Odisha border
-
'దండకారణ్యం' నెత్తురోడింది
చర్ల/ మల్కన్గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్.. దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్గఢ్కు చెందిన సీఆర్పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్గా.. ఛత్తీస్గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్కౌంటర్లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్! కులారీఘాట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు. -
ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే సర్వేశ్వరరావును కాల్చి చంపిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం 60 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో 30 మంది మిలీషియా సభ్యులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
గంజాయి సాగు పై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం
-
ఎన్కౌంటర్లో మావోయిస్టుల సామగ్రి స్వాధీనం
పాడేరు: ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మథిలి పోలీసుస్టేషన్ పరిధిలోని తుల్సి పహద్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రి, తుపాకీలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో ఎస్వోజీ, జీవీ ఎఫ్ పార్టీలు, ఇతర పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించగా ఎదురు కాల్పుల ఘటనలో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మల్కన్గిరి జిల్లా సుదాకొండ గ్రామానికి చెందిన అనిల్ అలియాస్ కిషోర్ అలియాస్ ముఖసొడి (ఏసీఎస్ క్యాడర్, రూ.5 లక్షల రివార్డు) ఆంధ్రా, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీలోని గుమ్మ బ్లాక్లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు సోని ఏసీఎం క్యాడర్లో మావోయిస్టు కీలకనేత ఉదయ్కు ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆమెపైనా రూ.4 లక్షల రివార్డు ఉంది. ఆంధ్రాకు చెందిన విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలానికి చెందిన చిన్నారావు మావోయిస్టు సభ్యుడిగా, మావోయిస్టు మహిళ నేత అరుణ ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి దండకారణ్యంలో గట్టిదెబ్బ తగిలింది. -
గంజాయి జోరు
⇔జిల్లా అంతటా విస్తరిస్తున్న గంజాయి విక్రయాలు ⇔ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి రవాణా..? ⇔పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీస్, ఎక్సైజ్ అధికారులు ⇔తూతూ మంత్రంగా కేసుల నమోదు ఒంగోలు క్రైం: జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం షాపుల జోరు, బెల్ట్ షాపుల హుషారుతో ఉన్న ఎక్సైజ్ అధికారులు గంజాయి విక్రయాలు జిల్లా నలుమూలలా విస్తరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఒంగోలు నగరంతోపాటు మున్సిపాలిటీలు, ప్రధాన మండల కేంద్రాల్లోనూ గంజాయి జోరుగా లభ్యమవుతోంది. అయినా అటు పోలీసులుకాని ఇటు ఎక్సైజ్ అధికారులుకాని సరఫరా అవుతున్న మూలాలపై దృష్టి సారించటంలేదు. రైల్వే రూట్లో... రైల్వే లైన్లు ఉన్న చీరాల–గూడూరు లైన్లోనూ, వినుకొండ–మార్కాపురం లైన్లోనూ విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు గంజాయి విక్రయాలపై కఠినంగా అడిగినప్పుడు మాత్రం నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైల్వే లైన్లలోని రైల్వే స్టేషన్లు ఉండే గ్రామాలు, పట్టణాలతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా అవుతున్నట్టు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా చేతులు తడుపుకొని తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరం నడిబొడ్డున గంజాయి స్వాధీనం.. గత ఏడాది ఒంగోలు నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూములో పేకాట అనుమతి తెచ్చుకొని నిబంధనలకు విరుద్దంగా కోతముక్క ఆడిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్పట్లో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సీవీఎన్ రీడింగ్ రూములోనే కేజీకి పైగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. జిల్లా కేంద్రం ఉన్న క్లబ్లోనే గంజాయి దొరికిందంటే ఇక చాటుమాటుగా ఏస్థాయిలో గంజాయి విక్రయాలు జోరందుకుంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నాలుగేళ్లలో 32 కేసుల నమోదు.. గత నాలుగేళ్లలో ఎక్సైజ్ అధికారులు 32 గంజాయి కేసులు నమోదు చేశారు. 285 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 33 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2013–14లో గిద్దలూరు ప్రాంతంలో సాగుచేసిన గంజాయి తోటపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 2,108 మొక్కలను ధ్వంసం చేశారు. పొలం యజమానిని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 2015లో నాలుగు గంజాయి కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. 37 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2016లో ఏడు గంజాయి కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 700 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకొని దానిని సరఫరా చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసి, రెండు కేసులు నమోదు చేశారు.