breaking news
Parvathipuram manyam District News
-
ఏఓబీలో విస్తృత దాడులు
● 5400 లీటర్ల పులిసిన బెల్లం, ● 180 లీటర్ల నాటు సారా స్వాధీనంకురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బి.జీవన్ కిశోర్, విజయనగరం వారి ఆధ్వర్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సంయుక్త దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలైన కెరడ, వలవ గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించగా సారా తయారీకోసం నిల్వ ఉంచిన 5400 లీటర్ల బెల్లం ఊట, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 180 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ గంగాధర్, రాజేశ్వరి, కురుపాం ఎకై ్సజ్శాఖ ఎస్సై రాజశేఖర్ , రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్శాఖ సిబ్బంది పాల్గోన్నట్లు తెలిపారు. సారాపై సరిహద్దుల్లో నిరంతర నిఘా పెడుతున్నామని ప్రజలు కూడా స్పందించి సారా రవాణా, విక్రయాలు చేసేవారి వివరాలను ఈ క్రింది నంబర్ –6302936599కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్గా శాన్వి
● విజయనగరంలో ఆంధ్ర జట్టుతో తలపడనున్న హైదరాబాద్ జట్టుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని రెల్ల గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్–15 వన్ డే ట్రోఫీ 2025–26 హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికై ంది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు విజయనరంలోని విజ్జీ స్టేడియంలో 2026వ జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుతో తలపడనుంది. ఈమేరకు రెల్ల గ్రామానికి చెందిన శాన్వి తండ్రి పత్తిక ప్రవీత్ రంజీ ప్లేయర్ కావడంతో హైదరాబాద్లో ఉంటూ..తన కుమార్తె శాన్వి కూడా క్రికెట్లో ప్రతిభ చూపేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి పోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న శాన్వి ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్) వేదికగా కోచ్ సాలాం బయాష్ అలియస్ తిలక్ వర్మ ఆధ్వర్యంలో రెండున్నరేళ్లుగా పలు బాలికల క్రికెట్ పోటీల్లో అండర్–15 విభాగంలో దేశ, విదేశాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొని పతిభకనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఉమెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్, సెలక్టర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఆమెను ఎంపిక చేశారు. ఆమె కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోటీల్లో ఉత్తమంగా రాణించాలని ప్రోత్సహించారు. -
ఆలయంలో చోరీ కేసు ఛేదన
● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● రూ.9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనంపార్వతీపురం రూరల్: సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ మిస్టరీని సీతానగరం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో గల ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, హిరమండలానికి చెందిన సవర సూర్యం వృత్తిరీత్యా దొంగలు. గతంలో వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, బయటకు వెళ్లాక పెద్ద మొత్తంలో సొత్తును అపహరించాలని పథకం రచించారు. కటకటాల నుంచి విడుదలైన తర్వాత తమ పాత బుద్ధిని పోనిచ్చుకోకుండా, నవంబరు 1వ తేదీ రాత్రి లచ్చయ్యపేట ఆలయంలో చొరబడి నగలను దోచుకెళ్లారు. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు డిసెంబరు 7న బొబ్బిలి పోలీసులు వేరే కేసులో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా లచ్చయ్యపేట చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుల అంగీకార నివేదిక ఆధారంగా సీతానగరం పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. జోగింపేట గ్రామ శివారులో నిందితులు దాచి ఉంచిన సుమారు 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల 400 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.10.75 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురవగా, రూ.9.40 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేశారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై ఎం.రాజేష్ పోలీసు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు చేపట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాతా శిశుమరణాల కట్టడికి పటిష్టంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో మాతా శిశు మరణాల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేలా ‘102’ 108’ వాహనాలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తక్కువ బరువుగల శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మాతా శిశుమరణాలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పి.భాస్కరరావు, డీసీహెచ్ఓ ఎన్.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన యువకుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటేష్(35) మంగళవారం సాయంత్రం అత్తవారికి సంబంధించి విజయనగరంలోని జూట్మిల్లు వద్ద గల పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ వారికి సహాయం చేసి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామానికి 11.45గంటలకు బైక్పై వస్తున్న సమయంలో చిన్నాపురం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో స్పృహ కోల్పోయి పక్కకు పడిపోయాడు. ఈ విషయాన్ని స్ధానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పద్మనాభం మండలం పోలీసులు కేసు నమోదుచేశారు. భీమిలి సీహెచ్సీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహన్ని స్వగామం కొత్త భీమసింగికి తరలించారు. పావుగంటముందే భార్యకు పోన్ మృత్యువాత పడడానికి పావుగంట ముందే వెంకటేష్ భార్యకు ఫోన్ చేశాడు. ఇంతలోనే భర్త మృతిచెందాడన్న విషయం తెలియడంతో భార్యతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు వెంకటేష్కు భార్య సూర్యకళ ఇద్దరు కుమార్తెలు గాయత్రి(11),యోగితాశ్రీ(10), తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. తండ్రి నాగరాజు ఇటీవల పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు. -
గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు
● ఒడిశా నుంచి అక్రమంగా దిగుమతి ● ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు పార్వతీపురం: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను ఆహార భద్రత చట్టం కింద 2006లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అయినా పట్టణాలనుంచి పల్లెల వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యాపారులు నిబంధనలను పక్కన పెట్టి పక్క రాష్ట్రం ఒడిశా నుంచి పట్టణాలకు సరఫరా చేసుకుని అక్కడి నుంచి మండలాలకు, పల్లెలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేతులు మారేకొద్దీ వాటి ధరలు కూడా అమాంతం పెంచి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ విక్రయాలు యథాతథంగా సాగుతున్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా, పాన్పరాగ్, ఖైనీ ప్యాకెట్లను రహస్యంగా విక్రయిస్తూనే ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెస్తున్న ముఠా.. స్థానికంగా కొంతమంది వ్యాపారుల అండదండలతో యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ తరచూ పలువురు పట్టుబడుతున్నా..విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పార్వతీపురం నేడు గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారింది చడీచప్పుడు లేకుండా విక్రయాలు పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, బడ్డీ దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు, ఖైనీ ప్యాకెట్లు చడీచప్పుడు లేకుండా కూరగాయల బుట్టలు, బస్తాలు, చిన్న చిన్న సంచులలో భద్రపరుచుకుని విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీ చేసే సమయంలో కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే పప్పుధాన్యాల బస్తాల్లో, కూరగాయల బుట్టల్లో భద్రపరుస్తున్నారు. గుట్కాలకు అలవాటుగా మారిన వారు అధిక ధరలు పెట్టి వాటిని కొంటూనే ఉన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్న జనం పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సైతం నిషేధిత పొగాకు ఉత్పత్తులను తిని పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు ఖైనీ, గుట్కాలను తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మానిక్చంద్, డీలక్స్, మిరాజ్, పాన్పరాగ్, రాజాఖైనీ, ఖైనీ వంటి బ్రాండ్లకు చెందిన గుట్కాలు జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలించే బండిళ్లలో తీసుకువచ్చి ఒక్కో ప్యాకెట్ను రూ.15 నుంచి రూ.25వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులు గుట్కా తింటే నోటి నుంచి జీర్ణవ్యవస్థ వరకు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దానివల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. కేన్సర్, గుండెజబ్బులు, నోటి కేన్సర్, గొంతు కేన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. పళ్లు అరిగిపోయి గారపడతాయి. నాలుక రుచి మొగ్గలు నశిస్తాయి. వాటి వల్ల ప్రాణనష్టం కూడా జరిగే ఆస్కారం ఉంది. – డా.యాళ్ల వివేక్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం -
19నెలల పాలనలో.. రూ.2.93 లక్షల కోట్లు అప్పు
● కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు ● లక్షలాది పెన్షన్ల తొలగింపు ● ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ)కి తూట్లు ● సీఎం చంద్రబాబు ఘనత ఇదే.. ● మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర సాలూరు రూరల్: చంద్రబాబునాయుడు 19 నెలల పాలనలో రూ.2లక్షల 93 వేల కోట్లు అప్పు తప్ప అభివృద్ధి కనిపించడంలేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరులో స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మంచి ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం మానుకొని ప్రజలనోట మంచి ప్రభుత్వం అని పలికించుకునేలా పాలన సాగించాలని హితవుపలికారు. అధికారుల లెక్కల ప్రకారం గత ప్రభుత్వం సుమారు 66 లక్షల పెన్షన్లు ఇచ్చిందని, ప్రస్తుతం 62 లక్షల మందికే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతేనే భార్యకు పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. భర్త చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్యానికి లేకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పి 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్ మంజూరు చేయకపోవడం సమంజసం కాదన్నారు. 2025 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, విద్యుత్ చార్జీలు పెంచడం, రైతుకు యూరియా లభించకపోవడం, ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడంతో పాటు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి అమలుకునోచుకోలేదని, కనీసం 2026 సంవత్సరంలోనైనా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు. సీతంపేట: ఐటీడీఏ డిప్యూటీ ఈవోగా మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల హెచ్ఎం పాలక నారాయుడుకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు ఉద్యోగవిరమణ చేయడంతో ఆ స్థానంలో నారాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
జిల్లాలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఏనుగుల బారినపడి 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో రైతులు పంటలను కోల్పోయారు. కుంకీలు తెస్తామని.. ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని గత ఏడాదంతా పాలకులు హామీలిస్తూనే గడిపేశారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అంటున్నారు. ఈ సారైనా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. పార్వతీపురం: పీఆర్టీయూ రాష్ట్ర క్యాలెండర్ ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం కలెక్టర్ కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించా రు. అనంతరం పీఆర్టీయూ నాయకులు కలె క్టర్కు ముందస్తుగా నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి.తవిటినాయు డు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, టి.తాతబాబు, జి.శశికుమార్, రామినాయుడు పాల్గొన్నారు. పాలకొండ: మండలంలోని నాగావళి నదితీరంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై బుధవా రం తెల్లారుజామున అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ ఎం.రాంబాబు తొలుత అంపిలి గ్రా మం వద్ద ఉన్న ఇసుక ర్యాంపును తనిఖీ చేశా రు. నాటుబళ్లతో ఇసుక తరలిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం నదీ తీరంలో తనిఖీలు చేపట్టారు. మండలంలో అట్టలి సమీపంలో అక్రమంగా కంకర తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నదీతీర గ్రామాల్లో ఉన్న ఇసుక ర్యాంపులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి వేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రూ. 9,45,439 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దీనిలో కోదండ రామాలయం నుంచి రూ.23,229 సమకూరినట్లు వివరించారు. దేవదాయశాఖ పాలకొండ డివిజన్ సీఐ ఎస్.రామారావు పర్యవేక్షణలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించామని చెప్పారు. 2025 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు లెక్కించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకుడు అప్పలాచార్యులు, టీటీడీఎస్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కాలగమనం గిర్రున తిరిగింది.. మరో ఏడాదిని తనలో కలిపేసుకొంది. మదిలో జ్ఞాపకాల దొంతరలను పదిలపరుచుకుంటూ 2025 కనుమరుగైంది. క్యాలెండర్లో చివరిపేజీ చిరిగిపోయింది. కొంగొత్త ఆకాంక్షలు.. కోటి ఆశలతో మరో నవ వసంతం మన ముందుకొచ్చింది. అలుపెరగని బా టసారిలా! గతమిచ్చిన విజయాలు సోపానాలుగా .. వైఫల్యాలు గుణపాఠాలుగా స్వీకరిద్దాం.. భవిత కు బంగారు బాటలు పరుస్తూ, లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం.. నూతన సంవత్సరం 2026ను సరి కొత్తగా ప్రారంభిద్దాం... ఆనందంగా, సగర్వంగా!! గతమిచ్చిన విజయాలు అక్కడితో ఆగిపోకూడదు. కొత్త సంవత్సరంలోనూ కొనసాగాలి. పదో తరగతి పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. వరుసగా మూడేళ్లు ప్రథమ స్థానంలో నిలిచింది. మన ప్రభుత్వ బడుల పిల్లలు భళా అనిపించుకున్నారు. అదే ఒరవడి కొనసాగించాలి. అంతకుమించిన ప్రణాళికలతో ముందుకు సాగాలి. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 187 ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులు 9,149 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 36 ప్రైవేట్పాఠశాలల్లో 1,700 మంది విద్యార్థులున్నారు. మరోసారి వీరంతాజయకేతనం ఎగురవేయాలి. విజయీభవ! కలెక్టర్గా డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి.. జిల్లాలో వినూ త్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన చేపట్టిన ‘ముస్తాబు’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కురుపాం పచ్చకామెర్ల ఘటనలో వందలాదిమంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెబుతున్నారు. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ.. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం సాధించేలా.. జ్వరాలు, మరణా లు తగ్గేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సి ఉంది. పౌష్టికాహార లోపాన్ని నివారించాలి. పాఠశాలలు, వసతిగృహాల్లో మెనూను సక్రమంగా అందించాలి. ఏళ్లు గడుస్తున్నా గిరిజనుల తలరాత మారడం లేదు. డోలీల మోతలు ఆగడం లేదు. అనారోగ్య సమస్య వచ్చినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా డోలీల ద్వారానే కొండకోనలు దిగాలి. నదులు, వాగులు దాటాలి. మార్గమధ్యంలోనే ప్రసవాలు.. సకాలంలో వైద్యం అందక ఆగిపోయిన ప్రాణాలెన్నో. జిల్లాలోని 15 మండలాల్లోనూ పీహెచ్సీల్లో వైద్యం పడకేసింది. జ్వరాలు, ఇతర రోగాలతో సర్కారు వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. సరైన వైద్యసదుపాయాలు పేదలకు అందడం లేదు. జిల్లా ఆస్పత్రి నుంచి రిఫరల్స్ పెరుగుతున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభమయ్యాయి. దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయిన తర్వాత.. ప్రభుత్వం మారడంతో అవి కాస్త పడకేశాయి. ప్రభుత్వ వైద్యకళాశాల పూర్తిగా అటకెక్కింది. పీపీపీ విధానమంటూ చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిస్థితి మారాలి. వైద్యం ప్రజల చేరువ కావాలి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అనేకం. వాటి బాగోగులను గతేడాదంతా పట్టించుకున్న దాఖ లాలు లేవు. తోటపల్లి.. నిర్వహణ లేక, శివారు భూములకు నీరివ్వలేకపోతోంది. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలకు 2008లో ఏర్పాటు చేసిన షట్టర్ల నిర్వహణను గాలికొదిలేశారు. కాలువ సామర్థ్యం 414 క్యూసెక్కులు. పట్టర్లు పాడవడంతో నీరు వృథాగా పోతోంది. జంఝావతి జంఝాటం అలానే ఉంది. ఒడిశాతో చర్చలు జరిపి, పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ఇక్కడే ఈతకు దిగి, ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడిగెడ్డ నుంచి వట్టిగెడ్డ అనుసంధానం పనులు ముందుకు కదలలేదు. ఇది పూర్తయితే సుమారు 600 ఎకరాలకు నీరందుతుంది. మిగులు జలాలు వట్టిగెడ్డకు చేరుతాయి. కురుపాం మండలం గుమ్మిడిగెడ్డ జలాశయం ద్వారా 3,100 ఎకరాలకు సాగునీందించాల్సి ఉంది. మరమ్మతులు జరగకపోవడంతో ప్రస్తుతం 1,500 ఎకరాలకే అందుతోంది. వెంగళరాయ సాగర్, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకాలం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉన్నచోట వంతెనల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. వరదల సమయంలో ఆవల ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. సాధారణ రోజుల్లోనూ పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. పాచిపెంట, కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, సీతంపేట, భామిని, సాలూరు, సీతానగరం ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రవాహానికి బలైన ప్రాణాలు అనేకం ఉన్నాయి. పూర్ణపాడు–లాభేసు వంతెనకు చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రహదారులంటూ గతేడాది మొదట్లో హడావిడి చేశారు. కొద్దిరోజులకే అవన్నీ రాళ్లు తేలాయి. జిల్లాలో ఏ మూల చూసినా రహ‘దారిద్య్రం’ కనిపిస్తోంది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలి. జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది మండలాల్లో ఉన్న గిరిజనుల బాగోగులను పట్టించుకునే వారే కరవయ్యారు. గ్రామాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. గత వైఫల్యాలను మరిచిపోయి.. నూతన వసంతంలోనైనా కొత్తగా మొదలు పెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. జిల్లాలో 3.34 లక్షల ఎకకరాల్లో సాగు భూమి ఉంది. ఇందులో 2.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను పండిస్తున్నారు. గత ఏడాదంతా అన్నదాత తీవ్ర క్షోభను ఎదుర్కొన్నాడు. ఖరీఫ్ సీజన్లో సకాలంలో ఎరువులు, విత్తనాలు, యూరియా అందక అవస్థలు పడ్డాడు. మధ్యలో అకాల వర్షాలు, తుపాన్లు ముంచాయి. చివర్లో వచ్చిన మోంథా తుపాను కారణంగా 732 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పరిహారం ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. పంట నష్టంలో నిబంధనలు శరాఘాతంగా మారాయి. అన్నదాత సుఖీభవ నిధులు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో పెట్టుబడికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. రెక్కల కష్టంతో సేద్యం చేసినా.. చివరికి వచ్చేసరికి ధాన్యం విక్రయించుకోవడంలోనూ దగా పడుతున్నాడు. మిల్లర్ల దోపిడీకి బలవుతున్నాడు. మద్దతు ధర అందడం లేదు. రబీ సీజన్ మొదలైంది. అన్నదాత కష్టాలు యథావిధిగా కనిపిస్తున్నాయి. 2026లోనైనా రైతు కష్టం పోవాలి. ఆ విధంగా అధికార యంత్రాంగం ఆలోచన చేయాలి. -
సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కె.కిరణ్కుమార్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా (క్రానిక్ కాల్సిఫిక్ప్యాంక్రియాటైటిస్) అనే వ్యాధితో బాధపడుతూ తీవ్రమైన పొట్టనొప్పితో కొద్ది రోజుల క్రితం సర్వజన ఆస్పత్రిలో చేరాడు. కిరణ్కుమార్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ గ్రంధిలో రాయిలా ఏర్పడిన కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్సలో భాగంగా ప్యాంక్రియాస్ను తెరిచి అందులో ఉన్న సుమారు 6 గీ6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రాయిని జనరల్ సర్జరీ, మత్తు విభాగం వైద్యులు సమన్వయంతో విజవంతంగా తొలగించారు. అనంతరం ప్యాంక్రియాస్ను చిన్న పేగుతో అనుసంధానం చేసే (ప్యాంక్రియాటికో–జేజునోస్టమీ) అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. కిరణ్కుమార్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. శస్త్రచికిత్సనిర్వహించిన జనరల్ సర్జరీ హెచ్ఓడీ పీఏ.రమణి, డాక్టర్ చైతన్య బాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ ఎన్.జగదీష్, డాక్టర్ ధర్మకిశోర్, డాక్టర్ శశిధర్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ హేమసుందర్, డాక్టర్ రామేశ్వరి ప్రభు డాక్టర్ రాకేష్, డాక్టర్ అరవిందసుప్రజలను సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి
గరుగుబిల్లి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిన తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని, కోదండరామ స్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, విశేష హోమములు, పాశుర విన్నపం, మంగళాశాసనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హన్మత్ వాహనంపై సీతారామ లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీకోదండ రామాలయం వరకు ఉత్తర ద్వారం గుండా తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించి, హన్మత్ వాహనంపై వున్న స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. అనంతరం కోదండరామస్వామి ఆలయంలో ఉత్తరద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ అర్చకులు అప్పలాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, ఈవో శ్రీనివాస్, సిబ్బంది, గ్రామ పెద్దలు, పలువురు భక్తులు, టీటీడీ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. తిరువీధి కార్యక్రమంలో మహిళా భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహించారు. ● స్వామివారిని దర్శించుకున్న భక్తులు ● కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం -
సమావేశమైన పోలీస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ
● త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం ● సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే సొసైటీవిజయనగరం క్రైమ్: పోలీస్ సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకుకే జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పడిందని ఎస్పీ అన్నారు. తక్కువ వడ్డీతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 202425 ఏడాదిలో వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు వివరించామని తెలిపారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలను వ్యక్తిగత రుణాలుగా, ఆడపిల్లల పెళ్లి నిమిత్తం రూ.8 లక్షలు అందజేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యుల పిల్లలకు పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 % కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిట్ స్కాలర్షిప్లను కూడా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. త్వరలో జిల్లా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, రమేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కోఆపరేటివ్ సెక్రటరీ ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు, కోఆపరేటివ్ సభ్యులు, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రాణాలూ వేలాడాల్సిందేనా..!
