Parvathipuram manyam District News
-
మహాశివరాత్రికి రామతీర్థంలో గట్టి పోలీస్ బందోబస్తు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై దేవస్థానం సిబ్బందితో చర్చించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులకు దన్నానపేట జంక్షన్ వద్ద, విజయనగరం వైపు నుంచి వచ్చే భక్తులకు సీతారామునిపేట జంక్షన్ వద్ద పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జాతరలో నిరంతర నిఘా ఉంటుందని, డ్రోన్స్ను వినియోగించి గస్తీ నిర్వహిస్తామన్నారు. ఆకతాయల కదలికలపై నిఘా పెడతామని, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై గణేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. సీఐ రామకృష్ణ -
ఉపాధ్యాయసంఘాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పార్టీల కతీతంగా స్వతంత్రంగా, కేవలం ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్నానని గాదెశ్రీనివాసులునాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మెరకముడిదాం మండలంలోని భైరిపురం, గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి, గరుగుబిల్లి, సాతాంవలస జెడ్పీపాఠశాలలతో పాటు మెరకముడిదాం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, గర్భాం ఏపీ మోడల్స్కూల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి నట్లయితే చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే మహిళలకు అవసరమైన మరిన్ని సెలవులను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆల్తిరాంబాబు, జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మండలానికి చెందిన పలు యూనియన్ల నాయకులు ఆర్.సింహాద్రి, టీవీవీఎల్.నరసింహులు, కృష్ణ, సత్తారు రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎస్ ఇప్పించండి కాగా మెరకముడిదాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెశ్రీ నివాసులనాయుడిని మెరకముడిదాం మండలానికి చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు (పార్ట్టైమ్ ఉద్యోగులు, సీఆర్ఎంటీలు, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది) కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తమకు ఎంటీఎస్ ఇప్పించాలని, అలాగే తమను పార్ట్టైమ్ ఉద్యోగులుగా కాకుండా ఒకేషనల్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం పరిగణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన గాదె శ్రీనివాసులునాయుడు తాను గెలుపొందిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్కుమార్, శంకర్రావు, సత్యవతి, ఉగాది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు -
గంజాయి అక్రమ రవాణా నిందితుడి అరెస్టు
రామభద్రపురం: 2019లో ఐషర్ వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పరారైన నిందితుడు డ్రైవర్ కిల్లో చిరంజీవి స్థానిక బైపాస్ రోడ్డులో పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో కాకర్లవలస జంక్షన్ వద్ద సాలూరు మీదుగా రామభద్రపురం వైపు వస్తున్న గంజాయితో ఉన్న వ్యాన్ 2019 జూన్ 17వ తేదీన స్థానిక పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబూరుగు మండలం తామర వీధి గ్రామం నుంచి 266 కిలోల గంజాయిని ఐషర్ వ్యాన్తో అక్రమంగా తరలిస్తుండగా కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో ఎస్సై బి.లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యాన్ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్ కిల్లో చిరంజీవి పరారవడంతో క్లీనర్ వెల్లంగి రమేష్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేిశారు. ఇన్నాళ్ల తరువాత స్థానిక బైపాస్ రోడ్డులో అప్పటి నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం పోలీసులు చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. -
విందులో విష సంస్కృతి
చర్యలు లేవుప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతోంది. పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా దారి మళ్లించి ప్లాస్టిక్భూతం ప్రజల మధ్యకు వస్తోంది. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాలి, ప్రతి ఒక్క ఉద్యోగికి ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యం కల్పించాలి. ఆర్వీజే నాయుడు, రాజాం పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్, చర్యలు తీసుకుంటున్నాంరాజాం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం. తొలుత షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం చేస్తున్నాం. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపై దృష్టిసారిస్తాం. వాటితో పాటు వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఫిర్యాదుచేయాలి. సీహెచ్. ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్, రాజాం ● విచ్చలవిడిగా ప్లాస్టిక్ బఫే ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు ● కలుషితమవుతున్న ఆహారపదార్థాలు ● ప్రమాదకరంగా పరిశ్రమల పరిసర ప్రాంతాలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం ● వాటర్ ప్లాంట్లుల్లోనూ అదే పరిస్థితిరాజాం: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న విందు భోజనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. శుభకార్యక్రమాలు, పెళ్లిళ్లు, పూజలు, పేరంటాళ్ల పండగ వంటి కార్యక్రమాల్లో నిర్వహించే సామూహిక భోజన కార్యక్రమాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. గతంలో ఈ భోజనాల్లో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు వినియోగంలోకి వచ్చాయి. వాటిని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాటిలో భోజనాలు చేసే వ్యక్తులు క్యాన్సర్ వంటి భయానక రోగాలబారిన పడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వాటితో పాటు ఆయా కార్యక్రమాల వద్ద వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా ప్రమాదకర వ్యాధులను ప్రజలకు అంటగడుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల వద్ద ప్లాస్టిక్ కవర్లు పోగులుగా ఏర్పడి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అంతా కలుషితమే ఇప్పుడు ప్రతి గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికోసం వినియోగిస్తున్న ముడిసరుకు చాలా ప్రమాదకరంగా ఉంది. వాటితయారీ అనంతరం వచ్చిన వ్యర్థాలు ఆయా పరిశ్రమల పక్కన పొలాల్లో, చెరువుల్లో పడేయడంతో ఆయా ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వాటిని అన్నసంతర్పణలు, భోజనాల్లో వినియోగించిన తరువాత ప్లేట్లను ప్రధాన రహదారులు, చెరువుల పక్కన వదిలేయడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర రసాయనాలతో కలుషితంగా మారుతున్నాయి. మానవుని ఆరోగ్యంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలిన ఆహార పదార్థాలు తినడం ద్వారా పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. అలాగే ఆయా కార్యక్రమాల వద్ద వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ వినియోగం ప్రమాదరంగా మారుతోంది. అవి ఏళ్ల తరబడి భూమిలో కలవడంలేదు. వాటిని పడేస్తున్న పంటపొలాలు, చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పర్యావరణం కలుషితమై చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకర రసాయనాలు పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వాటి తయారీలో వినియోగిస్తున్నారు. మోట్రో సోమిన్, బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటున్నాయి. వాటిలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసిన వెంటనే కరిగి ఆయా ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. దీంతో చర్మసంబంధిత వ్యాధులతో పాటు ప్రమాదకర క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. -
వైఎస్సార్సీపీలో సంస్థాగత నియామకాలు
విజయనగరం: రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్పార్సీపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీలో నూతన నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. నూతనంగా నియామకమైన నాయకులు రానున్న నాలుగు సంవత్సరాల పాటు పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నూతన నియామకాలు ఇవే.. నూతన నియామకాల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజాంకు చెందిన టంకాల అచ్చంనాయుడు, బొబ్బిలి నుంచి చొక్కాపు లక్ష్మణరావు, నెల్లిమర్ల నుంచి పతివాడ అప్పలనాయుడు, విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సీనియర్ కార్పొరేటర్ శెట్టి వీర వెంకట రాజేశ్వరరావు, గజపతినగరం నుంచి పాండ్రంకి సంజీవరావు, చీపురుపల్లి నుంచి శిరవూరు వెంకటరమణ రాజు, ఎస్ కోట నుంచి నూకల కస్తూరి నియామకమయ్యారు. జిల్లా పార్టీ కోశాధికారిగా రాజాం నియోజకవర్గానికి చెందిన సిరిపురపు. జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గజపతినగరం నుంచి వర్రి నరసింహమూర్తి, నెల్లిమర్లకు చెందిన అల్లాడ సత్యనారాయణమూర్తి, చీపురుపల్లి నుంచి ఇప్పిలి అనంత్ , విజయనగరం నుంచి సంగంరెడ్డి.బంగారు నాయుడు, బొబ్బిలి నుంచి తమ్మిరెడ్డి దామోదర్ రావులు నియమితులయ్యారు. అదేవిధంగా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా విజయనగరం నుంచి బొద్దాన అప్పారావు, కిలారి రాంబాబు, గజపతినగరం నుంచి తొత్తడి సత్తిబాబు, సుంకరి రామునాయుడు, బొబ్బిలి నుంచి చెలికాని.మురళీకష్ణ, ఆవు సత్యనారాయణ, రాజాం నుంచి కనకాల సన్యాసినాయుడు, కిమిడి ఉమామహేశ్వరరావులను నియమించారు. ఎస్.కోట నుంచి పినిశెట్టి వెంకటరమణ, పినిశెట్టి కష్టప్ప దొర, చీపురుపల్లి నుంచి శీర.అప్పలనాయుడు, నెల్లిమర్ల నుంచి లంక లక్ష్మణరావు, కర్రోతు వెంకటరమణలు నూతన కమిటీలో స్థానం దక్కించుకున్నారు. జిల్లా కార్యదర్శులుగా విజయనగరానికి చెందిన దుప్పాడ సునీత, కునుకు నాగరాజు, గజపతినగరం నుంచి బండారు బంగారమ్మ, సుమల గోవింద, బొబ్బిలి నుంచి సీహెచ్ సత్యనారాయణ, భమిడిపాటి విశ్వనాథశర్మ, రాజాం నుంచి ఎస్.రమేష్ నాయుడు, గడి మధుసూదనరావు, ఎస్.కోట నుంచి ఎం.అప్పారావు, పల్లా భీష్మా, చీపురుపల్లి నుంచి కొణిశి కృష్ణంనాయుడు, కరిమజ్జి శ్రీనివాసనాయుడు, నెల్లిమర్ల నుంచి బుగత రమణ, జి.మురళీమోహనరావులు నియామకమయ్యారు. అదేవిధంగా పార్టీ స్పోక్స్ పర్సన్గా రాజాం నుంచి ఉత్తరావల్లి సురేష్ముఖర్జీ, బొబ్బిలి నుంచి బి.సత్యనారాయణ, చీపురుపల్లి నుంచి రేగిడి లక్ష్మణరావు, గజపతినగరం నుంచి కరణం ఆదినారాయణ, నెల్లిమర్ల నుంచి సముద్రపు రామారావు, విజయనగరం నుంచి కనకల రఘురామారావు, ఎస్.కోట నుంచి గొర్లె రవికుమార్లు నియమితులయ్యారు. -
లలిత క్రీడా వైభవం
విజయనగరం: చైన్నెలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా ఈ నెల 17 నుంచి వరకు జరిగిన 23వ పారా జాతీయస్థాయి చాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో జిల్లాకు స్వర్ణపతకం దక్కిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన కిల్లక లలిత 400 మీటర్ల పరుగు పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. గతం లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించిన లలిత చైన్నెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్ సాధించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించినట్లు చెప్పారు. ఈ విజయం క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పారా జాతీయపోటీల్లో పతకం సాధించిన లలితతో పాటు కోచ్ తబరీష్లను కలెక్టర్ డాక్టర్.బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామిలు అభినందనలు తెలియజేశారు. పారా జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణపతకం -
27న జీఎంఆర్ నైరెడ్లో ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు రిప్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ (13 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), మగ్గం వర్క్స్ (30 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డులతో పాల్గొనాలని సూచించారు. జెంట్స్ టైలరింగ్, లేడీస్ టైలరింగ్, మగ్గం వర్క్స్కు హాజరయ్యేవారికి 5వ తరగతి విద్యార్హత ఉంటే చాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఉపాధ్యాయసంఘాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పార్టీల కతీతంగా స్వతంత్రంగా, కేవలం ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్నానని గాదెశ్రీనివాసులునాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మెరకముడిదాం మండలంలోని భైరిపురం, గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి, గరుగుబిల్లి, సాతాంవలస జెడ్పీపాఠశాలలతో పాటు మెరకముడిదాం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, గర్భాం ఏపీ మోడల్స్కూల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి నట్లయితే చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే మహిళలకు అవసరమైన మరిన్ని సెలవులను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆల్తిరాంబాబు, జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మండలానికి చెందిన పలు యూనియన్ల నాయకులు ఆర్.సింహాద్రి, టీవీవీఎల్.నరసింహులు, కృష్ణ, సత్తారు రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎస్ ఇప్పించండి కాగా మెరకముడిదాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెశ్రీ నివాసులనాయుడిని మెరకముడిదాం మండలానికి చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు (పార్ట్టైమ్ ఉద్యోగులు, సీఆర్ఎంటీలు, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది) కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తమకు ఎంటీఎస్ ఇప్పించాలని, అలాగే తమను పార్ట్టైమ్ ఉద్యోగులుగా కాకుండా ఒకేషనల్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం పరిగణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన గాదె శ్రీనివాసులునాయుడు తాను గెలుపొందిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్కుమార్, శంకర్రావు, సత్యవతి, ఉగాది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు -
జాతీయ కబడ్డీ పోటీలకు శశికుమార్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారుడు అర్హత సాధించాడు. ఈనెల 20 నుంచి 23 వరకు కటక్లో జరగనున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన శశికుమార్ ఎంపికయ్యాడు. ఈ క్రీడాకారుడు గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. శశికుమార్ ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవీపీ రాజు, అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణరావు, ట్రెజరర్ శివకుమార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్రస్థాయి వెటరన్ షటిల్ పోటీలకు పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న వెటరన్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్టు గురువారం పయనమైంది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం 30 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా జట్టుకు కోచ్ అండ్ మేనేజర్లుగా వై.కుసుం బచ్చన్, నున్న సురేష్లు వ్యవహరించనున్నారు. ఈ బృందంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది క్రీడాకారులు కుసుం బచ్చన్, టీఎల్.సుబ్బారావు, మల్లికార్జునరావు అపర్ణ బాబా, గణేష్, నవీన్కుమార్, ఖలీ లుల్లా, ఎం. శ్రీను, పైడిరాజు పాల్గొననున్నారు. ఈ బృందానికి జిల్లా గుర్తింపుతో టీ షర్ట్స్ను జిల్లా సంఘం చైర్మన్ ఇందుకూరి రఘురాజు బహుకరించగా, జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేఏ నా యుడు జిల్లా సంఘం ద్వారా క్రీడాకారులకు ప్రవేశరుసుము, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లిస్తున్నారు. జి ల్లా జట్టుకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
