old leaders
-
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సంజీవ్ బాల్యన్ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
కురువృద్ధ నేతల రాజకీయం
ప్రపంచంలో కొన్ని దేశాల్లో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులుగా యువత ఎదుగుతుండగా భారత్లో వృద్ధ రాజకీయాలు బలంగా కొనసాగుతుండటం గమనార్హం. తరుణ భారత్కు తరుణ నేతలు ఎంతో అవసరం. ఆస్ట్రియా నూతన చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలు. న్యూజి లాండ్ నూతన ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే. పైగా ఈమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా నేత. ఇక టోనీ బ్లెయిర్, డేవిడ్ కేమరూన్ 43 ఏళ్ల ప్రాయంలో బ్రిటన్ ప్రధానులయ్యారు. 39 ఏళ్ల ఎమాన్యువల్ మెక్రాన్ ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీ సగటు ఆయుర్దాయం కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. రాజకీయ పార్టీల వయో దుర్బలత్వంతో ఓటర్లు విసిగిపోతుండటంతో అలాంటి పార్టీలన్నీ మనగలగడానికి కొత్త రక్తాన్ని తీసుకువచ్చి అధికారం కట్టబెడుతున్నారు. కానీ భారత్ను చూస్తే సీనియారిటీపట్ల, అధికారపు దొంతరపట్ల విధేయతను కొనసాగిస్తూ రాజకీయ పార్టీలు గడ్డకట్టుకుపోయినట్లు కనపడుతోంది. 2014లో, మన ప్రస్తుత పార్లమెంటులో 30ఏళ్ల వయస్సులోపు ఉన్న ఎంపీలు 12 మంది మాత్రమే. ఇక 55 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఎంపీలు 53 శాతంమంది కాగా, ఎంపీల సగటు వయస్సు 50ఏళ్లకు పైబడి ఉంది. (బీజేపీ సగటు ఎంపీల వయస్సు 54 ఏళ్లుకాగా, కాంగ్రెస్ ఎంపీల వయస్సు 57 ఏళ్లు) జనాభాలో యువత శాతం పెరుగుతుండగా (మన యువత సగటు వయస్సు 25 ఏళ్లు), మన పార్లమెంటు సభ్యుల వయస్సు మాత్రం పెరుగుతోంది. తొలి లోక్సభ సగటు వయస్సు 46.5 ఏళ్లు కాగా, 10వ లోక్సభ నాటికి ఇది 51.4 ఏళ్లకు పెరిగింది. ఇక రిటైర్మెంటుకు దగ్గరపడిన రాజకీయ నేతలు వానప్రస్థ జీవితాన్ని జాప్యం చేస్తూ అధికారపు అంచులను పట్టుకుని వేలాడుతున్నారు. ఇతరులు తమ వారసులు ఎదిగి వచ్చేంతవరకు తమ పదవులను అంటిపెట్టుకుని ఉంటున్నారు. దీని ఫలితంగా భారత రాజకీయ పార్టీలలో చాలావరకు కుటుంబ వ్యాపారంలో ఉంటున్నాయి. రాజకీయ సాధికారత మన సమాజంలో పెద్దల ఇలాకాగా మారిపోయింది. అయితే దీంట్లోనూ మినహాయింపులున్నాయి. పలు సందర్భాల్లో, ప్రధానంగా రాజకీయ వారసత్వం కారణంగా కొంతమంది యువనేతలను బాధ్యతాయుత స్థానాల్లోకి ప్రోత్సహిస్తున్నారు. కానీ వీరి సంఖ్య తక్కువే. భారత రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ పురాతన సంప్రదాయం కారణంగా నేను కూడా లబ్ధి పొందాను. అయితే రాజకీయ పార్టీలు భారతీయ యువతకు సభ్యత్వం ఇవ్వడం లేదని దీని అర్థం కాదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తమవైన యువజన, విద్యార్ధి సంఘాలు ఉంటున్నాయి. కానీ రాజకీయాల్లో వారి పెరుగుదల తగ్గుతున్నట్లు కనబడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు 75 ఏళ్లను రిటైర్మెంటుకు తగిన వయస్సుగా నిర్ధారించుకోవడం అభిలషణీయమే అయినా ఈ దిశగా చేయవలసింది చాలానే ఉంది. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఇప్పుడు సంపద, వారసత్వం, పరిచయాలు వంటివాటిపై ఆధారపడి ఉంది. పోతే, యువతను, వ్యక్తులను సాధికారతవైపు తీసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. సెర్బియా ఈ దిశగా 500 మంది యువ రాజకీయ నేతల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం కోసం యువ నేతలను గుర్తించి, ఎంపిక చేయడం ద్వారా యువత రాజకీయ భాగస్వామ్యం చేపట్టడాన్ని వేగవంతం చేస్తున్నారు. యంగ్ పొలిటికల్ లీడర్స్ ప్రోగ్రాం (యుఎన్డీపీ) 2.6 మిలియన్ డాలర్లతో ఒక జాతీయ యువ పౌర విద్యా కేంపెయిన్ను అమలు చేసింది. రాజకీయాల్లో యువ నేతల ఎంపిక దిశగా వారి వైఖరులలో మార్పు తీసుకురావడం, పౌరసమాజ విజ్ఞానాన్ని, కౌశలాలను పెంచడం దీని లక్ష్యం. కెన్యా అయితే 2001 నుంచి యువ రాజకీయ నాయకత్వ అకాడెమీని నిర్వహిస్తోంది. చర్చలు, సలహాలు వంటి అంశాలపై పార్టీలకు అతీ తంగా నిపుణతలను పొందడం, వాటిని తమ తమ పార్టీలలో అమలు చేయడానికి కృషి చేసేలా యువతను తీర్చిదిద్దుతున్నారు. యూనిసెఫ్ 2010, 2013 సంవత్సరాల మధ్యన కోసావోలో ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు నిధులు సమకూర్చింది. 2007–2009 మధ్య కాలంలో ఆసియన్ యంగ్ లీడర్స్ ప్రోగ్రాంకి యుఎన్డిపి ఆతిథ్యమిచ్చింది. జాతీయ, ప్రాంతీయ వర్క్షాపుల సమ్మిశ్రణ ద్వారా యువ ఆసియా నేతల్లో నాయకత్వ కుశలతలను పెంపొందించడం దీని లక్ష్యం. ఇలాంటి కార్యక్రమాలతోపాటు వ్యవస్థాగత జోక్యం కూడా తగువిధంగా తోడ్పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాలు (మొరాకో, పాకిస్తాన్, కెన్యా, ఈక్విడార్ వగైరా) తమ చట్టసభల్లో యువనేతలకు నిర్దిష్టంగా చోటు కల్పిస్తున్నాయి. జాతి, కుల ప్రాతిపదిక బృందాలకు రిజర్వేషన్లు అందిస్తుండగా యువతకు వాటిని ఎందుకు కల్పించకూడదు? ఉదాహరణకు ఈక్వడార్, ఎల్సాల్వడార్, సెనెగల్, ఉగాండా, బురుండి వంటి ఇతర దేశాలు కూడా అన్ని చట్టసభల ఎన్నికలకు కనీస వయో పరిమితిని 18 ఏళ్లకు కుదించాయి. బోస్నియాలో ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఆధిక్యత రాకపోతే అలాంటి స్థానాలను పోటీచేసిన వారిలో పిన్న వయస్కులకు కేటాయించాలని ఎన్నికల చట్టంలోని అధికరణం 13.7 ద్వారా నిర్దేశించింది. 