకు వీలుగా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్(జీఏపీ) సర్టిఫికేషన్ను తీసుకొచ్చింది. మన దేశంలో ఇది అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం.సర్టిఫికెట్ల జారీ.. నాణ్యతా పరీక్షల అనంతరం ఈ పదహారు మంది రైతులు పండించిన ధాన్యం నమూనాలు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్–2011కి అనుగుణంగా ఉన్నట్లు తేల్చి రైతుల ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారిస్తూ.. ఏపీఎస్ఓపీసీఏ పదహారు మంది రైతులకు సర్టిఫికెట్లను జారీ చేసింది. సర్టిఫికెట్లను పొందిన రైతులకు ప్రస్తుతం రబీ సీజన్లో కూడా శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణలో రైతుల ధాన్యం ఉత్పత్తులను క్వాలిటీ పరీక్షలు జరిపి సర్టిఫికెట్లను ఇచ్చేందుకు ఈ పదహారు మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసింది. జి.కొండూరు: ఆంధ్రప్రదేశ్ రైతులను గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేశారు. వైఎస్సార్ పొలంబడి పేరుతో సాధారణంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలతో పాటు మేలైన సేద్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే.. ఆర్గానిక్ వ్యవసాయంపై సంపూర్ణ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా రైతులే తమ ఆహార ధాన్యాలను విక్రయించే విధంగా ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వైఎస్సార్ ఇండ్గ్యాప్(జీఏపీ) పొలంబడి పేరుతో 16మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ(ఏపీఎస్ఓపీసీఏ) ద్వారా స్కోప్ సర్టిఫికెట్లను సైతం అందజేశారు. శిక్షణ ఇలా.. వైఎస్సార్ ఇండ్ గ్యాప్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 2023–24 సంవత్సరానికి గానూ ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో వరి పండించే కుంటముక్కల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అనంతరం ప్రేమధార ఫార్మర్ ప్రొడ్యూసింగ్ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్లో సభ్యులుగా ఉన్న పదహారు మంది రైతులను ఎంపిక చేశారు. ఈ పదహారు మంది రైతులు సాగు చేస్తున్న 61.65ఎకరాల భూమిలో శిక్షణ ప్రారంభించారు. వీటిపైనే శిక్షణ.. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ, నీటి యాజమాన్యం, సమగ్ర కలుపు నివారణ యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టడం, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు తయారు చేయడం, రైతులే తమ పొలాల్లో పర్యావరణ కారకాలపై అధ్యయనం చేసి సాధికారతను సాధించడం, వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కేంద్ర బృందాల పర్యవేక్షణ.. ఈ శిక్షణకు ఎంపిక చేసిన రైతులకు ఖరీఫ్ సీజన్లో 14వారాల చొప్పున ప్రతి శుక్రవారం ఇండ్ గ్యాప్ పొలంబడి శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో రైతులు పండిస్తున్న వరి పైరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అధారిటీ (ఏపీఎస్ఓపీసీఏ)కి చెందిన క్యాలిటీ మేనేజ్మెంట్ బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. పంట కాలం పూర్తయిన తర్వాత ధాన్యాన్ని పరీక్షలకు పంపింది. ఈ పరీక్షలలో పంట ఉత్పత్తులలో ఆర్సనిక్, కాడ్మియం, కాపర్, మెర్కురీ, టిన్ వంటి ఇన్ ఆర్గానిక్ అవశేషాలతో పాటు సూక్ష్మ విష పదార్థాలైన ఎప్లోటాక్సిన్స్, రసాయనిక అవశేషాలు కూడా లేనట్లు గుర్తించారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వైఎస్సార్ ‘గ్యాప్’ పొలంబడి గ్లోబల్ మార్కెటింగే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కుంటముక్కలలో నిర్వహణ ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, అధికాదాయమే లక్ష్యంరైతులకు సువర్ణావకాశం వైఎస్సార్ ఇండ్ గ్యాప్ పొలంబడి రైతులకు సువర్ణావకాశం. ఈ శిక్షణ కార్యక్రమం వల్ల రైతులు తమ ధాన్యాన్ని గ్లోబల్ మార్కెట్లో నేరుగా అమ్ముకునేలా వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో గ్లోబల్ మార్కెటింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం గొప్ప నిర్ణయం. – ఎం. రాంకుమార్, వ్యవసాయాధికారి, జి.కొండూరు సేంద్రియమే మేలు సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే విధానంపై 14వారాలు శిక్షణ ఇచ్చారు. నేను 7.70ఎకరాలలో ఎంటీయూ–1061 రకం వరిని సాగు చేశా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చాయి. మా పంటను ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునేలా సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. – పామర్తి సాంబయ్య, రైతు, కుంటముక్కల గ్రామం -
మంత్రముగ్దులను చేసిన తీర్థతరంగాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ధర్మపథం వేదికపై కృష్ణ సంపత్కుమార్ బృందం ఆలపించిన నారాయణ తీర్థతరంగాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ధర్మపథం వేదికపై సంపత్కుమార్ పలు కీర్తనలను మనోహరంగా అలపించారు. సంపత్కుమార్కు పాలవర్తి నాగేశ్వరరావు వయోలిన్, డి.అనిల్కుమార్ మృదంగంపై సహకారం అందించారు. అంతకు ముందు సంపత్కుమార్ బృందానికి ఆలయ ఈవో కె.ఎస్.రామరావు అమ్మవారి శే షవస్త్రాలు, ప్రసాదాలను ఇచ్చి సత్కరించారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పెడన మండలం గాయంపాడు గ్రామ వాసి అర్జా పవన్(27) ఐడీఏలోని ఓ లాడ్జిలోని రూమ్లో అద్దెకు ఉంటూ రాణి లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాడ్జి గదిలో పవన్ బోర్లా పడుకుని మృతి చెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని తండ్రి అర్జా రాంబాబు ఫిర్యాదుపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ పాపారావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ తెలిపారు. చిన్నారిపై లైంగికదాడి పోక్సో కేసు నమోదు కంకిపాడు: చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడిపై కంకిపాడు పోలీసుస్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన వంగా ప్రవీణ్ క్లీనర్గా చేసి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతంలో అతని ఇంటి సమీపంలో ఉండే కుటుంటంతో సన్నిహితంగా మెలిగేవాడు. ప్రస్తుతం ఆ బాలిక కుటుంబం వేరే చోట ఉంటోంది. ఆ కుటుంబం ఉంటున్న ప్రాంతానికి మంగళవారం రాత్రి వచ్చి బాలిక (5)పై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో మోసం