మహాశివరాత్రికి రామతీర్థంలో గట్టి పోలీస్ బందోబస్తు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై దేవస్థానం సిబ్బందితో చర్చించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులకు దన్నానపేట జంక్షన్ వద్ద, విజయనగరం వైపు నుంచి వచ్చే భక్తులకు సీతారామునిపేట జంక్షన్ వద్ద పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జాతరలో నిరంతర నిఘా ఉంటుందని, డ్రోన్స్ను వినియోగించి గస్తీ నిర్వహిస్తామన్నారు. ఆకతాయల కదలికలపై నిఘా పెడతామని, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై గణేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. సీఐ రామకృష్ణ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 170జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలువీరఘట్టం: వీరఘట్టంలో కొంతమంది వ్యక్తులు నకిలీ స్టాంపుల విక్రయాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనుగోలు చేసిన రూ.10, రూ.50 స్టాంపు పేపర్లను పోలిన మాదిరిగానే కలర్ జిరాక్స్లు తీసి అడ్డుగోలు వ్యాపారానికి తెరతీశారు. భూముల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల కోసం ఈ స్టాంపు పేపర్లు అవసరమైన వారు అవి నకిలీ అని తెలియక కొనుగోలు చేస్తున్నారు.ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూరిల్లు దగ్ధందత్తిరాజేరు: మండలంలోని టి.బూర్జవలసలో చింతగడ ప్రసాద్కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు సర్పంచ్ మంత్రి క్రాంతికుమార్, ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారని చెప్పారు. నిరుపేద అయిన ప్రసాద్కు చెందిన ధాన్యం, బియ్యం, పప్పు దినుసులు టీవీ ఇతర ఇంటి సామగ్రి బట్టలు, ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో కటుంబసభ్యులు రోడ్డున పడ్డారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందంపార్వతీపురంటౌన్: జిల్లా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. బృందం క్వాలిటీ కంట్రోలర్ రవికుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవితో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా అందించే కాయకల్ప అవార్డును ఇంటర్నల్ పీగ్ అసెస్మెంట్లో భాగంగా బృందసభ్యులు ఆస్పత్రిని పరిశీలించిన సందర్భంగా అస్పత్రిలో అన్ని విభాగాలను సందర్శించాచు. స్వచ్ఛత, సదుపాయాలు, బయోమెడికల్ వేస్టేజీ, పారిశుధ్య రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రసవాల సంఖ్య, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆస్పత్రి నిర్వహణ అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జ్ఞాన జ్యోతితో చిన్నారుల సమగ్రాభివృధ్ధి● డీఈఓ ఎన్.తిరుపతినాయుడు గుమ్మలక్ష్మీపురం: ఐదేళ్లలోపు చిన్నారుల సమగ్రాభివృధ్ధి కోసమే జ్ఞానజ్యోతి శిక్షణ ఇస్తున్నామని..శిక్షణను సద్వినియోగం చేసుకుని చిన్నారుల సమగ్ర అభివృధ్ధికి అంగన్వాడీ కార్యకర్తలంతా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.తిరుపతినాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ శిక్షణలో నేర్పిస్తున్న అంశాలు, ఎంత వరకు అర్థం చేసుకున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం గుమ్మలక్ష్మీపు రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ పబ్లిక్ పరీక్షలను పరి శీలించారు. ఆయన వెంట ఎంఈఓలు బి.చంద్రశేఖర్, బిడ్డిక భీముడు ఉన్నారు. ఈ సందర్భంగా డీఈఓ విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 67 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు పేర్కొన్నారు. -
అనుమానంతోనే భార్య హత్య
దత్తిరాజేరు: ఈనెల 6న గుచ్చిమి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో భార్య యాకల గౌరమ్మను అనుమానంతోనే భర్త సత్యం హతమార్చాడని బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య తెలిపారు. నిందితుడు పెదమానాపురం బీసీ కాలనీ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై జయంతి, సీఐ రమణ పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పెదమానాపురం పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య వివరాలు వెల్ల డించారు. స్వగ్రామం చుక్కపేట నుంచి పొలం పనులకు వెళ్తుండగా తోట వద్ద కొడవలితో హత్య చేసి అక్కడి నుంచి చెరువులో సెల్ఫోన్ పడేసి రక్తపు మరకలు కడుక్కుని మరడాం, మేడపల్లి, పోరాం, ఉద్దంగి వద్ద జాతీయ రహదారి దగ్గరలో నిందితుడు వేసుకున్న షర్ట్ను విప్పేసి తువ్వాలు కప్పుకుని బొండపల్లి మండలం గొల్లుపాలెంలో ఐదు రోజుల పాటు గొర్రెల కాపరులతో ఉన్నాడు. వారు డబ్బులు ఇవ్వక పోవడంతో పెందుర్తిలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పని చేయగా కూలి రూ.2వేలు రావడంతో ఆ డబ్బులతో బుధవారం సాయంత్రం పెదమానాపురం వచ్చాడు. భార్య మృతి చెందిందా? లేదా? పిల్లలు ఎలా ఉన్నారో? ఊరి పరిస్థితి తెలుసుకోవడానికి నిందితుడు పెదమానాపురం వచ్చిన సమాచారంతో పోలీసులకు పట్టుబడడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. -
చికెన్ వినియోగంపై అపోహలు వద్దు
● జిల్లాలో బర్ట్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవు ● హెూటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావువిజయనగరం: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేనని, చికెన్ వినియోగంపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని మయూర హోటల్లో జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా పాల్గొని ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు మీడియా సహకారం కావాలని కోరారు. కేవలం రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బర్డ్ఫ్లూలక్షణాలు కనిపించాయని, విజయనగరం జిల్లాలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. హోటల్స్ పరంగా తాము నిత్యం దాడులు నిర్వహిస్తున్నామని, ఎవరైనా కల్తీ చేసినట్లు నిరూపితమైతే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పుకార్లు రావడంతో హోటల్స్ వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయన్నారు. ప్రజలు చికెన్ వినియోగింవచ్చన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నవీన్, శ్రీనివాసరావు, కాళ్ల సునీల్, మహమ్మద్ అకితుల్లా, రోహిత్, ఈశ్వర్, పఠన్, చందు తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తోంది పాలకొండ: గంజాయి వనంలో తులసి మొక్కల వలే నిలబడ్డారు... రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తోంది.. పార్టీ ప్రతిష్టను పెంచారు... ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాలకొండ నగరపంచాయతీ కౌన్సిలర్లను అభినందిస్తూనే భరోసా ఇచ్చారు. పాలకొండలోని పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నగర పంచాయతీ కౌన్సిలర్లతో కాసేపు మాట్లాడారు. ఇటీవల నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి నాయకుల ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్ కౌన్సిలర్లు పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడిన తీరును అభినందించారు. బలంలేకపోయినా చైర్మన్ కుర్చీకోసం కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలను అడ్డుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లందరూ ఏకతాటిపై నిలబడడం గర్వంగా ఉందన్నారు. కౌన్సిలర్లతో సెల్ఫీలు దిగి వారిని ఉత్సాహపరిచారు. సాక్షాత్తు జగన్మోహన్రెడ్డి కౌన్సిలర్లను, పార్టీ నాయకులను పేరుపేరున పలుకరించడం, భరోసా కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. శివరాత్రికి జిల్లా నుంచి 55 బస్సులుపార్వతీపురంటౌన్: శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా నుంచి 55 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా శాఖాధికారి కె. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గల శైవ క్షేత్రాలకు మూడు డిపోల నుంచి బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 26,27 తేదీల్లో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి కొమరాడ మండలం గుంప సోమేశ్వర ఆలయానికి 10 బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ. 20గా నిర్ణయించినట్లు తెలి పారు. సాలూరు డిపో నుంచి పారమ్మ కొండకు 25బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. పాలకొండ నుంచి రామతీర్థం క్షేత్రానికి 20బస్సులు ఏర్పాటు చేశామని, చార్జీ రూ.30గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులంతా ఆర్టీసీ సర్వీ సులను వినియోగించుకోవాలని తెలిపారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు● ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ వ్యక్తులు, మహిళలు, పిల్లలు, సంస్థలపై హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు రోలింగ్ చేసినా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టిన, షేర్చేసేవారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత అనవసర పోస్టులు పెట్టి భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. నాటిక పోటీలు ప్రారంభం నెల్లిమర్ల: జరజాపుపేటలో నల్లి సూరిబాబు స్మారక కళాప్రాంగణంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శించిన రైతే రాజు, ఎడారిలో వాన చినుకు నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ప్రారంభోత్సవంలో చనమల్లు వెంకటరమణ, సువ్వాడ రవిశేఖర్, పలువురు కళాకారులు పాల్గొన్నారు. పాలకొండలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిసాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ/పాలకొండ రూరల్: అభిమానం ఎక్కడికీ పోలేదు.. మమకారం ఇసుమంతైనా తగ్గలేదు.. ఆప్యాయత అణువంతైనా మారలేదు. మన్యం ప్రజలకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధ్య విడదీయరాని అనుబంధం పాలకొండ సాక్షిగా గురువారం నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డిపై తమ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న మమకారం ఆయన పర్యటనలో కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పాలకొండ రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. అడుగడుగునా అభిమాన వర్షం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన... విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వీరఘట్టం రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు ఆయనకు అక్కడ ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణి వెంట రాగా.. రోడ్డు మార్గంలో రాజాం జంక్షన్, కోటదుర్గ జంక్షన్ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాలకొండలోని పాలవలస ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర అభిమానులు ద్విచక్ర వాహనాలతో ఆయన వెంట హుషారుగా కదిలారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల జగన్ ఎక్కడా వాహనం దిగనప్పటికీ... మధ్యమధ్యలో ప్రజల అభిమానంతో కారు మీద నుంచే ఆగి, అభివాదం చేసుకుంటూ వెళ్లారు. పాలకొండ పట్టణంలోని పాలవలస విక్రాంత్ ఇంటి వద్దకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.45 సమయంలో అక్కడకు చేరుకున్న జగన్.. తొలుత దివంగత పాలవలస రాజశేఖరం చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరం సతీమణి ఇందుమతి చేతిలో చేయివేసి ధైర్యం చెప్పారు. రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్బాబు, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్కుమార్, గొండు కృష్ణమూర్తి, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, నాయకులు తలేరాజేష్, పేరాడ తిలక్, గొడ్డేటి మాధవి, జమ్మాన ప్రసన్న కుమార్, జయమణి, రేగాన శ్రీనివాస్, నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్య నారాయణరాజు, అంధవరపు సూరిబాబు, పిరియా సాయిరాజ్, ధర్మాన కృష్ణ చైతన్య, కరిమి రాజేశ్వరరావు, మెంటాడ పద్మావతి, చింతాడ రవికుమార్, కిల్లి సత్యనారాయణ, పాలిన శ్రావణి, దుంపల లక్ష్మణరావు, చెట్టి వినయ్, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్ని కను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్ఎస్ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు. పార్వతీపురంటౌన్: జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలను రానున్న రెండు మాసాల్లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలోని రెండు యూపీహెచ్సీలు ఈ నెలాఖరులోగా పూర్తిచే యాలన్నారు. సాలూరులోని యూపీహెచ్సీ మార్చి చివరనాటికి, పాలకొండ యూపీహెచ్సీ ఏప్రిల్ మాసాంతానికి సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూపీహెచ్సీలపై వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల సేవల కసం మంజూరైన యూపీహెచ్సీలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. మురుగునీటి వ్యవస్థను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బెలగాంలోని యూపీహెచ్సీ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సెప్టిక్ ట్యాంక్ పనులు పెండింగ్ ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. పూర్తి చేసిన పనులకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల అవుతున్నందున త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సాలూరు తెలగ వీధిలోని యూపీహెచ్ఈ, పాలకొండ యూపీహెచ్సీలకు ప్లోరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పెండింగ్ ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని, మెంటాడ వీధిలోని యూపీహెచ్సీ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. యూపీహెచ్సీ నిర్మాణ పనులన్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కావాలని, ప్రతివారం ప్రగతి ఫొటోలను తమకు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎంఎస్ఎంఈల సర్వే మరింత వేగవంతం చేసి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మున్సిపాల్టీతో పాటు చుట్టు పక్కల పంచాయతీలను స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనీలకు శిక్షణ స్వచ్ఛ సుందర పార్వతీపురంపై మార్చి 1వ తేదీ నుంచి మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తామని, అందుకు తగిన పేర్లను సూచించాలని కలెక్ట్ తెలిపారు. రోజూ రెండు పూటలా పారిశుద్ధ్యం చేపట్టేలా ప్రణాళికలు చేయాలని, చెత్తను సేకరించేందుకు వీలుగా తగిన సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసుకోవాలని వివరించారు. సమావేశంలో వైద్యాధికారి టి.జగన్మోహన్రావు పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.పార్వతీపురంటౌన్: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్న్యూస్రీల్పాలవలస కుటుంబానికి ఓదార్పు.. పార్టీ ప్రతిష్ట నిలిపారు.. మీ అందరికీ అండగా ఉంటా.. కౌన్సిలర్లను అభినందించిన జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం పాలవలస కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరామర్శ వైఎస్సార్ సీపీ అధినేతకు అపూర్వ ఆదరణ గుండెల్లో పెట్టుకున్న ఏజెన్సీ ప్రజానీకం హెలిప్యాడ్ నుంచి పాలవలస ఇంటి వరకూ దారి పొడవునా తోడ్కొని వెళ్లిన నాయకులు, అభిమానులు సీఎం సీఎం... పల్లె పండగ పనులపై దృష్టి సారించండి జిల్లాలో పల్లె పండగ కింద మంజూరైన పనులపై దృష్టి సారించి శతశాతం పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పల్లె పండగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. పూర్తి చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన, పూర్తయిన పనులు, బిల్లులు మంజూరు, పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి మాసాంతానికి శతశాతం పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. కురుపాంలో మందకొడిగా పనులు కురుపాంలో పనులు వేగవంతం కావడం లేదని, దానిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ను రద్దుచేసి, వేరే కాట్రాక్టర్తో పనులు చేపట్టాలని కలెక్టర్ వివరించారు. ఫిబ్రవరి మాసాంతంలోగా పనులు పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైతే అదనపు పనివారిని ఏర్పాటు చేసుకుని, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఉపాధిహామీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి జాతీయ ఉపాధిహామీ కింద జిల్లాలో చేపట్టిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం ఉపాధిహామీ పనులపై ఎంపీడీఓలతో కలెక్టర్ర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మినీ గోకులాలు, ప్రహరీలు, ఫారంపాండ్స్, ఫిష్ పాండ్స్, రహదారులు తదితర పనుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఉపాధిహామీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఉపాధి కింద చేపడుతున్న పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, బిల్లులను పంపాలని సూచించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఐదేళ్ల కుమారుడి కష్టా న్ని పాలకొండకు చెందిన ముదిల జ్యోతి జగన్మోహన్రెడ్డికి వివరించగా.. చిన్నారి ఆరోగ్య బాధ్యతను మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. జగన్తో సెల్ఫీలు దిగేందు కు మహిళ లు, వృద్ధు లు, యువకులు, విద్యార్థులు అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారూ పోటీ పడ్డారు. గోడలు, గేట్లు గెంతారు. జగనన్నను చూసేందుకు పాలకొండ రో డ్డులో దారి పొడవునా జనం వేచిచూశారు. ఇళ్ల డాబాపైకి ఎక్కి ఆశగా చూశారు. అభిమాను లు అడుగడుగునా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. సుమా రు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాలకొండ చేరుకున్నారు. సాయంత్రం 4.15 నిమిషాలకు తిరు గు ప్రయాణమయ్యారు. దాదాపు గంట సమయం పాలవలస ఇంటిలోనే గడిపారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల ముఖ్య నేత లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు ఆయనను కలిశారు. పట్టణంలో పలువురు చిన్నారులను ఆయన దగ్గరకు తీసుకోవడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు. -
