October 5
-
5 నుంచి వందే భారత్
న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారిగా ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య అక్టోబర్ 5 నుంచి పరుగులు పెట్టనుంది. ఈ మేరకు టికెట్ల బుకింగ్ను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రారంభించినట్లు రైల్వే ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 3న హోంమంత్రి అమిత్ షా వందే భారత్ను ప్రారంభించనున్నారు. కాగా, ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ–కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. ఈ రైలులో న్యూఢిల్లీ నుంచి ఆఖరి స్టేషన్ అయిన శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణించడానికి కనీస చార్జీలు రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలనందిస్తుంది. ట్రైన్ నెం: 22439 న్యూఢిల్లీ–కత్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. వందే భారత్కు మార్గమధ్యలో అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. -
బ్యాంకులకు వరుస సెలవులు
అక్టోబర్ 5 వరకు మధ్యలో 3 రోజులే సేవలు స్తంభించనున్న ఆర్థిక లావాదేవీలు తాడేపల్లిగూడెం : బ్యాంకులకు వరుస సెలవుల కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించే పరిస్థితి ఎదురుకానుంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 5 వరకు మధ్యలో 3 రోజుల మినహా మిగిలిన రోజులు సెలవులు వచ్చారుు. శుక్రవారం బక్రీద్ సందర్భంగా సెలవు కాగా శనివారం నెలలో నాలుగోది కావడంతో కొత్త మార్గదర్శకాల ప్రకారం సెలవు. ఆదివారం వారాంతపు సెలవు. బ్యాంకులు తిరిగి సోమ, మంగళవారాలు పనిచేస్తాయి. సెప్టెంబరు 30, అక్టోబరు ఒకటో తేదీలు అర్థసంవత్సర లెక్కల ముగింపు సందర్భంగా ఖాతాదారులకు సేవలు అందించవు. అక్టోబరు రెండో తేదీన గాంధీ జయంతి సెలవు. అక్టోబరు మూడో తేదీ శనివారం కావడంతో బ్యాంకులు సాయంత్రం వరకు పనిచేస్తాయి. అక్టోబరు 4న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఇలా వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో బ్యాంకుల్లో లావాదేవీలకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి.