Peddapalli District Latest News
-
అంబేడ్కర్, గాంధీని అవమానించిన అమిత్షా
కమాన్పూర్(మంథని): అంబేడ్కర్, గాంధీని కేంద్ర మంత్రి అమిత్షా అవమానిస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం బై బాపు, బై భీమ్, బై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, గాంధీ చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగా నిర్మాతలను బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, కేంద్ర మంత్రి అమిత్షా అవమానిస్తున్నారని అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో తొట్ల తిరుపతియాదవ్, వైనాల రాజు, కోలేటి మారుతి, గాండ్ల మోహన్, ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, అంబిర్ శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, కుక్క రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యన్ని కాపాడటమే లక్ష్యం ముత్తారం(మంథణి): ప్రజాస్వామ్యన్ని కాపాడడమే లక్ష్యంగా, రాజ్యాంగం ప్రఖ్యాతి తెలిసేలా గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ముత్తారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్గాంధీ పిలుపు మేరకు గ్రామాల్లో ప్రతీ కార్యకర్త రాజ్యాంగ ఆవశ్యకతను వివరిస్తూ పాదయాత్రలు చేయలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే..
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కార్మిక ప్రయోజనాలే లక్ష్యంగా సమ్మె చేపడతాం. దీనికి అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలి. కలివచ్చే అన్ని సంఘాలతో ఒక్కరోజు టోకన్ సమ్మెను విజయవంతం చేస్తాం. కేంద్రం తీరుతో సింగరేణి పెద్దమొత్తంలో నష్టపోయింది. భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేలా పోరాటాలకు సన్నద్ధం అవుతున్నాం. – సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు లేబర్ కోడ్లు రద్దు చేయాలి కార్మిక చట్టాలను మార్పుచేయాలి. లేబర్ కోడ్లనే వెంటనే రద్దు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఆలోచన. దీన్ని అడ్డుకోవాలని సమ్మెకు పిలుపునిచ్చాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ మానుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని కాపాడుకో వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సంస్థకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. – తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు విజయవంతం చేయాలి ఒక్కరోజు సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. కార్మిక చట్టాలు రద్దు చేసి, లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని నష్టం కలుగుతుంది. అలాగే బొగ్గు గనులను ప్రైవేట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కొత్తబ్లాక్లు సింగరేణికే అప్పగించాలి. – రియాజ్అహ్మద్, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు -
ధాన్యం శుభ్రతకు ప్యాడీక్లీనర్లు
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునేందుకు పడుతున్న అవస్థలను దూరం చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతికతతో కూడిన శ్రీప్యాడీక్లీనర్లుశ్రీ అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్ర వినియోగం వల్ల రైతుకు కొంతమేర శ్రమ తప్పుతుంది. ధాన్యాన్ని ఎత్తి ప్యాడీ క్లీనర్లో పోసే పని ఉండదు. కింది భాగంలో ఉన్న ప్లేటు వద్దకు ధాన్యాన్ని లాగితే చాలు. యంత్రమే మిగతా పని పూర్తి చేసి నాణ్యమైన ధాన్యాన్ని కుప్పగా పోసేస్తుంది. అంటే రైతుకు కొంత పనిభారం తప్పనుండగా సమయం కూడా ఆదా అవుతుంది. కలెక్టర్ చొరవతో.. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం ఏటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రైతులు ధాన్యాన్ని ఎత్తి పోస్తేనే నాణ్యమైన ధాన్యం బయటకు వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్లో పలు కేంద్రాల నుంచి 10వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అలాంటి కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలు ఉన్నట్టు తేలడంతో 154 యంత్రాలను తెప్పించారు. ఈ యంత్రాల వినియోగంతో ధాన్యం తూర్పారపట్టడం కొంత సులువుగా ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి.. రైతులకు కొంతమేర తప్పనున్న పని భారం జిల్లాలో.. వరి సాగువిస్తీర్ణం : 1,98,201ధాన్యం దిగుబడి అంచనా 4.37లక్షల మెట్రిక్టన్నులుసన్నరకం 1.79 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం 2.58 లక్షల మెట్రిక్ టన్నులుకొనుగోలు కేంద్రాలు: 334ప్యాడీక్లీనర్లు: 500ఆధునికసాంకేతికతో కూడినవి: 154ఈ ఫొటోలో ఉన్నది రైతులు పండించిన వరి ధాన్యంలో రాళ్లు, మట్టిపెల్లలు, తాలులాంటివి తీసి శుభ్రమైన ధాన్యాన్ని రాశిగా పోసే ఆధునిక ప్యాడీక్లీనర్. ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన ప్లేటు వద్దకు రైతు ధాన్యాన్ని పారతో లాగితే చాలు.. యంత్రమే ధాన్యాన్ని సేకరించి తూర్పార పట్టి మరో వైపు రాశిగా పోసేస్తుంది. -
ఆకతాయిల భరతం పట్టాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంకు బండ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సీపీ అంబర్కిషోర్ ఝా సమక్షంలో పోలీసు అధికారులు డ్రోన్ కెమెరాతో తనిఖీలు నిర్వహించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను బహిరంగప్రదేశాల్లో సేవించే ఆకతాయిల భరతం పట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధానకూడళ్లు, ఎల్లమ్మచెరువుకట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలు, వ్యాపారసంస్థల సమయపాలన తీరు, ఆ సమయంలో బైక్లపై వస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతాచర్యలు, నేరాలు ఇతర శాంతిభద్రతల విషయాలను డీసీపీ కరుణాకర్ వివరించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు మల్లేశ్, పలువురు అధికారులు ఉన్నారు. ● సీపీ అంబర్కిషోర్ ఝా -
ఓదెల మల్లన్న ఆదాయం రూ.33.59లక్షలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. రూ33,59,130 నగదు, 40.9గ్రాముల మి శ్రమ బంగారం, 7.2కిలోల మిశ్రమ వెండి సమకూరినట్లు పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకుసిబ్బంది, పోలీసులు, రా జరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బ్రెడ్ ప్యాకెట్లపై తయారీ తేదీలుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని బేకరీలు, స్వీట్హౌజుల్లో నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారని ఈనెల 21న ‘తింటే బేజారే..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి జరిమానా విధిస్తుండడంతో వ్యాపారుల్లో కూడా మార్పు మొదలయింది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ఓ సంస్థ తయారు చేస్తున్న బ్రెడ్పై లైసెన్స్ నంబర్తోపాటు తయారు చేసిన తేదీ, ఎకై ్స్పరీ డేట్, ధర, బరువు తదితర వివరాలను ముద్రించి విక్రయిస్తోంది. ఈసందర్భంగా వ్యాపారుల్లో మార్పు వచ్చేలా చొరవ తీసుకున్న ‘సాక్షి’ని పలువురు అభినందిస్తున్నారు. తినుబండరాలను విక్రయిస్తున్న వ్యాపారస్తులు తప్పనిసరిగా బాధ్యతతో ఉండాలని కోరుతున్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ సుల్తానాబాద్(పెద్దపల్లి): మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. గురువారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ రాంచందర్రావు, జిల్లా గ్రాంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, మున్సిపల్ కమిషనర్ మహ్మద్నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్అలీ పాల్గొన్నారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయండి● అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గోదావరిఖని(రామగుండం): రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో 62 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను రామగుండంలో నిర్మించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ యాదాద్రికి తరలించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచే రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఈప్రాంతాన్ని సందర్శించిన సమయంలో దీనికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ఈక్రమంలో వెంటనే ప్లాంట్ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను రెగ్యులర్ చేయాలని కోరారు. -
సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్
● బొగ్గుగనుల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్ల రద్దు కోసం ● మే 20న టోకెన్ సమ్మెకు జాతీయ సంఘాలు సైగోదావరిఖని(రామగుండం): సింగరేణిలో సమ్మైసెరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక్క రోజు సమ్మెకు జాతీయ సంఘాలు సై అంటున్నాయి. మే 20న ఒక్కరోజు టోకెన్ సమ్మె విజ యవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జాతీయ సంఘాల పిలుపు మేరకు.. కేంద్రప్రభుత్వం బొగ్గు గనుల్లో కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా పర్మినెంట్ కార్మికులతో చేయించాలని కోరుతున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేపట్టాలని, దీనికి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి కార్మికులు పూర్తి స్థాయి మద్దతు పలికి విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోల్బ్లాక్ల వేలంలో సత్తుపల్లి ఓసీపీని ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఓసీపీ ఓబీ మట్టిపోయడానికి స్థలం లేదని, సింగరేణి సంస్థ అప్పగించవద్దని, తాడిచర్ల– 2, వెంకటాపూర్ గనులు సింగరేణికే అప్పగించి భవిష్యత్కు భరోసా ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. ప్రధాన డిమాండ్లు ఇవే.. ● రద్దు చేసిన కార్మిక చట్టాలను తిరిగి కొనసాగించాలి. కోడ్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ● ఇది చట్టవిరుద్ధమైన కోల్ ఆపరేషన్ ప్రైవేట్వారితో తీయించడం మానుకోవాలి. ● సత్తుపల్లి ఓసీపీ ప్రైవేట్ సంస్థ ఓబీని సింగరేణి భూమిలో పోయడానికి అవకాశం ఇవ్వొద్దు ● తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులను సింగరేణికే ఇవ్వాలి. ● సింగరేణికి రావాల్సిన రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించి సంస్థను ఆదుకోవాలి. ● సంస్థలో నూతన గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. -
సమాజ సేవలో ముందుండాలి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సమాజ సేవలో యువత ముందుండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో బోస్ ఫెలోషిప్ వలంటీర్లు చేపట్టిన యంగ్ ఓరిటర్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తల్లిదండ్రులు పిల్లల చదువులపై అధికంగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చని, దీంతో విద్యార్థులు వెనుకంజలో ఉండకుండా సంబంధిత గ్రామాల యువత ముందుకు వచ్చి సదరు విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలన్నారు. బోస్ ఫెలోషిప్ కార్యక్రమం కింద 8నెలల పాటు వలంటీర్లుగా పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక తరగతి విద్యార్థులకు వివిధ ఆక్టీవిటిస్ ద్వారా విద్యాభోధన చేయడంపై అభినందించారు. డిగ్రీ చదివే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకొని దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డాక్టర్ పీఎం షేక్, బోస్ ఫెలోషిప్ వలంటీర్లు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ఇక సన్నబియ్యమే
ఉమ్మడి జిల్లాలో రేషన్కార్డులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే రేషన్షాపులకు సన్నబియ్యం వచ్చేశాయి. వీటిని ఉగాది రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. కార్డులో ఉన్న ప్రతీవ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు 80 శాతం జనాభాకు తెల్లరేషన్కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) ఉన్నాయి. వీరందరికీ సన్నబియ్యం అందనున్నాయి. గతంలోనూ ఇవే కార్డుల మీద ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కానీ... వాటిని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. బియ్యం దొడ్డుగా ఉన్న కారణంతో వాటిని హోటళ్లు, వ్యాపారులకు విక్రయించేవారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యాపారులు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి అమ్ముకునేవారు. ఇకపై బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకునేలా.. పకడ్బందీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులందని, డిలీట్ అయిన వారి కష్టాలు.. కొందరు లబ్ధిదారులకు ఇంకా రేషన్కార్డులు అందలేదు. వీరంతా గతేడాది ప్రజాపాలన, మీసేవా, ప్రజావాణి, ఇటీవల మరోసారి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంట లు తమ పేర్లను కుటుంబాల నుంచి డిలీట్ చేసుకుని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అర్హులైనా.. ఇంతవరకు రేషన్కార్డులు అందలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఏప్రిల్లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు లబ్ధిదారులను అధికారులు రేషన్ జాబి తాలో ఎంపిక చేశారు. వీరికి నెలానెలా సరుకులు వస్తాయనుకున్నా.. నేటికీ ఎలాంటి సరుకులు అందడం లేదు. ఉగాది నుంచైనా కార్డులు పనిచేస్తాయా? లేదా? అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు. బియ్యం దందా బంద్అయ్యేనా? ఇంతకాలం రేషన్ బియ్యాన్ని కొని మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వారికి జిల్లాలో విస్తృత నెట్వర్క్ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామం, పట్టణాలలో ఇంటింటికీ మోపడ్ బండ్లపై తిరుగుతూ రేషన్బియ్యం సేకరించే వారికి ఇకపై మునపటి స్థాయిలో దందా నడవకపోవచ్చు. గోదావరిఖని, మంథని మీదుగా గోదావరి దాటి మహారాష్ట్రలోకి బియ్యం పంపే వీరు అక్కడ వాటిని ప్రాసెస్, పాలిష్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ నుంచే రైల్వే వ్యాగన్లలో రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారంటే వీరి దందా ఏస్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. సన్నబియ్యం సరఫరా నేపథ్యంలో వీరి దందా బంద్ అయ్యేనా? లేక రూట్ మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఉగాది నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది ప్రజలకు ఉపయుక్తం దొడ్డుబియ్యం దందాకు శాశ్వత పరిష్కారం పేర్లు డిలీట్ అయిన వారికి ఇంకా అందని కార్డులు ప్రజాపాలన రేషన్జాబితాలో పేర్లు వచ్చినా అందని సరుకులు -
చెట్టంత కొడుకు పోయాడు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన భూస కార్తీక్ అనే యువకుడు రెండు నెలల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన భూస శంకరయ్య–స్వరూప దంపతులకు కార్తీక్ ఒక్కగానొక కొడుకు. పెరిగిపెద్దయి అండగా ఉంటా నుకున్న కొడుకు రూ. 6 లక్షలు బెట్టింగ్లో పోగొట్టాడు. మనోవేదనతో జమ్మికుంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్కు బానిసైన కొడుకు చనిపోయాడని.. చదువుకొని ఉద్యోగం చేస్తాడని ఆశపడితే కడుపుకోతే మిగిలిందని తల్లిండ్రులు బోరుమన్నారు. -
ఇదే చివరి తడి..!
● 18 టీఎంసీలకు పడిపోయిన ఎస్సారెస్పీ నీటి నిల్వలు ● ఏప్రిల్ 2 వరకే చివరి నీటి తడంటూ అధికారుల ప్రకటన ● ‘యాసంగి’పై ఉమ్మడి జిల్లా రైతుల ఆందోళనఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు ఏడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. పంట పొట్టదశలో ఉంది. ఇప్పుడు సాగునీరు అందకపోతే కష్టం. ఎస్సారెస్పీ నుంచి మరో 8 టీఎంసీలు మాత్రమే విడుదల చేసే అవకాశముంది. దీంతో రైతులు వ్యవసాయ బావులపైనే ఆధారపడి ఉన్న పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి.ఎందుకీ సమస్య? ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో నిండింది. ఓ ప్రణాళికంటూ లేకుండా ఇష్టారీతిన నీటిని వాడటంతో చి‘వరి’కి సాగునీటి గండం ఏర్పడుతోంది. ప్రజాప్రతినిధులు చెప్పారని వానాకాలం, ఎండాకాలం తేడా లేకుండా ఎస్సారెస్పీ అధికారులు నీరు విడుదల చేశారు. ఎస్సారెస్పీ కాలువలకు ఇష్టారీతిన తూములు ఏర్పాటు చేసి, సాగునీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీటి విడుదల సరిగ్గా కాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటికి వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. బుధవారం నాటికి 18.833 టీఎంసీలకు పడిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ జోన్–2 ఆయకట్టు(ఎల్ఎండీ ఎగువ భాగం)కు డీ–54 నుంచి డీ–94 వరకు ఏప్రిల్ 2వ తేదీ వరకు, జోన్–1 ఆయకట్టు(డీ–5 నుంచి డీ–53 వరకు)కు ఏప్రిల్ 9వరకు మాత్రమే చివరి సాగు నీటితడి అందిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో యాసంగి పంట సాగుపై ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లావాసులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అ రుణశ్రీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎండల తీవ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై బుధవారం సమీక్షించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు లో జిల్లా మూడోస్థానంలో ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనివేళలు మార్చాలని, ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతీఒక్కరి వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలు, సిబ్బందికి వడదెబ్బ తగలకుండా టెంట్, తాగునీటి సౌక ర్యం కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు నగదు చెల్లింపులు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం(మంథని): జాయతీ రహదారి కోసం భూములిచ్చిన నిర్వాసితులకు నగదు చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కొయ శ్రీహర్ష తెలిపారు. ధర్యపూర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రం, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీచేశారు. బోర్లు, వ్యవసాయ బావులు, చెట్లు, ఇతర కట్టడాలకు పరిహారం అంది స్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం జా తీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్కు త్వరగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీవో సురేశ్, ఎంపీవో గోవర్ధన్, ప్రిన్సిపాల్ సంతోష్, మాజీ జెడ్పీటీసీ చోప్పరి సదానందం ఉన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాండవులగుట్ట భూములను ఆయన పరిశీలించా రు. ప్రభుత్వ భూములకు బోర్డులు, హద్దులు ఏర్పా టు చేయలని తహసీల్దార్ జగదీశ్వర్రావును ఆదేశించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. యువతకు ఉచిత శిక్షణ సుల్తానాబాద్రూరల్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇందుకోసం సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి స్టేడియంలో దేహదారుఢ్య, మెడికల్, రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 17–21 ఏళ్ల మధ్య వయసుగలవారు నేరుగా స్టేడియంలోకి హాజరు కావాలన్నారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలి మంథని: అఽధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ అఽధికారి, పురపాలక సంఘ భవనం పనులను ఆయన పరిశీలించారు. నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి ఉన్నారు. -
డెత్లైన్ బెట్టింగ్!
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025ఒంటరి గువ్వలుఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి(28) ఆటో నడపడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో పాల డెయిరీ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఏర్పడ్డ పరిచయాలతో ఆన్లైన్ బెట్టింగ్లో రూ.18లక్షలు పోగొట్టుకున్నాడు. నిండా మునగడంతో పాలడెయిరీ, ఆటోలను సైతం అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై 2024 నవంబర్ 11న పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. స్వామి మృతితో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు సాద్విన్, వర్షిత ఒంటరివారయ్యారు. స్వప్న ప్రస్తుతం బీడీలు చుడుతుండగా.. వారికి ఆసరాగా స్వామి తండ్రి లక్ష్మీనారాయణ మిర్చీ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.బలైన విద్యార్థితిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్రావు(22)హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది 10 రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు ఆన్లైన్ బెట్టింగ్కు బలికావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ●బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెడితే నిమిషాల్లోనే ఐదింతలు..పదింతలు అవుతాయనే ప్రకటనలు.. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే క్షణాల్లోనే మీ జీవితాలు మారుతాయనే యాడ్స్.. యువతను ఆకర్షిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు.. అప్పుడప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న యువత.. పిల్లాపాపలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మధ్యవయసు వారు.. అందరూ బాధితులే. కష్టపడి సంపాదించిన సొమ్మును బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్లు, ఐపీఎల్ బెట్టింగ్లలో పెడుతూ నిండా మునుగుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో దాదాపు 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు.. ఇన్ఫ్లుయన్సర్లు.. బుల్లితెర..వెండితెర నటీనటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెట్టింగ్యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్ బాధిత కుటుంబాల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ టౌన్/ఎల్లారెడ్డిపేట/తిమ్మాపూర్/శంకరపట్నంఈజీమనీ వల.. జీవితాలు విలవిల●● అప్పుల ఊబిలోకి లాగుతున్న అత్యాశ ● మనీ సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షణ ● బెట్టింగ్యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్లలో పెట్టుబడులు ● నిండా మునిగాక బయటకు రాలేకపోతున్న యువత ● ప్రాణాలు తీసుకుంటున్న వైనం ● రోడ్డున పడుతున్న కుటుంబాలుసిటీలకే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే వారిని ఏజెంట్లగా నియమించుకుంటున్నారు. వీరు బెట్టింగ్లకు పాల్పడే వారిని గుర్తించి ఫోన్ నంబర్లతో టెలిగ్రామ్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసినందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగానే ముట్టజెప్పుతున్నారు. బెట్టింగ్లకు పాల్పడేవారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్ల ప్రకారం బెట్టింగ్లు పెడుతున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో గోదావరిఖనికి చెందిన బెట్టింగ్ నిర్వాహకులు పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసులు నమోదైతే చిక్కులు తప్పవు గతంలో బెట్టింగ్లో పట్టుబడితే వారిపై పెట్టి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు అనే వివరాలు ఉంటున్నాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగావకాశాలు ఇవ్వవు. ఇలా గుర్తించండి బెట్టింగ్యాప్ బాధితులు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కువ సమయం ఫోన్లో లీనం కావడం, తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పులు చేయడం, ఇంట్లో వారికి తెలియకుండానే డబ్బులు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఫిర్యాదు చేయండి తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం. బెట్టింగ్కు పాల్పడిన, ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెట్టింగ్పై ఆన్లైన్లో www. cybercrime. gov. in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్ఫ్రీ నంబర్ 1930లోనూ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కొన్ని సంఘటనలు ● 2025 మార్చి 21న మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడటంతో రూ.6లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో మళ్లీ బెట్టింగ్ల జోలికి వెళ్లనని హామీ ఇవ్వగా నమ్మిన కుటుంబసభ్యులు అప్పులు తీర్చారు. తిరిగి సాయితేజ బెట్టింగ్లకు పాల్పడి రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ● 2024 జూలై 4న సుల్తానాబాద్లో రాత్రి వేళ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.33.10 లక్షల నగదుతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఐదు ఫోన్లు సీజ్ చేశారు. ● సుల్తానాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి సుమారు రూ.5లక్షల వరకు నష్టపోయాడు. అవి తీర్చేందుకు లోన్యాప్స్లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు తెలిసి మందలించడంతో మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఐపీఎల్ పేరుతో ప్రతీ ఇంటిలోకి తొంగిచూస్తున్న బెట్టింగ్ భూతం బారినపడకుండా కుటుంబసభ్యులే రక్షించాల్సిన అవసరం ఉంది. న్యూస్రీల్ -
ఎవరూ వాటి జోలికి పోవద్దు
ఎవరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు. అవన్నీ మోసపూరితమైనవే. ఆన్లైన్ ఊబిలోకి కూరుకుపోయిన వారు ఎవరూ బాగుపడలేదు. నా భర్త తెలియక డబ్బులు పెట్టి నిండా మునిగాడు. చివరికి ప్రాణాలు సైతం తీసుకున్నాడు. మేము ఒంటరివారమయ్యాం. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – బండి స్వప్న, సింగారం తల్లిదండ్రులు నిఘా పెట్టాలి ఐపీఎల్ బెట్టింగ్పై నిఘా ఉంచాం. అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిఘా పెట్టాలి. బెట్టింగ్లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. – కరుణాకర్, డీసీపీ పెద్దపల్లి మానసిక ఒత్తిడితోనే ఈజీగా డబ్బు సంపాదించాలే ఆశతో యువత బెట్టింగ్ ప్రారంభిస్తారు. మొదట డబ్బులు వస్తుంటే ఆశతో ముందుకెళ్తారు. ఆ తర్వాత నష్టపోతుంటే అప్పులు భారంగా మారి అసాధారణమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక నష్టాలు వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూ పుతాయి. ఈ ఒత్తిళ్లు వారికి అదనపు భయం, ఒంటరితనంతో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి వారిని గుర్తించి వారు ఒత్తిడిని జయించాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. – ప్రీతి, సైకియాట్రిస్టు -
పుట్టెడు దుఃఖంతో ‘పది’ పరీక్షకు..