జీడి పరిశ్రమను పరిశీలించిన వీడీవీకే బృందం
పార్వతీపురంటౌన్: సంకల్ప్ పథకంలో భాగంగా పలాసలోని జీడిపప్పు పరిశ్రమను వీడీవీకే (వన్ధన్వికాస్ కేంద్రం) సభ్యులు బుధవారం సందర్శించినట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా జీడిపప్పు పరిశ్రమను స్థాపించనున్న వీడివీకే బృందం పలాసలోని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను సందర్శించినట్టు వెల్లడించారు. పరిశ్రమ నిర్వహణపై అవగాహన పొందారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పథక సంచాలకుడు వై. సత్యం నాయుడు, జిల్లా పరిశ్రమల అడిషనల్ డైరెక్టర్, కృషి విజ్ఞాన్ కేంద్రం కోఆర్డినేటర్, హార్టికల్చర్ ఆఫీసర్, మండల ఏపీఎంలు, నైపుణ్యాభివృద్ధి సిబ్బంది పాల్గొన్నారు. -
కొటియా గ్రామాల సమస్య పరిష్కరించండి
సాలూరు రూరల్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల పాలకులు సంయుక్తంగా చర్చించి కొటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యధర్శి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఆయన దిగువ శెంబి, ఎగువశెంబి, ధూళిభద్ర, గ్రామాల్లో బుధవారం పర్యటించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించారు. 21 కొటియా గ్రూపు గ్రామాల ప్రజలు ఆంధ్రాలో కలిసి ఉంటామని చెబుతున్నా ప్రభుత్వం వివాదం పరిష్కంచేందుకు కృషిచేయకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.వై.నాయుడు, కోరాడ ఈశ్వరరావు, సీతయ్య, మహేష్, చోడపల్లి బిరుసు, మర్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు ఆట వస్తువులు
● ఐసీడీఎస్ పీడీ జె.కనకదుర్గ రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తులను సరఫరా చేస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ పీడీ జె.కనకదుర్గ, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు అందజేసేందుకు రామభద్రపురంలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ గోదాంలో ఉన్న ఆట పరికరాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షం పథకం కింద జిల్లాలోని 2075 అంగన్వాడీ కేంద్రాల్లో మొదటి దశలో 113 కేంద్రాలకు క్రీడా పరికరాలు సరఫరాచేశామన్నారు. ఇప్పుడు రెండో దశలో 516 కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని, తర్వాత మిగిలిన కేంద్రాలకు సరఫరా అవుతాయన్నారు. పిల్లలు కోసం ఆట వస్తువులతో పాటు టీవీ, ఆర్వో ప్లాంట్ తదితర పరికరాలను కేంద్ర ప్రభుత్వం సరఫరాచేస్తోందన్నారు. కొద్ది రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలకు పాలప్యాకెట్ల సరఫరాను నిలిపివేసి వాటి స్థానంలో పాలపౌడర్ను పంపిణీ చేసే అవకాశం ఉందన్నా రు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద సాలూరు, భద్రగిరి ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామని చెప్పారు. జీబీఎస్పై ఆందోళన వద్దు.. ప్రస్తుతం కలకలం రేపుతున్న జీబీఎస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని డీఎంహెచ్ఓ భాస్కరరావు అన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, నాడీ వ్యవస్థకు సోకే వ్యాధిగా పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాధి నివారణకు సంబంధించిన మందు లు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో సీడీపీఓలు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని డి.మంజులవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ముగిశాయన్నారు. ఒకేషనల్ విభాగంలో 40 సెంటర్లలో ఫిబ్రవరి 5 నుంచి 19వ తేదీ వరకు, జనరల్ విభాగంలో 37 సెంటర్లలో 10 నుంచి 19వ తేదీ వరకు రెండు స్పెల్లలో పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. వృక్షశాస్త్రం పరీక్షకు 1808 మంది, జంతుశాస్త్రం పరీక్షకు 1808, భౌతిక శాస్త్రం పరీక్షకు 4,217, రసాయన శాస్త్రం పరీక్షకు 4217 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షకు మొదటి సంవత్సరం 2,881 మంది, రెండవ సంవత్సరం 3,045 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయన్నారు. -
ఛత్రపతి శివాజీ గొప్ప దేశభక్తుడు
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: ఛత్రపతి శివాజీ మహాయోధుడే కాదని , గొప్ప దేశభక్తుడని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా పట్టణంలోని శివాజీ సెంటర్లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, హైందవ ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన కృషిని దేశం మరిచిపోదని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు,నాయకులు, గిరిరఘు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన మంత్రి సంధ్యారాణి పట్టణంలోని శివాజీ సెంటర్లో ఉన్న శివాజీ విగ్రహానికి సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ దేశ భక్తిని కొనియాడారు. -
జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
● నేడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలకొండ రాక పాలకొండ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం పాలకొండ రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేదుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారు. దీనికోసం వీరఘట్టం రోడ్డులో హెలిప్యాడ్ను సిద్ధంచేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డు మార్గం గుండా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏర్పాట్లపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావుతో పాటు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్లు రెవెన్యూ, పోలీస్ అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. రాజశేఖరం ఇంటికి వెళ్లే ప్రధాన మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభిమానులను జగన్మోహన్రెడ్డి పలకరించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. -
స్పందన కరువు
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సూర్యఘర్ యోజనకుపార్వతీపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వచ్చే ఏడాది మార్చినాటికి జిల్లాలో సుమారు 5వేల యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 560 మంది దరఖాస్తు చేయగా, 83 మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 45 మంది ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటుచేశారు. సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. సౌరవిద్యుత్ ప్యానళ్లు, ఇతర సామగ్రికి అయ్యే వ్యయంలో దాదాపు సగం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకునే వెసులుబాటు ఉన్నా అధికమంది ఆసక్తి చూపడంలేదు. యూనిట్ల ఏర్పాటు ఇలా... రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. నెలకు 120 యూనిట్లు ఉపయోగించే వారికి ఒక కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంటు ఇంటి డాబాపై ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు. ఈ యూనిట్కు రూ.60 వేలు ఖర్చవుతుంది. అందులో రూ.30 వేలు రాయితీ వస్తుంది. నెలకు 240 యూనిట్లు వినియోగించేవారు రెండు కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంటు పెట్టుకోవచ్చు. దీనికి లక్షా20వేలు లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ.60 వేలు రాయితీగా లభిస్తుంది. నెలకు 360 యూనిట్లు ఉపయోగిస్తే మూడు కిలోవాట్ల వవర్ ప్లాంటు పెట్టుకోవచ్చు. దీనికి ఖర్చయ్యే రూ.లక్షా 80వేలలో 90వేలు రాయితీ వస్తుంది. సోలార్ రూఫ్ టాప్కు 25 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నారు. డీలర్లు ఐదేళ్లపాటు ఉచిత సర్వీసు అందిస్తారు. న్యూస్రీల్ పథకంపై ఆసక్తి చూపని జిల్లా వాసులు 50 శాతం రాయితీ ఉన్నా వినియోగించుకోని వైనం జిల్లాలో ఇప్పటివరకు కేవలం 506 దరఖాస్తులు 45 యూనిట్ల బిగింపు డబ్బులు చెల్లించినది 83 మందే... అపోహలు వద్దు సోలార్ పవర్ వల్ల విద్యుత్ బిల్లు భారీగా తగ్గిపోతుంది. మొదట పెట్టుబడి అధికంగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్ టాప్ల విషయంలో ఎటువంటి అపోహలు అవసరంలేదు. బ్యాంకులు రుణంగా ఇస్తాయి. పదేళ్లలో బ్యాంకు అప్పు తీరిపోతే 15 సంవత్సరాలపాటు ఇంటికి ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు మరికొంత సొమ్ము ఏపీఈపీడీసీఎల్ నుంచి వస్తుంది. – చలపతిరావు, ఏపీఈపీడీసీఎల్, ఎస్ఈ -
నేటి నుంచి ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీలు
నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు, కందుకూరి వీరేశలింగం అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ ఆరిపాక బ్రహ్మానందం మాస్టారి పేరిట ఈ నాటక పోటీలను ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎంఎల్ఏ లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభ అనంతరం నాటిక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. తొలిరోజు హైదరాబాద్ కళాంజలి కళాకారులు’ రైతే రాజు’ నాటికను తర్వాత కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్న్స్ కళాకారులు ’ఎడారిలో వాన చినుకు’ నాటికను ప్రదర్శిస్తారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమానికి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, భీశెట్టి బాబ్జీ, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వేమలి త్రినాథరావు హాజరు కానున్నారు. రెండో రోజు రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం కళారారులు ’కొత్త పరిమళం’ నాటికను, తర్వాత విజయనగరానికి చెందిన సౌజన్య కళా స్రవంతి (ఉత్తరాంధ్ర) కళాకారులు దేవరాగం నాటిక ప్రదర్శించనున్నారు. మూడో రోజు శనివారం సాయంత్రం 6గంటలకు సభా కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ’చీకటి పువ్వు నాటికను, తర్వాత విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి కళాకారులు ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత ’నాటికను ప్రదర్శించమన్నారు. విజేతలకు బహుమతులు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అతిథుల చేతుల మీదుగా జరజాపు పేటకు చెందిన సీనియర్ కళాకారులను సత్కరించనున్నట్లు పోటీల నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాటక పోటీల విజేతలకు వరుసగా రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులతో పాటు శాశ్వత షీల్డ్ లను అందజేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ నటులకు వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నాటక పోటీలకు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మూడురోజుల పాటు జరగనున్న పోటీలు రెండు రాష్ట్రాల నుంచి ఆరు నాటిక బృందాల రాక -
ఆశ్రమ పాఠశాలలకు కోడిగుడ్డు కట్
సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెనూలో భాగంగా పోషకాహరం అందివ్వడానికి పెట్టే కోడిగుడ్లు నిలుపుదల చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఆదేశించారు. పక్క ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఎగ్స్ పెడుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిలిపివేయడం గమనార్హం. అలాగే మిడ్డేమీల్, అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్నప్పటికీ ఆశ్రమపాఠశాలలకు మాత్రమే నిలుపుదల చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మిగతా ఐటీడీఏలలో ఎక్కడా కోడిగుడ్లు నిలుపుదల చేయలేదని స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రమే ఆపివేశారని వాపోతున్నారు. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలకు కలిపి మొత్తం 3,70,000 కోడిగుడ్లు అవసరం. ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు (శనివారం మినహాయించి )ఇచ్చేవారు. చికెన్, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినవచ్చని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేస్తోంది. చికెన్ ఎలాగూ బర్డ్ఫ్లూ భయంతో నిలుపుదల చేశారు. కనీసం ఎగ్ కూడా పెట్టకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏమన్నారంటే..ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర వద్ద సాక్షి ప్రస్తావించగా తుని నుంచి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, బర్డ్ఫ్లూ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా కొద్ది రోజులు నిలిపివేయాలని అన్ని వసతిగృహాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అంతకు ముందు చికెన్ నిలిపివేత బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిర్ణయం -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టుబొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్హమోహన్రెడ్డి సుమారు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్టోటింగ్ జెట్టీకి పరిపాలన, ఆర్థిక అనుమతులపై కనీసం పట్టించుకోకపోవడంతో టెండర్ ప్రక్రియ జరగలేదు. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవన విధానం మెరుగుపడేది. జెట్టీలేక పోవడంతో వేట సాగక తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం మత్స్యకారులు వలస పోయారు. జెట్టీ నిర్మాణం పూర్తయితే సుమారు 885 బోట్లకు వరకు జెట్టీలో నిలుపుకునే అవకాశం ఉంది. జెట్టీలేక పోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బోట్లు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో లక్షలాది రుపాయల విలువైన బోట్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 27 కిలోమీటర్ల తీరప్రాంతంలో పూసపాటిరేగ, భోగాపురం మండలాలను కలుపుతూ 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి సర్కారు మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించి ఎంతో కాలంగా మత్స్యకారులు కళగా ఉన్న ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తిచేసే విధంగా అడుగులు మందుకు పడాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలిఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. టెండర్ దశలో ఉన్న ఫ్లోటింగ్ జెట్టీకి అనుమతులు మంజూరు చేసి మత్స్యకారుల సంక్షేమంపై దృషి సారించాలి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లామత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు విజయనగరం మత్స్యకారుల చిరకాల వాంఛ ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం మత్స్యకారుల చిరకాల వాంఛ. జెట్టీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మాణంపై దృష్టిసారించాలి. బొ.కొర్లయ్య, చింతపల్లి ఆరునెలలుగా ముందుకు సాగని పనులు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం వేటసాగక ఇబ్బందులు పడుతున్న గంగపుత్రులు -
