NTR district News
-
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయని శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంజీ రోడ్డులోని ఎంఅండ్ఎం శ్రీ చైతన్య విద్యాసంస్థల క్యాంపస్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శనివారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్–2025 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో కె.మానస, జి.లహరి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే బైపీసీ విభాగంలో షేక్ ఆఫీఫా తబస్సుమ్ 992 మార్కులతో అసాధారణ ప్రతిభ కనబరిచిందన్నారు. 990 ఆపై మార్కులు 172 మంది, 247 మంది 985 ఆపై మార్కులు, 792 మంది 980 ఆపై మార్కులు, 8551 మంది 900 ఆపై మార్కులు పొందారని వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లోనూ విజయ పరంపర ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ తమ విద్యార్థుల విజయ పరంపర కొనసాగిందన్నారు. ఎంపీసీ విభాగంలో 467 మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఎం.వినూత్న, బి.యశ్వంత్ నాయక్ అగ్రస్థానంలో నిలిచారన్నారు. బైపీసీ విభాగంలో చల్ల లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రఽథమ స్థానం పొందారని చెప్పారు. ఎంపీసీ విభాగంలో 466 ఆపై మార్కులు 23 మంది, 465 ఆపై మార్కులు 157 మంది, 460 ఆపై మార్కులు 1212 మంది, 400 ఆపై మార్కులు 7927 మంది సాధించారని తెలిపారు. బైపీసీ విభాగం నుంచి 436 ఆపై మార్కులతో 14 మంది, 435 ఆపై మార్కులు 67 మంది, 430 ఆపై మార్కులు 469 మంది, 400 ఆపై మార్కులు 2063 మంది విద్యార్థులు సాధించి సత్తా చాటారన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ, డీన్స్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతమ్మ సేవలో అధికారులు పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారిని శనివారం పశుసంవర్ధక శాఖ జెడీ హనుమంతరావు, ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివరామ్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారి గోశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పశువైద్యాధికారి పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం, బంగారు గోపురం పనులకు భక్తులు విరాళాలను అందించారు. అమ్మవారి నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన ఎం.శ్రీనివాసరావు కుటుంబం రూ.1,01,116, హైదరాబాద్కు చెందిన కె.విష్ణువర్ధనదేవి రూ.లక్ష హైదరాబాద్కు చెందిన మరో భక్తుడు వి.శ్రీనివాస్ రూ. 1,01,116 విరాళాన్ని అందించారు. బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన డి.రామాంజనేయులు రూ.1,51,116, విశాఖపట్నంకు చెందిన కె.బాలకృష్ణారావు కుటుంబం రూ.లక్ష అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలతో సత్కరించారు. -
మచిలీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురిని చిలకలపూడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిలకలపూడి సీఐ ఎస్కే నబీ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం ఆనంద్పేటకు చెందిన ఉదయ్కుమార్ హైదరాబాద్లో ఉంటూ మూడు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. ఉదయ్కుమార్, బుట్టాయిపేటకు చెందిన షేక్రియాజ్, బందరు మండలం నవీన్మిట్టల్కాలనీకి చెందిన గోపీ, ముస్తాఖాన్పేటకు చెందిన బలగం నాగరాజు, కాగి జస్వంత్లు శనివారం ఉదయం మాచవరం మెట్టు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిలకలపూడి స్టేషన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారణ చేయగా ఐదుగురు గంజాయి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 25.62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగరాజు ద్విచక్ర వాహనంతో పాటు ఉదయ్కుమార్ కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వీటితో పాటు వారి నుంచి 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయి కేసులో లోతైన దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బందరు డీఎస్పీ రాజా ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టీమ్లు పనిచేస్తున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయాలకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా నేరుగా తమకు తెలియజేసి గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ యుఎల్ సుబ్రహ్మణ్యం, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 25.65 కేజీల గంజాయి స్వాధీనం, ఐదుగురి అరెస్ట్ బైక్, కారును సీజ్ చేసిన చిలకలపూడి పోలీసులు -
నయనానందకరం.. శ్రీవారి కల్యాణం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): పండు వెన్నెల.. మల్లె పందిరి.. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై వాల్మీ కోద్భవ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి నయనానందకరంగా జరిగింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులతో కొండపైన ఉన్న ఆలయం నుంచి గ్రామంలో ఊరేగించి ఎదురు కోలోత్సవం జరిపించారు. అనంతరం కొండ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలోకి విగ్రహాలను ప్రతి ష్టించి ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణ మాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు పర్యవేక్షణలో కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, పలువురు దంపతులు పీటలపై కూర్చున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకిం చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసుదేవాచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఐపీఎస్ అధికారి మనీషారెడ్డి ఆధ్వర్యంలో నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జగ్గయ్యపేట, వత్సవాయి, చిల్లకల్లు ఎస్ఐలు రాజు, తోట శ్రీనివాస్ వంద మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఏసీ ప్రసాద్, ఇన్చార్జ్ తహశీల్దార్ మనోహర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఇంటర్లో ఎన్టీఆర్ సత్తా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు మరో సారి తమ సత్తాచాటారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని మించి ఫలితాలు సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచింది. గత ఏడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మాత్రం తృతీయ స్థానానికి పడిపోయింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 81 శాతంతో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 89 శాతం ఫలితాలతో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచారు. 2023 వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఫలితాలు ప్రకటించగా, గత ఏడాది నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ బోర్డు ఫలితాలను ప్రకటిస్తోంది. 39,200 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షకు హాజరవగా 31,676 మంది ఉత్తీర్ణులయ్యారు. 35,484 మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 31,736 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 74.6 శాతం ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 74.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 830 మంది పరీక్షలకు హాజరవగా 620 మంది ఉత్తీర్ణత (74.6 శాతం) సాధించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి ఏడాది 241 మంది మంది పరీక్షలు రాయగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం సాధించారు. రెండో సంవ త్సరం 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం సాధించారు. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి 641 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 443 మంది ఉత్తీర్ణులై 69 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 66 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు న్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 997 మంది హాజరవగా 485 మంది ఉత్తీర్ణులై 49 శాతం, రెండో సంవత్సరానికి సంబంధించి 606 మందికి 398 మంది ఉత్తీర్ణులై 66 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరవగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం, రెండో సంవత్సరం పరీక్షలకు 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఫలితాలను సాధించారు. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఫలితాల్లో రాష్ట్రంలో రెండో సంవత్సరం ఫలితాల్లో 19 స్థానం, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏడో స్థానానికి పరిమితమమైంది. ఏపీఎస్డబ్ల్యూఆర్ మొదటి ఏడాది 84 శాతం, రెండో ఏడాది 96 శాతం, ఏపీటీడబ్ల్యూర్ మొదటి ఏడాది 94 శాతం రెండో ఏడాది 99 శాతం, హైస్కూల్ ప్లస్ మొదటి ఏడాది 39 శాతం, రెండో ఏడాది 52 శాతం, మోడల్ స్కూల్ మొదటి ఏడాది 88 శాతం, రెండో ఏడాది 81 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 68 శాతం, రెండో ఏడాది 81 శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన జి.రాజ్య లక్ష్మి ఎంపీసీలో 1000కి 984 మార్కులు, బైపీసీలో మైలవరం జెడ్పీ బాలికల పాఠశాలలో ఉన్న హై స్కూల్ ప్లస్లో బూక్యా హరిణి 978, పఠాన్ షాజిదా ఖాతూన్ 976, పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షేక్ రేష్మా 973 మార్కులను సాధించారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ప్రథమ సంవత్సరంలో 81, ద్వితీయ సంవత్సరంలో 89 శాతం ఉత్తీర్ణత మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలురోజూ రెండు పరీక్షలు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు జరుగుతాయి. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకూ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. మే 28 నుంచి జూన్ మొదటి తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు సంబంధించి ఫీజు చెల్లింపునకు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. -
ధరకు చెల్లిన నూకలు
బస్తా రూ.1500 చొప్పన విక్రయించా నేను రెండు ఎకరాల్లో దాళ్వా సాగు చేశాను. వరి కోసి ధాన్యం అరబెట్టినప్పటికీ కొనేవారు లేక ప్రయివేటు వ్యాపారులకు 75 కిలోల బస్తా రూ.1500 చొప్పున విక్రయించా. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉంటే బస్తాకు రూ.240 అదనంగా ధర వచ్చేది. రెండు ఎకరాలకు రూ.70 వేల పెట్టబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాను. – జూపల్లి సుబ్బారావు, రైతు, పైడూరుపాడు, విజయవాడరూరల్ మండలం ధాన్యం కొనే నాథుడే లేడు నేను తొమ్మిదెకరాల్లో దాళ్వా సాగు చేశాను. రూ.3.5 లక్షల పెట్టుబడి పెట్టాను. పంట మంచిగా పండింది అనుకుంటే ధాన్యం కొనేవారు లేరు. మా గ్రామానికి పది వేల సంచులు అవసరమైతే వెయ్యి సంచులు ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేందుకు ఎవరూ రావడంలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – కాగితపు వెంకటేశ్వరరావు, రైతు, పైడూరుపాడు, విజయవాడరూరల్ మండలం జి.కొండూరు: అన్నదాతకు ఆపద వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అధిక తేమ, బియ్యంలో నూకలు వస్తున్నాయంటూ మిల్లర్లు ధర తగ్గించేశారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు వచ్చినకాడికి తెగనమ్ముతున్నారు. ఖరీఫ్ పంటను వరదలు ముంచేశాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రబీలో వరి సాగుచేసిన రైతులకు మిల్లర్ల మాయాజాలంతో కష్టాలు తప్పడంలేదు. తమకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని రైతులు వాపోతున్నారు. రైతులకు దక్కని మద్దతు ఎన్టీఆర్ జిల్లాలో రబీ సీజన్లో 19,985 హెక్టార్లలో వరి సాగైంది. ప్రభుత్వం 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా ధర రూ.2,320, 75 కేజీల బస్తా ధర రూ.1740గా నిర్ణయించింది. జి.కొండూరు, విజయవాడరూరల్ మండలాల రైతులు ధాన్యం విక్రయించేందుకు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతానికి తక్కువగా ఉంటే కొనుగోలు చేస్తారు. రైతులు రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టి తేమ 16 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మిల్లర్లు అనేక సాకులతో వేధిస్తున్నారు. మిల్లర్లు, ప్రయివేటు వ్యాపారులు, సహకార సొసైటీల సిబ్బంది ఏకమై ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని, ధాన్యం ముక్కలవుతోందని సాకులు చూపి మద్దతులో కోత విధిస్తున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న 75 కిలోల ధాన్యం బస్తాను రూ.1740కి కొనుగోలు చేయాలి. అయితే రూ.1500 నుంచి రూ.1600లోపే మిల్లర్లు ధర చెల్లిస్తున్నారు. 17 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే బస్తాకు రూ.1300లకు మించి ధర ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చి సాయంత్రం సమయానికి వర్షపు జల్లులు పడుతుండటంతో చేసేది లేక రైతులు వచ్చిన కాడికి ధాన్యాన్ని తెగనమ్ముతున్నారు. కొన్ని గ్రామాల్లో గన్నీ సంచుల కొరత ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మిల్లర్ల మాయాజాలంతో ధాన్యం రైతుల గగ్గోలు అధిక తేమ శాతం, బియ్యం ముక్కలవుతోందంటూ ధర తగ్గించిన మిల్లర్లు ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడి కల్లాల్లోనే పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వాతావరణంలో మార్పులతో ఆందోళనలో అన్నదాతలు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికి సేకరించిన ధాన్యం 7,200 టన్నులు మాత్రమే.. అంకెల్లో ఇలా.. రబీ వరి సాగు విస్తీర్ణం : 19,985 హెక్టార్లు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం : 50 వేల టన్నులు ఎకరాకు ప్రభుత్వం కొనే ధాన్యం : 39.2 క్వింటాళ్లు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు : రూ.2,320 ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య: 107 ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు : 34 శుక్రవారం వరకు సేకరించిన ధాన్యం : 7,200 టన్నులు ధాన్యం సేకరిస్తున్న మిల్లుల సంఖ్య: 16 ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు మారత కృష్ణారావు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలంలోని కవులూరుకు చెందిన ఈ రైతు రబీలో 2.4 ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం క్రితం రెండెకరాల్లో కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి స్థానిక సొసైటీని సంప్రదించారు. 75 కిలోల ధాన్యం బస్తా ప్రభుత్వ మద్దతు ధర రూ.1,740 కాగా రూ.1,620కే కొనుగోలు చేస్తా మని సొసైటీ సిబ్బంది చెప్పారు. అదేమని అడిగితే ఇష్టమైతే అమ్ముకో లేదంటే ఉంచుకో అని చెప్పడంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను తెగనమ్మారు. తక్కువ ధరకు విక్రయించడంతో రూ.9 వేలకు పైగా నష్టపోయినట్లు కృష్ణారావు వాపోయారు. -
సహకార వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానాన్ని అమల్లోకి తేవాలని రౌండ్టేబుల్ సమావేశం తీర్మానించింది. రెండంచెల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని, ఐదు లక్షల సంతకాలు సేకరించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకోవాలని, విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకులుగా మార్పు చేయాలని, సహకార బ్యాంకింగ్లో రెండంచెల విధానం తేవాలని కోరుతూ శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని రెండంచెల విధానం అమలు చేయాలన్న యూనియన్ డిమాండ్కు మద్దతు ప్రకటించాయి. రెండంచెల విధానంలో అటు రైతులకు, ఇటు ఉద్యోగులకు జరిగే మేలును వక్తలు వివరించారు. వ్యవసాయ రుణాల పంపిణీ జాప్యం నివారించడమే కాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయని వక్తలు పేర్కొన్నారు. సహకార వ్యవస్థ మనుగడ సాగిస్తుందన్నారు. గ్రామీణ పేదలకు మేలు.. రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థను వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడానికి ముందు, తర్వాత అని రెండుగా విభజించి చూడాల్సి ఉంటుందన్నారు. 2002 సంవత్సరానికి పూర్వం సహకార వ్యవస్థను అప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుదేలైన సహకార రంగాన్ని ఆదుకొని గాడిలో పెట్టారన్నారు. రూ.వందల కోట్ల ఆర్థిక సాయం అందించి సహకార వ్యవస్థను బతికించారన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులను లాభాల బాట పట్టించారని చెప్పారు. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలోనూ రెండంచెల విధానం అమల్లోకి తేవాలన్నారు. ఇందుకు తమ సహకారం ఉంటుందని, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సహకార వ్యవస్థలో పెత్తనమంతా రాజకీయ నాయకులదేనన్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి పెరిగిపోయిందన్నారు. ఈ వ్యవస్థలో రెండంచెల విధానం అమల్లోకి తెస్తే గ్రామీణ పేదలకు మేలు జరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందుతాయని చెప్పారు. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్, రైతు సంఘం నాయకులు కేశవరావు, కేవీవీ ప్రసాద్, జమలయ్య, భవానీప్రసాద్, బ్యాంకుల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో తీర్మానం సహకార రంగాన్ని వైఎస్సార్ బతికించారు : పూనూరు గౌతంరెడ్డి -
సింహ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మో త్సవాల్లో ఐదో రోజైన శనివారం శ్రీగంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు సింహ వాహన సేవ జరిగింది. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. సింహ వాహనంపై అధిష్టించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణవీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మొయిన్రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులకు భక్తులు పూజాసామగ్రి సమర్పించారు. ఉదయం మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మూలమంత్ర హవనం, సదస్యం, వేద స్వస్తి జరిగాయి. -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం వైభవంగా సాగింది. దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా విశేష సంఖ్యలో అమ్మవారి భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెల్లవారుజామున 5.55 గంటలకు కామథేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 8 కిలో మీటర్ల మేర ప్రదక్షిణ.. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, కోలాట నృత్యాల మధ్య గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. సుమారు 8 కిలో మీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తుల మనోభీష్టి నెరవేరుతుందని, అమ్మవారి కరుణా కటాక్షాలతో కుటుంబం సుఖ సంతోషాలతో విరసిల్లుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు పసుపు నీళ్లుతో గిరి ప్రదక్షిణ మార్గాన్ని శుద్ధి చేసి ఆది దంపతులకు భక్తితో పూజా ద్రవ్యాలను సమర్పించారు. గిరి ప్రదక్షిణ మార్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తయిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు వర్గీకరణ ముసుగులో మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మండిపడ్డారు. విజయవాడలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. వర్గీకరణలో మాదిగలకు 6, మాలలకు 8 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రబాబుపై మాదిగల్లో అసంతృప్తి నెలకొందన్నారు. రోస్టర్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరితే కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాదిగలకు మరోసారి అన్యాయం చేస్తున్నారన్నారు. గద్దె దింపడం కూడా మాదిగలకు తెలుసు 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మాదిగలకు చంద్రబాబు చేస్తున్న సామాజిక న్యాయం ఇదేనా అంటూ నిలదీశారు. ఓ వైపు వర్గీకరణ తుది దశకు చేరుకుందని చెబుతూనే ... మరో వైపు విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు ఉమ్మడిగా ప్రకటిస్తున్నారన్నారు. ఇలా చేస్తే వర్గీకరణ తర్వాత మాదిగలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. మాదిగల డప్పు కొట్టి, చెప్పు కుట్టి, వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానంటే నమ్మి భుజాన మోసామన్నారు. తీరా వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ద్రోహం చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన మాదిగలకు గద్దె దింపడం కూడా తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని, ఆంధ్రాలో మాదిగలకు అన్యాయం చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. లోపాలను సరిచేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 25న నెల్లూరు, 30న కడప, మే 10న రాజమండ్రి, మే 20న విశాఖపట్నం, మే 30న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జి మాదిగ పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు ప్రమాదకరం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్బోర్డు సవరణ బిల్లు దేశానికి చాలా ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో పంజాసెంటర్లో శనివారం సాయంత్రం వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి నారాయణ మాట్లాడుతూ.. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. అందులో భాగంగానే అన్ని రాజ్యంగ వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్బిల్లు ఆమోదంపై చంద్రబాబు మూడు సూచనలు చేశానని చెబుతున్నాడని, అవి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు మూడు నామాలు పెట్టిన చంద్రబాబు తన బోగస్ మాటలు ఆపాలని హితవు పలికారు. చంద్ర బాబు, పవన్కల్యాణ్ బీజేపీకి లొంగిపోయారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ కేవలం మైనార్టీలకు మాత్రమే చెందిన అంశం కాదని, ఇది రాజ్యాంగంపై దాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సమితి కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో వివిధ హోదాల్లో నాయకులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లుగా మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. నృత్యకళాకారులకు గిన్నిస్ బుక్లో చోటుపెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లికి చెందిన శ్రీవిజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ నృత్య కళాకారులు 30 మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్లో చోటు దక్కించుకున్నారని నాట్యచారిని జి.వనజ చంద్రశేఖర్ తెలిపారు. ఆమె శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో భరత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,209 మంది కళాకారులతో కూచిపూడి కళావైభవం మహా బృంద నాట్య ప్రదర్శన జరిగిందని పేర్కొన్నారు. ఈ బృందంలో తమ అకాడమీ విద్యార్థులు 30 మంది భాగస్వాములయ్యారని తెలిపారు. ఆ నాట్య ప్రద ర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు ఎక్కిందని పేర్కొన్నారు. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరికీ గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికెట్లు అందాయని వివరించారు. కొనసాగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలుగుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్ర క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం కూడా కొనసాగాయి. మహిళల విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ స్థాయిలో ఈ పోటీలు జరి గాయి. మాస్టర్స్ మహిళా విభాగం పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జగపతి తిరుపతమ్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది చాంపియన్గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యుడు గుత్తా శివరామ కృష్ణ(చంటి), కోచ్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యుడి సేవలో డీజీపీ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా సతీ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు పూర్ణకంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన డీజీపీ హరీష్కుమార్ గుప్తా పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, వేదపండితులు బాలకృష్ణ శర్మ, మణిదీప్ శర్మ, విరూప్ శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ పాల్గొన్నారు. -
దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు హారాన్ని భక్తులు శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన దేవినేని సురేంద్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ను కలిసి బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు. వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం ● బిల్లును ఉపసంహరించుకునే వరకూ పోరాటం ● లబ్బీపేట మసీదు వద్ద ముస్లిం సంఘాల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెచ్చిందని ముస్లిం సంఘాలు మండిపడ్డాయి, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే కుట్రలో భాగమే ఈ సవరణ బిల్లు అని వారు నినదించారు. లబ్బీపేటలోని మసీదులో శుక్రవారం నమాజు అనంతరం వందలాది మంది ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం జాక్ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు ఐక్యతగా సోదరభావంతో నివసిస్తున్నా, వారి మధ్య అగాధం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం అనునిత్యం ముస్లింలను వేధించడమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ముస్లిం సంస్థల్లో ముస్లిమేతరులకు ప్రాధాన్యం కల్పించి వక్ఫ్ బోర్డును బలహీనపరిచేందుకు ఈ సవరణ బిల్లును తెచ్చారన్నారు. ఈ బిల్లును ఉపసంహరించే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ముస్లింలను మోసం చేశాయన్నారు. కార్యక్రమంలో ముక్తార్ అలి, అబిద్, ఎస్ఐఓ ప్రతినిధులు అమిర్ ఫాహెద్, అబ్దుల్ హఫీజ్, అమీర్ యహ్యా ఖాన్, అబ్దుర్రఖీభ్, కరీమ్ మొహిద్దీన్, మొహ్మద్ రియాజ్, ముసైబ పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి ఆర్డీఎంఏ నాగనరసింహారావు పెనమలూరు: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరే విధంగా పన్నులు సకాలంలో వసూలు చేయాలని రీజినల్ డైరెక్టర్ అప్లేట్ కమిషనర్(ఆర్డీఎంఏ)సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఒక హోటల్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలపై కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సకాలంలో పన్నులు వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే పనులు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో పాలన పారదర్శకంగా ఉండాలని, అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో సిబ్బంది పని తీరు మెరుగుపరిచే విధంగా కమిషనర్లు కసరత్తు చేయాలని అన్నారు. సమావేశంలో రెండు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లా..?
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని శుక్రవారం పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) తీవ్రంగా ఖండించాయి. ఆ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతిపత్రం అందజేశాయి. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ శాఖ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎం. మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి.రఘు రామ్, అబ్దుల్ ఖదీర్, సీనియర్ నాయకులు జి.రామారావు, బీవీ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కోశాధికారి సయ్యద్ మహమ్మద్ హుస్సేన్, జీవన్ కుమార్ డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. అనంతరం డీఆర్వో కార్యా లయం ఎదుట బైఠాయించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే సభ్యులు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో... కృష్ణలంక(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు,జి.ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి.శ్రీనివాసరావు, కె.మునిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి.హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు వార్త ప్రచురణ కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఆ పనికి బదులుగా ఇటువంటి కేసులు బనాయించటం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్స్టేషన్ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా ఎనిమిది దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే ఇటువంటి చర్యలకు పోలీసులు పాల్పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన క్రిమినల్ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలి ఏపీయూడబ్ల్యూజే, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసిన వివిధ యూనియన్ల నాయకులు -
అనుబంధ కమిటీల్లో జిల్లా నాయకులకు చోటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో నియమించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా కేసరి శివారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ముక్కపాటి నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శులుగా డాక్టర్ రెవరెండ్ సందీప్, కలపాల అజయ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. డాక్టర్ చంద్రహాస్కు అరుదైన గౌరవం ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నానికి చెందిన మైనింగ్ రంగ నిపుణుడు డాక్టర్ నిడుముక్కల చంద్రహాస్కు అరుదైన గౌరవం దక్కింది. చాంబర్ ఆఫ్ మైనింగ్ అసోసియేషన్, ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టర్కీలో గురువారం రాత్రి జరిగిన ఫ్రాగ్బ్లాస్ట్ సింపోసిజం సిరీస్లో 36 దేశాల ప్రతినిధులు పాల్గొనగా, సౌత్ ఇండియా తరపున డాక్టర్ చంద్రహాస్ హాజరై ఓపెన్ మైనింగ్ అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఓపెన్ మైనింగ్పై చంద్రహాస్ ఇచ్చిన ప్రజెంటేషన్ను మెచ్చిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు ప్రశంసాపత్రం అందజేసి అభినందించా రు. కెనడాలో 2028లో జరగనున్న సిరీస్కు కూ డా ఆహ్వానించారు. ఈసందర్భంగా పలువురు చంద్రహాస్కు అభినందనలు తెలియజేశారు. బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో బీసీ కులాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరాను నియమించి ఆయనకు నియమాకపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో మార్పు రాలేదన్నారు. తమిళనాడులో బీసీల ఐక్య పోరాట ఫలితంగా 69శాతం రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. అదే తరహాలో దేశ వ్యాప్తంగా బీసీలు పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా కులగణనతోపాటు బీసీ కులగణను కూడా చేపట్టాలని కోరా రు. బీసీల రక్షణ కోసం వెంటనే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగుల్మీరా మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వెంగళరావు యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీసీ సంఘం నేతలు కలిసి నాగుల్ మీరాను సత్కరించారు. -
జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడు
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమ సమాజం కోసం ఉద్యమించిన స్పూర్తి ప్రదాత, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి చదువు ఒక్కటే మార్గమని భావించిన మహనీయుడు పూలే అన్నారు.పూలే, అంబేడ్కర్ల ఆశయాలు, ఆలోచనలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ను నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘చెప్పాడంటే..చేస్తాడంతే’ అనేమాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే వర్తిస్తుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి నాందీ... సామాజిక న్యాయానికి నాందీ పలికిన గొప్పవ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే కాగా, ఆయన స్పూర్తితో పాలన సాగించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. పూలే ప్రేరణతో మాజీ సీఎం వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పూలే ఆశయాలకనుగుణంగా వైఎస్ జగన్ పాలన సాగించారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందన్నారు. పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, నాయకులు కాలే పుల్లారావు, బూదాల శ్రీను, పోలిమెట్ల శరత్, తోలేటి శ్రీకాంత్, జమల పూర్ణమ్మ, విద్యార్థి నాయకుడు రవిచంద్ర, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, గుండె సుందరపాల్, దేరంగుల రమణ, జి.నవీన్, పిళ్లా సూరిబాబు, మజ్జి శ్రీను పాల్గొన్నారు. పూలేకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న దేవినేని అవినాష్, పక్కన అరుణకుమార్, విష్ణు తదితరులు -
నంది వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై నిర్వహిస్తున్న చైత్ర మాస బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు నంది వాహనంపై నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం దిగువన నంది వాహనాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేతంగా మల్లేశ్వర స్వామి వారు అధిష్టించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నగరోత్సవ సేవను లాంఛనంగా ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన నంది వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్ మీదగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ ఊరేగింపు కనుల పండువ గా సాగింది. నగరోత్సవ సేవలో ఆలయ ఏఈవో దుర్గారావు, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
● వీఎంసీ స్థాయీసంఘం సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి ● అజెండాలో 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికాబద్ధంగా నిధులు సమకూరుస్తున్నామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన స్థాయీసంఘం సమావేశం జరిగింది. అజెండాలో మొత్తం 38 అంశాలు రాగా అందులో రెండు అంశాలు రద్దు చేశారు. నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ కేటాయించాలని ఒక అంశం, రెండు అంశాల్లో లీజును ఏడాది వరకు కేటాయింపులు జరగ్గా పూర్తి వివరాలు తర్వాత సమావేశంలో అందించాలని ఒక అంశం, ధ్రువీకరణకు ఒక అంశం, రికార్డుకు ఒక అంశంతో పాటు 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో మూడు సర్కిళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీఎంసీ మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధానాంశాలు ● స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో నగరంలోని వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు 2020 జనవరిలో కాంట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులను వీఎంసీ నియమించుకుంది. ఈ క్రమంలో కాంట్రాక్టరుకు వారం రోజులకు మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వగా 28 రోజులకు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు రూ.400 చొప్పున 28 రోజులకు రూ.33.60 లక్షలు బిల్లులు పెట్టారు. దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు లేవని, ఇప్పటికే రెండుమార్లు వాయిదా వేసినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు అందించనందున స్థాయీ సంఘం ప్రతిపాదనను రద్దు చేసింది. ● కృష్ణలంక బాలాజీనగర్ కర్మల భవనం మూడేళ్లపాటు లీజుకు ఇవ్వాలని, దీనికి ఇప్పటికే టెండర్లు వేయగా ఇరువురు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారని, అత్యధికంగా పాడుకున్న జి.శ్రీనివాసరావుకు కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనపై టెండరుదారుకు ఏడాది మాత్రమే లీజుకు ఇవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. ● సర్కిల్–3 పరిధిలోని విజయ్ నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పాత మోటర్ల స్థానంలో కొత్త మోటర్లు అమర్చాలని, అందుకు రూ.49.80 లక్షల వ్యయం వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనను స్థాయీ సంఘం సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ● 56వ డివిజన్లోని పాతరాజరాజేశ్వరి పేట మెయిన్రోడ్డులో మహంకాళమ్మ గుడి జంక్షన్ నుంచి రైల్వేగేటు వరకు రోడ్డుకు ఇరువైపులా పేవర్బ్లాక్స్, డ్రైన్ల మరమ్మతులకు రూ.48.23 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని వచ్చిన ప్రతిపాదనను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ● సర్కిల్–3 పరిధిలోని 4వ డివిజన్ సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో రోడ్డు నం.1 మిగిలిన రోడ్లకంటే కూడా పల్లంగా ఉందని, ఈ రోడ్డు మెరుగుపరచటానికి అవసరమయ్యే నిధులు రూ.39.42 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని సభ్యులు తీర్మానించారు. -
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.పుష్పరాజ్ డిమాండ్ చేశారు. బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఽశుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీలు 52శాతం ఉన్నారని గత ప్రభుత్వం లెక్కలతో తేల్చిందన్నారు. ఆ మేరకు బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలపదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీహార్ సీఎం నితీష్కుమార్ కులగణన జరిపి బీసీలకు 65శాతం రిజర్వేషన్లు ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు కొదమల ప్రభుదాసు, గంగవరపు దేవా , జిల్లా అధ్యక్షుడు ఉదయ్కిరణ్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొండపాటి శామ్యూల్ కుమార్, సిటీ కన్వీనర్ పి.డేనియల్, నాయకులు దాసరి కృష్ణ, ఉడుముల బుజ్జి, మద్దిరాల వినోద్, కోటేశ్వరరావు, మల్లాది అశోక్, బూదాల బాబురావు, కె.వి.రత్నం, నందిగం రామ్మోహన్, మేకల దుష్యంత్, ప్రత్తిపాటి మల్లయ్య పాల్గొన్నారు. -
సెపక్ తక్రా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: మణిపూర్లో ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలబాలికల సెపక్ తక్రా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు ఏపీ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. బాలురు జట్టుకు జి.సతీష్, కె.కుశల్, డి.ఎం.షాహిద్, టి.జశ్వంత్, టి.వంశీ, బాలికలు జట్టుకు పి.హరిప్రియ, కె.వెంకటలక్ష్మి, పి.దుర్గమధురశ్రీ, సి.తేజ, జి.రమ్య ఎంపికై నట్లు వివరించారు. ఈ జట్లుకు కోచ్, మేనేజర్లుగా ఎస్.రమేష్, ఎం.సంతోషికుమారి, డి.సుంకరరావు వ్యవరిస్తారని వెల్లడించారు. ఈ జట్లను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు(ఎస్పీడీ) బి.శ్రీనివాసరావు పటమట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అభినందించారు. -
పూలే సిద్ధాంతాలు ఆదర్శప్రాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు పూలే అలుపెరగని పోరాటం చేశారన్నారు. మానవుడికి విద్య జ్ఞానజ్యోతి లాంటిదని పూలే విశ్వసించేవారన్నారు. బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు సాధికారత దిశగా కృషి చేశారన్నారు. మన దేశంలో గాంధీజీ కంటే ముందే మహాత్మా అని బిరుదు పొందారన్నారు. ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె. లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఈవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోన్న ప్రభుత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): లౌకిక రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలని, మతసామరస్యం కోరుతూ సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మనీ ఆధ్వర్యంలో ఈనెల 13న విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడెమీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సమైక్యతా శంఖారావం సదస్సును జయప్రదం చేయాలని నిర్వహణ జాతీయ కమిటీ చైర్మన్ కె.విజయరావు, రాష్ట్ర సమన్వయకర్త, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. గవర్నర్పేటలోని బాలోత్చవ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమైక్యతా శంఖారావం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. భిన్నమతాలు, జాతులు, భాషలు, వర్గాలు, సంస్కృతుల సమాహారంగా ఉన్న మనదేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలు సృష్టించే విధంగా పాలక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. 1947 చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, మసీదులు, చర్చీల విషయంలో ఎలాంటి జోక్యం ఉండరాదన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వందేళ్ల కిందటే స్వామి వివేకానంద చికాగోలో మనదేశ ఔన్నత్యంపై ప్రసంగించిన వైనాన్ని గుర్తుచేశారు. విజయరావు మాట్లాడుతూ సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ జాతీయస్థాయిలో మత సామరస్యం కోసం కృషి చేస్తుందన్నారు. 13న జరిగే సదస్సులో రాజ్యసభసభ్యుడు ఇమ్రాన్ప్రతాప్గదీ, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యూపీ మాజీమంత్రి మోయిద్అహ్మద్ తదితరులు వక్తలుగా పాల్గొంటారని వివరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ ఇటీవల వివిధవర్గాల వారు వివిధరకాల శంఖారావాల పేరుతో నానాయాగి చేశారన్నారు. పాలకులే మతం, భక్తి పేరుతో రోజుకో మాటలు చెబుతున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర కన్వీనర్ షేక్ బాజీ, న్యాయవాది మతీన్, సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, రైతుసంఘ నాయకుడు వై.కేశవరావు, ఐద్వా నాయకురాలు శ్రీదేవి, అరస నాయకుడు మోతుకూరి రుణ్కుమార్, సూర్యారావు పాల్గొన్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
● జనవరి 17 నుంచి రూ.18 కోట్ల మేర వేతన బకాయిలు ● పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపని కూలీలు ● సిబ్బంది మెడపై వేలాడుతున్న లక్ష్యాల కత్తి ● రూ.70 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకం కింద ఉన్న ఊళ్లో ఉపాధి దొరికినా చేసిన పనికి సకాలంలో వేతనం అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. నాలుగు కారం మెతుకులు మింగి, నీళ్లు తాగి కాలం వెళ్లదీస్తున్నారు. వేతనం రాని పనికి వెళ్లే కంటే వలస వెళ్లడం మేలని కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, వలసల నివారణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పథకం ఉద్దేశం నీరుగారుతోంది. వారం రోజుల్లో చేసిన పనికి వేతనం ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఆరుబయట ఎండలో రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసిన కూలీలకు రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. మరో వైపు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు కోట్లల్లో బకాయిలు పడ్డాయి. ఆర్నెల్లుగా కార్యాలయ నిర్వహణ ఖర్చులు లేక వ్యవస్థ చతికిలపడింది. నిబంధనల ప్రకారం వారంలోగా వేతనం ఇవ్వాలి ఎన్టీఆర్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. వేసవిలో వ్యవసాయ కూలీలకు పనులు దొరకవు. ఈ పథకం కింద పనులు గుర్తించి కూలీలకు ఉపాఽధి కల్పించాలి. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 వేతనం అందించాలి. తాజాగా ప్రభుత్వం వేతనం రూ.307గా నిర్ణయించింది. పనులు చేసిన కూలీలకు నిబంధనల ప్రకారం వారంలోపు వేతనం అందించాలి. కానీ ఇదంతా కాగితాలకే పరిమితమైంది. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పిస్తున్నా గత రెండు నెలలుగా కూలీలకు వేతనాలు జమ చేయడం లేదు. వేతనాలు ఎప్పటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలోని 16 మండలాల్లో 6 లక్షల పనిదినాలకు జనవరి 7 నుంచి వేతనాలు అందడం లేదు. రూ.16 నుంచి రూ.18 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయి. కార్యాలయ నిర్వహణకు కూడా డబ్బుల్లేవు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించి డిసెంబర్ నుంచి బకాయిలు ఉన్నాయి. మెటీరియల్ కాంపొనెంట్ కింద జిల్లాలో రూ.70 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఓ వైపు కూలీలకు వేతనాలు అందక పనులు ముందుకు సాగడం లేదు. వీటికి తోడు మండలాల్లో కార్యాలయ నిర్వహణకు డబ్బులు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. లక్ష్యాలు నిర్దేశించి ఉన్నతాధికారుల వేధింపులు ఉపాధి హామీ పథకానికి లక్ష్యాలు నిర్దేశించి వాటిని చేరుకోవాలని దిగువ స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వారం వారం కూలీలకు వేతనాలు అందితే పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని, కానీ రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకోవాలంటే ఎలా అంటూ కొందరు సిబ్బంది తమలో తాము మథన పడుతున్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి మెడపై కత్తి పెట్టి మరీ లక్ష్యాలు చేరుకోవాలంటున్నారని, కార్యాలయాల నిర్వహణకు పైసా ఇవ్వకుండా సస్పెండ్ చేస్తాం. షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ తీవ్రమైన వత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. పై నుంచి ఎండ మాడిపోతోంది...లోపల కడుపు కాలిపోతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉపాధి కూలీలు పనిచేయాల్సి వస్తోంది. మండే ఎండల్లో, కాలే కడుపుతో ఎన్నాళ్లని పనిచేయగలరు. రెండు నెలలకు పైగా వేతనాలు అందని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు రావడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. వలసలు నివారించడానికి ఉద్దేశించిన ఈ పథకం వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు వలసబాట పట్టాల్సిన దుస్థితిని కలుగజేస్తోంది. మరోవైపు ఉపాధి హామీ పథకం సిబ్బంది మెడపై లక్ష్యాల కత్తి వేలాడుతోంది. కూలి డబ్బులు రావడం లేదు వేసవిలో ఉపాధి పనులకు వెళుతున్నా. రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతికేది? – మంద రాహేలు, చెవుటూరు శానా ఇబ్బందిగా ఉంది నేను వ్యవసాయ కూలి పనులకు వెళ్తాను. ఉపాధి పనికి వెళ్తే గతంలో వారంలో డబ్బులు ఇచ్చేవారు. కొద్ది రోజుల నుంచి డబ్బులు రావడం లేదు. శానా ఇబ్బందిగా ఉంది. – నాగేశ్వరరావు, చెవుటూరు -
కార్పొరేషన్ల ద్వారా చెక్కుల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ శుక్రవారం వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కార్పొరేషన్ల తరఫున లబ్ధిదారులకు సబ్బిడీపై రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్పొరేషన్ల నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 400 మంది లబ్ధిదారులకు రూ.8.05కోట్ల ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారాలు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి. కె.లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఇవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.10 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు నీటిని నిలుపుదల చేశారు. మిర్చి యార్డుకు వరుస సెలవులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మంగళవారం నుంచి క్రయ విక్రయాలు కొనసాగుతాయి.పూలే చిరస్మరణీయుడు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళుల ర్పించిన వైఎస్సార్ సీపీ నేతలు పూలే చిరస్మరణీయుడని కొనియాడారు. – 10 లోu -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘సూపర్ సిక్స్’ ఎగవేతకు కుట్ర ధర్నాలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అప్పులను సాకుగా చూపి వాటిని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) మండిపడింది. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ప్రగతిశీల మహి ళా సంఘం(పీఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. గంగాభవాని మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందన్నారు. కూటమి నేతలు బ్రాందీ షాపుల వాటాలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులకు హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇపుడు అమాయకంగా ఖజానాలో డబ్బు లు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన పది నెలల్లో రూ. 1.50 కోట్ల అప్పులు చేశారని, అయినా పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పవన్ కల్యాణ్ ఏమైపోయారో.. పీఓడబ్ల్యూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు పి.పద్మ మాట్లాడుతూ మహిళలపై చేయి వేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అంతులేకుండా జరుగుతున్న పవన్ కల్యాణ్ నోరు మెదకపోవడాన్ని తప్పుపట్టారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. దుర్గ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. సాగరతీరంలో మాక్ డ్రిల్ కోడూరు: మండలంలోని హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు గురువారం ప్రత్యేక మాక్డ్రిల్ చేశారు. కోస్టల్ అధికారుల ఆదేశాల మేరకు గురువారం తీరంలో సీ–విజిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తీరప్రాంత గ్రామాల్లోకి ప్రవేశించి, ఏదో ఒక ప్రాంతంలో దాగి ఉంటే, వారిని కనిపెట్టేందుకు చేపట్టే చర్యలతో మాక్ డ్రిల్ చేపట్టామని మైరెన్ సీఐ సురేష్రెడ్డి తెలిపారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఐదేళ్లుగా కార్యవర్గం లేదు.. అధికారుల పర్యవేక్షణ అసలే కనపడదు.. ఇళ్ల మధ్యే పరిశ్రమల వ్యర్థాలు.. వెరసి ప్రమాదంలో పడిన ప్రజారోగ్యం.. ఇది రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన విజయవాడ ఆటోనగర్ వద్ద పరిస్థితి. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ‘ఐలా’ చేష్టలుడిగిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులే ఐలాకు ఎన్నికలు నిర్వహించకుండా మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్ద పారిశామ్రికవాడగా విజయవాడ ఆటోనగర్ గుర్తింపు పొందింది. 3వేలకు పైగా చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు, 50వేల మందికి పైగా కార్మికులు నిత్యం ఇక్కడ పని చేస్తుంటారు. 100 టన్నులకు పైగా వ్యర్థాలు నిత్యం ఇక్కడి పరిశ్రమల నుంచి వస్తాయి. అయితే వీటిని గుంటూరులోని జిందాల్ పరిశ్రమకు తరలించాలని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చెబుతోంది. వీరు ఆ పని చేయకుండా టన్నుల కొద్దీ వ్యర్థాలను పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడప మునిసిపాలిటీ, కానూరు నుంచి ఎనికేపాడుకు వెళ్లే దారిలో విజయ ఇంజినీరింగ్ కళాశాల వద్ద దాదాపు 100 ఎకరాల పంట పొలాల్లో నిత్యం తెచ్చి పోస్తున్నారు. ఇక్కడ కళాశాలలు, పలు కాలనీలు ఉన్నాయి. ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, కాలం తీరిన మందులను వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. వీటిని దహనం చేస్తుండటంతో విషవాయువులు వ్యాప్తి చెంది, ఆ సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నాయని, కేవీఆర్ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శానిటేషన్ పర్యవేక్షిస్తున్న ఐలా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. పొల్యూషన్కు సంబంధించిన మట్టి, మునిసిపల్ వ్యర్థాలు పంట పొలాల్లో వేయటానికి వీలులేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నా, అధికారులకు చెవికెక్కడం లేదు. రాత్రి వేళ్లలో పంట పొలాల్లో వ్యర్థాలు పోసి తగులబెడుతున్నారు. దీంతో అక్కడ ఆ పంట పొలాలతో పాటు, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో సైతం పంటలు పండక రైతులు అల్లాడిపోతున్నారు. స్థానికులు అడ్డుకుంటున్నా.. ఇటీవల రాత్రి సమయాల్లో డంప్ చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ఆరు లారీలను సీజ్ చేశారు. వాటిని వదిలి వేయాలని వ్యర్థాలను తీసి వేస్తామని, ఐలా అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, స్థానికుల నుంచి తీవ్ర అభ్యతరం వ్యక్తం అవుతోంది. నిడమానూరు, ఎనికేపాడు, కానూరు గ్రామాల సర్పంచ్లు, పెద్దలు, అంతకు మునుపు పోసిన చెత్తను, వ్యర్థాలను పూర్తిగా తొలగించే వరకు, సీజ్ చేసిన లారీలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ నామ మాత్రంగా చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పూర్తి స్థాయిలో చెత్త తొలగించడంతోపాటు, అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కానూరు–ఆటోనగర్ ప్రధాన రహదారి పక్కనే చెత్త కుప్పలు వేస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. చెత్త కుప్పలు కారణంగా రోడ్డుపై ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది. – అవినాష్, పెయింటర్, పోరంకి కానూరు ఆటోనగర్కు వచ్చే దారిలో భారీగా చెత్త తీసుకువచ్చి వేస్తున్నారు. కార్మికులు పని చేసే ప్రాంతంలో చెత్త వేయటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెత్తవేసే వారిపై చర్యలు తీసుకోవాలి. – సురేష్, ఆటోనగర్ కార్మికుడు, విజయవాడ పన్ను వసూళ్లు 50 శాతం కంటే తక్కువగా ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేదు. వసూళ్లు 50 శాతం దాటితే ఎన్నికలు నిర్వహిస్తాం. మేము కార్పొరేషన్ పన్ను కడుతున్నప్పటికీ చెత్త తరలింపునకు స్థలం కేటాయించలేదు.. జిందాల్కు తరలించాలని కార్పొరేషన్ అధికారులు సూచించారు. ఇక్కడ ఖాళీగా ఉన్నందున డంపింగ్ చేశాం. ఇబ్బంది అయితే మరో చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తాం. – కె. బాబ్జీ ఇన్చార్జి కమిషనర్, ఐలా పంట పొలాల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తగలబెడుతున్న దృశ్యం7న్యూస్రీల్ పంట పొలాల్లోకి పరిశ్రమ వ్యర్థాలు స్థానికులు అడ్డుకుంటున్నా ఫలితం శూన్యం జిందాల్కు తరలించకుండా రాత్రి వేళల్లో తెచ్చి పడేస్తున్న వైనం ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు లేకపోవడంతో కొరవడిన పర్యవేక్షణఎన్నికలను అడ్డుకుంటోంది ఎవరు? ఏపీఐఐసీ అందుకే నిర్వహించలేదు.. ఐలా(ఇండ్రస్టీయల్ ఏరియా లోకల్ అథారిటీ) పర్యవేక్షణలో ఆటోనగర్ నడుస్తుంది. దీనికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. అయితే గత ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు నిర్వహించటం లేదు. దీనికి ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్గా జోనల్ మేనేజర్ కె. బాబ్జి వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రస్తుతం విజయవాడ, ఏలూరు, జోనల్ మేనేజర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఐలాకు ఎన్నికలు జరగకుండా అధికారులే అడ్డుకుంటున్నారన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగితే, పాలక వర్గం పర్యవేక్షణ ఉంటుందనే భావనతో ప్రభుత్వాన్ని సైతం అధికారులు మభ్య పెడుతున్నట్లు చెబుతున్నారు. పైగా రూ.20లక్షల–రూ.25లక్షలకు పైగా ముడుపులు అధికారులకు అందుతున్నట్లు సమాచారం. దీంతో ఏదో సాకుచూపి, ఎన్నికలు జరగకుండా అధికారులు మోకాలడ్డుతున్నట్లు చెబుతున్నారు. శానిటేషన్కు సంబంధించి టెండర్లు నిర్వహించకుండానే అధికారులు పనులు కట్టబెట్టడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి రావణ వాహనంపై నగర పుర వీధుల్లో విహరించారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం మూల మంత్రహవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రావణ వాహనాన్ని అధిష్టించిన ఆది దంపతులకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామా రంగం చౌక్, మొయిన్రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. కోలాట బృందాలు, డప్పు కళా కారుల విన్యాసాలతో పాటు దేవస్థాన వాయిద్యాల బృందం, పంచవాయిద్యాలతో వాహనం ముందుకు సాగింది. ఆది దంపతులు నగర వీధుల్లోకి విచ్చేయడంతో స్థానిక భక్తజనం, దుకాణదారులు పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఏఈవో చంద్రశేఖర్, దుర్గారావు, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా, భక్తజనులు పాల్గొన్నారు. కనులపండువగా నగరోత్సవ సేవ -
చిన్న ఆస్పత్రులను యాక్ట్ నుంచి మినహాయించాలి
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నుంచి మినహాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ అన్నారు. రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో కొన్ని సవరణలు తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఏ కోరిక మేరకు చాలా రాష్ట్రాల్లో క్లినిక్స్, చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు అంటే 50 పడకల లోపు ఉన్న వాటిని చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారని, మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వైద్యులపై దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రాష్ట్రంలో చట్టాల్లో సవరణలు చేయాలన్నారు. ప్రస్తుతం మూడేళ్ల శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, ఆ చట్టాన్ని ఏడేళ్లకు పొడిగించడం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేయాలన్నారు. పీఎన్డీటీ యాక్ట్లో గర్భిణులను టాగింగ్ చేయడం ద్వారా ప్రతి మాతా శిశువుని సంరక్షించవచ్చునన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్చంద్రబోస్, జాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.ఫణిదర్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకుని దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో గురువారం పర్యటించిన ఆయన వన్నెతగ్గని సృజనాత్మక బొమ్మల తయారీకి ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హస్తకళాకారుల సొసైటీ భవనాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటక్ హబ్గా జిల్లా.. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతికంగా జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎక్స్పీరియన్స్ భవనంలో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతి భావితరాలకు తెలిసేలా ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్పూర్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ నెల 23 నుంచి మే 2 వరకు విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో మానసాదేవి ఆలయం, రామ్ జులా, లక్ష్మణ జులా, అనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, మాత వైష్ణోదేవి దేవాలయ సందర్శనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో బోర్డింగ్/డిబోర్డింగ్ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) ఒక్కొక్కరికి రూ. 18,510, స్టాండర్డ్ (3 ఏసీ) ఒక్కొక్కరికి రూ. 30,730, కంఫర్ట్ (2 ఏసీ) ఒక్కొక్కరికి రూ 40, 685 టిక్కెట్ ధర నిర్ణయించారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 97013 60701 ఫోన్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా మరికొన్ని ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్డు (07025) ప్రత్యేక రైలు ఈ నెల 11 నుంచి జూన్ 6 వరకు ప్రతి శుక్రవారం, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి (07026) ప్రత్యేక రైలు ఈ నెల 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి–సాయినగర్ షిర్డి (07637) ఈ నెల 13 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం, ఽతిరుగు ప్రయాణంలో సాయినగర్ షిర్డీ–తిరుపతి (07638) ఈ నెల 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం నడపనున్నారు. హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్పూర్ యాత్ర -
కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
పెనమలూరు: ఆర్థిక బాధలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. యనమలకుదురులో ఏడేళ్ల కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామంలోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో వేమిరెడ్డి భవాని ఆమె భర్త సాయిప్రకాష్రెడ్డి, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. భవాని విజయవాడ గాంధీనగర్లో జన ఔషధి మెడికల్ షాపులో పని చేస్తోంది. భర్త సాయిప్రకాష్రెడ్డి వన్టౌన్లో బంగారం వర్క్ షాపు నిర్వహిస్తాడు. కరోనా సమయంలో వ్యాపారం లేక భర్త సాయిప్రకాష్రెడ్డి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. భర్త మానసికంగా ఇబ్బందులు పడుతుండటంతో భార్య అతనికి ధైర్యం చెప్పసాగింది. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం భర్త పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. భవాని తాను మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని విజయవాడ వెళ్లింది. వెళ్లిన అరగంటలోనే భవానికి ఇంటి సమీపంలో ఉన్న వారు ఫోన్ చేసి ఆమె భర్త సాయిప్రకాష్రెడ్డి (34), కుమారుడు తక్షిల్ (7) విష పదార్థం తీసుకున్నారని చెప్పారు. వారిని పటమటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. భవాని పటమట ఆస్పత్రికి చేరుకుని వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్సకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకు అదే రోజు రాత్రి మృతి చెందారు. సాయిప్రకాష్రెడ్డి చనిపోక ముందు తాను, కుమారుడు సైనేడ్ తీసుకున్నామని విజయ్ అనే మిత్రుడికి ఫోన్ వాయిస్ మెసేజ్ చేశాడు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక బాధల కారణంగానే ఘటన -
తటాకాలు కావివి.. పంట పొలాలే!
పెనుగంచిప్రోలు: గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు వచ్చిన భారీ వరద రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఆ వరదలకు మునేరు తువ్వ కాలువకు గండ్లు పడి వత్సవాయి మండలం వేములనర్వతో పాటు పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు, ముచ్చింతాలకు చెందిన 220 ఎకరాల్లో పైగా పంట భూములు కోతకు గురయ్యాయి. వరదలకు పంట కొట్టుకు పోవటంతో పాటు పొలాలు కోతకు గురై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మునేరుకు వచ్చిన వరదతో పక్కనే కాలువకు పెద్ద పెద్ద గండ్లు పడి ఒక్కో చోట 10 నుంచి 15 అడుగుల గోతులు పడ్డాయి. మునేరుకు వరదలు వచ్చి 8 నెలలు అవుతున్నా కోతకు గురై గుంతలు పడిన భూముల్లో నేటికీ వరద నీరు అలానే ఉంది. దీంతో అవి తటాకాల్లా దర్శనమిస్తున్నాయి. రైతులు ఆ భూముల్లో నీటిని తోడేసి, మట్టితో చదును చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులు అంత పెట్టుబడి పెట్టలేక అలానే ఉంచేశారు. ఇప్పటికే ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పోయాయి. మళ్లీ ఖరీప్ సీజన్ రానుంది. దీంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు ప్రభుత్వం నుంచి కొంత తోడ్పాటు అవసరమని అంటున్నారు. ఇసుక మేటలు తొలగించుకుంటున్న రైతులు... ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవటంతో కొందరు రైతులు ఇక తప్పనిసరై వరద ముంపునకు తమ పొలాల్లో ఇసుక మేటను సొంతంగా తొలగించుకుంటున్నారు. కొందరు రైతులు జేసీబీ, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని అవసరమైన రైతులకు తోలుతున్నారు. కొన్ని పొలాల్లో 3 నుంచి 4 అడుగుల మేర ఇసుక మేట ఉంటే కొన్ని చోట్ల 6 నుంచి 7 అడుగుల వరకు ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేచి చూస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో తమకు తామే ఇసుక మేటలు తొలగించుకుని ఖరీప్ సాగు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. కోలుకోలేని దెబ్బ తీసిన మునేరు వరద 8 నెలలవుతున్నా నేటికీ తొలగని వరద నీరు దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు సొంతంగా ఇసుక మేటలు తొలగించుకుంటున్న వైనం -
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావించే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డీఎల్పీఓలు, వార్డు సచివాలయాల అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నూతన ఆవిష్కరణలతో రోల్ మోడల్గా నిలుస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించేందుకు అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. రాబోయే నాలుగేళ్లలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలలో ప్రజలను కీలక భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలన్నారు. సంపన్న కుటుంబాలు(మార్గదర్శి) నిస్సహాయ కుటుంబాలను (బంగారు కుటుంబం) దత్తత తీసుకుని వారి సమగ్రాబివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మండల స్థాయిలో వర్క్షాపులు నిర్వహించి అధికారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు. గణాంకాల ప్రకారం సర్వీస్ సెక్టార్లో మన జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానం, పారిశ్రామిక వృద్ధిలో 5వ స్థానం, వ్యవసాయ రంగంలో 23వ స్థానంలో ఉన్నామని వివరించారు. అన్ని రంగాలలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్, 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తక్వియుద్దీన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి – -
కానూరులో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: కానూరు మురళీనగర్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్కు చెందిన షగీర్ఖాన్(30), భార్య దిల్రుబాబీబీ, ముగ్గురు పిల్లలతో కానూరు మురళీనగర్లో గత కొద్ది కాలంగా ఉంటున్నాడు. భర్త ఆటోనగర్లో పాత ఇనుము షాపులో పని చేస్తుండగా, భార్య స్టీల్ కంపెనీలో పని చేస్తోంది. భర్త షగీర్ఖాన్ మద్యానికి బానిసగా మారటంతో భార్య దిల్రుబాబీబీతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్య పనికి వెళ్లగా, ముగ్గురు పిల్లలు స్కూల్కు వెళ్లారు. షగీర్ఖాన్ భార్య దిల్రుబాబీబీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. భార్య మధ్యలో పని వదిలి ఇంటికి వచ్చి తలుపుకొట్టింది. భర్త తలుపు తెరవకపోవటంతో ఇంటి యజమాని, ఇరుగుపొరుగువారికి సమాచారం తెలిపింది. పోలీసుల సహకారంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా షగీర్ఖాన్ చున్నీతో ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అవినీతి తప్ప అభివృద్ధి శూన్యం
గుణదల (విజయవాడతూర్పు): రాష్ట్రంలో, విజయవాడ నగరంలో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.వందల కోట్ల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగకపోవటంతో ఆ పార్టీల నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. కూటమి నేతలు హామీలపై బాండ్లు ఇచ్చారని, కానీ అవి పనికిరాకుండా పోయాయని, తల్లికి వందనం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో పథకాలు దిక్కు లేకుండా పోయాయని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మననం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నేతలకు పట్టడం లేదని, ప్రజలందరి పక్షాన తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తూర్పులో చంద్రబాబు డూప్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి చంద్రబాబు డూప్ అని, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు మరికొన్ని అబద్ధాలను చేర్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను ఏమార్చేందుకు పీ–4 అని కొత్త స్కాంను తీసుకొచ్చారన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో జగన్ కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ను పట్టుకుని వాళ్లు మాట్లాడుతున్నారని, మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ వెంకట సత్యం, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలను తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా జరిగింది. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత 10 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. సమ్మె కాలపు ఒప్పందాలపై జీవోలు జారీ చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ, సమ్మెకాలపు ఒప్పందాలపై జీవోలు ఇవ్వాలని ఈ నెల 17 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సభ తీర్మానించింది. సంఘం అధ్యక్షుడు టి.నూకరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, రాష్ట్ర కోశాధికారి ఎస్.జ్యోతిబసు, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ధర్నాచౌక్లో మున్సిపల్ కార్మికుల ధర్నా -
మొక్కజొన్న ధర ఢమాల్!