సప్తగిరికాలనీ: ఓ వైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు తల్లి హఠాన్మరణంతో ఆ విద్యార్థి తల్లిడిల్లిపోయాడు. బాధతప్త హృదయంతో పదో పరీక్షకు హాజరయ్యాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అమరం జనార్దన్రెడ్డి – మౌనిక దంపతుల కుమారుడు అమన్రెడ్డి కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పదో తరగతి చదివాడు. పిల్లల చదువు నిమిత్తం కరీంనగర్ మంకమ్మతోటలోనే నివాసముంటున్నారు. తండ్రి నిమ్మపల్లి ఐకేపీ సెంటర్లో సీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం తల్లి లత గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఓ పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యాడు. అమన్ రెడ్డిని బుధవారం ఉదయం పరీక్ష కేంద్రం వద్ద మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి ఓదార్చారు. అమన్ రెడ్డిని ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు ధైర్యం చెప్పారు. ఉన్నత స్థాయిలో రాణిస్తా మా అమ్మ ఎప్పుడు నన్ను ఉన్నతస్థాయిలో రాణించాలని చెప్పేది. బాగా చదవాలి. క్రీడల్లోనూ రాణించాలని సూచించేది. నేను జాతీయ జూడో పోటీలకు ఎంపికై నందుకు చాలా సంతోషపడింది. స్పోర్ట్స్లో పాల్గొనేలా ఉత్సాహం నింపింది. ఉన్నత స్థానంలో నిలిచి అమ్మకోరిక నెరవేర్చుతా. – అమన్ రెడ్డి -
రూ.కోటి పరిహారం చెల్లించాలి
రామగుండం: టీటీఎస్ అంతర్గాంకు చెందిన ఆలకుంట సంపత్ది పోలీసు హత్యగానే భావిస్తున్నామని పౌరహక్కుల సంఘం నేతలు అన్నారు. మంగళవారం మృతుడి కుటుంబాన్ని వారు పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సంపత్ ఆర్థికంగా నష్టపోయి జగిత్యాలలో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది గల్ఫ్ ఏజెంట్గా పని చేశాడన్నారు. అతడితోపాటు తోడల్లుడు చిరంజీవితో కలిసి సేవలు అందించారని అన్నాడు. అయితే, గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే సంపత్ మృతిచెందాడని హక్కుల నేతలు ఆరోపించారు. సంపత్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, ప్రభుత్వ హత్యగా గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేతలు మాదన కుమారస్వామి, నార వినోద్, బొంకూరి లక్ష్మణ్, రెడ్డిరాజుల సంపత్, బండారి రాజలింగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మృతుడు సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్ -
రామగుండంలో రూ.2 కోట్ల మాఫీ
● ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ ● ఈనెలాఖరు వరకు గడువు ● జీవో జారీచేసిన ప్రభుత్వం కోల్సిటీ(రామగుండం): నగరపాలక, పురపాలక సంస్థల్లో ఆస్తిపన్ను బకాయిలదారులకు రాష్ట్ర ప్ర భుత్వం చల్లటి కబురు చెప్పింది. వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్)కల్పిస్తూ జీవో నంబర్ 154ను మంగళవారం రాత్రి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ జారీచేశారు. ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 31 వరకు గడువు.. 90శాతం వడ్డీమాఫీ వర్తించేందుకు ఈనెల 31వ తే దీ వరకు గడువు విధించారు. కేవలం ఐదు రోజులే గడువు మిగిలి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిపడిన ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీమాఫీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్టైన్ సెటిల్మెంట్ స్కీమ్(ఓటీఎస్) తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను వడ్డీతోసహా ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 90 శాతం వడ్డీని మినహాయిస్తారు. మిగిలిన 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మినహాయింపు మొత్తాన్ని భవిష్యత్తు చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు బల్దియాల్లో.. రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీం బకాయిదారుల నుంచి స్పందన వచ్చేందుకు మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టారు. గడువు తక్కువగా ఉండడంతో నేరుగా బకాయిలదారుల ఇంటికే వెళ్లి ఆస్తిపన్ను చెల్లించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రామగుండం బల్దియాలో రూ.2.28 కోట్లు.. రామగుండం నగరపాలక సంస్థలో రూ.15.22 కోట్ల వరకు ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా ఈనెల 25వ తేదీ వరకు రూ.9.88కోట్ల వరకు వసూలైంది. ఆస్తిపన్నుపై సుమారు రూ.2.28కోట్ల మేర వడ్డీ ఉండగా, ఓటీఎస్ స్కీం ద్వారా రూ.2.05కోట్ల వరకు మాఫీ కానుంది. సద్వినియోగం చేసుకోవాలి ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం కల్పించిన 90 వడ్డీమాఫీ పథకం బకాయిదారులకు మంచి అవకాశం. గడువు తక్కువగా ఉండడంతో ఫ్లెక్సీలు, మైకులతో విస్తృంగా ప్రచారం చేస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లు బకాయిదారుల ఇంటికే వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ), రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ -
24 గంటల్లో చోరీ కేసు ఛేదన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పాతబజార్ ప్రాంతంలో బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణం తాళాలు పగులగొట్టి 100 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్కు చెందిన లోకిని తిరుమల భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత పెద్దపల్లిలోని ఓ హోటల్లో కొంతకాలం పనిచేసిన తిరుమల.. పనిమానేసి ఇంటివద్ద ఖాళీగానే ఉంటోంది. ఖర్చులు ఇతర అవసరాలకు డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచనతో దొంగతనాలు చేయాలని నిర్ణయించింది. సుత్తితో తాళాలు పగులగొట్టి.. సోమవారం రాత్రి సుత్తి వెంటతెచ్చుకుని ఫస్ట్ఫ్లోర్లోని దేవరకొండ కరుణాకర్ నగల దుకాణం షట్టర్ల తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించింది. 100 గ్రాముల బంగారు ఆభరణాలు (చైన్లు, గుండ్లు, గొట్టాలు)తోపాటు రూ.40వేల నగదు చోరీ చేసింది. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజీల సాయంతో మహిళాదొంగగా నిర్ధారించారు. ఆ తర్వాత తిరుమలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బహిర్గతమైంది. నగదులో రూ.12వేలను అవసరాలకు వినియోగించుకుంది. మిగతా రూ.28వేలతోపాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల సాయంతోనే నిందితురాలిని 24గంటల్లోగా పట్టుకున్నామని, వీటి ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశం, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు ప్రభాకర్, అనిల్కుమార్, రాజు, రమేశ్ను అభినందించి ప్రోత్సాహకాలు అందించారు. మహిళా దొంగను పట్టించిన సీసీ కెమెరాలు ఆభరణాలు, నగదు రికవరీ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్ -
నాలుగు ఇళ్లలో చోరీ
మానకొండూర్: అన్నారం గ్రామంలో మంగళవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గొట్టెముక్కుల విజయ ఇంట్లో నిద్రిస్తుండగా.. బంగారు పుస్తెల తాడు అపహరించారు. మధునాల వెంకటమ్మ ఇంట్లో 55 తులాల వెండి, రూ.20వేల నగదు, రుద్రోజు వెంకటాచారి ముప్పావు తులం బంగారం, 18 తులాల వెండి పట్టీలు, పాకాల రాజిరెడ్డి ఇంటి ఎదుట ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, క్లూస్ టీం పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మిర్చి యార్డులో.. తిమ్మాపూర్: మండల కేంద్రంలోని మిర్చియార్డ్లో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు దొంగిలించారని యజమాని శ్రీనివాస్, అంజయ్య తెలిపారు. ఇద్దరు దొంగలు రాత్రివేళ చోరీకిపాల్పడినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని శ్రీనివాస్, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్టీంకు సమాచారం అందించగా సీఐతో సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలను సేకరించి విచారణ చేపడతామని తెలిపారు. -
సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం
● ఉగాది పండుగ నుంచి అందజేసేందుకు నిర్ణయం ● రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం ● కార్యాచరణ రూపొందిస్తున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని తెల్లరేషన్కార్డుదారులకు ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం అవసరమైన ముందస్తు కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఒకేసారి సన్నబియ్యం పేదలకు అందించేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఈమేరకు జిల్లా సివిల్ స్లయీస్ అధికారి రాజేందర్ డీలర్లు, రైస్మిల్లర్లతో ఇటీవల సమావేశమయ్యారు. బియ్యం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గోదాంల నుంచి లారీల ద్వారా నేరుగా రేషన్ డీలర్లకు సన్నబియ్యం సరఫరా చేసేలా సూచనలు ఇచ్చారు. ఉచితంగానే సన్నబియ్యం.. జిల్లాలోని పేద కుటుంబాలకు రేషన్కార్డు ద్వారా ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ చేస్తారు. తద్వారా నిత్యావసరాలపై పేదలు చేసే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పటికే కేవైసీ పూర్తిచేసిన తెల్లరేషన్కార్డుదారులు అందరికీ ఈ పథకం ద్వారా వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందుతాయి. ప్రతినెలా 3,852 మెట్రిక్ టన్నులు అవసరం.. జిల్లా వ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,19,382 తెల్లరేషన్కార్డుల ద్వారా ప్రతినెలా రేషన్బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీనెల సుమారు 3,852 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈమేరకు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలోని స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా సమాచారం రేషన్కార్డులు 2,19,382 అన్నపూర్ణ 175 అంత్యోదయ 12,297 రేషన్దుకాణాలు 413 నెలకు అవసరమయ్యే సన్నబియ్యం(మె. ట) 3,852 శుభపరిణామం మాలాంటి పేదలకు ఉగాది నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు దీనిద్వారా పౌష్టికారం అందుతుంది. – పత్తి మల్లారెడ్డి, లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్ డీలర్లకు సరఫరా చేస్తున్నాం తెల్లరేషన్కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు ఇప్పటికే సన్నబియ్యం సరఫరా ప్రారంభించాం. – రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
జాతీయ పోటీలకు ఎంపిక
వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అరిగెల వైశాలి జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 9న హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వరకు యూపీలోని లక్నోలో జరిగే 47వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఎండపల్లి నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంపై మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, వెంకటరమణారెడ్డి వైశాలిని అభినందించారు. -
వనరుల దోపిడీని ఆపాల్సిందే..
పెద్దపల్లిరూరల్: దేశంలోని బడా కార్పొరేట్శక్తులకు సహజవనరుల సంపదను దోచుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నక్కనారాయణరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని కోట్లాది రూపాయల విలువైన అటవీసంపదను కార్పొరేట్శక్తులకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కార్ చేస్తున్న యత్నాలను విరమించుకుని వనరుల దోపిడీని ఆపాల్సిందేనన్నారు. ఆదివాసీలపై అరాచకం.. అటవీ సంపదను దోపిడీ చేసేకుట్రలో భాగంగానే పసిగుడ్డు మొదలు పండుముదుసలి వరకు అందరిపైనా దాడు చేస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలను సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాపాడి వారికి అండగా ఉండేందుకు అన్నివర్గాల ప్రజలు, దళితులు, మేధావులు రక్షణగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్లో ఆదివాసీల హననాన్ని ఆపేయాలని, మహిళలపై అత్యాచారాలను నిలిపేయాలని, దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు. కరీంనగర్లో ఏప్రిల్ 20న సభ.. ఆదివాసీహక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న కరీంనగర్లో బహింరగసభ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు ప్రకటించారు. ఈవేదిక కన్వీనర్లుగా ప్రజాసంఘాల నేతలు ముడిమడుగుల మల్లన్న, మర్రి వెంకటస్వామి, తాళ్లపల్లి లక్ష్మణ్, వెంకటమల్లయ్య, రాజమల్లయ్య, రామిళ్ల బాపు, జిన్నంప్రసాద్, లెనిన్, బాలసాని రాజ య్య, దండు అంజన్న, బాపన్న, సతీశ్, సృజన్, టీపీఎఫ్ జిల్లా క న్వీనర్ గుమ్మడి కొమురయ్య, రాజగోపాల్, రత్నకుమార్, విశ్వనాథ్కు బాధ్యతలను అప్పగించినటుల పేర్కొన్నారు. నాయకులు సదానందం, శ్రీనివాస్, వెంకన్న, రాజమల్లన్న, బాపన్న, ర వి, రవీందర్, సదానందం, వినోద్, సంపత్ పాల్గొన్నారు. అడవులను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర ఆదివాసీ మహిళలపై అత్యాచారాలను ఆపండి దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తివేయండి పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ కరీంనగర్లో ఏప్రిల్ 20న బహిరంగసభ -
ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ‘ఇచ్చట లింగనిర్ధారణ చేయరు.. ఇలా చేయడం కూడా చట్టరీత్యా నేరం’ అని రాసిన బోర్డులను అందరికీ కనిపించేలా డయాగ్నొస్టిక్ కేంద్రాల ఎదుట అమర్చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మంగళ వారం పట్టణంలోని పలు డయాగ్నొస్టిక్ కేంద్రాల ను తనిఖీ చేశారు. పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైద్య పరీక్షల కోసం వచ్చేవారినుంచి నిబంధనల ప్రకారమే ీఫీజుల వసూలు చేయాలని ఆమె సూచించారు. ఫీజుల వివరాలను తెలిపే పట్టికలను కూడా ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డులపై అంటించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను సైతం తనిఖీ చేసిన డీఎంహెచ్వో.. అగ్నిమాపక పరికరాలను అమర్చుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ లింగనిర్ధారణ చేయొద్దు నిబంధనల మేరకు ఫీజు వసూలు చేయాలి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్నకుమారి ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు -
ప్రభుత్వాలు సంపన్నుల కోసమేనా?
కోల్సిటీ(రామగుండం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నుల కోసమే పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత టీ జంక్షన్లోని అంబేడ్కర్, రాజేశ్ థియేటర్ కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహాలకు జాన్వెస్లీతోపాటు బొజ్జా బిక్షమయ్య, భూపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బల్దియాకు చేరుకుని ఆయన మాట్లాడారు. బల్దియాలో సీపీఎం భూపోరాటం ద్వారా 600 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇప్పించామన్నారు. వీరందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు, ఇంటి నంబర్లు ఇవ్వాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పింఛన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఆయన చేశారు. సింగరేణి, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అనంతరం బల్దియా డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామికి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు వై.యాకయ్య, వే ల్పుల కుమారస్వామి, ఎ.ముత్యంరావు, ఎం. రామాచారి, సారయ్య, శ్రీనివాస్, శంకర్, బిక్షపతి, శైలజ, గణేశ్, జ్యోతి, రవీందర్, అశోక్, నాగమణి, ఎ.మహేశ్వరి, ఉపేందర్, సంజీవ్, లక్ష్మారెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం నాయకులు జాన్వెస్లీకి స్వాగతం పలికి బైక్ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి –కూనారం మార్గంలోని రైల్వేక్రాసింగ్ వద్ద చేపట్టిన రైల్వే వంతెన పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. నాయకులు ముత్యంరావు, భూపాల్, భిక్షమయ్య, రమేశ్, అశోక్, రవీందర్, జ్యోతి, శ్రావణ్, ప్రశాంత్, దిలీప్, నవీన్, వెంకటస్వామి, ఖాజా, రాజమల్లు, సాగర్ పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు కూడా ఇవ్వడంలేదు తక్షణమే ఇంటినంబర్లు, పట్టాలివ్వాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రామగుండం బల్దియా ఎదుట ధర్నా -
ఆదాయం పెంచేలా ప్రణాళికలు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ఆదాయాన్ని పెంచేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. దుబారా ఖర్చులు తగ్గించి పట్టణాభివృద్ధికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆదాయవనరులు పెరిగితేనే ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. పన్నులను నూరుశాతం వసూలు చేయాలని, వార్డుల వారీగా అధికారులు, సిబ్బందిని నియమించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పన్నుల పెంపుపై అవసరమైనచోట రీ అసెస్మెంట్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
గంజాయి నియంత్రణకు పటిష్ట నిఘా
● పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ గోదావరిఖని: గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ సూచించారు. కమిషనరేట్లోని పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలని సీపీ సూచించారు. వివిధ కార్యకలాపాలపై ముందస్తు సమాచారం ఉండాలని, ప్రతీ కేసులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరపాలని తెలిపారు. అనంతరం గంజాయి స్వాధీనం కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, పెద్దపల్లి, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేశ్, కృష్ణ, మల్లారెడ్డి, ప్రతాప్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణ కరువైంది
పార్క్ల నిర్వహణపై మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. సాయంత్రమైతే మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. పిల్లలు, మహిళలు అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. – శ్రీనివాస్, పెద్దపల్లి నిర్వహణ విస్మరించారు సుమారు రూ.3కోట్లకుపైగా వెచ్చించి నగరంలో పార్క్లు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ బాధ్యతలు విస్మరించారు. దీంతో చిన్నపిల్లలు ఆడుకునే ఆట పరికరాలు విరిగిపోయాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వెంటనే కొత్త పరికరాలు అమర్చాలి. – ఎండీ ఇబ్రహీం, గోదావరిఖని -
బీఆర్ఎస్ పాలనలోనే నష్టం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గత బీఆ ర్ఎస్ పదేళ్ల పాలనలోనే సింగరేణితో పాటు కార్మికులకు నష్టం జరిగిందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ విమర్శించారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం బొగ్గు గనుల వే లం పాటలో పాల్గొనకపోవడంతోనే ఒక్క బొగ్గుగని రాలేదన్నారు. రూ.35వేల కోట్ల విద్యుత్ బకాయిలను సింగరేణికి చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఏటా 70 మిలియన్ల బొ గ్గు ఉత్సతి చేయడంతోపాటు కార్మికుల సంక్షేహానికి తమ యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం ఏఐటీ యూసీ నాయకులు ఐఎన్టీయూసీలో చేరారు. నాయకులు శంకర్ నాయక్, నరసింహారెడ్డి, ఽధర్మపురి, ఎండీ అక్ర మ్, వికాస్ కుమార్, సత్యనారాయణరెడ్డి, సంపత్రెడ్డి, నవీన్, మల్లేశ్, సదానందం, మోహన్, కనకయ్య, మార్కండేయ పాల్గొన్నారు. ఒప్పందాన్ని అమలు చేయాలి జ్యోతినగర్(రామగుండం): కార్మికుల సమస్య ల పరిష్కారానికి గతంలో కుదుర్చుకున్న ఒ ప్పందాన్ని అమలు చేయకపోగా సమస్యను జఠిలం చేస్తున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఒప్పందం జరిగిన అంశాలను పరిష్కరించకపోతే శనివా రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కదంబాపూర్ క్వారీలో విచారణ సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కదంబపూర్ లోని క్వారీలో ఆర్డీవో గంగయ్య, మైనింగ్ ఏడీ శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ మంగళవా రం విచారణ చేపట్టారు. సర్వే నంబర్లు 507, 508లోని కేఎస్ఆర్ క్వారీలో అనుమతికి మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని తమకు ఫిర్యా దు అందిందని ఆర్డీవో తెలిపారు. దీంతో విచారణ చేశామన్నారు. తహసీల్దార్ రాంచందర్రావు, గిర్దావర్ వినోద్ పాల్గొన్నారు. పత్తి క్వింటాల్ రూ.7,124 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,124 ధర పలికింది. కనిష్టంగా రూ.5,011, సగటు రూ.6,761 ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పలువురు రైతుల నుంచి 384 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్ల ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించాలి పెద్దపల్లిరూరల్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఇచ్చిన గడువును మరోనెల రోజులపాటు పొడిగించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎరుకల రమేశ్ కోరారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, పలుకారణాలతో అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసు కోలేక పోతున్నారని పేర్కొన్నారు. గడువును పొడిగిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం చొరవ చూపాలని ఆయన కోరారు. సఖి కేంద్రానికి మహిళ తరలింపు పెద్దపల్లిరూరల్: మతిస్థిమితం లేనిమహిళను మంగళవారం సఖికేంద్రానికి తరలించారు. అ డ్మినిస్ట్రేటర్ స్వప్న, సిబ్బంది ప్రత్యేక వాహనంలో బాధితురాలిని తరలించారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ ఇచ్చిన సమా చారంతో జిల్లా సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్ ఆ మహిళను సఖి కేంద్ర సిబ్బందితో తరలించారు. ఆ తర్వాత హైదరాబా ద్లోని అమ్మనాన్న ఆశ్రమానికి తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో విజయం మాదే
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి పెద్దపల్లిరూరల్: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. తె లంగాణలోనూ ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కమిటీ ఖరారు.. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రే ణులను సమాయత్తం చేస్తున్నామని సంజీవరెడ్డి అన్నారు. పార్టీ పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఖరా రు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్, కాసగోని ని ర్మల(పెద్దపల్లి), ముస్కుల భాస్కర్రెడ్డి(రామగుండం), మత్స్యగిరి రాము(మంథని)ను నియమించామన్నారు. ప్రధానకార్యదర్శులుగా కడారి అశోక్రావు, పల్లె సదానందం(పెద్దపల్లి), కోమళ్ల మహేశ్(రామగుండం), కార్యదర్శులుగా జంగ చక్రధర్రెడ్డి, మౌఠం నర్సింగం, మహేందర్, కంకణాల జ్యోతిబసు, బిరుదు గట్టయ్య, అధికార ప్రతినిధులుగా శనిగరపు రమేశ్, పిలుమర్రి సంపత్, జక్కుల నరహరిని నియమించామన్నారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా పిన్నింటి విశా ల్, కిసాన్మోర్చా అధ్యక్షుడిగా గూడెపు జనార్దన్రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చాతరాజు రమేశ్, దళిత మోర్చా అధ్యక్షుడిగా మచ్చవిశ్వాస్తోపాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను నియమించామని ఆయన వివరించారు. -
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ ఖని న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. ము న్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వా జి శ్రీనివాస్, కమిటీ కార్యవర్గ సభ్యులు గోసిక ప్రకాశ్, పులిపాక ప్రవీ ణ్కుమార్, వరలక్ష్మి, చందాల శైలజ, గొర్రె రమేశ్, అరుణ్, రాజేశ్, వెంకట్, రంగు శ్రీనివాస్, నూతి సురేశ్, సహనవాజ్, రవీందర్, ప్రసన్న, అంజలి తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళా పెద్దపల్లిరూరల్: జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 27న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. అపోలో ఫార్మసీలో 50 ఫార్మసిస్టు, ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ట్రేనీ పో స్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు 82476 56356, 89853 36947లో సంప్రదించాలన్నారు. -
మిగిలింది కొద్దిరోజులే..
● 31 వరకు సీపీఆర్ఎంఎస్ గడువు గోదావరిఖని: వైద్యచికిత్సలపై రిటైర్డ్ కార్మికు లు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం క్యాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ స్కీం(సీపీఆర్ఎస్)ను 2018 నుంచి అమలు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రిటైర్డ్ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు మరోసారి గడువు విధించింది. సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది. స్కీంలో 35 వేల మంది చేరిక.. పథకం ప్రారంభించిన సుమారు ఏడేళ్లలో దాదా పు 35 వేల మంది రిటైర్డ్ కార్మికులు ఇందులో చే రారు. ప్రతీసభ్యుడు రూ.40వేలు చెల్లిస్తే.. యాజమాన్యం మరో రూ.18వేలు కలిపి ఈ పథకం కింద జమచేస్తోంది. దీనిద్వారా రిటైర్డ్ కార్మికుడు, అతడి భార్య తమ జీవితకాలంలో గరిష్టంగా రూ.8లక్షల వరకు వైద్య సదుపాయం పొందే వీలుంది. అత్యవసర పరిస్థితుల్లో నగదు చెల్లించి వైద్య చికిత్స పొందినా ఆ తర్వాత బిల్లులు క్లెయి మ్ చేసుకునే వీలు కల్పించారు. ప్రాణాంతక, దీర్ఘకాలిక, కాన్సర్ లాంటి వ్యాధులకు గరిష్ట పరిమితి ఏమీ లేదు. మలిదశలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది. సీపీఆర్ఎంఎస్ వివరాలు.. పథకంలో చేరిన సభ్యులు 35,000 జమైన సొమ్ము(రూ.కోట్లలో) 400 రిటైర్డ్ కార్మికుల వాటా(రూ.కోట్లలో) 250 యాజమాన్యం వాటా(రూ.కోట్లలో) 150 గతేడాది వైద్యం కోసం చెల్లించిన సొమ్ము(రూ.కోట్లలో) 90 -
● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు ● రాజీవ్ యువ వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం ● రేషన్కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్లే ● లబోదిబోమంటున్న లబ్ధిదారులు
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖా స్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. కొత్త కార్డులొస్తాయని ఆశతో... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
పోలీస్ బాస్.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
● కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ టీంల రద్దు ఎల్ఆర్‘ఎస్’ మేళా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించి 25శాతం రాయితీ పొందడంతోపాటు తమ భూ ములు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందు కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని వేలాది మంది అర్జీదా రులు రుసుం చెల్లించేందుకు బల్దియాల్లో బారులు తీరుతున్నారు. పెద్దపల్లిలోని మేళా వద్ద క్యూకట్టిన అర్జీదారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిగోదావరిఖని: చోరీల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్ర మాదాలను అదుపు చేయడం.. మొత్తంగా శాంతి భద్రతల పరిక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన రెండురోజులకే రైల్వే, బస్స్టేషన్లు, బొగ్గు చోరీలు జరిగే ప్రాంతాలను ఆయన అర్ధరాత్రి ప రిశీలించారు. పోలీసుశాఖ ప్రక్షాళనకూ నడుం బి గించారు. కమిషనరేట్లో కీలకమైన టాస్క్ఫోర్స్ టీంలను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ కమిషనర్ ఝా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులోని అధికారులు, సిబ్బందిని సొంత ప్రాంతాలకు పంపించి వేశారు. మహిళల భద్రతపైనా ప్రత్యేక దృష్టి మహిళల రక్షణ, భద్రతపైనా పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందుకోసం కాలేజీల్లో ఈవిటీజింగ్, పలు రద్దీ ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను నియమించాలని నిర్ణయించారు. బ్లాక్స్పాట్లపై చర్యలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లపై సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాదారులను అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డుల ఏర్పాటు, రాత్రిపూట స్పష్టంగా కనిపించే డేంజర్ రేడియం స్టిక్కర్లు అతికించాలని ఆదేశాలిచ్చారు. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, స్పీడ్గన్లతో నిఘా పెంచడం, రోడ్లపై రిఫ్లెక్టింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు సీరియస్గా ముందుకు రామగుండం కమిషరేట్ పరిధిలో గంజాయి, ఇతర మారకద్రవ్యాలను కట్టడిచేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎంతటి వారున్నా ఊరుకోబోమని, సీరియస్గా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యం మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మా లక్ష్యం. టాస్క్ఫోర్స్ టీంలను ఎత్తివేశాం. ప్రమాద, గంజా యి రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇదే సమయంలో యువత ఉపాధిపై దృష్టి సారిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా – పోలీస్ కమిషనర్, రామగుండం -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
పెద్దపల్లిరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన పలువురు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ● అడిషనల్ కలెక్టర్ వేణు ప్రభుత్వ, అద్దె గోదాముల్లో టెండర్లతో జరిగే పనులు చేస్తున్న హమాలీలకు పనిభద్రత, ఈ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం కాంట్రాక్టర్, గోదాం యజమానులు, అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. – తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నేతలు సుమారు 300మంది రైతులతో కలిసి పెద్దపల్లి ఎఫ్ఈడీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ స్థాపించాం. ఈ ప్రాంతంలోని రైతులు పండించిన ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసే అవకాశం మాకు ఇవ్వండి. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – ఎర్రం మల్లారెడ్డి, ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ ఫేజ్–2తో ఇబ్బంది అంత్యోదయ కార్డు మంజూరు చేయండి నాకు రేషన్ కార్డు ఉంది. దీనిపై ఆరుకిలోల బియ్యం ఇస్తున్నారు. అంత్యోదయ కార్డుకు నాకు అన్ని అర్హతలున్నాయి. విచారణ జరిపి అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలి. – శేషగిరిరావు, గోదావరిఖని పరిహారం ఇప్పించండి జాతీయ రహదారి కింద పోయిన మా భూమి కి ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలి. రెండో కిస్తీ పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – విజయలక్ష్మి, నాగమణి, లక్కారం, మంఽథని మండలం భద్రత కల్పించండి ధాన్యం కొనుగోళ్లకు అవకాశమివ్వండి -
రైతులకు పరిహారం ఇవ్వండి
పెద్దపల్లిరూరల్: తన నియోజకవర్గంలో అకా ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. హైదరాబాద్లో సోమవారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందించారు. వరి, మొక్కజొన్న, కూరగాయల రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలిపారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సర్వేచేసి పంట నష్టం అంచనా వేశారని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందించాలని సీఎంను అభ్యర్థించారు. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పరీక్ష కేంద్రం తనిఖీ ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ రమేశ్, డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతకు అభినందన పెద్దపల్లిరూరల్: కాసులపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లారెడ్డి జాతీయస్థాయి అవార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మల్లారెడ్డిని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డితో కలిసి అభినందించారు. సాగు విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుడి సాధించేలా ఆధునిక పద్ధుతులను అవలబించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు విద్యార్థిని ఎంపిక ముత్తారం(మంథని): ధర్యపూర్ మోడల్ స్కూ ల్ విద్యార్థిని మెట్టు హాసిని మల్లేషియాలో మే 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది. ఆమెను ప్రిన్సిపాల్ సంతోష్, ఉపాధ్యాయులు సోమ వారం అభినందించారు. హాసిని తల్లిదండ్రులు నర్సింగం, దేవి మంథనిలో నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కరాటే అంటే తనకెంతో ఇష్టమని హాసిని చెబుతోంది. ‘టీబీ ముక్త్ భారత్’ సాధిద్దాం పెద్దపల్లిరూరల్: క్షయ నిర్మూలనపై ప్రజలు అ వగాహన పెంపొందించుకోవాలని జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమా రి సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్భారత్ సాధించేలా ప్రణాళిక రూపొందించిందన్నారు. 100రోజుల పాటు నిర్వహించిన నిక్షయ్ శిబిర్ ద్వారా 1,32,944 మందికి పరీక్షలు నిర్వహించి 14,723 మందిని అనుమానితులుగా గుర్తించామని వివరించారు. వారిలో 502 మందిని వ్యాధిగ్రస్తులుగా గుర్తించి మందులు అందించామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు. ప్రోగ్రాం అధికారి సుధాకర్రెడ్డి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్కుమార్, శ్రవణ్కుమార్, రెడ్క్రా స్ సొసైటీ కన్వీనర్ రాజగోపాల్ పాల్గొన్నారు. -
బోర్డులున్నాయి.. మైదానాలే లేవు
పల్లెల్లోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వెలుగులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఊరూరా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, కొందరు అధికారులు.. రూ.లక్షలు వెచ్చించి గ్రామాల్లో హడావుడిగా బోర్డులు ఏర్పాటు చేశారు.. ఇవే క్రీడా ప్రాంగణాలు అని ప్రకటించారు. స్పోర్ట్స్ కిట్లు గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయాలకు చేరినా కొన్ని కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పుడైనా క్రీడామైదానాల్లో సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకు రావాలని క్రీడాకారులు కోరుతున్నారు. – సుల్తానాబాద్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అ న్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే విజయరమణరావు భరోసా ఇచ్చారు. భోజన్నపేట, చీకురాయి, హన్మంతునిపేట, రాంపల్లి గ్రామాల్లో వ డగళ్లకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కాలువ చివరి ఆయకట్టుకూ సా గునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. డీఏవో ఆదిరెడ్డి, ఏవో అలివేణి, రైతులు, నాయకులు ఉన్నారు. ఉదయ్నగర్లో కమాన్ ప్రారంభం జిల్లా కేంద్రంలోని ఉదయ్నగర్ కాలనీకి వెళ్లే ప్ర ధాన రోడ్డుపై మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, సురేందర్ సొంత డబ్బు వెచ్చించి ని ర్మించిన ప్రవేశద్వారం (కమాన్)ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. రైతులను ఆదుకుంటాం జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం జూలపల్లి, కోనరావుపేట, ఎలిగేడు మండలం ధూళికట్టలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా -
ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు మంథని: ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి రూ.3వేల కోట్లకు పైగా బడ్జెట్లో నిధులు కేటాయించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తా ర్ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం అమలు చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, కొండ శంకర్, కొత్త శ్రీనివాస్, పెండ్రు రమాదేవి, మూల సరోజన, మంథని సురేశ్, ఆజీంఖాన్, ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
13 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సిందే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏ ర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పి లుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వ ర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తారని వెల్లడించారు. కేసీఆర్కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్పోస్టులు పె ట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటారో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా ఆదుకునేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్లే. కేసీఆర్ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జోష్ నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్కు ఘనస్వాగతం పలి కిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనా రాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరి సిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పె ద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెక్పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు : గంగుల ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు : ఈశ్వర్ కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు : వినోద్కుమార్ జోష్ నింపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ, సమావేశం -
ఉగాది ఉత్సవాలకు రండి
కమాన్పూర్(మంథని): మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న నిర్వహించే ఉగాది ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆదివారం మంథని పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్బాబును ఆలయ ఈవో కాంతరెడ్డి తదితరులు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. బీసీ కులగణన చారిత్రకం ధర్మారం(ధర్మపురి): బీసీ కుల గణన చారిత్ర కమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. బీసీ కుల గణన చేపట్టి, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన విప్కు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. అనంతరం ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కృతజ్ఞత సభ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, లావుడ్య రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. రేపు ‘ఆర్టిజన్ల గర్జన’ పెద్దపల్లిరూరల్: ఆర్టిజన్ల సమస్యలను ప్రభు త్వం సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టను న్న ఆర్టిజన్ల గర్జన సభను విజయవంతం చే యాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని ఆయ న పేర్కొన్నారు. విద్యార్హతలను బట్టి సబ్ ఇంజినీర్, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీ స్ సబార్టినేట్ పోస్టుల్లో భర్తీ చేయాలని ఆయన అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విన్నవించామని ఆయన గుర్తుచేశారు. పోరాటాలతోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుగోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకోసం పోరాటాలకు సిద్ధం కా వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ కోరారు. ఆదివారం కాంట్రాక్టు కార్మిక సంఘం సమావేశాన్ని ఆ సంఘం బుర్ర తిరుపతి అధ్య క్షతన నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వేతనాలను పెంచాలన్నారు. ఈఎస్ఐ వేతనాలు అమలు చేయాలని, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, సెలవులను వర్తింపజేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ అక్బర్అలీ, ఇన్చార్జి ముస్కే సమ్మయ్య, నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, యర్రగాని కృష్ణయ్య, కిష్టఫర్, రాజరత్నం, చంద్రమౌళి, గౌస్, జెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలో కురిసిన వడగళ్లకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అసెంబ్లీ ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాధికారులతో పంట నష్టంపై సర్వే చేయించి ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సామర్థ్యానికి మించి..
మంథని: అసలే ప్రైవేట్ వాహనాలు.. ఆపై అస్తవ్యస్తమైన రహదారులు.. అనేక మూలమలుపులు.. నిబంధనలు సరిగా అమలుకు నోచుకోవు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నాయి.. అనూహ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పలు రోడ్డు ప్రమాదాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఆటోలు, టాటా ఏస్ వాహనదారులు ప్రయాణికుల తరలింపులో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లాలో ని పెద్దకల్వల వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. శనివారం మంథని మండలం నాగెపల్లి వద్ద వ్యవసాయ కూలీలను తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 16 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. సౌకర్యం లేక.. తప్పనిసరై.. ప్రతీవ్యవసాయ సీజన్లో కూలీ పనుల కోసం పొరుగు జిల్లాలకు వెళ్లే వారు అనేకమంది ఉంటారు. అంతేగాకుండా స్థానికంగా పని లభించని పరిస్థితుల్లో మరికొందరు కూలీలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలివెళ్తున్నారు. ఇంకా కొందరు కొరత ఉన్న ప్రాంతాలకు వెళ్లడం సహజం. మిర్చి ఏరేందుకు వెళ్తూ.. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం, గాదంపల్లి, పెద్దతూండ్ల తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున మిర్చి సాగవుతోంది. అక్కడ కూలీల కొరత ఉంది. దీంతో సమీప గ్రామాల నుంచి కూలీలు.. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో అక్కడకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. టాటా ఏస్ లాంటి వాహనంలో 10 నుంచి 12 మందిని తరలించాల్సి ఉండగా 20 మందిని తరలిస్తున్నారు. అలాగే ఐదు, ఆరు సీట్ల సామర్థ్యం గల ఒక్కో ఆటోలో 15 మందిని తరలిస్తున్నారు. మిర్చి ఏరే ప్రాంతాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యం ఏమీలేదు. కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ, ఇతర వాహనాల సౌకర్యం ఉన్నా.. సమయానికి అందుబాటులో ఉండవు. తప్పనిసరి పరిస్థితిల్లో.. అదికూడా ప్రమాదకరమని తెలిసినా.. వ్యవసాయ కూలీలు ఆటోలు, టాటా ఏస్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కండిషన్ లేదు.. పర్యవేక్షణ లోపం నిత్యం ప్రయాణికులను చేరవేసే ప్రైవేట్ వాహనా ల కండిషన్ను పర్యవేక్షించాల్సిన అధికారులు ప ట్టించుకోవడంలేదు. పరిమితికి మించి ప్రయాణికు లు, విద్యార్థులను తరలిస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నా రు. ఫిట్నెస్ లేకున్నా, మరమ్మతుల్లోని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా తనిఖీలు చేయరు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనదారులు ఆటోలు, టాటా ఏస్లలో పరిమితికి మించి ప్రయాణం తరచూ ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోతున్నా పట్టని యంత్రాంగం బోల్తాపడిన ఆటో కమాన్పూర్(మంథని): మండల కేంద్రంలోని పిల్లిపల్లె గ్రామంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడిపోయింది. జూలపల్లి గ్రామానికి చెందిన అరుణ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో పిల్లిపల్లె గ్రామంలో రేణుక ఎలమ్మ ఆలయానికి బయలు దేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆటో పిల్లిపల్లెలోని మూలమలుపు వద్దకు చేరగా.. కుక్క అడ్డురావడంతో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన కందకంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆధ్యాత్మికం.. పర్యాటకం
● టూరిజం స్పాట్గా గోదావరి తీరం ● సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి ● రూ.3 కోట్లు వెచ్చించనున్న సింగరేణిగోదావరిఖని: మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిపై రెండు వంతెనలు నిర్మించారు. గోదావరి తీరంలోనే ప్రతీ రెండోళ్లకోసారి సమ్మక్క– సాలరమ్మ జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలోనే పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారు. వీరికోసం పుష్కరఘాట్ నిర్మిస్తారు. ఇక్కడి శివుని విగ్రహం, పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు. గిరిజన దేవతల జాతర నిర్వహణకు ఆధునిక హంగులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. ఎండోమెంట్ పరిధిలోకి.. మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గిరిజన జాతరకు వస్తున్నారు. దీంతో 1998లో జాతర ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లింది. అయితే, అభివృద్ధికి నోచుకోక పోగా.. గోదావరి బ్యాక్వాటర్తో అమ్మవార్ల గద్దెలు నీట మునుగుతున్నాయి. దీనిని అధిగమించేందుకు సింగరేణి సంస్థ ఓబీ మట్టిని లోతట్టు ప్రాంతాల్లో నింపి సుమారు 2 మీటర్ల ఎత్తున గద్దెలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. ఇదేసమయంలో నదీతీరంలోని పుష్కరఘాట్ను సుందరంగా తీర్చిదిద్ది పైపులైన్లు నిర్మిస్తుంది. గ్రిల్కూడా బిగిస్తుంది. శ్మశానవాటిక కనిపించకుండా.. సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణం సమీపంలోనే హిందూ శ్మశానవాటి ఉంది. ఇది భక్తులకు కనిపించకుండా దాదాపు 200 మీటర్ల పొడవున ప్రహరీ, సుమారు 600 మీటర్ల పొడవున సీసీరోడ్లు నిర్మిస్తారు. భక్తులు సేదతీరడంతోపాటు వంటలు తయారు చేసుకునేందుకు వీలుగా పెద్ద షెడ్లు నిర్మించనున్నారు. వచ్చే రెండు నెలల్లోగా ఈపనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. 1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభం గోదావరిఖని శివారులోని గోదావరి తీరంలో 1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. ప్రతీ రెండేళ్లకోసారి మేడారంలో నిర్వహించే జాతరకు వేల సంఖ్యలో సింగరేణి కార్మికులు తరలివెళ్లేవారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రప్రభావం పడేది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం.. గోదావరి తీరంలోనే గిరిజన దేవతల జాతర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్లకోసారి మేడారం నుంచి కోయ పూజారులను రప్పించి జాతర నిర్వహిస్తోంది. ఇలా సుమారు 33 ఏళ్లుగా ఇక్కడ జాతర వైభవంగా జరుగుతోంది. 25వేల మంది భక్తులతో ప్రారంభమైన జాతర 5లక్షల మందికి చేరుకుంది.సింగరేణి సంస్థ కేటాయించిన నిధులు(రూ.లక్షల్లో)సీసీరోడ్లు 64 పుష్కరఘాట్ 25 పుష్కరఘాట్ రెయిలింగ్ 19.50 పుష్కరఘాట్ గదుల అభివృద్ధి 5.26 రిటర్నింగ్ వాల్ 42.50 ఓపెన్షెడ్(సమ్మక్క గద్దెల వెనకాల) 52 షాబాదిబండతో గద్దెల వద్ద ఫ్లోరింగ్ 34 ఓపెన్షెడ్(గద్దెల కుడివైపు) 43 నదీ తీరం.. ఇక పర్యాటకం గోదావరి నదీతీరాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చుదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ ఆధ్వర్యంలో గోదావరితీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఎకోపార్క్, రోడ్లు, షెడ్ల నిర్మాణం, జీడీకే–5 ఓసీపీ వద్ద రూ.98 లక్షల వ్యయంతో చేపట్టిన ఖబరస్తాన్ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 148 మందికి కల్యాణలక్ష్మి, 23 మందికి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నాయకులు మహంకాళి స్వామి, పెద్ద్దెల్లి ప్రకాశ్, పొలసాని శ్రీనివాస్, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, బాలరాజ్కుమార్, శంకర్నాయక్, ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, డీజీఎం(పర్సనల్) కిరణ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాలకు తావిస్తోంది
కొందరు వ్యాపారులు లాభాపేక్షతో అనారోగ్యానికి గురైన వాటిని వధించి విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మేకలు, గొర్రెలను పరిశీలించిన తర్వాతనే స్లాటర్ హౌస్లో వధించాలి. – మార్కపురి సూర్య, వినియోగదారు ప్రాణాలతో చెలగాటమా? బర్డ్స్ఫ్లూకు భయపడి ధర ఎక్కువైనా మటన్ కొంటున్న ప్రజల ప్రాణాలతో వ్యాపారులు, అధికారులు చెలగాటమాడుతున్నారు. మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా? అనేది ఎవరు ధ్రువీకరిస్తున్నారు? మాంసంపై ఎక్కడా మున్సిపల్ స్టాంప్ కనిపించడం లేదు. – ఈదునూరి శంకర్, వినియోగదారు చర్యలు తీసుకుంటాం మాంసం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంచేవారిపై చర్యలు తీసుకుంటాం. రామగుండంలోని స్లాటర్హౌస్ను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. చనిపోయిన మేకలు, వధించిన తర్వాత వ్యర్థాలను నాలాల్లో వేస్తున్న వ్యాపారులపై జరినామా విధిస్తున్నాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా -
టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలి
గోదావరిఖని: తన నియోజకవర్గాన్ని టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గం పరిశ్రమలకు, ఆధ్యాత్మికతకు నిలయమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిరంతరం 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని తెలిపారు. ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రామునిగుండాల గుట్ట, శ్రీత్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయం, గోదావరి నదీపరీవాహక ప్రాంతం ఆధ్యాత్మికతకు సూచికగా ఉన్నాయని అన్నారు. సింగరేణిలోని 7ఎల్ఈపీ బొగ్గు గనిని మైనింగ్ టూరిజంగా గతంలో ప్రకటించినా.. ప్రస్తుతం మూసివేశారని తెలిపారు. దానిని యథావిధిగా కొనసాగించేలా చూడాలని ఆయన కోరారు. పారాగ్లైడింగ్, హట్ బెలూన్స్, మైనింగ్ టూరిజం, టెంపుల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నదీ ప్రాంతంలో బోటింగ్ తదితర ఏర్పాట్లను చేయాలని ఆయన కోరారు. -
రామగుండం బల్దియా క్లీన్పై క్యూసీఐ నజర్
● నగరంలో పర్యటించిన ఢిల్లీ ప్రతినిధుల బృందం కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థను చెత్త రహిత ప్రాంతం(జీఎఫ్సీ)గా అభివృద్ధి చేస్తున్న తీరును ఢిల్లీ నుంచి వచ్చిన క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలిరోజు స్థానిక 21వ, 22వ డివిజన్లలోని పాత రామగుండం, అయోధ్యనగర్లో పర్యటించిన ప్రతినిధులు.. పలు ఇళ్లలో తడి, పొడి చెత్తను సేకరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ఫొటోలను వారు సేకరించారు. స్థానికులతో మాట్లాడి పారిశుధ్యం పనితీరుపై అభిప్రాయాలను తీసుకున్నారు. రహదారులపై వీధి దీపాలు, ఫుట్పాత్లు, రోడ్లపై చెత్త కుప్పలను ప్రతినిధులు పరిశీలించారు. సుమారు వారం నుంచి పది రోజులపాటు క్యూసీఐ ప్రతినిధులు రామగుండం నగరంలోనే ఉంటారని సమాచారం. వీరి వెంట ఎన్విరాల్మెంట్ ఇంజినీరు మధూకర్, అధికారి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సుల్తానాబాద్రూరల్: రౌడీషీటర్లు త మ పద్ధతులు మార్చుకుని సత్ప్రవర్త నతో వ్యవహరించాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్లోని సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్క పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్లతో శనివారం సుల్తానాబాద్ సర్కిల్ కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ప్రజలపై గొడవలు, అల్లర్లు, బెదిరింపులకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా పదేపదే జై లుకు వెళ్తారని, అలాకాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. రౌడీషీటర్లు మళ్లీ గొడవలకు దిగి తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని కోరారు. అందరితో కలిసి సంతోషంగా గడపాలని ఆయన అన్నారు. -
వర్షార్పణం
● 2,627 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం ● 1,514 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట ● 1,084 ఎకరాల్లో ధ్వంసమైన మొక్కజొన్న ● క్షేత్రస్థాయిలో సర్వేచేసిన వ్యవసాయాధికారులు ● పరిహారం అందించాలని అన్నదాతల డిమాండ్ పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవా రం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొ న్న, మామిడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోనే పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధి కారులు గుర్తించారు. జిల్లా మొత్తంగా 1,896 మంది రైతులకు చెందిన సుమారు 2,627 ఎకరాల్లోని వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అత్యధికంగా 1,035 మంది రైతులకు చెందిన 1,514 ఎకరాల్లో వరి, 828 మంది రైతులకు చెందిన 1,084 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలిందని వారు వివరించారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అధికారులు.. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, ఏడీఏ శ్రీనాథ్, ఏవో అలివేణితో పాటు ఏ ఈవోలు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనావేశారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట, హన్మంతునిపేట, చీకురాయి, రాంపల్లి, గౌరె డ్డిపేట, ముత్తారం తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు. అత్యధికంగా వరి 1,514 ఎకరాల్లో నష్టం జరగ్గా, ఆ తర్వాత మొక్కజొన్న 1,084 ఎకరాల్లో నేలవాలిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరో 20 ఎకరాల్లో కూరగాయలు, ఇంకో 10 ఎకరాల్లో పెసర, మిరపలాంటి పంటలు నష్టపోయాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. చేతికందే దశలో.. చేజారింది వరి, మొక్కజొన్న కొద్దిరోజుల్లోనే చేతికి వచ్చేవని, ఈలోగా అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు పాడై తీరని నష్టాన్ని కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడులు సాధిస్తామన్న తమ ఆశలన్నీ అడియాసలయ్యాయని వాపోయారు. అకాల వర్షాలకు పంట నష్టం కలిగి.. దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపాతం వివరాలు జిల్లాలో సరాసరి వర్షపాతం 15.3 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా ధర్మారం మండలంలో 46.8 మి.మీ. వర్షం కురరవగా అత్యల్పంగా 2.2మి.మీ. వర్షపాతం ముత్తారం (మంథని) మండలంలో నమోదైందని ముఖ్యప్రణాళికాధికారి రవీందర్ తెలిపారు. పెద్దపల్లిలో 33.0 మి.మీ., ధర్మారంలో 46.8 మి.మీ., అంతర్గాంలో 27.3 మి.మీ., పాలకుర్తిలో 3.6 మి.మీ., రామగుండంలో 8.1 మి.మీ., రామగిరిలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.ఈ రైతు పేరు గుర్రం సతీశ్. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట స్వగ్రామం. తనకున్న 1.5 ఎకరా లతోపాటు మరో ఆరెకరాలను కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న వేశాడు. శుక్రవారం రాత్రి కురి సిన వడగండ్లకు రెండు పంటలూ నేలవాలాయి. కొద్దిరోజుల్లోనే పంట చేతికొస్తుందని ఆశపడితే ప్రకృతి పగబట్టిందని సతీశ్ వాపోయాడు. -
స్లాటర్హౌస్కు మరమ్మతు చేయండి
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియాలోని స్లాటర్హౌస్ భవన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను ఆమె శనివారం పరిశీలించారు. మల్కాపూర్ శివారులోని పశువధశాల కిటికీలు చోరీకి గురవడంతోపాటు గోడల నుంచి తొలగించిన కిటికీల ప్రాంతాల్లో మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలన్నారు. అనంతరం 39వ డివిజన్ ఖాజీపల్లిలో చేపట్టిన రోడ్డు పనులు, 29వ డివిజన్ బాపూజీనగర్ ప్రధాన రహదారిలో చేపట్టిన నీటిసరఫరా పైప్లైన్ లీకేజీలను పరిశీలించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి నీటికొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాభాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి తదితరులు ఉన్నారు. రాయితీని సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ ధరఖాస్తుదారులు రుసుంలో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ, ఈనెలాఖరుతో గడువు ముగుస్తుందని, ఈలోగా రుసుం చెల్లించాలన్నారు. టౌన్ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ ప్రసాద్, అధికారి నవీన్ పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్రావు
కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నాహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీ– కన్వెన్షన్ ఫంక్షన్హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే గర్భస్రావానికి అనుమతి పెద్దపల్లిరూరల్: గర్భస్రావాన్ని ఇష్టానుసారంగా చేస్తే చర్యలు తప్పవని, ప్రత్యేక పరిస్థితుల్లోనే అనుమతినిస్తారని డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులకు పలు సూచనలు చేశారు. జిల్లా లో 12 ఆస్పత్రులకే అనుమతి ఉందని, అందు లో ఇటీవల ఓ ఆస్పత్రిని సీజ్ చేశామన్నారు. గర్భవతికి మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగే అవకాశమున్నప్పుడు, వైకల్యం గల బిడ్డ పుట్టే అవకాశం ఉన్నప్పుడు, బలత్కా రానికి గురై గర్భం దాల్చినప్పుడే గర్భ స్రావం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలి జ్యోతినగర్(రామగుండం): నీటిని పొదుపుగా వినియోగించాలని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సమంత సూచించారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీలో శనివారం నిర్వహించిన కార్యక్రమాన్ని చందన్కుమార్ సమంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై శిక్షణ, పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎన్.రవీందర్ ‘నీటి ప్రాముఖ్యత –నీటి దినోత్సవం ప్రాముఖ్యత’ అంశంపై ప్రసంగించారు. నీటి సంరక్షణపై ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. జీఎం(ఓఅండ్ ఎం) ఏఆర్ దాస్, జీఎం(ఆపరేషన్స్) కేసీ సింఘారాయ్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ హిందీ పరీక్షకు 7,374 మంది హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి హిందీ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 7,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,374 మంది విద్యార్థులు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్స్వాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారని పేర్కొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శంకర్గంజ్ ప్రాంతంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. విద్యుత్ మరమ్మతు ల నిర్వహణ కారణంగా ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి, మొక్కజొన్న వేసిన. రాళ్లవానకు పంటలన్నీ నేలవాలాయి. చేతికి అందుతుందనుకున్న దశలో తీరని నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఎనగందుల శ్రీనివాస్, రైతు, పెద్దబొంకూర్ పెట్టుబడి కూడా రాదు నాకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. కంకి, పాలుపోసే దశలో ఉండగా వడగండ్లకు పంట నేలవాలింది. దాదాపు రూ.90 వేల దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే పరిహారం అందించాలి. – మల్లెత్తుల బక్కయ్య, రైతు, ధూళికట్ట ప్రభుత్వానికి నివేదిస్తాం అకాల వర్షానికి సుమారు 2,627 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏఈవోలు, క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ వివరాలు సేకరించారు. వివరాలను ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తాం. – ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
రాములోరికి తలంబ్రాలు
జ్యోతినగర్(రామగుండం): కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి సాధారణంగా మరపట్టిన బియ్యం వినియోగిస్తారు. కానీ, శ్రీసీతారాముల కల్యాణం కోసం గోటితో వొలిచిన తలంబ్రాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు గోటితో వొలిచిన తలంబ్రాలను శ్రీసీతారామ కల్యాణం కోసం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈఏడాది కూడా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం మహిళలు గోటితో వొలిచిన తలంబ్రాలను పంపించి భక్తిని చాటుకుంటున్నారు. గోటితో కోటి తలంబ్రాలను వొలిచే ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి, జనగామ రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యుడు చెప్యాల సత్యానారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమానికి శ్రీకారం -
వస్త్రోత్పత్తి ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయాలి
సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లను వెంటనే అందించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా కారుణ్య నియామకపత్రాలు అందించారు. ప్రజా ఆరోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేసే సిరిగిరి నర్సింహులు అనారోగ్యంతో 2020లో మరణించగా.. అతని కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామకపత్రం అందించారు. నగునూరి నాంపల్లి 2023 మరణించగా అతని భార్య నగునూరి లతకు నియామకపత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. అర్హులకు ఓటుహక్కు కల్పించాలి జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ కోరారు. శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,157 మంది పురుషులు, 2,47,977 మంది మహిళా ఓటర్లు, 38 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, సంపత్, రాజన్న, రమేశ్, రమణ, ఎన్నికల సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సందడిగా అల్ఫోర్స్ ‘ఫ్లిక్కర్’
కొత్తపల్లి: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మైదానంలో శుక్రవారం శ్రీఫ్లిక్కర్శ్రీ పేరిట నిర్వహించిన భగత్నగర్ అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ వార్షికోత్సవం సందడిగా సాగింది. వేడుకలను ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.మధుసూదన్రెడ్డితో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 35ఏళ్లుగా అల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తూ తలమానికంగా నిలుస్తున్నామని తెలిపారు. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించిన హర్షిత్రెడ్డి ఇటీవల గేట్–2025లో ఆల్ఇండియా 60వ ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలుకరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నదా లేక రాక్ష స పాలన సాగిస్తున్నదా అని మాజీ స ర్పంచుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరాజం ప్రశ్నించా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ అభివృద్ధి బి ల్లుల విడుదలకు మోకాలడ్డుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ, ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించా రు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా, నిరాశే మిగి లిందని విమర్శించారు. నాయకుల ఎదుట మా సమస్యలు చెప్పుకోవడం తప్పేనా అన్నారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలవడం అనైతికమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆర్ఎఫ్సీఎల్ ఆదాయం రూ.500 కోట్లు!