వై.ఎస్.జగన్తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యా రు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్ను మర్యాదపూర్వకంగా కలిశా రు. తాడేపల్లిలోని వై.ఎస్.జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబా బుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొ ంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వై.ఎస్.జగన్ ఆదేశించారు. డీవీఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు పార్వతీపురంటౌన్: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డి.మంజులవీణకు ఆచార్య దేవోభవ అవార్డు వరించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలిగా, ఉమ్మడి జిల్లాల ఆర్ఐఓగా అందించిన ఉత్తమ సేవలకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 2025 సంవత్సరానికి అవార్డును ప్రదానం చేసింది. ఆమెను కలె క్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అభినందించారు. మరిన్ని ఉత్తమ సేవలందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు పార్వతీపురం రూరల్: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపినాథ్ జట్టి ఎస్పీలను ఆదేశించారు. విశాఖపట్టణం రేంజ్ కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. నేరాలపై సమీక్షించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, పొక్సో కేసులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయదారులపై ప్రత్యేక షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. గంజాయి వ్యాపారుల ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధి తులకు పరిహారం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ మాధవ్రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలిసాలూరు: ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో వైద్యారోగ్యశాఖ నియమ నిబంధనలు తప్పక పాటించాలని డీఎంహెచ్ఓ డా.భాస్కరరావు స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ పత్రాలను పరిశీలించారు. ఆస్పత్రులకు వస్తున్న రోగుల వివరాల నమోదు, వారికి అందిస్తున్న చికిత్స, వసూలు చేస్తున్న ఫీజు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు సన్యాసిరావు, యోగీశ్వరరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్ను ఆశ్రయించారు. ఉభయులూ కలిపి పెద్దల సమక్షంలో సీతానగరం పోలీస్టేషన్కు చేరుకున్నారు. గ్రామ పెద్దలతో పోలీస్టేషన్కు వచ్చిన ఉభయ వర్గాల వారుల స్టేషన్ ఆవరణలో పంచాయితీ నిర్వహించారు. మెడికల్షాపు నిర్వాహకుడు ఉభయుల శ్రేయస్సు దృష్ట్యా తనకున్న స్థిరాస్థులు విక్రయించి బాధితులకు రుణాన్ని తనకున్నంత మేరకు తీర్చుకుంటానని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు. దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌరహక్కుల రక్షణ చట్టం, అత్యాచార నిరోధకర చట్టం జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలో గౌరవ సభ్యులుగా నియమాకం చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎండి.గయాజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అధికార సభ్యులు ముగ్గురు, అనధికార సభ్యులు ఐదుగురు, స్వచ్ఛంద సేవా సభ్యులు ముగ్గురిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార సభ్యులు గ్రూపు ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్స్, అనధికార సభ్యులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు, స్వచ్ఛంద సభ్యులు ఇతర కేటగిరిలకు చెందినవారు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తుతో ఎస్సీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9492535085 నంబర్ను సంప్రదించాలని కోరారు. వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు● 10 కేసుల నమోదు విజయనగరం: విజయనగరం పట్టణంలో, బొండపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎం.దామోదర నాయుడు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడం గుర్తించి 3 కేసులు, తూనిక యంత్రాలలో లొసుగులు వినియోగించి తూకంలో మోసం చేసిన వారిపై 4 కేసులు, అదేవిధంగా ప్యాకేజీలపై ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించిన వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తూకంలో గానీ కొలతలో గానీ తేడా లేకుండా విక్రయించాలని, ముద్రించిన ధరకే ప్యాకేజీలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిభామిని: మండలంలోని లివిరికి చెందిన బౌరి రాజేంద్ర(32) బుధవారం ఉదయం మరణించాడు. మంగళవారం రాత్రి లివిరి–భామిని మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న బౌరి రాజేంద్ర(32), మరో యువకుడు బౌరి తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్థానికుల సహకారంతో బాధితులను భామిని పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం లివిరి స్వగ్రామానికి తీసుకువెళ్లి ఇద్దరు బాదితులకు ప్రైవేట్ వైద్యం అందించినప్పటికీ గాయపడిన బాధితుడు బౌరి రాజేంద్ర(32) మృత్యువాత పడి ఉండడాన్ని భార్య ఉషారాణి బుధవారం ఉదయం గుర్తించి భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించగా లివిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు ● భారీగా పోలీసుల మోహరింపుబొబ్బిలి: పట్టణంలోని 29వ వార్డు పాకివీధి సమీపంలో 1.40ఎకరాల స్థలాన్ని పారిశుధ్య కార్మికులకు కేటాయించాలని గత పాలకులు ఇచ్చిన హామీ మేరకు అందులో తాత్కాలికంగా వారు వేసుకున్న పాకలను మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు పొక్లెయిన్లతో తొలగించారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం పారిశుధ్య కార్మికులు ఇళ్ల వద్ద లేని సమయంలో పాకలు తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులను మహిళలు అడ్డుకున్నా వెరవకుండా తొలగించారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కార్మికులు, సంఘం నాయకులు అంతా ఒక చోట చేరి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఆక్రమించి మోహరించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన స్థలం కోసం 1991లోనే మున్సిపల్ కార్యాలయానికి రుసుము చెల్లించామని ఆ రశీదులు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, సీఐలు కె. సతీష్ కుమార్, నారాయణరావు, ఎస్సై ఆర్.రమేష్ల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మీకు స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఆ పార్టీలోనే ఉండబోనని టీడీపీ నాయకుడు కాకల వెంకటరావు కార్మికులకు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కార్మికులు మెమొరాండం సమర్పించగా మున్సిపల్ ఉన్నతాధికారుల లేఖను కార్మికులకు వారు అప్పగించారు. అక్కడ నిర్మించిన పాకలను వెంటనే తొలగించాలని పోలీసులు, అధికారులు కోరారు. పాకలను తొలగించే వరకూ సరేనని, కానీ అక్కడున్న కర్రలను తొలగించేది లేదని చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ స్థలంలో కర్రలను తొలగించకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులుంటాయని హెచ్చరించడంతో కాసేపు తోపులాట జరిగింది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి. ఆరుగురి అరెస్ట్ కేసుల నమోదుఆ సమయంలో కోపోద్రిక్తులైన పోలీసులు ఆరుగురు కార్మిక సంఘం నాయకులు పొట్నూరు శంకరరావు, బంగారి యుగంధర్, ఏడుకొండలు, వడ్డాది శంకర రావు, జి.గౌరీశు, బంగారి వెంకట రమణలను పోలీసు వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్కు తీసుకువెళ్లిపోయారు. అక్కడ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్కడి నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ వారిపై బైండోవర్ చేశారు. ఇండ్ల స్థలాలను అడిగితే ఇలా అరెస్టులు, కేసులు ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. చర్చల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శ శరత్, కాకల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం పాతరేగకు గూడాపు సింహాచలం, గాయాల పాలైన పైడిపునాయుడుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గ్రామ శివారుకు స్కూటీపై సింహాచలం వచ్చి పైడిపునాయుడిపై కత్తితో దాడిచేయగా గాయాలపాలవడంతో ముందుగా బాడంగి ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతున్నాడు. దాడిచేసిన సింహాచలాన్ని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వృత్తి పరమైన నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్ధులు ఆదిశగా కళాశాల స్థాయి నుంచి తయారు కావాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్ రిటైర్డ్ సైంటిస్టు బీవీఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్స్పై నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు అధికమన్నారు. భవిష్యత్లో అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సావనీర్ను ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీఎస్ఎన్మూర్తి, ప్రొఫెసర్ కె.బాబులు, కేసీబీరావు, డాక్టర్ గురునాథం, డాక్టర్ నీలిమ, డాక్టర్ బి.హేమ, డాక్టర్ జి.అప్పలనాయుడు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి హాజరైన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
23న ఉత్తరాంధ్ర స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకా రులతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం–మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఓపెన్ విభాగంతో పాటు అండర్–7,9,11,13,15 వయస్సుల విభాగాల్లోని బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఓపెన్ విభాగంలో విజేతకు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనుండగా..చిన్నారుల విభాగంలో విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఫోన్ 9703344488 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l Isîæ-yîlH M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ yîlH& gôæiĶæÊH M>Æý‡Å-{MýSÐ]l$… {ç³VýS-†Oò³ ÑÑ«§ýl Ô>QÌS A«¨M>Æý‡$-ÌS-™ø çÜÒ$„ìS…^éÆý‡$. ˘ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరతి ఆబా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) కార్యక్రమం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించిందన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో ఆన్లైన్ సబ్కలెక్టర్ యశ్వంత్ కుమార్ పాల్గొనగా, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ బి.చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ దుర్గా చక్రవర్తి, ఎస్ఎస్ఏ పీఓ ఆర్.తేజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోమన్రావు, టీడబ్ల్యూ ఈఈ మణిరాజు, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ కంచిబాబు, జీసీసీ డీఎం మహేంద్రకుమార్, డీఎఫ్ఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు
చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. -
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దార్ విజయభాస్కర్ సిబ్బంది బుధవారం చెరువు దగ్గరకు చేరుకుని చుట్టూ వేసిన ఇనుప కంచెను, చెరువు గట్టుపై వేసిన కంచెను తొలగించాలని ఆక్రమించిన ఎన్ఆర్ఐ బంధువులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వ భూమిలో వేసిన కంచెను తీస్తామని రైతులు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కోరడంతో..రెండు రోజుల్లో తొలగించని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు. 200 ఎకరాలకు వెళ్లే దారిని మూసి వేయడంతో రైతులు ఆందోళన చెంది సర్పంచ్ గర్భాపు విజయలక్షి, భర్త శ్రీనివాసరావు ద్వారా పత్రికలో కథనం రావడంతో పొలాలకు వెళ్లే మోక్షం కలింగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కంచె తొలగించాలని ఆదేశాలు -
పీహెచ్సీల్లో ప్రసవసేవలు అందించాలి
● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) ప్రసవ సేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ జీవనరాణి హెచ్చ రించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 10 పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణుల నమోదు, నెలనెలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా జరపాలన్నారు. మాతాశిశు మరణా లను నివారించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారిక మందులు అందజేయాలన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీ సర్వే వేగవంతం చేయాలి
సీతంపేట: భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి వీఆర్వోలను ఆదేశించారు. ఐటీడీఏలోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో వీఆర్వోలు, వీఏఏలతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వేలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గృహనిర్మాణాలకు సంబంధించిన ల్యాండ్ పొజిషన్ సిర్టిఫికెట్లను వెంటనే మంజూరుచేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేలా లబ్ధిదారులను చైతన్యవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ గీతాంజిలి, మండల వ్యవసాయాధికారి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. కుంకి ఏనుగుల నివాస స్థలం పరిశీలనసీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడానికి తీసుకురానున్న కుంకి ఏనుగుల నివాసానికి అసరమైన స్థల ఏర్పాట్లను రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట కొండ ప్రాంతంలో కుంకి ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన స్థావరాలను ఆమె తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడు ఏనుగుల గుంపు, పాలకొండ నియోజకవర్గంలో నాలుగు ఏనుగుల గుంపు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా కుంకి ఏనుగులను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కొంతమంది అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామ న్నారు. కార్యక్రమంలో సీఎఫ్ఓ మైడి దివాన్, జిల్లా అటవీశాఖఅధికారి ప్రసూన, ఎఫ్ఆర్ఓ రామం నరేష్, ఎస్ఎఫ్ఓ మనోజ్కుమార్, బీట్ ఆఫీసర్ రిషి పాల్గొన్నారు. మార్చి 8న జాతీయ లోక్అదాలత్ ● వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం లీగల్: వచ్చేనెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని న్యాయమూర్తులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రాంసిరీ నోట్, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్, భూములు, కుటుంబ తగాదాలు, వాటర్, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిస్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, టీవీ రాజేష్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవీ రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రికి BÈtïÜ {ç³™ólÅMýS ºçÜ$ÞË$ ˘ విజయనగరం గంటస్తంభం: మహాశివరాత్రి పర్వదినాన వివిధ ఆలయాలు సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థానికి 45 బస్సులు నడుపుతామన్నారు. శ్రీకాకుళం–2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ, చీపురుపల్లి, గరివిడి మీదుగా పాలకొండ డిపో నుంచి 20 బస్సులు వేశామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు వేసినట్టు పేర్కొన్నారు. -
పట్టునిలుపుకున్న వైఎస్సార్సీపీ
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ పట్టు నిలుపుకుంది. నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి నాయకుల ఎత్తులను చిత్తుచేస్తూ తమ బలం నిరూపించుకుంది. కౌన్సిలర్లంతా ఏకతాటిపై నిలబడి కూటమినాయకుల ప్రలోభాలను తిప్పికొట్టారు. చైర్మన్ పదవిని తమ పార్టీ వారికి కట్టబెట్టేందుకు గత 15 రోజులుగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పలుమార్లు పాలకొండలో మకాం వేసినా ఫలితం లేకపోయింది. నిలిచిన ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు కోరం లేక నగరపంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం మరో మారు ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొంత మంది కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ నుంచి తమవైపు తిప్పుకుని చైర్మన్ పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నాలు చేశారు. వీటిని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లందరూ ఐక్యతగా తిప్పికొట్టారు. న్యాయబద్ధంగా తమ పార్టీ కౌన్సిలర్కే చైర్మన్ పదవి దక్కాలని స్పష్టం చేశారు. పార్టీని వీడి టీడీపీలోచేరి.. స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ బరిలో దిగిన ఆకుల మల్లేశ్వరికి మద్దతిచ్చేది లేదన్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల అఽధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి, జేసీ శోభికలు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరుకాలేదు. కేవలం కూటమికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నుంచి కూటమిలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచిచూసి కోరం లేకపోవడంతో ఎన్నికను రద్దుచేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. కోరంలేక నిలిచిన చైర్మన్ ఎన్నిక ఎన్నికల కమిషన్కు నివేదిస్తాం: ఎన్నికల అధికారి మంత్రి మకాం వేసినా ఫలితం శూన్యం -
20