18 ఏళ్ల వయసుకొస్తున్న యువత బాధ్యతలు నిర్వహించేలా ప్రోత్సహించడానికి ఎల్సాల్వెడార్ తన పాఠశాలల్లో కేంపెయిన్లు నిర్వహిస్తోంది. ఇక కెన్యా 2006లో జాతీయ వయోజన విధానాన్ని, 2009లో జాతీయ యువజన చట్టాన్ని ప్రకటించింది. ఈ రెండూ ఎన్నికల్లో మరింతగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్నాయి. వీటికి అదనంగా మన రాజకీయ వ్యవస్థ యువత రాజకీయ సాధికారతకు అనేక అవకాశాలను ప్రతిపాదించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో అనుభవం కలిగిన వారు నేతలుగా ఎదగడానికి వారికి మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి. ఇలాంటి నేతలు కాస్త అనుభవం పొందాక రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయి చట్టసభల్లో స్థానాలకు కూడా పోటీ పడగలరు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఇలాగే ఎదుగుతున్నారు. కానీ అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యం క్షీణించడం, మునిసిపల్, పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్ను వంతుల ప్రకారం మార్చడం, ఎన్నికల ఖర్చు పెరగడం వంటివి యువనేతల ఆశలకు అవరోధాలను కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ వంతుగా రాజకీయ నేపథ్యంలేని యువతకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వృత్తి నిపుణులను రప్పించడానికి చొరవ తీసుకోవాలి. తరుణ భారత్ ఏం కోరుకుం టోంది, తమ ఆశలు, ఆకాంక్షలు ఏమిటి అనే అంశంపై యువ రాజకీయ నేతలకు అవగాహన ఉంటుంది. ఇలాంటి నేతలకు ప్రతిభ ఆధారంగా ఎదిగించే విషయంలో రాజకీయ పార్టీలు తగు చోటు కల్పించాలి. - వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, fvg001@gmail.com -
వృద్ధ నేతలు.. వ్యర్థ సిద్ధాంతాలు
బైలైన్ ఈ విషయం చాలా కాలంపాటే అత్యంత హాస్యభరిత కథనంగా నిలిచి తీరుతుంది. కోల్కతాకు ఆనుకుని ఉన్న బిధాన్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 3న జరిగాయి. ఇప్పుడు పూజ్యులుగా పిలవాల్సినంత పెద్దవారైన అసిమ్ దాస్గుప్తా ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మేయర్ అభ్యర్థి. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలో ఆయన పాతికేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఇంత ఘోరంగా పతనం చెందడం ఆషామాషీ విషయం కాదు. వాస్తవానికి ఇది, పార్టీ ఆదేశాలకు వ్యక్తి అహం అడ్డంకి కాకుండా చేయడంలో సీపీఐ(ఎం)కున్న ఖ్యాతికి తగినదే. అంతటి గొప్ప ఆర్థిక మంత్రిని ఒక నగర శివారు మేయరు పదవికి ప్రయత్నించమని పార్టీ ఆదేశిస్తే, శిరసావహించాల్సిందే. అసలు చమత్కారం ఇది కాదు. అది మరో చోటుంది. కామ్రేడ్ దాస్గుప్తా పాత పద్ధతిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ‘‘ఓటు వేయడం మరచిపోకండి. ఉదయాన్నే ఓటు వేసే యండి... ఎందుకంటే ఆ సమయంలోనే టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) గూండాల సమస్య, విచ్ఛిన్నకాండ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం’’ అని ఆయన పౌరులకు చెబుతున్నారని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనం. ‘మీ ఓటును మీరే వేయండి’ అనే కరపత్రాన్ని కూడా ఆయన పంచుతున్నారు. నీవు నేర్పిన విద్యయే... 1977-2011 మధ్య అంతే లేదన్నట్టుగా సాగిన వామపక్ష పాలనలోని పశ్చిమ బెంగాల్లో నివసించిన వారెవరైనాగానీ ఇది చూసి విరగబడి నవ్వాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ మార్క్సిస్టులు సరిగ్గా ఈ పద్ధతిలోనే అదనపు ఓట్లను సంపాదించి విజయానికి హామీని సాధించేవారు. రాష్ట్ర పోలీసుల రక్షణతో వారి క్యాడర్లు గూండాలకుండే ఆత్మవిశ్వాసంతో తమ పట్ల వ్యతిరేకత ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకునే వారు. పోలింగ్ కేంద్రాల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులు తమతో కుమ్మక్కు కాకపోతే వారిని భయపెట్టేవారు, వేధించేవారు. మూలనపడ్డ కుండ, ఉడుకుతున్న కూర దాకను వెక్కిరించడం ఎప్పుడూ తమాషాగానే ఉంటుంది. సీపీఐ(ఎం) ఇతరుల విషయంలో ఏం చేసిందో సరిగ్గా అదే మమతా బెనర్జీ సీపీఐ (ఎం) విషయంలో కూడా చేస్తోంది. ఎన్నికలు న్యాయంగా జరగాలని బెంగాల్ మార్క్సిస్టులు సూచించడం ఊహించడానికి కూడా దాదాపు అసాధ్యం. కానీ ఓటమి అద్భుతాలను చేయగలుగుతుంది. మిమ్మల్నది వివేక వంతులను సైతం చేయవచ్చు. అధికారం కోల్పోయి నాలుగేళ్లయి పోయినా ఇంకా ఎందుకు ఓడిపోయారో బెంగాల్ మార్క్సిస్టులకు అర్థం కాకపోవడమే విచిత్రమైన విషయం. పాత సిద్ధాంతం, వృద్ధ నేతలు.. అని ఒక్క ముక్కలో దాని ఓటమికి కారణం ఏమిటో చెప్పేయొచ్చు. వామపక్షవాదులు యువతకు చేరువయ్యే సమీకరణాన్ని పునరుద్ధరించగలిగే విధంగా తమ తత్వశాస్త్రాన్ని తిరిగి కనిపెట్టలేదు లేదా చెల్లుబాటయ్యే తేదీ ఎన్నడో దాటిపోయిన పాత నేతలను తప్పించనూ లేదు. అసిమ్ దాస్గుప్తాకు ఇప్పుడు 69 ఏళ్లు. మరో విధంగా చెప్పాలంటే, ఆర్థిక మంత్రిగా నియమితులయ్యేనాటికి ఆయనకు 40 ఏళ్లు. బిధాన్నగర్ మేయర్ అభ్యర్థిగా ఒక 40 ఏళ్ల నేతను సీపీఐ (ఎం) ఎందుకు నిలపలేకపోయింది? పార్టీలో సమర్థవంతులైన యువ నేతలు ఏమంత మంది లేకపోవడం వల్లనేనా? ఆ పార్టీ ఇంకా ‘‘సోవియెట్ పొలిట్బ్యూరో మనస్తత్వం’తో బాధపడుతోందా? అత్యంత ప్రభావశీలుర బృందంలోకి ఒక్కసారి చేరారంటే, ఆ భగవంతుడు తాఖీదులు పంపేవరకు అందులో ఉండాల్సిందేననే ధోరణిని సోవియెట్ పొలిట్బ్యూరో మనస్తత్వం అని పిలుస్తారు. మార్క్సిస్టు ఆదర్శ నేత స్టాలిన్ భగవంతుడ్ని నమ్మేవాడు కాదు. క్రమానుగతమైన ప్రక్షాళన ద్వారా ఆయన ఆ సమస్యను పరిష్కరించాడు. కానీ బెంగాల్ స్టాలినిస్టులకు ఆ అవకాశం లేదు. మార్క్సిస్టులకు కాలదోషం పట్టిపోయిందా? స్థానికమైన ఒక మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ప్రస్తుతం అర్ధ అవనతమై కుంటుతున్న ఎర్రజెండా మాత్రం అలసిపోయిన వృద్ధుల నేతృత్వంలో రెపరెపలాడే అవకాశం తక్కువ. భారత ఎన్నికల సమీకరణల్లో వామపక్షవాదులు ఖాళీ చేసిన స్థలాన్ని వారు ఎన్నటికైనా తిరిగి సంపాదించుకోగలరా? మన దేశంలోని బూట కపు మార్క్సిజం, అంతర్జాతీయ మార్కిజం అంతగా కాలదోషం పట్టిపో యిందా? ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. చిట్టచివరి కమ్యూనిస్టు స్థావరాలు కూడా కూలిపోయాయి. చైనా కమ్యూనిస్టులకు సమానత్వ సాధన ఉద్దేశాలున్నాయేగానీ, పాత, ఫార్ములా తరహా పరిష్కారాల ద్వారా సౌభా గ్యాన్ని సృష్టించగలమని అది ఇకనెంత మాత్రమూ విశ్వసించడం లేదు. క్యూబాకు చెందిన రావుల్ క్యాస్ట్రో దేదీప్యమానమైన మతం వెలుగును చూడటం ప్రారంభించారు. పోప్ ఫ్రాన్సిస్ను ఆయన తమ దేశానికి ఆహ్వానించి, తాను కూడా తిరిగి మత విశ్వాసిగా మారగలననే సంకేతాన్ని చ్చారు. మార్క్సిజం మూలస్తంభాలు కుప్పకూలిపోగా, సదుద్దేశాలు మాత్రం మిగిలాయి. బెంగాల్ మార్క్సిస్టుల దీర్ఘాయుర్దాయం రహస్యం సిద్ధాంతంలో కాదు, పార్టీ యంత్రాంగంలో ఉంది. వారి పాలిటి శని దేవత మమతా బెనర్జీ దీన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఆ పార్టీ యంత్రాంగంలోని తగినన్ని భాగాల ను లాక్కుని, తమ సొంత యంత్రాంగానికి తగిన విధంగా మలచి వాటిలో ఇముడ్చుకున్నారు. అదేసమయంలో, వామపక్షాలతో ఎలాంటి సంబంధ మూలేని రాజకీయ పార్టీలు పేదరికం సవాలును ఎదుర్కొన్నాయి. అవి దాన్ని ఏదో అంతర్జాతీయ విప్లవ పథకంలో భాగంగా గాక జాతీయ కార్య క్రమంగా చూశాయి. బెంగాల్లో పేదల మద్దతు ఉన్నది కాబట్టే మమతా బెనర్జీ గెలిచారు. కూలిన కోట మూడున్నర దశాబ్దాలుగా మార్క్సిస్టులు బెంగాల్ను తమ కోటగా చూశారు. అది చాలా పటిష్టమైన కోటే. అయినా, కోట తలుపులు బయటకు తెరుచుకుంటాయి కూడానని వామపక్షవాదులు ఒక్కసారైనా అనుకోకపో వడమే విచిత్రం. సురక్షితమైన ఆ స్థావరం నుంచి తమ రాజ్యం లేదా భావ జాలం విస్తరించగలదని మాత్రమే అనుకున్నారు. అందుకుబదులుగా వారు తమకు తామే తలుపులు మూసేసుకుని, తలపొగరుతో కూడిన స్వీయ సంతృప్తితో ఏకాంతవాసాన్ని గడిపారు. వ్యక్తులలాగే పార్టీలు కూడా చాలా కారణాలతో మంచాన పడతాయి. సమంజసత్వాన్ని కోల్పోవడం వల్ల పలు పార్టీలు అకాల మరణం పాల య్యాయి కూడా. భారత వామపక్షం మరణ వార్తను లిఖించేటప్పుడు అది సంతృప్తితో నిర్లక్షంగా ఉండటం వల్ల చనిపోయిందని రాయాల్సి ఉం టుంది. అది హత్య కాదు, ఆత్మహత్య నిజం. కోలుకోవడానికి దానికి సమ యం మించి పోయిందా? లేదు. కానీ దానికి డాక్టర్ అవసరం లేదు. కావా ల్సిందల్లా అద్భుతం. కానీ అద్భుతాలు జరగాలంటే భగవంతుడు అవస రం. వామపక్షం భగవంతుడ్ని అంగీకరించకపోతే పోనీ, అది కనీసం భగ వంతునికి భిన్నమైన దైవదత్తమైన తండ్రినైనా(గాడ్ ఫాదర్) ఆశ్రయించి అందుకు ప్రయత్నించాలి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
ముసలోళ్లకి దసరా పండుగ!
-
'రాజకీయ భారతం' లో కుర వృద్ధులు వీరే...