కంకిపాడు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మొక్కజొన్న రైతుల పరిస్థితి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా, మార్కెట్లో ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవటంతో ధర నిర్ణయం దళారుల ఇష్టారాజ్యంగా తయారైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 11,875 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ప్రస్తుతం పది రోజులుగా మొక్కజొన్న కోత సాగుతోంది. కండెలు కోసి గింజలు వేసే యంత్రాలతో మొక్కజొన్న గింజలు వేరు చేయిస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు ఉన్నాయి. దిగుబడులు సంతృప్తికరం.. ఎకరాకు కౌలు రూ. 12 వేలు, పెట్టుబడులు రూ. 40 వేలు వెచ్చించి రైతులు సాగు చేపట్టారు. ఎకరాకు సరాసరిన 40–45 క్వింటాళ్ల వరకూ దిగుబడులు లభించాయి. పక్షులు, కత్తెర పురుగు ఉద్ధృతితో అక్కడక్కడా నష్టం వాటిల్లినా దిగుబడులు ఘనంగానే వచ్చాయి. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ. 2,225గా నిర్ణయించింది. దీంతో ఆశించిన ధర దక్కుతుందని మొక్కజొన్న రైతులు ఆశించారు. నీరసపడుతున్న అన్నదాతలు.. దిగుబడులు చేతికందే వరకూ క్వింటా మొక్క జొన్నలు బహిరంగ మార్కెట్లో రూ.2,250 నుంచి రూ.2400 వరకూ పలికింది. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. ఈ తరుణంలో ధర నేల చూపులు చూస్తోంది. రోజు రోజుకీ ధరలు దిగజారుతున్నాయి. క్వింటా ధర రూ. 1950 నుంచి రూ. 2వేలు మాత్రమే పలుకుతోంది. ధర పడిపోతుండటంతో మొక్కజొన్న రైతులు నీరసించిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కోత దశలోనూ, ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షానికి తడిచాయి. ఈ పంటను ఆరబెట్టి, ఎండగట్టి మార్కెట్కు తరలించేందుకు ఒక్కో రైతు ఎకరాకు రూ. 5 వేలు వరకూ అదనపు పెట్టుబడులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులు పంటను ఎండబెట్టి గింజ నాణ్యతను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. అయితే ప్రకృతి మాత్రం రైతులు వదలటం లేదు. అల్పపీడనం రూపంలో అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈడుపుగల్లులో ఆరబోసిన మొక్కజొన్న గింజలు ఆశాజనకంగా దిగుబడులు రోజు రోజుకూ పడిపోతున్న ధరతో ఆందోళన మద్దతు ధర దక్కక తిప్పలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? ప్రకృతి ప్రకోపంతో అదనపు ఖర్చులు సర్కారు నిర్లక్ష్యం.. నెల రోజుల క్రితమే ప్రతిపాదనలు.. జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలను సేకరించాం. మార్కెట్ ఒడిదొడుకులను అంచనా వేశాం. నెల రోజులు క్రితమే ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. – మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్, కృష్ణాజిల్లా కూటమి సర్కారు అన్నదాతను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. పంట చేతికందే నాటికి మార్కెట్లో ధర తగ్గుముఖం పడితే మద్దతు ధర కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. పది రోజులుగా మొక్కజొన్న మార్కెట్కు చేరుతోంది. మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో అయినా కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ప్రదర్శిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
ఆర్చరీ కోచ్ చెరుకూరికి న్యాయం చేయాలి
విజయవాడస్పోర్ట్స్: ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అకాడమీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ చెరుకూరి సత్యనారాయణ మహానాడులోని ఆర్చరీ అకాడమీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజు కొనసాగింది. దీక్ష చేపడుతున్న చెరుకూరి సత్యనారాయణను ఆంధప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.డి.ప్రసాద్, నెట్బాల్ సంఘం ప్రతినిధి శివరామ్, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్, టీడీపీ నాయకుడు నరసింహచౌదరి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రేమ్కుమార్, వెంకటరమణ, నాగేశ్వరరావు, రంగారావు, చెన్నకుమార్ పరామర్శించి సంఘీబావం ప్రకటించారు. చెరుకూరి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకూరి సత్యనారాయణకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.క్రీడా సంఘాల నాయకుల డిమాండ్ -
సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. ఇటీవల జిల్లా శాఖకు నిర్వహించిన ఎన్నికలలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడు డి. సత్యానారాయణరెడ్డి, సహా అధ్యక్షుడు వి.వి. ప్రసాద్, కార్యదర్శి పి. రమేష్కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కలెక్టర్ను మార్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి. సతీష్ కుమార్, డి. విశ్వనాథ్, జి.రామకృష్ణ, బీబీ రమణ, వి. నాగార్జున నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా వెండి రథోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవ సేవ నిర్వహించారు. సాయంత్రం 5 గంట లకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద వెండి రథంపై కొలువై ఉన్న స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవో దుర్గారావు, ఇతర ఆలయ అధికారులు వెండి పల్లకీని ముందుకు లాగి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన నగరోత్సవం కుమ్మరిపాలెం, కామకోటి నగర్, శంకరమఠం, విద్యాధరపురం, సొరంగ మార్గం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వెండి రథంపై అధిష్టించిన స్వామి వారు భక్తుల ఇంటి ముంగిటకు విచ్చేయడంతో హారతులిచ్చి పూలు, పండ్లు, కొబ్బరి కాయలను సమర్పించి, పూజలు చేశారు. బెజవాడ వీధుల్లో ఊరేగిన దుర్గామల్లేశ్వరులు -
పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం–జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. సమన్వయంతో పనిచేయాలి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. చట్టం పటిష్టంగా అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు, కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కులధ్రువీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు తిరువూరు డివిజన్లో పది కేసుల్లో బాధితులకు రూ. 10.75లక్షలు, విజయవాడ డివిజన్లో 150 కేసుల్లో బాధితులకు రూ. 1,78,21,250, నందిగామ డివిజన్లో 56 కేసుల్లో బాధితులకు రూ.65 లక్షలు మేర మొత్తం 216 కేసుల్లో దాదాపు రూ. 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కేసుల వివరాలు ఇవీ.. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ 2023, డిసెంబర్ 21 నుంచి 2024, డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లతో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్, మహిళా పీఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లు వివరించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, ఆర్డీఓలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డీవీఎంసీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
దళిత ప్రజాప్రతినిధికి సెగ..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఇద్దరూ తోడు దొంగలై దోచుకున్నారు. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు రూ.కోట్లు వెనకేసుకున్నారు. వాటాల్లో తేడా రావడంతో విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలి ఒకరిపై మరొకరు రాజకీయ ఎత్తులు వేసుకుంటూ కాలయాపన చేశారు. ఇలా కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గ అధికార పార్టీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిదే పైచేయిగా నిలిచింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటరిగా మిగిలారు. నోటి దురుసు తనం, ఆవేశమే ఆయనకు శాపంగా మారాయి. దానిని ఓ సామాజికవర్గం తమకు అనుకూలంగా మార్చుకుని ఆధిపత్య పోరులో దళిత ప్రజాప్రతినిధిపై ఫిర్యాదులు చేస్తూ, అధిష్టానం వద్ద పై చేయి సాధించింది. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం సైతం ఆచితూచి అడుగులు వేస్తూ, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుండా గుమ్మనంగా వ్యవహరిస్తోంది. పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ ప్రజాప్రతినిధిదేపై చేయి అక్రమ దందా వాటాల్లో తేడా వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై పార్లమెంట్ ప్రజాప్రతినిధి వేసిన రాజకీయ ఎత్తుగడలు ఫలించాయి. పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఏకతాటిపైకి తీసుకొచ్చి అధిష్టానానికి ఫిర్యాదు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటెద్దు పోకడలను ఆది నుంచి గమనిస్తున్న అధిష్టానం సైతం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. జిల్లా సీనియర్ నాయకులతో చర్చలు జరిపి నియోజకవర్గ ప్రజాప్రతినిధిని పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే క్రమంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి తిరువూరు రాజకీయాల్లో చక్రం తిప్పడం ప్రారంభించారు. తిరువూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి నుంచి డైరెక్టర్ పోస్టుల వరకు తన వర్గీయులనే ఎంపిక చేయించారు. ఈ నెల ఐదో తేదీన జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి వెంట నాయకులెవరూ వెళ్లకుండా చేయడంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన సేవల దేవదత్ను తెరమీదకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంలోనే తాము పని చేస్తామంటూ తిరువూరు నియోజకవర్గ ప్రముఖ టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సమాచారాన్ని సైతం అధిస్టానానికి చేరవేసిన పార్లమెంట్ ప్రజాప్రతినిధి సేవల దేవదత్ను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ప్రకటించేందుకు వ్యూహం పన్నారు. బాబు సమక్షంలో అవమానం క్లైమాక్స్కు చేరిన తిరువూరు రాజకీయ చదరంగం వర్గపోరులో పంతం నెగ్గించుకున్న పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఆయన వర్గీయులకే మార్కెట్యార్డు పదవులు నియోజకవర్గ దళిత ప్రజాప్రతినిధికి అడుగడుగునా అవమానాలు ఆ ప్రజాప్రతినిధిని పక్కనబెట్టి కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తారని ప్రచారం పార్లమెంట్ ప్రజాప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు ఈ నెల ఐదో తేదీన నందిగామ వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికే క్రమంలో తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని దళిత సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు ఎదురుగా వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి గులాబీపువ్వు ఇచ్చి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ను చంద్రబాబు పట్టించుకోకుండా పక్కన ఉన్న నాయకులతో ఫొటోలు దిగుతున్న వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఇదేనా దళిత ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. దళిత ప్రజాప్రతినిధిపై అగ్రకుల పార్లమెంట్ ప్రజాప్రతినిధి పంతం నెగ్గించుకుని రాక్షసానందం పొందుతున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఎం. యతిరాజం కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఆరోగ్య కేంద్రం సందర్శన కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆరోగ్య కార్యక్రమాల తనిఖీల్లో భాగంగా కృష్ణలంక, భ్రమరాంబపురంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం కృష్ణలంక–7ను, క్షేత్రస్థాయిలో వ్యాధి నిరోధక టీకాల సెషన్ జరిగే ప్రాంతాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.సుహాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రంలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణలంక–7 వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘పది’ మూల్యాంకనం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. విజయవాడ బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన ఈ వాల్యూయేషన్లో 826 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరిలో 92 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 552 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 182 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,70,781 జవాబు పత్రాలకు వాల్యూయేషన్ పూర్తి చేశారు. అందులో తెలుగు–29,805, స్పెషల్ తెలుగు– 1,231, హిందీ–22,737, ఇంగ్లిష్–11,462, లెక్క లు–21,414 భౌతికశాస్త్రం–21,500, బయోలజికల్ సైన్స్–24,390, సోషల్–27,454, సంస్కృతం–8,309, వోకేషనల్–2,479 ఉన్నాయి. విజయవంతంగా.. జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ‘పది’ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా ముగించామన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పాట్ కొనసాగిందన్నారు. జిల్లాకు వచ్చిన 1,70,781 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ శాఖకు పంపించినట్లు చెప్పారు. విజయవాడలో పోస్టర్లపై నిషేధం భవానీపురం(విజయవాడపశ్చిమ): పోస్టర్ రహిత నగరమైన విజయవాడలో బహిరంగంగా పోస్టర్లను అతికించటం, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టటం నిషేధమని నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు నగర సుందరీకరణను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ/ప్రైవేట్ భవనాలు, ప్రహరీలు, ట్రాఫిక్ డివైడర్లు, కరెంట్ పోల్స్, ట్రాఫిక్ ఐల్యాండ్స్, ఫ్లై ఓవర్లు/బ్రిడ్జిలు తదితర ప్రాంతా ల్లో పోస్టర్లను అతికించటాన్ని నిషేధించామని వివరించారు. వివిధ సంస్థలకు చెందినవారు తమ ప్రకటనల నిమిత్తం వాల్ పోస్టర్లను నగరంలో పైన పేర్కొన్న ప్రాంతాలలో పోస్టర్లను అతికిస్తే వారిపై చట్ట రీత్యా (1997 చట్టం) చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటనదారులు, ప్రింటింగ్ ప్రెస్ల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా జరిమానా వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించిన వారితోపాటు వాటిని ప్రింటింగ్ చేసిన వారిని కూడా గుర్తించామని వివరించారు. -
వైఎస్సార్ పాదయాత్ర ఒక మరపురాని చరిత్ర
మధురానగర్(విజయవాడసెంట్రల్): దేశ రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహానేత చేపట్టిన పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను, రైతుల పట్ల అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ఉదాసీనతను ఎత్తిచూపడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11 జిల్లాల్లో 1,500 కి.మీ. పాదయాత్ర చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై ఆయన చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు 108 సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని అన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు సహా 942 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
సగటు వేతనం రూ.307 వచ్చేలా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వేతనదారులకు పని కల్పించడంలోనూ, సగటు దినసరి వేతనం రూ.307 వచ్చేలా చూడటంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆ యన డ్వామా అధికారులతో కలిసి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులతో పాటు సగటు రోజువారీ వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని సమీక్షించారు. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 80 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది గణాంకాల ఆధా రంగా ఈ ఏడాది మండలాలు, రోజుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. ఈ ఏ డాది మార్చి నుంచి జూన్ వరకు 2,737 పంట కుంటల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, 69 కుంటల నిర్మాణం 100శాతం పూర్తయిందని, మరో 1,029 పంట కుంటలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వేసవిలో పశువులతో పాటు గొర్రెలు, మేకలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామని, పశు సంవర్థక శాఖ 277 తొట్టెల పనుల ను గుర్తించి, పనులు చేపట్టిందన్నారు. మిగిలిన వా టికి సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రక్రియ ఈ నెల 12 నాటికి పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల సాగుకు 2025–26లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 20 ఎకరా లను గుర్తించాలని, జిల్లా లక్ష్యం 4వేలఎకరాలుగా ఉం దని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.సమావేశంలో డ్వా మా పీడీ ఎ.రాము, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఈ ఏడాది 80 లక్షల ఉపాధి హామీ పనిదినాలు లక్ష్యం పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరేలా పనిచేయాలి -
అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
పెనమలూరు: యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ఫిరోజ్ విజ్ఞప్తిచేశారు. ఆయన బుధవారం వివరాలు తెలుపుతూ కృష్ణానదిలో ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని మహిళ హత్యకు గురైందని, ఈ హత్య ఇద్దరు వ్యక్తులు చేసి ఉంటారని సీసీ ఫుటేజీ కదలికల ద్వారా తెలుస్తోందని వివరించారు. ఒక వ్యక్తి తొలుత కరకట్ట దిగువన ఉన్న బార్లో మద్యం సీసా కొనుగోలు చేశాడని, ఆ తరువాత అతను మరో మహిళతో కలిసి మృతురాలిని కృష్ణానదిలోకి తీసుకువెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. అక్కడ మహిళ హత్య జరిగిన తరువాత నిందితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారన్నారు. ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కరకట్టపై లారీకి తప్పిన ముప్పు తోట్లవల్లూరు: తోట్లవల్లూరులోని కృష్ణా కరకట్ట వద్ద బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. స్థానిక కృష్ణానది రేవు నుంచి ఓ లారీ కరకట్ట పైకి ఎక్కే క్రమంలో పొరపాటుగా హైడ్రాలిక్ పైకి లేచి, ఫైబర్నెట్ తీగకు పట్టి బలంగా లాగేయటంతో పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్లైన్ ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే విద్యుత్ స్తంభం కూలే క్రమంలో ఒక్కసారిగా గంగూరు సబ్స్టేషన్లో ట్రిప్ అవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనలో డ్రైవర్ నాగనాంచారయ్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ట్రాన్స్కో ఏఈఈ దేవదాసు ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన సిబ్బందిని ఏర్పాటు చేసి దెబ్బతిన్న స్తంభం తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కానిస్టేబుల్ ఆత్మహత్య తిరువూరు: వత్సవాయి పోలీసుస్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ చిల్లపల్లి శ్రీని వాసరావు(42) బుధవారం సాయంత్రం గంపలగూడెం మండలం తోట మూలలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంపలగూడెం పోలీసుల కథనం మేరకు.. శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2011లో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు ఎ.కొండూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ వత్సవాయికి బదిలీ అయ్యాడు. పది నెలలుగా విధులకు కూడా వెళ్లకుండా మానసిక వత్తిడికి గురవుతున్నాడు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. శ్రీనివాసరావు మృతదేహానికి తిరువూరు పోలీసు స్టేషన్లో పోస్టుమార్టం నిర్వహించారు. -
మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చిన సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం బ్యారేజీలోని 67వ కానా నుంచి మహిళ నదిలోకి దూకింది. ఆమెను గమనించిన స్థానిక పాదచారులు అక్కడ విధులు నిర్వహిస్తున్న 16వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారమందించారు. వారు వెంటనే దుర్గాఘాట్ వద్ద డ్యూటీలో ఉన్న వారిని అప్రమత్తం చేయటంతో వారు బోటుతో నదిలోని సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పట్టుకున్నారు. అదే సమయంలో ఇతర సిబ్బంది బ్యారేజీ పైనుంచి తాడు విసరటంతో ఆమెను బోటులోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం వన్టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందికి సమాచారమందించి వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని బెటాలియన్ ఎస్పీ రాజకుమారి అభినందించారు. నదిలోకి దూకిన మహిళ యనమలకుదురుకు చెందిన 29 సంవత్సరాల మేక దివ్య అని గుర్తించారు. ఆమె కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆమె కుటుంబ సభ్యులను పిలిచి ఆమెను అప్పగించారు. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు విజయవాడలీగల్: కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను ఈ నెల 23వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీ ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐడీ అధికారులు దాఖలు చేసిన కేసులో బుధవారం రిమాండ్ ముగియడంతో వంశీ సహా 12 మందిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 23వ తేదీవరకు రిమాండ్ను పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వంశీ బెయిల్ పిటీషన్ డిస్మిస్ విజయవాడలీగల్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో తన స్థలం ఆక్రమించి, వేరేవారికి విక్రయించారని సీతామహాలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి బెయిల్ మంజూరుచేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటీషన్ దాఖలుచేశారు. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం బెయిల్ పిటీషన్ను డిస్మిస్ చేస్తూ విజయవాడలోని 12వ అదనపు జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. -
ప్రపంచ శాంతి అందరి అభిమతం కావాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రపంచ శాంతి ప్రజలందరి అభిమతం కావాలని, అదే జైన మతం బోధిస్తుందని ప్రముఖ జైనగురువు ఆచార్య దేవేష్ శ్రీమద్ విజయ్ కుల్బోధి సూరీశ్వర్జీ అన్నారు. జైన సంఘాల అనుబంధ సంస్థ జితో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ నవకర్ మహామంత్ర దినోత్సవాన్ని విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించారు. ప్రపంచ వ్యాపితంగా పలు నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఉపన్యాసాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం స్థానికంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జైన గురువు ఆచార్య దేవేష్ శ్రీమద్ విజయ్ కుల్బోధి సూరీశ్వర్జీ మాట్లాడుతూ ప్రపంచంలోని మానవులందరూ ఎటువంటి కష్టనష్టాలు లేకుండా, ఏ విధమైన ఈతిబాధలు లేని జీవితాలను గడపాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అన్ని జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఉద్బోధించారు. ప్రధానంగా ప్రజలందరూ పర్యావరణ ప్రేమికులు కావాలని, తద్వారా చుట్టూ ఉన్న సమాజాన్ని దైవ స్వరూపంగా చూడగలరని అన్నారు. సంస్థ విజయవాడ చాప్టర్ చైర్మన్ కమలేష్ ఫోలముతో మాట్లాడుతూ జైనులు వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాల్లోనూ తమదైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాకేష్ జైన్, ప్రధాన కార్యదర్శి మనీష్ జైన్, కోశాధికారి కుందన్మల్ గాంధీ, కార్యదర్శి, నవకార్ మహామంత్ర దినోత్సవ కన్వీనర్ ప్రవీణ్జైన్ రాంకా, కార్యదర్శి మనీష్ చాజ్జెడ్, మహిళా విభాగం చైర్పర్సన్ కాజల్ జైన్, చీఫ్ సెక్రటరీ ఛాయాజైన్, యువజన విభాగ చైర్మన్ రిషబ్జైన్, చీఫ్ సెక్రటరీ నిషా బాగ్రేచా తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ప్రపంచ నవకార్ మహామంత్ర దినోత్సవం భారీగా హాజరైన జైన మతస్తులు -
విఘ్నేశ్వర ఆలయంలో హుండీ చోరీకి యత్నం
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్థాని క సత్యనారాయణపురం, గిరివీధిలోని అభయ విఘ్నేశ్వర ఆలయంలోకి దొంగలు చోరబడి హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు, ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. వినాయకుని గుడి ఎదుట ఉన్న హుండీని గడ్డపారతో పగులకొడుతుండగా, ఆ శబ్దాలు విన్న పక్కనే ఎస్బీఐ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డు అక్కడకు రావడంతో ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. విషయం తెలియడంతో ఆలయ నిర్వాహకులు ఎస్ఎన్పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పల్సర్ వాహనంపై ముగ్గురు నిందితులు చోరీకి యత్నం చేసినట్లు గుర్తించారు. వారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో అదే రోజు మధ్యరాత్రి 12.50కి ఒక ఇంటి ముందు పల్సర్ వాహనం చోరీ చేసి దానిపైనే సత్యనారాయణపురంలోని విఘ్నేశ్వర ఆలయంలో చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
మహిళలకు అందని ద్రాక్షగా మారిన న్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచార కేసుల్లో బాధిత బాలికలు, మహిళలకు న్యాయం అందని ద్రాక్షగా మారిందని ఏపీ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని అన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరగకపోగా వారి హక్కులను, రాజ్యాంగ సూత్రాలను తిరస్కరించేవిగా ఉన్నాయన్నారు. ‘చిన్నారులు మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల తీర్పులను నిరసిస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) పిలుపులో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ తాలూకా కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పు కాపీలను దహనం చేశారు. అనంతరం దుర్గాభవాని మాట్లాడుతూ పోక్సో కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన తీర్పు మహిళా లోకాన్ని ఆవేదనకు గురిచేసిందన్నారు. దేశంలో వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల్లో బాధితులకు న్యాయం కంటే దోషులకు ఊరట కలిగించే తీర్పులు వెలువడడం బాధాకరమన్నారు. రాష్ట్రాల హైకోర్టు తీర్పులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణతో పాటు న్యాయ మార్గదర్శకాలను సక్రమంగా పాటించేలా చేయాలని దుర్గాభవాని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ కేసులలో విచారణ జాప్యం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, నగర నాయకులు డి.సీతారావమ్మ, నీలాపు భాగ్యలక్ష్మి, ఓ.నాగుర్ బి, ప్రభావతి, వేలాంగణి రాణి, ఝాన్సీ, మల్లేశ్వరి, జి.మణి కుమారి, జి.కుమారి, షణ్ముఖ ప్రియ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఏపీ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని -
బంగారం, నగదు చోరీపై కేసు నమోదు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బంగారం, నగదు చోరీపై వన్టౌన్ పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే గన్నవరంలో భీమవరపు సామ్రాజ్యం (64) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె తన బంగారపు తాడు తెగిపోవటంతో కొత్త తాడు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మూడు కాసుల బంగారపు తాడు, మరో మూడు కాసుల బరువైన రెండు బంగారపు గాజులు, రూ.50 వేల నగదును తీసుకుని తన ఆడబిడ్డ గుజ్జు లక్ష్మీకుమారితో కలిసి బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విజయవాడకు బయలుదేరింది. గన్నవరం నుంచి రామవరప్పాడు వరకు ఒక ఆటో, అక్కడి నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకూ మరో ఆటో ఎక్కి వన్టౌన్కు చేరుకుంది. ఆటో దిగి సంచిలో చూసుకోగా బంగారం, నగదు కనిపించలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమందించి వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాంబే కాలనీలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహంపాయకాపురం(విజయవాడరూరల్): వాంబే కాలనీ సి బ్లాక్ సమీపంలో డ్రైనేజీ కాల్వలో గుర్తు తెలియని వృద్ధుని శవం పడి ఉండటంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు, సుమారు 70–75 సంవత్సరాల వయస్సు కలిగి బక్కచిక్కి తెల్లనిగడ్డం, జుట్టుతో టీషర్ట్–నిక్కరు ధరించిన వ్యక్తి మృతదేహం ఉంది. స్థానికుల సహకారంతో శవాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవు. సచివాలయ వీఆర్వో టి.జాన్ రాఘవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు 5–2 అడుగులు ఎత్తు, చామనచాయ రంగు, తెలుపు జుట్టు, తెల్ల టీషర్ట్, లైట్ గ్రీన్ నిక్కరు ధరించి ఉన్నాడని, వయస్సు 70–75 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. వివరాలు తెలిసిన వారు నున్న పోలీసు స్టేషన్లో సంప్రదించవచ్చన్నారు. -
విజయవాడ మీదుగావేసవి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. హుబ్లీ–కతిహార్(07325) ప్రత్యేక వారాంతపు రైలు ఈ నెల 9 నుంచి 30 వరకు ప్రతి బుధవారం, కతిహార్–హుబ్లీ రైలు (07326) ఈ నెల 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడపనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా బెంగళూరు–నారంగీ (06559) ఈ నెల 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం, నారంగీ–బెంగళూరు (06560) ఈ నెల 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు అధికారులు తెలిపారు. కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా..గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో 2023–25 ద్వితీయ సంవత్సరం డైట్ విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సభ నిర్వహించారు. డైట్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సందడి చేశారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలను ప్రథమ సంవత్సర విద్యార్థి అంజుమ్ కౌసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సీనియర్ అధ్యాపకులు వినయకుమార్, మోహినికుమారి, లెక్చరర్లు, ఆచార్యులు పాల్గొన్నారు. 11న ఉమ్మడి కృష్ణాజిల్లా క్రికెట్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండ ర్–19 పురుషుల వన్డే, మల్టీ డే క్రికెట్ జట్టును ఈ నెల 11వ తేదీన మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2006 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారే ఈ పోటీలకు అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూ, సొంత కిట్తో ఆ రోజు ఉదయం 7.30 గంటలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 93934 44279ను సంప్రదించాలని సూచించారు. -
వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మల్లేశ్వర ప్రాంగణంలో పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను జరిపించి, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు జరిపించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి పల్లకీపై ఉంచి నగరోత్సవ సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి వెండి పల్లకీ సేవ ప్రారంభం కాగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భజన బృంద సభ్యులతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్ మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. పూజా కార్యక్రమాలు, నగరోత్సవ సేవలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉపప్రధాన అర్చకులు కోట ప్రసాద్ పాల్గొన్నారు. వేడుకగా మంగళ స్నానాలు వెండి పల్లకీపై ఊరేగిన ఆదిదంపతులు -
మొక్కజొన్నకు తీవ్ర నష్టం
జిల్లా వ్యాప్తంగా రబీలో 8,287హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుండగా యాభై శాతానికి పైగా మొక్కజొన్న ఇప్పటికే కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోశారు. మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతుండటంతో గిట్టుబాటు కాక రైతులు అమ్మకుండా కల్లాల్లోనే ఉంచారు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. అంతే కాకుండా వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరు నేలవాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో మొత్తం 581 హెక్టార్లలో మొక్కజొన్న నేల వాలినట్లు వ్యవసాయశాఖాధికారులు నివేదికలో పేర్కొన్నారు. -
ధాన్యం కొనేవాళ్లే లేరు..
జిల్లా వ్యాప్తంగా రబీలో 19,985హెక్టార్లలో వరి సాగైంది. అయితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలలో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం, విజయవాడరూరల్ మండల పరిధిలో ముమ్మరంగా కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు అకాల వర్షాలు, మరో వైపు తేమ పేరుతో మిల్లర్ల వేధింపులు అక్కడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరబోసేందుకు జాగా లేక శ్మశానాల్లో ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ధాన్యం వర్షానికి తడిసిపోయి ఆరబెట్టేందుకు కూలీలు దొరక్క నరకయాతన పడుతున్నారు. తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే తాము ఒడ్డున పడతామని రైతులు వాపోతున్నారు. -
వ్యూహాత్మక ప్రణాళికతో ‘సహకారం’ బలోపేతం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళికతో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏడాదంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం 4వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ (డీసీడీసీ) సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించారన్నారు. సహకార, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సామాజిక–ఆర్థిక అసమానతలను రూపుమాపడం తదితర లక్ష్యాల సాధనలో సహకార రంగం పోషిస్తున్న పాత్ర, సహకార ఉద్యమం ప్రాధాన్యం, సహకార సంఘాల ప్రయోజనాలు తదితరాలను తెలియజెప్పేలా సదస్సులు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, కార్యశాలలు నిర్వహించాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు పరపతితో పాటు వివిధ అవసరాలను తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పోషిస్తున్న పాత్రపై హైస్కూల్ స్థాయిలో వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు. వేగంగా కంప్యూటరీకరణ.. అత్యంత పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, కాగిత రహిత సేవలు అందించే లక్ష్యంతో పీఏసీఎస్ల కంప్యూటరీకరణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 131 పీఏసీఎస్లలో 99 పీఏసీఎస్ల కంప్యూటరీకరణ ఇప్పటికే పూర్తయినందున.. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి వాటిద్వారా కూడా ఆన్లైన్ సేవలు అందేలా చూడాలన్నారు. డీసీఓ, డీసీడీసీ సభ్య కన్వీనర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పౌర సరఫరాల మేనేజర్ ఎం.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, కేడీసీసీబీ లిమిటెడ్ జీఎం రంగబాబు, మిల్క్ యూనియన్ ఏజీఎం సీహెచ్ అన్వేష్, ఎఫ్సీఐ ప్రతినిధి రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీసీడీసీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ -
ప్రజలను దొంగ దెబ్బతీసిన మోదీ ప్రభుత్వం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి దేశ ప్రజలను దొంగ దెబ్బతీసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. మంగళవారం విజయవాడ బీసెంట్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపు, పెట్రోల్, డీజిల్పై పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మహిళలు వంట గ్యాస్ సిలిండర్లను తాళ్లతో మెడకు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ధర్నా నుద్దేశించి బాబూరావు, దోనేపూడి కాశీనాథ్లు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు తగ్గుతుండగా కేంద్రం పెట్రోలు, డీజిల్పై సుంకాలు విధించి వినియోగదారులపై అదనపు భారం మోపిందన్నారు. ఈ పాపంలో మోదీతోపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సిలెండర్కు రూ. 50 ధర పెంచి దేశంలోని 32 కోట్ల వినియోగదారులపై రూ. 9,100 కోట్ల భారం మోపడం దుర్మార్గమన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్పై రాయితీలు ఇస్తామని ప్రభుత్వం సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిందన్నారు. కానీ అందులోనూ కొందరికి మాత్రమే అరకొర సబ్సిడీ అందిస్తోందన్నారు. కార్పొరేటర్ బోయి సత్యబాబు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీదేవి, నాయకులు పి. కృష్ణ, నారాయణ, టి.ప్రవీణ్, చిన్నారావు, కోరాడ రమణ, సీహెచ్ శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధర,పెట్రోల్, డీజిల్పై సుంకాలు తగ్గించాలి సీపీఎం నాయకుల డిమాండ్ -
ధాన్యం కొనడం లేదు
నేను 24ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేశాను. సార్వా పంట వరద ముంపుతో పోయింది. దాళ్వా బాగా పండింది అంటే కొనే వాళ్లే లేరు. ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా ఒక్కరూ తిరిగి చూడడం లేదు. తేమ 17 రావాలని చెబుతున్నారు. ఎండబెట్టి తీసుకెళ్తే మిల్లర్లు ఇంకా ఎండాలని వెనక్కి పంపుతున్నారు. ఇప్పడు వర్షానికి ధాన్యం తడిసిపోతుంది. తీవ్రంగా నష్టపోతున్నాం. – దారపనేని సాంబశివరావు, కౌలు రైతు, ఈలప్రోలు, ఇబ్రహీంపట్నం మండలం -
మొత్తం ధాన్యం కొనాల్సిందే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు. ధాన్యం తడవడంతో తక్కువ ధరకు మధ్యవర్తులకు విక్రయించి నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సంచులు సరిపడా నిల్వ ఉంచాలని.. ధాన్యం తరలింపులో ఎక్కడ వాహనాల కొరత రాకుండా, కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విఫలం.. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడం తప్ప ఇప్పటివరకు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రి కనీసం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో వారం రోజుల క్రితమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన సంబంధిత శాఖల అధికారులు మొద్దునిద్ర పోతున్నారన్నారు. ఓ వైపు వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారుల కాలయాపనతో రైతులకు అవస్థలు తప్పడం లేదన్నారు. లారీలు రావట్లేదని, వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, వాకాడ రాము, నల్లమోతు చినబాబు, పామర్తి వెంకయ్య, జాజుల నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, శేషిరెడ్డి, యరగొర్ల శ్రీరాములు ఉన్నారు. రైతులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన మల్లాది విష్ణు -
మునిసిపల్ సేవలు@ పురమిత్ర
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిళ్ల పరిధిలోని ఆయా డివిజన్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులకు 5% రాయితీని పురమిత్ర యాప్ ద్వారా కూడా పొందవచ్చని వీఎంసీ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఇందులో ప్రజలు వారి వారి సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ యాప్ని తమ ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయి తమకు విజయవాడ నగరపాలక సంబంధిత ఎలాంటి సమస్యనైనా వెంటనే ఫొటో తీసి అప్లోడ్ చేసిన వెంటనే దగ్గరలోని సంబంధిత సచివాలయం సిబ్బంది ఆ సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పురమిత్ర యాప్లో ప్రజల ఫిర్యాదులు, సేవలు, చెల్లింపులకు అవకాశం కల్పించిందన్నారు. ● పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక సంబంధిత, వీధి దీపాలు, ఇంజినీరింగ్, తదితర అంశాలపై ఫిర్యాదులు తెలుపవచ్చని తెలిపారు. ● సేవల విభాగంలో ప్రజలు ఆన్లైన్ సేవలను పొందవచ్చని, ఖాళీ స్థలాలపై పన్ను విధించడం, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, ప్రకటనల పన్ను, డ్రెయినేజీ కనెక్షన్ తదితర అంశాలున్నాయని అన్నారు. ● చెల్లింపుల విభాగంలో ప్రజలు పురమిత్ర యాప్ ద్వారా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, ప్రకటనల పన్ను, ఆస్తి పన్నుల్లో పేరు మార్పు మ్యుటేషన్ చార్జెస్, తదితర అంశాలపై ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జ్ కమిషనర్ తెలిపారు. ● అలాగే ఇంటి వద్దే చెత్త సేకరణ, పరిసరాలలో పారిశుద్ధ్య వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని కూడా తెలియపరిచే అవకాశాన్ని ఈ యాప్లో కల్పించారని పేర్కొన్నారు. ఫిర్యాదులు, సేవలు, పన్ను చెల్లింపులకు అవకాశం -
తుది శ్వాస వరకు తెలుగు భాషాభివృద్ధికి కృషి
ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు గుడ్లవల్లేరు: తెలుగు భాషాభివృద్ధికి తుది శ్వాస వరకు కృషి చేస్తానని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రతిష్టాత్మక కళారత్న(హంస) అవార్డు అందుకున్న ఆయనను సింగలూరులో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ బండారు శ్యామ్కుమార్, సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సుబ్బారావు మాట్లాడుతూ.. తెలుగు భాష కోసం ప్రపంచ దేశాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడ్లవల్లేరు ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ హైస్కూల్ డైరెక్టర్ నారాయణం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అవార్డు గ్రహీత గుత్తికొండ 60 ఏళ్ల పాటు తెలుగు భాషాభివృద్ధి కోసం ఉద్యమాన్ని నిర్విరామంగా చేయటం గర్వించదగ్గ విషయమన్నారు. గుడివాడ పుట్టి వెంకటేశ్వరరావు సామాజిక సంస్థ అధినేత పుట్టి నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఎంతోమంది కవులు, కవయిత్రులను తయారు చేసిన ఘనత సుబ్బారావుదన్నారు. మచిలీపట్నం భావతరంగణి అధ్యక్షుడు భవిష్య మాట్లాడుతూ.. సినీ కవులతో పాటు రాష్ట్ర స్థాయి ప్రముఖులతో ఎన్నో తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాల సృష్టికర్త సుబ్బారావు అని కొనియాడారు. ఉప సర్పంచ్ నందం శ్రీనివాసరరావు, గ్రామస్తులు నందం నాగ సుధాకర్, మాచర్ల రమణయ్య, బిట్రా అర్జునరావు, నాగ మల్లేశ్వరరావు, పైడేశ్వరరావు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగణనలో కులగణన చేపట్టాలి
పటమట(విజయవాడతూర్పు): జనాభా దామాషాలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు, సంక్షేమం – అభివృద్ధి సమపాళ్లలో అందించి, అందరికీ సామాజిక న్యాయం అందాలంటే తప్పనిసరిగా ఈసారి జనగణనతో పాటే సమగ్ర కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు చెప్పారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన 45 బీసీ కుల సంఘ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసన మాట్లాడుతూ.. దేశంలో జనగణన జరగడం ఎంత ముఖ్యమో–కులగణన జరపడం అవసరమన్నారు. కులగణన విషయమై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, అవలంబిస్తున్న నిర్లక్ష్యం, తాత్సార ధోరణులకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఓబీసీలు సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నెల 27న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం కళాక్షేత్రం వద్దనున్న మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తామన్నారు. సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే జగదీష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు కుక్కల వీర వెంకట సత్యనారాయణ, ఉద్యోగ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ పుల్లారావు, కందిమళ్ల శేషగిరిరావు, దాసరి కేశవరావు తదితరులు పాల్గొన్నారు. యార్డుకు 1,44,446 బస్తాలు మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,44,443 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,41,802 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,900 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10 వేల నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,400 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,917 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
స్వార్థ ప్రయోజనాల కోసమే అసత్య ఆరోపణలు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దురుద్దేశం, స్వార్థ ప్రయోజనాల కోసమే చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్లు, సమితి ఉద్యోగులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు పేర్కొన్నారు. పాలప్రాజెక్టు ఆవరణలోని బోర్డు మీటింగ్ హాల్లో ఎండీ ఈశ్వరబాబు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్, డైరెక్టర్లు, ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతుల సంక్షేమం కోసమే కాకుండా వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. అదే సమయంలో సమితిలో పని చేసే ఉద్యోగుల భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సెల్లో సమితిలో పని చేసే వివిధ హోదాల్లో మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. అసలు నిందారోపణలు చేస్తున్న కొడాలి ప్రమీల అనే మహిళ కృష్ణా మిల్క్ యూనియన్ ఉద్యోగినే కాదన్నారు. ఆమె సమితిలో 2022లో పని చేశారని చెబుతుండగా, ప్రమీల వివరాలు తమ రికార్డుల్లో ఎక్కడా లేవన్నారు. సమితి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను కృష్ణా మిల్క్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. అసత్య ప్రచారాలపై డీజీపీతో పాటు సిటీ పోలీస్ కమిషనర్ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారనే దానిపై నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి రూ.5 లక్షల బంగారం చోరీ చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని రూ.5 లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పి.నైనవరం గాంధీ బొమ్మ సెంటర్లో సూరగాని ప్రసాద్, శివకుమారిలు నివాసం ఉంటున్నారు. ఆటో నడుపుకుని జీవనం సాగించే ప్రసాద్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రామకృష్ణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. రామకృష్ణకు ఈ నెల 18వ తేదీన వివాహం జరిపించేందుకు ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంచేందుకు ప్రసాద్, శివకుమారిలు సోమవారం మధ్యాహ్నం పెదకాకానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లి బీరువా తెరిచి కనిపించింది. అలమరలో బట్టల కింద పెట్టిన తాళాలతో బీరువా తెరిచినట్లు గుర్తించారు. బీరువాలో ఉండాల్సిన 73 గ్రాముల బంగారపు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల వేలిముద్రలను సేకరించారు. బీరువాలోని మూడు కాసుల బంగారపు నానుతాడు, 5 గ్రాముల బంగారపు సూత్రాలు, 4 గ్రాముల బంగారపు రూపు, 22 గ్రాముల బంగారపు చైను, రెండు కాసుల బంగారపు గొలుసు, 2 గ్రాముల బంగారపు లాకెట్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
యనమలకుదురులో మహిళది హత్యే !