–8లోనప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు పెట్రోల్ బంకులో చిరిగిన పది రూపాయల నోటు గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదికొచ్చింది. వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు దివ్యాంగులకు రైల్వే పాస్లను ఆన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ను ప్రారంభించింది.వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలకొండకు రాక సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు రానున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పాలకొండకు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మంగళవారం వెల్లడించారు. 20వ తేదీన జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ 1.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి 2.15 గంటలకు పాలకొండలోని పాలవలస రాజశేఖరం తనయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఉండనున్నారు. తదుపరి సాయంత్రం 3.30 గంటలకు పాలకొండ నుంచి తిరిగి బయలుదేరుతారు. 4.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.వ్యక్తి అరెస్ట్గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. -
దాహం కేకలు
గిరిశిఖర గ్రామాల్లో సీతంపేట: ఏజెన్సీలో తాగునీటి కష్టాలు ఆరంభమయ్యాయి. కొండ శిఖర గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటికోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎదుర్కొవాల్సిన నీటి ఎద్దడి ఇప్పటి నుంచే ఆరంభం కావడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నీటిసేక రణలో నిమగ్నమవుతున్నారు. జేజేఎం పనులు జరిగేదెప్పుడు... జల్జీవన్ మిషన్ పనులు ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రూ.10.77 కోట్ల తో 505 పనులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఇవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. దీంతో ఇంటింటికీ కుళాయి నీరు ఈ వేసవిలో కూడా సరఫరా అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఏజెన్సీలో 556 గ్రామా లున్నాయి. సుమారు 700లకు పైగా బోర్లు, 400 వరకు బావులు, మరో 150 సోలార్ రక్షిత పథకాలున్నాయి. వీటిలో సుమారు వందకుపైగా గ్రామా లు ఏటా తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. దోనుబాయి, దారపాడు, పూతికవలస, కడగండి, మండ, నాయుడుగూడ, పెదరామ, దోనుబాయి, కిల్లాడ, పొల్ల, శంభాం, కుశిమి పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువగా నీటి ఎద్దడి ఉంది. వీటికి శాశ్వత పరిష్కారం లభించని పరిస్థితి. నీటికోసం గెడ్డలపై ఆధారపడుతున్నారు. జీవగెడ్డలు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే అడుగంటి పోతున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో గిరిజనులు ఉన్నారు. కొండశిఖర గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నావారికి అరకొర మంచినీరు లభిస్తోందని గిరిజనులు తెలిపారు. శాశ్వత పరిష్కారం ఎండమావిగా మారిందంటూ వాపోతున్నారు. అడుగంటుతున్న జీవగెడ్డలు గిరిజనానికి తప్పని అవస్థలు సుదూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్న గిరిజనులు వందకు పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం నిల్ చిత్రంలో బావి నుంచి నీరు సేకరిస్తున్నది సీతంపేట మండలం రంగంవలస వాసులు. గ్రామానికి 800 మీటర్ల దూరంలో తాగునీటి బావి ఉంది. గతంలో గిరిజనులు సొంత ఖర్చులతో పైప్లైన్ వేసి మోటారు ఆధారంగా తాగునీరు సరఫరా చేసుకునేవారు. ఇప్పుడు మోటారు పనిచేయకపోవడంతో బావి వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. రోజులో సగం సమయం నీటిని తెచ్చుకునేందుకే సరిపోతుందని మహిళలు వాపోతున్నారు. బావి నీరు అడుగంటడంతో ఆందోళన చెందుతున్నారు.చిత్రంలో కనిపిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలది సీతంపేట మండలంలోని ఎగువదరబ గ్రామం. స్థానికంగా తాగునీటి సదుపాయం లేదు. గతంలో రసూల్పేట నుంచి మోటార్ పెట్టి పైపుల సాయంతో నీరు గ్రామానికి సరఫరా చేసేవారు. ఆ సదుపాయం ఇప్పుడు నిలిచిపోయింది. గ్రామంలో నివసిస్తున్న 37 కుటుంబాల వారు సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గొయిది గెడ్డ నుంచి ప్రతిరోజు తాగునీరు తెచ్చుకుంటున్నారు. గెడ్డనీరు తాగుతుండడంతో జ్వరాల బారిన పడుతున్నామని వాపోయారు. -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
ఎన్నికల విధుల్లో తప్పిదాలకు తావివ్వొద్దు
పార్వతీపురం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో సమర్ధవంతంగా నిర్వహించాలని, తప్పిదాలకు తావివ్వొద్దని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పీఓలు, ఏపీఓలకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్వో, డుమా పీడీలతో కలిసి ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలకు మంగళవారం తొలివిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై పీఓలు, ఏపీఓలకు పూర్తి అవగాహన అవసరమన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పక పాటించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూలో ఉన్నవారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి ఓటు హక్కును కల్పించాలన్నారు. పోలింగ్ ముందు రోజున ఉదయం 7 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు పీఓలు తమ బృందంతో చేరుకోవాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద సరఫరా చేసే సామగ్రిని పరిశీలించి తీసుకోవాలన్నారు. తరువాత తమ బృందంతో కలిసి యంత్రాంగం సమకూర్చిన వాహనంతో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. చిన్నపాటి తప్పిదాలకు కూడా తావులేకుండా పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను నిర్దేశించిన రిసెప్షన్ సెంటర్లో అప్పగించాల్సిన బాధ్యత పీఓలదేనన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, డుమా పీడీ కె.రామచంద్రరావు, పీఓలు, ఏపీఓలు, ఎన్నికల సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.వ్యక్తి అరెస్ట్గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. -
సంతృప్తి చెందేలా వినతులకు పరిష్కారం
విజయనగరం అర్బన్: ఆర్థిక పరమైన అంశాలు, కోర్టుల నుంచి నిలిపివేయమని ఆదేశాలు వచ్చిన అంశాలు తప్ప మిగిలిన అన్ని రకాల వినతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతులకు పూర్తిస్థాయిలో కూలంకుషంగా చదివి, పిటిషనర్లతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్జీదారుల సంతృప్తే ముఖ్యమని భావించి సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, సీఎంఓ, వీఐపీ గ్రీవెన్స్సెల్లో నాలుగు రకాల వినతులు అందుతున్నాయని చెప్పారు. వాటిపై నిర్వహించిన విశ్లేషణలో సరాసరిగా ఒక్కో కుటుంబం నుంచి రెండు వినతులు వస్తున్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఏ ఒక్క వినతైనా గడువు దాటితే సంబంధిత అధికారికి చార్జ్ మోమో జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. నియోజకవర్గం వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, బుధవారం లోగా నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియపై ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, వచ్చిన వినతులకు సరైన పరిష్కారం చూపిస్తే, రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 శాతం సమస్యల పరిష్కారం జరుగుతోందని, ప్రతిరోజూ సమీక్షించడం వల్ల పెండింగ్ తగ్గిందన్నారు. రీఓపెన్ కేసులపై మండలాల వారీగా సమీక్షించి, కారణాలను తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, డిప్యుటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
రామభద్రపురం: పాస్ తీసుకోవడానికి దివ్యాంగులు పడే కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. దివ్యాంగులు ఇక నుంచి రైల్వే పాస్లను నేరుగా స్టేషన్కు వచ్చే తీసుకునే పనిలేకుండా అన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ ప్రారంభించింది.అందులోనే ఈ–టికెట్ బుక్ చేసుకునే కొత్త విధానాన్ని ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఆర్థోపెడిక్, అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగత్వం తదితర అంగవైకల్యం కలిగిన అన్ని వయసుల వారు కలిపి మొత్తం 73 వేల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వారిలో దాదాపు 45 వేల మంది రైల్వేపాస్లు పొందేందుకు అర్హులున్నట్లు అధికార సమాచారం. రైల్వే పాస్ల కోసం దివ్యాంగులు నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అన్లైన్ విధానంతో ఆ కష్టాలు తప్పనున్నాయి. ఆన్లైన్లో పాస్ జారీ ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోనే కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో జ్ట్టి ఞ://ఛీజీఠి డ్చ ుఽజ్జ్చ ుఽజీఛీ.జీ ుఽఛీజ్చీ ుఽట్చజీ .జౌఠి.జీ ుఽ వెబ్సైట్లోకి వెళ్లి పాస్కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు(యూడీ ఐడీ)మంజూరు చేస్తారు. నూతన పాస్ కావాల్సిన వారు, పాత పాస్ రెన్యువల్కు కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్సైట్ అమల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి దరఖాస్తును పరిశీలించుకోవచ్చు. ఇకపై ఆన్లైన్లో రైల్వేపాస్ జిల్లాలో 45 వేల మంది అర్హులు ఇకపై ఆన్లైన్లో పాస్ తీసుకోవడానికి రైల్వేశాఖ చర్యలు ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు -
కోట్లాది రూపాయలతో వ్యక్తి పరారీ
సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై ర్యాలీ
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విజయనగరం గంటస్తంభం: ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేస్తూ క్యాబినెట్ చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అయితే మొత్తం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అంతేగానీ మళ్లీ థర్డ్ పార్టీ విధానంలో కార్మికుల్ని బందీలను చేసి వారి శ్రమను కొల్లగొట్టాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోందని, రిటైర్ అయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. చివరికి వాటర్ సప్లై, నైట్ శానిటేషన్, స్ట్రీట్లైట్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా, నచ్చినట్లు విధుల నుంచి తొలగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అతి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కుదింపు, పోలవరం అమరావతి సహా రైల్వే జోన్ తదితర ప్రాధాన్యతా అంశాలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ కూటమి పెద్దలు మౌనంగా ఉండడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, నాయకులు పాపారావు, భాస్కరరావు, గురుమూర్తి, రాఘవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
సారాతో నలుగురి అరెస్టు
మెంటాడ: సారా తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సారా బాటిల్స్ మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర రిజార్వాయర్ వెనుక గల లోతుగెడ్డ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 20 బ్యాటిల్స్లో 40 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకుని వారిని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయండి● ట్రాన్స్కో ఎస్ఈ చలపతిరావు ● సాక్షి కథనానికి స్పందన వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను మోసగిస్తోందని మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఉచిత విద్యుత్ పధకానికి మంగళం’ అనే కధనంపై జిల్లా ట్రాన్స్కో ఈఓ చలపతిరావు స్పందించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే మండలాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈలను ఆదేశించారు. గూడ్స్ సైడింగ్ ప్రారంభందత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గందర గోళం మధ్య గూడ్స్సైడింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైల్వే మూడో లైన్ పనులతో పాటు గూడ్స్ సైడింగ్ పనులు అప్పట్లో ప్రారంభమై పూర్తి కావడంతో బొబ్బిలి గూడ్స్షెడ్ స్థానంలో కోమటిపల్లి పల్లి వద్ద మంగళవారం ప్రారంభం కావడంతో ఇంతవరకు బొబ్బిలిలో పని చేసిన కార్మికులతో పాటు వి,కృష్ణాపురం, వింధ్యవాసి, వంగర, పెదమానాపురం, పాచలవలస మరడాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్మికులు రావడంతో మధ్యాహ్నం వరకు పనులు ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ నుంచి కోమటిపల్లి ఆటోస్టాండ్ వరకు బియ్యం లారీలు ఉండడం గమనించిన పెదమానాపురం ఎస్సై కాంట్రాక్టర్తో మాట్లాడగా ఆయన కార్మికులతో తొలి రోజు 50 లారీలలో వచ్చిన బియ్యాన్ని రైలులో వేయించారు. చెరకు లారీ బోల్తారాజాం సిటీ: మండల పరిధి రాజయ్యపేట జంక్షన్ వద్ద మంగళవారం చెరుకు లారీ బోల్తా పడింది. పరిమితికి మించి లోడుతో తెర్లాం నుంచి రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద లారీ బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. -
ఆ ముగ్గురి మధ్యే పోటీ!
–8లోబుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పాకలపాటి రఘువర్మ● కీలక దశకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ● ఈనెల 25 సాయంత్రం 4 గంటలతో ముగియనున్న ప్రచారం ● ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ● మొత్తం ఓటర్లు: 22,493 మంది ● పోలింగ్ కేంద్రాలు: 123 డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు అన్ని ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే ఈసారి ఓటర్లు పెరిగారు. పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లు రావాలి. లేకుంటే 2వ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ● పోటీ వారిమధ్యనే.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. విజయగౌరికి ఉత్తరాంధ్రాలో బలమైన యూటీఎఫ్ సంఘాలు మద్దతు ఇస్తుండగా, రఘువర్మకు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు బీజేపీ నాయకులు, మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీ మాధవ్ మద్దతు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వీరి ముగ్గురి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ● ప్రచారానికి కొద్దిరోజులే సమయం.. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభ్యర్థులు జోరుగా చేపడుతున్నారు. ఈ ప్రచారం ఈ నెల 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రచారంలో స్పీడు పెంచాయి. పాఠశాలల్లో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ● 123 కేంద్రాల్లో పోలింగ్.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్వతీపురం మన్యం, విజయగనరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఉన్న 22,493 మంది ఓటర్ల కోసం 123 పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. ఈ కేంద్రాల్లో 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 8,985 మంది, పురుషులు 13,508 మంది ఉన్నారు. శ్రీకాకుళం–5,035 మంది, విజయనగరం–5,223, పార్వతీపురం మన్యం–2,333, అల్లూరి సీతారామరాజు–1,488, విశాఖపట్నం–5,529, అనకాపల్లి జిల్లాలో 2,885 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. న్యూస్రీల్ఆ ఇద్దరు కూడా... ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగుతుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతుండంగా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బహుజన సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థి పోతల దుర్గారావు కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీ చేస్తున్న సుంకర శ్రీనివాసరావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుండడంతో మొదట ప్రాధాన్యత ఓటు శాతం ప్రధాన అభ్యర్థులకు తగ్గే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నారు. పోటీ అభ్యర్థులకు మద్దతు ఇలా... గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి పీఆర్టీయూ తరఫున బరిలో దిగిన డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడుకు ఏపీటీఎఫ్ (1938), ఆంధ్రపదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘం (ఆప్టా), బహుజన ఉపాధ్యాయ సంఘం, ఆర్యూపీపీ, ఆదివాసీ ఉపాధ్యాయ, ఎస్టీయూ సంఘాల (ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు) మద్దతు ఉంది. తొలిసారిగా బరిలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థిని కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్, ఏపీ మోడల్ స్కూల్ పీఎస్, కేజీబీవీ టీచర్లు, తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. రెండో సారి పోటీలో ఉన్న పాకలపాటి రఘువర్మకు ఏపీటీఎఫ్ (257), ఎస్ఎల్టీఏ, ప్రధానోపాధ్యాయుల సంఘం, పీఆర్టీయూడీ, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు అండగా ఉన్నాయి. -
నూతన విధానంతో సులభతరం..