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ మూతబడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో ఎఫ్సీఐ కర్మగారాన్ని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంగా పేరు మార్చి పునరుద్ధరించారు. 22 మార్చి 2021న రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా కిసాన్ బ్రాండ్ పేరిట వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నులు. 2022 నవంబర్ 12న భారత ప్రధాని నరేంద్రమోదీ ప్లాంటును జాతికి అంకితం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేసిన యూరియాను భారత్ బ్రాండ్తో మార్కెట్ చేస్తున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,941.60 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ.440.96 కోట్ల ఆదాయం(లాభం) సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈక్రమంలోనే ఈసారి రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తగ్గిన దిగుమతుల భారం.. దేశీయంగా ఎరువుల కొరత అధికంగా ఉండడంతో కేంద్రప్రభుత్వం దిగుమతి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్సీఐ), గోరఖ్పూర్(ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్(ఒడిశా) ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరించిన వాటిలో ఉన్నాయి. ఇందులోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం ఎరువుల ఉత్పత్తిని 2021 మార్చి 22న, గోరఖ్పూర్ యూనిట్లో 2022 అక్టోబర్ 18న, సింద్రీ యూనిట్ లో 2022 నవంబర్ 05న ఉత్పత్తి ప్రారంభించారు. తాల్చేర్ ప్లాంట్లో 2025 చివరి నాటికి యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎఫ్సీఎల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా రామగుండం ఎరువుల కర్మాగారంలో రూ.150 కోట్లతో సల్ఫర్ యూరియా ఉత్పత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. దేశీయంగా వంటనూనెల డిమాండ్ అధికంగా ఉండడంతో దాని కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగుకు సబ్సిడీ కల్పించాయి. పామాయిల్ సాగుకు ఉపయోగకరంగా ఉండే సల్ఫర్ కోటెడ్ యూరియాను రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. 7 రాష్ట్రాలకు ఆర్ఎఫ్సీఎల్ యూరియా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాలో 50శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ యూరియా సరఫరా చేస్తున్నారు. ● 50 శాతం యూరియా తెలంగాణ రాష్ట్రానికే -
రోడ్డుప్రమాదాల నియంత్రణే లక్ష్యం
గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ల క్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. శుక్రవా రం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రోడ్డుసేఫ్టీపై సమీక్షించారు. ఎన్హెచ్–63, ఎన్హెచ్–363, ఎ స్హెచ్–1, ఎస్హెచ్–24, ఎస్హెచ్ –8 తదితర రోడ్లను గూగుల్ మ్యాప్ ద్వారా ఆయన పరిశీలించారు. 2022 నుంచి 2024 వరకు జరిగిన ప్రమా దాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల కా రణాలు, నియంత్రణకు తీసుకొన్న చర్యలపై విశ్లేషించారు. బ్లాక్స్పాట్ల వద్ద రేడియం స్టికర్లతో కూ డిన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ ముఖ్యమని సూచించారు. సమాచార వ్యవ స్థను పటిష్టం చేసుకోవాలని అన్నారు. డ్యూటీ సమయంలో సిబ్బంది, అధికారులు స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
కరీంనగర్: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయాలని కుట్రచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. పార్లమెంటుస్థాయిలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకుు తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అప్పుల దేశంగా మారుస్తున్నాడని, గతంలో రూ.80లక్షల కోట్ల అప్పు ఉంటే తాజాగా రూ.150 లక్షల కోట్ల అప్పుచేసి కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందెస్వామి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ అభ్యర్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో శుక్రవారం కార్యవర్గసభ్యుడు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సీపీఐకి గణనీయమైన చరిత్ర ఉందని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, నేటికీ అనేక గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సభ్యులు ఉన్నారని అన్నారు. అదే ఒరవడిని కొనసాగించేందుకు సీపీఐ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైదాపూర్(హుస్నాబాద్): ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండలంలోని గొల్లగూడెంకు చెందిన మర్రి సదానందం (47) మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు శుక్రవారం సైదాపూర్ వెళ్తుండగా బొత్తల్లపల్లి వద్ద మర్రి సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో సదానందం తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది 108లో సదానందంను హుజూరాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతుడి వయస్సు 35–40 మధ్య ఉంటుందన్నారు. నల్లటి జీన్స్ ప్యాంట్, బ్లూ కలర్ ఫుల్షర్టు ధరించి ఉన్నాడన్నారు. తలపగిలి నుజ్జునుజ్జు కావడంతో ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఆయన పేర్కొన్నారు. సంబంధీకులు ఉంటే సెల్ నంబరు 99493 04574, 87126 58604లో సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్: తుమ్మన్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో శుక్రవారం ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్(21) కరీంనగర్ జిల్లా ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండీలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధురాలు అదృశ్యంకొత్తపల్లి(కరీంనగర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్కు ప్రయాణిస్తూ అదృశ్యం అయింది. నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి, ఎత్తు ఐదడుగులు ఉంటుంది. గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె కోసం బంధువులు, పోలీసులు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించడం లేదు. ఆమె కనిపిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ నంబర్లు 9494490268/ 8712670765లకు సమాచారం అందించాలని, వారికి నగదు పారితోషికం ఇవ్వబడుతుందని ఎస్హెచ్వో, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు. -
ఇఫ్తార్కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
శంకరపట్నం(మానకొండూర్): రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందుకు తండ్రికొడుకులు ఏర్పాట్లు చేశారు. అంతలోనే జరిగిన రోడ్డుప్రమాదంలో అసులువుబాసారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మక్త గ్రామానికి చెందిన తండ్రికొడుకులు షేక్ అజీమ్ (35), షేక్ రెహమాన్ (10) శుక్రవారం కేశవపట్నంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి ఇంటికి బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన మందాడి శ్రీనివాస్రెడ్డి, ఇజ్జిగిరి హరీశ్ కూడా కేశవపట్నం నుంచి బైక్పై వెళ్తుండగా వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ కేశవపట్నం బ్రిడ్జి సమీపంలో ఇరువురి బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో అజీమ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. మందాడి శ్రీనివాస్రెడ్డికి తీవ్ర, హరీశ్కు స్వల్పగాయాలయ్యాయి. కేశవపట్నం ఎస్సై రవి, సిబ్బంది 108వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అజీమ్, రెహమాన్ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు, స్థానికులు వంకాయగూడెంలో పట్టుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్జీ, హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి పరిశీలించారు. సాయంత్రం వేళ ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తండ్రికొడుకుల దుర్మరణం స్థానికులను కలచివేసింది. రెండు బైక్లను ఢీకొన్న లారీ తండ్రీకొడుకులు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
ఎక్లాస్పూర్ సందర్శన
మంథని: ఎక్లాస్పూర్లో కొద్దిరోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకెళ్ల.. మిషన్ భగీరథ, గ్రిడ్ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. తాము కనీసం స్నానం చేయడానికి నీరు లేదని, తినే అన్నంలో మట్టి పోస్తారా? మా పరిస్థితిని అర్థం చేసుకోరా? అని గ్రామస్తులు అధికారులకు ఏకరువు పెట్టారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్, డీఈ కిరణ్, మిషన్ భగీరథ డీఈఈ రాజ్కుమార్తోపాటు పలువురు అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి నీటి సరఫరాను పరిశీలించారు. వాల్వ్లో మట్టి, ఇసుక నింపడంతో సమస్య వచ్చిందని వాపోయారు. సమస్య పరిష్కరానికి చొరవ చూపుతామని, గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు. -
పదేళ్లలో ఒక్క రేషన్కార్డు ఇవ్వలేదు
● అసెంబ్లీలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సాక్షి, పెద్దపల్లి: పదేళ్లలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క కొత్తరేషన్కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక లు నిర్వహిస్తే అక్కడ కొత్త రేషన్ కార్డులు, కొత్త ప థకాలు ప్రవేశపెట్టి ఎన్నికలపైనే దృష్టి సారించార ని, ప్రజలకు న్యాయం చేయలేదన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా అ ర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించామన్నా రు. అర్హులైన ప్రతీఒక్కరికి కొత్తరేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే రేషన్కార్డుదారులకు సన్నబి య్యం అందించనున్నామని విజయరమణారావు అన్నారు. గతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. కాళేశ్వరం పేరిట ప్రజల సొమ్మును నీళ్లపాలు, రాళ్లపాలు చేసిందని ధ్వమెత్తారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రారు, అభినందించరు, సలహా ఇవ్వరు.. కానీ సీఎం ఇట్లా, భట్టి విక్రమార్క అట్లా అని విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
మూత్రశాలలు శుభ్రంగా ఉన్నాయా?
కోల్సిటీ(రామగుండం): కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యా న్ని మెరుగుపర్చడం కోసం ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి రెడ్యూస్–రియూజ్–రీసైకిల్(ఆర్ఆర్ఆర్) పేరిట ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2024’ పోటీలు చేపట్టారు. ఇందులోనూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిలిచింది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్కు కీలకమైన ప్రజప్రాయా(సిటిజన్ ఫీడ్బ్యాక్) సేకరణ చేపట్టిది. మరో కీలకమైన బ హిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్) పరిస్థితిని తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు శుక్రవారం రామగుండం చేరుకున్నార. శనివారం నుంచి బల్దియాలో ఓడీఎఫ్ స్థితిని నేరుగా తనిఖీ చేస్తారు. ఓడీఎఫ్ – ప్లస్ ప్లస్ కోసం ఆశలు.. రామగుండం బల్దియాకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్(బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. 2023లో ఆ గుర్తింపు వచ్చింది. ఓడీఎఫ్–ప్లస్ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల దరఖాస్తు చేసింది. అయితే, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. మల్కాపూర్లో వినియోగంలోకి వచ్చిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ) ద్వారా ఓడీఎఫ్ ప్లస్ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఓడీఎఫ్కు 1,200 మార్కులు.. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీలో మొత్తం 12,500 మార్కులు కేటాయించారు. ఇందులో ఓడీఎఫ్కు 1,200, గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగానికి 1,300, ఇతర విభాగాలకు 10,000 మార్కులు కేటాయించారు. క్యూసీఐ ప్రతినిధులు ఇచ్చే మార్కుల ఆధారంగా ఓడీఎఫ్పై రేటింగ్ రానుంది. జాతీయ స్థాయిలో ప్రకటించే ర్యాంక్క్లకూ ఓడీఎఫ్ మార్కులు కీలకం కానున్నాయి. నేటి నుంచి క్యూసీఐ బృందం పరిశీలన.. ఢిల్లీ నుంచి వచ్చిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ)లో రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ ఉన్నారు. తొలిరోజున బల్దియా కార్యాయంలో ఓడీఎఫ్ డాక్యుమెంట్లు పరిశీలించారు. శనివారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీంతో పారిశుధ్య విభాగం అప్రమత్తమైంది. బల్దియాలో 25 టాయిలెట్స్ పరిశీలన.. బల్దియాలో ఆరు పబ్లిక్, 19 కమ్యూనిటీ టాయిలెట్స్తోపాటు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ వినియోగంలో ఉ న్నాయనిఅధికారులుస్వచ్ఛ సర్వేక్షణ్ ఆన్లైన్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా క్యూసీఐ వాటిని క్షేత్రస్థాయిలోపరిశీలించి వివరాలు సేకరించనుంది. క్యూసీఐ పరిశీలించే అంశాలు.. సెఫ్టిక్ ట్యాంక్ల నిర్వహణ, పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్లో అందుబాటులో కేర్ టేకర్, రోస్టర్ పద్ధతిలో క్లీనింగ్, టాయిలెట్స్కు వచ్చే ప్రజల ఫీడ్బ్యాక్, మహిళలు, పురుషులు గుర్తించేలా టాయిలెట్స్ బోర్డులున్నాయా? లోపల లైటింగ్, వా ష్బేసిన్, మిర్రర్, విడిగా యూరినల్స్, బాత్రూం తలుపులకు లోపలైపు బోల్టులు, వాటర్ సరఫరా, దుర్వాసన రాకుండా ఒడోనిల్, వెంటిలేషన్, ఎగ్జాస్టింగ్, క్యూఆర్ కోడ్ తదితర సౌకర్యాలపై క్యూసీఐ తనిఖీ చేసి ఫొటోలు తీసుకోనుంది. అక్కడికక్కడే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్లు తలుపులు బిగించారా.. దుర్వాసన వస్తుందా? నేటి నుంచి క్యూసీఐ బృందం క్షేత్రస్థాయి తనిఖీలు రామగుండం బల్దియాకు చేరుకున్న ఢిల్లీ ప్రతినిధులు సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్ల నిర్వహణపై ఆరాకు సన్నద్ధంపారిశుధ్య విభాగం ప్రొఫైల్: మొత్తం డివిజన్లు 50 విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 93.87 జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644 గుర్తించిన మురికివాడలు 92 స్వచ్ఛ సర్వేక్షణ్–2024 మార్కులు కేటాయించినవి 12,500 గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగం 1,300 ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ప్లస్, వాటర్ ప్లస్ 1,200 ఇతర విభాగాలు 10,000 పోటీ పడుతున్న బల్దియాలుసంవత్సరంరామగుండం ర్యాంక్ 2017 434 191 2018 4203 194 2019 4237 192 2020 4242 211 2021 4320 92 2022 4354 136 2023 4416 175 2024 4900 (ప్రస్తుతం ర్యాంక్ సర్వే) -
అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేస్టేషన్ అభివృద్ధి
రామగుండం: అంతర్జాతీయ ప్రమాణాలతో రామగుండం రైల్వేస్టేషన్ను ఎయిర్ పోర్ట్ను తలదన్నేలా ఆధునికీకరిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. రామగుండం రైల్వేస్టేషన్ పనులను శుక్రవారం పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.26.5 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ చేపట్టామని, ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. పది రోజుల్లోగా రైల్వేస్టేషన్ను ప్రారంభిస్తామని అన్నారు. రైల్వేస్టేషన్ను కలియ తిరిగిన అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 14 మండలాల్లో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. ఇందులో తొమ్మిది మంది గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్స్వాడ్స్తోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో పరేషాన్ మంథని: పదో తరగతి పరీక్ష కేంద్రం మార్పుతో విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడింది. గతంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, గురుకుల బాలుర వి ద్యాలయంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పా ఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇ వి పట్టణ శివారులో ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బ స్టాండ్కు సమీపంలో ఉన్న బాలుర, జెడ్పీ బాలిక ల హైస్కూల్లో ఏర్పాటు చేయకుండా ఈసారి బాలుర జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పా టు చేయడంతో విద్యార్థులు తికమకపడ్డారు. స్కూల్కు ఇరు వైపులా రోడ్డు ఉన్నా.. ఎటువైపు నుంచి వెళ్లాలో సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. కనీస సౌకర్యాలు కల్పించలేదు. జిల్లాలో 99.87శాతం హాజరు -
ఊరూవాడా చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. -
మారుపేర్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలం
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మా రుపేర్ల సమస్య పరి ష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని రా మగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం వద్ద ఎమ్మెల్యే పలు సమస్యలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, మారుపేర్ల అంశం, కార్మికుల విజిలెన్స్ పెండింగ్ కేసుల గురించి వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, పట్టణప్రగతి, రోడ్లు, డ్రైనేజీ, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవల విస్తరణ వంటి ముఖ్యాంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. లంచం అడిగితే సమాచారమివ్వండి పెద్దపల్లిరూరల్: ‘జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అన్నిసేవలను ఉచితంగా అందిస్తున్నాం.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం.. ఎవరైనా డబ్బులు అడిగితే సూపరింటెండెంట్ సెల్ నంబరు 84990 61999కు లేదా రీజినల్ మెడికల్ ఆఫీసర్ సెల్ నంబరు 94948 53906కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలి’ అని ఆస్పత్రి ఆవరణలో పోస్టర్లు అంటించారు. నేతల త్యాగఫలమే వర్గీకరణ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజీలేని పోరాటం, అనేకమంది త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభలో ఆమోదం లభించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంపై మండల కేంద్రంలో శుక్రవారం బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మూడు దశాబ్దాల కల సాకారమైందని నాయకులు అన్నారు. నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్, తులా మనోహార్రావు, బండ రవీందర్రెడ్డి, సబ్బని రాజమల్లు, దంతెనపెల్లి చిన్నస్వామి, దంతెనపెల్లి ధర్మయ్య, అక్కపాక తిరుపతి, ఉమామహేశ్వర్, తూండ్ల రాజయ్య, బర్ల తిరుపతి, మంతెన రామస్వామి, చలిగంటి స్వరూప, రాజేశం, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి రామగిరి(మంథని): లద్నాపూర్ నిర్వాసితుల కు పన్నూర్, రత్నాపూర్లో కేటాయించిన పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సింగరేణి అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో రూ.2.66 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆర్జీ–3 జీఎం సుధాకర్రావుతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. పునరావాస కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాల్, రామాలయం, రెండు వినాయక మండపాలకు భూమిపూజ చేసి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని వేణు అన్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన.. ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో శైలజారాణి, సింగరేణి అధికారులు రఘుపతి, ఐలయ్య, రాజేంద్రకుమార్, సుదర్శనం, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు.. నీళ్లపాలు
● అన్నదాతకు వడగళ్ల కడగండ్లు ● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు ● ధ్వంసమైన కూరగాయల తోటలు ● రాలిపోయిన మామిడికాయలు ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ● పెద్దపల్లిలో అత్యధికంగా 32.8 మి.మీ. వర్షపాతం నమోదుపెద్దపల్లిరూరల్: అన్నదాతల ఆశలను అకాల వర్షం నీటిపాలు చేసింది. చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. కూరగాయాల తోటలకూ తీరని నష్టమే జరిగింది. మామిడిపూత, కాత కూడా నేలరాసింది. శుక్రవా రం సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వడగళ్లు కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లిలో వర్షం అధికంగా కురిసింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరి ఇప్పుడిప్పుడే గింజ దశకు చేరుకుంటోంది. దీనికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్నకు కొంత నష్టం జరగొచ్చని వారు వివరించారు. అధికారులు ఇలా పేర్కొంటుంటే.. తమకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేట్టులేదని రైతులు ఆవేదన చెందుతు న్నారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాంటున్నారు. వివిధ గ్రామాల్లో.. పెద్దపల్లి పట్టంలో రాత్రి 8గంటల వరకు అత్యధికంగా 32.8మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురి సింది. ధర్మారం మండలంలో 29మి.మీ., జూలపల్లి మండలంలో 26మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి మండలం నిట్టూ రు, నిమ్మనపల్లి, హన్మంతునిపేట, రాంపల్లి, భోజ న్నపేట గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. రాంపల్లిలో నేలవాలిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి అలివేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం.. జిల్లాకేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుభాష్ విగ్రహం వద్ద ఇప్పటికే డ్రైనేజీని మూసివేయగా.. మురుగునీరంతా రోడ్డు పైకి చేరుతోంది. వర్షానికి సైతం సుభాష్విగ్రహం ప్రాంతమంతా మోకాలిలోతులో నిలిచింది. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించింది. పోలీస్స్టేషన్ ఆవరణలోకి వర్షపునీరు వచ్చి చేరింది. బస్టాండ్, కమాన్ ప్రాంతాల్లోనూ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీ భారీగాలులతో కూడిన వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని ఓ భవనంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చిరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవవ్ర అంతరాయం కలిగింది. ట్రాన్స్కో ఏ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే దానిని తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంథనిలో..మంథని: అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కానీ, వివిధ పంటలకు నష్టం కలిగిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంథనిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరి తదితర పంటలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. సుల్తానాబాద్లో.. సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు సుగ్లాంపల్లి, పూసాల, ఆరేపల్లి తదితర గ్రామాల్లో భారీవర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో మొక్కజొ న్న కర్ర నేలవాలింది. పొట్టదశలోని వరి నీటిపాలైంది. వర్షంతో ఎలాంటి ప్రయోజనం లేదని, నష్టమే అధికంగా ఉందని రైతులు వాపోయారు. ధూళికట్టలో.. ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఈదురుగాలులతో కూడి భారీవర్షం కురిసింది. దాదాపు అర్ధగంటపాటు వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లు భారీగా కురిశాయి. మొక్క జొన్న కర్రలు నేలవాలాయి, పొట్ట, ఈనేదశలోని మొక్కజొన్న కర్రలు, వరి పైరు తీవ్రంగా దెబ్బతి న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడికాయలు చెట్లపైనుంచి రాలి తీవ్రనష్టం కలిగించాయని అన్నారు. ఎలిగేడు, ముప్పిరితోట తదితర గ్రామాల్లో తుంపర వర్షం కురిసింది. నేలవాలిన మొక్కజొన్న జూలపల్లి(పెద్దపల్లి): కోనరావుపేట, జూలపల్లి, వడ్కాపూర్, పెద్దాపూర్, అబ్బాపూర్, నాగుపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వచ్చిన గాలివాన అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడిన అన్నదాత శ్రమ మరో నెలరోజుల్లో చేతికి వస్తుందనగా అకాలవర్షం ఆగమాగం చేసింది. పంటంతా పడిపోయింది నాకున్న ముప్పయి గుంటల్లో మక్క ఏసిన. కంకులు పాలు పోసే దశ వచ్చినయి. అకాల వర్షం కర్రలను నెలపాలు చేసింది. మరో నెలరోజుల్లో చేతికొచ్చే పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. – దాడి కుమార్, రైతు, కోనరావుపేట -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యౖ మెన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షయ శిబిరం, ఎన్సీడీ సర్వే చాలాబాగా చేశారని వైద్యసిబ్బందిని అభినందించారు. టీబీ రహిత గ్రామాలను ప్రకటించాలని కలెక్టర్ సూచించారు. జి ల్లాలో గుర్తించిన బీపీ, మధుమేహం బాధితులు తమ జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పు ల గురించి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా ఏ ప్రిల్లో అవగాహన కల్పించాలని అన్నారు. డ యాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీ క్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో జిల్లా ముందు వరుసలో ఉందని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ జిల్లాలో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్ఆర్యూపీలో జరిగిన పొరపాట్ల సవరణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాలపై కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు సురేశ్, గంగయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
27న ఓదెల మల్లన్న హుండీ లెక్కింపు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 27న ఉదయం 9గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో సదయ్య పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగలవారు, భక్తులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 26న శ్రీఆదివరాహస్వామి.. కమాన్పూర్: మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయ హుండీని ఈ నెల 26 లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు లెక్కింపులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అదే రోజు ఆలయానికి కిరాణ సామగ్రి సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29 -
41 కేంద్రాలు.. 7,393 మంది విద్యార్థులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో శుక్రవారం నుంచి మొదలు కానున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాల్లో 7,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 586 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ సారి 24 పేజీల బుక్లెట్ విధానం ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ను జవాబులు రాసేందుకు ఇవ్వనున్నారు. దీన్ని ఒకేసారి అందివ్వనుండడంతో పక్కవారికి పేపర్ అందించే అవకాశం ఉండదు. ఈ విషయమై టెన్త్ విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా మాస్ కాపియింగ్ జరగకుండా నిఘా బృందాలను నియమించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వసతుల కల్పన పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండకాలంలో దాహార్తిని తీర్చేందుకు నీరు, పరీక్ష సమయంలో దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించేలా ఆదేశాలిచ్చారు. పరీక్షల నిర్వహణపై సందేహాలుంటే కంట్రోల్ రూం నం. 97015 15725లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.జిల్లా సమాచారం పరీక్షల నిర్వహణ: ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల సంఖ్య: 207 (135 ప్రభుత్వ, 72 ప్రైవేట్) విద్యార్థుల సంఖ్య: 7,393 బాలికలు: 3,690, బాలురు: 3,703 ఇన్విజిలేటర్లు: 586 మంది నేటి నుంచి పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం నం. 97015 15725పకడ్బందీగా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇతర శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించాం. కేంద్రాల వద్ద వైద్యసిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. – మాధవి, జిల్లా విద్యాధికారి -
రాజస్థాన్ బృందం సందర్శన
మంథని: జాతీయస్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అ వార్డు పొందిన మంథని మండలం చిల్లపల్లి గ్రామాన్ని గురువారం రాజస్థాన్ నుంచి 19 మంది ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రతినిధులకు మహిళలు బతుక మ్మ, కోలాటాలతో స్వాగతం పలికారు. గ్రా మంలో ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులు పరిశీలించారు. తమ రాష్ట్ర పంచా యతీరాజ్ మంత్రి సూచనలతో ఇక్కడకు వ చ్చినట్లు రాజస్థాన్ బృందం తెలిపింది. ఇక్కడి మహిళల పనితీరు బాగుందని, ఈ పర్యటన తమకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది. స్టేట్ నోడల్ ఆఫీసర్ అనిల్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 11 టీఎంసీలకు ‘ఎల్లంపల్లి’రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. గురువారం నీటిపారుదలశాఖ అధికారులు తెలిపిన నివేదిక ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.28 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి గూడెం ఎత్తిపోతలు 290 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, వేంనూర్ ఎత్తిపోతలు 494 క్యూసెక్కులు మొత్తం 1,357 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉండగా ఇన్ఫ్లో మాత్రం లేదు. ముగిసిన ఇంటర్ పరీక్షలుపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని నోడల్ అధికారిణి కల్పన తెలిపారు. గురువారం జరిగిన పరీక్షకు 4,532 మందికిగాను 4,428 మంది హాజరయ్యారని, 104మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానాకోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలో నిబంధనలు పాటిచకుండా మాంసం వ్యాపారులు దుకాణాల వద్దే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. దీంతో అదనపు కలెక్టర్, నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ ఆదేశాలతో గురువారం డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో పారిశుధ్య విభాగం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల వద్ద మేకలను వధిస్తున్న ముగ్గురు వ్యాపారులను గుర్తించి ఒకొక్కరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలు సీజ్ రామగుండం బల్దియాలో ఆస్తిపన్ను చెల్లించని వ్యాపార సంస్థలను గురువారం అధికారులు సీజ్ చేశారు. స్థానిక లక్ష్మీనగర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా పలుదఫా లుగా నోటీసులు జారీ చేసినా, స్పందించని నా లుగు వ్యాపార సంస్థలను నగరపాలక కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రెవెన్యూ విభా గం అధికారులు సీజ్ చేశారు. కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం, ఎ న్వి రాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, సూపర్వైజ ర్ దయానంద్, సంపత్, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
ఆదాయం అంతంతే..
● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025లో వెల్లడిగనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.సాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26 -
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి
● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్పాలకుర్తి(రామగుండం): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని, ప్రతీ గ్రామంలో వాటి ఏర్పాటుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. గురువారం బసంత్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం కుక్కలగూడుర్లో ఏర్పాటు చేసిన ‘నేనుసైతం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్ సమాచారం ఇవ్వకూడదన్నారు. యువత మద్యం, గంజాయి, గుట్కా, ధూమపానం వంటి చెడువ్యసనాలకు అలవాటుపడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చదువు, కెరీర్పై దృష్టిసారించి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈసందర్భంగా గ్రామంలో స్థానికుల సాయంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి, మాజీ సర్పంచ్ గోండ్ర చందర్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 23న సామూహిక గీతా పారాయణంమంథని: సనాతన ధర్మ ప్రచార సమితి, శ్రీసీతారామ సేవాసదన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్లో 5వేల మందితో సామూహిక గీతాపారాయణం నిర్వహించనున్నట్లు సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంథెన శ్రీనివా్స్, ఉత్సవ సమితి అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ, భగవద్గీతను ఇంటింటికీ చేర్చడానికి ఐదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పారాయణానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రవచకులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు పిఠాధిపతులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు శోభాయాత్ర నిర్వహించి గీతాపారాయణం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కొత్త శ్రీనివాస్ గుప్తా, వేడగోని రాజమౌళిగౌడ్, పుప్పాల విక్రమసింహారావు, కొండమేన అశోక్కుమార్, బండారి సురేశ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
పెద్దపల్లిరూరల్: పదో వార్షిక తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 7 వేల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇందుకో సం 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, సమీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆదేశించారు. పారామెడికల్ సి బ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈవో మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్లో గ్రీవెన్స్ బాక్స్ రామగుండం: పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్లో గర్ల్ చై ల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఏర్పాటు చేశారు. హెచ్ఎం చైర్పర్సన్గా, ఉపాధ్యాయురాలు కన్వీన ర్, ప్రతీ తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులను కమిటీ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. బాలికలపై అఘాయిత్యాలను పాఠశాలస్థాయి నుంచే ఎదుర్కొనేందుకు వీలుగా గ్రీవెన్స్ బాక్సు ఏ ర్పాటు చేశారు. బాలికలపై లైంగిక దాడులు, అసభ్యకర ప్రవర్తన, అవమానకర కామెంట్స్, కించపరిచే చేష్టలు తదితర సమస్యలపై ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ప్రధానోపాధ్యా యురాలు అజ్మీరా శారద చైర్పర్సన్గా, కన్వీనర్గా హిందీ ఉపాధ్యాయురాలు ఎం.హేమలత వ్యవహరించనున్నారు. సుల్తాన్పూర్లో రాజస్తాన్ బృందం ఎలిగేడు/సుల్తానాబాద్(పెద్దపల్లి): రాజస్తాన్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు సుల్తాన్పూర్, సుల్తానాబాద్లో బుధవారం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రతపై ఆరా తీశారు. ఎరువుల తయారీ విధానం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లలో సహజ సిద్ధంగా పెంచుతు న్న కూరగాయలు, సౌరశక్తి పనులను పరిశీలించారు. డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవోలు భాస్కర్రావు, దివ్యదర్శన్రావు, ఎంపీవోలు ఆ రిఫ్, సమ్మిరెడి, ఎస్బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, హెచ్ఎం నరేంద్రచారి పాల్గొన్నారు. పత్తి క్వింటాల్ రూ.7,087 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,087 ధర పలికింది. కనిష్టంగా రూ.5,561, సగటు రూ.6,717గా ధర నమోదైందని మార్కెట్కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు. 5 వరకు దరఖాస్తు చేయండి పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన విద్యావంతులైన బీసీ నిరుద్యోగ వయువతీయువకులు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణం పొందేందుకు ఏప్రిల్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి కోరారు. యువతకు స్వయం ఉపాధి క ల్పించి, ఆర్థికాభ్యున్నతి సాధించేందుకు ప్రభు త్వం ఈ పథకం అమల్లోకి తెచ్చిందని పేర్కొ న్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ యన వివరించారు. వివరాలకు కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఇంటర్ పరీక్షలకు 96.26 శాతం హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 96.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,798 మంది హాజరయ్యారని ఆమె వివరించారు. -
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఏది?