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో మృతి చెందిన మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. యనమలకుదురు లంకల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందని పోలీసులకు ఈ నెల 5న స్థానికుల ద్వారా సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతి చెందిన మహిళ హత్యకు గురైందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే విషయం పోలీసులు తొలుత తేల్చలేక పోయారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన మహిళ కోసం ఎవరూ రాకపోవడంతో కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. మహిళది హత్యే.. కేసు విచారణలో భాగంగా పోలీసులు నదికి వెళ్లే మార్గాల్లో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో పురుషుడు, మహిళ ముఖానికి మాస్క్లు ధరించి వెళ్తుండగా వారి వెనుక మృతి చెందిన మహిళ అనుసరించినట్లు గుర్తించారు. ముగ్గురు కరకట్ట మీదుగా వెళ్లి చింతల్ వద్ద కరకట్ట దిగి గ్యాస్ గోడౌన్ మీదుగా నదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ తరువాత 5వ తేదీన మహిళ మృతదేహం కృష్ణానదిలో లభ్యమైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను హత్య చేశారని పోలీసుల నిర్థారించారు. ఎవరా ఇద్దరు.? గుర్తు తెలియని మహిళను కృష్ణానదిలోకి తీసుకువెళ్లిన ఇద్దరు ఎవరనేది మిస్టరీగా ఉంది. నదిలో చనిపోయి మహిళ వివరాలు తెలియక కేసు ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలో మృతురాలిని నదిలోకి తీసుకు వెళ్లిన ఇద్దరు ఎవరనే ప్రశ్న పోలీసులకు సవాల్గా మారింది. అసలా మహిళను ఎందుకు హత్య చేశారో తేలాల్సి ఉంది. మృతి చెందిన మహిళ, ఆమెను నదిలోకి తీసుకు వెళ్లిన ఇద్దరు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని గుర్తించిన వారు కేసు వివరాలను 94906 19468, 86861 35007 ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలపాలని పోలీసులు కోరుతున్నారు. -
కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమని వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ అన్నారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలంలో కస్తూరి గోపి, నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో నల్లపు నరసింహారావు మిర్చి పంటలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇద్దరు రైతులు భూములు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేసి సరైన గిట్టుబాటు ధర రాని కారణంగా, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్తో మిర్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రైతుల తరుఫున వైఎస్సార్ సీపీ నిత్యం పోరాడుతోందని, తాము నిరసనలు తెలపటం వల్లనే ప్రభుత్వం దిగి వచ్చి క్వింటాకు రూ.11,781 ఇస్తామని చెప్పిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం జగ్గయ్యపేట: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై మంగళవారం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. బైపాస్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఉందంటూ జగ్గయ్యపేట రైల్వే సూపరింటెండెంట్ విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే హెడ్కానిస్టేబుల్ వైఎస్వీఆర్ ప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు పట్టాలపై శరీర భాగాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఘటనా స్థలంలో బిర్యానీ ప్యాకెట్లు, మద్యం సీసా ఉండటం చూస్తే సోమవారం రాత్రి రైలు ఢీకొని ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. శరీర భాగాలపై సినీ హీరో ప్రభాస్, ఆంజనేయస్వామి, శిలువ పచ్చబొట్లు ఉన్నాయి. మృతదేహాన్ని విజయవాడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని బంగారుపేటకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలకు 94917 36189 నంబర్లో సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు. వాహనం ఢీ కొని యువకుడి దుర్మరణం మైలవరం: టాటా ఏస్ వాహనం ఢీ కొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన పుల్లూరు గ్రామంలో మంగళవారం జరిగింది. మైలవరం మండలం పుల్లూరు గ్రామంలోని ప్రధాన రహదారిలోని హరీష్ హోటల్ వద్ద తిరువూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పుల్లూరు శివారు బాడవ గ్రామానికి చెందిన ఆకుతోట శ్రీనివాసరావు(30) మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్ కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని మిర్చి సాగు చేశాడు. వచ్చిన దిగుబడికి ఽభవిష్యత్తులో ధర పెరుగుతుందని కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశాడు. అయితే నరేష్ భార్య కృష్ణకుమారి(35) మిర్చి నిల్వ చేయకుండా అమ్మి బాకీలు కడదామని తెలిపింది. తన మాట వినకుండా మిర్చిని కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశాడని మనస్తాపంతో నరేష్ భార్య కృష్ణకుమారి ఈనెల 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స సొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డైట్ అధ్యాపకుల నియామక అర్హతలు సడలించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డెప్యూటేషన్ పద్ధతిలో డైట్ అధ్యాపకుల నియామకానికి పోస్టు గ్రాడ్యుయేషన్, 55 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారని, దీనిని 50 శాతానికి తగ్గించాలని డీపీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను కోరారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజును ఆయన కార్యాలయం విద్యా భవన్లో మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీను మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నూతన విద్యాసంస్కరణలలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పోస్టును గ్రేడ్ – 1 ప్రధానోపాధ్యాయులుగా ఉన్నతీకరించాలన్నారు. సీనియర్ హెచ్ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించి వారిని క్లస్టర్ హెచ్ఎంలుగా నియమించాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల చర్చించే నిమిత్తం రిజిస్టర్ , క్యాడర్ సంఘాలను కూడా సమావేశాలకు ఆహ్వానించాలని, మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం(ఒక రోజు వేతనం మినహాయించి) ఇవ్వాలని, వారికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, భాషా పండితుల ఉద్యోగోన్నతుల విధి విధానాలు ప్రకటించాలని కోరారు. దీనిపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
అన్నదాతకు వెతలు
మునేరుకు కోతలు.. పెనుగంచిప్రోలు: మునేరు పక్కన పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు చెందిన వందల ఎకరాల మామిడి తోటలు, మాగాణి పొలాలు ఉన్నాయి. ప్రతి ఏడాది మునేరుకు వరదలు రావటం భూములు కోతకు గురి కావటం జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్లో మునేరుకు వచ్చిన భారీ వరదలకు పెద్ద ఎత్తున భూములు కోతకు గురై ఇసుకలో కలిసిపోయాయి. ముఖ్యంగా మునేరు పక్కన ఉన్న మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఏళ్లుగా పెంచిన మామిడి చెట్లతో పాటు భూమి వరదకు కొట్టుకుపోయాయి. వరదకు పెనుగంచిప్రోలు పక్కన విలువైన భూములు కోతకు గురి కావటంతో పాటు ఇసుకలో కలిసిపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరదలకు మునేరు పక్కన 15 హెక్టార్లలో మామిడి తోటలు దారుణంగా దెబ్బతినటంతో పాటు 87.5 హెక్టార్లు భూమి కోతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు.. ఇప్పటికే ఎంతో భూమి వరదలకు ఇసుకలో కలిసి పోతోందని, ఉన్న భూమిని అయినా రక్షించుకుందామని రక్షణ చర్యలు చేపట్టేందుకు ఖర్చు తలకు మించి భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. రక్షణగా బండరాళ్లను రైతులు జగ్గయ్యపేట చుట్టు పక్కల కొండ ప్రాంతం నుంచి టిప్పర్లలో తెచ్చి తోటలకు రక్షణగా వేసుకుంటున్నారు. దీంతో భూమి కోతలకు గురి కాకుండా రక్షణగా ఉంటుందని రైతులు అంటున్నారు. దీనికోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. కోతలకు గురవుతున్న భూములకు రక్షణగా ప్రభుత్వం గోడలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. మునేరు వరదలకు ఇసుకలో కలిసిపోతున్న విలువైన భూములు గతేడాది వరదలకు భారీగా కోతకు గురైన మామిడి తోటలు రక్షణ గోడలు నిర్మించాలంటున్న రైతులు -
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ’ పుస్తకాన్ని నారాయణమూర్తి ఆవిష్కరించారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఆవిష్కరణ సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తూ రాష్ట్రాల అధికారాలను గుంజుకుంటోందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని రాష్ట్రాలను బలహీనం చేయడం సరికాదన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, హామీలను విస్మరిస్తోందన్నారు. ఆచరణలో సాధ్యం కాని పథకాలను రూపొందించడం మంచిది కాదన్నారు. అవసరం లేని పథకాలకు నిధులు వెచ్చించడం సరైన విధానం కాదని, ఆచరణ సాధ్యం కాని పథకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల సాధన సమితి నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, సింహాద్రి ఝాన్సీ, డి.హరనాథ్, పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
చివరి రోజు కనకాంబరాలు, గులాబీలతో అర్చన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలలో 9వ రోజైన సోమవారం అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో విశేష అర్చన జరిగింది. సోమవారం మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతితో వసంత నవరాత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. సోమవారం ఉదయం ఆలయం ప్రాంగణంలోని పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆల య అర్చకులు గులాబీలు, కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారికి జరిగిన విశేష పుష్పార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, వేద పండితులు, అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించారు. -
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ కేంద్రంగా ఎంతో మంది యువతను జాతీయ, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఓల్గా ఆర్చరీ అకాడమీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2015, 2019లో రెండు పర్యాయాలు సీఎం హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకాకపోవడాన్ని నిరసిస్తూ, మహానాడు రోడ్డు లోని ఓల్గా ఆర్చరీ అకాడమీ వద్ద సోమవారం ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తానని, కోచ్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తానని, పింఛన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇదే హామీని 2019 లోనూ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు హామీలు అమలు జరిగే వరకు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు సందర్శించి సంఘీబావం తెలిపారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంక గోవిందరాజులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం.సాయికుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.పి.రావు సంఘీబావం ప్రకటించారు. ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ డిమాండ్ -
గోడ కూలి ఆర్టీసీ కండక్టర్ మృతి
జి.కొండూరు: అకాల వర్షానికి కోళ్ల ఫారం గోడ కూలి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు శివారులోని పినపాక రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే...జి.కొండూరుకు చెందిన ఉయ్యూరు మంగారావు(45) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధుల నుంచి వచ్చిన మంగారావు వాకింగ్ చేసేందుకు మరో ఇద్దరు కండక్టర్లతో కలిసి గ్రామ శివారులోని పినపాక రోడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో తీవ్రమైన గాలి, వాన ప్రారంభం కావడంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో పినపాక రోడ్డులోని పాడుబడిన కోళ్లఫారం వద్దకు వచ్చే సమయానికి వాన ఉధృతి పెరగడంతో మంగారావు కోళ్లఫారం షెడ్డు గోడ పక్కన నిలబడ్డాడు. మరో ఇద్దరు కోళ్లఫారం షెడ్డులోకి వెళుతుండగా గోడ కూలి శిథిలాలు మీద పడడంతో మంగారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పోలీస్ ప్రజావాణిలో 83 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 83 ఫిర్యాదులు స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్తి, నగదు లావాదేవీల వివాదాలు పరిష్కరించాలని 53 మంది, కుటుంబ కలహాలపై 10, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, మోసాలపై మూడు, కొట్లాటపై ఒకరు, స్వల్ప వివాదాలపై 11 మంది ఫిర్యాదులు ఇచ్చినట్లు వెల్లడించారు. సదరు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
మృతి చెందిన మహిళ ఎవరు..?
పెనమలూరు: యనమలకుదురు కృష్ణానది లంకల్లో రెండు రోజుల క్రితం మృతి చెందిన మహిళ ఎవరనేది మిస్టరీగా మారింది. కృష్ణానది లంకల్లో గుర్తు తెలియని మహిళ(40) గాయాలతో మృతి చెంది ఉండటంతో స్థానికుల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఆమె మృతదేహం వద్ద పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందీ, ఎలా చనిపోయిందనేది అంతుపట్టడంలేదు. యనమలకుదురు గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకల్లోకి ఆమెను ఎవరైనా తీసుకు వచ్చారా..లేక హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పడేశారా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె దేహంపై పలు గాయాలు ఉండటంతో ఆమెది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదు. మృతురాలు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, లేకపోతే ఇప్పటికే ఫిర్యాదు అంది ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి యనమలకుదురు లంకలకు వచ్చే దారిలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతిచెందిన మహిళను ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. గంజాయి మత్తులో యువకుడి వీరంగం పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో గంజాయి బ్యాచ్కు చెందిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బడ్డీ కొట్టు యజమానిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మహిళలు, స్థానికులను బ్లేడ్తో దాడి చేస్తానని బెదిరించాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు డొంకరోడ్డు మహాత్మాగాంధీ విగ్రహం వీధిలో కోలా వెంకటేశ్వరరావు బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్దకు ఆదివారం అదే గ్రామానికి చెందిన బోలెం అమలేష్ అనే యువకుడు మత్తులో ఊగిపోతూ వచ్చి ఒరేయ్..సిగరెట్ ఇవ్వు అంటూ బెదిరించాడు. సిగరెట్లు లేవని సమాధానం చెప్పగా ఒక్కసారిగా అతని పై కర్రతో కాళ్లపై కొట్టి, రాయితో తలపై దాడి చేసి గాయపరిచాడు. వెంకటేశ్వరరావు భయపడి ఇంట్లోకి పారిపోయాడు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి అమలేష్ను వారించగా బ్లేడుతో దాడి చేస్తానని వారిపై హెచ్చరించాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి ఎదురు తిరగటంతో యువకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. గాయపడిన వెంకటేశ్వరరావును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ వీరంగం యనమలకుదురు డొంక రోడ్డులో గత కొద్ది కాలంగా గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నారని స్థానికులు తెలిపారు. రాత్రి సమయాలలో వీరు రెచ్చిపోవటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అఽధికార పార్టీ నేతల మద్దతు ఉందంటూ గంజాయి బ్యాచ్ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. పోలీసులు ఇప్పటికై నా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
డామిట్...కథ అడ్డం తిరిగింది!
కోడి పందేలకు భారీ బరి... రాత్రీ తెల్లవార్లూ ఉంటుందని ప్రచారం ●గుట్టు చప్పుడు కాకుండా ఆడించేందుకు సిద్ధం ●వారిలో వారికే మనస్పర్థలు రావడంతో సోషల్ మీడియాలో ప్రచారం ●మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో అర్థరాత్రి దాడులు ●తొమ్మిది మంది అరెస్ట్...ఒకరు పరారు...రూ.36,650 నగదు స్వాధీనం ●తొమ్మిది సెల్ ఫోన్లు... ఆరు ద్విచక్రవాహనాలు సీజ్ పెడన: మండల పరిధిలోని బలిపర్రు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఎన్డీయే కూటమికి చెందిన కొందరు నాయకులు భారీ బరిని ఏర్పాటు చేసి కోడి పందేలను నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆడిస్తామని, ఆసక్తి ఉన్న వారు హాజరుకావాలంటూ లోపాయికారీగా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. దీంతో భారీ సంఖ్యలో ఔత్సాహికులు వాహనాలలో తరలివచ్చారు. దండిగా సొమ్ము చేసుకునే అవకాశం వచ్చిందని నిర్వాహకులు కూడా సంతోషపడ్డారు. అయితే వారిలో వాటాల పంపకం విషయంలో మనస్పర్థలు రావడంతో కోడిపందేల బరిని కాస్తా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జిల్లా ఎస్పీ వరకు చేరడంతో ఆయన ఆదేశాలతో మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా ఆదివారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పెడన పోలీస్ స్టేషన్ ఎస్ఐతో ఇతర సిబ్బంది సైతం వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహణలో ఉండటంతో స్వయంగా డీఎస్పీ కోడిపందేల శిబిరంపై దాడి చేశారు. తొమ్మిది మంది అరెస్ట్...రూ.36,650 నగదు స్వాధీనం డీఎస్పీ రాజా తన సిబ్బందితో శిబిరంపై దాడి చేయగా తొమ్మిది మంది దొరికారు. ఒకరు పరారయ్యారు. వారి నుంచి రూ.36,650 నగదును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది సెల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పెడన ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అయితే శిబిరం వద్ద ఫ్లడ్ లైట్లు, కుర్చీలు అలాగే వదిలివేశారు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటే వాటిని ఎవరు బుక్ చేశారనే విషయాలు బయటకు వచ్చేవని ప్రజలు అంటున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన చిన్నారి (5)పై మతిస్థిమితం లేని ఒక వ్యక్తి (42) అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏపీఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఎన్నికై ంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం గాంధీనగర్ లోని ఏపీఎన్జీవో హోంలో జిల్లా సహ అధ్యక్షుడు పి.రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఆ పదవికి ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డి.సత్యనారాయణరెడ్డిని, జిల్లా సహాధ్యక్షుడిగా వి.వి.ప్రసాద్ను, కార్యదర్శిగా పి.రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖకు ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రంగారావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, సిటీ అధ్యక్షుడు ఎస్.సూర్యం, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు భవానీపురం(విజయవాడపశ్చిమ): భవానీపురం సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదాయాలపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.5,68,800 జరిమానా విధించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.విజయకుమారి, విజయవాడ పట్టణ ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యు.హనుమయ్య ఆధ్వర్యంలో అధికారులు 42 బృందాలుగా ఏర్పడి 3,148 గృహ సర్వీసులు, 366 వాణిజ్య సముదాయాల సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 146 సర్వీసులకు అదనపు లోడు 250 కెడబ్ల్యూ మొత్తానికి గాను రూ.5,68,800 మొత్తాన్ని జరిమానా కింద వసూలు చేశారు. ఈ సందర్భంగా విజయకుమారి, హనుమయ్య మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినట్లు తెలిస్తే 9440812362, 944081 2363, 8331014951 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలలో విజయవాడ పట్టణ డీ1 డీఈఈ ఎంవీవీ రామకృష్ణ, ఏఏఓ పి.ప్రసాద్, ఏఈ కేవీఎస్ రామప్రసాద్లతోపాటు విజయవాడ పట్టణ డివిజన్ పరిధిలోని డీఈఈలు, ఏఈలు, జేఈలు, ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ ద్వారా చేపట్టే వ్యాయామ ఉపాధ్యాయుల నియామకంలో ఈవెంట్స్కు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి, అఖిల భారత యువజన సమాఖ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటరు ధర్నా చౌక్లో సోమవారం అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈవెంట్స్కు వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె.శివారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లంకా గోవిందరాజులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, మధు, చెల్లయ్య, వెంకట్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ తరహాలో నేషనల్ ప్రాన్స్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్పీసీసీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో రైతులు, ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న రైతులు, ఎగుమతిదారులు, సీడ్, ఫీడ్ వ్యాపారులు ఇప్పటికే హార్వెస్టింగ్ దశలో ఉన్న రొయ్యలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని, లేని పక్షంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఆక్వా రంగం కోలుకునేలా చర్యలు తీసుకుంటాం.. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ సంక్షోభం తాత్కాలికమేనని, ఆక్వా రంగాన్ని ఆదుకుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా, స్వదేశీ వినియోగం పెంచేలా పౌల్ట్రీలో నెక్ తరహాలో ఆక్వా రంగంలోనూ రొయ్య ఉత్పత్తిదారులతో ఓ కమిటీ వేసేందుకు ఆలోచన చేస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆక్వా రైతులు ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందాలన్నా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధన విధించినట్టు తెలిపారు. జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు వివరించారు. దాణా ధర తగ్గింపు విషయంలోనూ తయారీదారులతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎగుమతిదారులు– ఇతర రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్ రావు, వేగేశ్న నరేంద్రవర్మరాజు, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, జీఎఫ్ఎస్టీ డైరెక్టర్ సి. కుటుంబరావు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఆక్వా ఎగుమతిదారులు, ఉత్పత్తి దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడును కోరిన ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులు నెక్ తరహాలో నేషనల్ ప్రాన్స్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు -
బెజవాడ టీడీపీలో అంతర్యుద్ధం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. లోక్సభ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కేశినేని శివనాథ్ (చిన్ని)కు పార్టీకి చెందిన శాసనసభ్యుల మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరడంలేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇసుక, బూడిద, మట్టి, గ్రావెల్, మద్యం అక్రమ వ్యాపారాలతో పాటు ఆయన వర్గీయుల దందాలు శృతిమించితుండటం అధిష్టానానికి సైతం తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా రిజర్వుడు స్థానం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం తాడోపేడో తేల్చుకునే దశకు వెళ్లారు. సీఎం చంద్రబాబు శనివారం నందిగామ పర్యటన సందర్భంగా నేతల మధ్య విభేదాలు మరోసారి వీధికెక్కాయి. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు అనుమతించిన స్థానిక నాయకుల జాబితాతో పాటు సభావేదికపై ఆశీనులయ్యేందుకు అవకాశం కల్పించిన వారి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు భగ్గుమనడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బండి తిరుపతిరావు, ఆర్.ఎస్.ప్రసాద్, నూకాలమ్మ తదితర నాయకులను అనుమతించే విషయమై ఎమ్మెల్యే తంగిరాల విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబుకు ఆ రోజు ఉదయాన్నే ఫోన్చేసి ప్రశ్నించగా ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి అందిన జాబితాననుసరించి తాము నడుచుకున్నామని సీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహించిన సౌమ్య ‘స్థానిక ఎమ్మెల్యే నుంచి జాబితా తీసు కోరా? మా మాటకు విలువలేదా? దళిత ఎమ్మెల్యే అయినందున ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఆ మేరకు మీకేమైనా సూచనలు ఉన్నాయా?’ అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించడంతో తమకు ఏ దురుద్దేశాలు లేవని, అలాంటివి ఆపాదించవద్దని సీపీ కోరారనేది భోగట్టా. దీనిపై ఎంపీ కార్యాలయ కార్యదర్శి కిషోర్కు తంగిరాల సౌమ్య ఫోన్ చేసి ‘హెలిప్యాడ్ వద్దకు ఎవరెవరిని అనుమతించా లనే పేర్లు మీరెలా నిర్ణయిస్తారు? జాబితా ఖరారుకు మీరెవరు? దానిని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఎలా పంపారు?’ అంటూ విరుచుకుపడినట్లు తెలిసింది. ఆలోచనలో ఎంపీ వర్గం తంగిరాల సౌమ్య అంతగా ఆగ్రహించడానికి కారణం ఆమెను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా అనే కోణంలో ఎంపీ వర్గం ఆరా తీిసింది. మాజీ మంత్రి దేవినేని ఉమానే కారకుడని నిర్ధ్ధారించుకుని చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. విజయవాడ లోక్సభ పరిధిలో రెండు రిజర్వుడు శాసనసభా స్థానాల్లో ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, ఎంపీ చిన్ని వర్గాల మధ్య విభేదాలు ముదిరి పరస్పరం ఫిర్యాదులు, దాడుల వరకు చేరుకున్నాయి. చంద్రబాబు, లోకేష్తో కేశినేనికి ఉన్న సన్నిహిత సంబంధాలు, పితూరీల నేపథ్యంలో నందిగామలో హెలిప్యాడ్ వద్ద కొలికపూడి నమస్కరించినా సరే ముఖ్యమంత్రి దళిత ఎమ్మెల్యే వైపు కన్నెత్తి చూడకపోవడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పుడు నందిగామ ఎమ్మెల్యే కూడా ఎంపీ విషయంలో దాదాపు కొలికపూడి దారిలోనే నడుస్తున్నట్లు అర్థమవుతోంది. వీటన్నిటిని బట్టి తనను దళిత వ్యతిరేకిగా ముద్ర వేయించడానికి దేవినేని ఉమా బృందం గట్టిగా ప్రయత్నిస్తుందనే అనుమానాలు ఏంపీ శివనాథ్లో బలపడుతున్నాయి. ఆ అనుమానాలనే ఎంపీ తన ఆంతరంగీకుల వద్ద వ్యక్తంచేసి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తాడోపేడో అంటున్న తంగిరాల కయ్యానికి కాలుదువ్విన కొలికపూడి దళిత ప్రజాప్రతినిధుల అంతర్మథనం వసంతతో మొదటి నుంచీ బూడిదే సెంట్రల్లోకి రానివ్వని బొండా శ్రీరాంతాతయ్యతో భీమవరం గట్టు పంచాయితీ ఎంపీతో గద్దె మినహా అందరిదీ అదే తీరు కేశినేని చిన్ని వైపు అధిష్టానం మొగ్గు ఇతర ఎమ్మెల్యేలతోనూ అదే తీరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు ఎంపీ చిన్నికి మధ్య బూడిద తకరారు భారీ ఎత్తునే ఉంది. బూడిద పంచాయితీ అధిష్టానం వద్ద జరిగింది. జగ్గయ్యపేట పరిధిలోని భీమవరం గట్టు వద్ద తకరారు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య పెద్దదే. జిల్లా పార్టీ అధ్య క్షుడు నెట్టెం రఘు రాం నేతృత్వంలో అక్రమంగా గ్రావెల్ను తరలింపజేస్తున్నారని ఎంపీపై శ్రీరాం తాతయ్య సోదరులు గుర్రుగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోకి ఎంపీని ఎమ్మెల్యే బొండా ఉమా ఆహ్వానించి అభివృద్ధి కార్యక్రమాలలో ఉమ్మడిగా పాల్గొన్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. రైతు బజార్లు, బీసెంట్ రోడ్డులో హాకర్లు తదితర అంశాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో డూండీ రాకేష్, ఫతావుల్లా వంటి వారిని ఎంపీ ప్రోత్సహిస్తుండటం అక్కడి సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులకు మింగుడుపడటం లేదు. వ్యాపారవర్గాల వారితో డూండీ పేచీలు పెట్టుకుని దందాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. దీంతో అక్కడి కూటమి ఎమ్మెల్యే సుజనాచౌదరి సైతం ఎంపీపై విముఖతతో ఉన్నట్లు తెలు స్తోంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మాత్రం ఎంపీకి కాస్తోకూస్తో సయోధ్య ఉందని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతుండటం విశేషం. -
రెవెన్యూ శాఖ అర్జీలే అధికం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర– 2047 లక్ష్యాల సాధనకు, సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సంపద సృష్టి, వృద్ధిరేటుపై ప్రతి శాఖ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. డీఆర్వో లక్ష్మీనరసింహతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ లక్ష్మీశ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల పదో తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర విజన్ : 2047, వృద్ధి ఇంజిన్లపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులకు వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. అర్జీలు ఇలా.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 152 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 76 అర్జీలు వచ్చాయి. శాఖల వారీగా.. పోలీస్ శాఖకు 16, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు పది చొప్పున, పంచాయతీ రాజ్కు ఆరు, గృహ నిర్మాణానికి ఐదు, డీఆర్డీఏ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, విద్యా శాఖలకు నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. ఉపాధి కల్పన, మార్కెటింగ్, ఏపీసీపీడీసీఎల్, వ్యవసాయం, సహకార సొసైటీ, కార్మిక, సర్వే, ఎండోమెంట్, వైద్య ఆరోగ్యం, నైపు ణ్యాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఏపీ జెన్కో, ఫుడ్ కంట్రోల్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరే షన్, బ్యాంకింగ్, సీఆర్డీఏ విభాగాల పరిధిలో మిగిలిన అర్జీలు అందాయి. దారి మూసివేశారు ‘చందర్లపాడు మండలం, ముప్పాళ్లలో మెయిన్ రోడ్డు నుంచి దళితవాడ వరకు వెళ్లేందుకు రోడ్డు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నాం. గతేడాది ఈ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ఈ రోడ్డులో మొదట ఓసీలు, ఆ తర్వాత 30కు పైగా ఎస్సీల ఇళ్లు ఉన్నాయి. ఓసీల ఇళ్ల వరకు ఒక భాగం, అక్కడ నుంచి దళితుల ఇళ్ల వరకు మరో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రెండు భాగాల మధ్యలో కొంత రోడ్డు వేయండా వదిలేశారు. రోడ్డు నిర్మించకుండా వదిలేసిన చోట కొందరు ఇనుప కంచె వేసి రోడ్డును మూసివేశారు. దీంతో మాతో పాటు దళిత కుటుంబాలకు దారి సమస్య ఏర్పడింది’ అని ములకలపల్లి లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు అర్జీ సమర్పించారు. మా భూమికి హద్దులు నిర్ణయించండి ‘నందిగామ అశోక్నగర్లో మాకు ఆర్ఎస్ నం. 476/1, 477/1 నంబర్లలో 2.14 ఎకరాల భూమి ఉంది. సబ్ డివిజన్లో 1.82 ఎకరాలుగా రిజిస్టరైంది. మా స్థలానికి ఉత్తరం వైపు ప్రభుత్వ డొంక ఉంది. కొందరు డొంకతో పాటు మా స్థలాన్ని ఆక్రమించి భవనాలు నిర్మించారు. మా స్థలాన్ని ఆనుకుని మరు గుదొడ్లు నిర్మించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సర్వే చేసి మా స్థలానికి హద్దులు నిర్ణయించండి’ అని బైసాని వెంకట నాగేశ్వరరావు అర్జీ సమర్పించారు. పీజీఆర్ఎస్కు 152 అర్జీలు అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశాలు -
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సబ్ స్టేషన్ ఆపరేటర్లు, వాచ్మన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బ్రేక్ డౌన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్లు, స్టోర్స్ హమాలీలు, ఎస్పీఎం తదితర క్యాడర్లలో ఎంతో మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గుర వుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ – ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయా లని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, షిప్ట్ ఆపరేటర్లకు సమాన వేతనాలు ఇవ్వాలని, బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, మీటర్ రీడర్లకు, ఎస్పీం కార్మికులకు, స్టోర్ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం వినతిపత్రాన్ని ట్రాన్స్కో డైరెక్టర్ హెచ్ఆర్ కె.లింగమూర్తికి అందజేశారు. సీఐటీయూరాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.రాజశేఖర్, కోశాధికారి ఎస్.విజయరావు, పి.అనీల్ కుమార్, నాగరాజు, డి.సూరిబాబు, కె.దుర్గారావు పాల్గొన్నారు. -