● ఆటోల్లో కుక్కి.. బస్సుల్లో తొక్కి.. ● వెక్కిరిస్తున్న నిబంధనలు పార్వతీపురం రూరల్: బడికి వెళ్లే బాట.. మృత్యువుతో ఆటగా మారుతోంది. విద్యార్థుల ప్రయాణం నిత్యం కత్తిమీద సాములా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో విద్యా సంస్థల వేళల్లో కనిపిస్తున్న దృశ్యాలు వాహనదారులను, బాటసారులను కలచి వేస్తున్నాయి. నిబంధనలు గాలికి.. పసిప్రాణాలు వేలాడుతూ.. ఆటోల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కుక్కుతున్నారు. వెనుక సీటుపై ప్రమాదకరంగా కూర్చోబెట్టడంతో ప్రమాదవశాత్తు ఆటో వెనుక భాగంలో విద్యార్థులు కూర్చున్న ఆ డోర్కు ఉన్న చైన్ తెగితే అంతే ఒక్కసారిగా చిన్నారులు బలంగా రోడ్డు ఢీకొని వెనుక వస్తున్న వాహనాలకు బలికాక తప్పని దుస్థితి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కొందరు విద్యార్థులు బయటకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన రద్దీతో ప్రవేశ ద్వారం వద్ద ఫుట్బోర్డుపై నిలబడి, గాలిలో వేలాడుతూ విద్యార్థులు చేసే ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అని తోటి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపైనే దృష్టి.. వీటిపై ఏది నిఘా? పోలీసు, రవాణా శాఖాధికారులు కేవలం ద్విచక్ర వాహనాల తనిఖీలపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్లు, ఫైన్ బకాయిలు, పత్రాల వేటలో పడి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాల వాహనాలు, ఓవర్ లోడ్ ఆటోలను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పసిప్రాణాల ప్రయాణానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
విజయనగరం ఫోర్ట్: చేపల వేట సాగించే మత్య్సకారుల సమస్యలు, హక్కుల కోసం ఏర్పాటైన జిల్లా మత్య్సకార సహకారం సంఘం ఎన్నికలకు కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు. 100 లోపు సభ్యులు ఉన్న సంఘం ఎన్నికకు కోట్లాది రుపాయలు ఖర్చుచేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పదవుల్లో ఉన్న నేతలు, టీడీపీ నాయకులు మూడు, నాలుగు రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు నడిపారు. సభ్యులను క్యాంపులకు తరలించే బాధ్యతను సైతం టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మత్య్సకార సహకార సంఘం ఎన్నికలు జరగాయని పలువురు మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. మత్య్సకార సహకార సంఘం ఎన్నికల్లో ఎప్పుడూ రాజకీయ జోక్యం ఉండేదికాదని చెబుతున్నారు. ఎన్నికల కేంద్రం వద్ద మంత్రి అనుచరులు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న చేప పిల్లల పెంపకం కేంద్రంలో మంగళవారం జిల్లా మత్య్సకార సహకార సంఘానికి ఎన్నిక నిర్వహించారు. ఈ కేంద్రం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనుచరులు అధిక సంఖ్యలో చేరుకుని హడావిడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్టర్ల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. చివరకు ఎన్నికల్లో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా టీడీపీ సానుభూతి పరుడు సింగిడి పాపారావు, ఉపాధ్యక్షుడిగా దాసరి లక్ష్మణలు ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికార దర్పంతో గెలిచారు అధికార దర్పంతో మత్స్యకార సంఘం ఎన్నికల్లో గెలిచారని జిల్లా మత్య్సకార సంఘం మాజీ అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న ఆరోపించారు. చేపపిల్లల పెంపకం కేంద్రం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృత్తిపరమైన ఎన్నికలకు కూడ టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సభ్యులను తరలించి క్యాంప్ రాజకీయాలు నడిపారన్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇంతలా దిగిజారి పోయారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగా సభ్యులు ఓటు వేస్తే గెలవలేమని భావించి సభ్యులను నిర్బంధించారని, ఇదే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అన్నారు. కార్యక్రమంలో మత్య్సకారులు కె.చిన్నారావు, జి.సింహాచలం, జి. అప్పలరాజు, బి.సుదర్శన్రావు, పి.లక్ష్మణ్, ఎం.గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కేంద్రంవద్ద మంత్రి అనుచరులు, టీడీపీ నేతలు అధికార దర్పంతో గెలుపు 66 మంది సభ్యులున్న ఎన్నికకు క్యాంప్ రాజకీయాలు -
మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్లో.. అత్యాధునిక టోమోథెరపీ సేవలు
విశాఖపట్నం: కేన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, హాస్పిటల్ ఎం.డి డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతికతను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు కేన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పిటల్ ఎం.డి మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ దేశంలో లెవెల్ 3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా కేన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని ప్రత్యామ్నాయం కోసం ఉపాధి కల్పిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏడాదిలో గంజాయి సాగుపై తీసుకున్న చర్యలు, ఉపాధి కల్పనపై డీఐజీ వివరాలు వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా చేపట్టిన సమగ్ర చర్యలు 2025 లో గణనీయమైన ఫలితాలను సాధించాయన్నారు.గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలలో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల పంపిణీ కార్యక్రమం కింద 29,979 మంది రైతులను 29,839.5 ఎకరాల్లో సాగుచేయగా, 35,011.5 ఎకరాల్లో 34,012 మంది రైతులు వాస్తవంగా పంటలు సాగు చేశారన్నారు. ఈ ఏడాదిలో 0.10 ఎకరాల గంజాయి పంటను పూర్తిగా నాశనం చేశామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా నివారణతో పాటు హార్టికల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో విశాఖపట్నం/అనకాపల్లి జిల్లాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునిక 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో 14,870 ఎకరాలను సర్వే చేయగా, 138 గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని తెలిసిందన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్ పోస్టులు, 362 డైనమిక్ తనిఖీ కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని వందలాది కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. గంజాయి నిల్వలను గుర్తించేందుకు 9 ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను మోహరించి ప్రతి జిల్లాలో డి అడిక్షన్ సెంటర్లు పెట్టి డ్రోన్ ఆధారిత ఎన్డీపీఎస్ బీట్లతో హాట్స్పాట్లను గుర్తించి, వినియోగదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 244 మందిని వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డీడీసీ ద్వారా 67,000 కిలోల గంజాయి, 77.267 కిలోల హషీష్ ఆయిల్ ధ్వంసం చేసి మొత్తం 509 కేసులు నమోదు చేసి 1,390 మందిని అరెస్టు చేశామని, 28,423 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 341 వాహనాలను సీజ్ చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు. విశాఖ రేంజ్ పోలీస్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఏపీఓ
సీతంపేట: ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు మంగళవారం ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండలంలోని బుడగరాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని సమస్యల సాధన చేశారు. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఏ విధంగా ఒక్కో విద్యార్థికి వచ్చాయో పరిశీలించారు. ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాల వాతావరణం బాగా ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రైనేజీ శుభ్రం చేయించాలన్నారు. అనంతరం మెనూ పరిశీలించారు. రుచికరమైన భోజనం విద్యార్థులకు పెట్టాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడారు. అర్ధరాత్రి దాటితే రోడ్లపైకి రావొద్దు ● మత్తులో బండి తీస్తే కటకటాలే : ఎస్పీ పార్వతీపురం రూరల్: నూతన సంవత్సర వేడుకలు నవ్వుల పూలు పూయించాలే తప్ప.. కన్నీటి గాథలకు తావివ్వకూడదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో యువత ఉత్సాహం ఉరకలెత్తి ఉన్మాదంగా మారకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవాలని మంగళవారం విడుల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు. డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత రహదారులపై ఎవరూ సంచరించకూడదని, ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించామని, మద్యం మత్తులో స్టీరింగ్ పడితే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్ వంటి విన్యాసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే వారి కంటే ఎక్కువగా తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్లు కట్ చేయడం, పెద్ద ధ్వనులతో డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడం వంటి పనులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని, ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అల్లరి మూకల ఆట కట్టించేందుకు ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లను, నిరంతర పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నిర్ణీత సమయం మించి మద్యం విక్రయించే దుకాణాలపై కూడా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య నూతన వసంతానికి స్వాగతం పలకాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. -
చంద్రబాబు పాలన కష్టాలమయం
విజయనగరం: ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హమీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాలమయంగా మారిందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రెండేళ్లు పూర్తికాక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. ఇందుకు 2025 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పడిన ఇబ్బందులు, వ్యక్తమైన వ్యతిరేకతలే తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టలు తప్పవన్న నానుడి మరోసారి నిజమవుతోందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకుండా పోతుందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించటంతో పాటు లాఠీ దెబ్బలు తినటం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సత్సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవటమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. క్షీణించిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటే ఓర్వలేని కూటమి నేతలు వారిపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయన్నారు. హత్యలు, అరాచకాలు, దాడులు, గంజాయి అక్రమరవాణా రోజురోజుకు పెచ్చుమీరుతుందన్నారు. ఎన్నికలకు ముందు రూ.1 కరెంట్ ఛార్జీ పెంచమని చెప్పి వివిధ రూపాల్లో ప్రజల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రగతి జాడ లేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకున్న నాధుడు లేడన్నారు. వైఎస్సార్సీపీలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణ పనులను అంతా తామే చేస్తున్నామంటూ ఫొటోలకు ఫోజులివ్వటం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ లేదు.. కొత్తగా ఒక్క పింఛను మంజూరు లేదు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన సూపర్ సిక్స్ హమీలపై మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ లేదు... రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను మంజూరు చేయలేదని చెప్పారు. 2019 సంవత్సరంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల పింఛన్లు ఉంటే 2024 ఎన్నికల సమయానికి 66.34 లక్షల మందికి ఆ సంఖ్య పెరిగిందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా సుమారు 5 లక్షలకు పైగా పింఛన్లు నిలిపివేశారన్నారు. కొత్తగా 60 సంవత్సరాలు నిండిన వారితో పాటు వితంతువులకు, అనారోగ్యాల బారిన పడిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హమీని పక్కన పెట్టి, పీ–4 నెల రోజుల పాటు హడావుడి చేసి గుర్తించిన బంగారు కుటుంబాలకు ఏం లబ్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో ప్రజలకు సేవలందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ, రానున్న ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ముందుగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరంలో వైఎస్సార్సీపీని ముందుకు నడిపించడంలో సహకరించిన పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం సంక్షోభంలో వ్యవసాయ రంగం ఆరోగ్యశ్రీ నిలిపివేతతో ప్రజారోగ్యానికి భద్రత కరువు శాంతి భద్రతల పరిరక్షణలో వైఫల్యం సూపర్ సిక్స్ హామీల అమల్లో ప్రజలను మోసం చేసిన వైనం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
తెర్లాం: మండలంలోని లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి యూరియా కోసం ఎగబడ్డారు. వారిని నియంత్రించడం కష్టమవడంతో వ్యవసాయ సిబ్బంది స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై సాగర్బాబు అక్కడికి సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులందరికీ యూరియా ఇస్తారని, అందరూ వరుస క్రమంలో నిలబడాలని సూచించారు. రైతులంతా వరుస క్రమంలో ఉండి యూరియా తీసుకున్నారు. ఎరువుల పంపిణీ పూర్తయినంతవరకు ఎస్సై అక్కడే ఉండి పర్యవేక్షించారు. రైతులకు కావాల్సినంత యూరియా రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉందని, యూరియా అవసరంలేని రైతులు కూడా వచ్చి తీసుకువెళ్తుండడంతో సమస్య ఏర్పడుతోందని మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోని రైతుల ఆధార్కార్డు, వన్బీ తీసుకుని క్షేత్రస్థాయిలో ఆ రైతు ఏ పంట సాగుచేస్తున్నాడో పరిశీలించిన తరువాత యూరియా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. -
పెన్షన్ డబ్బులు మాయంపై ఫిర్యాదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి సచివాలయంలో పెన్షన్ అమౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంపై కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పెన్షన్లు పంచేందుకు సోమవారం సిరిపురం యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ.33 లక్షల 45 వేల 500ను విలేజ్ సర్వేయర్ సచివాలయానికి తీసుకువచ్చి కార్యదర్శికి అందించారు. అనంతరం క్లస్టర్ వైజ్ పంచగా అందులో రూ.50 వేలు మాయమైయినట్లు గుర్తించారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో యువకుడి మృతిగుర్ల: మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన కంది సాయిరాం(26) బెంగళూరులో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సాయిరాం బెంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వస్తుండగా బెంగళూరులో జరిగిన రైల్వే ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందించారని చెప్పారు. -
కోర్టు తీర్పు బేఖాతరు
మెంటాడ: న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా మెంటాడ మండలంలోని పిట్టాడ, వాణిజ గ్రామ వీఆర్వో ఆదిరావు భూమిని మ్యూటేషన్ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాణిజ గ్రామ రెవెన్యూ పరిధిలో 59/2 సర్వే నంబర్లలో సుమారు నాలుగున్నర ఎకరాల మెట్టభూమిలో వ్యవసాయం చేసుకుంటూ బంటుపల్లి సూర్యనారాయణ పెంటమ్మ దంపతులు నివసించేవారు. వారు లక్కోజి సన్యాసమ్మకు 1996లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. బంటుపల్లి సూర్యనారాయణ కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా గత సంవత్సరం డిసెంబర్లో పెంటమ్మ మరణించింది. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇదే అదునుగా అదే గ్రామంలో నివసిస్తున్న బంటుపల్లి సన్యాసిరావు, వీఆర్వో అదిరావులు కలిసి చనిపోయిన దంపతుల భూమిపై కన్నువేశారు. పెంటమ్మ తన సొంత పెద్దమ్మే అని బంటుపల్లి సన్యాసిరావు చేత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్కు వీఆర్వో ఆదిరావు దరఖాస్తు చేయించాడు. అన్నీ తానై సర్టిఫికెట్ చేయించి పెంటమ్మ భూమిని బంటుపల్లి సన్యాసిరావు పేరున మార్చేశాడు. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామంలో సాక్షి విచారణ చేయగా బంటుపల్లి పెంటమ్మకు సన్యాసిరావు ఎలా వారసుడవుతాడంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే భూమికొన్న లక్కోజి సన్యాసమ్మను ఈ భూమిపైకి వస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. మరోదారిలేక సన్యాసమ్మ కోర్టును ఆశ్రయించగా భూహక్కుదారులకు అనుకూలంగా తీర్పునిస్తూ, రికార్డుల్లో మార్పులు చేయవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రికార్డులు మార్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో పాత్రపై విమర్శలు ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక వీఆర్వో అన్నీ తానై వ్యవహరించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల కంటే తమకే అధికారం అన్నట్లు వ్యవహరిస్తూ, అవతలి పక్షం నుంచి లబ్ధి పొంది రికార్డులను ఆన్లైన్లో మ్యుటేషన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండానే క్షేత్రస్థాయిలో ఈ మాయాజాలం జరిగినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు అమలు కాకపోవడమే కాకుండా, అక్రమంగా మ్యుటేషన్ జరగడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై లక్కోజు సన్యాసమ్మ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ కాపీలు చూపించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. రికార్డులు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అక్రమ మ్యుటేషన్పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వీఆర్వో, ఇతర రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తన భూమిని తనకు అప్పగించాలని కోరుతోంది. వివాదాస్పదంగా మ్యుటేషన్ అనర్హులకు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ భూహక్కుదారుల ఫిర్యాదుతో వెలుగులోకి నిర్వాకం చక్రం తిప్పిన మెంటాడ మండల వీఆర్వో -
ఐదు రోజుల బ్యాంకింగ్ విధులు అమలు చేయాలి
● ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద యూఎఫ్బీయూ ధర్నావిజయనగరం అర్బన్: బ్యాంకింగ్ రంగంలో ఐదురోజుల విధుల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాయలం ఎదుట బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయనగరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు బీవీప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ మురళీశ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రమేష్, రాజశేఖర్ గుప్తా, కమిటీ సభ్యులు నాగభూషణరావు, రవికుమార్, శ్రావణకుమార్, మురళి, భానోజీరావు, హరీష్, మనోజ్ వర్మ, హర్ష, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ బాలుర గురుకులంలో జిల్లాతరఫున విద్యార్థులను మంగళవారం ఎంపికచేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కొప్పెర్ల, బాడంగి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ గురుకుల పాఠశాలలనుంచి 15మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8మందిని ఎంపికచేశామని తెలిపారు. ఎంపికచేసిన విద్యార్థులు వచ్చేనెల 3వ తేదీన ఏలూరు జిల్లా పెదవేమలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొననున్నట్లు చెప్పారు. చెరుకు పంట దగ్ధంబలిజిపేట: మండలంలోని పి.చాకరాపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న చెరుకు పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మురగడాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎం.వెంకటినాయుడు పంట దగ్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 3.95ఎకరాల విస్తీర్ణంలో పండిన చెరుకుపంట సుమారు 200టన్నులు ఉంటుందని అంచనా. దీనిప్రకారం రైతుకు సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కౌలు రైతు వెంకటినాయుడు పార్వతీపురానికి చెందిన డి.దాలినాయుడు వద్ద భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తున్నాడని కౌలు రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం కౌలురైతును ఆదుకోవాలని కోరుతున్నారు. రెచ్చిపోతున్న బ్యాటరీ దొంగలురామభద్రపురం: మండలంలో వాహనాల బ్యాటరీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రోజూ ఏదో గ్రామంలో వాహనాల బ్యాటరీలు చోరీ జరిగిందంటూ సంబంధిత వాహనచోదకులు లబోదిబోమం టున్నారు. రెండు రోజుల క్రితం బూశాయవలసలో ట్రాక్టర్, ఆటోలకు చెందిన బ్యాటరీలు చోరీచేయగా సోమవారం రాత్రి స్థానిక సాయినగర్లోని గుడ్ల కాంట్రాక్టర్ బండారు నాగరాజుకు చెందిన రెండు వ్యాన్లలోని రెండు బ్యాటరీలు దొంగలు చోరీ చేశారు.గతంలో కూడా ఒక వ్యాన్లో ఉన్న గుడ్లు చిదిమేసి, వ్యాన్కు చెందిన బ్యాటరీని దొంగలు ఎత్తికెళ్లిపోయారని గుడ్ల కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపాడు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు నైట్ బీట్ సమయంలో నిఘాపెట్టాలని బాధితులు కోరుతున్నారు. సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో డిపాజిట్ చేసిన సొమ్మును చెల్లించి తమకు న్యాయం చేయాలని బాధితులు పోస్టాఫీస్ ఎదుట మంగళవారం ఆదోళన వ్యక్తం చేశారు. తామంతా వ్యవసాయ కూలిపనులు చేసుకుని వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ. 500 నుంచి రూ.1000 వరకూ కడుతున్నామన్నారు. దాచుకున్న సొమ్మును సంబంధిత పోస్టుమాస్టరు పోస్టాఫీస్లో కట్టకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎక్కువమంది ఆర్డీ డిపాజిట్ దారుల సొమ్ము కట్టకుండా దుర్వినియోగం చేశారని గతంలో పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేసిన వారికి నగదు వాపసు చేశారని తమకు మాత్రం కట్టిన ఆర్డీ సొమ్ము ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కొందరికి చెల్లింపులు చేసినా తమకు న్యాయం చేయాలని కొత్తవలస గ్రామానికి చెందిన నారికేళ్ల అప్పలనర్సమ్మ, గేదెల సోములమ్మ, యాండ్రపు చినతల్లి, బర్ల గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, ముచ్చిపెదగౌరమ్మ, యాండ్రపు తిరుపతమ్మ కోరుతున్నారు. బాధితురాలు అప్పలనర్సమ్మ మాట్లాడుతూ తమసొమ్ముకు భధ్రత ఉంటుందని గ్రామ పెద్దలు చెప్పడంతో తామంతా వ్యయప్రయాసలకోర్చి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కొత్తవలస నుంచి గెడ్డలుప్పి పోస్టాఫీస్కు వెళ్లి కడితే అక్కడ కూడా భద్రత లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. గెడ్డలుప్పి పోస్టు మాస్టరు వద్ద డిపాజిట్ల విషయమై ప్రస్తావించగా ఆర్డీ కట్టిన ఖాతాదారులు ఽఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరామన్నారు. -
కలిసికట్టుగా ‘జంఝావతి’ని సాధిద్దాం
గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతులంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝావతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా పెదపోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కరణం కుటుంబీకులు సంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఘటానికి పూజలు జరిపారు. అనంతరం మేళ తాళాలు, కోలాట ప్రద్శనలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పెద పోలమాంబను చదురు గుడికి తీసుకువచ్చారు. అమ్మవారు గ్రామంలోని చదురుగుడిలో వారం రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 6న ప్రధాన ఉత్సవం, 7న అనుపొత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు సనప చాటింపు వేస్తారు. జనవరి 12న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 13 రోజుల పాటు పోలమాంబ అమ్మవారు చదురు గుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 26న తొలేళ్లు ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, సర్పంచ్ సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, జన్ని, కరణం, కుప్పిలి కుటుంబీకులు పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో అమ్మవారికి ఆహ్వానం పలికిన భక్తులు -
జిల్లాలో 16 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
● ప్రస్తుతం జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలు: 451 ● ప్రతిపాదనలను పరిశీలిస్తున్న అధికారులు వీరఘట్టం: కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త పంచాయతీలు కావాలంటూ పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేశారు. వాటిని ప్రభుత్వ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. పంచాయతీ విభజన చట్టం ప్రకారం తమ గ్రామాలను కొత్త పంచాయతీలుగా గుర్తించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 16 కొత్త పంచాయతీల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 451 పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని కొన్ని పంచాయతీల్లో ఉన్న గ్రామాల ప్రజలు కొత్త పంచాయతీలకు దరఖాస్తు చేశారు. వీరఘట్టం మండలం నుంచి 5, గరుగుబిల్లి మండలం నుంచి 3, సాలూరు నుంచి 2, పాచిపెంట నుంచి 3, భామిని నుంచి 2, బలిజిపేట మండలం నుంచి 1 దరఖాస్తు కొత్త పంచాయతీల ఏర్పాటుకోసం అందాయి. సాలూరు మండలంలోని తోనాం పంచాయతీలో ఉన్న చిమిడివలస, కొత్తూరు గ్రామాలను మరుపెంట పంచాయతీలో అనుసంధానం చేయాలని దరఖాస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా వీరఘట్టం, భామిని, గరుగుబిల్లి, సాలూరు, పాచిపెంట, బలిజిపేట మండలాల నుంచి కొత్త పంచాయతీలు కావాలని 16 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాం. నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తాం. – కొండలరావు, జిల్లా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి -
పదవుల వేట!
చేపల వలలో.. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యయుతమైన అధికారం,కోరంలో బలం లేకపోయినా మున్సిపాలిటీలు, మండల పరిషత్లు.. పంచాయతీలను కేవలం అధికార బలంతో చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నేడు మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే విధానం అవలంబిస్తోంది. విజయనగరం జిల్లాలోని మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి పలు సొసైటీల డైరెక్టర్లు, సంఘాల సభ్యులు ఇప్పటికే వైఎస్సార్సీపీలో కొనసాగుతూ పార్టీ తరఫున పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవులను లాక్కునేందుకు టీడీపీ.. జనసేన నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారు. గత వారం రోజులుగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, చోటా నేతలు గ్రామాల్లోకి దిగిపోయి సొసైటీ నేతలను ప్రలోభపెడుతున్నారు. అధికారం తమది కాబట్టి తమతో ఉంటే అభివృద్ధి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. లొంగనివాళ్లని బెదిరిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలుపెట్టి వారిని తమ దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న విశ్వప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాగానే జిల్లా మత్సకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మత్సశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 30న మంగళవారం జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 44 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది అధ్యక్షులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రచరించేశారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో 11 మంది డైరెక్టర్లను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లుగా ఎన్నికై న వారంతా వారిలోనే ఒక అధ్యక్షుడిని, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక... జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుని ఎన్ని క ప్రక్రియ చేతులు ఎత్తే విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదే సువర్ణావకాశంగా భావించిన అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు సంఘం అధ్యక్షుడిగా తమకు అనుకూలంగా ఉండే వారిని ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా పార్టీ జిల్లా నేత గ్రామాల్లో ఉండే నాయకులతో మంతనాలు నిర్వహించి వారి ద్వారా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను తమదారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఎన్నిక ల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు. ప్రాథమి క సహకార సంఘాల అధ్యక్షులు తాము చెప్పినట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా రు. ప్రత్యేక క్యాంప్లు పెట్టి మాట వినిని వారిని బుజ్జగిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 66 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో అధిక శాతం మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. గడిచిన రెండు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వారు సైతం వైఎస్సార్సీపీలో ఉన్న వారే. సదరు వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో మింగుడు పడని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుని, వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో చాలా మంది గ్రామాల్లో నెయ్యిల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారి ఆర్ధిక, సామాజిక స్థితి గతులు అంతంతమత్రంగానే ఉండటంతో వారిని అధికార బలంతో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిని సంబందిత సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. -
ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు
గరుగుబిల్లి: ఉత్తరాంధ్ర చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయం మంగళవారం చేపట్టే వైకుంఠ ఏకాదశి పూజలకు ముస్తాబైంది. ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, పాశుర విన్నపం, శాత్తుమురై, మంగళాశాసనం తదితర కార్యక్రమాల అనంతరం 6.30 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆల యం నుంచి కోదండరామస్వామి ఆలయం వరకు స్వామివారిని హన్మత్ వాహనంపై తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. పూజాకార్యక్రమాల్లో భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈఓ శ్రీనివాస్ కోరారు. కలెక్టర్ను సత్కరించిన రెవెన్యూ అసోసియేషన్ పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్–స్పెషల్ డెస్క్ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి జిల్లాలో ప్రారంభించడం సంతోషదాయకమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ తరఫున కలెక్టర్ను సోమవారం సత్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీఆర్ఓ కె.హేమలత, సిబ్బంది పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు ఆర్థిక సహాయంపార్వతీపురం: రోడ్డు ప్రమాదాల్లో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన(హిట్ అండ్ రన్) బాధితుల కుటుంబాలకు ఆర్థిక పరిహారాన్ని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అందజేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి పరిహారానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. హిట్అండ్ రన్ కేసులకు సంబంధించి 10మందికి గాను 9మందికి మంజూరైన పరిహారాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, రవాణాశాఖాధికారులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు గుండె గుబిల్లు
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఈ చిత్రంలోని వ్యక్తి పేరు కొండగొర్రి లక్ష్మణ్. కొమరాడ మండలం నయ పంచాయతీ గుడ్డాం గిరిజన గ్రామం. దాదాపు ఎనిమిదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ రాయితీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్నాడు. ఇటీవల వినియోగ బిల్లు బకాయి అంటూ రూ.6,282 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు నోటీసు పంపారు. తనకు ఉన్నది ఒక ఫ్యాను, లైటు మాత్రమేనని.. ఎంత వినియోగించినా వంద యూనిట్లు దాటదని.. ఇంత మొత్తం బకాయి ఉంటే తాను ఎలా చెల్లించగలనని లక్ష్మణ్ వాపోతున్నాడు. -
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందించండి
● కలెక్టర్ను కోరిన పారా అంతర్జాతీయ క్రీడాకారుడువిజయనగరం: జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు (పారా) ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని పారా అంతర్జాతీయ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు సోమవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి కలెక్టరెట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకుని వచ్చాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచాడని కలెక్టర్కు వివరించారు. భవిష్యత్ లో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. -
పశుసంవర్థకంతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పార్వతీపురం రూరల్: పశుసంవర్థక రంగం బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖపై సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుపాలనలో జెమిని, పెరప్లెక్సిటీ వంటి ఏఐ సాంకేతికతను జోడించి రైతులకు వేగంగా సమాచారం అందించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు ఈ రంగంలోని ఉపాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏడాదికి ప్రతి రైతు 1200 గుడ్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా డైరీ సంఘాలను బలోపేతం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయాలని, ఎగుమతి నాణ్యత కలిగిన మేత ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలు చేసిన గ్రామ ముస్తాబు, గోపాల సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు వివరించారు. సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీలు
● 232 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 232 వినతుల స్వీకరించగా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల పరిష్కారంలో ఆలస్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 110పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ నంబర్కు వచ్చిన కాల్స్ను సరైన సమాధానం అందించాలని సూచించారు. స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 136, పంచాయతీ శాఖ 26, పోలీస్ శాఖ 10, పబ్లిక్ హెల్త్ 10, మున్సిపల్ పరిపాలన 9, సర్వేల్యాండ్ రికార్స్5, వ్యవసాయ శాఖ 4, విద్యుత్ శాఖ 4, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 3, ఎస్సీ కార్పొరేషన్కు రెండు, దేవాదాయ శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 2, సమగ్రశిక్షక్ష 2, వాటర్రిసోర్సెస్కు 2 వినతులు స్కీకరిచారు. వినతుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలా గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఎస్వీవిజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం ప్రజా ఫిర్యాదుల శ్రీఘ్ర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్లో భాగంగా విజయనగరం జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ను సోమవారం ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా రికార్డుల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఆన్ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు నేరుగా పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్టువల్ సమాచారం ఇవ్వనున్నట్లు వివరించారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి, వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తిని సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తికరమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్లైన్ నిర్ణయించామని, కొన్ని ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసులు మిగహా మిగతావాటిని వేగంగా పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 19 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ చాంబర్ లోనే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చాంబర్ వద్దే ఆవేదన వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని డీపీఓలో ఎస్పీ వాహనం వద్దే ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న వుమెన్ కానిస్టేబుల్ ,ఆ ఫిర్యాదుదారు రాలిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎస్పీని కలిపించారు. ఇక ఎస్పీ ఛాంబర్ లోనే ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ దామోదర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 144 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి 55 అర్జీలు, 89 అర్జీలు వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం మంజూరు చేయాలి ● సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన టి.ఉమ తన కుమారుడికి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం మండలం హిందూపురం గ్రామానికి బి.వెంకటరమణ తప్పెటగుళ్లు బృందానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, రిజిస్టర్ చేయాలని, జిల్లాలో నిర్వహించే సంబరాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు. ● సీతానగరం మండలం రేపటివలస గ్రామానికి చెందిన పి.సుమలత జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.రజని, భామిని మండలం భామినికి చెందిన టి.సరస్వతి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఎన్.అప్పలనాయుడు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోరారు. ఫిర్యాదులపై చర్యల నివేదిక పంపాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో 5 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై నివేదికను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై రమేష్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. తిడ్డిమికి చెందిన నీలారావు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దగుమ్మడ స్కూల్కు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని బగదల గ్రామస్తురాలు జన్ని వరలక్ష్మి విన్నవించింది. రోలుగుడ్డికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన కె.నరేష్ వినతిపత్రం అందజేశాడు. లోకొండ పంచాయతీని విభజించవద్దని కె.ఎర్రన్నాయుడు కోరాడు. ట్రైకార్ రుణం ఇప్పించాలని మంగయ్య, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో పేరు వేరేగ్రామంలో ఉందని తమ గ్రామానికి మార్చాలని కొంటికర్రగూడ గ్రామస్తుడు సవర గోపాల్ విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి.గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్ జి.నరసింహులు, పీఆర్ జేఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధంమైంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్ధ గోష్ఠి కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. ఉదయం 5గంటలకు సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవాన్ని జరిపించనున్నారు. అనంతరం బోదికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. భక్తుల రద్దీ నేపధ్యంలో దేవాదాయ, పోలీస్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పూర్తికాని గిరి ప్రదక్షిణ రహదారి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు కాలినడకన చెప్పులు లేకుండా సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడిచి స్వామిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని ఎనిమిదేళ్ల క్రితమే గ్రావెల్ రహదారిగా మార్చి సిద్ధం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రహదారిలో మట్టిని వేసి రహదారికి మోక్షం కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గిరి ప్రదక్షిణ రహదారి(తారు రోడ్డు) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికే సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదైనా సిద్ధమవుతుందేమోనని ఎదురు చూసిన భక్తులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సగం వరకు చిప్స్(రాళ్ల పిక్కలు) మాత్రమే వేసి వదిలేయడంతో ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి చేసేశామంటూ సోషల్మీడియాలో ప్రచారం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, ఓ రూపుకు తీసుకువచ్చామని, తామే మార్గం సిద్ధం చేశామని..ఇలా ఎమ్మెల్యే లోకం నాగమాధవి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని చూసి భక్తులు నవ్వుకుంటున్నారు. ఆ రహదారిని కొత్తగా వాళ్లే సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు తారు వేస్తేనే కదా పూర్తయినట్లు అన్నది భక్తుల అభిప్రాయం. వాస్తవానికి మంజూరైన రూ.2కోట్ల నిధులు సరిపడకపోవడం వల్లనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. గిరి ప్రదక్షిణ రహదారిలో వేసిన చిన్న చిన్న చిప్స్ కాళ్లకు గుచ్చుకునే ప్రమాదం ఉందని భక్తుల్లో ఆందోళన నెలకొంది. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. -
నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ● మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలుకురుపాం: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయాలు చేసినా, సరఫరా చేసినా అటువంటి వ్యాపారుల పైన, వ్యక్తుల పైన చర్యలు తప్పవని కురుపాం ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి దిన పత్రికలో ‘ధాన్యం ముసుగులో నల్లబెల్లం అక్రమ రవాణా’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన సీఐ పి.శ్రీనివాసరావు కురుపాం మండల కేంద్రంలోని రావాడ కూడలి, శివ్వన్నపేట తదితర దుకాణాల్లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బెల్లం నిల్వల పై ఆరా తీశారు. ఇకపై బెల్లం దిగుమతి ఏ మేరకు చేపడుతున్నది తమకు 15 రోజులకు ఒకసారి తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్లం సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని మరో 14 మంది పై బైండవర్ కేసులు నమోదు చేసి వారి నుంచి రూ45 వేల అపరాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. సారా నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న దాడుల్లో పట్టుబడిన వారిని, వారికి బెల్లం సరఫరా చేసేవారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
మూగవేదన
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో పశుసంపద కళకళలాడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,46,060 మూగజీవాలు ఉన్నాయి. వాటిలో ఆవులు, ఎడ్లు 2,28,681 కాగా, గేదెలు 76,017 వరకు ఉన్నాయి. ఇక గొర్రెలు 2,07,451, మేకలు 1,73,110, పందులు 5,089 ఉన్నాయి. లక్షల సంఖ్యలో కుటుంబాలు వాటి పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతటి ఘనమైన పాడి సంపద ఉన్నా..పాలకుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో ఆస్పత్రుల్లో కనీసం మందులు దొరకని దుస్థితి దాపురించింది. ప్రైవేట్ షాపులే దిక్కు సర్కారు దవాఖానాలో చికిత్స ఉచితమే అయినా..మందులు మాత్రం బయట కొనాల్సిందేనని వైద్యులు చీటీ రాసిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ జబ్బుకే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పాడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. పశువుకు జబ్బు చేస్తే, మాకు జ్వరం వచ్చినట్లే ఉంది. మందులు కొనలేక సతమతమవుతున్నామని పలువురు పాడిరైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణం స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు జిల్లాలోని పశువైద్య కేంద్రాలకు గత ఏప్రిల్లో మందుల పంపిణీ జరిగింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మందుల నిల్వలు రావాల్సి ఉంది. అయితే అత్యవసర చికిత్సకు ఆటంకం కలగకుండా ఇతర కేంద్రాల నుంచి మందులను సర్దుబాటు చేయిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి అవసరమైన మందుల జాబితా (ఇండెంట్లు) పంపాం. కొద్ది రోజుల్లోనే జిల్లాకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరిగే అవకాశముంది. డా.మన్మథరావు, జిల్లా పశువైద్యాధికారి, పార్వతీపురం మన్యం సాధారణంగా పశువైద్యశాలలకు ప్రతి మూడు నెలలకోసారి (త్రైమాసికం) మందుల సరఫరా జరగాలి. కానీ, జిల్లాలో గత ఆరు నెలలుగా మందుల ఊసే లేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ లేదా అక్టోబర్ నాటికి రావాల్సిన మందులు ఇంతవరకు రాలేదు. జ్వరం, గాయాలు, ఇతరత్రా వ్యాధులకు వాడే యాంటీ బయాటిక్స్, నీరసిస్తే ఎక్కించే సైలెన్లు, పాల దిగుబడిని పెంచే కాల్షియం మందులు ఏప్రిల్ తర్వాత కేంద్రాలకు సరఫరా కాలేదు. ఉన్న నిల్వలు ఎప్పుడో అయిపోగా, ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందుల అరలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో పశువైద్యులు సమీపంలోని ఇతర ఆస్పత్రుల నుంచి మందులు అరువు తెచ్చుకుని నెట్టుకొస్తున్నారు. సంచార పశువైద్య వాహనాల్లోనూ (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఇదే దీనస్థితి నెలకొంది. పశువులకు వైద్యం కరువు ప్రైవేట్ మందులతో పాడి రైతులకు భారం ఆరునెలలుగా నిలిచిపోయిన మందుల సరఫరా జిల్లాలో 8.46 లక్షల పశుసంపద ఉన్నా..సౌకర్యాల లేమి -
వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవ తలకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్ర దాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. -
గిరిజన పిల్లల ఎదురుచూపులు
● పీఎం జన్మన్ హాస్టల్స్కు మోక్షమెప్పుడు? ● మంజూరై రెండేళ్లయినా అతీగతీ లేదు ● మూలుగుతున్న రూ.6 కోట్ల 90 లక్షలు కేంద్రం నిధులు సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో పీవీటీజీ (పర్టిక్యులర్లీ వల్నర్బుల్ ట్రైబ్ గ్రూప్) తెగకు చెందిన గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వాటిలో ప్రధానమైన పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకాన్ని 2023 నవంబర్ 15న ప్రారంభించింది. 9 మంత్రిత్వ శాఖల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి పక్కా ఇళ్లు వాటికి మరుగుదొడ్లు, పైప్లైన్ ద్వారా తాగునీరు, మొబైల్ మెడికల్ వ్యాన్లు, సేవలు, వంద జనాభా ఉన్న గ్రామాలకు టెలికాం టవర్లు, రోడ్లు, విద్యుత్ రహిత గృహాలకు విద్యుత్ సోలార్ లైటింగ్, జీవనోపాధికి వనధన్ వికాస కేంద్రాలు, విద్యలో భాగంగా హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకంలో పీవీటీజీలు లబ్ధిపొందాలనేదే పథకం ఉద్ధేశం. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట ఏజెన్సీలో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల సంఖ్య 49,611 మంది ఉన్నారు. మొత్తం 12,488 కుటుంబాలు ఉన్నాయి. ఇదీ పరిస్థితి.. అత్యంత ఎత్తైన కొండపై మారుమూల ఉన్న గిరిజన గ్రామాలను ఎంపిక చేసి మూడు చోట్ల ప్రత్యేక గిరిజన మోడల్ వసతిగృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. మండలంలోని గుడ్డిమీదగూడ, చదునుగూడ, తలైబుగూడ గ్రామాల్లో వసతిగృహాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిసరాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న 50 మంది చొప్పున విద్యార్థులను మొత్తం 150 మందిని ఆ హాస్టల్స్లో చేర్పించేందుకు విద్యాశాఖాధికారుల ప్రతిపాదన సిద్ధమైంది. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అక్కడ చేసి, మధ్యాహ్న భోజనం మాత్రం ఆయా పాఠశాలల్లో చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. పోషకాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం, టీచర్లతో పాటు ప్రత్యేక ట్యూటర్లను నియమించి విద్యాబోదన చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు రూ.ఒక్కోవసతి గృహానిర్మాణానికి రూ.2 కోట్ల 30లక్షలు చొప్పున మొత్తం రూ.6 కోట్ల 90లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్లయినా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. విద్యార్థులను ఎంపిక చేశాం మోడల్ వసతిగృహాలకు సంబంధించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తయ్యాయి. స్థల సేకరణ కూడా రెండు వసతిగృహాలకు జరిగింది. పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇంకా తలైబుగూడ వసతిగృహం పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
మా క్లినిక్కు వచ్చేయండి..