దివ్యాంగులు పాస్లు పొందేందుకు రైల్వేశాఖ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో జిల్లా వాసులు సంబంధిత రైల్వేస్టేషన్కు ఇతరుల సాయంతో వెళ్లి అక్కడ దరఖాస్తు అందజేసేవారు. రైల్వే అధికారులు జిల్లా నుంచి వచ్చిన మొత్తాన్ని సేకరించి సంబంధిత రైల్వే సబ్డివిజన్కు పంపేవారు. అక్కడ అధికారుల ఆమోద ముద్ర పడిన తరువాత తిరిగి జిల్లాకు వచ్చేది. ఇదంతా జరగడానికి దాదాపు మూడు నెలల వరకు సమయం పట్టేది. ఈ లోగా పాస్ల కోసం దివ్యాంగులు నాలుగుసార్లు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ఇబ్బందులను గుర్తించి నూతన విధానానికి రైల్వే శాఖ నాంది పలికింది. దివ్యాంగులు తాము ఉండే ప్రాంతం నుంచే నెట్ సెంటర్, ఈ–సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ తరువాత 20 రోజుల్లోపు వారు ఆన్లైన్లో పాస్ కూడా తీసుకోవచ్చు. సమయంతో పాటు శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కె.కుమార స్వామి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎ.డి, విజయనగరం -
బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మహారాణి పేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రూమ్లను పరిశీలించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్, కూర్మానంద రావు, తహసీల్దార్ పి.సత్యవతి ఎంఈఓ, జిల్లా బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు, టూ టౌన్ ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
అపరాలకు దక్కని మద్దతు..!
● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం ● ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● తుఫాన్ల కారణంగా వేల హెక్టార్లలో పంటకు నష్టం విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్లో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల వరి పంటతో పాటు అపరాల (పెసర, మినుము) పంటలు కూడా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉన్న పంటకు కూడా ప్రస్తుతం మద్దతు ధర రాని పరిస్థితి. మార్కెట్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర రానప్పడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేయాలి. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి సర్కార్ చెప్పింది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాసాన పోలేదు. తాజాగా అపరాలు సాగు చేసిన రైతులు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము పండించిన పెసర, మినుము చాలా వరకు పంట తీసి నూర్పులు చేసి పంట వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో పంటను తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21,931 హెక్టార్లలో అపరాలు సాగు జిల్లాలో అపరాలు 21 931 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పెసర పంట 5,909 హెక్టార్లలోను, మినుము పంట 16,011 హెక్టార్లలో సాగైంది. వీటి ద్వారా పెసర పంట 3,520 మెట్రిక్ టన్నులు, మినుము పంట 10,081 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పెసర ఎంఎస్పీ రూ.8682 పెసర పంట ఎంఎస్పీ క్వింటారూ. 8682, మినుములు ఎంఎస్పీ క్వింటాకు రూ.7400 అయితే ప్రభుత్వం అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అపరాలు విక్రయించాల్సిన పరిస్థితి. పెసలు క్వింటాకు రూ.7 వేలు, మినుములు క్వింటాకు రూ.6500 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జిల్లాలో సాగైన అపరాల్లో తుఫాన్ వల్ల చాలా వరకు పంట దెబ్బతింది. ఎకరాకి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకి క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితి. ఉన్న పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా వరకు రైతులు పంట తీసేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏకారణం చేతనో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాలి అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెఫెడ్ డీఎంకు లెటర్ రాశాం. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.డి.కి ప్రతిపాదనలు పంపిస్తాంజిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాసిన లెటర్ అందింది. జేసీ ద్వారా మార్కెఫెడ్ ఎం.డి.కి అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎన్.వెంకటేశ్వరావు, మార్కెఫెడ్ , జిల్లా మేనేజర్ -
●మాకు తెలియకుండానే ఉద్యోగుల తొలగింపు
ఉపాధిహామీలో క్షేత్రస్థాయి అధికారులను తీర్మానం లేకుండా తొలగిస్తున్నారు.. మా మండలంలో ఉపాధిహామీ క్షేత్రసహాయకులను ఏడుగురిని కూటమి ప్రభుత్వం తొలగించింది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయడం లేదు. సర్పంచ్ల హక్కులు కాలరాస్తున్నారు. అభివృద్ధి పనులకు సర్పంచ్ల మాటలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంచాయతీల హక్కులను కాలరాస్తున్నారు. పంచాయతీల ప్రథమ పౌరులుగా మా బాధ్యతలను మాకు అప్పగించాలి. అందుకే పంచాయతీల ప్రెసిడెంట్లంతా ఈ రోజు కలెక్టర్ను కలవడానికి వచ్చాం. – రమేష్, శిఖబడి సర్పంచ్, జియ్యమ్మవలస మండలం -
నిర్వాసితులకు రెట్టింపు పరిహారం
వేపాడ: పెందుర్తి– బౌడారా– 516బి రోడ్డు విస్తరణ లో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితుల కు రెట్టింపు పరిహారం అందజేస్తున్నట్టు ఆర్డీఓ దాట్ల కీర్తి తెలిపారు. తహసీల్దార్ రాములమ్మ నేతృత్వంలో బొద్దాం, పాటూరులో నిర్వాసితులతో సోమవా రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వాసితు ల జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహా రం అందజేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ భూములకు సెంటుకు రూ. 26,500, వ్యవసాయేత ర స్థలాలకు గజానికి రూ.6 వేలు చొప్పున పరిహా రం అందజేస్తామన్నారు. బొద్దాంలో 130, పాటూరులో 30 మంది నిర్వాసితులను గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్ సన్యాసినాయుడు, ఆర్ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ పెద్దలు కొట్యాడ రమణమూర్తి, ద్వారపూడి గంగునాయుడు పాల్గొన్నారు. -
ఎండన బడిన పిల్లలు
–8లోమంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025రథసప్తమి వెళ్లాక.. ఎండలు మండుతున్నాయి.. రెండు నిమిషాలు బయట ఉంటేనే.. నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్దవారే ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు.. విద్యార్థులు.. ఏకధాటిగా కూర్చొన్న చోట నిలువ నీడ లేక.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పందిర నీడన ఒకేచోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురుకావడం గమనార్హం. సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. రెండేళ్ల కిందట అది కూలిపోవడంతో దానిని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నాళ్లపాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద, పందిరిలో బోధించాల్సిన పరిస్థితి. ఎండలోనే మధ్యాహ్నభోజనాలు చేస్తున్నారు. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు ఊరి చివరన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటుచేసిన పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అసలే ఎండలు. ఆపై ఆరుబయట చదువులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షి, పార్వతీపురం మన్యం న్యూస్రీల్ -
కూటమి ఎత్తులు చిత్తు
పాలకొండ: పాలకొండ నగరపంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకుల ఎత్తులు చిత్తయ్యా యి. చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకోవాలన్న కూటమి ఎత్తుగడను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమ ష్టిగా తిప్పికొట్టారు. పార్టీ సిద్ధాంతాలే తమకు ప్రధానమని, ప్రలోబాలకు లొంగేదేలేదని తేల్చిచెప్పారు. ఫలితం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సోమవారం మూడోసారి నిర్వహించిన ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఉత్కంఠ నడుమ సాగిన ఎన్నిక.. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గరు సభ్యులు, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరు కాగా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో మద్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన ఎన్నిక ల అధికారి యశ్వంత్కుమార్రెడ్డి మంగళవారానికి చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బలం లేకున్నా... వాస్తవంగా పాలకొండ నగర పంచాయతీలో మొ త్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిల ర్లు ఉన్నారు. ఈ 17 మందిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగరీత్యా తన పదవికి రాజీనామా చేశారు. ఇద్దరు కౌన్సిలర్లు కూటమిలో చేరారు. అయినప్పటి కీ వైఎస్సార్సీపీ సభ్యుల బలం 14 ఉంది. వాస్తవంగా చైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకే దక్కాలి. అయితే, రిజర్వేషన్ ప్రకారం ఒక్కరే ఉండడం, ఆమెను టీడీపీ నేతలు పార్టీలో చేర్చుకోవడంతో సమస్య తలెత్తింది. చైర్మన్ ఎన్నిక జరగాలంటే కూటమికి మరో ఐదుగురు సభ్యులు కావాల్సి ఉంది. నిజాయితీగా తమ సంఖ్యాబలం బట్టి తమకే చైర్మన్ పదవి దక్కాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంద రూ ఒకే మాటపై ఉండడంతో టీడీపీ నేతల ఎత్తుగ డ పారడం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉదయం 9 గంటలకు పాలకొండ చేరుకుని కూటమి నాయకులతో మంతనా లు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిల సూచనల మేరకు కౌన్సిలర్లందరూ ఒకేమాటపై ఉండడం, శాసన మండలి విపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిశానిర్దేశంతో కౌన్సిలర్లు ముందుకు సాగడంతో కూటమి నాయకుల కుట్రలన్నీ చిత్తయ్యాయి. మోహరించిన పోలీస్ బలగాలు.. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపధ్యంలో పోలీస్ బలగాలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద మోహరించాయి. 144 సెక్షన్ విధించి డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సీఐ చంద్రమౌళి, నలుగురు ఎస్సైలు, ఇంటలిజెన్స్ అధికారులు, ప్రత్యేక బలగాలు, కానిస్టేబుల్స్తో పాటు సుమారు గా 100 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేశారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా ఒతిళ్ల్లకు లొంగని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు -
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురంటౌన్: పోలీస్ సిబ్బంది మెరుగైన సేవలందించేందుకు వీలుగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా సాయుధ పోలీసులకు 15 రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ తరగతులను పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్ సిబ్బందికి ఏటా మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్నెస్ను మెరుగుపరిచే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు జిల్లా పోలీస్ శాఖకు వెన్నెముఖగా నిలుస్తున్నారన్నారు. యోగా, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఆర్థిక స్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు, పలువురు ఏఆర్ఎస్ఐలు, ఏఆర్హెచ్సీలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు శంబర పోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర
మక్కువ: ఉత్తరాంధ్రు ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర మంగళవారం జరగనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం నిమిత్తం ఈవో వీవీ సూర్యనారాయణ, సీఐ రామకష్ణ, ఎస్సై వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పా ట్లు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు పులిహార, లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు చేపట్టా రు. నాలుగవ జాతరలో సుమారు 70 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. స్వచ్ఛసుందర పురంగా తీర్చిదిద్దుదాం పార్వతీపురం: అందుబాటులో ఉన్న వనరుల తో పార్వతీపురాన్ని స్వచ్ఛసుందర పురంగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నా రు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెత్తను సేకరించేందుకు మున్సిపాల్టీ, సచివాలయ సిబ్బందిని వినియోగించాలన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు మార్చి 1 నుంచి మాస్టర్ ట్రైనీలతో శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరులు, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డుమా పీడీ కె.రామచంద్రరావు, జట్టు ఆశ్రమం సభ్యులు వి.పద్మజ, డీఎల్డీఓ రమేష్రామన్, తదితరులు పాల్గొన్నారు. విలేకరిపై దాడి తగదు విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరిపై టీడీపీ నాయకుడి దాడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన లో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసి నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ ఇవ్వాలని, లేదంటే ప్రకటన ద్వారా ఖండించాలే తప్ప భౌతికదాడులు సరైన మార్గం కాదన్నా రు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని పేర్కొన్నారు. బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తా మని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరంగా–2025 పార్వతీపురం: అంతర్జాతీయ సహకార సంవత్సరంగా–2025ను ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తుందనే నినాదంతో సహకార సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయాలని, వాటికి గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాల విస్తరణ జరగాలన్నారు. మత్స్య, చేనేత, గొర్రెల పెంపకం సంఘాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ సహకార సంఘాలలో నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేశామన్నారు. జిల్లాలో బాగా పనిచేస్తున్న సహకార సంఘాలను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డి.ఎస్.దినేష్ కుమార్ రెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం డీసీసీబీల జనరల్ మేనేజర్లు కేవీవీఆర్ఎన్.సత్యనారాయణ, ఎస్వీఎస్ జగదీష్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్ఎన్బీ శ్రీధర్ రాజా, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి తూట్లు
సర్పంచ్ల హక్కులకు.. సాక్షి, పార్వతీపురం మన్యం: ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా.. వెండర్ విధానం ద్వారా పనులు చేయించడం సర్పంచ్ల హక్కులు కాలరాయడమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్లు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ను సోమ వారం కలిసి వినతిపత్రం అందజేశారు. వెండర్ విధానాకి విరుద్ధంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను జతపరిచారు. అంతకుముందు పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సర్పంచులతోపా టు మన్యం జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జోగారావు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఉపాధిహామీ పథకం–2005 చట్టానికి విరుద్ధంగా గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులకు తెలియకుండా.. వారి తీర్మానాలు లేకుండా వెండర్ విధానం ద్వారా కూటమి ప్రభు త్వం తమ అనుచరులకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సర్పంచుల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. చట్టానికి విరుద్ధంగా నేడు గ్రామాలలో పనులు చేపట్టడం సర్పంచులను తీవ్రంగా అవమాన పరచడమేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పార్టీ అధిష్టానం సూచన ల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు సారఽథ్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు సమక్షంలో చర్చించి, కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం అక్కడ నుంచి ప్రజాప్రతినిధులంతా కోర్టు తీర్పు కాపీలను జత చేసి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉపాధి హామీ పను లు చట్టానికి విరుద్ధంగా జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచుల హక్కులను కాదని వెండర్ విధానం ద్వారా పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సర్పంచుల హక్కులు, అధికారాలు కాపాడాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షు లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పల్లెల్లో కూటమి ప్రభుత్వ ప్రత్యేక చట్టం అమలు వెండర్ విధానంలో ఉపాధిహామీ పనులు సర్పంచ్ల తీర్మానానికి చెల్లు హైకోర్టు తీర్పు ఉన్నా బేఖాతరు ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు ఫిర్యాదు పవన్ కళ్యాణ్ స్పందించాలి... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్లకు తగిన ప్రాధాన్యమిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆచరణలో అది అమలు కావడం లేదు. ఆయన స్పందించాలి. సర్పంచ్ల ఆమోదం, తీర్మానం లేకుండా గ్రామంలో పనులు జరుగుతున్నాయి. ఎందుకూ పనికి రాని కూటమి కార్యకర్తలు సర్పంచ్ల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులపై హక్కులను మాకు కల్పించాలని కోరుతున్నాం. – జి.సతీష్, పుట్టూరు గ్రామ సర్పంచ్. సర్పంచ్ అంటే సుప్రీం అన్నారు.. సర్పంచ్ అంటే సుప్రీం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ ఆనాడు చెప్పారు.. నేడు అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది. కనీసం ఒక మనిషిగానూ మమ్మల్ని గౌరవించడం లేదు. మా హక్కులు మేం పొందలేకపోతున్నాం. మాకు సంబంధించిన పనులు సర్పంచ్లకు చెప్పే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు వినతిపత్రం ఇచ్చాం. – బంకురు రవికుమార్, పంచాయతీరాజ్విభాగం అధ్యక్షుడు, పార్వతీపురం నియోజకవర్గం మా హక్కులను కాలరాస్తున్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. 86 శాతం ఉన్న వైఎస్సార్సీపీ సర్పంచ్ల ను పక్కన పెట్టారు. నెత్తి మీద రూపాయి పెట్టినా పనికిరాని వారితో గ్రామాల్లో పనులు చేయించుకుంటున్నారు. ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలేవీ అమలు కావడం లేదు. మా హక్కులను కాలరాస్తున్నారు. – కురిటి మోహనరావు, సర్పంచ్, పి.చాకరాపల్లి, బలిజిపేట మండలం -
ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
● ఒక్క ఉచిత విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం ● ఉచిత విద్యుత్కు తూట్లు పొడుస్తున్న కూటమి ఏడు నెలలవుతోంది ఏడు నెలల క్రితం వీరఘట్టం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉచిత విద్యుత్ మీటరు కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారని లైన్మెన్ను అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – లెంక జగదీశ్వరరావు, రైతు, నడుకూరు గ్రామం, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లావీరఘట్టం: ● పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రామకృష్ణ అనే రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. ఇంతవరకు ఆయన దరఖాస్తును పరిశీలించిన దాఖలాలు లేవు. ● అలాగే వీరఘట్టం గ్రామానికి చెందిన మంచుపల్లి గోపాలం అనే మరో రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం తన దరఖాస్తును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రైతుకు కూడా ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇలా వీరఘట్టం మండలంలో 15 మంది రైతులు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, మరో 30 మంది వీరఘట్టం ట్రాన్స్కో కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేశారు. ఇలా వీరఘట్టం మండలంలో ఇంతవరకు 45 మంది వరకు రైతులు ఉచిత విద్యుత్ వ్యవసాయ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ● ఉచిత విద్యుత్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం దశల వారీగా మంగళం పాడుతోంది. రైతులకు ఆపన్న హస్తంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.అందుకోసం పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏకంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరునే ప్రభుత్వం నిలిపి వేసింది. గతేడాది 2024 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఒక్కటి కూడా కూడా మంజూరు చేయలేదు. ఆగస్టు నెలాఖరు వరకు మంజూరు చేసిన కనెక్షన్లు కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమోదించిన వాటికే కనెక్షన్లు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు. రాష్ట్రంలో 1.50 లక్షల దరఖాస్తుల పెండింగ్.. పార్వతీపురం జిల్లాలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటీకీ వాటికి ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఇప్పటికీ 2,500లకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.వాటిని పరిష్కరించి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. కనీసం ఆ దరఖాస్తులను ఇంతవరకు పరిశీలించకపోవడం కానీ, స్క్రూట్నీ చేయకపోవడం కానీ ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 2,500మందికి పైగా రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అందనీయకుండా తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రాధాన్యతా క్రమంలో మంజూరు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గతేడాది ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేశా. మిగిలిన దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ కావాల్సిన వారు 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది పరిశీలించి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. – ఎస్.చలపతిరావు, ట్రాన్స్కో ఎస్ఈ, పార్వతీపురం మన్యం జిల్లా కోసం సుమారు 1.50 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని విశాఖ–అరుకు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం పుణ్యగిరి కళాశాల వద్ద బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బద్దు మహేందర్ అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం 1.30 సమయంలో బైక్పై రోడ్డు దాటుతుండగా, విశాఖపట్నానికి చెందిన బసవబోయిన దుర్గాప్రసాద్(17) అనే యువకుడు తన మోటార్ సైకిల్పై కొత్తూరు నుంచి ఎస్.కోట వైపు వేగంగా వస్తూ మహేందర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయాల పాలవగా, తలకు గాయమైన దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టు సంఘాల నిరసన
● జర్నలిస్టుపై దాడిచేసిన టీడీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు వినతిసత్యనారాయణ, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్, ప్రజాశక్తి ప్రతినిఽధి సీహెచ్.రాము, వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డేవిడ్ రాజు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం పార్వతీపురం: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వల్ల ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విలేకరులపై దాడులు చేయడం సరికాదని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అల్లువాడ కిశోర్ పేర్కొన్నారు. ఈ మేరకు మక్కువ మండల విలేకరిపై భౌతికదాడులకు పాల్పడడంతో పాటు చంపుతానని టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు హెచ్చరించిన చర్యను ఖండిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడులకు నిరసనగా పలు నినాదాలు చేశారు. విలేకరిపై దాడి సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, విలేకరికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సంఘ సభ్యులు జిల్లా కార్యదర్శి గండి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావుతోపాటు జిల్లాలోని వివిధ పత్రిలు, మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.విజయనగరం అర్బన్: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై దాడి చేసిన టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టుపై చేసిన దాడికి నిరసనగా స్థానిక కలెక్టరేట్ వద్ద గల గాంఽధీ విగ్రహం దగ్గర సోమవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విఽధినిర్వహణలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణలపై వార్త కవరేజ్ కోసం విలేకరిపై దాడి చేయడం, చంపుతానని బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించని అధికారుల పనులపై, మంత్రి కార్యక్రమాలపై ఎందుకు రాశావని అసభ్యకరమైన పదజాలంతో దూషించి భౌతిక దాడికి పాల్పడడం దారుణమని వాపోయారు. ఇకపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించిన వేణుగోపాల్ నాయుడిని కఠినంగా శిక్షించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు -
హోటల్స్కు స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్
విజయనగరం అర్బన్: పర్యావరణ హితంగా పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ తెలిపారు. అందుకోసం ఘన వ్యర్థాల నిర్వహణ, మానవ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణల ఆధారంగా మూడు విధాలుగా మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో సబ్ కమిటీలు హోటల్స్ను తనిఖీ చేసి రేటింగ్ కోసం సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్ను హోటళ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చని అందువల్ల ఆయా హోటళ్ల ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న హోటల్స్ను ప్రభుత్వమే వెబ్సైట్లో పెట్టి ప్రోత్సహిస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీపీఓ వెంకటేశ్వరరావు, పలు హోటళ్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు, బాబూరావు కలెక్టర్ను పుష్పగుచ్చంతో సత్కరించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
పేదల ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నం
● ప్రజలు ప్రతిఘటించడంతో వెనుదిరిగిన అధికారులుసాలూరు: రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు నివాసముంటున్న ఇళ్లను కోర్టు ఆదేశాలతో కూలగొట్టేందుకు అధికారులు జేసీబీతో రాగా, తమ గూడును తొలగించవద్దంటూ పేదలు వాపోయి ఆందోళన చేసి ప్రతిఘటించారు. సాలూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఉన్న రైల్వేస్టేషన్ రోడ్డులో పేదలు నివాసముంటున్న పూరిళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సోమవారం పూనుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న పేదల ఇళ్లను కూల్చేందుకు యత్నించారు. వెంటనే బాధిత ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దంటూ గగ్గోలు పెట్టారు. పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి ఎన్వై నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శ్రీనువాసరావు సదరు బాధిత పేదలకు అండగా నిలిచారు. పేదలతో కలిసి నాయకులు సంఘటనాస్థలానికి అధికారులు, పోలీసులతో తీసుకువచ్చిన జేసీబీని అడ్డుకున్నారు. నిరుపయోగంగా ఉన్న కొన్ని పూరిళ్లను తొలగించారు. ఈ సందర్భంగా పేదలు కమిషనర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న చోటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో పేదలు ఊపిరిపీల్చుకున్నారు. -
రైతుబజార్లో నేరుగా కూరగాయల విక్రయం●
● రైతులకు పిలుపునిచ్చిన అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ● సాక్షి కథనానికి స్పందనపార్వతీపురంటౌన్: రైతులు పండించే కూరగాయలను నేరుగా రైతుబజార్లో విక్రయించుకోవచ్చని అగ్రి ట్రేడ్–మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం సాక్షిలో ‘రైతులు లేరు..జని రారు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పంచాచారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుబజార్లో రైతులు తమ కూరగాయలను రైతులు విక్రయించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తు తం కూరగాయల పంట సీజన్ అయినందున, అధిక సంఖ్యలో దిగుబడి రావడం, తమ ప్రాంతాల్లో తగినంత గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నట్లయితే మీ పల్లె లేదా మండలాల్లోని ఉద్యానవన శాఖ అధికారులు లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను కలిసి తగిన వివరాలు ఇస్తే, జిల్లాలోఉన్న అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ శాఖ ద్వారా మీ సరుకును పార్వతీపురంలోని రైతు బజార్లో నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు ఏ విధమైన నష్టం వాటిల్లదని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సందేహాల నివృత్తి కోసం ఫోన్ 91823 61348 నంబర్ను సంప్రదించవచ్చని ప్రకటనలో వివరించారు. గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదంకొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో అందరూ ఉండగానే గ్యాస్లీకై మంటలు రావడం గమనించి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కలకు చెందిన యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఈక్రమంలో బి.అప్పలరాజు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని కొత్తవలస ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కాగా ఈ సమాచారం చెంతనే గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ కార్మాగారం యాజమాన్యానికి అందించగా కర్మాగారానికి చెందిన ఫైర్ ఇంజిన్తో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
విజయనగరం ఫోర్ట్: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 9 పీహెచ్సీల వైద్యాధికారులు సిబ్బందితో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి వారు సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ను లబ్ధిదారులందరికీ వేసేలా చూడాలని చెప్పారు. టీబీ గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఒళ్లంతా తిమ్మిర్లుగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతో పాటు వాంతులు గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధి పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నాడీ వ్యవస్థను ఈవైరస్ దెబ్బతీస్తుందని తెలిపారు. దీంతో రోగి పక్షవాతం బారిన పడతారన్నారు. ఇది అంత ప్రమాదకరం కాదని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఎల్ఓ డాక్టర్ కె. రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుత కుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
సీ్త్ర, పురుష నిష్పత్తిని తగ్గించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అధికంగా ఉంటున్నదని, దీనిని తగ్గించేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. జిల్లాలో ఉన్న 110 స్కానింగ్ కేంద్రాల ద్వారా రోజువారీ జరుగుతున్న స్కానింగ్ల సమచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గర్భిణులకు అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చికిత్సలకు వైద్యులు సిఫార్సు చేస్తూ పేద కుటుంబాలపై అనవసర ఆర్థికభారం మోపుతున్నారని, దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన గర్భిణులు, వారిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు ఆయా నెలల్లో జరిగే అబార్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు కూడా స్కానింగ్ సెంటర్స్ను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఎన్సీడీ పీఓఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
జేఎన్టీయూ జీవీలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో రెండు రోజులు నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏక్తార్ ఎక్స్ఎక్స్వీ’ అనే అంశంపై నిర్వహించిన ఈ సింపోజియంను యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్–జి రిటైర్డ్ శాస్త్రవేత్త పి.త్రిమూర్తులు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో విజయానికి విద్య, వృత్తి నైపుణ్యాలు ముఖ్యమన్నారు. ఉన్నత ఉద్యోగాలకు, పదవుల ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం విశిష్ట అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థల సంబంధాల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజేనాగరాజు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వీఎస్ వకుళ, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు పి.శ్రీనివాసులురెడ్డి, టి.శిరీష, వివిధ కళాశాలల నుంచి హాజరైన 400 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు
● అమృత్ భారత్ పనులు పరిశీలించిన రైల్వే జీఎంపార్వతీపురంటౌన్: ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్ను నిర్మిస్తున్నామని ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర ఫంక్వాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ఎఫ్ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశాఖ డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింగల్, సీఏఓ అంకుస్ గుప్త, సీనియర్ డీసీఎం కె సాందీప్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ (భువనేశ్వర్) సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్లో బయలుదేరిన ఆయన రాయగడ మీదుగా జిమిడిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం మీదుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో విజయనగరం రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. అడుగడుగునా ట్రాక్ల పరిశీలనతో పాటు మలుపులు, హెచ్చరికబోర్డులు, ట్రాక్ పాయింట్లు, ఆర్యూబీలు పర్యవేక్షి ంచారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయనాయకులు, ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించారు. అమృత్భారత్ నిధుల్లో భాగంగా ప్రయాణికులకు ప్రత్యేక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ను ప్రారంభించారు. అమృత్భారత్ స్టేషన్ అభివృద్ధిపనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చేపట్టాల్సిన పనులౖపై సూచనలు చేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 200జీబీఎస్పై అప్రమత్తం● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం: గులియబుల్ భారే సిండ్రోమ్ (జీబీఎస్)పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జీబీఎస్పై వైద్యశాఖ, పంచాయతీరాజ్శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు జీబీఎస్పై అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించడంతో పాటు వేడినీరు తాగడం, వేడి ఆహార పదార్ధాలను తీసుకోవాలని తెలియజేయాలన్నారు. సమావేశంలో కేఆర్ఆర్ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్తో ఎంఆర్ కళాశాల ఎంఓయూనెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయం విజయనగరం మహారాజా కళాశాలతో సోమవారం ఎంఓయూ కుదుర్చుకుంది. కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సాంబశివరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంటర్న్షిప్లు, పరిశోధన, నైపుణ్యం, తదితర అవకాశాలకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ సన్నీడయోల్, డాక్టర్ విజయ్బాబు, పుష్పలత, ఐక్యూసీ హెడ్ ప్రొఫెసర్ ఎంఎంల్ఎన్ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తావిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలోని జరిగిన డీఅర్ఎం కప్ 8వ రాష్ట్రస్థాయి ఉమెన్న్స్ సీనియర్ బాక్సింగ్ చాంపంయన్ షిప్ 2025లో విజయనగరం క్రీడాకారులు మూడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. విజేతల్లో ఎస్. షర్మిల 70 కిలోల రజత పతకం, మనోజి 75 కిలోల విభాగంలో రజత పతకం, సుమిత్ర 80 కిలోల కేటగిరిలో రజత పతకం, ఎన్.రమ్య 57 కిలోల కేటగిరిలో కాంస్య పతకం, బి.పూజిత 65 కిలో కేటగిరిలో కాంస్య పతకం, 60 కిలోల విభాగంలో వై.అనుష కాంస్య పతకం దక్కించుకున్నారు. విజేతలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు అభినందించారు. 100 లీటర్ల సారా స్వాధీనం● ● ఇద్దరిపై కేసు నమోదుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి, పులిగూడ గ్రామాల్లో సారా అమ్మకాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారాను కలిగి ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇరిడి గ్రామంలో బిడ్డిక గుండు 80 లీటర్ల సారాతో, పులిగూడ గ్రామానికి చెందిన ఊయక కిరణ్ కుమార్ 20 లీటర్ల సారాతో పట్టుబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల మండలాల్లో సారా తయారీ, విక్రయాలు, సరఫరా అరికట్టేందుకు దాడులు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
ఈ సారైనా..?