బడ్జెట్లో కార్మిక సంక్షేమాన్ని విస్మరించింది. వేతన పెంపు ఊసేలేదు. కార్మికుల సంక్షేమానికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై నా నిధులు కేటాయించక పోవడం బాధాకరం. – ముత్యంరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి విద్య, వైద్యరంగాలను విస్మరించారు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా విద్య, వైద్య రంగాలకై నా నిధులు కేటాయించక పోవడం సరికాదు. గతంలో విద్యారంగానికి 7.3శాతం నిధులు కేటాయిస్తే ఈసారి 0.2శాతం మాత్రమే పెంచి 7.5శాతం కేటాయింపులు చేయడం విడ్డూరం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి సంగతిని ప్రస్తావించనేలేదు. – సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
● సమస్యల పరిష్కరానికి పోలీస్దర్బార్ ● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించి పోలీస్శా ఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషనరేట్లో బుధవారం సీపీ పోలీస్దర్బార్ నిర్వహించారు. ఎ లాంటి సమస్యలు ఉన్నా దర్బార్ దృష్టికి తీసుకురావడం ఇబ్బందిగా ఉంటే నేరుగా తన ఆఫీస్కు రా వాలని సీపీ సూచించారు. ఒకే కుటుంబం స్ఫూర్తి తో సమన్వయం, క్రమశిక్షణ, ప్రణాళికా బద్ధంగా వి ధులు నిర్వహించాలన్నారు. పోలీస్శాఖ, యూనిఫాంపై గౌరవం ఉంటే చట్ట వ్యతిరేకమైన పనులపై ఆలోచన రాదన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. త ద్వారా మానసిక, శారీర ఒత్తిడి నుంచి దూరం కావచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, వాటిని తట్టుకోలేక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ గురించి ఆలోచించాలని సూ చించారు. ప్రతి రెండు నెలలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహించి హెల్త్ చెకప్ చేయిస్తామని సీపీ వివరించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జనగామ ఆలయంలో పూజలు.. గోదావరిఖనిటౌన్ : సీపీ అంబర్ కిశోర్ ఝా దంప తులు జనగామలోని శ్రీత్రిలింగేశ్వరస్వామి ఆల యంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. -
రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
మంథని: వరంగల్ – మంచిర్యాల మధ్య చేపట్టిన గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భాగంగా చేపట్టిన బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో బుధవారం ప ర్యటించిన కలెక్టర్.. ఆర్డీవో కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అ డవిసోమన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. జాతీయ రహదారి ప్యాకేజీ–1లో భాగంగా మంథని మండలం పుట్టపాక వరకు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తిచేశామని, రోడ్డు అలైన్మెంట్ లోపల రోడ్డు నిర్మించేందుకు వీలుగా పిచ్చిమొక్కలు తొలిగించాలని, బుషెస్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. డివిజన్ పరిధిలో కార్యాలయ స ముదాయం నిర్మించుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెనోవేషన్ పనులను పరిశీలించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మంథని ప్రాంతానికి గైనకాలజిస్ట్ను కేటాయించామని తెలిపారు. మంథని మాతా శిశు ఆస్పత్రిలో ఈనెల 22 నుంచి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పు రోగతిని యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మ్యాన్హోళ్లకు వెంటనే మరమ్మతు చేయాలి కోల్సిటీ(రామగుండం): నగర పరిధిలో ప్రమాదకరంగా ఉన్న మ్యాన్హోళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. బుధవారం 11, 33వ డివి జన్లలో ప్రమాదకరంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రశాంత్నగర్లోని మల్కాపూర్ చెరువును పరిశీలించారు. చెరువుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. మల్కాపూర్ చె రువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశో ర్ ఝాను అరుణశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన కట్టడాలు, ఆస్తిపన్ను చెల్లింపులపై సీపీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామణ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లిరూరల్: ఇంటింటా పర్యటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో పాలుపంచుకుంటున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. అంతకుముందు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఆశ వర్కర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, నెల వేతనం రూ.18వేలకు పెంచాలని యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, శారద, జ్యోతి, సువర్ణ, రూపారాణి, హేమలత, రేణుక, శివలీల, మంజుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారంజకంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. స్పష్టమైన వైఖరి, అద్భుతమైన విజన్తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయి. ఇరిగేషన్, విద్యుత్, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం. రామగుండం నియోజకవర్గానికి కేటాయింపులు జరిగాయి. దేశంలోనే అత్యున్నతస్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా ఉంది. – ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం సంక్షేమానికి ప్రాధాన్యం బడ్జెట్ చాలా బాగుంది. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశా రు. విద్యావంతులైన యువతకు స్వయం ఉపాధి మార్గాలను చూపేలా రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి -
ప్రాణాలు పోతున్నాయి..
● ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు ● అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు ఈనెల 6న మంథని మండలం బిట్టుపల్లి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన గుండపాక ఉదయ్కుమార్(24) మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈనెల 10న మంథని–పెద్దపల్లి మధ్య కమాన్పూర్ ఎక్స్రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వచర్లకు చెందిన దొంతుల వాణి(48) మృతి చెందింది. బైక్ను ఇసుకలారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈనెల 15న ఆర్ఎఫ్సీఎల్ గేట్ మూలమలుపు వద్ద వేగంగా వెళ్తున్న ట్రాలీఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని 8మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 15న అంతర్గాం ఎంపీడీవో ఆఫీసు సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఐకేపీ ఉద్యో గి మేర్గు కుమారస్వామి మృతి చెందారు. ఈనెల 17న మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొని అంతర్గాం మండలం పెద్దపేటకు చెందిన సింగరేణి కార్మికుడు బండి ప్రసాద్గౌడ్ దుర్మరణం చెందాడు. గోదావరిఖని: జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డెక్కితే గమ్యం చేరేంత వరకూ భరోసా లేకుండాపోతోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, సూచికల లేమి, లెక్కకు మించి మూలమలుపులు, డ్రైవింగ్లో నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు. గతేడాది 131 మంది.. 221 మందికి గాయాలు గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా 221మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 301మంది స్వల్పగాయాల పాలయ్యారు. రాజీవ్ రహదారిపై 27 బ్లాక్ స్పాట్లను పోలీసు యంత్రాంగం గుర్తించినా.. అక్కడ ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఆ ప్రాంతాల్లోనే ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో గాయాలపాలైన వారు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. యంత్రాంగం నిర్లక్ష్యం.. ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్ యంత్రాంగానికి అప్పగించారు. ఆరేళ్ల క్రితమే జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాల సంఖ్య అప్పట్లో అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం సూచిక బోర్డులు లేకపోవడం, బ్లాక్ స్పాట్లు వాహనదారులకు కనిపించకపోవడం, అతివేగంతో చాలామంది ప్రమాదాల బారినపడుతున్నారు. భారీ వాహనదారుల నిర్లక్ష్యం.. భారీ వాహన డ్రైవర్లతో నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవర్లోడ్తోపాటు అతివేగం ప్రమాదాల కు కారణమని అంటున్నారు. భారీ వాహన డ్రైవర్ల తీరుతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నారు. రాత్రంతా వాహనం నడిపి నిద్రలేకుండా డ్రైవింగ్ చేయడంతోనే డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటున్నారని, దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. నియంత్రణలోకి రాక.. ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసే కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజూ ఏదోఒకచోట మద్యం తాగి వాహనం నడుపుతూ కొందరు పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. కోర్టులు కూడా భారీగా జరిమానా విధించడంతోపాటు జైలు శిక్షణ వేస్తోంది. గతేడాది 6,725 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లు పట్టుపడగా, అందులో 3,352 మందికి రూ.44.14లక్షలు జరిమానా విధించారు. అయినా, తీరుమారడం లేనేలేదు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 128 44 296 2023 112 64 303 2024 131 221 301 నియంత్రణకు చర్యలు నేను గతంలో పోలీస్ కమిషనర్గా పనిచేసి వరంగల్లో చేపట్టిన అనేక సంస్కరణలో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఇక్కడ కూడా అలాంటి కఠిన చర్యలు తీసుకుంటాం. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై చర్యలు తప్పవు. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
సామర్థ్యానికి మించి రవాణా
రామగుండం: అంతర్గాం నుంచి ఎన్టీపీసీ బూడిద, ముర్మూర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా చెరువుమట్టి భారీగా రవాణా అవుతోంది. గోలివాడ రీచ్ నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ట్రాక్టర్లతో ఇసుక నిత్యం తరలిపోతోంది. ఈ వాహనాలతో గ్రామీణ రహదారులపై అలజడి రేగుతోంది. సామర్ాధ్యనికి మించి మట్టి, బూడిద తరలిస్తున్నారు. బుగ్గ రోడ్డు నుంచి అంతర్గాం మండల పరిషత్ జంక్షన్ వద్ద కూడలి ఉంది. అక్కడ వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ వాహనాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్గాం జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కూడలిలో రద్దీ అధికంగా ఉంటుంది. అయితే, మట్టి, బూడిద, ఇసుక తరలించే వాహనాలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మూలమలుపులు, కూడళ్ల వద్ద భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక రవాణాతో ట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. గోలివాడ రీచ్ నుంచి స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తరలించే అవకాశంఉంది. దీంతో ట్రాక్టర్ యజమానులు అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు మైనర్లకు ట్రాక్టర్లు అప్పగించడంతో ద్విచక్ర వాహనాలతో పోటీపడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవర్లోడ్, అతివేగంతో వెళ్తున్న వాహనాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ● భారీటిప్పర్లలో బూడిద, ఇసుక, మట్టి తరలింపు -
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
యైటింక్లయిన్కాలనీ/సుల్తానాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలా గైనా వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్నెల్లుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని సందేహాలు నివృత్తి చేస్తున్నారు. 21 నుంచి వార్షిక పరీక్షలు.. జిల్లాలోని మొత్తం 135 హైస్కూళ్లలో 7,393 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించే వార్షి పరీక్షలకు వీరు ఫీజు చెల్లించి ఉన్నారు. రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా.. జిల్లాలో మాస్కాపీయింగ్కు తావులేకుండా జిల్లా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చూచిరాతలు, అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌకర్యంగా ఆర్టీసీ అధికారుల సహకారంతో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో వైద్య సిబ్బంది.. పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను నియమిస్తారు. వారి వద్ద ఓఆర్ఎస్తోపాటు ప్రథ మ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుతారు. తా గునీటి సౌకర్యం కల్పిస్తారు. నీడకోసం అవసరమై న చోట షామియానాలు ఏర్పాటు చేస్తారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, బుక్స్టాళ్లు మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. నేరుగా హాల్టికెట్ల డౌన్లోడ్.. ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు నేరుగా htto:// bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికె ల్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఫీజు తిప్పలు ఉండవు.జిల్లా సమాచారం టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న టీచర్లు 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు -
గోదారి గట్టు మీద..
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025గోదావరిఖని: సింగరేణి రామగుండం రీజియన్ లేడీస్ క్లబ్ సభ్యులు ఎన్సీవోఏ క్లబ్లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. డైరెక్టర్లు, జీఎంల సతీమణులు మాలతి, విజయలక్ష్మి, వనజ, అనిత, అలివేణి, లక్ష్మి, లలిత, వాణి తదితరులు తొలుత కేక్ కట్చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఆ తర్వాత సినిమా పాటలపై అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.న్యూస్రీల్ -
ఇసుక, మట్టి అక్రమ రవాణా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలో ఇసుక, మ ట్టి అక్రమంగా తరలిపోతోంది. మానేరు సరి హద్దు గుట్ట, ప్రభుత్వ భూమిలో ఎర్రమట్టితోపాటు ఇసుక రవాణా చేస్తున్నారు. దీనిపై ఫి ర్యాదు చేసినా.. మైనింగ్, రెవెన్యూ అధికారు లు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలోంచి మట్టి తీస్తే అనుమ తి కావాలంటున్న అధికారులు.. అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మధూ సూదన్రెడ్డిని వివరణ కోరగా, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, అక్రమార్కులపై చర్యల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సీఎంవోగా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారు ● సింగరేణి సీఎండీ బలరాం గోదావరిఖని: సింగరేణి సంస్థ చీఫ్ మెడి కల్ ఆఫీసర్గా కంపె నీ వైద్యాధికారే కొనసాగుతారని ఆ సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం పేర్కొన్నా రు. మంగళవారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులుతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణి వైద్యాధికారులు ఎలాంటి అపోహ లు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఆకాంక్షను సాకారం చేసేక్రమంలో విలువైన సలహాలు, సూచనలు అందించే బాధ్యతలను మాత్రమే చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్)గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని అన్ని ఏరియాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సీఎంఎస్ కృషి చేస్తారని ఆయన వివరించారు. ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందప డి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీ పూర్తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికు లు 108 అంబులెన్స్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ వివరించారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రాణా లు కోల్పోయాడు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదా నికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యుల కు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఏఐతో విద్యాబోధన సులభం
గోదావరిఖనిటౌన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాయంతో విద్యాబోధన చేయడం ద్వారా వి ద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక గాంధీపార్క్ మండల పరిషత్ ప్రాథమిక, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఏఐ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించడం లక్ష్యంగా ఏఐ పద్ధతి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ సాయంతో విద్యా బోధన ప్రారంభిస్తున్నామని తెలిపారు. డీఈవో మాధవి, ఏఎంవో పీఎం షేక్, ఎంఈవో చంద్ర య్య, జిల్లా రిసోర్సు పర్సన్లు ప్రవీణ్, రవి, ప్ర ధానోపాధ్యాయుడు రాంబాబు పాల్గొన్నారు. సాగునీటిని వృథా చేయొద్దు పెద్దపల్లిరూరల్: ఎస్సారెస్పీ నీటిని వృథా చేయొ ద్దని, చివరి ఆయకట్టుకూ అందేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అప్పన్నపేట ఎస్సారెస్పీ డి–83 ప్రధాన కాలువ నీటి ప్రవాహాన్ని ఈఈ శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పంటలకు అవసరమైన నీటి వినియోగంపై రైతులకు అవగాహన అవససరమన్నారు. బాలసదనం సందర్శన.. స్థానిక బాలసదనం కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. పిల్లల సంఖ్య, వసతులపై ఆరా తీశా రు. పిల్లలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. నిధులు అవసరమైతే తనకు ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానన్నారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు రామగుండం/కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ: చదువు లో ప్రతిభచూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండంలోని తబితా, వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమాలను ఆయన మంగళవారం సందర్శించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితనిఖీ చేశారు. అధికారులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
తప్పని తెలిసినా.. తప్పట్లేదు..
చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు చివరి ప్రయత్నంగా ఎత్తిపోతల పథకానికి ఉన్న ఎయిర్ వాల్వ్లకు పైపులు బిగించుకుని సాగునీరు అందిస్తున్నారు. అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్వాసుల దాహం తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వేమునూర్ పంప్హౌస్ నుంచి భూగర్భ పైపులైన్ నిర్మించింది. వీటికి రెండు విద్యుత్ మోటార్లు బిగించింది. ఎల్లంపల్లి నీటిని వీటి ద్వారా నందిమేడారం చెరువులోకి ఎత్తిపోసింది. ప్రస్తుతం ఎస్సారెస్సీ నీరు అందక ఎండుతున్న పంటలకు ఎయిర్వాల్వ్లు జీవం పోస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు, జయ్యారం, మద్దిర్యాల తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లోని వరి పంటను ఎయిర్వాల్వ్ వృథా నీరు ఆదుకుంటోంది. ఇలా నీటిని తరలించడం తప్పని తెలిసినా తప్పక చేస్తున్నామని కొందరు రైతులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రజలు అధికారం అప్పగిస్తే పాలించడం చేతకాక ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్ విమర్శించారు. గోదావరి గోసపై చేపట్టిన పాదయాత్ర మంగళవారం రెండో రోజు పట్టణ శివారు బందంపల్లి నుంచి బయలుదేరింది. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు యాత్ర కు స్వాగతం పలికారు. ప్రగతినగర్ కూడలివద్ద తె లంగాణతల్లికి, బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయ కులు ఉప్పు రాజ్కుమార్, గంట రాములు, రఘువీర్సింగ్, రవీందర్, పెంట రాజేశ్, దాసరి ఉష, గండు రంగయ్య, జుబేర్, నటరాజ్, చంద్రశేఖర్, వైద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం సుల్తానాబాద్(పెద్దపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. సుగ్లాంపల్లికి చేరుకున్న పా దయాత్రకు మాజీ కౌన్సిలర్ పసేడ్ల మమత మంగ ళహారతితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చందర్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరమంటే చిన్న ఆనకట్ట కాదని, మూడు బరాజ్ లు, 15 రిజర్వాయర్లు, 19సబ్ స్టేషన్లు, 21పంపు హౌస్లు, 200 కి.మీ. సొరంగాలు, 1,530 కి.మీ. గ్రావిటీ కాలువలతో కూడుకున్నదని వివరించారు. నాయకులు దాసరి ఉష, రఘువీర్ సింగ్, పొన్నమనేని బాలాజీరావు, పాలరామారావు, పారుపల్లి గుణపతి, సూర శ్యామ్, సందీప్రావు, బుర్రశ్రీనివాస్ గౌడ్, దీకొండ భూమేశ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ రెండోరోజు కొనసాగిన ‘గోదావరి గోస’ పాదయాత్ర -
‘భట్టి’ బడ్జెట్పై ఆశలు!
సాక్షిప్రతితినిధి, కరీంనగర్: నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ సిటీ, జగిత్యాల మెడికల్ కాలేజీ, ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్కు ఎంత కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రానుంది. ● కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్కు నిధులు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రం నుంచి రూ.429 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.399 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని ఇటీవల మాజీ మేయర్ సునీల్ రావు సీఎంకు లేఖ రాశారు. ఈ నిధులపై బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని కరీంనగర్ బల్దియా అధికారులు ఆశాజనకంగా ఉన్నారు. ● మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం నిజాంషుగర్స్ బకాయిలు మొత్తం రూ.250 కోట్లు ఉన్నాయి. తొలుత రూ.43 కోట్లు, తర్వా త అది రూ.192 కోట్లకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వనుంది. ఫార్చున్ కన్సెల్టెన్సీ ప్రతినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్స్టాల్ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని.. ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుదోనని ఉత్కంఠగా మారింది. ● 2022–23 మెడికల్ కళాశాల ప్రారంభం అయ్యింది. దీని హాస్టల్స్ భవన నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు అయ్యాయి. ధరూర్ క్యాంపులో 27.5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.30 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా 360 బెడ్స్ ఆసుపత్రి నిర్మాణం కావాల్సి ఉంది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలోనే కొనసాగుతుంది. ఈ సారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటు ఇస్తారని పెద్దపల్లి జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ కు ఆదేశించారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో వేచిచూడాలి. స్మార్ట్ సిటీకి నిధులు దక్కేనా? నిజాం షుగర్స్ పై ప్రకటనపై ఉత్కంఠ పత్తిపాక రిజర్వాయర్ పనులు మొదలయ్యేనా? రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి -
పాసుబుక్కు ఇప్పించాలి
మా ఊరు శివారులోని సర్వే నంబరు 315/2లో నాకు వారసత్వంగా వచ్చిన భూమి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలి. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న ఫలాలను అధికారుల తప్పిదంతో పొందలేక పోతున్న. వీలైనంత త్వరగా పొరపాటును సవరించి పాసుపుస్తకం అందించి నాకు న్యాయం చేయాలి. – దేవ లాలయ్య, భోజన్నపేట కార్యదర్శి లేక కష్టాలు రామగిరి మండలం వెంకట్రావుపల్లికి పంచాయతీ కార్యదర్శిలేరు. ఏ పనీ ముందుకు సాగడం లేదు. కనీసం పారిశుధ్య పనులు కూడా చేపట్టడంలేదు. గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిని నియమించేలా చర్యలు తీసుకోవాలి. – బత్తిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, వెంకట్రావుపల్లి వంతెన నిర్మించాలి మా ఊరు పంట పొలాల్లోకి వెళ్లేందుకు ఊరచెరువు వద్ద వంతెన నిర్మించాలి. చెరువు వద్ద నిర్మించిన మత్తడి నుంచి వచ్చే వరదతో అటువైపు వెళ్లలేకపోతున్నాం. కాల్వపై వంతెన నిర్మించేలా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలి. – నిట్టూరు గ్రామ రైతులు -
కాంగ్రెస్ తీరును ఎండగడతాం
గోదావరిఖని/రామగుండం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోదావరినదికి జీవం పోస్తే.. సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఎడారిగా మార్చిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిగోస.. ప్రజలు, రైతుల బాధలను మాజీ సీఎం కేసీఆర్ విన్నవించేందుకు ‘గోదావరి గోస మహాపాదయాత్ర’ను ఈశ్వర్ సోమవారం ప్రారంభించా రు. జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ ఎ మ్మెల్యే దివాకర్రావు హాజరయ్యారు. ఈశ్వర్, చందర్ మట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమ యంలో ఎండిన గోదావరి నదితో రైతన్నల కన్నీ ళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్.. కాళేశ్వ రం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిచారని గుర్తుచేశా రు. ఆచరణకు యోగ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్పై అక్కసుతో కా ళేశ్వరం ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విశిష్టత, కాంగ్రెస్ సర్కారు ని ర్లక్ష్య వైఖరి ఎండగడుతూ ఈనెల 22వరకు ఎర్రవెల్లికి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలి పారు. నాయకులు మూల విజయారెడ్డి, అముల నారాయణ, కౌశిక హరి, పెంట రాజేశ్, బాదె అంజలి, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మహాపాదయాత్రకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం బైపాస్ వద్ద ఘనస్వాగతం పలికారు.● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ -
రోడ్డుపైనే నిర్మాణాలు
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో సెట్బ్యాక్ లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి. అసలే ఇరుకుగా ఉన్నరోడ్డును ఆనుకుని చేస్తున్న నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు సహకరించడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – చిలారపు పర్వతాలు, పెద్దపల్లి మెట్ల సౌకర్యం కల్పించాలి పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలోని జగ్జీవన్రాం విగ్రహం వద్ద పూలమాల వేసేందుకు వీలుగా మెట్లు లేవు. మూడేళ్లుగా ఏటా జయంతి, వర్ధంతి సందర్భంగా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఈ విషయంలో స్పందించాలి. తక్షణమే మెట్లు నిర్మించేలా చూడాలి. – కై లాసం, పెద్దపల్లి -
బయోమైనింగ్ అవసరం
జిల్లాలోనే అతిపెద్ద, ఒకేఒక నగరపాలక సంస్థ రామగుండం. పరిశ్రమలకు నిలయం. ఇరవై ఏండ్లుగా డంపింగ్యార్డ్కు స్థలం లేదు. గత ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఈ సర్కారైనా పట్టించుకోవాలి. ప్రభుత్వం బయో మైనింగ్ ఏర్పాటు చేయాలి. – మద్దెల దినేశ్, అధ్యక్షుడు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ టెండర్లు పిలిచాం ఆర్ఎఫ్సీఎల్కు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా డంపింగ్ యార్డుగా వినిగిస్తున్నాం. ఇందుకోసం డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ) కోసం టెండర్లు పిలిచాం. బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. సేంద్రియ ఎరువు తయారు చేస్తాం. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ) -