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఆర్. దీపక్వర్థన్కు రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో స్థానిక సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎముకల వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అతడ్ని ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో సరైన పరికరాలు లేవని.. అంబటిసత్రం ప్రాంతంలో తనకు సొంత క్లినిక్ ఉందని.. అక్కడకు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రోగి ప్రైవేట్ క్లినిక్కు వెళ్లారు. ఆ క్లినిక్లో ఒకసారి ఫిజియోథెరపీ చేసినందుకు రోగి నుంచి రూ. 1500 వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇదే మండలానికి చెందిన ఆర్. వరలక్ష్మి అనే మహిళ మెడనొప్పితో సర్వజన ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను కూడా ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. ఈమెను కూడా సదరు ఫిజియోథెరపిస్ట్ తన సొంత క్లినిక్కు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పాడు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె అతని క్లినిక్కు వెళ్లలేదు. ఇలా వీరిద్దరిరే కాదు ఫిజియోథెరపీ విభాగానికి వస్తున్న ప్రతి రోగినీ ఆయన తన ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాలని సూచిస్తున్నాడు. దీంతో రోగులు బయటకు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్కు వెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండడని గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం. రోగుల తరలింపే లక్ష్యం.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగినీ తన క్లీనిక్కు తరలింపే లక్ష్యంగా సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రయత్నిస్తున్నాడు. పక్షవాతం బారిన పడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరి. ప్రభుత్వాస్పత్రిలో మంచి సదుపాయాలున్నప్పటికీ, ఫిజియోథెరపిస్ట్ స్వార్థం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం వచ్చిన వారికి ఇక్కడే చేయాలి. ఇతర క్లినిక్లకు తరలించడానికి వీల్లేదు. అలా తరలించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిలో ఓ ఫిజియోథెరపిస్ట్ నిర్వాకం ఆస్పత్రిలో మంచి పరికరాలు లేవని రోగులను మభ్యపెడుతున్న వైనం గత్యంతరం లేక ప్రైవేట్ క్లినిక్కు వెళ్తున్న రోగులు వారి నుంచి వేల రూపాయలు గుంజుతున్నట్లు ఆరోపణలు -
గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు..
పార్వతీపురం: గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణరావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఆలిండియా ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ గిరిజన భవనంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన గిరిజను ల హక్కులు, వారి కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. రానురాను గిరి జనులకు భద్రత కరువవుతోందని, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి కలుగుతోందన్నా రు. గిరిజనులకు రక్షణగా ఉన్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అటు అధికారు లు, ఇటు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండి, పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గిరిజనులకు అన్యా యం జరిగితే మూకుమ్మడిగా పోరాటం చేయాలని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనునిత్యం పోరాడాలన్నారు. అనంతరం ఆలిండియా ఆదివా సీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో ఇచ్చే అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. 31న తోటపల్లి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపుగరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం ఈనెల 31న బుధవారం నిర్వహిస్తున్నట్లు ఈఓ బి.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మూడు నెలలకోసారి భక్తులనుంచి వచ్చిన కానుకలు, విరాళాలను దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించే ఈలెక్కింపు కార్యక్రమంలో దాతలు, భక్తులు, స్వామివారి సేవకులు పాల్గొనాలని కోరారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు, సేవకులు తెల్లని పంచె, తెల్లని బనియన్ మాత్రమే ధరించి రావాలని స్పష్టం చేశారు. నేడు చదురుగుడికి పెదపోలమాంబమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పెద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నా ట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారాలు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు. -
వైఎస్సార్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా రమాదేవి
జియ్యమ్మవలస: OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ Ð]l$íßæ-âê {糫§é¯]l M>Æý‡Å-¨ÇØV> hĶæ$Å-Ð]l$Ã-Ð]l-ÌSçÜ Ð]l$…yýl-ÌS… ÕQºyìl {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ķæ${Æý‡ Æý‡Ð]l*-§ólÑ °Ä¶æ$-Ñ$™èl$-ÌS-Ķæ*ÅÆý‡$. ™èl¯]l °Ä¶æ*-Ð]l$-M>°MìS MýS–íÙ ^ólíܯ]l OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Ôèæ{™èl$-^èlÆý‡Ï ç³È„ìS-™Œæ-Æ>k, Ð]l*i yìlç³NÅsîæ ïÜG… ´ëÐ]l¬ÌS ç³#çÙµ-}Ðé×ìæMìS Æý‡$׿ç³yìl E…sê¯]l° BÐðl$ ™ðlÍ´ëÆý‡$. D Ðól$Æý‡MýS$ B¨ÐéÆý‡… BÐðl$ _¯]l-Ðól$-Æý‡…-WÌZ° Ð]l*i yìlç³NÅsîæ ïÜG… ç³#çÙµ-}ిÐé×ìæ M>Å…‹³ M>Æ>Å-ÌS-Ķæ*-°MìS ÐðlãÏ ç³È„ìS-™Œæ-Æ>k, ç³#çÙµ-}Ðé×ìæ §ýl…ç³-™èl$-ÌS¯]l$ MýSÍíÜ «§ýl¯]lÅ-Ðé§éË$ ™ðlÍ´ëÆý‡$. ఈ సందర్భంగా రమాదేవిని శాలువాలతో సన్మానించారు. జిల్లా స్ధాయిలో పదవి అప్పగించడంతో శాయశక్తులా పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కోట రమేష్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం తీసుకోం
● తిరిగి పట్టుకుపోండి ● రైతులను తూలనాడిన మిల్లు యజమాని ● ఆందోళనలో అన్నదాతలుబలిజిపేట: బస్తాలకు ధాన్యం ఎత్తి నానా అవస్థలు పడి 21కిలోమీటర్ల దూరం మిల్లు వద్దకు తీసువచ్చారు. వాటిని మేం తీసుకోం..తిరిగి పట్టుకు వెళ్లిపోండని మిల్లు యజమాని తూలనాడడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏం చేయాలో తోచక కాళ్లూచేతులు ఆడలేదు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారు వంతరాం గ్రామరైతులు. బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ రైతుల ధాన్యాన్ని మిల్లరు కొనుగోలు చేయకపోవడంతో వారు ధాన్యం బస్తాలతో ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో మిల్లులకు 1:3నిష్పత్తిలో ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆ గ్రామ రైతులు సంతృప్తి చెందారు. వంతరాంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బి.వెంకటరమణ, ఎ.జనార్దన, ఒమ్మి సత్యనారాయణ, సతీష్, బి.శ్రీరామూర్తి, ఎన్.శ్రీనులకు చెందిన 480ప్యాకెట్లకు నాలుగు ట్రక్షీట్లు కొట్టించగా పి.చాకరాపల్లి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెన్నెల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరున ట్రక్షీట్లు వచ్చాయి. దీంతో రైతులు సంతోషంతో ధాన్యాన్ని 21కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లుకు ఆపసోపాలు పడి ఉదయం 10గంటలకు ముందే తీసుకువెళ్లారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. ట్రక్ షీట్లు రద్దు చేయండి ధాన్యాన్ని తీసుకోనని, తిరిగి పట్టుకువెళ్లిపోండని మిల్లు యజమాని కరాఖండిగా చెప్పడంతో రైతులకు కాళ్లూచేతులు ఆడలేదు. ట్రక్షీట్ ఉంది ఎందుకు తీసుకోరని ప్రశ్నించినా మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండి నేను తీసుకోను అని తేల్చిచెప్పడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. అధికారులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదు. అదనంగా ఇంకా ఎన్ని ధాన్యం కావాలో చెప్పండి ఇచ్చేస్తాం, ఏదో విధంగా తీసుకోండని మిల్లు యజమానిని రైతులు ప్రాధేయపడ్డారు. అయినా యజమాని నుంచి స్పందన లేదు. దీంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. చివరకు ట్రక్షీట్లు రద్దు చేసేయండని, ధాన్యాన్ని పట్టుకుపోయి ఏదో ఒకటి చేసుకుంటామని, ఇదెక్కడి అన్యాయమని రైతులు లబోదిబోమన్నారు. రైతుసేవా కేంద్రాల వద్ద నుంచి ట్రక్షీట్లు వచ్చిన తరువాత మిల్లర్లు కాదనడం సమంజసంగా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
వ్యాన్ ఢీ కొనడంతో వ్యక్తికి గాయాలు
సీతానగరం: మండలంలోని హైవే రోడ్డుపై లచ్చయ్యపేట – పాత బొబ్బిలి మధ్య ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లికి చెందిన బొబ్బాది వెంకటరమణ ఆదివారం ఉదయం బొబ్బిలి వైపు నుంచి పాత బొబ్బిలి మీదుగా ద్విచక్ర వాహనం వాహనంపై లచ్చయ్యపేట వైపు వస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొనడంతో వెంకటరమణకు గాయాలయ్యాయి. వెంటనే వ్యాన్డ్రైవర్ 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడ్ని బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న లారీ.. దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో పెదమానాపురం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి తెలియజేసిన వివరాల ప్రకారం.. పెదమానాపురం నుంచి గర్భాం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మామిడి నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు చొక్కపు అప్పలనాయుడు, అల్లు గోరమ్మకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజపతినగరం సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
గణితంలో శ్రీనివాసరావుకు పీహెచ్డీ
రాజాం సిటీ: స్థానిక జీసీఎస్ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు. -
ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదు
విజయనగరం గంటస్తంభం: కమ్యూనిజం అంతరించిపోయిందని భావించే వారికి సీపీఐకి ఉన్న వందేళ్ల ఉద్యమ చరిత్రే గట్టి సమాధానమని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని పడమర బలిజి వీధిలో సీపీఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన..సూర్యచంద్రులున్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని, దానికి అంతం లేదని, కమ్యూనిజం గుర్తుగా ఉన్న ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదన్నారు. అంతకుముందు అమరజీవి, కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం ఆ పార్టీ చేసిన పోరాటాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణమ్మ, పావని, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ● గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులతో కలిసి అడుగువేసిన కలెక్టర్ గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచారం, సంస్కృతికి ‘కంది కొత్తలు’ పండుగ నిలువుటద్దంలా నిలుస్తోందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని హెచ్గ్రౌండ్ వద్ద కంది కొత్తల పండగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ గిరిజనుల ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉందో ఈ పండగ నిర్వహణను చూస్తే అర్థం అవుతోందన్నారు. తర తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం, ఐక్యతను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజనులతో కలిసి నృత్యాల్లో పాల్గొన్నారు. అంతేకాక డప్పు వాయించారు. కలెక్టర్ తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా వేడుకల్లో భాగస్వామ్యం అవడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శతపతి అన్నపూర్ణకు ఎస్డీజీ చాంపియన్ అవార్డు
రామభద్రపురం: స్థానిక కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శతపతి అన్నపూర్ణకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఎస్డీజీ చాంపియన్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నేపాల్ దేశ సీ్త్ర శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి భగవతి చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డు తాను అందుకున్నట్లు అన్నపూర్ణ సాక్షికి తెలిపారు. సీడీసీ సుస్థిర గ్రామీణాభివృద్ధిపై గ్రామ స్థాయిలో మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర సేవలకు ఈ అవార్డు లభించిదని ఆమె చెప్పారు. ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.ధాన్యం ఎత్తుకెళ్లిపోతున్న దొంగలు ● ఆందోళనలో రైతులు భామిని: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వడ్డంగి రోడ్డులో ఉన్న కళ్లంలో 31 బస్తాలను అపహరించుకుపోయారు. దీంతో బాధిత రైతులు ముదుల పోలినాయుడు, కీర్తి మోహనరావు, బోదెపు ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట నేరడి–బికి చెందిన రైతు వలరౌతు దండాసికి చెందిన 13 బస్తాల దాన్యం దొంగలించుకుపోయారు. అలాగే బత్తిలికి చెందిన అప్పన్న అనే రైతు సింగుబై కళ్లంలో వేసిన ధాన్యం రాశి నుంచి పది బస్తాల వరకు ధాన్యం చోరీ చేశారు. సరిహద్దు ఒడిశా గ్రామాలకు చెందిన దొంగలే ధాన్యం దోచుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. డెంకాడ: మండలంలోని బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు (59) బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని విజయనరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.20 గంటలకు మృతి చెందాడు. మృతుడి మనవడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ.. భామిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సతివాడకు చెందిన మండల అప్పలమ్మ (54) ఈ నెల 23న సతివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతదేహానికి ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పందెంరాయుళ్ల అరెస్ట్
బాడంగి: మండలంలోని పాల్తేరు శివారులో గొర్రెప్పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్తేరు సమీపంలోని తోటలో గొర్రెప్పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేశారు. దీంతో ఏడుగురు పందెంరాయుళ్లు పట్టుబడగా.. వారి వద్ద నుంచి 23,160 రూపాయల నగదు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి నేపథ్యంలో ఎవ్వరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మారుతి వ్యాన్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆదివారం దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కు మార్(35), ఎల్లాబిల్లి దినేష్(24)లు శనివారం సాయంత్రం బేకరీ ఐటమ్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లి తిరిగి అదేవ్యాన్లో ఆదివారం విశాఖపట్నం వస్తుండగా గజపతినగరం రైల్వేస్టేషన్ దగ్గర వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెట్టును వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు వాహనంలో పోలిక లేకుండా పడి ఉన్నా యి. ప్రమాద సమాచారం అందుకున్న గజపతి నగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను, వ్యాన్ను పోలీసులు జేసీబీతో బయటకు తీసి శవపంచనామాకు తరలించారు. వినయ్ కుమార్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, దినేష్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతుడు దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ పిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలిపారు. -
జానపద కళలకు ఆదరణ
బొబ్బిలి: మనదేశ జానపద కళలకు, సంస్కృతికి ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ, టీవీ నటుడు షకలక శంకర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోటలో బొబ్బిలి కళోత్సవ్ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో బొబ్బిలికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరత్వంపై ఓ పద్యాన్ని ఆలపించారు. అనంతరం రేలారేరేలా గాయకుడు కోరాడ జానకిరామ్ యువతను ఆకట్టుకునే గేయాలు ఆలపించారు. అంతకు ముందు రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృంద ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చెక్కకభజనలు, బుర్రకథ ప్రదర్శనలు, కోలాటం, జాలరిబాగోతం, థింసా నృత్యం, డప్పుల వాయిద్యం, జయదేవుని అష్టపది, బిందెల డాన్స్, సినీ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామమూర్తినాయుడు, కోలాటం డ్యాన్స్ మాస్టర్ జి. కరుణ్కుమార్, శ్రీ కళాభారతి కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, స్థానిక కళాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటుడు షకలక శంకర్ -
ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!
● ఒడిశా నుంచి ఆంధ్రాకు దిగుమతి ● బయట ధాన్యం బస్తాలు..లోపల నల్ల బెల్లం ● సారా తయారీలో నల్లబెల్లం వినియోగం కురుపాం: కొన్ని సినిమాలు ఆదర్శంగా నిలుస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తాయి.. మరి ఏది ఆదర్శంగా తీసుకున్నారో కానీ కొంతమంది వ్యాపారులు సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం స్థానికంగా పుష్కలంగా లభిస్తుండడం.. అది ఎక్కడ నుంచి తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో బయటకు సక్రమంగాను.. లోపల అక్రమంగాను సరుకులు తరలిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. సరిగ్గా ఇదే పంథాను స్థానిక వ్యాపారులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ధాన్యం మాటన నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి తీసుకువస్తున్నారు.ఈ బెల్లాన్ని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన సారా తయారీ దారులు కొనుగోలు చేస్తున్నారు. అక్రమార్కులకు వేగులుగా సిబ్బంది..? ఈ అక్రమ రవాణాకు కొంతమంది ఎకై ్సజ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులకు ఎకై ్సజ్ సిబ్బందే వేగులుగా పనిచేస్తుండడంతో బెల్లం రవాణాను, సారాను అర్టికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎకై ్సజ్ శాఖ కురుపాం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు. -
ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే..
రాజాం: గతంలో కంటే దోమల బెడద ఎక్కువైంది. కలుషిత వాతావరణంతో పాటు ఎక్కడికక్కడే చెత్తాచెదారాలు పేరుకుపోవడం, మురుగు కాలువలు మూసుకుపోవడం వంటి కారణాలతో దోమల వ్యాప్తి అధికమైంది. గతంలో వేసవిలో మాత్రమే దోమల సమస్య పీడించేది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ దోమల బెడద ఉంది. పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్నిచోట్లా దోమలదండు కనిపిస్తోంది. అంతుపట్టని విష జ్వరాలను ఈ దోమలు వ్యాప్తి చేస్తున్నాయి. వీటి నిర్మూలనకు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పెరిగిన దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం గతంలో దోమల నివారణకు ఎక్కువుగా దోమ తెరలు వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్నిచోట్లా దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం పెరిగింది. ప్రతి ఇంట్లో దోమల చక్రాలు సాయంత్రం నుంచి వెలుగుతూనే కనిపిస్తున్నాయి. ఇక దోమల నివారణ రీఫిల్స్ వినియోగానికి హద్దే లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా రీఫిల్స్ వినియోగిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 50 మంది అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఒక రీఫిల్ వినియోగాన్ని చేపట్టాలి. అలా కాకుండా ఒకరిద్దరు ఉన్నచోట కూడా రాత్రింబవళ్లు రీఫిల్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా చాపకిందనీరులా వాయు కాలుష్యం జరుగుతోంది. దీంతో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయి. అమ్మో శ్వాసకోశ వ్యాధులు గతంలో ఏ వెయ్యి మందిలో ఒకరికి శ్వాసకోశ వ్యాధులు ఆశించేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. దోమల చక్రాలు, రీఫిల్స్లో వినియోగించే డైఇథైల్ టోలుమైడ్, పైరెత్రిన్, పైరిథ్రోయిడ్స్ వంటి రసాయనాలు మండి వాయుకాలుష్యం జరుగుతోంది. వీటిని పీల్చడం ద్వారా చర్మంపై అలర్జీలు, క్యాన్సర్ వంటి వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, నాడీ వ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించలేక చాలా మంది జీవితం అర్ధంతరంగా ముగుస్తోంది. విచ్చలవిడిగా దోమల నివారణ మందు వినియోగం తగదు కాయిల్స్, రీఫిల్స్ అతి వినియోగం ప్రమాదకరం చాపకింద నీరులా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధులు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే.. -
నకిలీ రశీదులతో బురిడీ
వీరఘట్టం: పంచాయతీ సిబ్బంది చేతివాటం చూపారు. నకిలీ ఇంటి బిల్లులతో వీరఘట్టం మేజర్ పంచాయతీ ప్రజల నుంచి రూ.20లక్షల వరకు గోల్మాల్ చేశారు. విషయం తెలియడం, సదరు సిబ్బంది బదిలీపై వెళ్లిపోవడంతో పంచాయతీ ప్రజలు ఆందోళన చెందతున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన బిల్లు కలెక్టర్లు ఇంటి పన్నుల వసూలుకు వెళ్లగా.. తాము ఇప్పటికే ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. అవి నకిలీ రశీదులని, ఐదారేళ్లుగా ఇంటిపన్ను కట్టలేదని ప్రస్తుత పంచాయతీ బిల్లు కలెక్టర్లు చెబుతుండడంతో మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి.... వీరఘట్టం మేజరు పంచాయతీలో సుమారుగా 4,500 గృహాలు, దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. వీటిలో 3,906 గృహాలు మాత్రమే పంచాయతీ రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ గృహాలకు ఈ ఏడాదికి రూ.33 లక్షల వరకు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. పాత బకాయిలు (ఎరియర్) గత ఏడేళ్ల నుంచి వసూలు చేయాల్సినది రూ.23 లక్షలు ఉంది. మొత్తం ఇంటి పన్నులు రూ.56 లక్షలకు ఇంత వరకు ఈ ఏడాది రూ.7 లక్షలు వసూలు చేశారు. కొంత మంది ఇప్పటికే ఇంటిపన్ను చెల్లించామంటూ రసీదులు చూపిస్తుండడంతో ప్రస్తుత సిబ్బంది నివ్వెరపోతున్నారు. గతంలో వీరఘట్టం మేజర్ పంచాయతీలో పనిచేసిన కొందరు ఉద్యోగులు ఇంటి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయకుండా కాజేసినట్లు గుర్తించారు. మా నాన్న రామచంద్రరావు పేరున ఉన్న ఇంటి నంబర్ 1705కు గత ఆరేళ్లకు సంబంధించి పాత బకాయిలతో కలిపి రూ.17,606లను రెండేళ్ల కిందట చెల్లించాను. అప్పటి ఉద్యోగి రసీదులు కూడా ఇచ్చారు. ఈ ఏడాది రూ.20,965లు చెల్లించాలని ఇటీవల పంచాయతీ సిబ్బంది అడిగారు. నేను కట్టిన రసీదు చూపించడంతో నా వద్ద ఉన్నవి నకిలీవి అంటున్నారు. గతంలో పనిచేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుని నా ఇంటి పన్నును క్లియర్ చేయాలి. – దౌలూరు శ్రీనివాసరావు, వీరఘట్టం వీరఘట్టం మేజరు పంచాయతీలో ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నును పక్కదోవ పట్టించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నంబర్ 1795లో ఉంటున్న ఇంటికి గత ఆరేళ్లుగా రూ.15,489లు చెల్లించాను. ప్రస్తుత సిబ్బంది పాత బకాయిలతో కలిపి రూ.19,179లను కట్టమని నోటీసు ఇచ్చారు. నోటీసు ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది. – వూణ్న సురేష్, వీరఘట్టం వీరఘట్టంలో చాలా మంది ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. వారు కట్టినట్లు మా రికార్డుల్లో లేవు. ప్రజలకు నకిలీ ఇంటి పన్ను రసీదులు ఇచ్చి డబ్బులు కాజీసిన ఉదంతంపై విచారణ చేపడతాం. ఇంటి పన్ను దొంగలను పట్టుకుని ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. బాధితులందరూ రశీదులు తీసుకుని సచివాలయాన్ని సంప్రదించాలి. – వై.గిరి, ఈఓ, వీరఘట్టం మేజరు పంచాయతీ ఇంటి పన్ను వసూళ్లలో పంచాయతీ సిబ్బంది చేతివాటం వీరఘట్టం మేజరు పంచాయతీలో రూ.20 లక్షలు గోల్మాల్ ఆవేదనలో పంచాయతీ ప్రజలు -
రెండు ఆటోలు ఢీ..
రాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటనలో పలువురు గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం నుంచి ఐదుగురు వ్యక్తులతో రాజాం వస్తున్న ఆటో.. రాజాం వైపు నుంచి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్లతో పాటు పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గౌరీశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి అనంతరం బాధితులను రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కారాడ గ్రామానికి చెందిన యాండ్రాపు నారాయణమ్మ, తెర్లాంనకు చెందిన సింగిరెడ్డి దివ్య, గదబవలసకు చెందిన దువ్వి లక్ష్మణరావు, నాషత్లను శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అలాగే పొట్టా యశోదను రాజాం కేర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జామి అప్పలనాయుడు, పచ్చికాల వరలక్ష్మి, యండమూరి గణేష్లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురికి గాయాలు -
ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి
పార్వతీపురం: ఎస్సీ, ఎస్టీల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి న్యాయం చేయడమే జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగిన కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సివిల్ రైట్స్డే కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి అవి సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో ప్రశ్నించడానికి కమిటీకి అధికారం ఉందన్నారు. బాధితులు నేరుగా అధికారులకు చెప్పలేని సమస్యలను కమిటీ సభ్యులు గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్రమైన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. పోలీ్స్ శాఖ వద్దకు వచ్చిన ప్రతీ కేసును నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, ఏఎస్పీ మనీషారెడ్డి, డీఆర్వో కె.హేమలత, డీపీఓ కొండలరావు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం.శ్యామల, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాకు అడ్డుకట్ట..
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేశామని ఎస్పీ దామోదర్, కలెక్టర్ ఎం. రామసుందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక దండుమారమ్మ టెంపుల్లో జిల్లా స్థాయి పోలీస్ సిబ్బందితో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి రవాణా, పోక్సో కేసు నమోదుపై జిల్లా శాఖ దృష్టి సారించిందన్నారు. పోక్సో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలోనే కాకుండా సబ్ కోర్టుల్లో కూడా శిక్షలు పడుతున్నాయన్నారు. గతేడాది పోక్సో కేసులు 58 నమోదైతే.. ఈ ఏడాది 57 నమోదయ్యాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై 87 కేసులు నమోదు చేసి 270 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 1,175 కిలోల గంజాయిని సీజ్ చేశామని.. 54,15,860 రూపాయల ఆస్తి రికవరీ చేశామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. వరకట్న వేధింపులు గతేడాది 241 నమోదైతే ఈ ఏడాది 267 నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే హత్యకేసులు గతేడాది కంటే పెరగడం బాధాకరమని తెలిపారు. మొత్తానికి గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని 2024లో 7,352 జరిగితే ఈ ఏడాది 4,880 కేసులు నమోదు అయ్యాయన్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
ప్రాణాంతక వ్యాధితో చిన్నారి పోరాటం..