● నేడు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ● ఉత్కంఠకు తెరపడేనా..! ● ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు పాలకొండ నగరపంచాయతీ కార్యాలయంపాలకొండ: పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు సోమవారం అయినా తెర పడనుందా? లేదా? అని అంతా చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఈ సారైనా జరుగుతుందా? అనే ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. ఈ నెల 3న జరగాల్సిన చైర్మన్ ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడగా. 4వ తేదీన కోరం లేక చైర్మన్ ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో ఈనెల 17న సోమవారం ఈ ఎన్నికల నిర్వహణకు మరోసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ సారి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఎలా జరగబోతుంది? కుర్చీ ఎవరికి దక్కుతుంది? వైఎస్సార్సీపీ పట్టు సాధిస్తుందా? లేక కూటమి దక్కించుకుంటుందా? అని పాలకొండ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సారి చైర్మన్ ఎన్నికకు మొదట ఎదురైన పరిస్థితులే వస్తే ఈ సారి ఎన్నికను కూడా వాయిదా వేస్తారా? లేక నిలిపివేస్తారా? లేక ఇంకా ఏం జరగబోతుందనే ప్రశ్నలు పాలకొండ పట్టణ ప్రజల్లో మొదలయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చైర్మన్ పదవి పాలకొండ నగరపంచాయతీ చైర్మన్ పదవిని ఇటు వైఎస్సార్సీపీ నాయకులు అటు అధికార బలంతో ఉన్న కూటమి నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు.కౌన్సిల్ సభ్యుల సంఖ్యా బలంతో ఉన్న వైఎస్సార్సీపీతో పాటు అధికార బలం ఉన్న కూటమి నాయకులు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా చైర్మన్ కుర్చీ కోసం పట్టుబడుతున్నారు. అయితే ఈసారి ఎన్నిక వాయిదా పడినా లేదా నిలిచిపోయినా రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించినందున తమతో ఉన్న 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లీశ్వరికి చైర్మన్ పదవి ఖాయమని కూటమి నాయకులు భావిస్తున్నారు. సభ్యుల ఆమోదం లేకుండా ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో జరగదని, ఒకవేళ చైర్మన్ ఎన్నిక జరిగినా సంఖ్యాబలం లేక పాలన సజావుగా జరగదని మరికొందరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగనుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
తప్పని డోలీ మోతలు..
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో ఉన్న తమకు డోలీ మోతలు తప్పడం లేదని.. ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాట మరిచారని గిరిజన సంఘ నాయకులు ధ్వజమెత్తారు. మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన జన్ని రవి అనే యువకుడు ఆదివారం కడుపునొప్పి, విషజ్వరంతో బాధపడడంతో బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఒక కర్రకు తట్టకట్టి రవిని అందులో కూర్చోబెట్టి, గ్రామానికి చెందిన యువకులు సుమారు ఏడు కిలోమీటర్లు కొండల మధ్యగా డోలీని మోసుకుంటూ మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనం దొరక్కపోవడంతో తెలిసిన వారి బైక్పై కూర్చోబెట్టి హుటాహుటిన ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘ నేతలు, గ్రామ యువకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ ఎస్.కోట బహిరంగ సభలో మాట్లాడుతూ, చిట్టంపాడుకు చెందిన గంగులు భార్య, అతడి బిడ్డ వైద్యం అందక చనిపోయారని.. ఇది చాలా అవమానమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా తమ కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిశిఖర గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం చేయకతప్పదని గిరిజన సంఘ నాయకులు జరతా గౌరీష్, తదితరులు స్పష్టం చేశారు. -
జనం రారు..
రైతులు లేరు..పార్వతీపురం టౌన్: బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలను నియంత్రించేందుకు గతంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లోనూ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. అయితే అవి లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి. అంతా ప్రైవేట్ వ్యాపారుల కనుసన్నల్లో దళారులే రైతుల అవతారమెత్తి కూరగాయలు అమ్ముతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉత్పత్తులను తెచ్చే రైతులు హోల్సేల్ వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే అమ్ముకుని వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ప్రజలకు తక్కువ రేట్లకే అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన రైతు బజార్లు రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్నాయి. కొనుగోలుదారులు రావడం తగ్గిపోతుం డడంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. గతంలో జిల్లాకు రెండు రైతు బజార్లను మంజూరు చేశారు. జిల్లా కేంద్రమైన పార్వతీపురం ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో, సాలూరు పట్టణంలో మామిడిపల్లి రోడ్డు వద్ద వాటిని మంజూరు చేశారు. సాలూరులో రైతుబజార్లో రైతులు కూరగాయలు అమ్మేందుకు సుముఖత చూపక ఇప్పటివరకు ఆ రైతు బజార్ను ప్రారంభించలేదు. పార్వతీపురం రైతు బజార్లో దళారులు సొంత రేట్లకు విక్రయాలు చేపడుతున్నారు. పెరిగిన తోపుడు బండ్ల వ్యాపారులు జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో తోపుడు బండ్ల వ్యాపారం పెరిగింది. ఈ కాలనీ, ఆ కాలనీ అన్న తేడా లేకుండా ఉదయం సమయంలో విస్తృతంగా కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు. ఇంకోవైపు రోడ్లపై చిన్నచిన్న దుకాణాల్లో కూడా కూరగాయల వ్యాపారం విస్తరించింది. దానివల్ల ఇప్పుడు పార్వతీపురం నడిబొడ్డున ఉన్న రైతుబజార్లో కొనుగోళ్లు తగ్గిపోయాయి. తోపుడు బండ్ల వ్యాపారుల వద్ద కూరగాయలు తాజాగా ఉండడం, ఇంటి వద్దకే వస్తుండడంతో జనం వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుబజార్లలో అమ్మకాలు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. ఆటోల్లోనూ అమ్మకాలు ఆటోల్లో కూడా కూరగాయలు తెచ్చి అమ్ముకునేవారు కూడా పెరిగిపోయారు. కొంతమంది రైతుల వద్దనే నేరుగా కొనుగోలు చేసి కాలనీల్లో అమ్మకాలు చేస్తున్నారు. కొందరు చిన్నచిన్న సెంటర్లలో రోడ్డుపై కూరగాయలు పోసి అమ్ముతున్నారు. మార్కెట్, రైతుబజార్లకంటే తక్కువ ధరకే కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా రైతు బజార్లలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఇళ్ల వద్దకే వస్తుండడంతో మహిళలు ఏ రోజుకారోజు ఆటోల వద్ద, తోపుడు బండ్ల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు రావడం లేదు రైతులు అమ్మకాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మున్సిపల్, పోలీస్సిబ్బంది సహాయంతో రోడ్లపై ఉన్న కూరగాయల దుకాణాలు రైతు బజార్లలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాం. వాటిని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు చర్యలు తీసుకున్నాం. ఉన్నతాధికారులు కూడా అందుకోసం దిశానిర్దేశం చేశారు. కూరగాయలు పండించిన చిరు రైతులే నేరుగా రైతు బజార్లకు వచ్చి విక్రయాలు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – అశోక్ కుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి లక్ష్యానికి విరుద్ధంగా.. రైతులు పండించిన కూరగాయలు నేరుగా ఆయా బజార్లకు తీసుకొచ్చి విక్రయించుకోవడమే వాటి ప్రధాన లక్ష్యం. తదనుగుణంగా అప్పట్లో అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ కంటే అక్కడ కూరగాయల ధరలు తక్కువగా ఉండడంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. రానురాను రైతులు ఆ కేంద్రాలకు దూరమయ్యారు. కొంతమంది చిరువ్యాపారులు నేరుగా రైతులు వద్దనే కూరగాయలు కొనుగోలు చేసి రైతుబజార్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆయా రైతుబజార్లలో సగం షాపులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లో మాదిరిగానే రైతుబజార్లలో ధరలు ఉండడం, మళ్లీ చిరు వ్యాపారులు వీధి వ్యాపారులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో పార్వతీపురం రైతుబజార్లో ఉన్న షాపులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుబజార్లో 40 నుంచి 45 షాపుల వరకు ఉండగా ఏడుగురు మాత్రమే విక్రయాలు చేస్తున్నారు. అవిపోను ఖాళీగా ఉన్న మిగిలిన వాటిలో కూరగాయలకు వచ్చే బాక్సులు, సైకిళ్లు, వివిధ రకాల వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. అలంకార ప్రాయంగా రైతుబజార్లు అంతా వ్యాపారులదే రాజ్యం రైతుల కూరగాయలు దళారులకే విక్రయం దిష్టిబొమ్మల్లా ధరల బోర్డులు సాధారణ మార్కెట్ మాదిరిగానే ధరలు జిల్లాలో రెండు రైతు బజార్లు దుకాణాలు ఉన్నా 50శాతం పైగా ఖాళీ రైతులు లేక మూతబడ్డ సాలూరు బజార్ -
మళ్లీ వచ్చిన ఏనుగుల గుంపు
కొమరాడ: కొన్నాళ్ల పాటు జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరించిన ఏనుగుల గుంపు ఆదివారం కొమరాడ మండలం పాతదుగ్గిలో మళ్లీ సంచరిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, అరటి, కూరగాయలు తదితర పంటలు చేతిక వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో గజరాజుల గుంపు సంచారం వల్ల పంటలు నాశనమవుతాయిని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగులు తీసుకుని వచ్చి ఏనుగుల గుంపును తరలిస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ..? అంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మొక్కజొన్న చేనులో సంచారం ఆవేదనలో రైతులు -
టమాటో
@వీరఘట్టం: నిన్న, మొన్నటి వరకు ఆకాశాన్నంటిన టమాటో, కాలిఫ్లవర్ ధరలు అమాంతం పతనమయ్యయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ టమాటో కొనేవారు కరువవడంతో వీరఘట్టంలో పంట పొలాల వద్ద రైతులు టమాటోను పారబోస్తున్నారు. వీరఘట్టం మార్కెట్లో కిలో టమాటో రూ.20లు పలుకుతున్నా..పంట పొలాల వద్ద హోల్సేల్గా కిలో రూ.5 కు కూడా కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. అలాగే కాలిఫ్లవర్ పంట దిగుబడి బాగా వచ్చినా గిరాకీ లేకపోవడంతో కోయకుండా పొలంలోనే రైతులు వదిలేస్తున్నారు.పెళ్లిళ్ల సీజన్ కావడంతో టమాటో, కాలిఫ్లవర్ పంటలకు మంచి గిరాకీ ఉంటుందని అనుకుంటే ఈ పంటలకు డిమాండ్ తగ్గడంతో ధర పతనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. టమాటో పతనం..కాలిఫ్లవర్ ఖతం అమాంతం పడిపోయిన ధరలు పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు -
సంచారం ఓ చదరంగం..!
● పశు ఆరోగ్యసేవలపై ప్రభుత్వం కుట్ర.. ● సేవలు నిలిపివేయాలని ఆదేశాలు ● నిలిచిపోయిన మొదటి విడత ప్రారంభమైన ఏడు వాహనాలు ● ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది ● ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ ● ఉన్న పళంగా తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పి స్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్అసిస్టెంట్స్, వెలుగులో పని చేసే వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్లు, వాచ్మె న్, పాఠశాలల్లో పనిచేసే వాచ్మెన్, ఆయాలను తొలగించారు. తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే సిబ్బందిని తొలిగించేశారు. పేజ్–1లో నియమితులైన అందరికీ టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ చేశారు. ఒక్కసారిగా తొలగింపు ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు అంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 13 వాహనాలు సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 13 ఉన్నాయి. మొదటి విడతలో 7 వాహనాలు వచ్చాయి. రెండో విడతలో వచ్చిన 6 వాహనాలు ఉన్నాయి. మొదటి విడతలో విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. రెండో విడతలో గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట, రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. మొదటి విడతలో వచ్చిన ఏడు వాహనాలను ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అదేవిధంగా సిబ్బందికి టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి. ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది పని ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పన సిబ్బంది పనిచేసేవారు. ఒక డ్రైవర్, పారవిట్, పశువైద్యుడు పనిచేసేవారు. అదేవిధంగా 6 వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారు. అయితే ఉన్నపళంగా వారిని విధుల నుంచి తొటగించడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పశువుల చెంతకు వెళ్లి సేవలు మూగజీవాలు అనారోగ్యానికి గురైతే వాటి చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో అనారోగ్యానికి గురైన ఎన్నో పశువులకు ఈ వాహనాల ద్వారా వైద్య సేవలు అందించారు. పశువుల చెంతకే వచ్చి వైద్యసేవలు అందించడం వల్ల పాడి రైతులు ఎంతో సంతోషించేవారు. ఈ వాహనాలు రాకముందు ఏదైనా పశువుకు అనారోగ్యం వస్తే పశు వైద్యశాలలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. మళ్లీ పాత రోజులే వచ్చే పరిస్థితి కనిపిస్తోందని పాడి రైతులు వాపోతున్నారు. ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు ఆరోగ్య సేవను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నిర్వహించేది. ఫిబ్రవరి 15, 2025తో ఆ సంస్థ టెండర్ కాలపరిమితి అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా సేవలను నిలిపివేసింది. ఏదైనా సంస్థకు టెండర్ కాలపరిమితి అయిపోయినప్పడు కొత్తగా టెండర్లు పిలిచి నూతన సంస్థ బాధ్యతలు స్వీకరించేవరకు పాత సంస్థను కొనసాగించేవారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. కొత్త సంస్థ బాధ్యతలు తీసుకోకుండానే పాత సంస్థ సేవలను నిలిపివేశారు. అలాగే కొత్త సంస్థ పాత ఉద్యోగులను కొనసాగించకుండా టెర్మినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు వాస్తవమే మొదటివిడతలో జిల్లాకు మంజూరైన ఏడు సంచార పశు ఆరోగ్య సేవల వాహనాల సేవలు నిలిపివేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఆదివారం నుంచి సేవలు నిలిపివేశాం. ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఉద్యోగులకు వాటిని అందజేశాం. –బి.నారాయణరావు, జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ జిల్లా మేనేజర్