‘ఈ–శ్రమ్’లో వివరాలు నమోదు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్, స్వీగ్గి, జోమోటో వంటి అన్లైన్ ప్లాట్ ఫాం కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరాలపై కార్మిక శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పోర్టల్ను ప్రారంభించిందన్నారు. ఆన్లైన్ ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలలో సంబంధిత కార్మికులు తప్పనిసరిగా పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోర్టల్ నమోదులో కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులు, సలహాలు, సూచనలు, ఇతర వివరాలకు జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ నాంచారయ్య, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆషారాణి, నగర పాలక సంస్థ యూసీడీపీఓ వెంకట నారాయణ పాల్గొన్నారు. 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాదా రుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. విజయవాడ నగరంతో పాటుగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని అధికారిక నివేదికలు చెబున్నాయి. వాటిలో అత్యధిక శాతం భూములు తెలుగు తమ్ముళ్ల చేతుల్లోనే ఉన్నాయని ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వక్ఫ్ భూములను కొందరు సాగు పేరుతో లీజుకు తీసుకొని రికార్డులను మార్చేసుకుని అనుభవిస్తున్నారు. మరి కొందరు ఇతర మార్గాల్లో వక్ఫ్ భూములను దక్కించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల వక్ఫ్ భూములకు పట్టాలు ఇవ్వటం వల్ల అవి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ముస్లిం నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు కాదు దాదాపుగా వెయ్యి ఎకరాల భూములు ఉమ్మడి జిల్లాలో అన్యాక్రాంతమయ్యాయని వక్ఫ్ బోర్డు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ భూములను ఇప్పటికీ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోలేకపోతోందని పేర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అత్యంత విలువైన ప్రాంతాల్లో వక్ఫ్ భూములను దర్జాగా ఆక్రమించుకున్నారని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లోనూ అన్యాక్రాంతం వక్ఫ్ బోర్డుకు విజయవాడ, నగర పరిసర ప్రాంతాల్లోనూ అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఈ భూములపై కబ్జాదారుల కళ్లు పడ్డాయి. వక్ఫ్ బోర్డుకు విజయవాడ చుట్టు పక్కల సుమారు 500 ఎకరాల వరకు భూములు ఉన్నాయని అంచనా. ఈ భూముల్లో 200 ఎకరాలు కమర్షియల్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా ముస్లిం సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ 500 ఎకరాల్లో అత్యంత విలువైన ప్రాంతాల్లో 30 నుంచి 40 ఎకరాల వరకు భూములు కబ్జాకు గురయ్యాయయని వివరిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల్లో వక్ఫ్ భూములు వక్ఫ్కు ఉమ్మడి జిల్లాలో 2,600 ఎకరాలు 1000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని అంచనా భూములను రక్షించాలని కోరుతున్న ముస్లిం సంఘాలు వక్ఫ్ భూములపై చిత్తశుద్ధి లేదు వక్ఫ్ భూములపై చంద్రబాబు ప్రభు త్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. అందులో భాగంగానే తన ఎంపీలతో పార్ల మెంట్లో వక్ఫ్బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ పాలనలోనే అత్యధిక భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రికార్డులు గందరగో ళంగా ఉన్నాయి. వక్ప్ బోర్డు పరిధిలో ఉన్నప్పుడే భూములకు రక్షణ లేదు. ఇక ప్రభుత్వం ఆధీ నంలో ఉంటే ఆక్రమణలకు మరింత సులువవుతుందని ముస్లిం సమాజం భావిస్తోంది. – షేక్ గౌస్మొహిద్దీన్, మాజీ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్బోర్డు కొత్త చట్టంతో రక్షణ కలిగేనా...? ఉమ్మడి జిల్లాలో వెయ్యి ఎకరాలు స్వాహా ఉమ్మడి కృష్ణాజిల్లాలో వక్ఫ్ బోర్డుకు సుమారు 2,600 ఎకరాల భూములున్నాయని రికార్డులు చెబుతున్నాయి. కృష్ణాజిల్లాలోని 25 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో ఈ భూములు ఉన్నట్లుగా అధికారులు చెబుతు న్నారు. అయితే వెయ్యి ఎకరాల భూములు ఇప్పటికే కబ్జా చెరలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా కొండపల్లిలో 50 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 50 ఎకరాలు, గుడూరు మండలంలో వంద ఎకరాలు, గుడివాడ మండలంలో 200 ఎకరాలు, పెనమలూరు మండలం తాడిగడపలో 42 ఎకరాలు, గుడ్లవల్లేరులో 25 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని వివరిస్తు న్నారు. ఈ భూముల్లో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే దశాబ్దాలుగా ఉన్నా యని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి. వాటిని రక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ముస్లిం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వాటిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. దేశంలో వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్న విలువైన ఆస్తులను కాజేయటానికే ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలంటూ కొత్తగా బిల్లు ప్రవేశపెట్టింది. దేశంలో, రాష్ట్రంలో కోట్ల రూపాయాల విలువైన భూములను కాజేయటానికి కుట్రలు జరుగుతున్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన వక్ఫ్బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం పోరాడుతోంది. – షేక్ ఆసిఫ్, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు గతంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సంస్కరణలు తెస్తే, తాజాగా ఎన్డీఏ పాలకులు పార్లమెంట్లో పెట్టిన సవరణలు ఆమోదం పొందటమే కాకుండా రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా రూపొందాయి. ఇప్పటి వరకూ వక్ప్ బోర్డు పాలకుల పరిధిలో ఉండే ఆస్తుల సంరక్షణ బాధ్యత ఇక ప్రభుత్వ పరిధి లోకి రానుంది. వక్ఫ్బోర్డులో ఉండగానే వందలాది ఎకరాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయ్యాయి. తాజాగా కేంద్రంలో తెచ్చిన చట్టంతో ఈ ఆస్తుల రక్షణ జరిగే అవకాశం ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రిపై సోమవారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం ఆలయ ప్రాంగణంలో సీతారామ కల్యాణం కనులపండువగా నిర్వహించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై ఆలయ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆల యానికి తరలించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత, ఆరోగ్య సమ స్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యతపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాతాశిశు సంరక్షణ, సంక్షేమ సేవలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ నాంచారయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉషారాణి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక బదిలీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం ఏపీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యూనల్ చైర్మన్గా పనిచేస్తున్న జి.గోపీని కృష్ణాజిల్లా జడ్జిగా నియమించారు. మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న చిన్నంశెట్టి రాజును విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎస్.చినబాబును అనంతపురం పోక్సో కోర్టు న్యాయ మూర్తిగా బదిలీ చేసి, ఆ స్థానంలో చిత్తూరు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తిగా పనిచే స్తున్న బాబూనాయక్ను నియమించారు. ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎ.పూర్ణిమను ప్రకాశం జిల్లా ఒంగోలు ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు. కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న పి పాండురంగారెడ్డిని మచిలీపట్నం పదో అదనపు జిల్లా న్యాయమూర్తిగా నియమించారు. లంక భూములను పరిశీలించిన కలెక్టర్, ఎంపీ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇబ్రహీం పట్నం మండలంలోని జూపూడి, చినలంక, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి పరిధిలోని పెదలంక భూములను ఎంపీ కేశినేని శివనాఽథ్ (చిన్ని), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా రాయపూడి గ్రామానికి ఐకాన్ బ్రిడ్జి, రహదారి నిర్మాణం కోసం భూములను సేకరించేందుకు డ్రోన్ సర్వే చేపట్టారు. ఐకాన్ బ్రిడ్జి సమీపంలోనే స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు కూడా లంక భూములు సేకరిస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎంపీ భూములను పరిశీలించి వెళ్లిన తరువాత చైన్నెకు చెందిన బృందం, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరోమారు డ్రోన్తో లంక భూములను సర్వే చేశారు. అధికారుల పర్యటనలతో లంక భూముల పట్టాదారులు ఆందోళన చెందు తున్నారు. కనీసం సొసైటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా భూముల సర్వే చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు
అప్పటి టీడీపీ ప్రభుత్వం మా భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి హక్కులను కోల్పోయేలా చేసింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల గోడును అర్థం చేసుకొని 22ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ జీవోను జారీ చేశారు. ప్రసుత్తం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పేరుతో తీరప్రాంత భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – కమ్మిలి కోటేశ్వరరావు, రైతు, ఉల్లిపాలెం, కోడూరు సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిషేధిత భూములకు విముక్తి కలిగిస్తే.. కూటమి సర్కార్ మళ్లీ ‘చుక్క’ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటూ, రైతుల ఆధీనంలో ఉన్న భూములను నిషేధిత భూముల్లోకి చేర్చింది. 2016లో చంద్రబాబు హయంలోనే చుక్కల భూములను 22ఏ(1) నిషేధిత భూముల్లో చేర్చారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వారి అవసరాలకు అవి ఉపయోగపడని పరిస్థితి. గత సెప్టెంబర్లోనే నిషేధిత జాబితాలో.. ఈ సమస్యను గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులకు యజమాన్య హక్కులు కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆ భూములను గత ఏడాది సెప్టెంబరులో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. 35,669 ఎకరాల భూములకు విముక్తి ఎన్నో ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న, రిజిస్ట్రేషన్ అయిన భూములను 2016లో నాటి సీఎం చంద్రబాబు 196 జీవో ద్వారా నిషేధిత జాబితాలో చేర్చారు. రాష్ట్రలోని 355 గ్రామాల్లో 22,042 మంది రైతులకు సంబంధించి 35,699 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో చేరాయి. ఈ సమస్య కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. 10,019 మంది రైతులకు సంబంఽధించి 15,791 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. 2022 ఆగస్టులో నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, ఆనాటి కలెక్టర్.. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టారు. దీంతో 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగసభ ఏర్పాటు చేసి 22ఏ (1) నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి, రైతులకు యాజమాన్య హక్కు పత్రాలు అందజేశారు. చికిత్సకు డబ్బులు అందక ప్రాణం పోయింది ముంబయిలో ఉంటున్న కె.నాగేశ్వరరావుకు కోడూరు మండలం సాలెంపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం ఉంది. గతంలో 22ఏ(1) కింద ఉన్న ఈ భూమిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు. చంద్రబాబు వచ్చాక సర్వే పేరుతో మళ్లీ చుక్కల భూమిలో చేర్చారు. ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావుకు నాలుగు నెలల క్రితం కిడ్నీ సంబంధిత సమస్య వచ్చింది. ముంబయిలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పిస్తే రోజుకు రూ.8వేలు ఖర్చు అవుతుందన్నారు. ఇక్కడనున్న పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకుందామని ఆయన భార్య ప్రభావతి ఇక్కడకు వచ్చి తనఖా రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే చుక్కల భూముల జాబితాలో ఉంది కుదరదన్నారు. తెలిసిన వారి వద్దకెళ్లి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని డబ్బులు ఇవ్వమంటే ఎవరూ ముందుకు రాలేదు. చికిత్సకు డబ్బులు అందక మూడు నెలల క్రితం చనిపోయాడు. చంద్రబాబు మళ్లీ చుక్కల భూముల జాబితాలో చేర్చడంతో పొలం ఉన్నా అక్కరకు రాక ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. నాగేశ్వరరావులాంటి బాధితులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ భూముల సాకుతోగతంలో ఒకసారి చుక్కల భూముల్లో చేర్చిన చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్లో మళ్లీ వీటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. వీటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయనే సాకుతో మరోసారి సర్వే చేసేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులకు తీవ్ర నష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఏన్నో ఏళ్లగా ఉన్న నిషేధిత భూముల సమస్యను కూడా పరిష్కరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు న్యాయం చేయాలి. – సీహెచ్ విజయభాస్కరరావు, రైతు, లింగారెడ్డిపాలెం, కోడూరు కూటమి వచ్చాక మళ్లీ ‘చుక్క’ పెట్టారు నాడు సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో 35,665 ఎకరాలకు విముక్తి అవనిగడ్డలోనే 15,791 ఎకరాలు ప్రస్తుతం రూ.లక్షల విలువైన భూములు చేతిలో ఉన్నా అక్కరకు రాని పరిస్థితి -
సందేశాత్మకం.. హాస్యభరితం
● సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో జాతీయస్థాయి నాటికల ప్రదర్శన ● యడ్లపాడులో ఎంవీ చౌదరి వేదికపై ప్రదర్శనలు ● మూడోరోజు అలరించిన మూడు నాటికలు యడ్లపాడు: స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం మూడు సందేశాత్మక నాటికలు ఎంవీ కళావేదికపై ప్రదర్శితం అయ్యాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు, అరుణకుమారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళానిలయం ప్రతినిధులు ముత్తవరపు రామారావు, పద్మారావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల రామారావు, శంకరరావు తదితరులు పర్యవేక్షించారు. ఆడపిల్లలకు సందేశం ‘నాన్న నేనొచ్చేస్తా’ పెళ్లంటే సర్దుబాటు.. సంసారం అంటే దిద్దుబాటు అనే విషయాన్ని మహిళలు తెలుసుకోవాలనే సందేశాన్ని గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన నాన్న నేనొచ్చేస్తా నాటిక ద్వారా ఇచ్చారు. ప్రతి తల్లితండ్రి మనసులో ఉండే పరమశక్తి ప్రేమ. పిల్లలు ఎదగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, తాము పొందలేనిది వారికి ఇవ్వాలన్న తపన తల్లిదండ్రుల్లో ఉండటం సహజం. కానీ వివాహం తర్వాత వచ్చిన సమస్యల్లో, తల్లిదండ్రుల అభిమానం వల్ల ఆడపిల్లలకు సహనశక్తి తక్కువైపోతుంది. బాధ్యతను విడిచిపెట్టి, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, సమాజంలో వేళ్లూనుకున్న ‘అత్యధిక అనురాగం’ అనే కొత్త వ్యాధికి నిదర్శనమని ప్రదర్శన ద్వారా హెచ్చరిక చేశారు. తాకబత్తుల వెంకటేశ్వరరావు రచన చేయగా, అమృత లహరి దర్శకత్వం వహించారు. అందరిలోనూ కనిపించే మంచితనం ‘బ్రహ్మస్వరూపం’ స్వచ్ఛమైన దృష్టితో చూస్తే ప్రతి వ్యక్తిలోనూ మంచితనం కనిపించి ప్రపంచం మమకారాల నిలయంగా అనిపిస్తోందనే విజయవాడ మైత్రి కళానిలయం వారు తమ కళారూపం ద్వారా చూపే ప్రయత్నం చేశారు. శాంతియుత జీవితంలోకి ఊహించని కష్టాలు వస్తే, ప్రతికూల శక్తుల రూపంలో విధి విఘాతం కలిగిస్తే, నిరాశ నిస్పృహాలతో ఉన్న ఆ క్షణాన ధర్మస్థాపనకై సాక్షాత్తూ బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమై, తుదితీర్పును ప్రసాదిస్తాడని సందేశాన్నిచ్చే కథాంశమే ఈ నాటిక. శ్రీ స్నిగ్ధ రచించగా, టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. హాస్యభరితం ‘బావా ఎప్పుడు వచ్చితివి’ కుటుంబ సంబంధాలు మరింత బలపడాలంటే అమ్మ, నాన్న, అక్క, బావ వంటి ప్రేమతో నిండిన పిలుపులే రుజువులు. అవి అనురాగాలకు మూలస్తంభాలుగా నిలుస్తాయి. వీటిని హృద్యంగా, హాస్యరసంతో హత్తుకునేలా వినోదాన్ని అందించిన యడ్లపాడు మానవతా సంస్థ నాటిక ‘బావా ఎప్పుడు వచ్చితివి’. ఈ నాటికలో కుటుంబ పిలుపులు అర్థభేదాలకూ, అపోహలకూ దారితీయగలవని, కొన్నిసార్లు మహిళల మనోభావాల్ని గాయపరచగలవని, భర్తకు అవమానం గానీ, అనుమానం గానీ కలిగించగలవని ఆద్యంతం హాస్యాన్ని మేళవించి కడుపుబ్బ నవ్వించారు. స్వర్గీయ పీవీ భవానీప్రసాద్ రచించగా, సినీదర్శకుడు జరుగుల రామారావు దర్శకత్వం వహించిన ఈ నాటికలో యడ్లపాడుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శన ఆహుతుల్ని ఎంతో ఆకట్టుకుంది. -
ఢిల్లీకి కృష్ణా జేసీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ బాధ్యతలను మూడు రోజుల పాటు అదనంగా నిర్వహించనున్నారు. దుర్గమ్మ సన్నిధిలో సీతారామ కల్యాణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామ నవమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణం కనుల పండువగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదికను కల్యాణ వేడుకకు ముస్తాబు చేశారు. ఘాట్రోడ్డులోని వీరాంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీసీతారామ లక్ష్మణ, వీరాంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అర్చకులు, వేద పండితులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం సీతారాముల కల్యాణం విశిష్టతను అర్చకులు తెలిపారు. కల్యాణాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, యజ్ఞనారాయణ శర్మ ఇతర అర్చకులు, వేద పండితులు జరిపించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా కళావేదిక వద్ద కూలర్లు ఏర్పాటు చేశారు. 4.10 ఎకరాల భూమి విరాళం నందివాడ: శ్రీరామనవమి సందర్భంగా నందివాడ మండలంలో లక్ష్మీ నరసింహపురంగ్రామం కొత్తూరు సెంటర్లోని శ్రీ కోదండ రామాలయానికి పమిడి అచ్యుతరావు, మణిమ్మ దంపతులు 4.10 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. ఆలయ కమిటీ పెద్దలు సింగ వరపు సత్యనారాయణ, సువ్వారి వెంకట రంగారావు, హనుమంతు పాపారావు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు ‘ఎల్హెచ్ఆర్’ విద్యార్థి మైలవరం: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మైలవరం ఎల్హెచ్ఆర్ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి సీహెచ్ దుర్గాప్రసాద్ కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికై నట్లు కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి ఆదివారం తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లోని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్లోని భారత జాతీయ అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రసాద్ ప్రతిభ చూపి 67 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడని ఆయన తెలిపారు. అతను ఎంపిక కావడం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి పేర్కొన్నారు. అతన్ని కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. వేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవం తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ అర్చకుడు తిరునగరి గోపాలాచార్యులు ఆధ్వర్యాన స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. దత్తత దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో రామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం చేశారు. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య పర్యవేక్షించారు. -
బూజు పట్టి.. తుప్పు కంపుకొట్టి
కంకిపాడు: బూజు పట్టి.. తప్పు కంపు కొడుతున్న టేక్ హోం రేషన్ గర్భిణులు, బాలింతలకు అందుతోంది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాలను సమకూర్చడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న టేక్ హోం రేషన్ కిట్లు నాసిరకంగా ఉన్నాయి. ఈ కిట్లు వినియోగిస్తే పోషకాలు మాటేమో కానీ, ఆస్పత్రి పాలవడం మాత్రం ఖాయమని పలువురు తల్లులు వాపోతున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా నాసిరకం పౌష్టికాహారం కిట్లు సరఫరా అవుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో..కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కంకిపాడు మండలంలో 62 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 520 మంది వరకూ గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరికి ప్రతినెలా టేక్ హోం రేషన్ కిట్ పేరుతో 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, 250 గ్రాముల ఎండు కర్జూరం, 200 గ్రాములు పల్లీ చిక్కీలు, 3 కిలోలు బియ్యం, 250 గ్రాములు బెల్లం, కిలో అటుకులు, 2 కిలోలు రాగిపిండి, అరలీటరు పామాయిల్, కిలో కందిపప్పు సరఫరా చేస్తున్నారు. కర్జూర ప్యాకెట్లు తెరిస్తే వాసన..టేక్ హోం రేషన్ కిట్ గత నెల 25న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యింది. నెల ఆరంభంలో రావాల్సిన కిట్ నెలాఖరుకు రావటంతో వీటిని ఆయా కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సిబ్బంది హడావిడిగా పంపిణీ చేసేశారు. ఈ కిట్లోని ఎండు కర్జూరం బూజుపట్టి పాడైన కాయలు వచ్చాయి. ఒక్క పాక్యెట్లో కనీసం ఐదు కాయలు పైగా పాడై ప్యాకెట్ తెరవగానే దుర్గంధం వచ్చిన పరిస్థితి. బెల్లం తుప్పు కంపుకొడుతోందని సమాచారం. రాగిపిండి జల్లెడ పడితే పొట్టుతో కూడిన వ్యర్థాలు వస్తున్నాయని చెబుతున్నారు. కంకిపాడు పట్టణంలోని ఓ వార్డులో తనకు వచ్చిన కిట్లో సామాగ్రి నాణ్యత లేకపోవడంపై ఓ మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ కిట్ను తీసుకుని మరో కిట్ను అందించినట్లు అధికారులు చెప్పడం నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది. పర్యవేక్షణ సున్నా..కిట్ల సరఫరా, పంపిణీ విధానంపై ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కిట్లు అంగన్వాడీ కేంద్రాలకు చేరుకోగానే కనీసం ఏదో ఒక కేంద్రాన్ని అధికారులు సందర్శించి కిట్ల నాణ్యత పరిశీలించడం, పంపిణీని పర్యవేక్షించడంలో లోపం కారణంగా నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు ఏ మేరకు చర్యలు చేపడతారో వేచిచూడాల్సి ఉంది. మూడు నెలలుగా బెల్లం అధ్వానం నాణ్యత లేని రాగిపిండి నాసిరకం బెల్లం, ఎండు కర్జూరం గర్భిణులు, బాలింతలకు అందుతున్న టేక్హోం రేషన్ ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ శూన్యం బెల్లం సరఫరా మూడు నెలలుగా అధ్వానంగా ఉంటోందని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పావు కిలో బెల్లం అచ్చు లబ్ధిదారులకు సరఫరా జరిగింది. కూటమి పాలనలో ఈ మూడు నెలల్లో టేక్ హోం రేషన్ కిట్లు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని తెలుస్తోంది. మూడు నెలలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న బెల్లం ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారని, అది కూడా తినే పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడైతే తిరిగి ఇచ్చేయండి..నెలాఖరుకు కిట్లు రావటం, వరుసగా సెలవులతో కిట్లు డ్యామేజ్ అయ్యాయి. రేషన్ కిట్లు తీసుకునే లబ్ధిదారులు చెక్ చేసుకుని, పాడైతే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు. కంకిపాడులో ఓ మహిళ ఫోన్ చేస్తే విచారణ చేసి కిట్ను మార్చి ఇచ్చాం. ఎవరి వద్ద పాడైన కిట్లు ఉన్నాయో కేంద్రానికి తీసుకురావాలని సూచించాం. ఉన్నతాధికారుల దృష్టిలో సమస్య ఉంచాం. నెలాఖరుకు కిట్లు రావడంతో హడావిడి అయ్యింది. – కె.బి. సుకన్య, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు, కంకిపాడు -
రమణీయం.. సీతారామ కల్యాణం
జగదభిరాముడి కల్యాణం వేళ.. జగమంతా ఆనందంతో పరవశించింది. రాతిని నాతిని చేసిన మహిమాన్వితుడు రఘురాముడి పెళ్లి సందర్భంగా వాడవాడాలా రామనామ స్మరణతో పులకించింది. ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో రామాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. వేడుకల్లో సీతారాముల కల్యాణాన్ని కనులపండవగా చేశారు. చలువ పందిళ్ల కింద జగదానందకారకుడైన శ్రీరాముడు, సీతాదేవిల విగ్రహాలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ క్రతువు ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీలు పానకాన్ని తయారుచేసి పంపిణీ చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 516.60 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. అన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్చరణ్తేజ కుటుంబం రూ.లక్ష విరాళం అందజేసింది. 7 -
వైభవంగా శోభాయాత్ర
విజయవాడ కల్చరల్: మూర్తీభవించిన ధర్మానికి ప్రతిరూపం రామచంద్రమూర్తి అని తాళ్లయపాలెం శైవపీఠాధిపతి శివస్వామి అన్నారు. శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామచంద్రమూర్తి శోభాయాత్ర, బైక్ ర్యాలీ గురువారం బీఆర్టీఎస్ రోడ్డులో ఆదివారం ప్రారంభమైంది. శివస్వామి మాట్లాడుతూ కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు అని అభివర్ణించారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో అయోధ్యలో రామమందిరం సాకారమైందన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను అప్పగించాలని సూచించారు. ప్రతి ఇంట్లో రామయం ఉండాలని బాల బాలికలకు రామకథను వినిపించాలని సూచించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర, మీసాలరాజారావు వంతెన, అయోధ్యనగర్, సింగ్నగర్ మీదుగా బసవపున్నయ్య స్టేడియానికి చేరుకుంది. మహిళలు బైక్ నడుపూ జై శ్రీరాం నినాదంతో పాల్గొనడం విశేషం. రామనవమి ఉత్సవ కమిటీ నిర్వాహకుడు నాగలింగం శివాజీ, బీజేపీ నేతలు పీయూష్ దేశాయ్, మువ్వల సుబ్బయ్య, గొల్లపల్లి నగేష్ పాల్గొన్నారు. -
ఈ–డైరెక్టరీ ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీని ఆదివారం ఐఎంఏ హాల్లో డాక్టర్ భవానీశంకర్ (యూఎస్ఏ) ఆవిష్కరించారు. విజయవాడ సొసైటీ ఆఫ్ ఎనస్తీషియాలజిస్టు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)లో భాగంగా ఆయన క్యాఫ్నోగ్రఫీ, అబ్స్టెట్రిక్ ఎనస్తీషియాను వివరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. సంఘ రాష్ట్ర అకడమిక్ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీ ఆవిష్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ–డైరెక్టరీలో విజయవాడకు చెందిన 150 మంది ఎనస్తీషియా వైద్యుల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. డైరెక్టరీని తయారు చేసిన డాక్టర్ దివ్యరావెళ్ల, డాక్టర్ కీర్తి చిగురుపాటిని అభినందించారు. అనంతరం డాక్టర్ కె.భవానీశంకర్ను అభినందించారు. కార్యక్రమంలో ఐఎస్ఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, డాక్టర్ కిరణ్, డాక్టర్ ఫణి, డాక్టర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన కళాక్షేత్ర నృత్య కళాబృంద సభ్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీహెచ్ తన్మయి పర్యవేక్షణలో 25మంది కళా బృంద సభ్యులు పలు కీర్తనలకు లయబద్ధంగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం పంచహారతుల సేవ అనంతరం అమ్మవారిని దర్శించుకుని కళావేదిక వద్దకు చేరుకున్న భక్తులు నృత్య ప్రదర్శనను ఆద్యంతం ఎంతో ఆసక్తితో వీక్షించి చిన్నారులను అభినందించారు. అనంతరం ఆలయ అధికారులు, కళాబృందానికి అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మకు విశేష పుష్పార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం విశేష పుష్పార్చన చేశారు ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం అమ్మవారికి చామంతి, సంపంగి పూలతో విశేష అర్చన నిర్వహించారు. తొలుత అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలను అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది కలసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి మూలవిరాట్కు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల, పచ్చ చామంతి, సంపంగి, మల్లెలు, మందార పుష్పాలతో ఆలయ అర్చకులు అర్చన చేశారు. విశేష పుష్పార్చనలో ఉభయదాతలు, భక్తులు, ఆలయ అర్చకుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. ఉభయదాతలకు అమ్మవారికి అర్చన నిర్వహించిన పుష్పాలను అందజేశారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా వారిని అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జూపూడి(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి మద్యం దుకాణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంట కాలువలో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు(45)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే. కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు ఇంటికి శనివారం గుంటూరుకు చెందిన ఇద్దరు బంధువులు వచ్చారు. వారితో కలిసి మద్యం సేవించేందుకు ఆరోజు రాత్రి మద్యం దుకాణానికి వెళ్లారు. అర్థరాత్రి అయినా భర్త ఇంటికి చేరలేదని భార్య పిల్లలు ఆరా తీశారు. బంధువులతోపాటు గుంటూరు వెళ్లి ఉంటాడని భావించారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం పోలీసులు నాగరాజు కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు భార్య చంద్రమ్మ, కుటుంబసభ్యులు కలసి గుంటూరు బంధువులను ఆరా తీసేందుకు ఫోన్చేయగా వారి ఫోన్లు స్విచ్చాఫ్లో ఉన్నాయి. రాతిక్వారీలో పనిచేసే నాగరాజు తన ఇద్దరు పిల్లలను చదివించి వెయిట్ లిఫ్టింగ్లో కోచింగ్ ఇప్పించాడు. పెద్ద కుమారుడు జూటూరి కోటేశ్వరరావు మూడేళ్ల కిందట జాతీయస్థాయి ఖేల్ ఇండియా పోటీల్లో పతకం సాధించాడు. కాయకష్టంతో బతికీడుస్తున్న కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు, ఈ మేరకు అతనిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగలురాత్రీ తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉండటంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు
వీరులపాడు: శ్రీరామనవమి పండుగ సందర్భంగా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ కోటేరు సూర్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రభలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన మహిళా భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న నందిగామ మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అక్కడకు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పండుగ వేడుకలను నిర్వహిస్తుండగా టీడీపీ వారి వేడుకలకు డీజే పర్మిషన్ ఇచ్చి వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి పర్మిషన్ లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకరికి పర్మిషన్ ఉందని మరొకరికి పర్మిషన్ లేదంటూ పోలీసులు పక్షపాత వైఖరి చూపడం తగదన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తుండటం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వేడుకలను సైతం రాజకీయకోణంలో చూస్తూ అడ్డంకులు సృష్టించడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒకరికి మైకు పర్మిషన్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రహదారిపై నిరసనకు దిగడం చట్టవిరుద్ధమంటూ మహిళలను అక్కడి నుంచి పంపించివేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళలు పోలీసుల తీరును ఖండించిన మాజీఎమ్మెల్యే జగన్మోహనరావు -
చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి
కోడూరు:రపమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఏసు (52) తాడిచెట్ల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం కూడా ఏసు తాడిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు తెగడంతో కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఏసును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడు భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ విక్రమ్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ వివాదంలో యువకుడికి తీవ్రగాయాలు తిరువూరు: స్థానిక మునుకుళ్ళ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. గత నెల 30న జరిగిన సీఎస్కే ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్పై కర్రి నవీన్కుమార్, కొయ్యల గంగా మహేష్ బెట్టింగ్ కాశారు. ఎవరు గెలిచినా రెండోవారు ఒక క్వార్టర్ బాటిల్ మద్యం కొని ఇవ్వాలని బెట్టింగ్ కాసినపుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయంలో ఆదివారం ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతోపాటు మద్యం మత్తులో ఉన్న మహేష్, ఖాళీ సీసాతో నవీన్పై దాడిచేశాడు. ఈఘటనలో నవీన్ తల, శరీరభాగాలపై తీవ్రగాయాలు కావడంతో అతన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓవ్యక్తి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి కథనం ప్రకారం.. కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 8వ ఫ్లోర్లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. -
తప్పిన పెనుప్రమాదం
గుడివాడరూరల్: స్థానిక రాజేంద్రనగర్లోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఓ అపార్టుమెంట్ 2వ అంతస్తు ఫ్లాట్ నంబరు 202లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరుగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకానున్న దేవదాయశాఖ కమిషనర్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఈనెల 8వ తేదీన హాజరుకానున్నారు. దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తన ఉద్యోగోన్నతి వ్యవహారంలో అన్యాయం జరుగుతుందంటూ గతనెలలో జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో 8వ తేదీన ఢిల్లీలోని కమిషన్ కార్యాలయానికి రావాలంటూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఫిర్యాదీ నాగేశ్వరరావుకు ఆదేశాలు అందాయి. 2021లో ఆలయ చీరల విభాగంలో గోల్మాల్ జరిగిందంటూ నాగేశ్వరరావును దేవస్థానం ఉన్నతాధికారులు ఐదునెలలపాటు సస్పెండ్ చేశారు. ఈవ్యవహారంతో నాగేశ్వరరావుకు రావాల్సిన ఇంక్రిమెంట్, ప్రమోషన్ నిలిచిపోయింది. దీంతో కోర్టును ఆశ్రయించిన నాగేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ చీరలను ఆలయ అధికారులకు లెక్క చూపారు. ఈ విషయంపై ప్రత్యేక కమిటీ సైతం నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో 8వ తేదీన జరిగే విచారణకు ప్రమోషన్కు సంబంధించి అన్ని ఒరిజినల్ రికార్డులతో హాజరు కావాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్ దేవదాయశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. అపార్టుమెంట్లో మంటలు అదుపుచేసిన ఫైర్ సిబ్బంది -
‘మణి’ మాస్టారు ఇకలేరు
చల్లపల్లి(అవనిగడ్డ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు(75) మాస్టారు గుండె పోటుతో ఆదివారం మృతి చెందారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవివాహితుడైన మణిమాస్టార్ సమాజ సేవకే అంకితమయ్యారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చల్లపల్లిలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన నాటినుంచి తన సేవలు అందిస్తూ ప్రస్తుతం చార్టర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మణి ప్రభాకరావు మాస్టారు భౌతికకాయాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామమైన వక్కలగడ్డకు తీసుకురాగా పలువురు సందర్శించి ఆయనకు ఘన నివాళులర్పించారు. పలువురు నిరుపేద విద్యార్థులు, అనాథలకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన మహోన్నత వ్యక్తి మణిప్రభాకరరావు మాస్టారు అని స్థానికులు కొనియాడారు. -
గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన సీఎం
నందిగామటౌన్: బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల సంక్షేమ వసతి గృహం, పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, పాఠశాలలోని విద్యా ర్థులతో కొద్దిసేపు ముచ్చటించి విద్యార్థులతో కలిసి తేనీటిని స్వీకరించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి వంటశాల, భోజనశాల పరిశుభ్రత ను, కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం భోజన రుచి, నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలను పరిశీలించి అభినందించారు. -
యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో శనివారం రక్తం గాయాలతో మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు లంకల్లో గుర్తు తెలియని మహిళ(55) మృత దేహం ఉండటంతో గ్రామస్తులు తెలిపిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె ముఖం, ఒంటిపై రక్తం గాయాలున్నాయి. మృతదేహం వద్ద ఎటువంటి వివరాలు, క్లూ లభించలే దు. మృతి చెందిన మహిళ యనమలకు దురు గ్రామానికి దూ రంగా కృష్ణానది లంకల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుందో విచారిస్తున్నా రు. ఆమెది హత్యా లే క సహజంగానే మరణించిందా అనేకోణంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసులుఆమె మృత దేహా న్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనకదుర్గ వారధిపై ప్రమాదం తాడేపల్లి రూరల్ : కృష్ణానది కనకదుర్గ వారధిపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న బొలేరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో వారధి 16వ పిల్లర్ వద్ద టైరు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం ఒక్కసారిగా రిటైనింగ్ వాల్కు ఢీకొనడంతో వాల్ పూర్తిగా ధ్వంసమైంది. ఫుల్రెస్ట్పై బొలెరో వాహనం ఆగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి భద్రతా సిబ్బంది, తాడేపల్లి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
