palavalasa rajasekharam
-
పాలవలస కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
మన్యం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీశ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు.నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.పాలకొండ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలుత విశాఖపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కాసేపు జగన్ చర్చించారు.పాలసవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది. సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. వైఎస్సార్తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు. ఆపై వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె. -
శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైఎస్సార్సీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.పాలవలస కన్నుమూతఇటీవల, వైఎస్సార్సీపీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం (81)అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
రాజకీయ కురువృద్ధుడు పాలవలస కన్నుమూత
వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం (81) సోమవారం రాత్రి 7.30 గంటలకు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగృహం పాలకొండలో శ్వాసకు సంబంధించి సమస్య ఎదురుకావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని జెమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.దివంగత సీఎం వైఎస్సార్తో అప్పట్లో నేరుగా మాట్లాడే వ్యక్తి పాలవలస. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ కాగా, ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. సతీమణి పాలవలస ఇందుమతి రేగిడి జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ పరామర్శ రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. -
వైఎస్సార్సీపీకే అత్యధిక ‘ప్రాదేశిక’ స్థానాలు
వంగర, న్యూస్లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. బుధవారం శివ్వాం గ్రామానికి చెందిన టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, శివ్వాం సర్పంచ్ ఉదయాన మురళీకృష్ణ, కొవగాన స్వామినాయుడు, కలమట రామయ్య, కిమిడి తవిటినాయుడు, కర్రి తాతబాబు,కర్రి అప్పలనరసింహులు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండలంలోని ఎం.సీతారాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పాలవలస రాజశేఖరం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తలగాం నుంచి పోటీ చేస్తున్న కిమిడి కనకమహాలక్ష్మిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, జెడ్పీటీసీ అభ్యర్థి ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, మండల కన్వీనర్ కె. సుదర్శనరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు మజ్జి వెంకటనాయుడు, సర్పంచ్లు కె.సన్యాసినాయుడు, గణేష్ బెనర్జీ, పి.రామకృష్ణ, జి.రామకృష్ణ,కె.గోవిందరావు పాల్గొన్నారు.