● ఆపన్నహస్తాల కోసం ఎదురుచూపు.. ● వైద్యానికి రూ. 12 లక్షలు అవసరం భోగాపురం: మండలంలోని రెడ్డికంచేరు గ్రామానికి చెందిన బైరెడ్డి సురేష్రెడ్డి, శైలజ దంపతులకు ఈ నెల 8న కుమారుడు జన్మించాడు. అయితే వారసుడు వచ్చాడన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలువలేదు. చిన్నారికి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వారి ఆనందం ఆవిరైంది. వివిధ ఆస్పత్రుల్లో చిన్నారిని చూపించినా, ఆరోగ్యం కుదుటపడలేదు. ఇందుకోసం రూ. లక్షల్లో ఖర్చు చేశారు. చివరగా విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. చికిత్స కోసం సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అంత సొమ్ము ఎలా పోగు చేయాలో తెలియక దేవుడిపై భారం వేసి ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 83744 67856, 93901 41053 నంబర్లను సంప్రదించాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే విషయం తెలుకున్న వైఎస్సార్సీపీ సర్పంచ్ బైరెడ్డి రమణరెడ్డి, శీరపు వంశీరెడ్డి, బైరెడ్డి దుర్గయ్యరెడ్డి, చిన్నయ్యరెడ్డి చిన్నారి తండ్రి సురేష్రెడ్డిని శనివారం కలిసి రూ. 21 వేల నగదు అందజేశారు. -
మానవీయ విలువలు పెంపొందించేలా..
పార్వతీపురం రూరల్: మానవీయ విలువలు పెంపొందించేలా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకలాపాలు సాగాలని కలెక్టర్ ఎన్. ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక ఐటీడీఏ క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ కార్యలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేవే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. రక్తదాన శిబిరాలు ముమ్మరంగా నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్ భాస్కరరావు, జిల్లా మెడికల్ ఆఫీసర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయికృష్ణ చైతన్య, రెడ్క్రాస్ చైర్మన్ మంచుపల్లి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ బీఎన్ రావు, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పార్వతీపురం రూరల్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, పార్వతీపురం మన్యం జిల్లా మొబైల్ మెడికల్ యూనిట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి–1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్–1, డ్రైవర్–1 పోస్టులను మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్లతో కలిపి 2026 జనవరి ఐదో తేదీలోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాల యంలో సమర్పించాలన్నారు. వైద్యాధికారి పో స్టుకు రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు), మిగిలిన పోస్టులకు రూ.300 చొప్పున డిమాండ్ డ్రాఫ్ట్ను జతచేయాలని తెలిపారు. వంగర: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన చిప్పాడ సింహాచలం (65) ఈ నెల 26న గ్రామాల్లో పప్పు దినుసులు విక్రయించుకుని టీవీఎస్ వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా శ్రీహరిపురం పరిధి బందరు చెరువు సమీపంలోకి వచ్చే సరికి శ్రీహరిపురం నుంచి బాగెంపేట వైపు వస్తున్న గంటాన తరుణ్ ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సింహాచలానికి తీవ్ర గాయాలు కావడంతో, రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్సై వి. ప్రసాద్ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పురుగు మందు తాగిన వ్యక్తి.. వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన బలగ సత్యంనాయుడు (67) పురుగు మందు తాగి మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యంనాయుడుకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మద్యం బాటిల్ అనుకుని పొరపాటున ఇంటిలో ఉన్న పురుగు మందు తాగేశాడు. వెంటనే అపస్మారకస్థితికి చేరుకున్న సత్యంనాయుడును కుటుంబ సభ్యులు రాజాం సీహెచ్సీకి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ నీలం శ్రీనివాసరావు తెలిపారు. -
అవయవదాతకు అంతిమ వీడ్కోలు
రాజాం సిటీ: రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన గెడ్డాపు ఎర్రయ్య (39) స్థానికంగా ఓ వాటర్ ప్లాంట్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నెల 16న ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాగోలు జెమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 26న బ్రెయిన్డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి డబ్బాడ వెంకటరమణ చొరవతో కుటుంబ సభ్యులకు అవయువ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో శనివారం అవయవ దానం చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. మృతదేహం గ్రామానికి వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం–శ్రీకాకుళం రోడ్డుకు చేరుకున్నారు. అవయువ దాత అమర్రహే అంటూ అంతిమయాత్ర నిర్వహించారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వినియోగం తగ్గించాలి
రీఫిల్స్, దోమల చక్రాల మితిమీరిన వినియోగం చాలా ప్రమాదకరం. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. చిన్న పిల్లలు, వృదుధలు, టీబీ పేషెంట్లు ఉన్నచోట వీటి వినియోగం పూర్తిగా నియంత్రించాలి. దోమతెరలు వాడడం, మస్కెటో కిల్లర్ బ్యాట్ల వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. అతిగా మస్కెటో రీఫిల్స్ వినియోగిస్తే చర్మసంబధిత వ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పన్నమవుతాయి. – గట్టి బార్గవి, పీహెచ్సీ వైద్యాధికారి, పొగిరి, రాజాం మండలం -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పక్కాగా ‘ముస్తాబు’ పాలకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవర్స్వప్నిల్ సూచించారు. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఏరోబిక్స్ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు రుచికరంగా భోజనం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అభినందన సీతంపేట: కొద్దిరోజుల కిందట సీతంపేటలో జరిగిన అన్వేష ఫెస్ట్లో అగ్రిటెక్ ప్రాజెక్టు, స్మార్ట్ఏటీఎం మోడల్స్ను ప్రదర్శించి విజేతగా నిలిచిన సీతంపేట ఏపీఆర్ బాలుర గిరిజన పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇనచార్జి పీఓ పవార్ స్వప్నిల్లు శనివారం అభినందించారు. సీనియర్స్లో ఎస్.అభినయ, వంశీకృష్ణ, జూనియర్ విభాగంలో లిఖిత్కు పార్వతీపురంలో ఓ కార్యక్రమంలో అభినందించినట్టు ప్రిన్సిపాల్ మధు తెలిపారు. శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు.పార్వతీపురం రూరల్: జిల్లాలోని రైతులకు రబీలోనూ కష్టాలు తప్పేలా లేవు. విత్తనాలు, ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారు. మొన్నటి ఖరీఫ్ సీజన్లో బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలకు పరుగు తీశారు. గంటల తరబడి నిరీక్షించారు. ఆ చేదు జ్ఞాపకాలు చెరిగిపోకముందే ‘రబీ’ సీజన్ ముంచుకొచ్చింది. ఇప్పుడు కూడా ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల మొక్కజొన్న రైతుకు యూరియా అందని పరిస్థితి. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం గణాంకాలతో అంతా సిద్ధమని ప్రకటిస్తున్నా.. ఆచరణలో శూన్యంగానే కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు. లెక్కల్లో ఆశాజనకం.. క్షేత్రస్థాయిలో..? అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాకు 6,028 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 2,452 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రైవేట్ డీలర్ల వద్ద 591 టన్నులు, సొసైటీల వద్ద 126 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 731 టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 961 టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. కాగితాల మీద ఈ లెక్కలు బాగానే కనిపిస్తున్నా.. సమయానికి లారీలు రాక, స్టాక్ పాయింట్ల వద్ద నో–స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ ఇలాగే ‘అంతా ఉంది’ అని చెప్పి, తీరా అవసరమైనప్పుడు చేతులెత్తేశారని చెబుతున్నారు. ప్రస్తుత రబీ (2025–26) సీజన్కు సంబంధించి జిల్లాలో ఎరువులు, విత్తనాల లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొన్నటి ఖరీఫ్ సీజన్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రబీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. జిల్లాలో సాగుకు అవసరమైన అన్ని వనరులను రైతులకు సమకూర్చేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. – అన్నపూర్ణ, జిల్లా వ్వవసాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం ఎరువులకు కటకట అరకొర విత్తనాల పంపిణీ కాగితాలపైనే ఎరువుల నిల్వలు.. క్షేత్రస్థాయిలో అందని పరిస్థితి -
మహాప్రస్థానం వాహన సదుపాయానికి ప్రతిపాదనలు
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహా ప్రస్థానం వాహనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు తెలిపారు. భద్రగిరి సీహెచ్సీలో చికిత్స పొందుతూ గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కడ్రక రాధమ్మ శుక్రవారం మృతిచెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ వాహనం లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడైన తన తమ్ముడు రోజూ చెత్త తరలించే రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ హృదయ విదారకర ఘటనపై ‘అక్కా క్షమించు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీసీహెచ్ఎస్ స్పందించారు. భద్రగిరి సీహెచ్సీని శనివారం సందర్శించారు. ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మృతదేహాన్ని తరలించేందుకు భద్రగిరి ఆస్పత్రికి ప్రత్యేకంగా ఎటువంటి వాహనం కేటాయించలేదని, మహా ప్రస్థానం వాహనం మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అప్పటివరకు ప్రత్యామ్నాయంగా అంబులెన్స్తో పాటు ఆయిల్ సదుపాయం కల్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆయన వెంట సీహెచ్సీ వైద్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. -
అంతా హడావుడే..!
● చేప పిల్లల విడుదలకు ఇదా సమయం.. ● 546 చెరువుల్లో 14 లక్షల చేప పిల్లలు ● రానున్న వేసవికి నీరు అడుగంటే ప్రమాదం ● మత్స్యశాఖ తీరుపై అసంతృప్తిసీతంపేట: మత్స్యశాఖాధికారులు హడావిడిగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. శనివారం నుంచి పలు గ్రామాల్లోని చెరువుల్లో పిల్లలు విడిచిపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరికొద్ది నెలల్లో వేసవికాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పుడు చేప పిల్లలను చెరువుల్లో ఎలా విడిచిపెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేసవిలో నీరు అడుగంటే అవకాశం ఉండడంతో చేప పిల్లలు ఎదుగుదల లేకుండా మధ్యలో చనిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఇవి ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ నియోజకవర్గ పరిధిలో 546 గిరిజనులకు చెందిన చెరువుల్లో 14 లక్షల చేపలు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారుల గణాంకాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా చేప పిల్లల పంపిణీకి కొద్ది రోజుల కిందట టెండర్లు నిర్వహించగా.. ఎల్వన్ బిడ్డర్ టెండర్ దక్కించుకున్నారు. ఐటీడీఏ నిధులు సుమారు రూ.15 లక్షల వరకు ఇందుకోసం వెచ్చించనున్నారు. సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లలు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సగానికి పైగా చెరువులు అడుగంటగా, మిగతా చెరువుల్లో నీరు ఉంది. అన్ని చెరువులూ మార్చి నెలాఖరుకు అడుగంటుతాయి. జూన్, జూలై నెలల్లో చెరువుల్లో చేప పిల్లలు వేయాల్సి ఉండగా..ఇప్పుడు వేయడం ఏం ప్రయోజనమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మత్స్యశాఖ జిల్లా అభివృద్ధి అధికారి ఏమన్నారంటే... ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సంతో ష్కుమార్ వద్ద ప్రస్తావించగా టెండర్లు ఆలస్యం కావడం వల్ల చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. వర్షాలు ఈ దఫా బాగా పడడంతో చెరువుల్లో నీరు ఉందన్నారు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడే చేప పిల్లలు వేయనున్నట్లు చెప్పారు. -
దాడి చేసిన వారిని శిక్షించాలి
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్నగర్ కాలనీకి చెందిన దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాలనీ మీదుగా నిర్మించిన మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడంతో పాటు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సిద్ధార్థ్నగర్కు చెందిన దళితులు 22 రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ముంజేరు గ్రామంలోని వాడుకనీరు వేరే మార్గం వైపు పోయేదని.. అయితే వాడుకనీరు పోయేందుకు వీలుగా సిద్ధార్థ్నగర్ కాలనీ మీదుగా కాలువ నిర్మించి, పనులు మధ్యలో నిలిపివేయడంతో మురుగునీరంతా కాలనీలో నిలిచిపోతోందని చెప్పారు. ఇదేమని అడిగిన వారిప కొంతమంది దాడి చేశారన్నారు. కాలువను నాగులగెడ్డ వద్దకు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలకు చెందిన నాయకులు, దళితులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమలవిజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ(జాతీయ మహిళా సమైక్య) రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అమర్భవన్లో ఆ సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, జిల్లా కార్యదర్శి బుగత పావనిల ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందన్నారు. ఇకనుంచి అయి నా మహిళలపై వివక్ష లేకుండా చూడాలని, వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
మెగా పశు వైద్య శిబిరం
పార్వతీపురం రూరల్: జిల్లాలో పశుసంపదను వృద్ధి చేసి, రైతులకు పాడితో అదనపు ఆదా యం చేకూర్చడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ఎం.ఆర్.నగర్లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘మన్యం గోబాల సంబరం’ మెగా పశు వైద్య శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పశుపోషణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతు లు శాసీ్త్రయ పద్ధతులు పాటించి పాలు, మాంసం ఉత్పత్తిలో జిల్లాను అగ్రగామిగా నిలపాల ని పిలుపునిచ్చారు. శిబిరంలో వివిధ మండలా ల నుంచి వచ్చిన 162 ఉత్తమ జాతి లేగ దూడ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిపుణులైన వైద్య బృందం 126 పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా, 105 ఆవులు, గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు చేశారు. 652 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలె క్టర్ డా.ఆర్ వైశాలి, జిల్లా పశుసంవర్థక శాఖాధి కారి డాక్టర్ శివ్వాల మన్మథరావు పాల్గొన్నారు. పార్వతీపురం: వినూత్న కార్యక్రమాల అమల తో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్రెడ్డికి డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ కెవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు టి. జగన్మోహన్రావు, రఘుకుమార్, వినోద్ కు మార్, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం: రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో పార్వతీపురం వాసవీ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్.ఎం.నిఖిత ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం అభినందించారు. అలాగే, జిల్లాస్థాయిలోని వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఠాగూర్ నాయుడు, ఎం.ఎం.వైష్ణవి, కె. పూర్ణచంద్లను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు. రేగిడి: మండంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఇంతవరకు 33 వేల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిన ట్టు యాజమాన్యం శుక్రవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తీసుకువస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్టు వెల్లడించింది. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కేజీబీవీలో రెండేళ్ల కిందట నాటిన ఓ గులాబీ మొక్క నేడు విరబూసింది. 80 గులాబీ పూలతో బాలికలను ఆకర్షిస్తోంది. – గుమ్మలక్ష్మీపురం -
బాకై ్సట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళన
● కొటియా గ్రామాల ప్రజలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొటి యా గ్రూప్ 22 గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం బాకై ్స ట్ తవ్వకాలు చేపడుతుందని అక్కడి గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సంధ్యారాణితో పాటు సంబంధిత మంత్రులు, అధికారులు స్పష్టత ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వం త్వరలో పొట్టంగి బ్లాక్ పరిధిలో బాౖక్సైట్ తవ్వకాలకు సిద్ధమవుతోందని టీడీపీ ప్రభుత్వం గెజిట్ పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయన్నారు. ఈ తవ్వకాలు కొటియా గ్రూప్ గ్రామాల్లో, గ్రామ సమీప పరిసరాల్లో జరుగుతాయేమోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నా రు. క్రిస్మస్ వేడుకలకు తాను వెళ్లగా అక్కడి గిరిజనులంతా బాకై ్సట్ తవ్వకాలపై ఆందోళనకు గురైన విషయాలను వివరించారన్నారు. 22 కొటియా గ్రూప్ గ్రామాల్లో ఈ బాకై ్సట్ తవ్వకాలు జరుగుతా యో లేదోనన్న విషయంపై ఆంధ్రా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. స్టేటస్ కో అమలులో ఉన్న ఈ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం ఈ తవ్వకాలు చేపట్టినట్లయితే వెంటనే ఆంధ్రా ప్రభుత్వం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలని సూచించారు. ఆంధ్రాకు మద్దతుగా నిలుస్తున్నారని అక్కడి గిరిజనుల ను ఒడిశా అధికారులు బెదిరింపులకు గురిచేసి భయాందోళన పెడుతున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా స్దానిక మంత్రి సంధ్యారాణి గాని లేదా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు తదితర అధికారులెవరూ ఇక్కడి గిరిజనులు గోడును పట్టించుకోవడం గాని, ఈ ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా నిలబడతామని ధైర్యం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బాకై ్సట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు గిరిజనులు చర్చించుకుంటున్నారని, 2014–19 మధ్య కూడా ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడ గిరిజనులు వద్దంటున్నా బాకై ్సట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా ఆ ప్రాంతాలను నాడు జగన్మోహన్రెడ్డితో పాటు తాను వెళ్లి పర్యటించామని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అనుమతులు రద్దుచేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతులు రద్దుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఈ కొటియా గ్రామాల సమస్య పరిష్కారం కోసం తాను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి చర్చించారని వివరించారు. ఈ విషయంపై నాడు ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఈ బాకై ్సట్ గనుల గురించే అంటూ ఆరోపణలు చేశారని, మరినేడు ఈ బాకై ్సట్ తవ్వకాలపై మంత్రిగా కొనసాగుతూ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ విషయాన్ని గిరిజనులు గమనిస్తున్నారన్నారు. మంత్రి ప్రజావ్యతిరేక పాలనపై గిరిజన గూడల్లో చర్చసాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు బీసు, గొర్లె రాజారావు, తాడంగి కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి న్యాయం?
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతలబెలగాం గ్రామానికి చెందిన బెలగాం పారమ్మ అనే వృద్ధురాలు గురువారం చనిపోయింది. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక గుడి చెరువులో దళితులకు అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో కప్పిపెట్టారు. అయితే ఆ చెరువును ఆక్రమించిన రైతులు మృతురాలి కుటుంబ సభ్యులపై శుక్రవారం చినమేరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను మృతదేహాన్ని బయటకు తీయందే తాము ఒప్పుకోమని రైతులు డిమాండ్ చేశారని దళితులు తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్కు ఫోన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులో లేరన్నారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు. -
చెదిరిన బతుకులు
మూతబడిన జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ కర్మాగారంకరాల సత్తువ..నరాల బిగువూ ఉన్నంతకాలం స్వేదం చిందించి పరిశ్రమ ఉన్నతి కోసం పనిచేసిన కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలో పనికి అలవాటు పడి మరో పని చేతకాక..అర్ధాంతరంగా రోడ్డున పడిన బతుకులను చూసి మనోవ్యధ చెందుతున్నారు. కుటుంబాలను పోషించలేక..వేరే దారి లేక..ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ తలో దిక్కుకు చెదిరిపోయి కుటుంబ నావను ఈడ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదీ జిందాల్ కర్మాగారం మూసివేసిన తరువాత అందులో పనిచేసిన కార్మికుల దుస్థితి. -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో సంచరిస్తున్న ఏనుగులు శుక్రవారం ఉదయానికి గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ మేరకు ఎస్డబ్యూపీసీలోని స్తంభాలను ధ్వంసం చేసి చిందరవందర చేశాయి. గజరాజులతో ఇప్పటికే వివిధ గ్రామాల్లో ధన, ప్రాణనష్టం జరిగినప్పటికీ ఏనుగులను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో వాహనచోధకులు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పొలం పనులు ముమ్మరంగా ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకముందే ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్లో సీతం విద్యార్ధుల ప్రతిభ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ 2025–26 లో అద్భుత ప్రదర్శన కనబరిచి పలు పతకాలు సాధించారు. ఇటీవల మహారాజా పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్షిప్లో అథ్లెటిక్స్, వివిధ గేమ్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో కె.దీక్ష బాలికల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్లో బంగారు పతకం, 200 మీటర్ల రన్నింగ్లో కాంస్యపతకం సాధించింది. జి.పవన్కుమార్ బాలుర విభాగంలో ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించగా బాలుర విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు తృతీయ స్థానం లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వివిధ విభాగాల అధిపతులు విజేతలను అభినందించారు. -
వైన్ షాపులో స్కెచ్.. జిమ్ కోచ్ మర్డర్
● వెంకునాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది ● వ్యభిచార కార్యకలాపాల్లో తేడాల్లో కారణం ● ఏడుగురు నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ విష్ణుస్వరూప్ వెల్లడి పరవాడ: లంకెలపాలెం శ్రీరామనగర్ కాలనీలో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన ఈగల వెంకునాయుడు (39) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుకు సంబంధించి దాసరి తేజస్వి (దానబోయిన పాలెం, అగనంపూడి), కనాటి దేముడునాయుడు (శనివాడ దరి కేఎస్ఎన్రెడ్డి నగర్), గొల్లు దినేష్కుమార్ (ఎస్.కోట మండలం సీతారాంపురం), చింతాడ సూర్యప్రకాష్ (తురకపేట, హిరమండలం), గుడె జాన్ ప్రశాంత్కుమార్(దయాల్నగర్), అదురి దాసు(హెచ్బీ కాలనీ), గుందేటి వంశీ (సంజీవనిగిరి, గాజువాక)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జునరావుతో కలిసి డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీరామనగర్ కాలనీలో నివాసముంటున్న మొల్లి సరస్వతి.. కూర్మన్నపాలెంలోని ఓ జిమ్లో కోచ్గా పనిచేస్తున్న ఈగల వెంకునాయుడుతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత తేజ అనే వ్యక్తి వెంకునాయుడుకి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు పిలిచాడు. అలా వెళ్లిన వెంకునాయుడు తిరిగి రాలేదు. 24న ఉదయం ఇంటికి సమీపంలోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కక్షలు.. కుట్రలు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వెంకునాయుడు వ్యభిచార కార్యకలాపాల విషయంలో దాసరి తేజకు సహకరించకుండా, వేరే వర్గానికి మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా తేజ అనుచరుడైన కనాటి దేముడునాయుడును తరచూ కొట్టడం, తిట్టడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పనులు పురమాయించి అవమానించేవాడు. దీంతో తేజ, దేముడునాయుడు అతడిపై కక్ష పెంచుకున్నారు. అలాగే తేజకు సంబంధించిన వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్న ఇతరులకు సామూహిక శత్రువుగా మారిపోయాడు. ఈ నెల 23 రాత్రి దువ్వాడలోని ఓ వైన్ షాపులో శత్రువులంతా సమావేశమై వెంకునాయుడు హత్యకు పథకం రచించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. అర్ధరాత్రి అతనికి ఫోన్ చేసి బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన పెద్ద బండరాయితో ముఖం, తలపై పలుమార్లు మోది కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో కొందరు ప్రత్యక్ష దాడిలో పాల్గొనగా, మరికొందరు పరోక్షంగా సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం తాడి మూడు మదుముల వద్ద ఐదుగురిని, గాజువాక దుర్గానగర్ ప్రాంతంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎస్ఐలు మహాలక్ష్మి, భీమరాజు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎట్టకేలకు పట్టుబడిన దొంగలు
● 12 తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు రికవరీ లక్కవరపుకోట: పోలీసులకు సవాల్గా మారిన దొంగతనాలను ఎట్టకేలకు ఛేదించి ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 12 తులాల బంగారం ,రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. అరకు–విశాఖపట్నం రోడ్డులో ఎస్సై సీహెచ్.నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే దారిలో వస్తున్న ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారణ చేయగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన ఉప్పలూరి ఉదయ్భాస్కర్ అలియాస్ బాలు, అదే జిల్లా కై లాసపురం, సాలిగ్రామపురానికి చిరత శివలుగా తేలింది. వారిద్దరూ కొంత బంగారం తీసుకుని ఆరకు, అనంతగిరి ప్రాంతాల్లో అమ్మేందుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఆ ఇద్దరు నిందితులు లక్కవరపు కోట మండలంలోని గోల్డ్స్టార్ జంక్షన్లో జూలై 2023లో, అలాగే శ్రీరాంపురం గ్రామంలో ఆగస్టు2024లో ఇళ్లలో పట్టపగలే చొరబడి కిటికీ ఊచలు వంచి దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. -
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన కొత్తవలస పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ● ఆర్టీసీ బస్సుకింద పడిన వృద్ధుడు మృతి ● కళ్లెదుటే భర్త మృతితో రోదించిన వృద్ధురాలు కొత్తవలస: మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవ్విన మట్టిపోగులపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపైనుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్స్టేషన్కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ● ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది.. షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందాడు. -
ఇంటి స్థల ఆక్రమణపై ఆరా
భామిని: మండలంలోని మాసగూడకు చెందిన బిడ్డిక ఈనత్తు, లక్ష్మీకి చెందిన ఇంటిస్థలం ఆక్రమణపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆదివాసీ కుటుంబానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలంలో రాజకీయ కక్షతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం తలపెట్టడంతో బాధిత కుటుంబం కన్నీరుపెట్టింది. ఇదే విషయంపై ‘ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష’ అనే శీర్షిక ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ శివన్నారాయణ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మండల సర్వేయర్ రాజేశ్వరరావు, ఎమ్మారై మణి ప్రభాకర్, వీఆర్వో గిరిబాబుల బృందం మాసగూడలో ఆదివాసీ కుటుంబానికి ఇచ్చిన ఇంటి స్థల పట్టాను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థల పట్టా సరిహద్దులు సరిచూశారు. ప్రస్తుతం ఆదివాసీ కుటుంబం తలదాచుకొంటున్న పాక స్థలం గుర్తించారు. రోడ్డు పక్కనే స్కూల్కు ఎదురుగా అంగన్వాడీ కేంద్రానికి స్థలం కేటాయించామని అధికారులు వివరించారు. లబ్ధిదారు కుటుంబం సమ్మతిస్తే స్కూల్ వెనుక భాగంలోని డీ పట్టా భూమిలో ఇంటి స్థలం మంజూరు చేస్తామని సర్దిచెప్పారు. దీనికి గిరిజన కుటుంబం సమ్మతి తెలిపింది. కాగా, ఇదే సమయంలో కూటమి నాయకుడు రెవెన్యూ అధికారులపై ఫోన్లో కేకలు వేయడం వినిపించింది. ఆదివాసీ కుటుంబంపై కూటమి నాయకుడు కక్షసాధింపులకు దిగడంపై గ్రామస్తులు తప్పుబడుతున్నారు. -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
రైతు కంటకన్నీరు..!
పాలకొండ: ధాన్యం అమ్మకాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. మొదటి నుంచి రైస్ మిల్లర్లు పలు రకాలుగా రైతులను దోచుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుతో మిల్లర్లు మరింత మొండికేస్తున్నారు. ఈ ఏడాది సక్రాంతికి కూడా ధాన్యం అమ్మకోలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు రైతుల వద్దనే ఉన్నాయి. ఒక్క మిల్లుకూ లేని బీజీలు పాలకొండ మండల పరిధిలో 7 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు లేవని గడిచిన వారం రోజులుగా రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. దీంతో రైతులు పండించిన పంట ప్రస్తుతం గ్రామాల్లో పోగులుగా వేసి ఉన్నాయి. నూర్పులు వేసి ధాన్యం బస్తాల్లో వేసి సుమారుగా 20 రోజుల నుంచి కళ్లాల్లోనే ఉంచుతున్నారు. ఇతర మండలాల నుంచి తరలింపు ప్రస్తుతం పాలకొండ రైస్ మిల్లులకు జిల్లాలోని సాలూరు, పార్వతీపురం ప్రాంతాల నుంచి ధాన్యం లారీలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. మిల్లర్లు బీజీలు లేవంటూనే ఇతర మండలాల నుంచి ఇక్కడికి ధాన్యం తీసుకువచ్చి దించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజీలు లేకపోయినా ఇతర మండలాల నుంచి ధాన్యం తీసుకోవడం బీజీలు కొంచెం వస్తే ఆ ధాన్యానికి బీజీ మేరకు బిల్లులు చేస్తున్నారు. దీనిపై మిల్లర్లు ఇతర ప్రాంతాల్లో ధాన్యం మంచి దిగుబడి వస్తుందని అందుకే అక్కడి ధాన్యం తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఎఫ్సీకి వెళ్లడం లేదు ధాన్యం రైతుల నుంచి తీసుకోకపోవడంపై మిల్లర్లను ప్రశ్నిస్తే ఎఫ్సీకి ధాన్యం వెళ్లడం లేదని చెబుతున్నారు. మూడవ వంతు బీజీలు కూడా ఇంకా రాలేదని, దీంతో ధాన్యం తీసుకోవడం కుదరదని తెగేసి చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీలు వస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు.ధాన్యం నూర్పు చేసి 20 రోజులైంది. అప్పటి నుంచి రైస్ మిల్లుల చుట్టూ తిరుగుతున్నాం. బీజీలు లేవు అంటున్నారు. ఆర్ఎస్కేలకు వెళ్తే బీజీలు వస్తే ట్రక్షీట్ జనరేట్ చేస్తామని చెబుతున్నారు. ఇతర మిల్లుల వద్ద మాత్రం లారీలతో ధాన్యం దించుతున్నారు. అడిగితే మంచి ధాన్యమని అందుకే తీసుకుంటున్నామని చెబుతున్నారు. – దాసిరెడ్డి నారాయణరావు, రైతు, తంపటాపల్లిమిల్లులు పెడుతున్న అవస్థలతో విసిగిపోయాం. అదనంగా ధాన్యం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. అయినా ధాన్యం కొనే పరిస్థితి కనిపించడంలేదు. మా గ్రామంలో వేల బస్తాలు పోగులుగా ఉన్నాయి. అధికారులు గ్రామాన్ని సందర్శించి ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. కనీసం సంక్రాంతిలోపు ధాన్యం అమ్ముకోలేకపోతే పండగ కూడా చేసుకోలేము. –రుంకు వెంకటరమణ, రైతు, తంపటాపల్లి -
కమిషనర్ పోస్టు.. ఎన్నాళ్లో గ్యారంటీ ఉండదు!