80 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గుట్టుచప్పు డు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పటమట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు పటమట స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ పవన్కిశోర్ మాట్లాడుతూ.. పటమట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎనికేపాడు లారీ బే వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనికీ చేపట్టామన్నారు. ఈ క్రమంలో గన్నవరం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును పోలీస్ సిబ్బంది ఆపగా కారు డ్రైవర్ కారును రోడ్డు మార్జిన్లో నిలిపి డ్రైవర్, కారు లోపల మరో వ్యక్తి దిగి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని, కారును తనిఖీ చేయగా కారులో 80 కేజీల గంజాయి గుర్తించామని చెప్పారు. నిందితులు చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామానికి చెందిన షేక్ షాజాద్(34), అదే జిల్లా పుంగనూరు మండలం, కొత్తపేటకు చెందిన షేక్ ఫయాజ్లుగా గుర్తించామన్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని 80 కేజీల గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి చెందిన ఘటన గుణదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ ఆర్ఆర్పేటకు చెందిన కసింకోట యువరాజు(41) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి కిరాయికు ప్రయాణికులను దించేసి ఇంటికి వస్తుండగా బీఆర్టీఎస్ రోడ్డు పడవలరేవు సెంటర్ శివాలయం వద్దకు వచ్చేసరికి ఆటో స్కిడ్ అయ్యింది. దీంతో ఆటో డివైడర్ను ఢీకొని తిరగబడింది. ఆటోలో ఉన్న యువరాజు తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సహకార సేనాని’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు సహకార రంగానికి అందించిన సేవలకు గుర్తుగా రూపొందించిన ‘సహకార సేనాని’ ప్రత్యేక సంచికను ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు. నాలుగు దశాబ్దాల పాటు సహకారోద్యమాలకు నాయకత్వం వహిస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్(న్యూఢిల్లీ) డైరెక్టర్గా, ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ వ్యవస్థాపక కార్యదర్శిగా, అధ్యక్షుడిగా తెలుగునాట అర్బన్ బ్యాంకుల అభ్యున్నతికి పాటుపడిన ఆంజనేయులు సేవలకు గుర్తింపుగా ఆయన సహకార ప్రస్థానంపై ఏపీ ఫెడరేషన్ ఈ ప్రత్యేక సంచికను రూపొందించింది. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర, సహకారోద్యమ నేత మానం ఆంజనేయులు, ఏపీ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జిలాని, డైరెక్టర్లు కోళ్ల అచ్యుతరామారావు, ఎం.వెంకటరత్నం, ఏవీ అంబికా ప్రసాద్, వేమూరి వెంకట్రావు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
చిత్రలేఖనంతో సృజనాత్మకతకు పదును
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి చిత్రలేఖనం పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్(స్పా) కళాశాల డైరెక్టర్ శ్రీకొండ రమేష్ చెప్పారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, లయన్స్ డిస్టిక్ట్–316డి, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంయుక్తంగా రమేష్ ఆసుపత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్టిటెక్ కళాశాల ఆవరణలో 12వ నేషనల్ లెవల్ వన్ డే ఆర్ట్ ఫెస్ట్ అండ్ ఆర్ట్ క్యాంప్ శనివారం జరిగింది. స్పా కళాశాల రిజిస్ట్రార్ కేవీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం పెరుగుతుందన్నారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రలేఖనంపై ఆసక్తిని పెంపోందించడానికి ప్రతి ఏడాది ఆర్ట్ ఫెస్ట్, ఆర్ట్ క్యాంప్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు గీసిన చిత్రాలను కళాశాల ఆవరణలో ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సర్వోదయ మండలి అధ్యక్షుడు ఎన్.రాంబాబు, మా జ్యూవెలరీ డైరెక్టర్ కె.సుధాకర్, శింగరి ఆస్పత్రి వైద్యురాలు అరుణ కుమారి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా, చిత్రకారులు జయన్న, మోహనరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు తామర పుష్పాలతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం అమ్మవారికి ఎర్ర తామర పుష్పాలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులతో విశేషంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి అర్చన నిర్వహించేందుకు సేకరించిన పుష్పాలను ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ వద్ద పూజలు చేపట్టారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని పూజా మండపం వద్దకు చేరుకున్నారు. ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్పార్చన నిర్వహించగా, పలువురు ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. పుష్పార్చనలో పాల్గొన్న ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
అంబేడ్కర్, జగ్జీవన్రామ్ ఆశయాలకు కూటమి తూట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేద వారికి చేరాయని, వారు ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పడ్డాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తోందని, సంక్షేమ పథకాలు లేవు, విద్యార్థులకు చదువు లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది..రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కూటమి రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, 10 నెలల్లో ప్రజల మీద దందాలు తప్పా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో జగ్జీవన్రామ్, అంబేడ్కర్ల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అనుబంధ విభాగాల అధ్యక్షులు చందా కిరణ్తేజ, శెటికం దుర్గాప్రసాద్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
శ్రీరాముడి కల్యాణం.. పల్లెకు పేరంటం
కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): కొటికలపూడిలో రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం చేశారు. సుమారు వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలం నుంచి దళిత సామాజిక వర్గం వారు ఇక్కడి రామాలయంలో ఏటా వైభవంగా కల్యాణం చేస్తున్నారు. నాడు పూరిపాకలో పూజలు అందుకున్న స్వామికి ప్రస్తుతం చిన్న ఆలయాన్ని భక్తులు నిర్మించారు. స్వామివారిని ఆరాధ్యదైవంగా కొలుస్తూ పూజలు చేస్తారు. అనాదిగా ఇక్కడ దళిత పూజారులు పూజలు, కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఐదుగురు కమిటీ పెద్దలతో.. ఐదుగురు కమిటీ పెద్దలు.. కుల కట్టుబాట్లతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చెక్కభజనలు, కోలాటాలు, కృష్ణానదిలో పుణ్యస్నానాలు, స్వామివారి పూజా స్తంభం, గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆచారంగా వస్తోంది. కారం పూడిలోని మాచర్ల చెన్నకేశవస్వామి ఆచారాల మాదిరిగా ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ‘నవమి’కి మూడు రోజుల ముందు నుంచి.. నవమి పండుగకు మూడు రోజుల ముందుగా ఉపవాసం ఉన్న భక్తులు శ్రీరామనవమి రోజు పదునైన కత్తులతో స్వామి వారికి సేవలు చేస్తారు. అయినా శరీరంపై ఎటువంటి గాయాలు కాకపోవడం వారి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. స్వామివార్ల కల్యాణానికి పెళ్లికుమార్తె (సీతాదేవి) తరఫున దాసరి వంశీయులు, పెళ్లి కుమారుడు(రాములవారు)కి గోసుల వంశీయులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంటారు. స్వామివారి చిత్రపటానికి కల్యాణం అనాదిగా ఇక్కడ ఆలయ ప్రతిష్ట, స్వామివార్ల ప్రతిష్ట జరగకపోవడంతో స్వామివార్ల చిత్రపటానికి కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీపారాధన స్తంభాన్నే స్వామివారిగా భావించి ఇంటింటికీ ఊరేగిస్తారు. మూడు రోజుల పాటు ఊరేగింపు జరుగుతుంది. భక్తులు స్వామి వారికి నూతన వస్త్రాలు, కానుకలు, వ్యవసాయ పంటలు అందజేసి మొక్కలు చెల్లించుకుంటారు. కల్యాణం అనంతరం సుమారు 700 కుటుంబాలకు అన్నదానం చేస్తారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు పండగకు ముందు మూడురోజుల పాటు క్రీడా పోటీలు, వివిధ సాంస్కృతిక (సాంఘిక, జానపద నాటికలు) కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏటా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేవారు. ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ ఆడపిల్లలకు ఆగ్రామ యువకులతోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. పండగ తర్వాతే గ్రామంలో వివాహాలు చేస్తారు. గ్రామంలోని వీధులు, రామాలయానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. కొటికలపూడిలో రామాలయం ముస్తాబు విద్యుత్ దీపాలంకరణ దీపారాధన స్తంభంతో ఊరేగింపు -
8 నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ఆదిదంపతులకు పలు విశేష వాహన సేవలు జరుగుతాయి. 8వ తేదీ వెండి పల్లకిపై, 9న వెండి రథోత్సవం, 10వ తేదీ రావణ వాహనంపై, 11వ తేదీ నంది వాహనంపై, 12వ తేదీ సింహ వాహనంపై, 13వ తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో విహారం ఉంటుంది. ఉత్సవాల్లో తొలిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రాయబార ఉత్సవం(ఎదుర్కోలు ఉత్సవం) జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల దివ్య కల్యాణోత్సవం చేస్తారు. 12వ తేదీ సదస్యం, వేదస్వస్తి, వేదాశీస్సుల కార్యక్రమాన్ని మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణతో ఉత్సవాలు పరి సమాప్తమవుతాయి. 14వ తేదీ ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
విజయవాడ సిటీ
నగరంలో నటి హన్సిక సందడి ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సినీ నటి హన్సిక విజయవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులోని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ప్రీమియం జ్యూవెలరీ బ్రాండ్ ఇంద్రియా మొదటి స్టోర్ను శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం షోరూంలో పలు రకాల డిజైన్లను ఆవిష్కరించారు. ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ–8లోu7 -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, సంఘసంస్కర్త, రాజకీయవేత్త బాబు జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. మహనీయుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్షను రూపుమాపడానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి నేటి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘పది’ మూల్యాంకన బడ్జెట్ కేటాయింపులు జరపాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తరగతి మూల్యాంకన బడ్జెట్ కేటాయింపులు జరపాలని డీపీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. శనివారం విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కేవీ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సకాలంలో పారితోషికాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను కోరారు. శ్రీరామనవమి సందర్భంగా మూల్యాంకన విధులకు ఒకరోజు సెలవు ప్రకటించాలని కోరారు. డీపీఆర్టీయూ అభ్యర్థనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కేవీ శ్రీనివాసులు రెడ్డి సానుకూలంగా స్పందించారని శ్రీను తెలిపారు. మూల్యాంకన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని, సెలవు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఒక గంట పర్మిషన్ ఇచ్చారని శ్రీను తెలిపారు. మూల్యాంకన బడ్జెట్ విడుదలపై సానుకూలంగా స్పందించారన్నారు. డైరెక్టర్ను కలిసిన వారిలో డీపీ ఆర్టీయూ నేతలు అక్బర్ బాషా, కుమార్ రాజా, మధుకర్, ఎడం శ్రీను, సర్వేశ్వరరావు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు దళితవాడల్లో శ్రీరామనవమి ఉత్సవాలు విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో టీటీడీ నిర్మించిన దేవాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మప్రచార పరిషత్ అసిస్టెంట్ సీవీకే ప్రసాద్ శనివారం తెలిపారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన గుడి – మన ప్రాంతం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో టీటీడీ 16 దేవాలయాలు నిర్మించిందన్నారు. ఆలయాల్లో పూజాదికాలు నిర్వహించడానికి టీటీడీ స్థానికులకే శిక్షణనిచ్చి, వారిచే ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఆయా ప్రాంతాల్లో శ్రీరాముని కల్యాణోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల కోసం తిరుపతి నుంచి వచ్చిన శ్రీవారి కంకణాలు, కుంకుమ, గోవిందనామాలు, భగవద్గీత పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. టీటీడీ పూజా కిట్ను పూజారులకు అందజేశారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ జయశంకర్ పాల్గొన్నారు అన్నప్రసాద వితరణ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం 300 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో నంబూరి కై సాలనాథ్, వీరలక్ష్మి, అత్తిలి అంజలి పాల్గొన్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి పర్యవేక్షించారు. -
ముగిసిన ఇంటర్ ‘స్పాట్’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యాన జరుగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగిసింది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో మూల్యాంకనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల 17న ప్రారంభమైన స్పాట్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం ఐదో తేదీ శనివారం వరకూ కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరానికి చెందిన 3,94,596 జవాబు పత్రాలను సుమారు 20 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్గా ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాకాధికారి సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. స్పాట్ కేంద్రంలోనే మార్కుల నమోదు మొన్నటి వరకూ మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్)ను విడదీసి బండిల్స్గా ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ ఓంఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించేవారు. ఈ ప్రక్రియలో ఆలస్యాన్ని తగ్గించడానికి బోర్డు అధికారులు గతేడాది తొలి సారిగా ప్రతి మూల్యాంకనం కేంద్రానికి స్కానర్ను అందించారు. స్కానర్ ద్వారా స్పాట్ కేంద్రంలో మూల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. 3,94,596జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం సుమారు 1,280 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మూల్యాంకనం చేసిన 3,94,596 జవాబు పత్రాలు హాజరైన 1,280 మంది అధ్యాపకులు స్పాట్ కేంద్రంలోనే మార్కుల పోస్టింగ్ఇంటర్ స్పాట్ విజయవంతంగా పూర్తి చేశాం జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ను నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేశాం. అన్ని స్థాయిల్లోని సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నమై దీనిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వానికి మార్కులను ఆన్లైన్ ద్వారా పంపించాం. – సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(గ్రామ సేవకుల సంఘం) రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగి సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేవలం రూ.10,500తో బతకలేక వీఆర్ఏల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రెవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి పీడీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామంటున్నారని, కానీ వీఆర్ఎల జీవితాలపై మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. వీఆర్ఏల డిమాండ్ల సాధనకు ఈ నెల 6, 7 తేదీల్లో తహసీల్దార్లకు, 8, 9 తేదీల్లో ఆర్డీఓలకు 10, 11, 12 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు, 15, 16 తేదీల్లో కలెక్టర్లకు రాయబారాలు, ఏప్రిల్ 28, 29 తేదీల్లో జిల్లా కేంద్రాలలో దీక్షలు, 30వ తేదీ కలెక్టర్లకు సామూహిక రాయబారం, మే నెల 13, 14 తేదీలలో రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘం రాష్ట్ర నేతలు త్రినాథరావు, రవికుమార్, కృష్ణారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
స్వర పేటిక తెగినా వైద్యులు ఊపిరి పోశారు..
పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో స్వరపేటిక తెగిన ఓ వ్యక్తికి విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం, సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన ఎస్.పవన్కళ్యాణ్(35) చేపలు అమ్మే నిమిత్తం సంతకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇనుప కంచైపె పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతని మెడ ముందు భాగంలో స్వర పేటిక పూర్తిగా తెగిపోయింది. ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో ఏలూరు జీజీహెచ్ నుంచి విజయవాడ జీజీహెచ్కు తరలించారు. రోగి ఆర్థిక స్థితిని గమనించి ఈఎన్టీ విభాగం హెచ్వోడీ డాక్టర్ కొణిదే రవి, సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీ రావు రూ.50 వేల ఖరీదు చేసే టి.ట్యూట్ను ముంబయి నుంచి కొనుగోలు చేసి షియాన్–యాన్లీ పద్ధతి ద్వారా అమర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం అవటంతో పేషెంట్ పూర్తిగా కోలుకుని మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన బృందాన్ని శుక్రవారం సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్ అభినందించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స -
వృత్తి పన్ను భారం రూ.200 కోట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి సర్కార్ విజయవాడ నగర ప్రజలపై వృత్తి పన్ను ద్వారా రూ.200 కోట్ల భారం మోపనుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై భారాలు వేయటమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విజయవాడలోని వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటుగా చిరు ఉద్యోగుల నుంచి సైతం వృత్తి పన్ను ముక్కుపిండి వసూలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, ఉద్యోగుల నుంచి వృత్తి పన్నును వసూలు చేయటానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా డివిజన్ల ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాలకు వివిధ రూపాల్లో ఉత్తర్వులు జారీ చేశారు. వీఎంసీ నుంచి వాణిజ్య పన్నుల శాఖ చేతికి... వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వృత్తి పన్ను వసూళ్లు రాష్ట్రం మొత్తం వాణిజ్య పన్నుల శాఖే నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రంలోని విజయవాడ నగర పాలక సంస్థ, విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధుల్లో మాత్రమే ఆయా స్థానిక సంస్థలు వృత్తి పన్నును వసూలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వృత్తిపన్ను మీద ఆశించిన స్థాయిలో ఆదాయం రావటం లేదని ప్రభుత్వం గుర్తించింది. దానికి తోడు ఆయా నగర పాలక సంస్థ పరిధుల్లో అధికారులు వారివారి విధుల్లో బిజీగా ఉండటం వలన వృత్తి పన్ను మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం భావించింది. నగర పాలక సంస్థల వద్ద ఉన్న వ్యాపార వర్గాల సమాచారం, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న డీలర్ల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటంతో వసూళ్లపై ప్రభుత్వానికి కన్ను పడింది. వృత్తి పన్ను వసూళ్లకు ఈ రెండు ప్రధాన నగరాలను వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి తీసుకొస్తే భారీగా ఆదాయం వస్తుందని గ్రహించింది. దాంతో ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవాడ, విశాఖపట్నం పరిధుల్లోనూ వాణిజ్య పన్నుల శాఖే వృత్తి పన్ను వసూళ్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర ప్రజలపై ఏడెనిమిది రెట్లు భారం 1 నుంచి వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి వృత్తి పన్ను వసూళ్లు షాప్ టు షాప్ తిరగాలని అధికారులకు ఆదేశాలు ఇప్పటి వరకూ వసూళ్లు ఏడాదికి రూ.28 కోట్లు మాత్రమే నిబంధనల ప్రకారమే వృత్తి పన్ను ఏప్రిల్ మొదటి తేదీ నుంచి విజయవాడలో వృత్తి పన్ను వసూలు వాణజ్య పన్నుల శాఖ పరిధిలోకి వచ్చింది. వృత్తి పన్ను ఎవరు కట్టాలనే అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మా వద్ద ఉన్న సమాచారం మేరకు ఎవరెవరు కట్టాలనే విషయాలను గుర్తించి వారి నుంచి వృత్తి పన్ను వసూలు చేస్తాం. – షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1 రూ.28 కోట్ల నుంచి రూ.200 కోట్లు వాణిజ్య పన్నుల శాఖకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు డివిజన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో విజయవాడ నగర పాలక సంస్థ పరిధికి సంబంధించి విజయవాడ డివిజన్–2 కార్యాలయం అత్యధికంగా ఉంటుంది. ఇప్పటివరకూ విజయవాడ నగర పాలక సంస్థ వృత్తి పన్ను ద్వారా ఏడాదికి రూ.28 కోట్లు మాత్రమే వసూలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న డీలర్ల సంఖ్య, ఉద్యోగులు తదితర వివరాలను క్రోడీకరిస్తే సుమారుగా రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని పొందవచ్చని ఉన్నతాధికారులు లెక్క వేశారు. వేసిందే తడవుగా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది తమతమ సర్కిల్ కార్యాలయ పరిధుల్లో షాప్ టు షాప్ తిరిగి వృత్తి పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఉద్యోగ విధులతో పాటుగా వెబ్ కాన్ఫరెన్స్లు, ఇతర సమావేశాలకే అల్లాడుతుంటే కొత్తగా ఈ వృత్తి పన్ను వసూళ్ల పని భారం తమపై రుద్దటం ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కంకిపాడు: నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని, రైతులకు మద్దతు ధర లభించాలని మార్క్ఫెడ్ ఎండీ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. కంకిపాడు మార్కెట్యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినుము, పెసలు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా అపరాల సేకరణ తీరుపై సిబ్బందిని వివరాలు అడిగారు. మార్క్ఫెడ్ ప్రత్యేకాధికారి కిషోర్, కొనుగోలు మేనేజర్లు నరసింహారెడ్డి, నళిని జిల్లాలోని 8 కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,948 హెక్టార్లలో పెసలు సాగు చేయగా, 3,435 మెట్రిక్ టన్నులు దిగుబడు లు వస్తాయని అంచనా వేశారన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.1.36 కోట్ల విలువైన 157 మెట్రిక్ టన్నుల పెసలు సేకరించి సీడబ్ల్యూసీ గోదాముకి తరలించామన్నారు. మార్క్ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి జాప్యం జరగకుండా సేకరణ ప్రక్రియ, సొమ్ము చెల్లింపు వేగంగా జరిగేలా ఆన్ లైన్లో వివరాలను సమర్థంగా నమోదు చేయాలన్నారు. ఈ–క్రాప్ నమోదులో పంట నమోదు వ్యత్యాసం ఉందని రైతు చెప్పటంతో వ్యత్యాసం రావటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని రైతులు కోరారు. దీనిపై స్పందిస్తూ రబీ సీజన్లో ధాన్యం సేకరణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఓ పీఎం కిరణ్, ఏఈఓలు సూర్యభవాని, వాణి, వీఏఏ కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెసలు కొనుగోలు కేంద్రం పరిశీలించిన మార్క్ఫెడ్ ఎండీ -
అపార నష్టం
అకాల వర్షం..సాక్షి ప్రతినిధి, విజయవాడ: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన దశలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పసుపు తడిసిపోయాయి. నున్న ప్రాంతంలో గాలివానకు మామిడి కాయలు రాలిపోయాయి. రబీలో సాగు చేసిన వరి దెబ్బతింది. వెన్నుదశలో ఉన్న వరికి సంబంఽధించి సుంకు రాలిపోయింది. ఇప్పటికే ఽగిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు మళ్లీ గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్లు, మళ్లీ తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబోసేందుకు అదనపు భారం కృష్ణాజిల్లాలో ఈ రబీ సీజనులో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న, 4,816 హెక్టార్లలో వరిపంటను సాగు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మామిడి పంట 22,500 హెక్టార్లలో సాగు చేశారు. కృష్ణా జిల్లాలోని దావులూరు, చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు, కంకిపాడు, ఈడుపుగల్లు, పునాదిపాడు ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. ఈ పంటను ఆరబోసుకునేందుకు ఎకరాకు రూ.5వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, ఈ అదనపు ఖర్చుతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు సంబంధించి రైతులు ఉడకబెట్టి ప్రస్తుతం కల్లాల్లో ఆరబోశారు. వర్షానికి తడిసి నాణ్యత దెబ్బతిని, కాటు వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం పసుపు రేటు క్వింటా రూ.9500 ఉందని, క్వింటా రూ.13వేలకు పైగా ఉంటే గాని గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. రబీలో వరి సాగు చేసిన రైతులు సైతం వరి కంకి దశలో ఉందని, సుంకు రాలిపోయి దిగు బడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నున్న ప్రాంతంలో ఎకరానికి పైగా అరటితోట పూర్తిగా నేలకు ఒరిగింది. నేలరాలిన మామిడి కాయలు తడిసిన మొక్కజొన్న, పసుపు వరి పంటపైనా ప్రభావం ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతు గోరుచుట్టుపై రోకటిపోటులా వర్షం మామిడి రైతుకు కోలుకోలేని దెబ్బ... ఈ ఏడాది ఇప్పటికే నల్లతామరతో మామిడి పంట బాగా దెబ్బతింది. అరకొరగా కాసిన మామిడి కాయలు సైతం గురువారం వీచిన గాలులు, వర్షానికి రాలిపోయాయి. నున్న ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉద్యానవన అధికారుల లెక్క ప్రకారం 50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండగా, కాసిన కొద్ది కాయలు నేల రాలిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే విధంగా మరోసారి వర్షం వస్తే మామిడి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని మామిడి రైతులు వణికి పోతున్నారు. -
‘పది’ స్పాట్ వాల్యూయేషన్ పరిశీలన
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ను జిల్లా పరిశీలకునిగా నియమితులైన ఏపీ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ శుక్రవారం పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్లో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు 800 మంది ఉపాధ్యాయులు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నియమించిన పరిశీలకులు కృష్ణమోహన్ శుక్రవారం స్పాట్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుందన్నారు. -
ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే నష్టపోతాం
నేను కౌలుకు తీసుకుని 20 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాను. కోత పూర్తయిన తర్వాత మైలవరం మార్కెట్ యార్డులో ఆరబోశాను. ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. క్వింటాకు రూ.20 సెజ్ కట్టాలని మార్కెట్ యార్డు అధికారులు చెప్పడంతో వ్యాపారులు వెనక్కిపోయారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నా మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు దళారులు కొనే అవకాశం లేదు. పది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయాలి. లేదంటే నష్టపోతాం. –చెరుకూరి అర్జునరావు, కౌలు రైతు, అనంతవరం, మైలవరం మండలం -
దుర్గమ్మకు వెండి పంచ పాత్ర బహూకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు పూర్వ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులను కలిసి సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. మంగినపూడి బీచ్లోకి 300 ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని గిరిపురం బీచ్లోకి 300 ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లలను అటవీశాఖ, మైరెన్ పోలీసులు వదిలారు. బందరు మండల కేంద్రంలో మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్న గుడ్ల సంతాన ఉత్పత్తి కేంద్రం నుంచి గురువారం 300 పిల్లలు గుడ్ల నుంచి బయటకు రాగా వాటిని సముద్రంలోకి వదిలారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ సాయి, సంరక్షణకేంద్రం ఇన్చార్జి ఒ.నాగరాజు, గిలకలదిండి మైరెన్ ఎస్ఐలు వి.జె.చంద్రబోస్, పరింకాయల మురళీకృష్ణ, స్టేషన్ రైటర్ మద్దియ్య, ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లల సంరక్షణ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. హాకీ జిల్లా జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్నగర్లోని ఎంబీపీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన చరణ్రాజ్, సునీల్కుమార్, విశ్వతేజనూతన్, నితిన్రాజ్, హరివినయ్, చిరంజీవిఏసురాజు, సూర్య, దినేష్సాయిరామ్, ప్రవీణ్, మున్నర్ వలీ, భార్గవ్, అశోక్, జస్వంత్, జగదీష్బాబు, అమీర్, యాసిన్, హర్షలను జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. 1,23,485 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,13,955 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,485 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,777 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్తో అనర్థాలపై అవగాహన కల్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యార్థులకు చిన్న తనం నుంచే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని వీఎంసీ డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డాక్టర్ సృజన అన్నారు. దీని కోసం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని వివరించారు. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అవగాహన పెంచుకుంటే అందరికీ తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. వీఎంసీ డిప్యూటీ కమిషనర్ సృజన -
రూ. 28.97లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పలు కేసులకు సంబంధించి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను శుక్రవారం జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఇతర అధికారులతో కలసి మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ చేత ధ్వంసం చేయించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాతో పాటు సారా తయారీ కేంద్రాలపై జరిపిన దాడులకు సంబంధించి 814 కేసులు నమోదు చేసిన పోలీసులు.. రూ. 28,97,000 విలువ గల 15,280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే 65 ఎకై ్సజ్ కేసులకు సంబంధించి 684.83 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. వీటిని శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన అన్ని మద్యం బాటిళ్లు, సారాను ధ్వంసం చేయించినట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీలకు సంబంధించి సమాచారం ఉంటే హెల్ప్లైన్ 14405, డయల్ 100, 112లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సీహెచ్ రాజ, శ్రీవిద్య, వి. ధీరజ్నీల్, సీహెచ్ శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ జి. శ్రీనివాసరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు ఎంతకష్టం!
● ఎంఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇబ్బందులు ● ఒకేసారి 3,900మందిని ఇంటర్వ్యూకు పిలవడంతో అదుపు తప్పిన పరిస్థితి ● కింద పడిపోయిన మహిళలు ● సొమ, మంగళవారాల్లో మరోసారి ఇంటర్వ్యూ మచిలీపట్నంటౌన్: బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. వివిధ స్వయం ఉపాధి యూనిట్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటర్వ్యూకి వచ్చి.. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా తిప్పలు పడి.. బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. శుక్రవారం బందరు నగరపాలక సంస్థ కార్యాలయం(ఎంఎంసీ)లో ఇరుకుగా ఉండే మీటింగ్ హాల్లో నగరంలోని 50 డివిజన్ల నుంచి 3,900 మందిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కొంత మంది మహిళలు కిందపడిపోయారు. నగరపాలక సంస్థ అధికారుల అనాలోచిత చర్యతో ఈ పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేశారు. రుణాల కోసం వచ్చిన తమపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం చాటేసిన బ్యాంకర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు.. నగరపాలకసంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రుణ ఇంటర్వ్యూలకు కీలకమైన బ్యాంకర్లు ముఖం చాటేశారు. నగరంలోని దాదాపు 15 బ్యాంకర్లను నగరపాలక సంస్థ ఆహ్వానం పలుకగా కేవలం ఆరు బ్యాంకులకు సంబంధించిన సిబ్బందే హాజరయ్యారు. అలాగే ఆయా డివిజన్ సచివాలయాలకు చెందిన పలువురు వెల్ఫేర్ సెక్రటరీలు కూడా గైర్హాజరయ్యారు. దీంతో తమ సెక్రటరీలు కానరాక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి కీలక సమావేశాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో 10 నుంచి 15 డివిజన్లకు ఒక చోట నిర్వహించేవారు. దీంతో తోపులాట లేకుండా సజావుగా కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం పాలకులు, అధికారులకు సరైన అవగాహన లేకపోవటంతో ఒకే రోజు ఒకే చోట ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల ఇబ్బందులకు కారణమయ్యారు. ఇంటర్వ్యూ వాయిదా.. శుక్రవారం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూను తిరిగి ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక టౌన్ హాల్ల్లో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని చెబుతున్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులతో కిక్కిరిసిన ఎంఎంసీ కార్యాలయంఇబ్బందులు పడ్డాం.. నగరపాలకసంస్థ అధికారుల అనాలోచిత చర్యలతో మేము ఇబ్బంది పడ్డాం. ఇరుకు గదిలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి నగరంలోని 50 డివిజన్ల నుంచి బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,900 మంది ఒకే సారి పిలవడం ఎంతవరకూ సమంజసం. పైగా వెల్ఫేర్ సెక్రటరీలు హాజరుకాలేదు. వారు వచ్చి ఉంటే మా దరఖాస్తులు పరిశీలించి ఒక క్రమ పద్ధతితో ఇంటర్వ్యూలకు పంపేవారు. – లక్ష్మి, దరఖాస్తుదారు -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
తిరువూరు: స్థానిక బైపాస్రోడ్లో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ సుభాని(21) దుర్మరణం చెందాడు. తిరువూరు రాజుపేటకు చెందిన సుభాని బస్టాండు సెంటర్లోని ఒక జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్నాడు. దుకాణం నుంచి బయటికి వెళ్లిన యువకుడు తన స్నేహితుడిని ఇంటివద్ద దింపి వస్తుండగా బైపాస్రోడ్డులో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాని తల ఛిద్రం కాగా అక్కడికక్కడే మరణించాడు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్గా పనిచేసే సుభాని తండ్రి ఉస్మాన్ ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముత్తగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తండ్రి మరణానంతరం సుభానిపైనే కుటుంబం ఆధారపడగా, అతని మరణంతో జీవనాధారం కోల్పోయింది. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభాని మృతదేహానికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
ఇంటి దొంగ అరెస్ట్
182 గ్రాముల బంగారం స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 182 గ్రాముల బంగారపు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కొత్తపేట సీఐ చిన కొండలరావు మీడియాకు వివరించారు. జక్కంపూడి కాలనీలోని అటికల శివాజీకి దూరపు బంధువైన బొడ్డు రమణ(52) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చాడు. ఈ నెల 1న రమణ శివాజీ కుమార్తె చింతల భారతి ఇంట్లోని బీరువాలో బంగారపు వస్తువులు, నగదును చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితుడు ఇంటి నుంచి బంగారపు వస్తువులను తీసుకుని ఆటోలో వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో పోలీసులు నిందితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్ను ఆరా తీశారు. 3వ తేదీ సాయంత్రం రమణ బస్టాండ్ వద్ద తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రమణకు వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య, పిల్లలను వదిలి విడిగా ఉంటున్నాడు. శివాజీ ఇంటికి వచ్చిన క్రమంలో భారతీ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులపై కన్ను పడింది. ఒకటో తేదీ ఇంట్లోని వారందరూ విస్సన్నపేటకు వెళ్లగా, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన రమణ ఇంట్లో బీరువాను స్క్రూడ్రైవర్, కట్టర్తో పగలగొట్టి బంగారపు వస్తువులను కాజేశాడు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని సీఐ కొండలరావు అభినందించారు. -
రైతుకు సహకార నిరాకరణ!