ఎన్హెచ్ 563లో కొత్త మలుపు
● జగిత్యాల – కరీంనగర్ సెక్షన్ పాత టెండరు రద్దు ● సాంకేతిక కారణాలతోనే రద్దయినట్లు సమాచారం ● తాజాగా రూ.1,779 కోట్లతో మరో టెండరు ● రూ.276 కోట్ల వరకు పెరిగిన అంచనా వ్యయం ● వేగంగా కరీంనగర్ – వరంగల్ సెక్షన్ పనులు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్గఢ్ నుంచి మహా రా ష్ట్ర.. రెండు రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక జాతీయ రహదారి ఎన్హెచ్ –563 టెండర్ కొత్త మలుపు తి రిగింది. గత జూలైలో కరీంనగర్–జగిత్యాల సెక్షన్ కు సంబంధించి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) టెండర్ల అంచనా వ్యయాలు ఖరారు అయ్యాయి. దాదాపు రూ.2,227 కోట్లతో టెండరుకు అంచనా వ్యయం కూడా రూపొందాయి. ఈ మేరకు టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విశ్వసనీయ స మాచారం మేరకు.. వివిధ సాంకేతిక కారణాలతో పాత అంచనాలతో రూపొందించిన టెండర్లు రద్దు అయ్యాయి. తాజాగా రూ.1,779 కోట్లతో ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. మొత్తం 58.86 కిమీ పొడవైన ఈ రహదారి కరీంనగర్ బైపాస్ (కొత్తపల్లి సమీపంలో) నుంచి జగిత్యాల వరకు నాలుగు లేన్ల రహదా రిగా వేయనున్నారు. గతంలో ఈ రోడ్డు ఖర్చు ప్రతీ కి.మీ.కు రూ.37 కోట్ల వరకు అంచనా వ్యయంగా ఉండటం గమనార్హం. అధునాతన సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జాతీయ రహదా రి నిర్మాణం కానుంది. ఈ మార్గంలో దాదాపు 241 హెక్టార్ల భూసేకరణ కోసం దాదాపు రూ.387 కోట్లు కేటాయించారు. వాస్తవానికి గతంలో అంచనా వ్య యం రూ.1,503 కోట్లు మాత్రమే. (వీటికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకుంటే అది రూ.2,227 కోట్ల వ రకు చేరింది.) తాజాగా టెండరు ప్రకారం.. రూ. 1,779 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.276 కోట్ల అంచనా వ్యయం పెరిగిందని సమాచారం. తాజా టెండర్ అంచనా వ్యయంలో జీఎస్టీ కలిసిందా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్లో పలు ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరిగి ఉండవచ్చని సమాచారం. వేగంగా రహదారి పనులు.. ఈ సెక్షన్లో కీలకమైన కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో మోదీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ పనులు చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ముఖ్య నగరాలైన వరంగల్– కరీంనగర్ పట్టణాలను కలిపే 68 కి.మీ.ల ప్రతిష్టాత్మక రహదారి. దీన్ని 2025 జూలై నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలో టోల్గేట్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అదే సమయంలో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి వద్ద నిర్మించతలపెట్టిన బైపాస్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.వరంగల్–కరీంనగర్ సెక్షన్ దూరం 68 కి.మీ అంచనా రూ.2,146 కోట్లు గడువు 16–7–2025 మానకొండూరు బైపాస్ 9.44 కి.మీ తాడికల్ బైపాస్ 6.65 కిమీ హుజూరాబాద్ బైపాస్ 15.05 ఎల్కతుర్తి బైపాస్ 4.60 కిమీ హసన్పర్తి బైపాస్ 9.57 కిమీ మైనర్ జంక్షన్లు 29కరీంనగర్–జగిత్యాల సెక్షన్ దూరం 58.8 కిమీ అంచనా రూ.1,779 కోట్లు (జీఎస్టీపై స్పష్టత రావాల్సి ఉంది) బ్రిడ్జిలు 24 ఆర్వోబీ/ఆర్యూబీ 03 మేజర్ జంక్షన్లు 27 మైనర్ జంక్షన్లు 29 టోల్ప్లాజా గంగాధర– తుర్కాశీనగర్ సమీపంలో (అంచనా) ట్రక్ బే టోల్ప్లాజా సమీపంలోనే (2 కి.మీలోపే) రెస్ట్ ఏరియా జగిత్యాల సమీపంలో.. -
ప్రారంభానికి రైల్వేస్టేషన్ సిద్ధం
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సుందరీకరణ పనులు శరవేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 21న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు ప్రస్తుతం పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 30లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నాయి. అమృత్ భారత్లో భాగంగా రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో 2023 ఆగస్టు 6న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో పనులకు పచ్చజెండా ఊపారు. ‘కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ ఘనత మాదే’ రామగుండం: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత తమకే దక్కుతుందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం కుమారస్వామి అన్నారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వేలాది మంది ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించేందుకు తమ యూనియన్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకు లు అబ్దుల్ తఖీ, యూనుసొద్దీన్, దుర్గయ్య, నీలం శంకర్, ఖమరొద్దీన్, రషీద్, బంగారి రా జు, రాధ, వెల్లుల స్వామి, ఎ.రాజేందర్, జ్ఞాన శేఖర్, చక్రవర్తి, చంటి, ఆసిఫ్, పోచం, కృష్ణ, గౌతమ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఆర్ఎఫ్సీఎల్ బాధితుల యాత్ర’ చేయాలి రామగుండం: గోదావరి గోస పాదయాత్ర క న్నా ముందు ఆర్ఎఫ్సీఎల్ బాధితుల యాత్ర చేపడితే మోసపోయిన వారికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ సూచించారు. అంతర్గాంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హ యాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కనీసం తా గు, సాగునీరందించలేదన్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలకు అప్పటి నేతలు శంకుస్థాపన చేసి మ ధ్యలోనే వదిలేస్తే.. మోటార్లు, సబ్స్టేషన్ పను లు పూర్తిచేసిన ఘనత తమదన్నారు. అధిష్టా నం మెప్పుకోసం, రాజకీయ లబ్ధికి కోరుకంటి చందర్ గోదావరి గోస పేరిట పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, పూదరి సత్తయ్య గౌడ్, ముచ్చకుర్తి రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేలం డబ్బు జమచేయాలి పెద్దపల్లిరూరల్: యాసంగి(2022–23 సీజన్) ధాన్యం వేలం పాట ద్వారా సమకూరిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు సకాలంలో జమచేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో సోమవారం ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. యాసంగి(2022–23) పంట దిగుబడులను ప్రభుత్వం వేలం వేసిందని, వాటిని దక్కించుకున్న మిల్లర్లు సత్వరమే డబ్బు చెల్లించాలని అన్నారు. సమావేశంలో డీఎస్వో రాజేందర్, సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్, రైస్మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 96.4శాతం హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 96.4శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షకు 5,500 మంది హాజరుకావాల్సి ఉండగా 5,304 మంది హాజరయ్యారని ఆమె వివరించారు. -
‘చెత్త’కు పరిష్కారం
● స్థానికుల వ్యతిరేకతతో ఓసీపీ–4 ప్రాంతంపై యూటర్న్ ● గతంలో చెత్త వాహనాలను అడ్డుకున్న ఆర్ఎఫ్సీఎల్ ● తాజాగా అదే స్థలాన్నే చెత్త నిల్వలకు వినియోగిస్తున్న వైనం ● ఊపిరి పీల్చుకుంటున్న రామగుండం నగర పాలక సంస్థ అధికారులుకోల్సిటీ(రామగుండం): చెత్త సేకరణలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన రామగుండం మున్సిపల్ కా ర్పొరేషన్కు శాశ్వత డంపింగ్ యార్డు లేక ఇన్నాళ్లూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు గోదావరి తీరంలోని ఆర్ఎఫ్సీఎల్ ఖాళీ స్థలం వినియోగానికి అడ్డంకులు తొలిగినట్లు సమాచారం. ఊపిరి పీల్చుకున్న బల్దియా అధికారులు.. ఇంటింటా సేకరించిన చెత్తను యార్డుకు తరలిస్తున్నారు. బమోమైనింగ్ ఏర్పాటు కూడా.. యార్డులో బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చే యడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ చేపడతారు. సేంద్రియ ఎరువూ తయారు చేస్తారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదేస్థలంలో గతంలో చెత్త పోయడానికి వెళ్లే వాహనాలను ఆర్ఎఫ్సీఎల్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మూసివేసిన సింగరేణి ఓసీపీ–4 స్థ లాన్ని రెండు నెలల క్రితం చదును చేశారు. స్థానికు ల నుంచి తీవ్ర వ్యతిరేకంత ఎదురైంది. తాజాగా క లెక్టర్ ఆదేశాలతో బల్దియా అధికారులు ఇక్కడే తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవాంతరాలు.. బల్దియాకు సుమారు ఇరవై ఏళ్లుగా శాశ్వతపు డంపింగ్ యార్డుకు స్థలం లభించడంలేదు. 15ఏళ్ల క్రి తం రామగుండంలో ఏర్పాటు చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జల్లారం శివారులో పదెకరాలను కేటాయించిన సింగరేణి.. ఓసీపీ–5 ఏర్పా టు కావడంతో మళ్లీ స్వాధీనం చేసుకుంది. పీకే రా మయ్యకాలనీ సమీపంలోని రామునిగుండాలగుట్ట సమీప క్వారీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సూచించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీపురం గ్రామ సమీప ఆర్ఎఫ్సీఎల్ ఖాళీస్థలంలో చెత్త డంప్ చేయగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గోదావరి ఒడ్డున సమ్మక్క–సారలమ్మ జాతర, హిందూ శ్మశానవాటిక దారిలో రోడ్డు పక్కన చెత్త పారబోయగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సుందిళ్లగ్రామ శివారులోని సింగరేణి స్థలాన్ని వినియోగించినా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా కొంతకాలంగా గోదావరి నదీతీరంలోని ఆర్ఎఫ్సీఎల్ ఖాళీ స్థలాన్ని డంపింగ్ యార్డుకు వినియోగిస్తున్నారు. రోజూ 118 మెట్రిక్ టన్నుల చెత్త.. నగరంలోని 50 డివిజన్ల నుంచి రోజూ సుమారు 118 మెట్రిక్ టన్నుల వరకు చెత్త వెలువడుతోంది. దీంతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జెన్కో పరిశ్రమలకు చెందిన కాలనీల నుంచి మరో 50 మెట్రిక్ టన్నుల వరకు వెలువడుతోంది. ఈ మొత్తం చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. ఇప్పటిదాకా డంపింగ్యార్డ్ అందుబాటులో లేక ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పారబోశారు.బల్దియా సమాచారం డివిజన్లు 50 నగర వైశాల్యం(చ.కి.మీ.లలో) 93.87 జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644మొత్తం నివాసాలు 64,000 రోజూ వెలువడే చెత్త(మెట్రిక్ టన్నుల్లో) 118 పారిశుధ్య కార్మికుల సంఖ్య 448 ర్యాగ్ పిక్కర్లు 100 స్వచ్ఛ ఆటోలు 53 ట్రాక్టర్లు 18 జేసీబీలు 03 బ్లేడ్ ట్రాక్టర్లు 05 చర్యలు వేగవంతం చేస్తేనే.. రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వలు ఉన్నట్లుగా అధికారులు రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. దీంతో పురపాలక, నగరపాలక సంస్థల్లో వెంటనే బయోమైనింగ్ విధానాన్ని అమలు చేయా లని సూచించారు. తొలత చెత్తను శుద్ధిచేసి తడిచెత్తను సేంద్రియ ఎరువు తయారీకి, పొడి చెత్తను సిమెంటు, ఇతర కర్మాగారాల అవసరాలకు తరలించాలని ఆదేశించారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
● పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామ శివారులోని పురావస్తు శాఖ అధీనంలో ఉన్న సుమారు 66 ఎకరాలు ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ప్రహరీ నిర్మించాలి. కొందరు రియల్టర్లు సమీప భూములు కొనుగోలు చేసి కబ్జాకు యత్నిస్తున్నారు. వారినుంచి భూమిని కాపాడేలా చర్యలు తీసుకోవాలి’అని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మిట్టపల్లి వసంత కలెక్టర్ కోయ శ్రీహర్షకు విన్నవించారు. ● ‘అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు మా భూమి గురైంది.. ఆడపిల్లల కూలి వేతనం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించి ఆదుకోవాలి’ అని ఆ గ్రామానికి చెందిన శంకరమ్మ వేడుకుంది. పెద్దపల్లిరూరల్: ఇలా.. పలు సమస్యలపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణులు ప్రజల నుంచి అర్జీలను అందుకున్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ● ప్రజావాణికి బాధితుల విన్నపం ● ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి ● పరిష్కరించాలని ఆదేశాలు -
‘ఎల్ఆర్ఎస్’తో ప్రయోజనాలు
● దరఖాస్తుదారులు రాయితీని సద్వినియోగం చేసుకోండి ● రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ కావాల్సిందే ● ‘సాక్షి’ తో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పెద్దపల్లిరూరల్: ‘ఇంటి స్థలాలు, ప్లాట్లు గలవారు తప్పనిసరిగా క్రమబద్ధీకరణ(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం–ఎల్ఆర్ఎస్ ) చేసుకోవడమే మేలు. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం 25శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మండల కేంద్రాలు, వాటికి సమీప గ్రామాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు ఎల్ఆర్ఎస్ చేసుకోవడమే మేలని ఆయన సూచించారు. లేఔట్ లేని భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం ఎల్ఆర్ఎస్ అవసరమన్నారు. ప్లాట్లు క్రయవిక్రయాలకూ ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. సాక్షి: అవసరాల కోసం ప్లాటు అమ్ముకోవచ్చా? డీపీవో : కొనుగోలు చేసుకున్న ప్లాటును అమ్ముకోవాలన్నా, అందులో ఇల్లు కట్టుకోవాలన్నా కచ్చితంగా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్ను సు లభంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. విక్రయించే సమయంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి ఆ ప్రొసీడింగ్తోనూ విక్రయించుకోవచ్చు. సాక్షి: ఇంటి నిర్మాణానికి ఎల్ఆర్ఎస్కు సంబంధం ఏమిటి? డీపీవో : ఇల్లు కట్టుకునే స్థలం కచ్చితంగా క్రమబద్ధీకరించుకోవాల్సిందే. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. ఆవాస యోగ్యంగా మారిన తర్వాత ఆ ప్రాంతంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది ద్వారా సేవలను పొందవచ్చు. సాక్షి: భూమి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రంతో దరఖాస్తు చేసుకునే వీలుందా? డీపీవో : భూమి కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్తో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన నిబంధనలకు లోబడి లేదు. ఎల్ఆర్ఎస్ చేసుకున్న ప్లాటులో మాత్రమే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సులువుగా అనుమతి పొందవచ్చు. సాక్షి: ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేది ఎవరికి? డీపీవో : ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం లే ఔట్ నిబంధనలకు లోబడి లేకుంటే 2020లోగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారి కోసం ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించింది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించొచ్చు. సాక్షి: ఇంటి నిర్మాణానికి రుణం పొందడంలో సమస్యలు ఉంటాయా? డీపీవో : ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేస్తారు. సాక్షి: ఎల్ఆర్ఎస్తో కలిగే ప్రయోజనాలేమిటి? డీపీవో : ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం. లే ఔట్ నిబంధనలు పాటించని భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందే. 2020 నాటికి కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు, విక్రయిస్తే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
రాకపోకలకు ఇబ్బంది
ప్రధాన రోడ్లు, అంతర్గత రహదారులపై స్ట్రీట్లైట్లు లేవు. కమాన్ నుంచి రంగంపల్లి వెళ్లే దారితోపాటు నారాయణస్వామి నగర్ వెళ్లే మార్గంలో రాత్రివేళ రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉంది. – సంపత్రెడ్డి, పెద్దపల్లి భయంగా ఉంది మా పనుల కోసం పెద్దపల్లికి వచ్చి రాత్రిపూట ఇళ్లకు వెళ్తున్నాం. రోడ్లపై స్ట్రీట్ౖ లెట్లు లేక చీకటిగా ఉంటోంది. రంగంపల్లి, కలెక్టరేట్ ప్రాంతాల్లో స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేసి చీకట్లను తొలగించాలి. – కనుకుంట్ల సదానందం, కొత్తపల్లి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తాం పెద్దపల్లిలోని పలు ప్రాంతా ల్లో వీధిదీపాలు ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. వీధిదీపాల ఏర్పాటుకు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. పనులు త్వరలో ప్రారంభిస్తాం. – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి -
ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం
● రైతులు ఆందోళన చెందొద్దు ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి/ఎలిగేడు/జూలపల్లి/సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్: ప్రతీఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎస్సారెస్పీ డీ– 83, 86 కాకతీయ కాలువలకు సాగునీటిని సరఫరా చేసే రెవెల్లె ప్రధాన డిస్ట్రిబ్యూటరీని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎ స్సారెస్పీ అధికారులతో మాట్లాడి సాగునీటి విడుదల ప్రణాళిక, నీటిలభ్యత, ప్రవాహంలో ఇబ్బందులపై ఆరా తీశారు. కాల్వశ్రీరాంపూర్లో నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించారు. నాయకులు సారయ్యగౌడ్, రామిడి తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, రామ చంద్రారెడ్డి, ప్రకాశ్రావు, శిరీష, లంక సదయ్య, మూల రమణారెడ్డి, కటుకూరి రాజిరెడ్డి, కిషన్రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్రెడ్డి, రాంరెడ్డి, రాజ పాపారెడ్డి సతీశ్, గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ కాలువలో నీటిపారకాన్ని పరిశీలించారు. -
వేతనాల కోసం ఫిర్యాదు
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలల వేతనాలు చెల్లించలేదని పలువు రు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆదివా రం కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. సీహెచ్పీలో థర్డ్పార్టీ కోల్ షాంప్లింగ్ మజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103మందికి గతేడాది ఏప్రిల్, మే నెలకు సంబంధించిన వేతనాలను సబ్కాంట్రాక్టు సంస్థ కేసీఎస్ ఇంకా చెల్లించలేదన్నారు. ప్రధాన కాంట్రాక్టు పొందిన ఈపీటీఆర్ కంపెనీ అధికారులను సంప్రదించినా స్పందించకపోవడంతో సింగరేణి దృష్టికి తీసుకుకెళ్లామన్నారు. అయి నా వేతనాలు అందలేదన్నారు. వెంటనే వేత నాలు చెల్లించేలా చూడాలన్నారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. నాయకులు కర్రె సంజీవరెడ్డి, కందుల సంధ్యారాణి, గుండబోయిన భూమయ్య, మి ట్టపల్లి సతీశ్, కోడూరి రమేశ్ పాల్గొన్నారు.స్విమ్మింగ్పూల్ ప్రారంభం గోదావరిఖని: నిమ్లో ఆధునికీకరించిన ిస్వి మ్మింగ్ పూల్ను జీఎం వెంకటయ్య ఆదివారం ప్రారంభించారు. నిమ్లో శిక్షణకు వచ్చే అధికా రులు, కాలనీలోని అధికారులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకొనేలా స్విమ్మింగ్పూల్ను తీర్చిదిద్దినట్లు జీఎం తెలిపారు. ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్, వకీల్పల్లిగని ఏజెంట్ నెహ్రూ, ఏరియా ఇంజినీర్ నరసింహారావ్, వర్క్షాప్ ఏజీఎం ఎర్రన్న పాల్గొన్నారు. లక్ష్యం సాధించిన ఓసీపీ –5గోదావరిఖని: అధికారులు, కార్మికులు సమష్టి గా శ్రమించారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 16 రోజుల ముందుగానే సాధించారు.. జీడీకే–5 ఓసీపీకి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఈనెల 15వ తేదీతోనే 36.19లక్షలు ట న్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారు. నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేసిన కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులను ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, పీవో చంద్రశేఖర్ అభినందించా రు. గతేడాది కూడా 30లక్షల టన్నుల లక్ష్యానికి 35.05లక్షల సాధించి 117శాతంలో నిలిచింది. రాజాపూర్వాసుల ఆందోళన రామగిరి(మంథని): తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని రాజాపూర్ వాసులు అన్నారు. పెద్దపల్లి – మంథని రోడ్డు, ఎల్ – 6 కెనాల్ పగుళ్ల ను ఆదివారం పరిశీలించి ఆందోళన చేశారు. బ్లాస్టింగ్లతో రోడ్డు కుంగుబాటుకు గురైతే సింగరేణి అధికారులు వక్రీకరించారని అన్నారు. -
నైతికత.. క్రమశిక్షణ
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): పతనమవుతున్న మానవ విలువలను పెంపొందించడం.. మరుగున పడుతున్న నైతికతపై అవగాహన కల్పించడం.. క్రమశిక్షణతో ఉత్తమలుగా తీర్చిదిద్దడం.. అన్నింటికీ మించి కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన చేయ డం లక్ష్యంగా సింగరేణిలోని పాఠశాలలు తమదై ముద్ర వేసుకుంటున్నాయి. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా ఆధునిక వసతులతో ముందుకెళ్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 9 పాఠశాలలు.. తమ కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు సింగరేణి సంస్థ మొత్తం 9 పాఠశాలలు నిర్వహిస్తోంది. విద్యార్థుల ను చదువుతోపాటు ఆటాపాటల్లోనూ ఉత్తములుగా తీర్చిదిద్దుతోంది. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ మెరికల్లా తయారు చేస్తోంది. అర్హులైన, అనుభవంగల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యబోధన చేస్తోంది. ఆర్జీ–2 ఏరియాలోని సెక్టార్–3 పాఠశాల ఉత్తమ విద్యా బోధన చేయడంలో సంస్థ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. సింగరేణి చరిత్రలోనే తొలిసారి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు యైటింక్లయిన్కా లనీ సింగరేణి పాఠశాల ఎంపిక కావడం విశేషం. సీబీఎస్ఈ విద్యాబోధనకు అవసరమైన సౌకర్యాల కల్పన, యంత్రపరికరాలు సమకూర్చడం కోసం సింగరేణి ఇప్పటికే రూ.5 కోట్లు వెచ్చించింది. పాఠశాలల ప్రత్యేకతలు ఇవే.. విద్యార్థులకు సకల సౌకర్యాలలో కూడిన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చిన యాజమాన్యం.. డిజిటల్ తరగతులు నిర్వహిస్తోంది. అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ప్రయోగశాలలు, కంప్యూటర్ శిక్షణ, కొత్త విషయాలపై అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ఆధునిక లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యోగా, ఆటల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీలోనూ ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తోంది. విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిపుణులతో సదస్సులు, జనరల్ నాలెడ్జి టెస్ట్లు నిర్వహిస్తోంది. విజ్ఞాన పర్యటనలతో ఉత్సాహం నింపుతోంది. సైన్స్, మ్యాథ్స్, ఒలింపియాడ్స్లోనూ అవగాహన కల్పిస్తోంది. అన్నింటికన్నా విద్యార్థుల నడవడిక, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేందుకు నిపుణులతో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కల్పనకు కార్యాచరణ రూపొందిస్తోంది.స్కూళ్ల సమాచారం సింగరేణిలోని మొత్తం స్కూళ్లు 9 ఉపాధ్యాయుల సంఖ్య 700 ఇందులో పర్మినెంట్ టీచర్లు 200 నాన్ టీచింగ్ స్టాఫ్ 50 తరగతులు 1 నుంచి – 10 మీడియం ఇంగ్లిష్ కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులో డిజిటల్ క్లాసులు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ పాఠశాలల్లో ఎన్సీసీ శిక్షణ సింగరేణి పాఠశాలల ప్రత్యేకత నాణ్యమైన విద్య అందిస్తున్నాం సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాల ల్లో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధానంగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రత్యేకంగా నైతిక విలువలు పెంపొందించడం లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నైతిక విలువలు పెంపొందించడం ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఎంతోకీలకం. అందుకే సింగరేణి ఈ నిర్ణయం తీసుకుంది. – సుందర్రావు, ప్రధానోపాధ్యాయుడు, సెక్టార్ –3 సింగరేణి స్కూల్ -
పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించాలి
రామగిరి(మంథని): సింగరేణి లద్నాపూర్ ఆర్అండ్ ఆర్ కాలనీలో వసతులు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఓసీపీ–2, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాల్లో శనివారం కలెక్టర్ ప ర్యటించారు. లద్నాపూర్లోని 88 ఎకరాలను సింగరేణికి అప్పగించాలన్నారు. రోడ్డు, కాలువల మ ళ్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూ చించారు. డిసెంబర్ 4న చోటుచేసుకున్న స్వల్ప భూకంపంతో పెద్దపల్లి – మంథని మెయిన్రో డ్డు, ఎస్ఆర్ఎస్సీ కాలువలో ఏర్పడిన పగుళ్లను స రిచేయాలన్నారు. కాగా, బ్లాస్టింగ్లతో ఇళ్లకు ప గుళ్లు ఏర్పాడుతున్నాయని, దుమ్ము, ధూళితో అ నారోగ్యం బారిన పడుతున్నామని, తమ గ్రామా న్ని సింగరేణి స్వాధీనం చేసుకునేలా చూడాలని రాజాపూర్ గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. ‘కలెక్టర్ సారూ.. మీ కాళ్లు మొక్కుతా బాంచన్.. కనికరించండి’ అని లద్నాపూర్ గ్రామానికి చెందిన తోట్ల పోశమ్మ కలెక్టర్ కాళ్లపై పడింది. సింగరే ణి నుంచి పూర్తి పరిహారం రాలేదని, రాత్రిపూట అధికారులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందింది. తగిన న్యాయం చేస్తా మని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో సురేశ్, ఆర్జీ–3 జీఎం సుధాకర్రావు, ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, తహసీల్దార్ సుమన్, ఆర్ఐ పాల్గొన్నారు. -
● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల్లో నలుగురు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే ● మరింత మంది కోసం గాలిస్తున్న టీసీఎస్బీ ● విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటున్న విదేశాంగశాఖ ● నిందితులపై కరీంనగర్ పోలీసుల లుక్ అవుట్ నోటీసులు
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్ వయసు 25ఏళ్లలోపే. కానీ బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను ఇప్పటి వరకూ వివిధ సైబర్ ఫ్రాడ్ కంపెనీలకు దాదాపు 300 మందికి పైగా యువతను విక్రయించాడు. జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన నలుగురిని ఇదేవిధంగా లావోస్ తరలించి వేధిస్తే వారు ఎలాగోలా ఇండియాకు వచ్చి రాజశేఖర్పై ఫిర్యా దు చేయగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో కేసు నమోదు చేసి లుక్అవుట్ నోటీసు జారీచేసింది. గతేడాది సిద్దిపేటలోనూ రాజశేఖర్పై ఇదే తరహా కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్రెడ్డిని ఇదే తరహాలో మోసగించిన విషయంలో మానకొండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కరీంనగర్ పోలీసులు రాజశేఖర్పై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. -
కలెక్టరేట్లో సందర్శకుల కష్టాలు
పెద్దపల్లిరూరల్: వివి ధ పనుల కోసం కలెక్టరేట్కు వచ్చే సందర్శ కులు తాగునీటికోసం తపిస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే (ఇన్వార్డు ఆఫీసు వద్ద)మార్గంలో వాటర్ కూ లర్ ఉన్నా.. అందులో నీళ్లు పోయడంలేదు. మండుతున్న ఎండలకు దాహం తీవ్రమవుతోంది. దాహం తీర్చుకునేందుకు సందర్శకులు రాజీవ్రోడ్డు సమీపంలోని హోటళ్లు, క్యాంటీన్ను ఆశ్రయించాల్సి వస్తోంది. వృద్ధు లు, దివ్యాంగులు మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో వారు మెట్లు ఎక్కలేకపోతున్నా రు. అధికారులు స్పందించి లిఫ్ట్ మరమ్మతు చేయాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని సందర్శకులు కోరుతున్నారు. -