● పార్వతీపురం గ్రేడ్ 1 మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి ● ఎవరొచ్చినా మూన్నాళ్ల ముచ్చటే ● తాజా బదిలీల్లో పావని నియామకం సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడికి కమిషనర్ గా ఎవరొచ్చినా.. మూన్నాళ్ల ముచ్చటే. పట్టుమ ని ఆరు నెలలు కూడా ఉండలేని పరిస్థితి. ఓ వైపు ప్రజలకు మంచి పాలన అందించడం కంటే.. రాజకీయాలకే మున్సిపల్ ప్రజా ప్రతినిధులు పరిమితమవుతున్నారు. స్వలాభం కోసం పార్టీల గోడలు దూకుతున్నారు. అభివృద్ధి పనులకు పలువురు మోకాలడ్డుతున్నారు. మరోవైపు.. రాజులేని రాజ్యంలా మున్సిపాలిటీ తయారైంది. ఉద్యోగులు గ్రూపులతో నిత్యం వీధికెక్కుతున్నా రు. ఫలితంగా మున్సిపాల్టీ విధులు, బాధ్యతలు ఎప్పుడో గాడి తప్పాయి. తాజాగా మరోసారి ఇక్కడి మున్సిపల్ కమిషనర్ మారారు. ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మున్సిపల్ కమి షనర్లను బదిలీ చేయగా.. పార్వతీపురానికి డి.పావనిని నియమించారు. వాస్తవానికి విశాఖ జీవీఎంసీ శానిటరీ సూపర్వైజర్గా పనిచేసిన కె.కిశోర్ కుమార్ను ఇటీవలే ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమించారు. నెలల వ్యవధిలోనే ఆయనకు స్థాన చలనం కలిగింది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి.. గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన పార్వతీపురం పురపాలక సంఘం.. మన్యం జిల్లా కేంద్రం కూడా నూ! జిల్లాకు కీలకమైన ఈ మున్సిపాలిటీకి కమి షనర్ల గండం ఉంది. కొన్నాళ్లుగా చూసుకుంటే.. గతంలో కె.శ్రీనివాసరావు రెగ్యులర్ కమిషనర్గా వచ్చారు. కేవలం ఆరు నెలల కాలమే పని చేశా రు. తర్వాత ఆయన స్థానంలో డీఈ శ్రీనివాసరాజులకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే మళ్లీ ఇక్కడ వెంకటేశ్వర్లును రెగ్యులర్ కమిషనర్గా నియమించారు. ఆయన హయాంలో మున్సిపాల్టీలో విభేదాలు తారస్థాయికి చేరా యి. అధికార పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. పాలక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్(వైఎస్సార్ సీపీ)కు సంబంధం లేకుండానే పలు నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ సమావేశాలు కూడా చాలా కాలం నిర్వహించలేదు. ఎట్టకేలకు నిర్వహించినా.. అచ్చం అధికార పార్టీ విధేయునిలా వ్యవహరించారు. ఉద్యోగులు కూడా ఆయన తీరుతో విసిగిపోయారు. నిరసనలు, ఫిర్యాదుల వరకూ వెళ్లారు. చివరికి ఆయన్ను సరెండర్ చేశారు. ఇన్చార్జి కమిషనర్గా పని చేసిన శ్రీనివాసరాజు మీద అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇక్కడ పని చేసిన కమిషనర్ వేధింపులు తాళలేక మహిళా టౌన్ ప్లానింగ్ అధికారిణి ఒకరు వెళ్లిపోయారు. ఇన్ని వివాదాల మధ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిశోర్ కుమార్ కూడా ఎక్కువ కాలం ఆ స్థానంలో పని చేయలేకపోయారు. తాజాగా బదిలీపై వస్తున్న పావని అయినా కొంత కాలం పని చేస్తారో లేదో చూడాలి. -
ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ను సత్కరించిన జేసీ
విజయనగరం: దుబాయి వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్–2025 పోటీల్లో బాడ్మింటన్లో గోల్డ్మెడల్ సాధించిన జిల్లాకు చెందిన పారా (దివ్యాంగ) క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్చంద్ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించి మెడల్స్ సాధించడం జిల్లా కు గర్వకారణమన్నారు. పారా క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోందని దివ్యాంగులంతా అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవఅధ్యక్షుడు కె.దయానంద్, జాయింట్ సెక్రటరీ కర్రోతు లక్ష్మి, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు, కోచ్లు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు
చంద్రబాబు పాలనలో జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ స్థాపన జరగలేదు. లక్కవరపుకోట మండలంలో గల మామహామాయ, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్, శారడ కార్మారం వంటివి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి పానలలో స్థాపన జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పానలలో కంటకాపల్లి గ్రామం వద్ద భారీ కర్మగారం అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. కాగా చంద్రబాబు పాలనలో పరిశ్రమల స్థాపనకు తీసుకునే భూములు బడా బాబులకు కేటాయించడమే తప్ప పరిశ్రమల స్థాపన జరగలేదు. ఉన్న పరిశ్రమలకు రాయి తీలు కట్ చేయడంలో సంక్షోభంలో నడుస్తున్నాయి.చంద్రబాబు పాలన అంటే పరిశ్రమల మనుగడ కష్టంగా మారిపోతుంది. ఇందుకు ఉదాహరణ జిల్లాలోని పరిశ్రమలే. –నెక్కల నాయుడుబాబు, జిందాల్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీసీ రాష్ట్ర కార్యదర్శి. -
సీనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు సత్తా చాటింది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడ జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్ అండ్ మేనేజర్లను జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. అంబకండిలో అగ్నిప్రమాదంరేగిడి: మండల పరిధిలోని అంబకండి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురి రైతులకు చెందిన ధాన్యం బస్తాలు, గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు అందించిన సమాచారం మేరకు అందరూ పొలాల్లో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవర్న సత్యంనాయుడు, ఎవర్న రాము, ఎవర్న లక్ష్మి, ఎవర్న రామునాయుడు, ఎవర్న రాము, కరకవలస ఆదినారాయణ, తదితర రైతులకు చెందిన 50 బస్తాల ధాన్యంతో పాటు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. ఆరుగాలం కష్టించి పండించుకున్న పంట చేతికందొచ్చిన సమయంలో అగ్గిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానికులు రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి కొంతమేర మంటలు అదుపుచేయడంతో పరిసర ప్రాంతాల్లోని చేనుకుప్పలకు ప్రమాదం జరగకుండా ఆపగలిగారు. ● బాలికకు తీవ్ర గాయాలు కొమ్మాది: భీమిలి బీచ్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి.. తొలుత రోడ్డు పక్కన ఉన్న జనరేటర్ను, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట సమీపంలోని వీబీసీ కాలనీకి చెందిన వాసుపల్లి కార్తీక అనే బాలిక నగరపాలెం జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నగరం నుంచి భీమిలి వైపు అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పింది. ముందుగా రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద జనరేటర్ను బలంగా ఢీకొనడంతో అది తిరగబడిపోయింది. అనంతరం అక్కడి నుంచి దూసుకెళ్లి బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను రుషికొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తల్లి వాసుపల్లి నూకరత్నం తెలిపారు. కారును విజయనగరం జిల్లా రాజాంనకు చెందిన ఎర్రగుంట్ల ప్రీతమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బాలిక తల్లి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్లో 4,5 నంబర్ ప్లాట్ఫామ్పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండడంతో జీఆర్పీ సిబ్బంది గమనించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుందని, 5 అడుగుల 8 అంగుళాల పొడవు కలిగి చామన ఛాయ రంగు ఉన్నాడని, తెలుపురంగుపై పింక్ కలర్ పువ్వులు గల ఫుల్హ్యాండ్ షర్ట్, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 8309430708 నంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు. -
తప్పు చేసిన వారు తప్పించుకోలేరు
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకు పోలేరని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు తదితర విషయాలపై మంత్రి సంధ్యారాణి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైఎస్సార్సీపీ నుద్దేశించి మాట్లాడిన మాటలపై రాష్ట్ర వైఎస్సార్సీపీ లీగల్ టీమ్ పరిశీలించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాలూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలు ముందుగా మీడియాతో మాట్లాడిందని, అదే బాధితురాలు ఎస్పీకి లిఖిత పూర్వకంగా కంప్లెయింట్ ఇచ్చి పార్వతీపురంలో మీడియాతో మాట్లాడి మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారంలో సతీష్ అరెస్ట్ కాకుండా ఉండాలనే రాజకీయ ఒత్తిళ్ల వల్లనే బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 15 టన్నుల అక్రమ పేలుడు పదార్థాలు ధ్వంసంవేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతుల్లేకుండా రవాణా చేస్తూ పట్టుబడిన పేలుడు పదార్థాలను అత్యంత భద్రతా చర్యలతో పోలీసులు శుక్రవారం నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2018లో రాతి క్వారీలకు ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జికోర్టు ఉత్తర్వుల మేరకు బాంబ్ స్కాడ్ టీమ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్, ఇద్దరు వీఆర్ఓలు, పోలీసు సిబ్బంది సమక్షంలో కరకవలసగ్రామంలో ఎవరూ సంచరించని ప్రదేశంలో 15000 కేజీల అక్రమ పేలుడు పదార్థాలను ధ్వంసం చేశారు. -
థర్మాకోల్ షీట్లే బోట్లు..!
సాలూరు రూరల్: ఆర్భాటంగా హామీలివ్వడం ఆనక ఆచరణ శూన్యంలా తయారైంది ప్రస్తుత గిరిజన, శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిస్థితి అని నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది. మంత్రి తొలి సంతకం ఏఎన్ఎంల నియామకంపై చేసినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే మున్సిపాలిటీలో మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఏడాదిన్ననర గడుస్తున్నా ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ఇటీవల వెంగళరాయ సాగర్లో చేపల విడుదల కార్యక్రమంలో తమకు బోట్లు మంజూరు చేయాలని, థర్మాకోల్షీట్ పడవలతో చేపలవేటతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని మంత్రికి మత్స్యకారులు విన్నవించుకున్నారు. దీనికియ మంత్రి వెంటనే మత్స్యకారులకు బోట్లు మంజూరుతో పాటు డిసెంబర్ కల్లా బోటు షికారు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అసలు మత్స్యకారులకు బోట్లు లేక చేపల వేటకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బోటు షికారు అంటూ మరో మెట్టు ఎక్కి బోట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తమకు కష్టాలు తీరిపోతాయని చేపల వేటతో పాటు బోటు షికారుతో పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుందని ఆశపడిన మత్స్యకారులకు చుక్కెదురైంది. డిసెంబర్ కల్లా బోటుషికారు వచ్చేస్తుందని ఎదురు చూసిన మత్స్యకారులకు ఇంతవరకు చేపల వేటకు అవసరమైన బోట్లు అందలేదు. అసలు ఆ బోట్లు ఎప్పుడు ఇస్తారో కూడా అధికారులు చెప్పడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు.చేపల వేటకు బోట్లు మంజూరు చేసేముందు ఇప్పటివరకు ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారికి బోట్లు మంజూరు చేయాలి. వారిని గుర్తించిన తరువాత బోట్లు కొంటాం. జిల్లాకు 6 ఫిషింగ్ బోట్లు మంజూరయ్యాయి. ఇంకా బోట్లు కొనుగోలు చేయలేదు. పర్యాటక బోట్ల విషయమై ఆ శాఖఅధికారులతో మాట్లాడాల్సి ఉంది. ఫిషింగ్ బోట్లు పర్యాటక బోట్లు వేరుగా ఉంటాయి. మత్య్స శాఖ ఎ.డి.ఎఫ్ సంతోష్ కుమార్ -
పరిపాలన కేంద్రీకరణ ఆలోచనలు మానుకోవాలి
పాఠశాల విద్యలో పరిపాలన వికేంద్రీకరణకు అవకాశం ఉన్నప్పటికీ.. పరిపాలన కేంద్రీకరణ దిశగా నిర్ణయాలు ఉండడం బాధాకరం. పదోతరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు సిద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణ, ఇన్విజిలేషన్, వాల్యుయేషన్ నియామకాలు కూడా రాష్ట్రస్థాయి నుంచే వచ్చే ఆదేశాలను అమలు చేయాలనే ఆలోచనలను వెనక్కి తీసుకోవాలి. మండల స్థాయి అధికారుల నిర్ణయాలను విజయవాడ కేంద్రంగా తీసుకుంటుండటం ఆశ్చర్యంగా ఉంది. –జే.సీ.రాజు, స్టేట్ అకడమిక్ కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ● -
జనవరి 3 నుంచి తెలుగు మహాసభలు
రాజాం సిటీ: అమరావతిలో 2026 జనవరి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని యువ రచయితల వేదిక అధ్యక్షుడు, విశ్వసాహితీ కళావేదిక రాష్ట్ర యువజన అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి ముకుందరావు పిలుపునిచ్చారు. యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక చీపురుపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మహాసభల వాల్పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభలు జరగనున్నాయని చెప్పారు. తెలుగుభాష పరిరక్షణ, తెలుగు భాష భవిష్యత్ కోసం ఈ మహాసభలకు తెలుగువారంతా హాజరుకావాలని కోరారు. భాష బతకాలంటే పిల్లలు, యువత భాషపై మక్కువ పెంచుకోవాలని అన్నారు. రెడ్క్రాస్ సభ్యులు కొత్తా సాయిప్రశాంత్కుమార్, పెంకి చైతన్యకుమార్, మరిశర్ల గంగారావు, ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, కరణం శంకరరావు, చీమకుర్తి ప్రసాద్, కోట తిరుపతిరావు, రెడ్డి శ్రీనివాసరావు, వి.సుబ్బారావు, రెడ్డి కాశీనాయుడు, బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు. -
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం
భోగాపురం: మండలంలోని కవులవావాడ గ్రామానికి చెందిన కొండపు రాంబాబు అనేవ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 2025 సెప్టెంబర్ 21వ తేదీన రూ.2 లక్షలు మాయమైనట్లు సీఐ కె దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ఆప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ చెప్పారు. డ్రోన్తో గమనించి కేసుల నమోదుశృంగవరపుకోట: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఎస్.కోట– శివరామరాజుపేట రోడ్డులో పోలీసులు డ్రోన్తో పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి 3కేసులు నమోదు చేశారు. మద్యం తాగి బైక్ నడుపు తున్న వ్యక్తిని గుర్తించి డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఇటీవల పోలీసులు డ్రోన్ ఫ్లైతో అనుమానిత ప్రాంతాలను జల్లెడ వేసి శోధిస్తున్నారు మందుల షాపులో అగ్నిప్రమాదంకొమరాడ: మండలంలోని విక్రంపురంలో విద్యుత్ షార్కసర్క్యూట్తో గురువారం రాత్రి ఓ మెడికల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..షాపు యాజమాని ఎనిమిది గంటల సమయంలో షాపు కట్టేసి ఇంటికి వెళ్లిన తరువాత విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చుట్టుపక్కల వారు సమాచారం అందించగా తక్షణమే అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు. షాపులో ఉన్న మందులు కాలిపోవడం షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మహిళ అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గురువారం అదృశ్యమైంది. ఇందుకు సంబంధించి ఎస్సై అశోక్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోనీ వీటీ అగ్రహారం యాత వీధికి చెందిన మహిళ(45)కు పైళ్లె ఒక కూతురు ఉంది. ఇటీవల ఆమె ఓ మహిళ నుంచి ఐదున్నర తులాల బంగారం అవసరాల దృష్ట్యా తీసుకుంది. బంగారం ఇచ్చిన సదరు మహిళ అడుగుతుండగా ఇదిగో అదిగో ఇచ్చేస్తానంటూ వాయిదాలతో తప్పించుకు తిరగసాగింది. ఇటీవలే ఆ బంగారం ఇచ్చిన మహిళ మళ్లీ అడిగింది. ఇక లాభం లేదనుకుని ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అదృశ్యమైన మహిళ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. కనక మహాలక్ష్మికి కుంభాభిషేకం విజయనగరం టౌన్: పట్టణంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న అభయాంజనేయస్వామి ఆలయంలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి పుష్యమాసం గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభాభిషేకం చేపట్టారు. ప్రధానార్చకుడు వీకే గాయత్రీశర్మ ఆధ్వర్యంలో అర్చకులు భక్తుల గోత్రనామాలతో పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా.. పూసపాటిరేగ: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు అన్నారు. మండలంలోని కొవ్వాడకు చెందిన దేబార్కి రామారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకన్న రఘు బాధిత కుటుంబానికి రూ. 20 వేల నగదును గురువారం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
8 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ: మండలంలోని పూసపాటిరేగ గ్రామంలో అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ గురువారం తెలియజేశారు. అనుమతిలేని షాపులో ఎనిమిది మద్యం సీసాలు ఉండడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనధికార మద్యం షాపు నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనధికార మద్యం షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఎస్సై చంద్రమోహన్, సిబ్బంది సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు ఉన్నారు. -
తూనికల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
● అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి ● ఆకస్మిక తనిఖీల్లో 19 కేసుల నమోదు ● ఎలక్ట్రానిక్ కాటాల్లో భారీగా తేడాలు గుర్తింపుసాలూరు: కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో తూనికలు/కొలతల శాఖ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ పి.వి. రంగారెడ్డి నేతత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చేపల మార్కెట్, పెద్ద బజార్లోని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కిరాణా షాపుల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఉల్లంఘనలు. ఎలక్ట్రానిక్ కాటాలపై మోసానికి సంబంధించి 8 కేసులు, నిర్ణీత కాల పరిమితిలో కాటాలకు ప్రభుత్వ ముద్రలు వేయించనందుకు 6 కేసులు నమోదు చేశారు. అలాగే ప్యాకెట్లపై తయారీదారు పేరు, చిరునామా, ధర, తయారీ తేదీ వంటి వివరాలు లేనందుకు 5 కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఒకే రోజులో వివిధ ఉల్లంఘనలపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వినియోగదారులను తూనికలు, కొలతల్లో మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారస్తులు తూనికలు, కొలతల్లో తేడాలు లేకుండా సరుకులు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పార్వతీపురం లీగల్ మెట్రాలజీ ఇనన్స్పెక్టర్ కె.రత్నరాజు, విజయనగరం ఇన్స్పెక్టర్ బి.ఉమా సుందరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కారు, లారీ ఢీకొని ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని గుండపురెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పసుపులేటి దక్షిణామూర్తి (58) చీపురరుపల్లి నుంచి కారులో విశాఖపట్నం వెళ్తుండగా జీఆర్పాలెం సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న దక్షిణామూర్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి డాన్ అరెస్ట్
● రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపువిజయనగరం క్రైమ్: గంజాయి రవాణాలో డాన్గా వ్యవహరిస్తున్న పఠాన్ బాషా అలీని విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై కృష్ణమూర్తి పఠాన్ బాషా ఆలీనీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, కొత్తవీధికి చెందిన పఠాన్ బాషా అలీ (31) విజయనగరంలోని ఫూల్బాగ్లో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. విజయనగరం టూ టౌన్ పీఎస్ పరిధి బాబామెట్ట ప్రాంతంలో గత ఏడాది 10 కిలోల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు మరో కేసులో 3.10 కిలోల గంజాయితో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2021లో గంట్యాడ పీఎస్ లో 1596.36 కిలోలు, 2023లో బాపట్ల జిల్లా నిజాంపట్నం పీఎస్ పరిధిలో 1.5 కిలోలల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలింది. దీంతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
పది యాక్షన్ ప్లాన్ వల్ల రాష్ట్రస్థాయి ఫలితాలు రావు
పదోతరగతి ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ రాష్ట్రస్థాయిలో ఒకే విధానంలో ఉండడం వల్ల ఫలితాలు రావు. ఒక్కో జిల్లాలో ఒక్కో స్థాయిలో విద్యార్థుల ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఆయా జిల్లా స్థాయి విద్యార్థుల అవగాహనకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాం. స్టడీ మెటీరియల్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి. ఆన్లైన్లో ఇచ్చిన పేపర్ను ప్రతిరోజు జిరాక్స్ తీసుకుని రాయడం విద్యార్థికి ఆర్థికంగా భారం. స్లిప్ టెస్ట్ మార్కుల పోస్టింగ్ పనులు ఇవ్వడం వల్ల విద్యార్ధి ప్రిపరేషన్పై టీచర్స్ దృష్టిపెట్టలేక పోతున్నారు. –వై.అప్పారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ● -
పది ప్రణాళిక తీరుపై గుర్రు
విజయనగరం అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక అమలు తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ పోకడలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నూతనంగా అమలులోకి తీసుకొస్తున్న పరీక్షల నిర్వహణ విధానం తలనొప్పిగా మారిందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచి వస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పాతర పరీక్షల క్షేత్రస్థాయి విధులు నిర్వహించే ఇన్విజిలేటర్ నుంచి మూల్యాంకన ప్రక్రియ వరకు అన్ని స్థాయిలలోనూ విధులు కేటాయించే నిర్ణయాలు రాష్ట్రస్థాయి అధికారుల చేతుల్లోనే ప్రభుత్వం ఉంచింది. జిల్లా, క్షేత్రస్థాయి అధికారుల అధికారాలు, రూల్స్ ప్రివిలైజేషన్ ద్వారా సంక్రమించిన విధులు, బాధ్యతలను కూడా రాష్ట్రస్థాయి అధికారులకు ప్రభుత్వం హస్తగతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలు మండల విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని వాపోతున్నారు. మరోవైపు ఇన్విజిలేటింగ్ విధుల కేటాయింపులో గందరగోళం తప్పదని తెలుస్తోంది. మండలానికి రెండు, మూడు పరీక్షా కేంద్రాలు ఉంటే ఆ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేట్ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు అవే కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు ఇన్విజిలేషన్ డ్యూటీలు, బాధ్యతలు వంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ విధానంలో కాకుండా ప్రభుత్వ తాజా ఆలోచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కేంద్ర కార్యాలయమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులే ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తే పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విద్యార్థులు ఒకే కేంద్రంలో ఉండే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు అవకాశం లేదని వాపోతున్నారు. ఇతర శాఖల పెత్తనం మరోవైపు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణ ఉపాధ్యాయులకు గుదిబండలా తయారైంది. ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు సంబంధం లేని ఇతర శాఖల మండలాల అధికారులను నియమించడం వారికి మింగుడు పడడం లేదు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, వశుసంవర్థక శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతోపాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పరిశీలనకు వచ్చిన వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాల్సి ఉంటుంది. షైనింగ్, రైజింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది కూడా తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులకు పెత్తనం ఇవ్వడంపై ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
●గాడిదపాయిలో కందికొత్తల పండగ
సీతంపేట మండలం గాడిదపాయి గ్రామంలో గురువారం కందికొత్తల పండగను గిరిజన ఆచార, సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న జాకరమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చేతి‘కంది’న తొలి పంటతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. దేవతల ప్రతిరూపంగా ఛత్రమ్మ (నెమలి పించాలు)ను ఊరేగించారు. ఇంటింటికీ తీసుకెళ్లిన ఛత్రమ్మకు దూపదీప నైవేద్యాలతో పాటు కర్పూరహారతులు ఇచ్చారు. డప్పువాయిద్యాలతో ఆడ, మగ, చిన్నాపెద్దా తేడా లేకుండా నృత్యాలు చేశారు. ఐదురోజుల పండగలో చివరిరోజు దోనుబాయిలో గిరిజనులమంతా కలిసి పండగ చేసుకుంటామని, ఆ తర్వాత కందులతో తయారుచేసిన వంటకాలను భుజిస్తామని గాడిదపాయి వాసులు తెలిపారు. – సీతంపేట -
ఆ అధికారితో వేగలేం..!
విజయనగరం ఫోర్ట్: ఆ అధికారి అంటే ఐసీడీఎస్ ఉద్యోగులకు హడల్. టీడీపీ నేత అండతో ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండం, పెద్దపెద్ద కేకలు వేయడం, చేతిలో ఏది ఉంటే దానిని వారిపై విసిరేస్తుండడంతో బెదిరిపోతున్నారు. ఉద్యోగం చేసేందుకు భయపడుతున్నారు. తాము కూడా ఉద్యోగులమన్న కనీసం జ్ఞానం లేని అధికారితో వేగలేకపోతున్నామంటూ తెలిసినవారి దగ్గర గోడు వెళ్లబోస్తున్నారు. అయితే, ఆయనకు అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు. ఐసీడీఎస్లో ఓ అధికారి వేధింపులతో హడిలిపోతున్న ఉద్యోగులు టీడీపీ నేత అండతో రెచ్చిపోతున్న అధికారి ఆయనకు నచ్చకుంటే గిరిజన ప్రాంతాలకు బదిలీ అధికారి వేధింపులు తట్టుకోలేక ఆస్పత్రిపాలైన ఓ మహిళా ఉద్యోగి -
ఆధునిక కాలంలో ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్స్ వచ్చినా మగువల్లో గోరింటాకు ముచ్చటే వేరు. స్నేహితులు, బంధువులతో పాటు చేతిపై ముగ్గులు వేసే నైపుణ్యం ఉన్నవారితో గోరింటాకు పెట్టించుకుని సంతోషపడతారు. దీనికి విజయనగరం సిమ్స్ బాప్టిస్టు చర్చి వద్ద బుధవారం కనిపిం
● 108 కేజీల చిత్రాన్న నివేదన జామి మండలం అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం తిరుప్పావడ (108 కేజీలు చిత్రాన్న నివేదన) సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఫణిహరం సీతరామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. గోదాదేవిని ఆలయ ప్రాంగణంలో పల్లకిలో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదవితరణ చేశారు. – జామి పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో చిత్రాన్ననివేదన -
వేణుగోపాల స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
బొబ్బిలి: పట్టణంలోని పురాతన దేవాలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ గురువారం దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన నుంచి తిరిగి వస్తూ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ పురోహితులు, దేవదాయ శాఖ సిబ్బంది, ఎమ్మెల్యే, తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన చేతులమీదుగా అర్చకులు పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి బబిత, న్యాయమూర్తి రోహిణీ రావు, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి దామోదర రావు, ఏపీపీ గంటి శర్మ, సీఐలు కె.సతీష్కుమార్, సీహెచ్ నారాయణరావు, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
ఆశలున్నాయ్.. ఆటే లేదు!