● పది నెలల్లో సహకార సంఘాల్లో పాలన అస్తవ్యస్తం ● ప్రభుత్వం మారగానే ఆగిపోయిన గోడౌన్ల నిర్మాణం ● రుణాల మంజూరు అంతంతమాత్రమే ● గత ప్రభుత్వంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా పరుగులు పెట్టిన వ్యవస్థ కూటమి నిర్వాకంతో వ్యవస్థ నిర్వీర్యంజి.కొండూరు: గ్రామస్థాయిలో రైతు బ్యాంకులుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా రైతులకు సేవలందించిన ఈ సహకార సంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు సమర్థనీయ సేవలను అందించడంలో విఫలమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ పది నెలల కాలంలో సంఘాలకు పాలనా కమిటీలను నియమించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వ్యవస్థ కుంటుపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సకల వసతులతో అన్ని రకాల సేవలను అందించిన ఈ సహకార సంఘాలు ఇప్పుడు నామమాత్రపు సంఘాలుగా మారుతున్నాయి. గోడౌన్లపై వివక్ష ఎందుకు? రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు వీలుగా గోడౌన్ విత్ ప్లాట్ఫారంల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో సహకార సొసైటీల ఆధ్వర్యంలో చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.21.44కోట్లతో 52చోట్లు గోడౌన్ విత్ ప్లాట్పారంలను నిర్మాణాలు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వంలోనే 50శాతంకి పైగా గోడౌన్లు పూర్తి చేసి ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల మంజూరులో జాప్యం జరగడంతో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాలు పూర్తయిన గోడౌన్లకు సైతం రహదారి సమస్యలు వంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు గోడౌన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతో సహకార సంఘాలు విఫలం కావడంతో వినియోగంలోకి రాలేదు. అంతే కాకుండా నిర్మాణ దశలో ఆగిపోయిన గోడౌన్లు సంచార జీవనం సాగించే కుటుంబాలకు ఆవాసాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. పక్కా భవనాలు కూడా.. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో పీఏసీఎస్లు 131, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్లు 22కి గానూ 98 నూతన భవనాలు, కొన్ని భవనాలకు అదనపు గదులు నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.28.36కోట్లు కేటాయించారు. వీటిలో 80శాతంకి పైగా భవనాల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో బలోపేతం ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సహకార వ్యవస్థ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణల వల్ల అధునిక వసతుల కల్పనతో పాటు రుణాల మంజూరు, టర్నోవర్, డిపాజిట్లు ఇలా అన్ని రంగాలలో సహకార వ్యవస్థ బలోపేతమై లాభాల బాటలో నడిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 57 కేడీసీసీ బ్రాంచ్లు, రెండు ప్రధాన కార్యాలయాలు, 6 జిల్లా కో ఆపరేటివ్ ప్రోసెసింగ్ సెంటర్లు, 425సొసైటీలు ఉన్నాయి. ● కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో చివరి ఏడాది 2019కి మొత్తం రుణాలు రూ.3,201.21 కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.5,138.46 కోట్లు ఉంది. షేర్ క్యాపిటల్ రూ.170.12 కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.148.33 కోట్లు, డిపాజిట్లు రూ.1,937.25కోట్లుగా ఉన్నాయి. ● 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు ఐదేళ్ల పాలనలో మొత్తం రుణాలు రూ.8,134.51కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.11,279.48కోట్లుగా ఉంది. షేర్ క్యాపిటల్ రూ.390.75కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.308.54కోట్లు, డిపాజిట్లు రూ.3,144.97 కోట్లుగా ఉన్నాయి. రుణాల మంజూరు లేదు.. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాభాల బాట పట్టించింది. సహకార సంఘాలకు అదనపు ఆదాయం కోసం పెట్రోలు బంకులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేశాం. గోడౌన్ల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గం. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోడౌన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. రుణాల రికవరీ టార్గెట్ పూర్తి కాలేదని రుణాలు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. ప్రత్యేక అధికారుల పాలన వల్ల సంఘాల్లో పారదర్శకత ఉండదు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలనా కమిటీలను ఏర్పాటు చేసి సహకార సంఘాలను బలోపేతం చేయాలి. – తన్నీరు నాగేశ్వరరావు, కేడీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం పాలనా కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రత్యేక అధికారులతో వ్యవస్థను నడిపిస్తున్న క్రమంలో రుణాల మంజూరు అంతంతమాత్రంగానే సాగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25సంవత్సరానికి 60శాతం మాత్రమే రుణాలను రైతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక అధికారుల పాలన రైతులకు రుణాల మంజూరులో తలనొప్పిగా మారినట్లు సమాచారం. రుణాల రికవరీ టార్గెట్లు పూర్తికాలేదని రుణాల మంజూరును ఆపేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
నూతన ఆర్థిక చట్టాన్ని వ్యతిరేకిద్దాం
బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వరప్రసాద్ పటమట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నూతన ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించాలని, పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ దొడ్డిదారిన పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పెట్టారని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమటలోని రఘురామ కల్యాణ వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు జరిగే వేతన సవరణలో ఉద్యోగులకు పెరిగే వేతనాలకు తగ్గట్టుగా పెన్షన్లో కూడా పెంపుదల జరిగే మార్పులు చేస్తూ 2026 నుంచి రిటైర్ అయ్యే వారికి మాత్రమే వేతన సవరణ అవకాశం కల్పించిందని అన్నారు. ఈ నూతన పెన్షన్ విధానం పాత పెన్షనర్స్కు మాత్రం మార్పులు లేని విధంగా, న్యాయపరమైన జోక్యం లేకుండా చట్టం చేస్తూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్ మెడకు ఉరితాడు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సి. భాస్కరరావు, సర్కిల్ కార్యదర్శి టి.ఆశీర్వాదం, సలహాదారు డి.దుర్గారావు కోశాధికారి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ గత ఏడాది మే 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన మురాల వెంకటేశ్వరరావు సతీమణి వీరమల్లు రాజేశ్వరికి పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తూ శుక్రవారం ఎస్పీ కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారు నేటి నుంచి విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణతో పాటు విధులను అత్యంత బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఏవో ఎంఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఒలింపిక్ సంఘం ప్రక్షాళనే పరిష్కారం విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీవోఏ) ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), ఫెడరేషన్ గుర్తింపు ఉన్న రాష్ట్ర క్రీడా సంఘాలతో గురునానక్కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీవోఏ ప్రతినిధులుగా కొనసాగుతున్న వ్యక్తుల కారణంగా ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో ఆంధ్ర రాష్ట్ర క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఏపీవోఏని రెండుగా విడదీసిన వ్యక్తులతో చర్చించి, ఏపీవోఏని ఒక్కటిగా చేయాలని గతంలో ఆలోచించామన్నారు. ఏపీవోని ప్రక్షాళన చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గమని బహిర్గతం చేశారు. ఏపీవోఏ అడహాక్ కమిటీ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పి.టి.ఉషతో ఇటీవలే చర్చించామని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అడహాక్ కమిటీ ఏర్పాటునకు క్రీడా సంఘాలన్ని కలిసి ఏకతాటిపైకి రావాలని ఆదేశించారు. ఏపీ జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్, కాయకింగ్, తైక్వాండో, ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో, హాకీ, మోడ్రన్పెంటత్లాన్, స్కైస్నోబోర్డ్, రైఫిల్షూటింగ్, బేస్బాల్ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
కలంకారీ పరిశ్రమలన్నీ సంఘటితం కావాలి
పెడన: కలంకారీ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి రావాలని, అప్పుడు క్లస్టర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం గూడూరు రోడ్డులోని దేవాంగ కల్యాణ మండలంలో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రాంను ఎస్ఎంఎస్ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కలంకారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారంతో పాటు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే కలంకారీ క్లస్టర్కు అవసరమైన స్థలాలను, భవనాలను గుర్తించి వాటి అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్ కూడా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఎస్ఎంఎస్ఈ జీఎం వెంకట్రావు, జ్యూవెలరీ పార్క్ అధ్యక్షుడు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కాగిత -
వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు మరోసారి వాయిదా
గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్స్టేషన్లో నమోదైన స్థల వివాదం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వంశీమోహన్ బెయిల్ పిటిషన్పై స్థానిక 8వ అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసు తీర్పు శుక్రవారం వెలువడాల్సిన నేపథ్యంలో ఆత్కూరు పోలీసులు వంశీని మరోసారి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును సోమవారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బెయిల్ పిటిషన్పై కూడా అదే రోజు తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కూలీలను కాపాడి మేస్త్రి మృతి గన్నవరం: శ్లాబ్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలను రక్షించే క్రమంలో కాంక్రీట్ లిఫ్ట్ గడ్డర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన పిల్లిబోయిన కొండలు(35) కాంక్రీట్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఓ భవనానికి శ్లాబ్ నిర్మాణ నిమిత్తం గురువారం కొంత మంది కూలీలను తీసుకుని వెళ్లారు. శ్లాబ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంక్రీట్ను పైకి లిఫ్ట్ చేసే యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో లిఫ్ట్ బాక్స్ వైర్లు ఒక్కసారిగా తెగి ఐరన్ గడ్డర్లు కిందపడిపోవడం గమనించిన కొండలు.. అక్కడే ఉన్న మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆ నలుగురు మహిళలను పక్కకు నెట్టివేసి.. కొండలు మాత్రం బరువైన లిఫ్ట్ బాక్స్ గడ్డర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అతనికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై గన్నవరం ఎస్ఐ ప్రేమ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చిల్లకల్లు(జగ్గయ్యపేట): భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిల్లకల్లులో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన బత్తుల భవానీ (25)కి 2015లో చిల్లకల్లుకు చెందిన బత్తుల శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త అల్ట్రాటెక్ కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భర్త మద్యానికి బానిసై గత కొంత కాలంగా భార్యను వేధిస్తున్నాడని ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరగటంతో భార్యను కొట్టటంతో మనస్తాపం చెందిన భవానీ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం సమయంలో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి వెంకటేష్ భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ మనీషా రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులకు తెలియకుండా వారి పేరుతో రుణాలు తీసుకోవడం, తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీర్చినా కొన్నేళ్ల తర్వాత రైతులకు నోటీసులు ఇచ్చి మరలా రుణాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ఇలాంటివన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నిత్యకృత్యం. రాజకీయ జోక్యంతో రికార్డులు తారు మారు చేయడం, సభ్యుల వివరాలు గల్లంతు చేయడం వంటివి జరిగేవి. ఇదంతా ఇపుడు గతం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. పీఏసీఎస్ల ద్వారా పారదర్శకంగా, అవినీతి రహితంగా రైతులకు సేవలు అందించేందుకు కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ పూర్తయింది. పీఏసీఎస్లన్నీ మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి కంప్యూటర్ ఆధారిత సేవలు అందించనున్నాయి. బ్యాంకుల తరహాలో రైతులకు పూర్తి పారదర్శకంగా సేవలు అందిస్తాయి. ఇకపై రైతులు పీఏసీఎస్ల ద్వారా ఆన్లైన్ సేవలు పొందవచ్చు. జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు అందుతున్నాయి. ఇవి గాక రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సొసైటీలు అందిస్తున్నాయి. వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి పీఏసీఎల్లలో సేవలను మాన్యువల్ విధానంలో అందిస్తున్నాయి. గతంలో సొసైటీలు అవకతవకలు అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉండేవి. సొసైటీల్లో అధ్యక్షులుగా ఎన్నికైన కొందరు అక్రమాలకు పాల్పడడం, రైతుల సొమ్ము కాజేయడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2004కి ముందు సహకార సొసైటీలు దివాలా తీశాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సొసైటీలకు జీవం పోసింది. గత ప్రభుత్వంలో కీలక అడుగులు.. సొసైటీలను డీసీసీబీలు, ఎస్సీబీలకు అనుసంధానం చేయడం, రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్యూటరీకరణ చేపట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసింది. ప్రస్తుతం సొసైటీలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత సేవలు, పారదర్శకంగా అందించేందుకు సిద్ధమయ్యాయి. మూడు దశల్లో కంప్యూటరీకరణ.. సహకార సంఘాల కంప్యూటరీకరణ మూడు దశల్లో చేపట్టారు. జిల్లాలోని 131 సహకార సంఘాల్లో మొదటి రెండు దశలు వంద శాతం పూర్తయ్యాయి. ఇక చివరిది ప్యార్లల్ రన్ ద్వారా 92 సంఘాల్లో పూర్తయింది. మరో రెండు రోజుల్లో మిగిలిన సంఘాల్లో పూర్తవుతుంది. కంప్యూటర్ ఆధారంగానే రైతులకు సేవలు అందించనున్నాయి. – శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార అధికారి కంప్యూటరీకరణలో భాగంగా ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతుల వివరాలు, వారి డిపాజిట్లు, రుణాలు, ఏ భూములపై రుణాలు తీసుకున్నారన్న వివరాలను పూర్తి స్థాయిలో సేకరించారు. శాసీ్త్రయ పద్ధతిలో రైతుల వివరాలు అప్డేట్ చేశారు. డేటా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సహకార సంఘాలు అన్ని శాఖలు, డీసీసీబీలు, ఆప్కాబ్, నాబార్డుకు అనుసంధానిస్తారు. రైతులు సొసైటీల ద్వారా తీసుకున్న, చెల్లించిన రుణాల వివరాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. జవాబుదారీ తనం పెరుగుతోంది. రికార్డుల నిర్వహణ కచ్చితంగా జరగడమే కాకుండా, అవినీతికి చెక్ పడుతుంది. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.18 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.18 కోట్లను కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమ ర్పించారు. ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ పర్యవేక్షణలో పలువురు సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం రూ. 2,18,00,698 నగదు, 355 గ్రాముల బంగారం, 6.374 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపు దేవదాయ శాఖ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగింది. కార్తికేయుని సేవలో డెప్యూటీ సీఈఓ మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని డెప్యూటీ సీఈవో, ఈవీఎం నోడల్ ఆఫీసర్ కె. విశ్వేశ్వరరావు, పలువురు ఎన్నికల అధికారులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుసోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్దు సతీష్ శర్మ, విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. వీరి వెంట మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, స్థానిక తహసీల్దార్ శ్రీవిద్య, ఎస్ఐ సత్యనారాయణ, మోపిదేవి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకట రమణ తదితరులు ఉన్నారు. ప్రజావేదిక ఏర్పాట్లు పరిశీలన చందర్లపాడు(నందిగామ టౌన్): ప్రజావేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో నిర్వహించనున్న ప్రజావేదిక కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనులను చేపడుతున్నామన్నారు. నెట్టెం రఘురాం, సౌమ్య మాట్లాడుతూ ప్రజావేదిక ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టికెట్ తనిఖీల్లోనూ రైల్వేకు భారీగా ఆదాయం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల వద్ద టికెట్ తనిఖీల ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 62.03కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.60.10 కోట్లు నమోదు కాగా దానికి మించి 2.5 శాతం అధికంగా ఆదాయం వచ్చిందన్నారు. కమర్షియల్ విభాగం నిరంతర కృషి ఫలితంగానే డివిజన్ రికార్డు స్థాయిలో ఆదాయం సాధించినట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ విభాగం మొత్తం 9,76,584 కేసులు నమోదు చేయగా అందులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై 4,52,887 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 37.17 కోట్లు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 5,13,285 మంది నుంచి రూ. 24.69 కోట్లు, బుక్ చేయని లగేజీలపై 10,412 కేసుల ద్వారా రూ. 19.46 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, కమర్షియల్ సిబ్బందిని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. కనులపండువగా.. దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి శ్వేత, హరిత వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానానికి బాపట్ల జిల్లా కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్షను విరాళంగా సమర్పించారు. –8లోuమళ్లీ గ్రాఫిక్స్ చేస్తున్నారు.. సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి సర్కారు విజయవాడ అభివృద్ధిపై అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. అంతా ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణ చూపడం లేదు. ఫలితంగా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు పది నెలలు గడుస్తున్నా నగరానికి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా 90శాతానికి పైగా పూర్తయిన వెస్ట్ బైపాస్ ను అందుబాటులోకి తేవడంలో విఫలమైంది. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలకమైన తూర్పు బైపాస్ను అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కోసం వదిలేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతి వనం, కృష్ణమ్మ జలవిహార్ వంటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. గతంలోనూ అంతే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బెజవాడ అభివృద్ధిపై శీత కన్ను వేస్తూనే ఉంది. ప్రచార ఆర్భాటం తప్ప.. చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయవాడలో వర్షం నీటి మళ్లింపునకు సంబంధించి రూ.440కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించినా పూర్తి చేయడంలో విఫలమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం చేసింది. కీలక వంతెనల నిర్మాణం పై దృష్టి సారించలేదు. అదిగో ఇదిగో మెట్రో రైలు ప్రాజెక్టు అంటూ కాలయాపన చేసింది. గ్రేటర్ విజయవాడ అంటూ తెరపైకి తెచ్చినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడూ అదే తీరు.. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం విజయవాడను చిన్నచూపు చూస్తోంది. గ్రాఫిక్స్లతో కనికట్టు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. గత ఏడాది బుడమేరు వరదలతో బెజవాడ విలవిల్లాడింది. బుడమేరును మొదటి దశలో రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తామని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఊదరగొట్టినా, ఆచరణలో అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ పాత పాటే ఎత్తుకుని, మైట్రో రైలు ప్రాజెక్టు, గ్రేటర్ విజయవాడ అంటూ మరోసారి నగర వాసులను మభ్యపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా గ్రాఫిక్స్ చూపిస్తారే తప్ప అభివృద్ధి కనిపించదు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు అంటూ మరలా గ్రాఫిక్స్కు తెరతీశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేశారు. ఐదేళ్లలో కరకట్ట రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేశారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పార్క్లు అభివృద్ధి చేశారు. – తిరుపతిరెడ్డి, కృష్ణలంక నాటి అభివృద్ధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో రూ. కోట్లు వెచ్చించి నగరంలోని మౌలిక సదుపాయాలపై నాటి పాలకులు దృష్టి సారించారు. పార్కులు, రోడ్లు, బ్రిడ్జిలు వంటి అనేకమైన సౌకర్యాలను కల్పించారు. విజయవాడ నగరం దేశంలోని క్లీన్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన పురస్కారాలు అందుకుంది. కానీ నేటి కూటమి ప్రభుత్వం మళ్లీ గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రణాళికలు చేస్తోంది. – యాలంగి బాలచంద్రరావు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి 7న్యూస్రీల్ కూటమి అధికారం చేపట్టి తొమ్మిది నెలలైనా అందుబాటులోకి రాని వెస్ట్ బైపాస్ తూర్పు బైపాస్కు మంగళం గ్రేటర్ విజయవాడకు పడని అడుగులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే కీలక ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కీలక ప్రాజెక్టులు.. విజయవాడ అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కీలక అడుగులు పడ్డాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్ను పూర్తి చేశారు. కీలక బెంజిసర్కిల్ మొదటి ఫ్లై ఓవర్కు సంబంధించిన మధ్యలో నిలిచిన పనులు పూర్తి చేసి, రెండో ఫ్లై ఓవర్ను ప్రారంభించి, రికార్డు సమయంలో పూర్తి చేశారు. సుందర నగరంగా తీర్చి దిద్దేందుకు భాగంగా గ్రీనరీ, కాలువ గట్లను అభివృద్ధి చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కరంగా రిటైనింగ్ వాల్ను నిర్మించారు. నదీతీరంలో ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. కొండ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేశారు. ఎయిర్పోర్టు కారిడార్ను అందంగా తీర్చి దిద్దారు. పలుపార్కులను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికీకరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ఏర్పాటు చేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయింది. అక్కడక్కడ అరకొరగా పనులు నిలిచిపోయాయని అంటున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. వెస్ట్ బైపాస్కు సంబంధించి మిగిలిపోయిన చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తెస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. – కృష్ణారెడ్డి, భవానీపురం -
ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణా జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెమీ మెకనైజ్డ్ విధానంలో యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందామన్నారు. పమిడిముక్కల మండలంలోని పడమటలంక, పెనమలూరు మండలంలోని చోడవరం, తోట్లవల్లూరు మండలంలోని నార్త్వల్లూరు, రొయ్యూరు వంటి నాలుగు కొత్త రీచ్లను ఎంపిక చేశామన్నారు. వీటన్నింటికి త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇసుక తవ్వకాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సెమీ మెకనైజ్డ్ విధానం ద్వారా వినియోగదారులకు సమృద్ధిగా నాణ్యమైన ఇసుక లభించటంతో పాటు ధరలు తగ్గుతాయన్నారు. రానున్న వర్షాకాలంలో నిర్మాణ అవసరాలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల్లో సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, గనులశాఖ ఏడీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ కొండారెడ్డి, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
సోషల్ మినహా అన్ని సబ్జెక్టుల వాల్యూయేషన్ ప్రారంభం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విజయవాడలో గురువారం ప్రారంభమైంది. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఈ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సోషల్ మినహా అన్ని సబ్జెక్ట్ల జవాబు పత్రాల మూల్యాంకనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్ పరీక్ష చివరిది కావటంతో ఆ పరీక్ష పత్రాలు గురువారమే నగరానికి చేరుకున్నాయి. దాదాపుగా మిగిలిన అన్ని సబ్జెక్టుల బోర్డులు ప్రారంభమయ్యాయి. 1,72,129 జవాబు పత్రాలను ఈ కేంద్రంలో మూల్యాంకనం చేయనున్నారు. సుమారు 720 మంది ఉపాధ్యాయులు తొలి రోజు మూల్యాంకనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిర్ణయించిన గడువు లోపు మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాస్త ఉపశమనం ఆటోనగర్(విజయవాడతూర్పు): గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజానీకానికి గురువారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా కారుమబ్బులు పట్టి, ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత సుమారు 25 నిమిషాల పాటు వర్షం కురిసింది. -
ఉపసంహరించుకోవాలి
పెన్షన్ చట్టం సవరణ బిల్లును తక్షణమే పటమట(విజయవాడతూర్పు): లక్షలాది మంది పెన్షనర్స్కు నష్టం చేకూర్చే ప్రమాదకరమైన పెన్షన్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంటులో పెట్టిన సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగులు, అధికారుల సంఘాల ప్రతినిధులు గురువారం స్థానిక గాంధీ కాలనీలో ఉన్న బీఎస్ఎన్ఎల్ పెన్షన్ పరిష్కార కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఆలిండియా బీఎస్ఎన్ఎల్ టెలికం పెన్షనర్స్ అసోసియేషన్, ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సంచార నిగం పెన్షనర్స్ అసోసియేషన్, ఆలిండియా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కృష్ణా ్జల్లా సర్కిల్ పరిధిలో ఉన్న పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ తారా చంద్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వి. వర ప్రసాద్, సర్కిల్ కార్యదర్శి ఎన్. రామారావు మాట్లాడుతూ ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయితే దేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్డ్ అయినప్పటికీ ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి మార్పులకు అవకాశం లేక హీనమైన జీవితం గడపాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎం. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, పి. ఆనంద బాబు, ఏ చంద్ర శేఖర్, సి. భాస్కరరావు, మాధవరావు, తాజారావు, కేఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ డిమాండ్ -
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకువస్తుందని, తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తోందని అందరూ భావించారన్నారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆప్కాస్ రద్దు, పర్మినెంట్ ముద్దు అనే నినాదంతో కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలకు జీవో ఇవ్వాలని నినదించారు. కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యే ప్రమాదం.. ధర్నాను ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కార్మికుల జీతాల పెంపు, కార్మికులకు రూ.21 వేలు జీతం కూటమి ప్రభుత్వం ఇస్తుందని అంతా ఆశించారన్నారు. కానీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆప్కాస్తో కార్మికులకు కొంత మేర ఉపశమనం కలిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ధారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఏజెన్సీలకు అప్పగిస్తే తిరిగి దళారీ వ్యవస్థ వస్తుందని, కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నిస్తోందన్నారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వాటికి సంబంధించి జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, లేనిపక్షంలో అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ధర్నాకు సీపీఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.దుర్గారావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.కృష్ణ మద్దతు తెలిపారు. ధర్నాలో మున్సిపల్ యూనియన్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ప్రవీణ్, కోశాధికారి డి.స్టీఫెన్ బాబు, ఉపాధ్యక్షురాలు టి.తిరుపతమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జె.విజయలక్ష్మి వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు, పార్క్, వాటర్, మెకానిక్, డ్రెయినేజీ, స్ట్రీట్ లైట్ సెక్షన్ బాధ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. దర్నా కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు -
పెట్రోల్ బంక్ సీజ్
నందిగామరూరల్: మండలంలోని అడవిరావులపాడు గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్, డీజిల్ బంకును తూనికలు, కొలతల శాఖాధికారులు సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రీడింగ్లు, కొలతల్లో తేడాలు న్నాయని వినియోగదారులు గురువారం బంకు వద్ద ఆందోళన చేశారు. మూడు నెలల నుంచి కొలతల్లో తేడాలను గమనిస్తున్నామని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి భానుప్రసాద్ మాట్లాడుతూ డీజిల్ మోటార్ పంపు ఆన్ చేయగా డీజిల్ రీడింగ్ హెచ్చుతగ్గులు చూపిస్తోందని లీటరుకు 0.8 పాయింట్లు, రూ.7.76 లు డీజిల్ తక్కువగా వస్తుందని తెలిపారు. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా మోటర్ జంప్ టెక్నిక్ను గుర్తించామన్నారు. బంకులో మోసం జరిగినట్లు నిర్ధారించటంతో తదుపరి అనుమతులు వచ్చే వరకు నయారా బంకులో పెట్రోల్, డీజీల్ అమ్మకాలను నిలిపివేయాలని యాజమాన్యానికి సూచించి బంకును సీజ్ చేశారు. తనిఖీల్లో పీడీఎస్ డీటీ రామ్మూర్తి రెడ్డి పాల్గొన్నారు. గంగాభవానీకి ‘లక్ష’ గారెలతో మహానివేదన కోడూరు: కోడూరు గంగాభవానీ అమ్మవారికి ‘లక్ష’ గారెలతో మహానివేదన కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అమ్మవారి 50వ జాతరోత్సవాల నేపథ్యంలో గురువారం గారెలతో మహానివేదన జరిపారు. కోడూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచి గారెలను వండి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఒక్కో మహిళ 54 లేదా 108 గారెలను తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు. గంగాభవానీ చిన్నఅమ్మవారి విగ్రహం ముందు గారెలను రాశిగా పోసి పండితులు కొమ్మూరి శ్రీనివాసరావు పూజలు చేశారు. అనంతరం గారెలను ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ధర్మకర్త కోట యుగంధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు కొనసాగుతుందని స్టేషన్ మేనేజర్ ఎన్.పోతురాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో భాగంగా ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణలో బోర్డింగ్, డే బోర్డింగ్ చేసే సౌకర్యం ఉందన్నారు. విజయవాడలో 8వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉజ్జయిని(మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర), ద్వారక(నాగేశ్వర్), సోమ్నాథ్, పూణే (భీమశంకర్), నాసిక్ (త్రాయంబకేశ్వర్), ఔరంగాబాద్(గ్రీష్ణేశ్వర్) జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రైలు విజయవాడ చేరుకుంటున్నారు. ట్రైన్ జర్నీ, నైట్ స్టే, అల్పాహారం, వెజిటేరియన్ భోజనం, వాష్ అండ్ చేంజ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఒకే ప్యాకేజ్లో అందుతాయన్నారు. ఆన్లైన్ బుకింగ్కు www.irctctourism.com సైట్లో సంప్రదించాలని కోరారు. -