సీఎంపై ఠాణాలో ఫిర్యాదు
గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అను చిత వాఖ్యలు చేశారని పేర్కొంటూ సీఎం రేవంత్రెడ్డిపై స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ ధ్వర్యంలో శనివారం గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకత్వా న్ని రెచ్చగొట్టేలా ఆయన వాఖ్యలు ఉన్నాయని ఫి ర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై కఠిన చర్యలు తీ సుకోవాలని అందులో కోరారు. ఈమేరకు ఎస్సై భూమేషన్కు ఫిర్యాదు పత్రం అందజేశారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉచితశిక్షణ పెద్దపల్లిరూరల్: డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతులకు చెందిన వారికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీ సర్ రంగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. డిగ్రీ పూర్తిచేసి 26ఏళ్లలో పు వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నా రు. అదేనెల 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కరీంనగర్లో నిర్వహిస్తామని, వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలని సూచించారు. స్కూళ్లలో ఏఐ విద్యాబోధన రామగుండం: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాల ల్లో శనివారం ఏఐ సాయంతో విద్యాబోధన ప్రారంభమైంది. ఆబాది రామగుండం, మల్యాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేథ(ఏఐ)విద్యా బోధనకు ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఎంఈవో చంద్రయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం అజ్మీరా శారద, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. చదవులో వెనుకబడిన విద్యార్థులను ప్రాథమిక స్థాయిలోనే ఏఐ సాయంతో విద్యా బోధన చేయడం ద్వారా కనీస విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు వివరించారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. హెల్త్ సబ్సెంటర్లు, హాస్టల్, పాఠశాల భవనాల మరమ్మతులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద చేపట్టిన సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తిచేసి ఈనెల 29లోగా బిల్లులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీశ్బాబు, సీపీవో రవీందర్ తదితరులు ఉన్నారు. పీపీఈ కిట్లు ధరించాలి జ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ సూచించారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీపీఈ కిట్లు ధరించకపోతే కలిగే నష్టాలు, అనర్థాల గురించి వివరించారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, చీర లు, టవల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రా మణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలిఎలిగేడు(పెద్దపల్లి): గ్రామాల్లో పారిశుధ్య ప నులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచా యతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సూచించారు. సుల్తాన్పూర్, ధూళికట్ట, ముప్పిరితోట గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను డీపీవో శనివారం తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిశుభ్రతోనే ఆరోగ్యవంతంగా ఉంటామని అన్నారు. ఎంపీవో ఆరిఫ్, ధూళికట్ట పంచాయతీ కార్యదర్శి పున్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 248 మంది గైర్హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు 248 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. పరీక్షకు 3,895 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,647 మంది (93.6శాతం) హాజరయ్యారని వివరించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆమె పేర్కొన్నారు. -
ఓవర్ టు మినిస్టర్
కేంద్రమంత్రి సంజయ్ వద్దకు పంచాయితీ ● బీజేపీలో ముదిరిన గ్రూపు రాజకీయాలు ● జాతీయ, రాష్ట్రస్థాయి నేతలకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులుపెద్దపల్లిరూరల్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లోని అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయి. సమన్వయంతో పార్టీని పటిష్ట పర్చాల్సిన కమలనాథులు కయ్యానికే కాలుదువ్వుతున్నారు. అంతటితో ఆగకుండా సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చెంతకూ చేరారు. బీజేపీకి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఎంతో ఆదరణ ఉన్నా.. ఆ పార్టీ నేతలు ఏకతాటిపైకి రాకపవడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు.. పార్టీ పటిష్టత కోసం పనిచేసే నాయకులకూ కష్టాలు తెచ్చిపెడుతోంది. కేంద్రమంత్రి ‘బండి’ ఇంటి ఎదుట నిరసన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని పెద్దపల్లికి చెందిన పలువురు నాయకులు శనివారం కరీంనగర్లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసం ఎదుట ఏకంగా నిరసన తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. పా ర్టీ కోసం, ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం పనిచేయని సంజీవరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారని వారు ప్రశ్నించారు. సంజీవరెడ్డి ఇటీ వల కారు కొనుగోలు చేయగా.. అక్కడకు మీరు(కేంద్రమంత్రి సంజయ్)వెళ్లడం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల విషయంలో తానేమీ జోక్యం చేసుకోనని సంజయ్ వారికి సర్ది చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులదే గతఎన్నికల వరకూ పెద్దపల్లిలో పట్టు ఉండేది. ఆ ఎన్నికల్లో దుగ్యాల ప్రదీప్కుమార్ టికెట్ దక్కించుకోవడంతో బీజేపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ప్రదీప్కుమార్కు మద్దతుగా పనిచేయక పోగా ప్రత్యర్థి పార్టీ నేతలతో చేతులు కలిపి బీజేపికి తీరని నష్టం చేశారని దుగ్యాల ప్రదీప్ వర్గీయులు ఎదుటి వర్గం వారిపై బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. పెద్దపల్లి సెగ్మెంట్కే చెందిన ఆయన ఈ ప్రాంత ప్రజలకు పరిచయమే లేదని, రాష్ట్ర, జాతీయస్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో అసెంబ్లీ టికెట్ సాధించుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నారని గుజ్జుల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పెద్దపల్లిలో గుజ్జుల, దుగ్యాల వర్గీయులు ఇటీవల వేర్వేరుగా సంబురాలు నిర్వహించడం వారిలోని ముఠా తగాదాలను మరోసారి వెలుగులోకి తెచ్చినట్లయ్యింది. శుక్ర వా రం నాటి హోలీ వేడుకలను సైతం పోటాపోటీగానే జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధ్యక్షుడిని మార్చాల్సిందే..! జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీపడగా కేంద్రమంత్రి సంజయ్ సూచన మేరకు కర్రె సంజీవరెడ్డికి బీజేపీ అధిష్టానం పగ్గాలు కట్టబెట్టిందనే ప్ర చారం ఉంది. బాధ్యతలను చేపట్టిన నాటినుంచే జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొందరు నాయకులు సంజీవరెడ్డి నియామకంపై గుర్రుగా ఉన్నారు. పెద్దపల్లిలో సంజీవరెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మినహా ఇతర ముఖ్య నేతలెవరూ హాజరుకాలే దు. సంజీవరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రా మకృష్ణారెడ్డితో కలిసి కార్యక్రమాలు నిర్వహి స్తూ పార్టీకోసం పనిచేస్తున్న తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ దుగ్యాల వర్గీయులు ఆరోపిస్తున్నారు. పార్టీకి పట్టున్నా.. గ్రూపులతోనే నష్టం మొన్నటి పట్టభద్రులు, ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీ జేపీ అభ్యర్థులే దక్కించుకోవడం పార్టీకి ప్రజల్లో ఉ న్న ఆదరణను తెలియజేస్తోందని నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ పటిష్టత కో సం పనిచేయాల్సిన నాయకులు.. ఆధిపత్యం కో సం పార్టీని భ్రష్టు పట్టిస్తూ తమను గందరగోళానికి గురిచేస్తున్నారని కొందరు క్రియాశీలక కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తొ లిసారి పెద్దపల్లికి కేంద్రమంత్రి సంజయ్ రావడాన్ని ఓ వర్గం నేతలు జీర్ణించుకోలేకనే ఈ వివాదంలోకి లాగుతున్నారని ప్రత్యర్థి వర్గీయులు పేర్కొంటున్నారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి ఏమాత్రం పనిచేయని వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలంటూ కేంద్రమంత్రి చెప్పడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు చెందిన సోమారపు లావణ్య, చిలారపు పర్వతాలు లాంటి బీసీ నేతల్లో ఒకరికి అవకాశమిచ్చినా అభ్యంతరం లేదని చెప్పినా పట్టించుకోకుండా సంజీవరెడ్డికి కట్టబెట్టడం సరికాదంటున్నారు. వెంటనే సంజీవరెడ్డిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందరినీ సమన్వయం చేస్తున్నాబీజేపీ క్రమశిక్షణ గ ల పార్టీ. నా విధానాలు నచ్చకపోతే పార్టీ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కేంద్రమంత్రిని వివాదంలోకి లాగడం, సోషల్మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. క్రమశిక్షణ పాటించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది. – కర్రె సంజీవరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
బూచాళ్లమ్మ.. బూచాళ్లు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగశాఖ, జాతీయ దర్యాప్తు సంస్థలు, స్థానిక పోలీసులు కోరుతున్నారు. తాజాగా థాయ్లాండ్ కేంద్రంగా వెలుగుచూసిన మానవ అక్రమ రవాణాలో సూత్రధారులు, పాత్రధారులు చివరికి బాధితులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టాలు, పాస్పోర్టులు రాగానే రెక్కలు కట్టుకుని, కలల కొలువు చేసేందుకు విదేశాలకు వెళ్దామనుకునే యువతకు ఈ ఉదంతం ఒక హెచ్చరిక. అదే సమయంలో భారతీ యుల క్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరూపించింది. థాయ్లాండ్, మయన్మార్లో చిక్కుకున్న దాదాపు 540 మందిని కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ల చొరవతో రెండు ప్రత్యేక సైనిక విమానాల్లో ఇళ్లకు తరలించింది. -
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ధర్మారం(ధర్మపురి): కాంగ్రెస్ ప్రజాపాలన లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రభు త్వ విప్ లక్ష్మణ్కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వి వేక్ ఆకాంక్షించారు. గోపాల్రావుపేట, దొంగ తుర్తిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర హ్మోత్సవాలకు వారు హాజరయ్యారు. నర్సింహులపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. క టికెనపల్లిలోని శ్రీవేకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొడారి హన్మయ్య, పాలకుర్తి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీపీని కలిసిన నాయకులు గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిశోర్ ఝా ను రాష్ట్ర కనీస వేతన అమలు కమిటీ చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, బహిరంగ మద్యపాన నిషేధం లాంటి విషయాలను నాయకులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, వికాస్కుమార్యాదవ్, ఎండీ అక్రం, దాస్, సదానందం, మార్కండేయ, నవీన్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.నేడు హుండీ లెక్కింపు పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివా రం లెక్కించనున్నట్లు ఈవో శంకరయ్య తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని శ్రీవేకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం 10 గంటలకు హుండీ ఆదాయం లెక్కిస్తామని ఈవో తెలిపారు. పంట రక్షణ కోసం.. పెద్దపల్లిరూరల్: పంటలను కోతుల బారినుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటా లు పడుతున్నారు. కొందరు అన్నదాతలు మంచెలను వేసి శబ్దం చేసి వానరాలను తరమికొడుతున్నారు. ఇంకొందరు ఆధునిక సాంకేతికతతో రూపొందించిన పరికరాలతో భారీ శబ్దం చేస్తూ కోతులను భయపెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారు. అలాంటి పరికరాలను తయారు చేసిన కొందరు పట్టణంలో ఒక్కో దాన్ని రూ.250కి విక్రయిస్తున్నారు. -
‘ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉ ప్పు రాజ్కుమార్ విమర్శించారు. ఆరుగ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, మాజీమంత్రి జగదీశ్వర్రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంటూ స్థానిక బస్టాండ్ వ ద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో అధికా రం దక్కించుకోవాలనే ఆరాటంతో అడ్డగోలు హామీలు ఇచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాయకులు సంపత్, మోహన్రావు, రాములు, చంద్రశేఖర్, భిక్షప తి, ఖదీర్ఖాన్, కార్తీక్, సురేశ్, వైద శ్రీనివాస్, మధు, అఖిల్, లక్ష్మణ్, ఫహీం, వాహిద్, అరుణ్, నరేశ్, ప్రేంకుమార్, ఆకుల శ్రీనివాస్, వే ణుగోపాలరావు, లవన్కుమార్ ఉన్నారు. -
తూకం.. మోసం
ఇది రామగుండంలోని ప్రధాన కూరగాయల మార్కెట్. పాతరకపు త్రాసు, బాట్లతో కూరగాయలు తూకం వేస్తోంది ఈ మహిళా వ్యాపారి. తూకంలో మోసం జరగకుండా ఎలక్ట్రానిక్ యంత్రంపైనే తూకం వేయాలి. కానీ, ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా ఒక్కో కిలోపై కస్టమర్ కనీసం 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు నష్టపోతున్నాడు. సాక్షి, పెద్దపల్లి: కిరాణం, సూపర్ మార్కెట్కు వెళ్లి కిలో చక్కెర, అర్ధకిలో కందిప్పు కావాలంటే ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి ఇస్తున్నారు. కానీ, కిలో బదులు 950 గ్రాములు, 500గ్రామలకు బదులు 450గ్రాములే తూకం ఉంటోంది. కేజీలో 150 గ్రాములు, అర్ధకిలోకు కనీసం 50 గ్రాములు కస్టమర్లు నష్టపోవాల్సి వస్తోంది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు తూకంలో మోసాలు చేస్తూనే ఉన్నారు. సాధారణ త్రాసుతోపాటు ఎలక్ట్రానిక్ యంత్రాల నూ ట్యాంపర్ చేసి నిలువునా దోచుకుంటున్నారు. తూకం, కొలతల్లో వ్యత్యాసంతోపాటు చిరునామా లేని చిరుతుండి, ఆహార పదార్థాల పొట్లాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. అయినా, పట్టించుకునే వారే కరువయ్యారు. తూకంంలో మోసంతో పాటు ఎమ్మార్పీలోనూ దగా చేస్తున్నారు. తనిఖీలు లేకనే.. జిల్లాలోని కిరాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, పంట కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు వినియోగించే బాట్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను లీగల్ మెట్రా లజీ అధికారులు తనిఖీ చేశారు. అన్నీ సక్రమంగా ఉంటే రెండేళ్ల కాలపరిమితో లైసెన్స్ జారీచేయాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలి. అయితే, జిల్లాలో ఎక్కడా ఈ పద్ధతి అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరాణాలు, బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారం చేసేవా రు ఒక్కోకిలోకు 50 గ్రామలు నుంచి 100గ్రామలు వరకు తూకంలో మోసం చేస్తున్నారు. ముద్ర లేనిబాట్లు, తూకం మిషన్లను వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ కుచ్చుటోపి ఎలక్ట్రానిక్ కాంటా ఖాళీగా ఉంటే డిస్ప్లే సున్నా బ రువు చూపిస్తుంది. తర్వాత సరుకులు పెట్టి బరువు లు లెక్కిస్తారు. కానీ, దానిలోని ఆప్షన్లను మార్చడం ద్వారా సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్ప్లే అ య్యేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 950 గ్రామలు సరుకు పెడితే 1,000గ్రాముల బరువు చూపించేలా సెట్టింగ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ యంత్రాలకు తూనికలు, కొలతల శాఖ అధికారుల నుంచి లైసెన్స్ పొందాలి. సీల్ తొలగించరాదు. ఎలక్ట్రానిక్ కాంటాలు, బాట్లను అందుబాటులో ఉంచాలి. అనుమానం వస్తే వాటితో తూకం వేసి చూపించాలి. జిల్లాలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి కొనుగోలు చేసే ప్రతీ వస్తువు తూకం సరిగా ఉన్నదీ లేనిదీ, ఎమ్మార్పీ, కొలతలు తదితర వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. తూకాల్లో తేడా ఉన్నట్లుగా భావిస్తే ఫిర్యాదు చేయాలి. వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేసి పరిహారం పొందే హక్కు ఉంది. – విశ్వేశ్వరయ్య, లీగల్ మెట్రాలజీ అధికారి ఫోరాన్ని ఆశ్రయిస్తే పరిహారంనిత్యావసరాల్లో కల్తీ, అడ్డగోలు ధరలు, ఆర్థిక మోసాలు.. ఇలా వినియోగదారులు నిత్యం ఏదోఒకరూపంలో దగా పడుతున్నారు. వస్తుసేవలకు దూరమవుతున్నారు. ఒకవైపు ఆధునికత అందుబాటులోకి వస్తున్నా.. మరోవైపు ఆన్లైన, ఆఫ్లైన్ మోసాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ వంటివి అక్షరాస్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంకా బోగస్ ఫైనాన్స్ సంస్థలు, చిట్ఫండ్లతో అనేక విధాలుగా కస్టమర్లు నష్టపోతూనే ఉన్నారు. ఈ తరహా మోసాలను అరికట్టి, రక్షణగా నిలిచేందుకే వినియోగదారుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం 1962 మార్చి15న అమల్లోకి రాగా, మనదేశంలో 1986లో చట్టం రూపొందించారు. వస్తుసేవల్లో నష్టపోతే వినియోగదారుల ఫోరంలో ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 180042500 333కు ఫోన్చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఏది కొనుగోలు చేసినా నష్టమే వినియోగదారుల జేబుకు చిల్లు నేడు వినియోగదారుల దినోత్సవం బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లు 25 కేజీల బస్తాపై బరువు 26 కేజీలు ఉన్నట్లు ముద్రిస్తున్నారు. అందులో 25 కేజీల కన్నా తక్కువగానే బియ్యం నింపుతున్నారు. కస్టమర్ల వద్ద 26 కేజీల ధర వసూలు చేస్తున్నారు. జీఎస్టీ తప్పించుని ప్రభుత్వ ఆదాయానికి ఇలా గండికొడుతున్నారు. జిల్లాలోని ఓ మద్యం దుకాణం పక్కన ఉన్న స్నాక్స్ షాప్లో ఎమ్మార్పీ కన్నా రూ.5 అధికంగా వాటర్ బాటిల్ వ్రియిస్తున్నారని లీగల్ మెట్రాలజీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు దుకాణంలో తనిఖీ చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేశారు. -
సర్కారు బడుల్లో ఏఐ చదువులు
● విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపు లక్ష్యం ● నేటి నుంచి 15 పాఠశాలల్లో అమలుకు నిర్ణయంపెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాయంతో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేలా ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆరు జిల్లాల్లో పెద్దపల్లికి కూడా చోటుదక్కింది. 3, 4, ఐదో తరగతుల విద్యార్థుల కోసం.. జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదో తరగతి విద్యార్థుల్లో కనీస విద్యాప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యాశాఖ ఏఐ సాయంతో విద్యాబోధన చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ప్రాథమిక స్థాయి నుంచే ఆశించిన స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియల్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. చదవడం, రాయడంపై.. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు రాయడం, చదవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కృత్రి మ మేథ ఆధారిత ఉపకరణాలతో చదవడం, రా యడంలో వెనకబడిన వారిలో విజ్ఞానం పెంపొందిస్తారు. ఏఐ ద్వారా విద్యా ప్లాట్ఫాంలు పర్సనలైజ్డ్ లర్నింగ్ టూల్స్ ద్వారా అభ్యసన మెరుగుపర్చుతా రు. బలహీనతలకు అనుగుణంగా కస్టమైజ్డ్ లర్నింగ్ మోడల్స్ ద్వారా అభ్యసన అందిస్తారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో విద్యాబోధన.. ఏఐ కార్యాచరణ అమలుకు ఎంపికై న పాఠశాలల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో పిల్లలకు సులభంగా అర్థమయేలా విద్యాబోధన చేస్తారు. 3, 4, ఐదో తరగతి విద్యార్థులను ఐదుగురి చొప్పున బ్యాచ్గా ఏర్పాటు చేస్తారు. ప్రతీ బ్యాచ్కు తెలుగువాచకం, గణితం అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు చెబుతుంది. ఆ విద్యార్థికి ఏ స్థాయిలో అర్థమైందనే విషయాన్ని నిర్ధారించుకుని సులువుగా అర్థం చేసుకునేలా బోధిస్తారు. జిల్లాలో నేటినుంచి అమలు.. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న జిల్లాలో శనివారం నుంచి 15 పాఠశాలల్లో ఏఐ సాయంతో విద్యాబోధన అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు ఇటీవల శిక్షణ కూడా ఇప్పించారు.పైలెట్ ప్రాజెక్టులోని స్కూళ్లు మండలం గ్రామం పెద్దపల్లి ఎంపీపీఎస్, రంగాపూర్ పెద్దపల్లి ఎంపీపీఎస్, మారెడుగొండ రామగుండం గాంధీపార్క్ గోదావరిఖని రామగుండం రామగుండం రామగుండం మల్యాలపల్లి రామగిరి ఎంపీపీఎస్, నాగేపల్లి పాలకుర్తి ఎంపీపీఎస్, కన్నాల ఎలిగేడు సుల్తాన్పూర్ ధర్మారం కొత్తూరు ధర్మారం నర్సింహులపల్లి కాల్వశ్రీరాంపూర్ గంగారం ముత్తారం(మంథని) ఖమ్మంపల్లి మంథని కన్నాల జూలపల్లి తేలుకుంట పాలకుర్తి బసంత్నగర్ -
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: యాసంగిలో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో గురువారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి సమీక్షించారు. ఈ సీజన్లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకాంత్, డీఎంవో ప్రవీణ్రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, డీసీవో శ్రీమాల, డీఎస్వో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టిసారించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో విద్యాప్రమాణాల పెంపుపై హెచ్ఎం లు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. పాఠశాలల్లో గుణాత్మక విద్య మెరుగుపర్చేందుకు హెచ్ఎంల పర్యవేక్షణ కీలకమన్నారు. సమగ్రశిక్ష సమన్వయకర్త పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేత రామగుండం ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శ్రీజకు కలెక్టర్ శ్రీహర్ష ల్యాప్టాప్ అందజేశారు. 8వ తరగతిలో తల్లిని కోల్పోయిన శ్రీజ పదో తరగతిలో 983 మార్కులు సాధించి ప్రతిభ చూపింది. ఇంజినీరింగ్ చదువుకు ల్యాప్టాప్ అవసరమని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ స్పందించి ల్యాప్టాప్ అందజేశారు. -
సూరీడు మార్చిఫాస్ట్
జిల్లాలో ఈనెల 10 నుంచి 13 వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలుజిల్లా 10 11 12 13 కరీంనగర్ 38.1 38.7 39.9 39.4 జగిత్యాల 38.6 39.1 40.3 39.9 పెద్దపల్లి 39.3 39.6 40.3 40.0 సిరిసిల్ల 39.8 39.5 40.0 38.7 జగిత్యాలఅగ్రికల్చర్/కరీంనగర్అర్బన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. 15న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: భవిష్యత్ తరాలు గుర్తుండేలా పోలీసుల పనితీరుండాలని, క్రమశిక్షణ, నిబద్దతతో పనిచేసిన అధికారులు, సిబ్బందికి తగిన గుర్తింపు ఇస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసుల నుద్దేశించి మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్తే విలువైన సమాచారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క అధికారి తమ వ్యక్తిగత జీవితానికి, మీవద్ద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలని, సిబ్బందితో మర్యాదగా మాట్లాడి దర్బార్ లాంటివి నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే వారికి పెద్దలా ఉండి పరిష్కరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా చేయడం కన్నా, సమయానుసారంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఇది మీసంకల్పం, నిబద్ధత మీకు గౌరవాన్ని ఇస్తుందన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలు జరుపుకుందామని సీపీ అంబర్కిశోర్ ఝా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. హోలీ వేడుకల్లో ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అనుమతి లేకుండా వ్యక్తులు, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం సరికాదన్నారు. బైకులు, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు. హోలీ సందర్భంగా పెట్రోలింగ్ పెంచామని, ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి
మంథని/పాలకుర్తి/రామగుండం: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. గురువారం మంథని మండలం గుంజపడుగు, నాగారం, మల్లేపల్లి, ఎక్లాస్పూర్, సూరయ్యపల్లి, పాలకుర్తి మండలం కన్నాల, జీడీనగర్, బసంత్నగర్, జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్, అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్, ఆకెనపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరాను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి నాణ్యమైన కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా పంచాయతీ కార్యదర్శులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 20 వరకు వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ఆర్జీదారులతో వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి సతీశ్కుమార్, మండల పంచాయతీ అఽధికారి శేషయ్య, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈతో పాటు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సెల్ నం.99592 25922కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలపాలని పేర్కొన్నారు.ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలజ్యోతినగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల తేదీలను విడుదల చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్ చలువాజి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీపీని కలిసిన ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడుజ్యోతినగర్: రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిశోర్ ఝాను గురువారం ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, గోపాల్రావు, సంపత్, మల్లేశ్, బొద్దున రాజేశం, శ్రీనివాస్, భూమల్ల చందర్ తదితరులున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లిలో గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గోదావరిఖని ఏసీపీ మడుత రమేశ్ విచారణ జరిపారు. గ్రామానికి చెందిన సముద్రాల రమేశ్ తనను కులం పేరుతో దూషించాడని మెంత్రి ఓదెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులను విచారించారు. ఆయన వెంట ఎస్సై గోపతి నరేశ్ ఉన్నారు. మొల్లమాంబ జయంతి ఉత్సవాలు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో గురువారం మొల్లమాంబ జయంతి నిర్వహించారు. శాలివాహన (కుమ్మరి)సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి కటికనపల్లి రవికుమార్, నాయకులు రాయమల్లు, వీరప్రసాద్, రమేశ్, శ్రీధర్, సదయ్య, తిరుపతి, ఓదెలు, రాకేశ్, రమేశ్ ఉన్నారు. పెద్దపల్లి పోలీస్స్టేషన్ తనిఖీపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ గురువారం పెద్దపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పెద్దపల్లి ప్రాంత పరిస్థితులు, నేరాల నమోదు తదితర వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై లక్ష్మణ్రావులను అడిగి తెలుసుకున్నారు. -
పౌర సేవలపై పట్టింపేది?