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ గురువారం దర్శించారు. ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, కార్యనిర్వాహణాధికారి బి.శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు ముందుగా ఆయనకు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం వేదాశీస్సులు, తీర్థ ప్రసా దాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో విజయనగరం జిల్లా జడ్జి ఎం.బబిత, పార్వతీపురం రెండవ అదన పు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు, టీటీడీఎస్ టీ సభ్యులు డి.పారినాయుడు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసి తను వేసిన నఖచిత్రాయణం, చిత్ర సాహితీ పుస్తకాలను అందజేశారు. విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్జీజీఓఎస్) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు వచ్చేనెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు సంఘ ఎన్నికల అధికారి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికలకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎన్జీజీఓఎస్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా, అదే జిల్లా కార్యదర్శి కేపీవీఎన్బీ కృష్ణ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారని పేర్కొన్నా రు. అమరావతికి చెందిన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఎన్నికల అబ్జర్వర్గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. విజయనగరం జిల్లా కమిటీలో సుమారు 6,001 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా ఈ ఎన్నికల్లో 283 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, కోశాధికారి, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, మహిళా జాయింట్ సెక్రటరీతో పాటు మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం విజయనగరం ఏపీఎన్జీజీఓహోంలో జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి ఎన్నికై న ఆఫీస్ బేరర్స్, డీసీ, డీఈసీ, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. వంగర: ఇనాం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పిన్నింటి రామారావు తెలిపారు. మండలంలోని మరువాడ పంచాయతీలోని సీతాదేవిపురంలో వివాదాస్పద ఇనాం భూములను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. భూములకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కలెక్టర్కు నివేదిస్తామని వెల్లడించారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో క్రీడా ప్రతిభకు కొదవ లేదు. సానబెడి తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. సరైన ప్రోత్సాహం లేకపోవడం క్రీడాకారులకు శాపంగా మారింది. గతంలో జిల్లాకు చెందిన గిరిజన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించా రు. ఇప్పుడు వారంతా తెరమరుగయ్యారు. అందు కు కారణం పేదరికం, వెన్నుతట్టి ప్రోత్సహించేవా రు కరువవడం.. వసతులు లేకపోవడంతో చాలా మంది క్రీడలకు దూరం అవుతున్నారు. మన క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఇటీవల ప్రకటించారు. 2030లో మన దేశ ఆతిథ్యంతో నిర్వహించబోయే కామన్వెల్త్ క్రీడల్లో మన్యం జిల్లా క్రీడాకారులు పతాకాన్ని ఎగురవేసేలా వారిని సిద్ధం చేస్తామని చెప్పారు. ఆయన ఆశయం మంచి దే అయినా.. ఆచరణే అనేక సవాళ్లతో కూడుకున్న ది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో క్రీడాకారుల కు, క్రీడాభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. సరైన సౌకర్యాలు, మంచి పౌష్టికాహారం అందించ డం ఖర్చుతో ముడిపడి ఉంది. అందుకు నిధుల లేమి క్రీడాకారుల ఆశయాన్ని నీరుగార్చుతోందన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచేందుకు ఈ నెల 12 నుంచి 14 వరకు పాఠశాల స్థాయి ఎంపికలు నిర్వహించారు. 15 నుంచి 17 వరకు జిల్లాస్థాయి పోటీలు చేపట్టారు. నైపుణ్యం ఆధారంగా వీరికి క్రీడా పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని చెబుతున్నారు. విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్ బాల్, చదరంగం, క్రికెట్, హ్యాండ్ బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్, తైక్వాండో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, బీచ్ వాలీబాల్ ఫెన్సింగ్ పోటీల్లో క్రీడాకారులను సానబెట్టాలన్నది ఆలోచన. జిల్లాలో క్రీడల అభివృద్ధికి వనరులు, అవకాశం ఉన్న గుమ్మలక్ష్మీపురం, తోటపల్లి, సీతంపేట, సాలూరు కేంద్రా ల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల కిందటే పాచిపెంట మండలం తోణాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను క్రీడా పాఠశాలగా తీర్చిదిద్దే ప్రయ త్నం చేశారు. అది ఫలితం ఇవ్వలేదు. పలువురు ఉపాధ్యాయులపై కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది. ఆ తర్వాత రావాడ–రామభద్రపురంలో క్రీడా పాఠశాల, మైదానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీని కోసం స్థానిక పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాల మధ్యనున్న సుమారు 12 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అది కూడా ముందుకు సాగలేదు. గతంలో పలుమార్లు ఇక్కడ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు, వేసవి క్రీడా శిబిరాలు సైతం నిర్వహించా రు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న క్రీడ విలువిద్య. మన్యంలోని గిరిజన విద్యార్థులు ఎక్కువగా ఈ ఆటపై ఆసక్తి చూపుతున్నారు. సరైన క్రీడా సామగ్రి లేకపోవడంతో జిల్లా స్థాయికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో ఎనిమిది గిరిజన మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 30 వేల మంది వరకు విద్యార్థులు గిరిజన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. వీరిలో వందల సంఖ్యలో విలువిద్య శిక్షణ తీసుకున్నారు. గతంలో జరిగిన పోటీల్లో అనేక మంది జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయికి కూడా కొందరు వెళ్లారు. కొన్నాళ్లుగా వారి నుంచి కూడా ఆసక్తి సన్నగిల్లింది. విలువిద్య పోటీలు మూడు విభాగాలలో ఉంటాయి. ఒక్కో రౌండుకు ఒక్కో రకమైన బౌ (విల్లు) వాడాలి. జిల్లా విద్యార్థులు స్తోమత లేక ఒక రకమైన బౌ మాత్రమే వాడడంతో రెండో రౌండ్లో సత్తా చాటలేక చతికలపడుతున్నారు. ●2022, 23, 24లో స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా ఆతిథ్యం ఇచ్చింది. పలు ప్రాంతాల నుంచి 600 మందికి పైగా వచ్చారు. జిల్లా నుంచి పదుల సంఖ్యలో పోటీ పడినా ఒక్కరే జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ●గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట జిల్లాలో పెద్దఎత్తున క్రీడా పోటీలను నిర్వహించింది. జిల్లా లోని 350 గ్రామ, వార్డు సచివాలయాలు, 15 మండలాలు, 4 నియోజకవర్గాల స్థాయిలో నాలుగు దశల్లో క్రీడలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడలు ఆడించా రు. క్రీడల నిర్వహణకు సచివాలయానికి రూ.10 వే లు, మండలానికి రూ.25 వేలు, నియోజకవర్గానికి రూ.25 వేలు చొప్పున విడుదల చేశారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ ఆలోచనకే స్వస్తి పలికింది. ఏపీ పీఎస్ఏ నూతన కార్యవర్గం ఎన్నికరాజాం సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) నియోజకవర్గ స్థాయి నూత న కార్యవర్గాన్ని స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో గురువారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బెవర ఈశ్వరరావు, కార్యదర్శిగా నడికొప్పల తారకేశ్వరరావు, కోశాధికారిగా ఎం.కిషోర్, ఉపాధ్యక్షురాలిగా జె.రాజేశ్వరి, జాయింట్ సెక్రటరీగా పొట్టా అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని విజయనగరం అధ్యక్షుడు గట్టి పాపారావు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి.సింహాచలం, స్టేట్ కౌన్సిల్ కో–ఆర్డినేటర్ రామ్మోహన్, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఈ.గణపతి పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం: పార్వతీపురానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, ఎస్పీ మాధవ్రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ ఉన్నారు. మానవేంద్రనాథ్రాయ్ గురువారం గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గొరడలో వావిలాల బాపూజీ స్మారక వ్యవసాయ విజ్ఞాన సమాచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీతంపేట: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు సూచించారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన అన్వేష ఫెస్ట్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మా ట్లాడారు. 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 292 ప్రాజెక్టులు ప్రదర్శించడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించా రు. సైన్స్ఫెస్ట్లో సీనియర్, జూనియర్ విభాగా ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు టీచర్ మోడల్స్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫే ర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ జి.రామ్మోహన్రావు, ఏటీడబ్ల్యూఓలు మల్లిఖార్జునరావు, సూర్యం, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష
● జగనన్న ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి పునాది ● వీధిన పడిన దివ్యాంగుడి కుటుంబం భామిని: మండలంలోని మాసగూడలో నిరుపేద ఆదివాసీ గిరిజన కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కూటమి నాయకుడు కక్షగట్టాడు. గత ప్రభు త్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని లాక్కుని అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి పూనుకున్నాడు. దీంతో దివ్యాంగుడైన బిడ్డిక ఈనత్తు, భార్య లక్ష్మి దంపతులతో పాటు ముగ్గురు కుమారులు వీధినపడ్డారు. బిడ్డిక లక్ష్మిపేరున గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది. అందులో పూరిపాక వేసుకుని గిరిజన కుటుంబం నివసిస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పీఎం జన్మాన్ పథకంలో పక్కాగృహం మంజూరైందని హౌసింగ్ అధికారులు చెప్పడంతో ఇంటి నిర్మాణం కోసం రాళ్లుకూడా తెప్పించుకున్నారు. ఇది చూసిన కూట మి నాయకుడు కక్ష పెంచుకున్నాడు. వారు నివసిస్తు న్న పూరిపాక స్థలంలో కొత్తగా వచ్చిన మినీ అంగన్వాడీ భవనం నిర్మాణం పేరున జేసీబీతో బుధవా రం పునాదులు తవ్వించారు. వాస్తవంగా అంగన్వాడీ భవన నిర్మాణానికి వేరే దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ను కూడా అధికారులు ఇచ్చారు. అయితే, దివ్యాంగుడి కుటుంబంపై ప్రతీకారంతో అధికారులపై వత్తిడి తెచ్చి మరీ గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం తలపెట్టడంపై బాధిత కుటుంబంతో పాటు గిరిజన సంఘా ల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. -
ఏపీఎన్జీఓ ఎన్నికలు ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీఎన్జీఓ) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా ముగిశాయి. నామినేషన్ల ప్రక్రియలో ప్రతి పదవికి ఒక్కొక్క సెట్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి టి.శ్రీధర్బాబు, సహాయ అధికారి ఎ.సురేష్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా జీవీఆర్ఎస్ కిషోర్(మెడికల్), అసోసియేట్ అధ్యక్షుడిగా జి.సూర్యనారాయణ (మెడికల్) ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల్లో కె.రంగాచారి (కార్యదర్శి), పి.పద్మ (కోశాధికారి), ఎస్.పద్మ (మహిళా ఉపాధ్యక్షురాలు), రేఖా వాణి (మహిళా జాయింట్ సెక్రటరీ)తో పాటు ఉపాధ్యక్షులుగా బి.రామకృష్ణ, టి.వెంకటనాయుడు, ఎస్.భాస్కరరావు, వై.జయప్రకాష్, పి.సురేష్కుమార్ ఎన్నికయ్యారు. కె.విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వి.శ్రీనివాసరావు, సీహెచ్ శంకరరావు, వి. గణపతిరావు, పి. చంద్రశేఖర్, ఎం.శ్రీధర్ జాయింట్ సెక్రటరీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఎన్నికల ప్రక్రియకు ముందు భారీ ఎత్తున ఉద్యోగులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమానికి పరిశీలకుడిగా ఎ.రంజిత్నాయుడు వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు విద్యాసాగర్, డి.వి.రమణ పిలుపు మేరకు ఉ ద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చే యాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఏపీఎన్జీఓ నేతలు, స్థానిక తాలూకా యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువకుని అదృశ్యంపై కేసు నమోదు
తెర్లాం: యువకుని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాగర్బాబు బుధవారం తెలిపారు. మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి అనే యువకుడు ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని తండ్రి ముడిదాన పైడితల్లి స్థాని క పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశా డని తెలిపారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసులో నిందితుడు.. తెర్లాం పోలీస్స్టేషన్లో నమోదైన అదృశ్యం కేసుకు సంబంధించి మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి పోక్సో కేసులో నిందితునిగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయడంతో 2025 ఫిబ్రవరిలో పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగి రైతు మృతి పాచిపెంట : పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగిన ఓ రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు.. సాలూరు మండలం కందులపదం గ్రామానికి చెందిన శెట్టి బాబ్జి అనే రైతు పాచిపెంట మండలం గడివలస సమీపంలో 27 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల మూడవ తేదీన పొలంలో గడ్డిని చంపడానికి గడ్డి మందు పిచికారి చేసే సమయంలో గడ్డి మందు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పొరపాటున గడ్డి మందు లేదనుకొని అదే ప్లాస్టిక్ డబ్బాతో పక్కన డ్రమ్ములో ఉన్న నీటిని తీసుకొని సేవించాడు. అలా సేవించిన కొంత సమయానికి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు సాలూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షల అనంతరం శరీరంలో పాయిజన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి విజయనగరం తరువాత విశాఖపట్నం తీసుకువెళ్లి పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చివరకు కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య సూర్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో మన్యం విద్యార్థుల ప్రతిభ
పార్వతీపురం టౌన్/వీరఘట్టం: రాష్ట్రస్థాయి సైన్న్స్ ఫెయిర్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని జిల్లా సైన్స్అధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీ ల్లో జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఒక ప్రాజెక్టు, సౌత్ ఇండియా స్థాయిలో రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామం ముస్తాబు–విజన్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ందన్నారు. ఇదే ప్రాజెక్టు సౌత్ ఇండి యా లెవెల్లో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపీయూపీ మొట్టవలస విద్యార్థులు రూపొందించిన టెస్టులేష న్ ప్రాజెక్టు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపి కై ందని వివరించారు. జాతీయస్థాయి పోటీలు మార్చినెలలో ఢిల్లీలో నిర్వహిస్తారని, సౌత్ ఇండి యా లెవెల్ పోటీలు జనవరి 19న హైదరాబాద్లో సాగుతాయని చెప్పారు. మన్యం జిల్లా విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు అభినందించారు. ●వీరఘట్టం మండలలలోని ఎం.వి.పురం యూపీ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయురాలు డి. సంతోషికుమారి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో సత్తాచాటారు. ఆమె ప్రదర్శించిన ‘టెస్సలేషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఆమెను పాఠశాల హెచ్ఎం వై.శ్రీనుబాబు, సర్పంచ్ పి.వెంకటరమ ణ, ఎంఈఓ ఆనందరావు, తహసీల్దార్ కామేశ్వరరా వు అభినందించారు. టెస్సలేషన్ ప్రాజెక్టు ఒక జ్యామితీయ కళ (జ్యామిట్రీ). దీని ఆధారంగా తక్కువ ఖర్చుతో అధునాతన హంగులతో బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ చేయవచ్చు. వస్త్ర పరిశ్రమలో సరికొత్త డిజైన్లు రూపొందించవచ్చు. బ్రిక్స్, టైల్స్ను ఆకర్షణీయమైన డిజైన్లతో తయారు చేయవచ్చని సంతో షికుమారి తెలిపారు. -
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
పార్వతీపురం: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని, వచ్చేఏడాది జిల్లాలో ఒక్క బాల్య వివాహం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం బాల్యవివాహ నిషేధ చట్టం అమలుపై ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసు గల యువతీ, యువకుల జాబితా ఆయా మండల పరిధిలోని అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే వా రం రోజులు ముందుగా తహసీల్దార్లు, పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో రెవెన్యూ క్లినిక్ నడుస్తోందని, సాధ్యమైనంత వరకు ఎలాంటి భూ తగాదాలు లేకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్, ఏఎస్పీ మనీషా రెడ్డి, ఎస్డీసీ పి.ధర్మచంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అవగాహనతోనే డ్రగ్స్ నివారణ సాధ్యం ప్రజలకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తేనే డ్రగ్స్ నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం, రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీతో కలిసి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మ త్తు పదార్ధాల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రె డ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు. ● రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎంపీడీఓ మండలంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రైతుల ఆదాయంను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రైతులు అంతర పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. -
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రుపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సాహవంతులైన రైతులను మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమం అమలు చేయడానికి మండల స్థాయి అధికారులతో ఈ నెలఖారున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఉద్యాన శాఖాధికారి చిట్టిబాబు, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత బొబ్బిలి రూరల్: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పూట చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న మట్టి లోడుతో ఉన్న నాలుగు టిప్పర్ లారీలను కలవరాయి గ్రామం వద్ద రెవెన్యూ శాఖ ఆర్ఐ రామకుమార్ పట్టుకున్నారు. తహసీల్దార్ శ్రీనుకు అందిన సమాచారం మేరకు మంగళవారం నిఘా పెట్టిన రెవెన్యూ వర్గాలు అర్థరాత్రి కాపుకాసి కలవరాయి గ్రామంలో చెరువు నుంచి బొబ్బిలి పట్టణ రియల్ ఎస్టేట్ వెంచర్కు టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు మట్టి లోడును పరిశీలించి 50వేల రూపాయిల జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో విడిచిపెడుతున్నామని, మరో మారు అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే కేసులు పెడతామని యజమానికి, కాంట్రాక్టర్ను తాహసీల్దార్ శ్రీను హెచ్చరించారు. వివాహిత ఆత్మహత్యపూసపాటిరేగ : మండలంలోని ఎరుకొండ గ్రామంలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు, మృతురాలు బంధువుల కథనం మేరకు పూసపాటిరేగ ఎస్పీ కాలనీకి చెందిన పాండ్రికి పుష్ప(19)కి ఎరుకొండ గ్రామానికి చెందిన శొంఠ్యాన శివతో మూడు నెలలు క్రితం వివాహం జరిగింది. వివాహ సయంలో శివ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు అదనపు కట్నం కోసం డిమాండు చేయడంతో ఇరువురు గ్రామాల పెద్దలు సర్ది చెప్పి అత్త వారింటికి పుష్పను కాపురానికి పంపించారు. అప్పటి నుంచి పుష్పను అత్తవారు వేధించడంతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అత్తింటి వారి వేధింపులు తాళలేకే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి పాండ్రంకి రమ కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినియోగదారులకు చేరువగా కన్జ్యూమర్ కమిషన్
● వినియోగదారుల కమిషన్ చైర్మన్ ఆర్.వెంకట నాగసుందర్ విజయనగరం అర్బన్: వినియోగదారుల సౌకర్యార్థం కన్జ్యూమర్ కమిషన్ వినియోగదారులకు చేరువవుతుందని ఆ కమిషన్ చైర్మన్ ఆర్.వెంకట నాగసుందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అన్యాయం జరిగినప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భయం లేకుండా కన్జ్యూమర్ కమిషన్న్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. వినియోగదారు సొంత ప్రాంతంలోనే కేసు దాఖలు చేసుకునే సౌకర్యం ఉందని, ఆఫిడవిట్ ద్వారా కూడా వ్యవహారం సాగుతుందని చెప్పారు. ఒరిజినల్ బిల్లులు లేకపోయినా ఫొటోస్టాట్ కాపీలతో కేసు నమోదు చేయవచ్చని, సాధారణంగా మూడు నెలల్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులకు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ–కామర్స్ కొనుగోళ్లలో ఉత్పత్తి వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాల్సిన అవసరాన్ని వివరించారు. ఫిర్యాదులను ఆన్లైన్, కన్జ్యూమర్ కమిషన్ లేదా పీజీఆర్ఎస్ ద్వారా చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు బి.శ్రీదేవి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో వినియోగదారుడి పాత్ర కీలకమని అన్నారు. మరో సభ్యులు అశోక్కుమార్ శర్మ డిజిటల్ న్యాయ పాలనపై మాట్లాడుతూ, ఈ–జాగృతి యాప్ ద్వారా కోర్టుకు రాకుండానే కేసు ఫైల్ చేయవచ్చని, కొనుగోలులో కలిగే నష్టాన్ని నమోదు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులు వ్యాసరచనలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి గంట్యాడ హైస్కూల్కు చెందిన వి.దీక్షిత, వక్తృత్వ పోటీలలో భోగాపురానికి చెందిన కళాశాల విద్యార్థిని కె.జయలక్ష్మి సాధించారు. వ్యాసరచన పోటీలలో గంట్యాడకు చెందిన కళాశాల విద్యార్థిని ఎ.ఝాన్సీలక్ష్మి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం, గంట్యాడకు చెందిన హైస్కూల్ విద్యార్థిని ఎన్.నిరీక్షణ రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించారు. వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు బహుమతులు పొందిన 24 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ మురళీనాథ్, డీవీఈఓ తవిటినాయుడు, సంస్కృత ఉన్నత పాఠశాల హెచ్ఎం లలితకుమారి, పలువురు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం కోసం వచ్చి.. విగతజీవిగా మారి...
పాలకొండ రూరల్/సాలూరు: వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో గుండె పోటుకు గురై ఓ వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. ఆ కుటుంబాన్ని ఉన్నపలంగా అంధకారంలోకి తోసేసిన ఘటన పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్లో చోటుచేసుకుంది. మృతుని బంధువులు, స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణ పరిధి జగన్నాథపురంలో నివాసముంటూ కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నడిపిల్లి జగదీష్(40). ఈయన మధుమేహంతో కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో వైద్య సేవలు పొందేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల బలగ ఆస్పత్రికి వచ్చిపోతుంటారు. ఇదే క్రమంలో ఇటీవల చేయించుకున్న రక్త పరీక్షల ఫలితాలు పోగొట్టుకోవటంతో మరోమారు పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళం వెళ్లారు. వైద్య సేవలు, పరీక్షలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరుగు ప్రయాణంలో భాగంగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్కు 6 గంటల సమయంలో చేరుకుని పార్వతీపురం బస్సు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాలేజీ పిల్లలు, సహ ప్రయాణికులతో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య గూర్చి వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోవటంతో అక్కడి వారు గుండెపోటుగా గుర్తించి సహకరించే యత్నం చేశారు. అప్పటికే జగదీష్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆర్టీసీ వర్గాలు, స్థానికుల సమాచారంతో 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా మరణించినట్టు ధ్రువీకరించారు. అప్పటి వరకూ తన ఆరోగ్య సమస్యలు చెబుతూనే తోటి ప్రయాణికుడు ఈ విధంగా మరణించటంతో అక్కడి వారు అయ్యో పాపం.. అంటూ ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాలకొండ పోలీసులు కాంప్లెక్స్కు చేరుకుని మృతుని సెల్ఫోన్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు. ఈయన స్వస్థలం సాలూరు మండలం కూర్మరాజుపేటగా గుర్తించారు. ఈయనకు భార్య సింహాచలం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాలకొండ చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిబంధనల మేరకు వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వారి కుటంబ సభ్యులకు అప్పగించారు. -
సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలి
పార్వతీపురం టౌన్: సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని, అపుడే తగిన న్యాయం లభిస్తుందని అన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువులతో మోసపోయినప్పుడు తగిన నష్టపరిహారం పొందవచ్చన్నారు. ఏ వస్తువు కొన్నా కచ్చితంగా బిల్లు తీసుకోవాలని, బిల్లు ఉంటేనే కోర్టులో ఫిర్యాదు చేయడానికి వీలుంటుందన్నారు. అలాగే వస్తువులపై ఐసీఐ, అగ్మార్క్, హాల్ మార్క్ వంటి గుర్తులను చూసి మాత్రమే కొనాలని, ముఖ్యంగా ఆహార పదార్థాలు, మందులు కొనేటప్పుడు తయారీ మరియు గడువు తేదీలను గమనించాలని అన్నారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న నేటి కాలంలో, కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు, యువతకు సూచించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సమాజం పట్ల అవగాహన కలిగి, అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని కోరారు. కార్యక్రమం చివరలో, వినియోగదారుల హక్కుల రక్షణలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్రెడ్డి -
సౌకర్యాలే కనం!
సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లాలో సహజ వనరులకు కొదవ లేదు. కొండకోనలు, జాలువారే జలాపాతాలతో ఆహ్లాదం పంచుతుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే.. జిల్లాను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయవచ్చు. గత కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ప్రస్తుత కలెక్టర్ ప్రభాకరరెడ్డి.. జిల్లా పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. అందులో భాగంగా బాహ్య ప్రపంచానికి తెలియని జలపాతాలను వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. ప్రస్తుత కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించినది మొదలు.. జిల్లాలో ఉన్న జలపాతాలను వెలికి తీసి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని సీతంపేట, సాలూరు, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో దండిగాం, దళాయివలస, సున్నపుగెడ్డ, మెట్టుగూడ, మల్లి, బెనరాయి, తాడికొండ, శిఖపరువు, కురుకుట్టి, లొద్ద, తోణాం వంటి ప్రధాన జలపాతాలు 20 వరకు ఉన్నాయి. కొండలు, గుట్టలతో ఆ ప్రాంతాలు చూపురులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పిక్నిక్ల సమయంలో ఈ కేంద్రాలన్నీ కిటకిటలాడుతాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పం మంచిదే అయినా.. అక్కడికి వెళ్లేందుకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో చేసే ప్రయత్నాలన్నీ వృథాగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆనందం వెంటే.. ప్రమాదం ఆహ్లాదం వెంటే ప్రమాదం కూడా పొంచి ఉంది. యువత, పిల్లలు జలకాలాడుతూ, పై నుంచి రాళ్ల ద్వారా కిందకు జారుతున్నారు. ఈ సమయంలో ఎక్కువగా గాయాలపాలవుతున్నారు. యువత ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటారని స్థానికులు చెబుతుంటారు. పూటుగా తాగిన మత్తులో ప్రమాదకర ప్రాంతంలోకి ఈతకు దిగి, మునిగిపోయిన సందర్భాలు అనేకం. ఇవేకాక.. జంఝావతి రబ్బర్ డ్యాం, తోటపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. జంఝావతి రబ్బర్డ్యాం వద్ద ఇటీవలే విహార యాత్రకు వెళ్లి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలు, ప్రాజెక్టుల వద్ద కనీస రక్షణ చర్యలు ఉండటం లేదు. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. యువత వినిపించుకునే పరిస్థితి లేదు. అటవీశాఖ అనుమతులున్నవెన్ని? అటవీశాఖ పరిధిలో ఉన్న ఏ ప్రాంతంలోనైనా పర్యాటకంగానూ, ఇతర పనులు చేపట్టాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో జలపాతాల గుర్తింపు, అభివృద్ధి అంటూ హడావిడి చేస్తున్న యంత్రాంగం.. అటవీశాఖ అనుమతులు లేకుండానే చాలా వరకు పనులు చేపట్టేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అటవీశాఖ ఆధ్వర్యంలో సున్నపుగెడ్డ వద్ద జలపాతానికి రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్చ్ ఏర్పాటు చేశారు. ఇంకొంత పనులున్నాయి. మిగిలిన ఎక్కడా ఆ శాఖ కనీస అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. సంబంధం లేని డీఆర్డీఏ శాఖను ఇందులో భాగస్వామ్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. ●ఎకో టూరిజం ప్రకారం ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికులకే శిక్షణ ఇచ్చి గైడ్స్గా నియమించాలి. పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి జీతాలు, అక్కడ సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు. కొండకోనల ప్రాంతంలో జంతువులు సంచరించే అవకాశం ఉంటుంది. తగిన హెచ్చరిక, రక్షణ చర్యలు తీసుకోవాలి. జలాపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. కనీస నిబంధనలు పాటించాలి. చాలా వరకు జలాపాతాల వద్ద ఇవేవీ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ●దళాయివలస, శిఖపరువు వద్ద టికెట్ పెట్టి మనిషి వద్ద రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తెలియడం లేదు. -
క్రాస్ కంట్రీ పరుగు పోటీలో జిల్లాకు పతకాలు
● 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాస్ కంట్రీ పరుగు పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గల ఎంఆర్ కళాశాలలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ నెల 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో హరీష్ 10 కిలోమీటర్ల పరుగు పోటీలు బంగారు పతకం కై వసం చేసుకోగా... నిరంజన్ 6 కిలోమీటర్ల పరుగులో మరో బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా మహిళల విభాగంలో మహాలక్ష్మి 4 కిలోమీటర్ల విభాగంలో మరో బంగారు పతకంతో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
మాపై కనికరం లేదా బాబూ..!
ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతినెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే అర్హులకు పింఛన్లు మంజూరుచేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేసే వీలుండదు. – ఎం.సుధారాణి, డీఆర్డీఏ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం: ఈమె పేరు గూల భవానీ. వీరఘట్టంలోని కొండవీధి కి చెందిన ఈమె భర్త రాము చనిపోయి రెండేళ్లవుతోంది. పింఛన్ కోసం గత ఏడాదిన్నరగా సచివాలయం, స్థానిక టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. భర్తకి వచ్చిన పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతుంది. చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న తనకు వితంతు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని విన్నవిస్తోంది. కొత్త పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది అర్హులైన వారు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందించాలి. కూటమి ప్రభుత్వంలో చేతి వృత్తుల వారికి ఎటువంటి పథకాలు అందడం లేదు. సీఎం చంద్రబాబు స్పందించి ఎన్నికల హామీ నెరవేర్చాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే -
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
పాలకొండ: నగర పంచాయతీ పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో పంచముఖ గాయత్రి దేవి ఆలయంలో మంగళవారం పట్టపగలు జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ మేరకు సీఐ ప్రసాద్ బుధవారం ఇందుకు సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. నగర పంచాయతీలోని సుందరయ్యనగర్ (భుట్టిమఠం) కాలనీకి చెందిన భార్యాభర్తలు పసల చిన్నారావు (22), బమ్మిటి దుర్గా (20) మంగళవారం ఉదయం గాయత్రి దేవి ఆలయంలో దర్శనం కోసం వెళ్లారు. అ సమయంలో అర్చకులు అక్కడ లేకపోవడంతో అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించి అమ్మవారి మంగళ సూత్రాలు, కళ్లు, ముక్కుపుడక తస్కరించి అక్కడ నుంచి జారుకున్నారు. అర్చకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై ప్రయోగమూర్తి రెండు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. బుధవారం వీరిని వాహన తనిఖీల సమయంలో పట్టుకున్నారని తెలిపారు. నిందితుడు చిన్నారావుపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని వివరించారు. నిందితులు చోరీ చేసిన 24గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును ఛేదించడంలో సిబ్బంది కృషిని సీఐ అభినందించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి, ట్రైనీ ఎస్సై హేమలత ఉన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు పండగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్తే బంగారు ఆభరణాలు లాకర్లో పెట్టుకోవాలని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
వితంతువులను ఆదుకోవాలి
భర్తలు చనిపోయి వితంతువులుగా ఉన్న చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడ బిడ్డలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అర్హులందరికీ ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేయాలి. చేతివృత్తులు చేసుకొని వెనుకబడిన 50 ఏళ్ల నిండిన వారికి పింఛన్లు అందించాలి. గత ప్రభు త్వం వలే ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – జంపు కన్నతల్లి, జెట్పీటీసీ సభ్యురాలు, వీరఘట్టం -
భోగాపురం, విజయనగరంలో ఏసీబీ సోదాలు
విజయనగరం క్రైమ్/భోగాపురం: ఏసీబీ అధికారుల సోదాలతో విజయనగరం, భోగాపురంలో అలజడి నెలకొంది. ఏకకాలంలో ఏసీబీ బృందాల సోదాలతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5, 6, 7 తేదీల్లో భోగాపురం సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో తనిఖీలు జరిపిన అధికారులు ఈ సారి సబ్రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటిలోను, కార్యాలయ ఆఫీస్ బోయ్ అలేటి కనకరాజు ఇంటిలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐ మహేష్ ఆధ్వర్యంలో సోదాలు సాగా యి. భోగాపురంలో కనకరాజు ఇంటికి మంగళవారం ఉదయం 6 గంటలకే డీఎస్పీ రమ్మ తన బృందంతో చేరుకుని సోదాలు జరిపారు. రాత్రి వరకు జరిపిన సోదాల్లో ఆయన వద్ద అక్రమంగా ఉన్న రూ.18లక్షల10వేల నగదు, 40తుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లతో పాటు కనకరాజు, ఆయన భార్య బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఆయా ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. డీఎస్పీ రమ్య ఆదేశాల మేరకు సీఐ మహేష్ సిబ్బందితో కలిసి విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్లో నివసిస్తున్న సబ్రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంటిలో సోదాలు జరిపారు. దాదాపు రూ.మూడు కోట్లు విలువచేసే భవనాల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. రామకృష్ణకు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్, ప్రదీప్నగర్, దాసన్నపేట కుమ్మరివీధి, ప్రదీప్నగర్–1, ఉడాకాలనీ, కంటోన్మెంట్, వీటీ అగ్రహారంలో బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. రామకృష్ణ అత్త, తోడల్లుడి పేరుతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించి సీజ్చేశామని సీఐ తెలిపారు. భోగాపురం సబ్రిజిస్ట్రార్ ఇంటిలో అక్రమాస్తుల గుర్తింపు కార్యాలయ బోయ్ ఇంటిలో పట్టుబడిన నగదు, బంగారం గతనెలలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు అనతికాలంలోనే తనిఖీలతో ఉద్యోగుల్లో గుబులు ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలు -
తల్లి వెంటే తనయ...
● మృత్యువులోనూ వీడని తల్లీకూతుళ్ల అనుబంధం ● తల్లిని కడసారి చూసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి.. ● విలపిస్తున్న కుటుంబ సభ్యులు ● చింతపల్లిపేటలో విషాదం గుర్ల: తల్లి అంటే ఆమెకు ప్రాణం. తల్లి మర ణంతో తల్లఢిల్లింది. ఆమె భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చింది. ఆ క్రమంలో కుప్పకూలి ఆస్పత్రిపాలైంది. అక్కడే ప్రాణం విడిచిన ఘటన గుర్ల మండలం చింతపల్లిపేటలో చోటుచేసుకుంది. తల్లిని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిపేటకు చెందిన సోమురోతు అప్పలనర్సమ్మ (60) అనారోగ్యంతో సోమవా రం మృతి చెందింది. తల్లిని చివరిగా చూసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కుమార్తె గౌరి (39) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లికి ఓ వైపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేస్తూనే మరోవైపు గౌరిని చీపురుపల్లి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గౌరి భర్త శంకరరావు విశాఖపట్నం పోర్టులో కూలిపని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు హర్షవర్థన్, కుమార్తె కుసుమ ఉన్నారు. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయండిపార్వతీపురం: పర్యాటకులను ఆకర్షించేలా పిక్నిక్ స్పాట్లను అభివృద్ధిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జిల్లాలో 2లక్షల మంది పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను సందర్శించారన్నారు. మండలాల పరిధిలోని దేవాలయాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్స్ వంటి ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.52 కోట్లు లక్ష్యం కాగా ఇంత వరకు రూ.32కోట్లు ప్రగతిని సాధించిందన్నారు. గృహ నిర్మాణశాఖలో పీఎం జన్మాన్, పీఎంఏవై కింద 9,438 ఇళ్లకు 8వేలు ఇల్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇంటి నిర్మాణాల కోసం 31,325 మందిని అర్హులుగా గుర్తించామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరని, హాజరు వేయనివారికి జీతాలు నిలిపివేయాలని హెచ్ఓడీలను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● ఆగని ఇసుక దందా ● మొద్దునిద్రలో అధికార యంత్రాంగం!సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు వెళ్తున్నా.. అది మూడు రోజుల ముచ్చటగానే మారుతోంది. వెళ్లడం.. వాహనాలను పట్టుకోవడం.. తర్వాత విడిచిపెట్టేయడం షరామాములుగా మారింది. మరలా కొద్దిరోజులకే ఇసుకాసురులు బరి తెగించేస్తున్నారు. కొమరాడ, పాలకొండ, భామిని తదితర నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలను అక్రమార్కులు గుల్ల చేస్తున్నారు. సీతానగరం, పాచిపెంట మండలాల్లోనూ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొమరాడ మండలంలోని కూనే రు రామభద్రపురం, కొరిశీల రెవెన్యూ పరిధిలో కొన్నాళ్లుగా తవ్వకాలు సాగుతున్నాయి. వాహనాల రాకపోకలకు దర్జాగా మెటల్ రోడ్డు వేసేసినా.. అధికార యంత్రాంగం కళ్లు మూసుకుందా? అన్న ప్రశ్నలు తీరప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలోని గోపాలపురం, అంపిలి తదితర ప్రాంతాల్లో ఇసుక దందా సాగుతోందని స్వయంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భామిని పరిసరాల్లోనూ నది గుల్ల అయిపోతోంది. నదిలో యంత్రాల సాయంతో ఇసుకను గుట్టలుగా పోగు చేసి.. అక్కడ నుంచి లారీలతో తరలిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో భారీ వాహనాల ద్వారా విశాఖ తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. చూసీచూడనట్లు వదిలేస్తున్న యంత్రాంగం అధికార పార్టీ అండదండలు ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలో ఇటీవల సబ్ కలెక్టర్ అర్ధరాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేసి కొన్ని వాహనాలను పట్టుకున్న విషయం విదితమే. పగటివేళ పోలీస్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి తెలియకుండా తవ్వకాలు సాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తమ పరిధిలోకి రాదని ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖాధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ, తప్పించుకుంటున్నారు. -
ఏటీఎం మోసాలు అరికట్టవచ్చు ఇలా..
స్మార్ట్ ఏటీఏం సిస్టంను ఉపయోగించి ఏటీఏం మోసాలను ఇట్టే అరికట్టవచ్చని సీతంపేట గిరిజన సంక్షేమ గిరిజన గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాల ఏడోతరగతి విద్యార్థులు ఎస్.సిద్ధార్థ, మనోజ్లు చేసిన ప్రాజెక్టు ఆకట్టుకుంది. ఒకరు ఏటీఏం కార్డును మరొకరు ఏటీఎంలో పెట్టి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తే ఓ డివైస్ ద్వారా మొబైల్కు మేసేజ్ వచ్చే విధానంపై ప్రాజెక్టు రూపొందించారు.జంక్ఫుడ్ తింటే కిడ్నీలకు ప్రమాదం...జంక్ఫుడ్ తినడం వల్ల కిడ్నీలపై చూపే దుష్ప్రభావం, కిడ్నీలు రాళ్లు ఏర్పడే విధానాన్ని పెద్దమడి ఆశ్రమపాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థినులు పి.గుణశ్రీ, జి.మౌనిక వివరించారు. -
మంత్రి సంధ్యారాణి పీఏ కేసులో ట్విస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్, ఆమె కుమారుడిపై మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్రెడ్డి తెలిపారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఫేక్ కేసులు పెట్టేశారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్, కుమారుడు పృథ్వీ తనను వేధిస్తున్నట్లు సాలూరుకు చెందిన త్రివేణి అనే ఉద్యోగిని కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, అదే సమయంలో రెండో వర్గం నుంచి కూడా ఫిర్యాదు అందిందని చెప్పారు. రెండు ఫిర్యాదులపై విచారణ జరిపి, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని చెప్పారు. నిపుణుల పరిశీలనలో సతీష్, మంత్రి కుమారుడు పృథ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్లన్నీ అబద్ధమని తేలిందన్నారు. త్రివేణి, ఆమె స్నేహితుడు దేవిశ్రీప్రసాద్ కలిసి తప్పుడు చాట్లు సృష్టించి సతీష్, పృథ్వీలను బెదిరించారని పేర్కొన్నారు. సతీష్, త్రివేణి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి సతీష్కు, త్రివేణికి మధ్య గతంలో ఉద్యోగం విషయమై ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఇదే విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ అనే మున్సిపల్ ఉద్యోగితో కలిసి ఆమె పలుమార్లు సతీష్ను బెదిరించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని చెప్పారు. దీంతో సతీష్పై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమె మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులతో మీడియా ముందుకొచ్చినట్లు గుర్తించామన్నారు. త్రివేణి, దేవిశ్రీప్రసాద్లపై ఫోర్జరీ, ఛీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు వివరించారు.ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా... బాధితురాలిగా ఫిర్యాదు చేసిన మహిళనే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. అలాంటిది ఆమెను గానీ, దేవీశ్రీప్రసాద్ను గానీ మీడియా ముందుకు తీసుకురాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారిని మీడియా సమావేశానికి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మహిళా ఉద్యోగిని తప్పుడు ఫిర్యాదు చేశారు ఆమె చూపించిన వాట్సాప్ మెసేజ్లన్నీ అబద్ధం స్నేహితుడితో కలిసి ఆమె తప్పుడు మెసేజ్లు సృష్టించారు వాటి ద్వారా మంత్రి కుమారుడు, పీఏలను బెదిరించారు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వెల్లడి -
సీనియర్స్ ఖోఖో పోటీలకు జిల్లా జట్లు పయనం
● 24 నుంచి గుడివాడలో జరగనున్న మహిళ, పురుషుల పోటీలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ మహిళ, పురుషుల ఖోఖో పోటీలకు జిల్లా జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఈ నెల 24 నుంచి 26 వరకు గుడివాడలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సీనియర్ అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు జరగనున్నాయి. జిల్లా జట్లు పోటీలకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా డిగ్రీ కాలేజీలో కోచింగ్ క్యాంప్ ముగించుకొని కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పురుషుల జట్టుకు వజ్రపు శ్రీనివాసరావు, అదే విధంగా మహిళల జట్టుకు సత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం కీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఏఎంఎన్ కమలనాభరావు మాట్లా డుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శనతో విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. సత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యవేణి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, ఉపాధ్యక్షుడు రామారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్
విజయనగరం క్రైమ్ : జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన విజయనగరం ట్రాఫిక్ పోలీస్స్టేసన్ కానిస్టేబుల్ బీఎస్ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు 14 జాతీయ స్థాయి సీనియర్ పూమ్సే తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మూర్తి జిల్లా పోలీసు విభాగం తరఫున పాల్గొన్నారు. మూర్తిని అభినందించిన ఎస్పీ భవిష్యత్లో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో జిల్లాకు పతకాలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్యాడిట్, జూనియర్స్ జూడో పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు మొత్తంగా పది పతకాలు సాధించారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో దుర్గ బంగారు పతకం దక్కించుకోగా... ప్రవల్లిక, ప్రణిత, యశస్విప్రియ, మహమ్మద్ మున్నా, హేమంత్, సిద్విక్, ప్రణీత్, తేజ వికాస్, నితీష్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణ, కోచ్లు బంగారునాయుడు, ఆనంద్ తదితరులు అభినందించారు. అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు సీతంపేట: అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు నిర్వహించనున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సహకార సంస్థతో సేకరించబడే కొండచీపుర్లు, పసుపుకొమ్ములు, కుంకుడు కాయలు, చింతపండు వంటి వాటికి అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రతీ పక్షం రోజులకొకమారు ఈ టెండర్లు ఉంటాయన్నారు. వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తామనేది ముందస్తుగా తెలియజేయనున్నామని తెలిపారు. పుస్తెలతాడు చోరీ సీతానగరం: మండలంలోని కొత్తవలస – వీరభధ్రాపురం గ్రామాల మధ్య మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పారిపోయిన వైనమిది. స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తీళ్ళ భూలక్ష్మి మంగళవారం సాయంత్రం శంబర నుంచి కొత్తవలస మీదుగా కాలినడన కన్నవారిల్లు అయిన వీరభధ్రపురం వెళ్తుంది. అదే సమయంలోమోటారు సైకిల్తో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి తన మెడలో ఉన్న రెండు పుస్తెల తాడును తెంపుకుని వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. బస్తా దించుతూ.. బతుకు చాలించి... పార్వతీపురం రూరల్: పశువుల దాణా ఆ కూలి పాలిట మృత్యుపాశమైంది. బస్తాలు దించే క్రమంలో లారీ పైనుంచి జారిపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని హిందూపురం కూడలి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి విశాఖ డెయిరీకి చెందిన పశువుల దాణా లోడ్తో వచ్చిన లారీ పార్వతీపురం చేరుకుంది. మండలంలోని గంగాపురం వైపు వెళ్తూ హిందూపురం కూడలి వద్ద బస్తాలు దించుతుండగా, లారీపై ఉన్న ఆమదాలవలసకు చెందిన తారకేశ్వరరావు (35) ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్ఐ సంతోషి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
అదనంగా ఇస్తేనే.. ధాన్యం బస్తాలు దించేది..!
● 80 కిలోలకు అదనంగా మరో 4 కిలోల ధాన్యం వసూళ్లు ● అర్థరాత్రి వరకూ ఇబ్బందులు పడ్డ రైతులురాజాం : పట్టణంలోని పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ రైస్ మిల్లు వద్ద సోమవారం అర్థరాత్రి వరకూ కొంతమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన రైతులతో పాటు రాజాం మండల రైతులు కొందరు ఇక్కడకు సోమవారం ధాన్యం విక్రయాలు నిమిత్తం తీసుకొచ్చారు. ముందస్తుగా తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం శాంపిల్స్ తీయడంతో పాటు వాటిని ఈ మిల్లర వద్దకు తీసుకొచ్చి అనుమతులు ఇచ్చిన తరువాత ట్రక్షీట్లు తీసుకున్నారు. ఆయా ట్రక్షీట్లుతో ట్రాక్టర్ల ద్వారా ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకుని రాగా మిల్లరు ధాన్యంలో నాణ్యత లేదని, కళాసీలు లేరని మొండికేసి ధాన్యం అన్లోడింగ్ చేయకుండా ట్రాక్టర్లపైనే వదిలేశారు. ఓ వైపు గజగజలాడించే చలి, మరో వైపు ట్రాక్టర్ల యాజమాన్యంతో ఇబ్బందులు పడుతూ రైతులు నానా అవస్థలు పడ్డారు. అదనపు చెల్లింపుతో దిగిన యజమాని చివరకు రైతులు ఒక్కో 80 కిలోల బస్తా ధాన్యంకు అదనంగా నాలుగు నుంచి ఐదు కిలోలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ధాన్యం దించేందుకు మిల్లరు అనుమతులు ఇచ్చాడు. పలువురు రైతులు ఈ ఒప్పందానికి అంగీకరించి ధాన్యం బస్తాలు దించారు. వీరికి రాత్రి 12 గంటల సమయం పట్టింది. మరికొంతమంది రైతులు అదనంగా ధాన్యం ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. తాము మధ్యాహ్నం 2 గంటలకు ధాన్యం తీసుకెళ్తే రాత్రి 11 గంటల వరకూ ధాన్యం దించకుండా లక్ష్మీనారాయణ మిల్లర్ల యజమాని అడ్డుకున్నారని సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయంపై మిల్లరు యజమాని అవినాష్ వద్ద సాక్షి ప్రస్తావించగా, ధాన్యం నాణ్యత బాగోలేని కారణంగా రైతులే అదనంగా ధాన్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. -
ముందస్తు ప్రణాళికలు అవసరం : కలెక్టర్
పార్వతీపురం: అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం పెద్దదైనపుడు అందుకు తగ్గ ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని, అప్పుడే సామాన్యుల దరికి అభివృద్ధి చేరుతుందన్నారు. మండల ప్రత్యేకాధికారి గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని అభివృద్ధికి ప్రణాళికలు చేయాలన్నారు. జిల్లాలో 15 మండలాలకుగాను 14 మండలాలు ఏ గ్రేడ్లో ఉన్నాయని, పాచిపెంట మండలం బీ గ్రేడ్లో ఉందన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని జిల్లా ఉద్యానశాఖాధికారి కలెక్టర్కు వివరించారు. మత్య్సశాఖ, ఈ–ఆఫీస్ ఫైలింగ్, ఉద్యానశాఖ తదితర శాఖల పురోగతిపై సమీక్షించారు. సమీక్షలో జేసీ యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టపగలే గాయత్రీదేవి ఆలయంలో చోరీ
పాలకొండ: నగర పంచాయతీ సమీపంలోని కొండాపురం గ్రామ సమీపంలో ఉన్న పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో చోరి జరిగింది. భక్తుల వేషంలో వచ్చిన భార్యాభర్తలు ఆలయ అర్చకులు ఆలయ మెట్లపై టిఫిన్ చేయడాన్ని గుర్తించారు. అమ్మవారిని దర్శించుకున్నట్టు నటించి గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రాలు, కళ్లు తీసుకుని ఆలయం నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఇది గమనించిన అర్చకులు చిట్టిబాబు శర్మ అమ్మవారిని చూడగా అమ్మవారి అలంకరణలో చేసిన బంగారు వస్తువులు కనిపించలేదు. వెంటనే కేక వేయగా నిందితులు తాము తెచ్చుకున్న వాహనంపై వుడాయించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. దొంగలించిన వస్తువులు సుమారుగా 23 గ్రాములు ఉంటాయని అర్చకులు తెలిపారు. కాగా చోరి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం. వీరు నగర పంచాయతీ పరిధిలోని నక్కలపేటకు చెందిన భార్యాభర్తలుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని వెంపలగూడ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో పెద్దింటి సోమేశ్వరరావు (53) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆర్.యుగంధర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది. టి.జయరాజు, అరవింద్లకు స్వల్ప గాయలవ్వడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు.. పీపీ ఈతమానుగూడ పంచాయతీ ఇప్పగూడకు చెందిన సోమేశ్వరరావు తన స్వగ్రామం నుంచి సీతంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఎదురుగా కొత్తూరుకు చెందిన యుగంధర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురెదురు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. దీంతో సోమేశ్వరరావు తలపై బలమైన గాయం తగలడంతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన యుగంధర్కు ప్రధమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేసినట్టు, స్వల్ప గాయాలైన ఇద్దరు ఇక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నట్టు సూపరెండెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుని భార్య బుచ్చమ్మ రెండేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరొకరి పరిస్థితి విషమం -
అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: చైన్నె ఎస్ఆర్ఎం ఐటీ డీమ్డ్టుబీ యూనివర్సిటీలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బాస్కెట్బాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ మంగళవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కళాశాలకు చెందిన ఎం.కార్తీక్, కె.శ్రీనివాస్ జేఎన్టీయూ జీవీ తరఫున ఆడారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. -
ఆలయాల్లో హుండీల చోరీని చేధించిన పోలీసులు
● నిందితుడి నుంచి రూ.42,135 స్వాధీనం ● సబ్బవరం స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడిన నిందితుడు వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో ఐదు ఆలయాల్లో జరిగిన చోరీని వల్లంపూడి ఎస్ఐ సుదర్శన్ నేతృత్వంలో సిబ్బంది హుంఽడీల చోరీని చేధించినట్టు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక వల్లంపూడి పోలీసుస్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. పోలీసులకు మంగళవారం వచ్చిన సమాచారం మేరకు కె.ఆర్.పేట జంక్షన్లో చోరీకి సంబంధించి పెందుర్తి గ్రామానికి చెందిన పెందుర్తి నాగరాజుగా గుర్తించిన పోలీసులు నిందితుని వద్ద రూ.42,135ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 13న బానాదిలో వినాయక ఆలయం, శివాలయం, ఆంజనేయస్వామి, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో తాళాలు పగులకొట్టి హుండీల్లో సోమ్ము చోరీకి గురైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ సుదర్శన్ సిబ్బందితో కలసి నిందితుడు నాగరాజును పట్టుకున్నట్టు చెప్పారు.ఐదు ఆలయాల్లో చోరీకి పాల్పడిన సొమ్ము రూ.42,135లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సబ్బవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ రాత్రి ఓ ఆలయంలో చోరీకి పాల్పడి 10,170 రూపాయలు చోరీ చేసినట్టు నిందితుడు చెప్పినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతీ నెల పౌరహక్కుల దినం నిర్వహించాలి
● అట్రాసిటీ ఘటనల ప్రాంతాలకు ఆర్డీవో, డీఎస్పీలు హాజరు కావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: ప్రతి నెల 30వ తేదీని పౌర హక్కుల దినాన్ని పక్కాగా నిర్వహించి డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యులందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం తదితర వివరాలను నెల రోజుల ముందే షెడ్యూల్ చేయాలని, అనంతరం మినిట్స్ను కలెక్టర్కు పంపించాలని, వాటిపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టంపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్వో, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్డే నిర్వహించి సమావేశపు వివరాలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు బసవ సూర్యనారాయణ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల శ్మశానాలు లేకపోవడం మరికొన్ని చోట్ల ఆక్రమణలు జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామ జనాభాను బట్టి శ్మశాన విస్తీర్ణం ఉండాలని ముగ్గురు ఆర్డీవోలు తనిఖీలు చేసి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఆక్రమణలు జరిగాయో నివేదిక పంపాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో శ్మశానాలు, వాటికి రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని సభ్యుడు చిట్టిబాబు ప్రస్తావించగా నిధుల కోసం డీవోకు లేఖ రాసినట్టు, నిధులు రాగానే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలపై దాడులు జరిగినప్పుడు ఆర్డీవో, డీఎస్పీలు, తప్పనిసరిగా సంఘటనా స్థలానికి హాజరై విచారణ జరపాలని, హత్య కేసులైతే కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరు కావాలని సభ్యులు మజ్జి గణపతి, ఎం.రాము కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి ఆర్డీవోలు, డీఎస్పీలు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 17 నమోదయ్యాయని, అందులో 14 కేసులు విచారణలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి డిసెంబర్ 15 వరకు 49 కేసుల్లో 68 మందికిగాను రూ.58 వేల పరిహారం చెల్లించినట్టు తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం మున్సిపాలిటీలో రెండు చోట్ల మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారన్న సమాచారంపై మున్సిపల్ కమిషనర్ వెరిఫై చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. జేసీ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్వో మురళి, డీఎస్పీలు, ఆర్డీవోలు, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ, జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు సున్నపు రామస్వామి, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
రాజాం సిటీ: స్థానిక వైఎస్సార్ పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ పార్కు ఏరియా, శ్రీనివాస థియేటర్ రోడ్డుల్లో గుర్తు తెలియని వృద్ధుడు యాచిస్తూ సంచరిస్తుండేవాడు. మంగళవారం వైఎస్సార్ పార్కు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్దుడుని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. వృద్ధుని గుర్తించిన వారి బంధువులు పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : నగరంలోని అయ్యకోనేరులో ఓ వివాహిత మృతదేహాన్ని టు టౌన్ పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాలు... దాసన్నపేటలోని గొల్లవీధికి చెందిన కోరాడ సునీత(35)కు పదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయి పదేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో, భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సునీత మానసిక స్థితిని కోల్పోయింది. ఈ పరిస్థితిలో సునీత బాగోగులను అన్నయ్య చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సునీత కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతికాడు. స్థానికులను సంప్రదించాడు. ఇంతలో స్థానిక అయ్యకోనేరులో ఓ మహిళ మృతదేహం కనిపించిందని సునీత అన్నయ్యకు సమాచారం అందింది. అయ్యకోనేరుకు వెళ్లి చూడగా పడమర గట్టున సునీత మృతదేహం కనిపించింది. పోలీసులు సీసీ పుటేజీలో చూడగా సోమవారం రాత్రే ఇంటి నుంచి వెళ్లి కోనేరులో దూకేసినట్టు రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. సునీత అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిగ్బాస్ విజేత భోగాపురం వాసి
భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం పంచాయతీ మధుర గ్రామం సుందరపేటకు చెందిన పడాల లక్ష్మణరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పడాల కళ్యాణ్ సినిహీరో నాగార్జున నిర్వహించిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని విజేతగా నిలిచాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కామన్మెన్గా బిగ్బాస్ హౌస్లోకి చేరి విజేతగా నిలిచి విజయం సాధించిన తొలి ఉత్తరాంధ్ర వాసిగా కళ్యాణ్ గుర్తింపు పొందాడు. బిగ్బాస్ హౌస్లోకి చేరిన మొదటలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పట్టువదలకుండా శ్రమించి చివరకు ఫైనల్కు చేరి విజేతగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి సినీ హీరోగా ఎదగాలనే ఆశ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మూడేళ్లకిందట సీఆర్ఫీఫ్ జవాన్గా చేరాడు. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు సామాన్యులకు అవకాశం ఉందన్న విషయం తెలుసుకుని దరఖాస్తు చేశాడు. కోట్లాది మంది వీక్షకుల మద్దతుతో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి 105 రోజుల పాటు సాగిన పోటీలో విజేతగా నిలిచాడు. తుది పోటీలో కళ్యాణ్, తనుజాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎక్కువ మంది ఓట్లువేసి కళ్యాణ్ను విజేతగా నిలిపారు. సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకున్నారు. ట్రోఫీతో తొలిసారి బుధవారం గ్రామానికి వస్తున్న కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కళ్యాణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాలకొండలో మైనింగ్ దందా
అధికార బలంతో పాలకొండలో మైనింగ్, ఇసుక దందాపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి స్వయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్న నేతల తీరు బట్టబయలైంది. స్వయంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఫిర్యాదు చేశారంటే జిల్లాలో సాగుతున్న అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ● కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి భూదేవి ● ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండలో అక్రమ మైనింగ్ సాగుతోంది.. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్లచేస్తున్నారు.. రాత్రీపగలు తేడాలేకుండా లారీలు, ట్రార్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.. అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేసినా పరిస్థితిలో మార్పులేదంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీకి తెలిసే ఇదంతా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వి, లారీలతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. ఇదే విషయమై భూదేవి వర్గం సాక్ష్యాలతో సహా కలెక్టర్ దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. కలెక్టర్ను కలసిన అనంతరం పడాల భూదేవి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పార్టీ ఇన్చార్జిగా తనకూ బాధ్యతలున్నాయని.. కార్యకర్తలకు తాను కూడా సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమి అంటే అందరూ కలిసే.. అందరి భాగస్వామ్యంతో పనులు చేయాలన్నారు. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. గృహాలు, పింఛన్లు, ఇటీవల పంపిణీ చేసిన రేషన్ కార్డుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టిలో కూడా పెడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల పాలకొండ నియోజకవర్గంలో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అలకలు వీడి, అంతా కలసికట్టుగా పని చేయాలని హితవు పలికారు. నియోజకవర్గంలో అంతా ఏకపక్షమేనని.. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తమను కలుపుకొని వెళ్లడం లేదని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూదేవి పలుమార్లు బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరు, అవినీతి, అక్రమాల పాలనను ఆమె కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లారు. పడాల భూదేవి వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టరేట్లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని కలిసి ముస్తాబు కార్యక్రమం నిర్వహణలో అభినందించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, ఎమ్మెల్యే జయకృష్ణ ఏకపక్ష వైఖరిపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గృహాల మంజూరు విషయం తమకు తెలియడం లేదని.. అర్హులకు అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరికీ ఇల్లు, పింఛన్లు రానీయకుండా ఎమ్మెల్యే వర్గం ఇబ్బందులు పెడుతున్నట్లు వివరించారు. గోశాలల విషయంలోనూ టీడీపీ కార్యకర్తలను వెనక్కి పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమాచారం తమ కార్యకర్తలకు తెలియడం లేదని.. దీని వల్ల ప్రజలకు ఆ ప్రయోజనాలు, లబ్ధి వివరించలేకపోతున్నామని చెప్పా రు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ తనకు ఏ కార్యక్రమాల సమాచారమూ చెప్పడం లేదని వివరించారు. అధికారులైనా సమన్వయం చేసుకుని వెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిసింది. -
పోలీసుల పాత్ర కీలకం
● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి ● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్లో పోలీస్ శిక్షణ ప్రారంభం శాంతిభద్రతల పరిరక్షణలోడెంకాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, ఇక్కడకు శిక్షణకు వచ్చిన 187 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్బోస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు
● జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సేవలు పార్వతీపురం రూరల్: గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామర్ల బారినపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న కడ్రక విద్యాసాగర్, బచ్చల ఇసంత్, ఏడో తరగతికి చెందిన పువ్వల ధాన్యాలు, గంట ఫిరోష్లు నాలుగు రోజులుగా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్.సింహాచలం ఆరోపించారు. ఇటీవల పిట్స్ వ్యాధితో ఈ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన మరువక ముందే అధికారులు ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా వార్డెన్ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి అన్వేష సైన్స్ ఫెస్ట్ సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమపాఠశాల ఆవరణలో అన్వేష సైన్స్ఫెస్ట్ను ఈనెల 23, 24 తేదీల్లో జరగనుందని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవర్ స్వప్నిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 53 గిరిజన విద్యాసంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు రూపొందించిన 277 ప్రాజెక్టులు, టీచర్లు తయారుచేసిన 36 ప్రాజెక్టుల ప్రదర్శనలో 469 మంది విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని పేర్కొన్నారు. వెంకటరాజపురంలో ఏనుగులుజియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగులు దర్శనమిచ్చాయి. అనంతరం బిత్రపాడు, బట్లభద్ర, బాసంగి గ్రామాల్లోని పంట పొలాల్లోకి జారుకున్నాయి. అధికారులు స్పందించి ఏనుగుల తరలింపు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ● బొబ్బిలిలో అనసూయ సందడి బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. కార్యక్రమంలో షాపింగ్మాల్ య జమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులను హరించడమే..
కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమస్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు. ఈ పథకం పేదల కోసం ఇచ్చే దానధర్మం కాదని, గ్రామీణ పేదలు, ఆదివాసీలు, దళితులు, చిన్నసన్నాకారు రైతులు, ఆర్థిక బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే హక్కుల ఆధారిత చట్టమన్నారు. గ్రామీణ కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్ -
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది పార్వతీపురం టౌన్: పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కునే కార్యక్రమం ప్రతి ఇంటిలో పక్కాగా జరగాలని, దీనికోసం ‘ఫ్యామిలీ ముస్తాబు‘ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. స్థానిక లూథరన్ చర్చి పక్కన ఉన్న సమావేశ మందిరంలో ‘ఫ్యామిలీ ముస్తాబు’పై సోమవారం శిక్షణ ఇచ్చారు. పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రతి ఫ్రైడేను డ్రైడే పాటించాలని కోరారు. సమష్టిగా దోమల నిర్మూలన చర్యలు చేపడితే మలేరియాను అరికట్టవచ్చన్నారు. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందాలని, నాటువైద్యం సరికాదన్నారు. డిగ్రీ తరువాతే తల్లితండ్రులు అమ్మాయిలకు వివాహం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎస్.మన్మథరావు, జిల్లా మత్య శాఖాధికారి టి.సంతోష్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు పార్వతీపురం: విద్యార్థుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గుర్తించి వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్డే సందర్భంగా ప్రశంసాపత్రాను అందజేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గౌరవిస్తామన్నారు. -
మిల్లరు దయతలిస్తేనే..
● ధాన్యమిచ్చిన మూడు రోజులైనా ఖాతాకు జమకాని డబ్బులు సాక్షి, పార్వతీపురం మన్యం: ధాన్యమిచ్చిన 48 గంటల్లో కాదు.. 4 గంటల్లో రైతుల ఖాతాకు డబ్బులు జమచేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం డబ్బులు ఎలా జమ చేస్తున్నా.. జిల్లాలో మాత్రం రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీదే అది ఆధారపడి ఉంది. మిల్లర్ల దోపిడీపై ఎన్ని విమర్శలొస్తున్నా.. ఏ ఒక్కరూ వెరవడం లేదు. అధికారుల సహకారంతో సంపూర్ణ దోపిడీకి పాల్పడుతున్నారు. సీతానగరం మండలం జగ్గునాయుడుపేట, ఆర్.వి.పేట రైతులు శంబంగి దమయంతి, యాండ్రాపు లావణ్య, పెంట సావిత్రమ్మ, పెంట పార్వతిలు రామవరం రైతు సేవా కేంద్రం ద్వారా ఈ నెల 20న ధాన్యమిచ్చారు. అదే రోజు ట్రక్షీట్ ద్వారా 304 బస్తాలు నిర్ధారించారు. బూర్జకు చెందిన చిన్నమ్మతల్లి మోడ్రన్ రైస్మిల్లుకు పంపించారు. మూడు రోజులైనా ఆ ధాన్యానికి గుర్తింపు ఇవ్వలేదు. నేటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు రామవరం రైతు సేవా కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. తమకేమీ సంబంధం లేదని.. మిల్లు యజమానితో మాట్లాడుకోండని వారు బదులిచ్చారు. మిల్లు వద్దకు వెళ్లి ఆరా తీస్తే.. రూ.4,800 అదనంగా కట్టాలని, లేకపోతే ధాన్యం వచ్చినట్టు గుర్తించడం(అక్నాల్జ్) చేయడం కుదరదని తేల్చిచెప్పారు. తేమశాతం కారణంగా ఒక బస్తాకు 43 కేజీల చొప్పున లెక్క కట్టి.. అదనపు ధాన్యం తీసుకోవడమే కాక.. ఆ మొత్తం చెల్లించాలని అంటున్నారని రైతులు వాపోతున్నారు. మిల్లరు కారణంగా డబ్బులు రాలేదని చెబుతున్న దమయంతి, పెంట పార్వతి -
వైద్యసేవలు వేగవంతం.. పారదర్శకతే లక్ష్యం
● విశాఖ జోనల్ సమీక్షలో హెల్త్ సెక్రటరీ సౌరబ్గౌర్ పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల వీసీ సమావేశ భవనంలో నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల ఆరోగ్య సమీక్షా సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తన వైద్యబృందంతో హాజరయ్యారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, ప్రగతి నివేదికలను కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. కార్యాలయం వ్యవహారాలన్నీ ఇకపై ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలని, ప్రతి నివేదికను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతృ మరణాల విషయంలో కచ్చితమైన జవాబుదారీ తనం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులు, పోర్టల్లను పరిశీలిస్తూ వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్మోహనరావు, డాక్టర్ రఘు కుమార్, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కౌశిక్, డీపీఓ లీలారాణి, ఏఓ మణిరత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తుమరవల్లి పంచాయతీ నేరళ్లవలసలో పోయిరి సోమయ్య(50) ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేరళ్లవలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య తన పెద్ద కుమారుడు పోయిరి సింహాచలం ఇంటి వద్ద ఉండేవాడు, సోమయ్య మతిస్థిమితం కోల్పోయి తరచూ తన పెద్ద కుమారుడిని విసిగిస్తూ అసహనానికి గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా అలా ప్రవర్తించడంతో అసహనానికి గురైన సింహాచలం తన తండ్రి సోమయ్య ఎడమ చెవి వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సింహాచలం అంగీకరించడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఇద్దరు గిరిజనులకు గాయాలుభామిని: మండలంలోని బొడ్డగూడకు చెందిన ఆరిక రామయ్య, తులసి గ్రామానికి చెందిన మోహనరావు సోమవారం వేకువజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పర్లాకిమిడికి వారిద్దరూ బైక్పై వెళ్తుండగా మంచు తాకిడికి రోడ్డు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిద్దరికీ ముందుగా పర్లాకిమిడి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం ఆరిక రామయ్యను శ్రీకాకుళం రిమ్స్కు, మోహనరావును సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి గాయాలువీరఘట్టం: మండలంలోని సీఎస్పీ రహదారిలో కడకెల్ల వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన బంగారం వ్యాపారి, వైఎస్సార్సీపీ నాయకుడు వూణ్ణ శ్రీనివాస్ (కోణార్క్ శ్రీను), ఆర్టీసీ డ్రైవర్ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ బుల్లెట్పై గరుగుబిల్లి మండల ఖడ్గవలస వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్స్ కోసం కొన్ని విద్యుత్ స్తంభాలను కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే డంపింగ్ చేశారు. అయితే ఖడ్గవలస నుంచి వస్తున్న వీరు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే డంపింగ్ చేసిన విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం పార్వతీపురం తరలించారు. కారును ఢీకొట్టిన కంటైనర్● త్రుటిలో తప్పిన పెనుప్రమాదంగజపతినగరం: మండల కేంద్రంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిలో అదుపు తప్పి ఆదివారం రాత్రి పార్కింగ్లో ఉన్న ఓకారును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నంనుంచి రామభద్రపురం వెళ్తున్న కంటైనర్ మార్గమధ్యంలో అదుపు తప్పి గజపతినగరంలో లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో అక్క జనసంచారం లేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
నాయనమ్మను హత్య చేసిన మనుమడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఈ నెల 13 జరిగిన జరిగిన హత్య కేసు మిస్టరీని భోగాపురం పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదని సొంత నాయనమ్మనే మనుమడు హత్య చేశాడని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీకి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి దిద్దులు, జుమ్మలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకుని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబర్ 13న ఫిర్యాదు చేసింది.ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా, నేర స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై పి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.లక్ష్మణరావు బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలనలో డాగ్స్క్వాడ్. నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. బంగారం, వెండి రికవరీ నేరం జరిగిన కొద్ది రోజుల తర్వాత, పోలీసులకు అనుమానం లేదని నిందితుడు ముడసల గౌరిపై భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమైపె కక్ష పెంచుకున్నాడన్నారు. ముందు రోజు రాత్రి పెద్ద కొడుకు కొడుకై న గౌరి మద్యం మత్తులో తన నాయనమ్మను బైక్ ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైన్, వెండి పట్టీలను దొంగిలించాడన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకుని పోయినట్లు మభ్యపెట్టేందుకు మృతదేహాన్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, నూతికి సమీపంలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లాభాపేక్షతో హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్సైలు పి.పాపారావు, కె.లక్ష్మణరావు, ఏఎస్సై గౌరీ శంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రదానం చేశారు. -
కరాటే చాంపియన్షిప్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన 19వ కెన్యూరియో కరాటే చాంపియన్షిప్–2025లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/పీజీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పి.హర్షవర్ధన్(2), సీహెచ్.రిషిత, పి.గురుసిద్దిక్, ఎన్.వేవన్ష్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, కె.ప్రేమేష్ ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.తనుశ్రీ, సీహెచ్.రిషిత, ఎన్.దేవాన్ష్, కె.ప్రేమేష్, వి.ఇందిరా ప్రియదర్శిని, మహమ్మద్ సమీర్, ఎం.హర్హవర్ధన్, కె.శివగణేష్, పి.గగన్సాయి, బి.లేవాన్ ఉన్నారు. రజత పతకం సాధించిన వారిలో కె.తనుశ్రీ, ఎం.యోగిత, పి.గురుసిద్ధిక్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, ఎన్.జనని, వి.ఇందిరా ప్రియదర్శిని, జి.వివేక్ వర్మ రెండు, మహమ్మద్ సమీర్, ఎం.హర్షవర్ధన్, కె.శివగణేష్, పి.కుష్వంత్కుమార్ (2), పి.గగన్ సాయి, బి.లేవాన్ ఉన్నారు. విజేతలను, కోచ్ కె.సంతోష్కుమార్, అసిస్టెంట్ కోచ్ శ్రీభార్గవ్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసాయిదేవమణి అభినందించారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇచ్చి అర్జీదారుల సంతప్తిని స్థాయిని పెంచాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజలు 185 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామం సమీపంలో గల కొండకు ఉన్న మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ గ్రామంలోని ఎస్టీ గదబ కులానికి చెందిన ఎస్. మహేశ్వరరావు, ఎస్.కుమార్, ఎస్.వెంకట పాపారావు, ఎస్. శ్రీధర్తోపాటు గ్రామస్తులు వచ్చి కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శ్యామల గౌరీపురం సమీపంలో ఉన్న కొండచుట్టూ పోడు వ్యవసాయం రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు, జీడిమొక్కలు తదితర పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నామని, కొండ ప్రాంతాన్ని పశువులు, మేకలు మేత కోసం వినియోగిస్తున్నామని, అలాగే కొండపై ఉమామహేశ్వర గోకర్ణ స్వామి ఆలయం కూడా ఉందన్నారు. ఈ కొండకు, గుడికి రాకపోకలు చేసేందుకు ప్రభుత్వం గతంలో రహదారిని కూడా నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కొండకు మైనింగ్ అనుమతుల కోసం 18.5.2025న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ కొండ సమీపంలో ఉన్న మంచాడవలస, పణుకువలస, శ్యామల గౌరీపురం గ్రామాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని, కొండకు మైనింగ్ అనుమతులు ఇవ్వడం వల్ల ఈ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు పునరాలోచన చేసి నవదుర్గ మైనింగ్కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని వారు కోరారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో వెలుగు సీఎఫ్పై ఫిర్యాదు సీతంపేట: తాము తీసుకున్న ఉన్నతి రుణాలను తిరిగి చెల్లిస్తుంటే వెలుగు సీఎఫ్ జమచేయడం లేదని కొత్తూరు మండలంల కురిగాం గ్రామానికి చెందిన ఆదివాసీ స్వయం శక్తిసంఘం మహిళా సభ్యులు ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబుకు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 27 అర్జీలను గిరిజనులు సమర్పించారు. గూనభద్రకు చెందిన చల్లా ఉమాదేవి, సుబ్బారావు తదితరులు పెండింగ్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కొంకాడపుట్టి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని సవర శివకుమార్ వినతి ఇచ్చారు. పిల్లలు ఉన్నందున డబారుసింగి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని దేవి తదితరులు కోరారు. సోదగ్రామం మండల పరిషత్ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. శ్మశాసస్థలాన్ని ఆక్రమిస్తున్నారని కొండపల్లికి చెందిన ఎం.రాజారావు ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్ నేరాలు, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అంశాలపై మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోనన్లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసి, ఆ నివేదికలను కార్యాలయానికి పంపాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మిస్టర్ ఇండియా పోటీలకు కోన రమణ
శృంగవరపుకోట: మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలకు ఎస్.కోటకు చెందిన బాడీ బిల్డర్ కోన రమణ ఎంపికయ్యాడు. ఈ నెల 21న తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న కోన రమణ 5వ స్థానం సాధించాడు. నిర్వాహకులు రమణకు రూ.1000లు నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జనవరిలో ఛత్తీస్గఢ్లో జరగనున్న మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు రమణ చెప్పాడు. డీజీపీ కమోడేషన్కు ఎంపికై న విజయనగరం పీసీవిజయనగరం క్రైమ్: ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఇవ్వనున్న డీజీపీ కమోడేషన్ డిస్క్ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో సిల్వర్ డిస్క్ విజయనగరం పోలీస్ శాఖ పరిధి రామభధ్రపురం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ వై.అప్పలనాయుడును వరించింది. డీజీపీ సిల్వర్ డిస్క్లు నలుగురు ఐపీఎస్లతో పాటు మొత్తం 343 మందికి లభించాయి. కానిస్టేబుల్స్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి ఇద్దరికి ఈడిస్క్ అవార్డులు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శారద ఉన్నారు. -
పక్కా ప్రణాళికతో హత్య
● భీముడు మృతిపై సమగ్ర విచారణ జరపాలి ● ఎస్పీకి మృతుడి భార్య వినతిపార్వతీపురం రూరల్: రికార్డుల్లో గుండెపోటు..శరీరంపై మాత్రం గాయాల అనవాళ్లు..వెరసి గొర్రె భీముడు(52) మృతి మిస్టరీగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య భారతి, ఆదివాసీ ఎరుకల సంఘాల నాయకులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడకు చెందిన భీముడు గత ఏప్రిల్ 22న వంశధార నది ఒడ్డున విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహంపై కంటి భాగం, పక్కటెముకల వద్ద గాయాలున్నా..పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా పేర్కొనడంపై బాధితులు మండిపడ్డారు. గ్రామంలో చెత్త బండి నడిపే విషయంలో స్థానికంగా కొందరితో విభేదాలున్నాయని, వారే కులం పేరుతో దూషించి, దాడి చేసి చంపేశారని భారతి ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై సాక్షులున్నా పోలీసులు పట్టించుకోలేదని, పైగా హడావుడిగా అంత్యక్రియలు చేయించారని వాపోయింది. హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగలేదని, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుడిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శంకరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు కె.సంజయ్బాబు, ఏపీఏవైఎస్ఎస్ నేతలు జి.శ్రీనివాసరావు, ఎస్.ముసలయ్య, ఎం.పోతురాజు, గొర్ల సత్యం,చల్ల చిన్నారావు, గొర్ల సన్యాసిరావు, గొర్ల రమణమూర్తి, గేదెల ఆదినారాయణ, గేదెల సురేంద్ర, గొర్ల బుల్లోడు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా
పార్వతీపురం: పరిపాలనలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గజమాలతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మన జిల్లాకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి వస్తువులు కొనుగోలు, సేవల వినియోగం విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులు, ప్రమాణాలకు సంబంధించిన వాల్పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణి, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యమైన వస్త్రాల కలబోత ఎస్ఆర్ షాపింగ్ మాల్
బొబ్బిలి: దేశ, విదేశాల నుంచి నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకు తీసుకువచ్చి బొబ్బిలి ప్రాంత ప్రజలకు అందించడమే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లక్ష్యమని డైరెక్టర్ ప్రసాదరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 14వ బ్రాంచ్ను బొబ్బిలిలో ప్రారంభిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనకు సినీనటి అనసూయ భరద్వాజ్ హాజరుకానున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, మున్సిపల్ చైర్మన్ ఆర్.శరత్బాబు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎం.డి శంబంగి వేణుగోపాల నాయుడు, టీబీఆర్ గ్రూప్స్ చైర్మన్ తూముల భాస్కరరావు హాజరు కానున్నట్లు తెలిపారు. -
ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్గా రాజు
గంట్యాడ: ఈనెల 23వతేదీ నుంచి 28వతేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలురు జట్టుకు మేనేజర్గా పీవీఎస్ఎన్ రాజు వ్యవహరించనున్నారు. ఆయన గంట్యాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొటియాలో ఒడిశా మంత్రి పర్యటనసాలూరు: వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొటియా గ్రామంలో ఒడిశా రాష్ట్ర ఆహారసరఫరా మంత్రి కృష్ణ చంద్ర పాత్ర ఆదివారం పర్యటించారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు ఆయన అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొటియా గ్రామాలకు బియ్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి కార్డుకు 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. బొలెరో ఢీకొని యువకుడి మృతిరేగిడి: మండల పరిధిలోని చిన్నశిర్లాం జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామానికి చెందిన బొడ్డు భానుప్రకాష్ (22) ద్విచక్రవాహనంపై పాలకొండ నుంచి రాజాం వెళ్తుండగా రాజాం నుంచి పాలకొండ వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి సమీపంలో గల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తూ డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు గ్రామ వీఆర్ఓ త్రినాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామానికి చెందిన బండారు స్వామినాయుడు(35) మూడు రోజుల క్రితం అరకులో ఉన్న తన స్నేహితుడికి ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తూ డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికసాయం డెంకాడ: బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న బీహెచ్ లాస్య వైద్య ఖర్చుల కోసం విజయనగరం జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు రూ.10 వేల ఆర్థికసాయం చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. దాతలు మరింతమంది ముందుకువచ్చి, సాయం చేస్తే లాస్య ఆరోగ్యం మెరుపడే అవకాశం ఉందని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అక్కడ చేయి తడిపితేనే పని..!
నెల్లిమర్ల: నగర పంచాయతీ సిబ్బంది ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇవ్వనిదే నగన పంచాయతీలో పనులు జరగడం లేదు. ఇంటి పన్నులు వేయడం, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయడం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ చేయడం కోసం పట్టణవాసుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇదీ గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు. అయినా సరే సిబ్బందిలో ఏమాత్రం మార్పు రాలేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఏ పనికై నా మున్సిపల్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని కంట్రోల్ చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పంచాయతీ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా సంబంధిత సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసులు ప్రత్యక్షంగా చెబుతున్నారు. అవసరం లేకపోయినా అఫిడవిట్ కావాలంటూ వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. పాత సర్టిఫికెట్లు కావాలంటే కనీసం రూ.10వేలు అయినా ఇవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ కావాలంటే కనీసం రూ.50 వేలు అయినా సమర్పించుకోవాల్సిందే. తాజాగా మొయిద జంక్షన్లో నిర్మిస్తున్న ఓ భవనానికి అనుమతి కోసం ఏకంగా రూ.80 వేలు అదనంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కాకుండా ఇతర విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నట్లు సమాచారం. ప్రతి సర్టిఫికెట్కు సమర్పించాలి ఇక సర్టిఫికెట్ల విషయానికి వస్తే ప్రతి సర్టిఫికెట్కు పైసలు ఇవ్వాల్సిందేనని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. జనన, మరణ ధవీకరణ పత్రాలు కావాలంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించాలని వాపోతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అఫిడవిట్ పేరుతో కనీసం రూ.వెయ్యి అయినా ఇస్తే గాని సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదే విషయమై గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది సిబ్బంది పేర్లు కూడా సదరు సమావేశాల్లో ప్రస్తావించారు. అయినా సంబంధిత అధికారులు సిబ్బందిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా అధికారులు స్పందించి, సిబ్బంది వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, కౌన్సిలర్లు కోరుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న నగర పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్, ధ్రువపత్రాల కోసం నగర ప్రజల పాట్లు కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు సభ్యుల ఫిర్యాద -
కోనేరంతా కన్నీరు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరా మలింగేశ్వరస్వామి పుష్కరిణిలో ఆదివారం సా యంత్రం ఇద్దరు చిన్నారులు జారి పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గణేష్నగర్కు చెందిన సురవరపు నాగరాజు కుమారుడు పవన్(8), గణేష్ నగర్కు చెందిన శంకు సుదర్శన్ కుమారుడు శంకు ధనుష్(6)వి ఎదురెదురు ఇళ్లు. ఆదివారం సెలవు కావడంతో సైకిల్ తొక్కుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లి ఆడుకుంటున్నారు. ఆ కోనేరు గట్టు జారుగా ఉండడంతో జారి కోనేరులో పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించలేకపోయారు. కాసేపటి తర్వాత అక్కడున్న వేరే పిల్లలు చెప్పడంతో కొంతమంది యువకులు పుష్కరిణిలోకి దిగి గాలించారు. తొలుత పవన్ను గుర్తించారు. అలాగే మరికొంత సేపు గాలించగా ఊబిలో కూరుకుపోయి ఉన్న ధనుష్ను పైకి తీశారు. ఈ లోగా వారి తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. 108కి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసి పిల్లలు చనిపోయారనే విషాద వార్త తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. మృతుల్లో పవన్ స్థానిక లక్ష్మినగర్ ము న్సిపల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. తండ్రి నాగరాజు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. తల్లి పార్వతి గృహిణి. మరో మృతుడు శంకు ధనుష్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. తండ్రి సుదర్శన్ పట్టణంలో కోటి కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ కొట్టు నడుపుతుంటారు. ఆదివారం తమ కళ్ల ముందు ఆడుకున్న పిల్లలు అంతలోనే చనిపోయారని తెలియడంతో స్థానికులు నిశ్చేష్టులైపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. ఇదే కోనేరులో గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. జనావాసాల మధ్యన ఉన్న ఈ పుష్కరిణి చుట్టూ సీసీ రోడ్డులు, మెట్లు నిర్మించారు గానీ రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఈ అలసత్వమే ఇప్పుడు పిల్లల పాలిట మరణ శాసనాలు రాస్తోంది. చెరువులో కూడా ఊబి ఎక్కువగా ఉండడంతో కనీసం ఆ చెరువు క్లీనింగ్కు కూడా నోచుకోవడం లేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ వాసులంటున్నారు. పవన్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి -
ధాన్యం కొనుగోలులోనూ టీడీపీ హవా..!
విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా టీడీపీ నేతలు వదల్లేదు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే వారు కూడా తమ పార్టీవారినే టీడీపీ నేతలు నియమించుకున్నారు. టీడీపీకి చెందిన వారు అయితే తమ పార్టీనేతల కనుసన్నల్లో నడుస్తున్నారని పసుపు పార్టీ సానుభూతిపరులనే జిల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే అనుభవాన్ని కానీ, అర్హతను కానీ పట్టించుకోకుండా నియమకాలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టారు. కానీ చంద్రబాబు సర్కార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కానీ, సంస్థల్లో గాని పనిచేసే ఉద్యోగాలు తాత్కాలికమే అయినప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం అనవాయితీ. కానీ చంద్రబాబు సర్కార్ హయంలో పసుపు పార్టీయే అర్హతగా పోస్టులను భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, అనుభవం లేక పోయినా పసుపు పార్టీకి చెందిన మద్దతు దారులు అయితే వారికి అప్పనంగా పోస్టులు కట్టబెట్టేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వాచ్మెన్, వెలుగు వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్, వాచ్మెన్లను తొలిగించి టీడీపీకి చెందిన వారిని నియమించుకున్నారు. తాజాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందిని కూడా టీడీపీ వారినే నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జిల్లాలో 382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక హెల్పర్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. రెండు, మూడు నెలల పాటు వీరు విధులు నిర్వహించనున్నారు. హెల్పర్కు రూ.9 వేలు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.12వేలు చొప్పన వేతనాలు అందించనున్నారు. రైతు కళ్లం నుంచి ధాన్యం శాంపిల్ సేకరించి తేమశాతం పరీక్షించడం టెక్నికల్ అసిస్టెంట్ చేయాల్సిన విధులు. అయితే ఎక్కడా క్షేత్ర స్థాయికి వెళ్లి శాంపిల్ సేకరణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రక్ షీట్స్ జనరేట్ చేస్తారు. హె ల్పర్ వారికి సహాయంగా ఉంటారు. టీడీపీ సానుభూతిపరులే కొనుగోలు సిబ్బంది జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఒక్కో కేంద్రంలో ముగ్గురు చొప్పున నియామకాలు రెండు, మూడు నెలల పాటు విధులు సిబ్బంది నియామకం పీఏసీఎస్లదే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా(పీఏసీఎస్)లు నియమించుకుంటాయి. సిబ్బంది నియామకం బాధ్యతే వారిదే. బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్ -
మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
● రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ● ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ● మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యదత్తిరాజేరు: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మార్పిన అప్పలనాయుడు, వంగర రామకృష్ణ, మరడ రాము మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలను మరింత ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఎలాంటి మగదిక్కు లేని వంగర రామకృష్ణ కుమార్తెకు ప్రైవేట్ ఉద్యోగం వేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.రెండవ కుమార్తె చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వేయిస్తామన్నారు. మరడ రాము కుమారుడు చదువుతున్నందున జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోనున్నట్లు తెలిపారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రెడ్డి సింహాచలంతో కలసి బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, పార్టీ నాయకులు ఫణీంద్రుడు, దత్తి చిరంజీవి ఉన్నారు. -
కురుపాంకు కూతవేటు దూరంలో గజరాజులు
కురుపాం: కొన్నేళ్లుగా ఏజెన్సీ మన్యంలో తిష్ట వేసిన గజరాజుల గుంపు ఆదివారం కురుపాం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి. సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత అటవీ శాఖ అధికారులు గజరాజుల సంచారంపై ముందస్తు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తుండడంతో ఎప్పుడు ఎక్కడ గజరాజులు తిరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తమ ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో పోలి యో చుక్కలు వేయడంతో పాటు, 22 నుంచి 23 వరకు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీన పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యే క దృష్టి పెట్టామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించాలని ఆదేశించారు.