హనుమాన్జంక్షన్ రూరల్: చిట్టీల వ్యాపారం పేరుతో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేసి పరారైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తురకా పుల్లయ్యపై హనుమాన్జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడరోడ్డులో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర చిట్ఫండ్స్ కంపెనీ ఏర్పాటు చేసి తోటి టీచర్లు, ఉద్యోగులను నుంచి రూ.కోట్లలో చిట్టీలు, డిపాజిట్లు కట్టించుకుని చివరికి ఊడాయించాడు. ఖాతాదారులంతా లబోదిబోమంటూ తురకా పుల్లయ్య బాధితుల సంఘంగా ఏర్పడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 420, 406, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్ల రక్షణ చట్టం కింద తురకా పుల్లయ్య, ఆయన కుమారుడు అశోక్రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఏడీఎల్ జనార్ధన్ బుధవారం తెలిపారు. పక్కా పథకం ప్రకారం ముందస్తుగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) చేయటంతో పాటుగా, స్థిరాస్తులను ఇతరుల పేరిట బదలాయించి కుటుంబ సభ్యులతో సహా గ్రామం నుంచి పరారయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఇప్పటికే కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా, మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిర్వాహకుడు ప్రభుత్వ టీచర్ పుల్లయ్య జంక్షన్ నుంచి పరారు కేసు నమోదు -
రామదర్శనం.. జన్మధన్యం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామచంద్రుడి దర్శనం.. జన్మధన్యం అంటూ భక్తజనం రఘురాముడిని మనసారా కొలిచారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శ్రీరామ నవమి వేడుకలను బుధవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధి నుంచి హనుమత్ సమేత సీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపుగా ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పల్లకీని మోసుకుంటూ కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేద పండితులు సీతారామ కల్యాణ విశిష్టతను వివరిస్తుండగా, అభిజిత్ లగ్నంలో స్వామి వారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. ఆలయ ఈవో రామరావు స్వామివారికి, సీతాదేవికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు తరలిరాగా, వారికి అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం చేసింది. చలువ పందిరి కింద కూలర్లు, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి వారి తలంబ్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, యజ్ఞనారాయణ మూర్తి, కోట ప్రసాద్, లింగంభోట్ల బద్రీనాఽథ్బాబు, ఇతర అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు -
వైభవంగా శ్రీరామచంద్రుని శోభాయాత్ర
విజయవాడకల్చరల్: శ్రీ రామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన బైక్ ర్యాలీ వైభవంగా సాగింది. తాళ్లాయపాలెం శైవ పీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. శారదా కళాశాలలోని ఆదిశంకరా మార్గ్లో ప్రారంభమైన శోభాయాత్ర, సంగీత కళాశాల, బీఆర్టీఎస్ రోడ్డు, సత్యనారాయణ పురం, ఏలూరు రోడ్డు మీదుగా సాగింది. జై శ్రీరాం అంటూ వందలాది మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర కన్వీనర్ నాగలింగం శివాజీ మాట్లాడుతూ.. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల భవ్య రామమందిరం నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. -
చంద్రబాబు మాటలు నమ్మరు
వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావురామవరప్పాడు: చంద్రబాబు దొంగ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు చెప్పారు. రామవరప్పాడులో బుధవారం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరిచి పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణే జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తోక పార్టీల కుట్ర రాజకీయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక తోక పార్టీలన్నీ కుట్రరాజకీయాలు చేస్తున్నాయని తమ విలువైన ఓట్ల ద్వారా వారికి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న జగన్పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేయించడం దుర్మార్గ చర్య అన్నారు. సంక్షేమమే అజెండాగా జగన్ ప్రజల మధ్యే పర్యటిస్తున్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయన్నారు. సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని ఒకటో వార్డు సభ్యురాలు బర్రె దేవుడమ్మతో పాటు పలు కుటుంబాలు వంశీమోహన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, నియోజకవర్గ ఎలక్షన్ ఇన్చార్జి ఆర్.వెంకటేశ్వరరావు, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు శీలం రంగారావు, గ్రామ సర్పంచి వరి శ్రీదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement