panakala swami
-
పానకాలస్వామిని దర్శించుకున్న గవర్నర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన గవర్నర్ సతీసమేతంగా మంగళగిరి వెళ్ళి పానకాలస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగత పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు. -
పానకాల స్వామిని దర్శించుకున్న భన్వర్లాల్
మంగళగిరి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల నర్సింహాస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం మంగళగిరి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో భన్వర్లాల్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డీఆర్వో, ఆర్డీవో, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.