నగదు వ్యవహారంలో వివాదం.. కుమార్తె ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): తల్లి, కూతురు మధ్య చోటుచేసుకున్న నగదు వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి ఓ వివాహిత ప్రాణాలను తీసుకునేలా చేసింది. న్యాయం చేయాల్సిన పోలీసులు వివాహిత పట్ల దురుసుగా ప్రవర్తించడం, తల్లి వ్యవహారశైలి నచ్చక పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివాహితకు పదే పదే ఫోన్ చేయడంతో పాటు కేసు రాజీ చేస్తానంటూ ఆమె నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి, కుమార్తె మధ్య గొడవలు పోలీసులు తెలిపిన వివరాలు, సేకరించిన వివరాల మేరకు విశాఖపట్నం సుందరయ్యనగర్కు చెందిన కామిశెట్టి మౌనిక(35), కృష్ణశంకర్లు భార్యభర్తలు. మౌనిక తల్లి గుత్తికొండ రమాదేవి విజయవాడ చిట్టినగర్లో నివాసం ఉంటోంది. రమాదేవికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం కిందట రమాదేవి భర్త మరణించడంతో ఇన్సూరెన్స్ ద్వారా రూ.8 లక్షలు వరకు వచ్చాయి. రమాదేవి కొద్ది నెలలుగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. చిన్న కుమార్తె అయిన మౌనిక ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇటీవలే తల్లి వద్దకు వచ్చేసింది. తల్లి వద్ద ఉన్న డబ్బుల్లో రూ.2 లక్షలు ఇవ్వాలని అడుగుతోంది. ఇదే విషయమై తల్లి కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల 30న మౌనిక తల్లితో డబ్బుల విషయమై అడిగింది. నాన్న చనిపోయిన తర్వాత మరోకరితో ఉండటం తనకు ఇష్టం లేదని, వైజాగ్ వచ్చేయాలని కోరింది. ఈ క్రమంలో మౌనిక వెంకటేశ్వరరావును కులం పేరుతో దూషించడంతో గొడవ తారాస్థాయికి చేరి పంచాయతీ పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. తన కుమార్తె డబ్బుల కోసం గొడవ చేస్తోందని రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ పేరుతో వేధింపులు ఫిర్యాదును తీసుకున్న పోలీసులపై వెంకటేశ్వరరావు ఒత్తిడి చేయడంతో మౌనికను స్టేషన్కు పిలిచి విచారణ చేశారు. తాను వైజాగ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని, ఇక ఆ డబ్బులు వద్దు.. మా అమ్మ వద్దని పోలీసులకు చెప్పినా వినిపించుకోలేదు. స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావాలని పదే పదే ఫోన్లు చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో విచారణ లేకుండా కేసు రాజీ చేస్తానని స్టేషన్కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ మౌనిక నుంచి డబ్బులు వసూలు చేసినట్లు మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు. విచారణ పేరుతో స్టేషన్లో పోలీసులు, తల్లి, వెంకటేశ్వరరావు అన్న మాటలను నేను భరించలేకపోతున్నానని భర్తకు ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైంది. ఇదే విషయాన్ని అక్క, బావలైన వెనిగళ్ల విజయలక్ష్మి, గోపినాథ్లకు చెప్పి బాధపడింది. స్టేషన్లో జరిగిన వ్యవహారంతో తాను మానసికంగా కుంగిపోయానని, తల్లి నడుచుకుంటున్న తీరు, పోలీసుల అన్న మాటలు నన్ను బాధపెట్టాయంటూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మౌనిక పురుగుల మందు తాగి తల్లి ఇంటి ముందుకు వెళ్లి పడిపోయింది. ఈ క్రమంలో గోపీనాథ్ దంపతులువచ్చి చూడగా అప్పటికే మౌనిక చలనం లేకుండా పడి ఉంది. వెంటనే 108 వాహనంలో హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మౌనిక భర్త కృష్ణశంకర్ హుటాహుటిన వైజాగ్ నుంచి గురువారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తల్లి, పోలీసుల వేధింపులే కారణమంటున్న బంధువులు -
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని ఉపాలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీపై ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా, ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నా, వీక్షించినా భక్తుల ఇంట సకల శుభాలు కలుగుతాయని, సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ మార్గం ద్వారా ఆది దంపతుల దర్శనానికి అనుమతించారు. కనులపండువగా వసంత నవరాత్రోత్సవాలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమ్మవారికి శ్వేత(తెలుపు), హరిత(పచ్చ) వర్ణ పుష్పాలతో విశేషంగా అర్చన జరిగింది. అమ్మవారికి తెల్ల జిల్లేడు, మల్లె పూలు, మారేడు బిల్వ పత్రాలు, తులసీ దళాలు, మందార పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొ లుత ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలను ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆయా పుష్పాలతో అర్చన నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు. లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన యువకుడు పెనమలూరు: పోరంకి సెంటర్లో గురువారం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అనకాపల్లికి చెందిన సింగంపల్లి గోవిందు పని కోసం పోరంకికి వచ్చాడు. అతను పోరంకి సెంటర్లో బైక్పై డివైడర్ కటింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న టిప్పర్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్తో పాటు గోవిందు లారీ కిందకు వెళ్లాడు. ఒక్కసారిగా అందరూ గోవిందు ప్రాణాలకు ముప్పు జరిగిందని భావించారు. అయితే అతను లారీ మధ్యలో ఉండటంతో లారీ చక్రాలు అతని పైకి ఎక్కలేదు. అతను సురక్షితంగా లారీ కింద నుంచి బయటకు వచ్చాడు. స్వల్వ గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. 100 అడుగుల రోడ్డులో కారు బీభత్సం పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో బుధవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఎనికేపాడు నుంచి తాడిగడప జంక్షన్ వైపునకు అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్పై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి పంట బోదెలో పడింది. డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఎవరైనా ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభం అలానే ఉంది. కిడ్నాప్ కలకలం.. పోరంకిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం చెలరేగింది. తన తండ్రిని కొందరు ఇంటి వద్ద నుంచి కిడ్నాప్ చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే పోరంకిలో ఉంటున్న వెంకటేశ్వరరావును వ్యాపార పార్టనర్ రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆమె తెలిపింది. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనలో ఇరువురు రాజీ పడినట్లు సమాచారం. -
రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీఆర్పీ సిబ్బంది గురువారం విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నంబర్ ప్లాట్ఫాం దక్షిణం వైపు చివరలో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో ఏడు కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అంబాపురానికి చెందిన సందునపల్లి రాంబాబుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పొట్లాలుగా కట్టి నగరంలో అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో చందు అనే వ్యక్తి నుంచి రాంబాబు గంజాయి కొనుగోలు చేసి రైలులో విజయవాడ చేరుకోగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వంశీ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్స్టేషన్లో నమోదైన స్థల వివాదం కేసులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై స్థానిక 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. ఉంగుటూరులోని ఓ స్థలం వివాదంపై తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పీఎస్లో ఈ ఏడాది ఫిబ్రవరి 24న కేసు నమోదైంది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీమోహన్ను పీటీ వారెంట్పై ఆత్కూరు పోలీసులు ఇటీవల స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో వంశీమోహన్ బెయిల్పై దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో గురువారం తుది విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి బి.శిరీష తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు. -
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మొయిన్స్ –2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలోని ఐయాన్ డిజిటల్ జోన్ (కానూరు), శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు), ఐయాన్ డిజిటల్ జోన్ (కండ్రిక), లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (మైలవరం) తదితర కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,488 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉండటంతో ఆయా ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. పృథ్వీశ్వరుడికి అరుణకిరణాల అభిషేకంచల్లపల్లి: మండలంలోని నడకుదురు క్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీబాల త్రిపుర సుందరీ సమేత శ్రీపృథ్వీశ్వరస్వామి ఆరుణ కిరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ బుధవారం సాయంత్రం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. పురాతన ఆలయం కావటంతో స్వామి గర్భాలయం సుమారు ఐదు అడుగుల లోతులో ఉంటుంది. స్వామికి ఎదురుగా నేలమట్టంపై నాలుగు అడుగుల పీఠంతో ధ్వజస్తంభం ఉంది. దానికి ఎదురుగా సుమారు 40 అడుగుల రాజగోపురం, దానికి ముందు ఆరు అడుగుల ఎత్తున్న నందీశ్వరుడు, పైన 12 అడుగుల ఎత్తులో మంటపం ఇలా వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉన్నాయి. ఇన్ని అడ్డుగా ఉన్నప్పటికీ సూర్యకిరణాలు స్వామిని ఎలా తాకుతున్నాయనేది ఆశ్చర్యంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఏటా ఉగాది పండుగ ముగిసిన తరువాత ఒకటి రెండు రోజులు సాయంత్రం వేళల్లో సూర్యుని కిరణాలు స్వామిని తాకుతాయని ఆలయ అర్చకుడు పృథ్వీశర్మ తెలిపారు. రైతుబజారులో మంత్రి మనోహర్ తనిఖీలుఆటోనగర్(విజయవాడతూర్పు): కొద్ది రోజుల నుంచి విజయవాడ ఏపీఐఐసీ రైతుబజారులో అన్ని రకాల కూరగాయలు దొరకడంలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఏపీఐఐసీ కాలనీ లోని రైతుబజారును మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా స్టాళ్లను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. రైతు బజారులో టమాటా సహా పలు రకాల కూరగాయలు లేకపోవడాన్ని గుర్తించి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, జేడీ ఎస్టేట్ అధికా రులు శ్రీనివాసరావు, రమేష్బాబు టమాటా ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వారిద్దరు సరిగా సమాధానం ఇవ్వలేకపోయారు. అన్ని రకాల కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరో సారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
రాష్ట్ర క్రీడా ఖ్యాతిని చాటిన స్కేటర్ కై వల్య
శాప్ చైర్మన్ రవినాయుడు విజయవాడస్పోర్ట్స్: తైవాన్లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్షిప్లో విజయవాడ క్రీడాకారుడు కొప్పవరకు కై వల్య ఐదు పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ సాధించి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు తైవాన్లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల యూత్ ఫ్రీ స్టయిల్, ఇన్లైన్, సోలో డ్యాన్స్, పెయిర్ స్కేటింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, కపుల్ డ్యాన్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కై వల్యను శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు బుధవారం దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అతని క్రీడా నైపుణ్యాన్ని కొనియాడారు. భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల్లో కై వల్య అత్యధికంగా 275.5 పాయింట్లు సాధించి అగ్రగామిగా నిలిచాడని తెలిపారు. తైవాన్, జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ఓవరాల్ చాంపియన్షిప్ సొంతం చేసుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన కై వల్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని యువతకు సూచించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. క్రీడాకారుడు కై వల్యను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి నరేష్శర్మ, భారత ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ప్రదీప్ మాల్వాయ్, ఏపీ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ఆకుల పవన్కుమార్, కోచ్ పి.సత్యనారాయణ అభినందించారు. -
మందుల మాయాజాలం
మందుల్లో మూడు రకాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): మందులోడా ..ఓరి మాయలోడా అని మనం చిన్నప్పుడు ఒక పాట విన్నాం. ఇప్పుడు అది నిజమవుతోంది. మందుల షాపుల్లోకి వెళ్లి మనం ఏం కొన్నా కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. ఆస్పత్రుల్లో కూడా అదే పరిస్థితి. ఒక మందు కొంటే ఎమ్మార్పీపై 50 నుంచి 70 శాతం మార్జిన్ ఉంటుందంటే దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు సైతం తక్కువ ధరకు మందులు ఇచ్చేందుకు జన ఔషధి షాపులు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారే కానీ, జనరిక్ మందులపై ఎమ్మార్పీలను మాత్రం నియంత్రించలేక పోతున్నారు. దీంతో మనం ఏ షాపుకెళ్లినా జనరిక్, జనరల్ మందులను అంటగట్టేస్తున్నారు. ఆ దోపిడీ ఫార్మసీ నిపుణులు సైతం గుర్తించలేనంతగా ఉంటోంది. దీంతో మందులు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు దారుణంగా మోసపోతూనే ఉన్నాడు. నిపుణులు కూడా గుర్తించలేరు మందుల్లో జరుగుతున్న మాయ ఫార్మసీ నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఉంటుంది. మనకు వైద్యులు ఫార్మా మందు రాసినప్పటికీ, ఫార్మసీలో ఇచ్చేది మాత్రం జనరల్ మందే. పేరు మారిందని ప్రశ్నిస్తే మందు ఒకటే, ఆ కంపెనీ స్టాక్ లేదని చెప్పుకొస్తారు. ఇలా మందుల అమ్మకాల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప చర్యలు లేవు. ప్రాణాంతక క్యాన్సర్ మందుల విక్రయాల్లో సైతం పెద్ద ఎత్తున మార్జిన్ ఉంటుంది. వాటిపై కూడా ఎమ్మార్పీని నియంత్రించడం లేదు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎమ్మార్పీ ధరకే వాటిని కూడా అమ్మేస్తున్నారు. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా(సీఎంఎల్)కు వాడే ఇమాటినిబ్(10 బిళ్లలు) ఎమ్మార్పీ రూ.1875 ఉంటుంది. కానీ బయట తెలిసిన వారి వద్ద తీసుకుంటే అవే బిళ్లలు రూ.500కు కూడా ఇస్తున్నారు. ఇలా ప్రాణాంతక మందుల్లో సైతం పెద్ద ఎత్తున దోపిడీ చేసేస్తున్నారు. ఎమ్మార్పీలపై నియంత్రణ ఏదీ? మందుల ఎమ్మార్పీలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైస్ కంట్రోల్బోర్డు పర్యవేక్షిస్తుంది. మందులపై ధరలు ఇష్టారాజ్యంగా ఉంటున్నా బోర్డు నియంత్రించక పోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పే జనరిక్ మందులపై ఎమ్మార్పీ ఎందుకు అంత ఎక్కువ ముద్రిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంతకు అమ్ముతున్నారో అంతే ఎమ్మార్పీ ఇస్తే కొనుగోలు దారుడు మోసపోయే అవకాశం ఉండదంటున్నారు. సాధారణంగా మందులు మూడు రకాలుగా మార్కెట్లో లభిస్తుంటాయి. ఫార్మ, జనరల్, జనరిక్గా మందులు ఉంటాయి. ● మొదటిగా ఫార్మా మందుల అమ్మకాలపై మార్జిన్ తక్కువగా ఉంటుంది. రిటైలర్స్కి మందు, కంపెనీని బట్టి 20 నుంచి 25 శాతం మాత్రమే మిగులుతుంది. దీంతో వీటిని మందుల షాపుల్లో తక్కువగా విక్రయిస్తుంటారు. ● రెండో రకం జనరల్ మందులు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోతున్న మందులు ఇవే. వీటి అమ్మకంపై 50 నుంచి 60 శాతం వరకూ మార్జిన్ ఉంటుంది. దీంతో ఆస్పత్రులతో పాటు, మందుల షాపుల్లో సైతం ఈ మందులే ఎక్కువగా అమ్మకాలు జరుపుతున్నారు. ●మూడో రకం జనరిక్. ఈ మందుల్లో ఎమ్మార్పీపై 80 శాతం వరకూ రాయితీ ఉంటుంది. జన ఔషధి షాపుల్లో అయితే కొంత మేర రాయితీ ఇస్తున్నారు. మామూలు షాపుల్లో అయితే 10 నుంచి 15 శాతం రాయితీపై అమ్మేస్తున్నారు. ● ఈ మూడు రకాల మందులపై ఎమ్మార్పీ ధరలు ఒకేలా ఉండటం గమనార్హం. ఎమ్మార్పీని నియంత్రించని ప్రభుత్వం ఫార్మా, జనరిక్ మందుల ఎమ్మార్పీ ఒకటే దీంతో జనరిక్ మందులు అంటగడుతున్న వైనం ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇదే పరిస్థితి మందుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న దోపిడీ ఇవే నిదర్శనం యాంటీబయోటిక్ ఆగమంటీన్ 625(పది బిళ్లలు) –ఫార్మ, జనరిక్ రెండింటిపైనా రూ.204 ఉంటుంది. ఆస్పత్రులకు ఫార్మా రూ.100కు వస్తుంది. జనరల్ రూ.60కు ఇస్తుంటారు. నొప్పులకు వాడే ఎసెక్లోఫెనాక్ ఎమ్మార్పీ రూ.119.60 ఉంటుంది. ఇవి ఫార్మాలో రూ.40 నుంచి రూ.50కి వస్తుండగా, జనరల్లో రూ.25కి ఇస్తారు. గ్యాస్కు వాడే పాంటాప్ 40ఎండీ ఇంజక్షన్ రూ.56.50 ఎమ్మార్పీ ఉంటుంది. ఇవి ఫార్మాలో రూ.25, జనరల్లో రూ.10కు వస్తుంటాయి. ఇలా కంపెనీని బట్టి వాటి ధరలు మారుతుంటాయి. కానీ మార్జిన్ మాత్రం అంతే ఉంటుంది. ఎమ్మార్పీపై ఎక్కువ అమ్మితేనే చర్యలు మందుల షాపుల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మితే మేము చర్యలు తీసుకుంటాం. కాలం చెల్లిన మందులు విక్రయించినా, ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించినా చర్యలు తీసుకుంటాం. వాటి మార్జిన్ విషయంలో మాకు సంబంధం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాణాంతక వ్యాధులకు పలు రకాల మందుల ఎమ్మార్పీపై నియంత్రణ విధించింది. –కె.అనిల్కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ మండలి -
జంతు సంరక్షణ సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతువుల సంరక్షణ సామాజిక బాధ్యతని, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా సొసైటీ (డీఎస్పీసీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం వర్చువల్గా జరిగింది. తొలుత జిల్లా సొసైటీలో ప్రగతిశీల రైతులు ఎ.శ్రీపద్మ, వి.రవికుమార్ సభ్యత్వానికి సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం జిల్లా పరిధిలో జంతు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వేసవి కార్యాచరణ, వీధి కుక్కలు – జనన నియంత్రణ కార్యక్రమం అమలు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ తదితరాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా సొసైటీ సభ్యుల సమష్టి కృషితో జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం పటిష్ట అమలుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి 10 నుచి 15 కిలో మీటర్ల లోపు జిల్లా ఎస్పీసీఏ యానిమల్ షెల్టర్ (గోశాల) ఏర్పాటుకు ఎకరా స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయంతో అన్ని ఆవాసాల్లోనూ నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు అవసరమైతే యుద్ధప్రాతిపదికన చేసి, వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్, డ్వామా, పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) మార్గదర్శకాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్–2023 ప్రకారం జిల్లాలో వీధి కుక్కల సంతాన నియంత్రణ కార్యక్రమాన్ని (యానిమల్ బర్త్ కంట్రోల్–ఏబీసీ) అమలుచేస్తున్నట్లు తెలిపారు. నెలకు సగటున 1100 ఏబీసీ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 211 కెన్నెళ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 100 కెన్నెళ్ల నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జంతు సంరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, డీఈఓ యు.వి.సుబ్బారావు, నాన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ పాకూరి బాలకృష్ణ, సొసైటీ సభ్యులు గోవింద సాబూ, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీసీఏ సర్వసభ్య సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
దొంగతనం కేసులో మహిళ అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంట్లో పని మనిషి గా చేస్తూ దుర్భుద్ధితో ఆ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బస్టాండ్లోని పోలీస్ ఔట్పోస్ట్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితురాలిని హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ట్రైనింగ్ డీఎస్పీ పావని, సీఐ నాగరాజుతో కలిసి సౌత్ ఏసీపీ పావన్కుమార్ వెల్లడించారు. రాణిగారితోటలోని పాత ఆంజనేయస్వామి గుడి పక్కనే ఉన్న పవన్ సాయి రెసిడెన్సీలో గుంటి సీతామహాలక్ష్మి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. గత 18 నెలలుగా వారి ఇంట్లో బాలాజీనగర్కు చెందిన కటారి భవాని పని మనిషిగా చేస్తోంది. సీతామహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి షిరిడికి వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకుని చూసుకోగా ఇంట్లో ఉండాల్సిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పీఎస్ క్రైమ్ సిబ్బందితో సంఘంటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అనుమానితురాలైన భవానీపై పూర్తి నిఘా ఏర్పాటు చేసి ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఇంటి యజమానులు షిరిడికి వెళ్లడంతో ముందుగానే దొంగిలించిన అదనపు తాళం సహాయంతో యజమాని ఇంట్లోకి వెళ్లి బంగారం, వెండి నగలు దొంగిలించినట్లు ఆమె అంగీకరించింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ వివరించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే చాకచక్యంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న కృష్ణలంక ఎస్ఐ సూర్యనారాయణ, సిబ్బంది ధనలక్ష్మి, సారథినాయక్, ప్రవీణ్కుమార్, సాంబయ్య, బాబూరావులను సీపీ రివార్డులతో అభినందించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే నిందితురాలి అరెస్ట్ ఇంటి పనిమనిషే నేరస్తురాలుగా గుర్తింపు నిందితురాలి నుంచి రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం -
విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్, బీసీబీ కార్య దర్శి ఉమర్అలీ ఆకాంక్షించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంట్రపెన్యూరియల్ మైండ్సెట్ డవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్ల ప్రదర్శన బిషప్ అజరయ్య హైస్కూల్లో బుధవారం జరిగింది. జిల్లాలోని వివిధ జెడ్పీ హైస్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన సబ్బులు, జ్యూట్ సంచులు, వ్యర్థాలతో ఇటుకలు, నీటి శుద్ధి ప్రాజెక్టులను ప్రదర్శించారు. మైనం హుస్సేన్, ఉమర్అలీ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి అవసరమైన ఆలోచనలు, ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జె.భానుకిరణ్ పాల్గొన్నారు. ‘సుజన మిత్ర’తో సమస్యల పరిష్కారంభవానీపురం(విజయవాడపశ్చిమ): పశ్చిమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి సుజన మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఎమ్మెల్యే సుజనచౌదరితో కలిసి భవానీపురంలో ఏర్పాటు చేసిన సుజన మిత్ర కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. సుజన ఫౌడేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 22 డివిజన్లలో కోఆర్డినేటర్లను నియమించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వ్యవస్థను రూపొందించి వారందరికీ ఎలక్ట్రిక్ బైక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, టీడీపీ నాయకులు నాగుల్మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
కేడీసీసీబీ టర్నోవర్ రూ.11,307 కోట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.11,307.14 కోట్ల టర్నోవర్ సాధించిందని బ్యాంక్ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం తెలిపారు. టర్నోవర్ గత సంవత్సరం కంటే రూ.257.32 కోట్ల మేర పెరిగిందన్నారు. బ్యాంకులో షేర్ క్యాపిటల్ రూ.393.70 కోట్ల నుంచి రూ.418.50 కోట్లకు పెరిగిందని వివరించారు. డిపాజిట్లు రూ.3,094.40 కోట్ల నుంచి రూ.3,265.20 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత సంవత్సరం రూ.7,955.42 కోట్ల రుణాలు ఇవ్వగా ఈ సంవత్సరం రూ.8,041.94 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రుణాలు రూ.86.52 కోట్ల మేర పెరిగాయన్నారు. దీంతో బ్యాంకు టర్నోవర్ రూ.11,049.82 కోట్ల నుంచి రూ.11,307.14 కోట్లు చేరిందని వివరించారు. బ్యాంకుకు నికర ఆదాయం రూ.99.27 కోట్లు వచ్చిందని గీతాంజలి శర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకార బ్యాంకు అనుబంధంగా 425 పీఏసీఎస్లలో కంప్యూటరీకరణ చేపట్టగా ఇప్పటి వరకు 314 పీఏసీఎస్లలో 74 శాతం మేర పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నూతనంగా 66 మంది స్టాఫ్ అసిస్టెంట్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. వారికి త్వరలో రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2024 నవంబర్ 26వ తేదీన నాప్కాబ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేడీసీసీ బ్యాంక్ బెస్ట్ ఫెర్ఫార్మిగ్ బ్యాంక్గా నిలిచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని గుర్తుచేశారు. నికర ఆదాయం రూ.99.27 కోట్లు ప్రత్యేకాధికారి గీతాంజలిశర్మ -
నవలంక దీవి సందర్శించిన జిల్లా అధికారులు
ఎంపీటీసీ సభ్యులను అభినందించిన వైఎస్ జగన్ నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ ఎదుట ఉన్న నవలంక మినీ ఐలెండ్ను బుధవారం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రీజనల్ డైరక్టర్ వై.వి.ప్రసన్నలక్ష్మి, కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి సందర్శించారు. నాగాయలంక తహసీల్దార్ ఎం.హరనాఽథ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీవి మ్యాప్ను పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన సర్వే మేరకు 16.75 ఎకరాలు దీవిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. దీవిలో మిగతా పరిధిని కూడా సర్వే చేయాలని భావిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనగా నవలంకలో ఏ విధంగా పర్యాటకాభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మండలంలోని ఎదురుమొండి దీవిలో పర్యటించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా డీఆర్వో చంద్రశేఖరరావు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సమీపంలో గుల్లలమోద వద్ద డీఆర్డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం, ప్రాజెక్ట్ సైట్లను పరిశీలించారు. ఈనెల ఏపీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి వర్ుచ్యవల్గా శంకుస్థాపన చేయునున్నారన్న ప్రచారం నేపథ్యంలో డీఆర్వో ఈ ప్రాజెక్ట్ సైట్ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యాటక అభివృద్ధి ప్రణాళిక అంశాలు పరిశీలన గుల్లలమోద డీఆర్డీఓ కేంద్రం స్థల సందర్శన -
బీబీఏ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
విజయవాడలీగల్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన నూతన కార్యవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేసింది. నగరంలోని సిటీ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో ప్రధాన ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. 2025–2026వ సంవత్సరానికి నూతన అధ్యక్షునిగా అబ్దుల్ ఖుద్దూస్ బాషా (ఏకే బాషా), ఉపాధ్యక్షునిగా పిళ్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె.వి.రంగారావు, జాయింటు సెక్రటరీగా జి.వరాహలక్ష్మి, కోశాధికారిగా ముద్దాడ సత్యనారాయణ, లైబ్రరీ కార్యదర్శిగా కంచర్ల త్రినాథ్కుమార్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా పల్లగాని రవిబాబు, మహిళా కార్యదర్శిగా కొప్పరాపు అనురాధ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి బాషాను తోడ్కొని వెళ్లి చాంబర్లో బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్కు తనను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బార్కి, బెంచికి మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. బార్ అసోసియేషన్లో ఉన్న సమస్యలను తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలతో పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఏపీ హైకోర్టు నూతన అధ్యక్షుడు చిదంబరం మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమానికి స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు చలసాని అజయ్కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, గుర్నాథం, సీహెచ్.మన్మధరావు, సరళా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పది స్పాట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా కేంద్రమైన విజయవాడలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ నగరంలోని బిషప్ అజరయ్య పాఠశాలలో ఈ స్పాట్ వాల్యూయేషన్ జరగనుంది. పదో తరగతి పరీక్షలు గత నెల 17వ తేదీన ప్రారంభమై ఈ నెల ఒకటో తేదీన ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటికే విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి కోడింగ్ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియగానే జవాబు పత్రాల మూల్యాంకనానికి అవసరమైన ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నమైంది. ప్రభుత్వం పది జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పునర్విభజన జరిగిన జిల్లా కేంద్రాల్లోనే నిర్వహించింది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణాన్ని నిర్ణయించారు. గతంలోనూ ఇదే ప్రాంగణంలో స్పాట్ వాల్యూయేషన్ను పాఠశాల విద్యాశాఖ నిర్వహించింది. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియలో భాగంగా స్పాట్ ఉత్తర్వులను ఇప్పటికే ఉపాధ్యాయులకు అందజేశారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. ఒరియంటేషన్ నిర్వహించిన అధికారులు మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులను ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు జారీ చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఉత్తర్వులను ఉపాధ్యాయులకు అందజేసే ప్రక్రియ దాదాపుగా ముగిసింది. జవాబు పత్రాల మూల్యాంగకనానికి సంబంధించి సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను నియమించారు. ఎనిమిది రోజుల పాటు మూల్యాంకనం చేస్తారు. దానికి సంబంధించి బుధవారం స్పాట్ జరిగే ప్రాంగణంలో ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు ఒరియేంటేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న జవాబు పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,129 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. జవాబు పత్రాలు జిల్లా కేంద్రానికి దఫదఫాలుగా వస్తున్నాయి. చివరిగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు ఇప్పడిప్పుడే చేరుకుంటున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు తదితరులు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొంటారు. జిల్లా కేంద్రంలో టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ 9వ తేదీ వరకూ కొనసాగనున్న ప్రక్రియ జిల్లాకు 1.72 లక్షల సమాధాన పత్రాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగరంలోని బిషప్ అజరయ్య హై స్కూల్ ప్రాంగణంలో ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ను నిర్వహిస్తున్నాం. స్పాట్ జరిగే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉపాధ్యాయులందరికీ సమాచారం అందించాం. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ వాల్యూయేషన్లో పాల్గొనున్నారు. – యు.వి.సుబ్బారావు, డీఈఓ, ఎన్టీఆర్ జిల్లా -
రైతుల కంట మున్నీటి ధారలు
రైతుల కంట మున్నేటి ధారలుహద్దులు తెలియడంలేదు వరదలకు పొలాలు మొత్తం ఇసుక మేట వేశాయి. పొలాలు హద్దులు కూడా కనిపించటం లేదు. మా పొలం నుంచి ఇసుక మేటలు తొలగించాలంటే ఎకరానికి రూ.లక్షలు ఖర్చు అవుతాయని అధికారులే చెబుతున్నారు. పొలాల్లో రెండు అడుగులు పైన ఇసుక మేటలు ఉన్నాయి. మా సోదరికి చెందిన రెండు ఎకరాల్లో ఇసుక మేట అలానే ఉంది. – ఎం.అశోక్, రైతు, ముచ్చింతాల ఖరీఫ్ సాగు ఎలా? పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. మా 12 ఎకరాల పొలం ఇసుక మేటతో ఎడారిని తలపి స్తోంది. ఖరీఫ్లో పొలాల్లో పంటలు సాగు చేసుకునేలా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఇసుక తొలగించేందుకు ఎకరానికి రూ.3.70 లక్షల ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కన మా 12 ఎకరాల్లో ఇసుక తొలగింపునకు సుమారు రూ.36 లక్షల ఖర్చవుతుంది. –మల్లెంపాటి సతీష్, రైతు, ముచ్చింతాల ప్రత్యేక నిధులు కేటాయించాలి రైతులు ఖరీఫ్ సాగు చేసుకోవాలంటే పొలాల్లో ఇసుక మేటల తొలగింపునకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో వందల ఎకరాల్లో ఇసుక పెద్ద ఎత్తున మేట వేసింది. రైతులకు సొంతగా పొలాల్లో మేట వేసిన ఇసుక తీసుకునే ఆర్థిక స్థితి లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. –కనగాల రమేష్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు పెనుగంచిప్రోలు: మునేరుకు గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలు పచ్చని పంట పొలా లను ఎడారిగా మార్చి రైతులకు కన్నీరు మిగిల్చాయి. వరదల ధాటికి పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. పచ్చని అందాలు పరిచినట్లుగా ఉండే మాగాణి భూములు ఇసుక మేటలతో ఎడారిగా మారాయి. నీటి ఉధృతికి పొలాల గట్లు కొట్టుకు పోయి హద్దులు కూడా కనిపించటం లేదు. ఇసుక మేటలు తొలగించేందుకు భారీగా ఖర్చవుతుందని, అంత మొత్తం తాము భరించలేమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకం నిధులతో ఇసుక మేటలు తొలగించే పరిస్థితి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జూన్ నెల నుంచి వర్షాలు పడతాయని, అప్పుటికి పొలాల్లో ఇసుక మేటలు తొలగించకపోతే ఖరీఫ్ సీజన్ సాగు చేపట్టలేమని రైతులు పేర్కొంటున్నారు. ఏడు నెలలు కావస్తోంది.. మునేరుకు వరదలు వచ్చి పొలాలు ఇసుక మేట వేసి ఏడు నెలలు కావస్తోంది. నేటి వరకు అధికా రులు, ప్రజాప్రతినిధులు ఇసుక మేటల ఊసే ఎత్తడంలేదు. ఒకవేళ తమంతట తాము తొలగించు కుంటామన్నా అధికారులు ఒప్పు కోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 29న కొండపల్లిలో కలెక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మునేరు వరదలకు 1400 ఎకరాల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరానికి రూ.3.70 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఎకరంలో 400 నుంచి 500 ట్రక్కులు ఇసుక మేట ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఇసుక తొలగించిన తరువాత మట్టితో చదును చేయాలని, అప్పుడే సాగుకు భూములు పనికొస్తాయని, ఈ వ్యవహారం తమకు తలకు మించిన భారమని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో ఇసుక తొలగించలేరు వర్షాకాలం వస్తే ఇసుక మేటలు తొలగించే పరిస్థితి ఉండదు. ఈ లోగా రైతులు తమ పొలాల్లోని ఇసుక మేటలు తొలగించుకునే పరిస్థితిలో లేరు. రైతులు రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇసుక తొలగించాలంటే ఖరీఫ్ సీజన్ వెళ్లిపోతుంది. తమ దయనీయ స్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని రెండు నెలల్లో ఇసుక మేటలు తొలగింపునకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు అంతా మంచి జరిగిందని, మునేరుకు గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన పూడ్చారని గుర్తుచేస్తున్నారు. మునేరు వరదకు గండ్లు పడటంతో పాటు పక్కన ఉన్న పొలాలు ఇసుక మేట వేయటంతో పాటు కోతకు గురయ్యాయన్నారు. అయినా నేటి వరకు గండ్లు పూడ్చేందుకు అంచనాలు అంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు.ఎడారిలా మారిన పంట పొలాలు మునేరు వరదతో పొలాల్లో భారీగా ఇసుక మేటలు ఇసుక మేటలతో రూపుకోల్పోయిన 1400 ఎకరాలు ఇసుక తొలగింపునకు ఎకరానికి రూ.3.7 లక్షల ఖర్చవుతుందని అంచనా తక్షణం నిధులు విడుదల చేయాలని కోరుతున్న బాధిత రైతులు