● మున్సిపాలిటీల్లో అటకెక్కిన సిటిజన్ చార్ట్ ● బల్దియాల్లో ఆన్లైన్ ఫిర్యాదులపై స్పందన కరువు ● అవగాహన లేక, పరిష్కారం కాక ఆసక్తి చూపని పట్టణవాసులు రామగుండం కార్పొరేషన్లోని మార్కండేయకాలనీకి చెందిన వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలు కావొస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో నేరుగా కార్యాలయంకు వెళ్లి తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు.మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఓ వ్యక్తి భవన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజులు గడిచినా అనుమతులు రాకపోవడంతో నేరుగా కార్యాలయానికి వెళ్లి విచారించారు. అసలు ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవని తెలిసి, ప్రత్యక్షంగా కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. ●సాక్షి, పెద్దపల్లి: సర్.. మా గల్లీలో నీళ్లు సక్రమంగా రావడం లేదు.. మా కాలనీలో రోడ్డు బాగాలేవు.. గుంతలు పూడ్చా లి.. వీధి దీపం వెలగట్లేదు.. ఇలా రోజూ వస్తున్న ఫిర్యాదులపై సత్వర పరిష్కారం గగనమైంది. ఒకే చోట.. సత్వరం.. సులభతరంగా పౌరసేవలు అందేలా మున్సిపాలిటీల్లో సిటిజన్ చార్టర్ ప్రవేశపెట్టా రు. అమలు చేయకుంటే జవాబుదారీతనం ఉండేలా అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధించేలా చట్టం రూపొందించారు. పౌరసేవలకు వచ్చేసరికి నెలల తరబడి ఆలస్యం అవుతోంది. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో సిటిజన్ చార్ట్ అమలు, పరిష్కారం, జాప్యంపై సమీక్షల్లేవు. నిబంధనల ప్రకారం నెలకు రెండుసార్లు సిటిజన్ చార్టర్ అమలు, పెండింగ్ ఫైల్స్, పౌరసేవలపై కమిషనర్ సమీక్ష చేయాలి. ఈ విధానం ఎక్కడ అమలు కావడం లేదు. దీనిని అలుసుగా తీసుకొని ఉద్యోగులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సిటిజన్ చార్టర్ అటకెక్కింది. అవగాహన శూన్యం జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలో ఆన్లైన్ సేవలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్ర జలు నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చే యాల్సి వస్తోంది. ‘సిటిజన్ బడ్డీ యాప్’ పట్టణ ప్ర జలకు అందుబాటులో ఉన్నా దీనిపై మున్సిపల్ అ ధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. సిటిజన్ చార్టర్ సేవలపై క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేక నీరుగారిపోతోంది. కొందరు విద్యావంతులు ఆన్లైన్లో వినతులు ఇస్తున్నా అధికారులు వాటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిటిజన్చార్ట్ అమలుపై ఆయా మున్సిపల్ కమిషనర్లను వివరణ కోరగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఏ పని ఎన్ని రోజుల్లో చేయాలి భవన నిర్మాణ అనుమతి 21 కొత్త లేఅవుట్ అనుమతి 30 కొత్త కుళాయి కనెక్షన్ 15 ట్రేడ్ లైసెన్సుల జారీ 07 కొత్త ఇంటి నంబరు 15 ఆస్తి పేరు మార్పిడి(ఇతరాలైతే) 30 ఆస్తి బైఫర్కేషన్ 30 పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం 05 మరణ ఽధ్రువీకరణ పత్రం 07 పాత రికార్డుల పత్రాలు 07 ఈ ఏడాదిలో ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదులు మున్సిపాలిటీ వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించినవి పెద్దపల్లి 02 02 మంథని 06 04 సుల్తానాబాద్ 116 98 రామగుండం 445 310 -
నత్తనడకన రహదారి విస్తరణ
● కొనసా..గుతున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ● ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనడకన సా..గుతున్నాయి. రెండు నెలల క్రితం చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ప్రధాన రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మజీద్ ప్రాంతం నుంచి అమర్నగర్ వరకు, దేవికిరోడ్ నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరించేందుకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేశారు. ఇళ్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులపై పలువురు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో డ్రైనేజీలపై గద్దెలు నిర్మించుకునేలా విస్తరణ పనులు కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన పైపులు రోడ్డు విస్తరణ పనుల్లో పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పైపులు అక్కడక్కడ ధ్వంసమయ్యాయి. వాటిని గుర్తించి తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆకుల వెంకటేశ్ సంబంధిత అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. మేన్రోడ్డు విస్తరణ మాటేమిటీ? పట్టణంలో ప్రధానమైన మేన్రోడ్డును వ్యాపారులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడంతో ఇరుకుగా మారింది. వాహనాలు ఎదురుపడితే రోడ్డు జామ్ అవుతోంది. ఈ మార్గంలోనే బట్టలు, కిరాణం, స్టీల్ తదితర దుకాణాలు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమకు అవసరమైన సామగ్రిని కొనేందుకు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపితే రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్డుగా ఉన్న మేన్రోడ్డు ఆ తర్వాత మేజర్పంచాయతీగా పెద్దపల్లి మారడంతో రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు ముందుకు పెంచడంతోనే రోడ్డు ఇరుకుగా మారిందంటున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రధానమైన మేన్రోడ్డును ఖచ్చితంగా విస్తరించాలంటూ పట్టణానికి చెందిన నారాయణ్దాస్ తివారీ సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో స్పందించిన కలెక్టర్ ఈ విషయమై దృష్టిసారించాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మేన్రోడ్డు విస్తరణ జరిగితేనే జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కొత్త శోభ సంతరించడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తయ్యేలా చూడాలి పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి.. ప్రధాన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహన, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. కమాన్నుంచి జెండా, దేవిడి నుంచి చాకలిఐలమ్మ విగ్రహం, శివాలయం ప్రధానద్వారం నుంచి అమర్నగర్ వరకు పనులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలి. – రాకేశ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, పెద్దపల్లి త్వరలో పూర్తి చేస్తాం పట్టణంలోని ప్రధాన రోడ్లకిరుపక్కలా విస్తరణ పనులు చేపట్టి డ్రైనేజీలు నిర్మించాల్సి రావడం వల్లే కొంత జాప్యం జరుగుతోంది. మిగతా అంతర్గత రోడ్ల ను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగానే పనులు పూర్తిచేస్తాం. – సతీశ్, ఏఈ, మున్సిపాలిటీ, పెద్దపల్లి -
సీ్త్రనిధి బకాయిలు చెల్లించాలి
● అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ పెద్దపల్లిరూరల్: మహిళా సంఘ సభ్యులు సీ్త్ర నిధి ద్వార పొందిన రుణాలు సద్వినియోగం చేసుకొని, సకాలంలో బకాయిలు లేకుండా చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం మెప్మా సీ్త్రనిధి ఆర్పీలతో సమావేశమై సమీక్షించారు. మైక్రో ఫైనాన్స్ వారిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో సీ్త్ర నిధి ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. పొందిన రుణాలను దీర్ఘకాలంగా పెండింగ్ ఉంచొద్దని సూచించారు. సమీక్షకు రాని రిసోర్స్పర్సన్లపై చర్యలకు ఆదేశించారు. బకాయిపడ్డ వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని, అవకతవకలు జరిగినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సంఘాల్లో లేనివారిని సభ్యులుగా చేర్చేందుకు కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, రీజినల్ మేనేజర్లు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. మార్చి ముగింపులోగా ఆస్తి పన్ను కట్టండి కోల్సిటీ(రామగుండం): ఈ ఏడాది మార్చి నెల ముగింపులోగా ప్రజలు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ రుసుం చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రజలు పన్నులు చెల్లించడానికి అన్ని సెలవు దినాల్లోనూ మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లు యథాతథంగాగా పని చేస్తాయన్నారు. వార్డు అధికారుల వద్ద చెల్లించే సౌలభ్యంతోపాటు మీసేవా కేంద్రాలు, మున్సిపల్ వెబ్సైట్, ఆన్లైన్లోనూ డిజిటల్ పేమెంట్ ద్వారా ఇంటి వద్ద నుంచి కూడా పన్ను కట్టవచ్చని తెలిపారు. పన్ను బకాయిదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. -
దివ్యాంగులకు యూడీఐడీ నంబర్లు
పెద్దపల్లిరూరల్: ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబరు కేటాయించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం యూనిక్ డిసిబిలిటీ ఐడీ జారీ, స్కూల్ యూనిఫాంపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన సమీక్షించారు. యూడీఐడీ నంబర్ల కోసం సదరం శిబిరాలకు పరిమితమైన స్లాట్లతో ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మీసేవ ద్వారా దర ఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కుబదులు యూనిక్ డిసిబులిటీ ఐడీ కార్డులు అంది స్తారని అన్నారు. వీటిపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సంక్షేమశాఖ అఽధికారిని ఆదేశించారు. యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాల స భ్యుల్లో టైలర్లుగా ఉన్న వారికే అప్పగించాలన్నారు. డీఆర్డీవో కాళిందిని, సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్, సూపరింటెండెంట్ శ్రీధర్, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎల్ఆర్ఎస్ రుసుం వ సూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమ లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించేవారికి 25శాతం రాయితీ వర్తిస్తుందనే సమాచారంపై సమగ్ర అవగాహన కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రి, జెడ్పీ హైస్కూల్, ఎంపీడీవో ఆఫీసు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో 1,036 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించామని, ఈనెలాఖరులోగా వారందరూ రుసుం చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని అదనపు గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, ఎంఈవో రాజయ్య, హెడ్మాస్టర్ శారద, ఆర్ఎంవో మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
కలెక్టర్ను కలిసిన డీసీపీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా నియమితులైన కరుణాకర్.. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాక బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనకు పూలమొక్క అందజేశారు.సాఫీగా తాగునీటి సరఫరా ముత్తారం/కాల్వశ్రీరాంపూర్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. ముత్తారం మండలం మైదంబండ, పారుపల్లి, శాత్రజ్పల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట, ఇదులాపూర్లో నీటివనరులను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేసవిలో నీటి కొరత ఉంటుందని, దీనిని అధిగమించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయ న అన్నారు. పారిశుధ్యం, ఆస్తిపన్ను వసూలు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. పల్లెల్లో పారిశుధ్య పనులు పెద్దపల్లిరూరల్/మంథని: వివిధ గ్రామాల్లో బుధవారం ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టా రు. ఈనెల 14వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్దకల్వల గ్రామంలో చేపట్టిన పనులను డీఎల్పీవో వేణుగోపాల్ పర్యవేక్షించారు. నర్సరీని సందర్శించారు. పంచాయతీ కార్యదర్శి నిశాంత్రా వు తదితరులు ఉన్నారు.. మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో చేపట్టిన పనులను డీఎల్పీవో సతీశ్ కుమార్ పరిశీలించారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి మంథని: ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. వెలుగు రేఖా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. అనంతరం మహిళా కళాకారుల డప్పు ప్రదర్శనను తిలకించారు. నాబార్డ్ డీడీఏం జయప్రకాశ్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంజని, ఏపీఏం పద్మ, సీఈవో రజిత, న్యాయవాదులు షబానా, శ్రీలక్మి, ఉపాధ్యాయురాలు బొజ్జ స్వాతి, ఏఎన్ ఏం కవిత, కానిస్టేబుళ్లు స్రవంతి, సంధ్య పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగావకాశాలు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం, కార్పొరేట్ ఆఫీస్, నోయిడో కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నతాధికా రులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశా రు. కెమికల్ విభాగంలో–9, మెకానికల్లో–6, ఎలక్ట్రికల్లో–3, ఇన్స్ట్రుమెంటేషన్లో –2, మె టీరియల్స్లో–3, ఫైనాన్స్ అకౌంట్స్లో–1, సి విల్స్లో–4, మెడికల్లో–5, సేఫ్టీలో–3, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో–4 ఖాళీలు ఉన్నా యి. ఏప్రిల్ 10 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖా స్తు చేసుకోవాలి. వివరాలకు (https://www. rfcl.co.in) వెబ్సైట్లో సంప్రదించాలి. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు బుధవారం 97.8శాతం మంది హాజరయ్యారని నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. మొత్తం 5,107 మందికి 4,995 మంది పరీక్షకు హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. -
ప్రమాదాల వారధి
● పట్టించుకునే వారేరి? ● ఇప్పటికే నలుగురి మృతి జ్యోతినగర్(రామగుండం): సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్కాస్టు గతంలోనే మూతపడింది. దీంతో మేడిపల్లి – మల్కాపూర్ మధ్య గల రోడ్డు మరమ్మతులు విస్మరించారు. రహదారి శిథిలం కావడం, నిత్యం వాహనాల రాకపోకలు అధికం కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా, దీనిగురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడని స్థానికులు వాపోతున్నారు. మల్కాపూర్ – రాజీవ్ రహదారి మధ్య రోడ్డు.. రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రాజీవ్ రహదారి నుంచి గ్రామం వరకు ఇటీవల రోడ్డు నిర్మించారు. కానీ, గోదావరినది వైపు వెళ్లే ఓపెన్ కాస్టు రోడ్డును అలాగే వదిలేశారు. ఓపెన్కాస్టులో బొగ్గు తవ్వకాలు జరిగినప్పుడు సింగరేణి కార్మికులు ఈ మార్గంలోనే విధులకు వెళ్లివచ్చేవారు. ప్రస్తుతం రోడ్డు శిథిలమై, గుంతలు పడి ప్రయాణానికి నరకం చూపుతోంది. రాత్రివేళ అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వరద కాలువపై ఉన్న వంతెనకు ఇరువైపులా గోడలు లేవు. వాహనాలు కాలువలో పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు సంవత్సరాల్లో కాలువలో పడి ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి కూడా మ ల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల వెంకటే శం వాహనంతో కాలువలో పడి చనిపోయాడు. రోడ్డంతా గుంతలమయం మేడిపల్లి ఓపెన్ కాస్టు – మల్లాపూర్ మధ్య రోడ్డు గుంతలమయంగా మారింది. రెండు సంవత్సరాల క్రితం గోదావరి నది బ్యాక్ వాటర్ రావడంతో కాలువపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. అధికారులు తాత్కాలికంగా మట్టిపోసి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేశారు. కానినీ, దానికి వరదకాలువ వైపు గోడలేక రాత్రి సమయాల్లో వాహనాలు అదుపుతప్పి వరదకాలువలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. -
షెడ్లు శిథిలం
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025కియాస్కీల సమాచారం తొలిదశలో షెడ్లు 50 మంజూరైన నిధులు(రూ.లక్షల్లో) 33 టెండరు నిర్వహణ డిసెంబరు – 2020 రెండోదశలోని షెడ్లు 50 మంజూరైన నిధులు(రూ.లక్షల్లో) 40 కౌన్సిల్ ఆమోదం తెలిపింది జనవరి – 2021 ఇప్పటివరకు నిర్మించిన షెడ్లు 37 గుర్తించిన వీధివ్యాపారులు 24,497 కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారులు(స్ట్రీట్ వెండర్స్) అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు నాలుగేళ్ల క్రితం రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లు(కియాస్కీలు) నిర్మించారు. కానీ, వాటిని ఎవరికీ కేటాయించకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. వినియోగానికి ముందే శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు ధ్వంసం కావడంతో వర్షాకాలంలో ఉరుస్తోంది. దీంతో చుట్టుపక్కల ఏర్పాటు చేసిన షీట్లు తడిచి పెచ్చులు ఊడుతున్నాయి. షెడ్లకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. స్ట్రీట్ వెండర్స్ను ఆర్థికంగా బలోపేతం చేస్తామనే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. 15 ఏళ్ల క్రితమే మార్గదర్శకాలు వీధి వ్యాపారుల అభివృద్ధి, సంక్షేమం కోసం కియాస్కీ షెడ్ల నిర్మాణానికి 2010లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటిని అమలు చేయడంలో అప్పటి పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో అవి అమలుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో 2019లో వీధి వ్యాపారుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రామగుండం బల్దియా అధికారులు.. ఎట్టకేలకు సర్వే చేపట్టారు. 24,497 మంది స్ట్రీట్ వెండర్స్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24,497 మంది స్ట్రీట్వెండర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 24,355 మంది రూ.10 వేల పీఎం స్వనిధి రుణం పొందారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వా రు.. దశలవారీగా మరోసారి పీఎం స్వనిధి రుణా లు తీసుకున్నారు. వీరందరికీ రహదారులపై కాకుండా నిర్దిష్ట స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా కియాస్కీ షెడ్లు నిర్మించారు. కానీ, వాటిని కేటాయించడంలో ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం 37 షెడ్ల నిర్మాణం 2019 సెప్టెంబర్లో రూ.30 లక్షలు వెచ్చించి 50, 2021 జనవరిలో మరో రూ.40 లక్షల వ్యయంతో ఇంకో 50 షెడ్లు నిర్మించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో తొలివిడతలో గోదావరిఖని కూరగాయల మార్కెట్లో ఆరు, గౌతమినగర్లో ఆరు, గోదావరి నదీతీరంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతంలో 10, ఎన్టీపీసీలోని ఎఫ్సీఐ ఎక్స్ రోడ్డులో 15 షెడ్లు నిర్మించారు. మిగతావి నిర్మించడానికి అనువైన స్థలం అందుబాటులో లేదనే సాకుతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నగరంలో మెప్మా సిబ్బంది సర్వే.. షెడ్ల కేటాయింపు కోసం నగరపాలక కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశాలతో మెప్మా ఆర్పీలు, సీవో లు ఇటీవల సర్వే చేపట్టారు. ఎఫ్సీఐ ఎక్స్ రోడ్డు లోని 15 షెడ్లతోపాటు గౌతమినగర్లోని షెడ్ల కేటాయింపులకు ఆసక్తి ఉన్న స్ట్రీట్వెండర్స్ నుంచి దర ఖాస్తులు స్వీకరించారు. షెడ్లలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అంచనాల కోసం ట్రాన్స్కో ఉన్నతాధికారులకు బల్దియా కమిషనర్ లేఖ రాశారు. ఇప్పటివరకు ఇటు బల్దియా నుంచి, అటు విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలంకారప్రాయంగా మారిన కియాస్కీలపై ‘సాక్షి’ ఆరా తీయడంతో స్పందించిన బల్దియా కమిషనర్.. మరోసారి స్ట్రీట్వెండర్స్ కోసం రీ సర్వే చేపట్టాలని బుధవారం ఆదేశించినట్లు సమాచారం. న్యూస్రీల్ నాలుగేళ్ల క్రితం ‘కియాస్కీ’ల నిర్మాణం వీధివ్యాపారులకు కేటాయించని వైనం నిరుపయోగంగా మారిన 37 షెడ్లు చర్యలు తీసుకుంటున్నాం కియాస్కీ షెడ్ల కేటాయింపులపై ఇప్పటికే సర్వే చేశాం. మరోసారి సర్వే చేయిస్తాం. షెడ్ల సమీపంలోని స్ట్రీట్వెండర్స్కే వాటిని కేటాయిస్తాం. షెడ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరుతూ లేఖ కూడా రాశాం. ఈ విషయంపై మరోసారి అధికారులతో చర్చిస్తాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ), రామగుండం -
ముదురుతున్న ఎండలు
● 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు జ్యోతినగర్(రామగుండం): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి రెండోవారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇళ్లలోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఆకెనపల్లిలో పగటిపూట గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్లో) తేదీ గరిష్టం కనిష్టం 06 34.4 19.6 07 34.8 13.6 08 36.0 14.2 09 37.0 15.3 10 34.4 18.6 11 33.6 20.6 12 40.3 28.9 -
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
గోదావరిఖని: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషనరేట్లో బుధవారం బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో ఆయన సమావేశమైయ్యారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు స్థానిక పరిస్థితుల గురించి పైఅధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బంది, అధికారులను గుర్తించి రివార్డులు అందజేస్తామన్నారు. ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని, అనుక్షణం వారికి అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ వర్టికల్స్ ఇన్చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు గోదావరిఖని/రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తొలుత రామగుండం రైల్వేస్టేషన్, పోలీస్స్టేషన్ తనిఖీ చేశారు. అనంతరం గోదావరిఖని బస్టాండ్లో సోదాలు చేశారు. ప్రయాణికుల భద్రత తదితర విషయాల గురించి ఆరా తీశారు. పెట్రోలింగ్, గస్తీ పోలీసుల పనితీరును ఆయన పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
కాంట్రాక్టు పద్ధతితో సీనియర్లకు అన్యాయం
గోదావరిఖని: సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి, చీఫ్ మెడికల్ సర్వీసెస్ అధికారులను కాంట్రాక్టు పద్ధతిన నియమించడం సరికాదని అధికారుల సంఘం నాయకులు అన్నారు. ఆర్జీ–1, 2 జీఎంలు లలిత్కుమార్, వెంకటయ్యకు బుధవారం వినతిపత్రా లు అందజేశారు. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేశా రు. కొత్త విధానంతో సీనియర్ అధికారులకు అన్యా యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంస్థలో డిపార్ట్మెంట్ హెడ్లుగా సర్వీస్లో లేనిబయటి వ్యక్తులను ని యమించడం సరైంది కాదన్నారు. కష్ట, క్టిష్ట సమయాల్లో సమ్మె సంస్కృతిని పని సంస్కృతిగా మార్చడంలో అధికారుల కృషి ఉందని గుర్తుచేశారు. అనేక వ్యయప్రయాసలకోర్చి, ప్రాణాలకు తెగించి, చిత్త శుద్ధితో అధికారులు పనిచేస్తున్నారన్నారు. కరోనా మహమ్మారితో పోరాడే సమయంలోనే అద్భుత ప నితీరు కనబర్చి ఉద్యోగుల్లో మనోధైర్యం కల్పించా రని పేర్కొన్నారు. ఈక్రమంలో చాలామంది ప్రాణా లు కోల్పోయారని ఆవేదన చెందారు. 30ఏళ్లకు పైబడిన అనుభవం, జవాబుదారీతనంతో పనిచేస్తున్న వారిని కాదని కొత్తపద్ధతిన బయటివారిని నియమించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. దీనిద్వారా భవిష్యత్లో సంస్థపై పడే దు ష్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పద్ధతిన నియామకాల ఆలోచనను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సింగరేణి అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కిరణ్రాజ్కుమార్, ఉపాధ్యక్షులు చిలుక శ్రీనివాస్, బి.మల్లేశ్తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–2 ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంవోఏఐ అధ్యక్షుడు పెద్ది నర్సింహులు, నాయకులు ఎస్.మధుసూదన్, చంద్రశేఖర్, నరేశ్, జనార్దన్, సుగుణాకర్, రామకృష్ణ, నితిన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అధికారుల సంఘం నిరసన జీఎంలకు వినతిపత్రాలు అందజేత -
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
మల్కాపూర్ రోడ్డు, కల్వర్టు మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసకెళ్తాం. ప్రమాదాలు జరగకుండా అఽధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. ఎన్టీపీసీ వరద, సింగరేణి రోడ్డు కావడంతో ఆయా పరిశ్రమల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్, రామగుండం బ్రిడ్జి, రోడ్డు నిర్మించండి మల్కాపూర్ నుంచి ఓపెన్కాస్టు వైపు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్టు ఉన్నప్పుడు రోడ్డు బాగుండేది. ఎన్టీపీసీ వరదకాలువలో నీరు పారడంతోపాటు గతంలో గోదావరి నది బ్యాక్ వాటర్తో బ్రిడ్జి కూలింది. బ్రిడ్జి మళ్లీ నిర్మించలేదు. రైతులు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. పాలకులు స్పందించాలి. – మడ్డి విజయ్కుమార్, మల్కాపూర్ పాలకులదే నిర్లక్ష్యంగత పాలకుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి కూలిపోయింది. మళ్లీ నిర్మించకపోవడం, బ్యాక్ వాటర్ను కంట్రోల్ చేయకపోవడం, గోదావరి నది వరదకు కరకట్ట కట్టకపోవడంతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి సింగరేణి, ఎన్టీపీసీల సీఎస్సార్ నిధులతో రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలి. సమస్య పరిష్కరించాలి. – మొహమ్మద్ రహీమ్, మల్కాపూర్ -
కిడ్నీలు పదిలమేనా?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం. – 8లో... రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చులయ్యాయి. విజయేందర్రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్రెడ్డికి జితేందర్రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న అన్నయ్యకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. -
ఉక్కుపాదం
డ్రగ్స్ మాఫియాపైమాట్లాడుతున్న సీపీ అంబర్ కిశోర్ ఝా● కమిషనరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ● సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే వేటు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: ‘గంజాయి, డ్రగ్స్ను కూకటివేళ్లతో పెకిలించి వేస్తాం. ఇందుకోసం కమిషనరేట్ కేంద్రంగా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తాం. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే పోలీసులపై వేటు వేస్తాం. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం’ అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: నేరాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: బదిలీపై రామగుండం రావడం సంతోషంగా ఉంది. రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా ముందుకు సాగుతాం. సాక్షి: గంజాయి రవాణా, విక్రయాలను ఎలా అరికడతారు? సీపీ: గంజాయి రవాణా పెరిగినట్లు సమాచారం ఉంది. పాత నేరస్తులపై నిఘా ఉంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేస్తాం. విక్రయదారులు, తాగేవారిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం. సాక్షి: డ్రగ్స్ నివారణకు ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? సీపీ: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు 15 మందితో సిటీడ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఫోన్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ నంబరుకు సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సాక్షి: పాత నేరస్తులు, భూమాఫియాపై..? సీపీ: పాతనేరస్తులు, భూమాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. సెటిల్మెంట్ల విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తేలేదు. సాక్షి: రోడ్డు ప్రమాదాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: వరంగల్ సీపీగా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకున్న చర్యలతో 20 శాతం ప్రమాదాలు తగ్గాయి. బ్లాక్స్పాట్ల వద్ద దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతాం. సాక్షి: పోలీసులకు మీరిచ్చే సూచనలేమిటి? సీపీ: శాంతిభద్రతల పరిరక్షణలో పకడ్బందీగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండాలి. ఉదయం, సాయంత్రం పోలీస్స్టేషన్లో ఉండి ఫిర్యాదులు స్వీకరించాలి. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఉంటే సహించేదిలేదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే వారిపైనా చర్యలు తీసుకుంటాం. సాక్షి: సైబర్నేరాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: సైబర్నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అపరి చితులు, అపరిచిత ఫోన్ నంబర్లకు సమాధానం ఇవ్వవద్దు. బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు. సాక్షి: ప్రజల నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? సీపీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి వారి వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. మత్తుపదార్థాల విక్రయాలను అరికట్టేందుకు సహకారించాలి. సమస్యల పరిష్కారానికి పోలీసులను ఆశ్రయించాలి. న్యాయం జరగకుంటే నేరుగా నన్ను సంప్రదించాలి. సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? సీపీ: గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగ యువతను చేరిదీసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే ఉట్నూర్ ఐటీడీఏ సహకారంతో గతంలో యువతకు శిక్షణ ఇప్పించి అగ్రగామిగా తీర్చి దిద్దాం. ఇక్కడ కూడా యువతకు ఉపాధి శిక్షణ, కాంపిటేటివ్ పరీక్షల్లో తర్ఫీదు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో శిక్షణ ఇస్తాం. ఇంటర్వ్యూలలో నెగ్గేలా తీర్చిదిద్దుతాం. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం. -
అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతాన్ని అన్నిరంగా ల్లో అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో మంగళవారం సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. ప్రధాన కూరగాయల మార్కెట్ను సందర్శించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, బొందలగడ్డలా మారుతున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం, సింగరేణి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆక్రమిత సింగరేణి స్థలాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. కూరగాయల మా ర్కెట్ను మోడల్గా తీర్చిదిద్దుతామని అభయం ఇచ్చారు. వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, ఆర్జీ –1 జీఎం లలిత్కుమార్, నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం కోల్సిటీ(రామగుండం): ఆధునిక యంత్రాలతో పా రిశుధ్య పనులు చేపట్టి రామగుండాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రా జ్ఠాకూర్ అన్నారు. రూ.76 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన రెండు బ్యాక్ హో లోడర్ యంత్రాలతోపాటు రూ.4.70 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 8 హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడా రు. అధికారులు రామన్, నాగభూషణం, కుమారస్వామి, నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తఫా, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బాధితురాలికి చేయూత రామగుండం: మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంతర్గాం మండలం ఆకెనపల్లికి చెంది న నంది లావణ్య వైద్యం కోసం ఎమ్మెల్యే ఠాకూర్ రూ.4 లక్షల ఎల్వోసీ ఇప్పించారు. రామునిగుండా ల కొండపై చేపట్టిన శ్రీఆంజనేయస్వామి విగ్రహం ఎదుట ఎమ్మెల్యే దంపతులు పూజలు చేశారు. 150 అడుగుల ఎత్తుతో చేపట్టిన పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు పర్యవేక్షించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
ఖమ్మంపల్లి – భూపాలపల్లి రోడ్డుకు రూ.33.70 కోట్లు
ముత్తారం(మంథని): పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలిపేందుకు ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు డబుల్ రో డ్డు నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం రూ. 33.70కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో అటవీశాఖ అనుమతి రాక రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు చొరవతో జీవో నంబరు 113 ద్వారా నిధులు మంజూరు చే యించారు. ఈ రోడ్డు నిర్మాణంతో మంథని, ఖ మ్మంపల్లి నుంచి భూపాలపల్లికి సుమారు 20 కిలో మీటర్ల వరకు దూర భారం తగ్గుతుంది. ఖమ్మంపల్లి, తాడిచెర్ల వంతెన నిర్మాణం పూర్తయినా.. భూపాలపల్లి వరకు ప్రయాణం చేయడానికి రోడ్డు సౌక ర్యంలేక వావానాదారులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఖమ్మంపల్లి నుంచి తాడిచెర్ల నాగులమ్మ, కాటారం నుంచి వెళ్లేవారు. ప్రస్తుతం ఖమ్మంపల్లి – భూపాలపల్లి మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరావడంతో తమ ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు సంబురపడుతున్నారు. -
మహిళలకు నైపుణ్య శిక్షణ
పెద్దపల్లిరూరల్: స్వశక్తి సంఘాల మహిళలు వ్యాపార రంగంలో రాణించేలా అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా వీ హబ్ సహకారంతో జిల్లాలో మహిళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. వ్యాపారాభివృద్ధిపై కలెక్టరేట్లో మంగళవారం స్వశక్తి మహిళలకు ఆయన అవగాహన కల్పించారు. ఆహార, ఉత్పత్తి, హస్తకళలు, టెక్స్టైల్ లాంటి రంగాల్లో శిక్షణ ఇస్తామని, యువత తమ ఆలోచనలను ఉన్నతంగా ఎంచుకుంటే వీ హబ్ ద్వారా సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీ హబ్ డైరెక్టర్లు జహీద్ అక్తర్ షేక్, ఊహ, డీఆర్డీవో కాళిందిని, ప్రతినిధులు సాయిరాం, లీడ్బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, ప్రిన్సిపాల్ మురళి, ఉష తదితరులు ఉన్నారు. కాగా, కుంగ్ఫూ కరాటే జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ శ్రీహర్ష ఈ సందర్భంగా అభినందించారు. తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలి ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమాయోజన పథకం కింద ఇండియా పోస్ట్ పేమెంట్ బాంకు ద్వారా రూ.436 ప్రీమియం చెల్లించి రూ.2లక్షల బీమా పొందవచ్చని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పథకం ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును కలెక్టర్ బాధితులకు అందజేశారు. రెండేళ్లలో 20మంది బీమా క్లెయిమ్ చేశారని ఆయన తెలిపారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, ఇండియా పోస్ట్పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టె శ్రీనివాస్, మేనేజర్ మోహన్సాయి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి -
నాణ్యమైన భోజనం పెట్టాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ గురుకుల పాఠశాల ల్లో చదివే బాల, బాలికలకు నాణ్యమైన భోజ నం అందించాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. డార్మెంటరీ, క్లాస్రూం, డైనింగ్హాల్, వంటగది, స్టోర్రూంలను తనిఖీ చేశారు. నా ణ్యమైన కూరగాయలు, పండ్లు ఇవ్వాలని అ న్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి ఫ లితాలు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఉపాధ్యాయినులు ఉన్నారు. భద్రత, శ్రేయస్సు కీలకం జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమ భద్రత, కార్మికులు, ఉద్యోగుల శ్రేయస్సు కీలకమని తె లంగాణ ప్రభుత్వ కరీంనగర్ ఫ్యాక్టరీల డిప్యూ టీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్రెడ్డి అన్నారు. ఎన్టీ పీసీ ప్రాజెక్టు పరిపాలనా భవనంలో మంగళవారం జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంతతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీలో విద్యు త్ ఉత్పత్తి భేషుగ్గా ఉందన్నారు. అనంతరం అ ధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. పలు పోటీల్లో విజేత లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించా రు. జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, అంజనా రంజన్ దాస్, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ ముకేశ్కుమార్, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ య్య, ప్రధానకార్యదర్శి రాజేశ్వర్, అధికారులు బహేకర్, సుప్రకాశ్ చక్రవర్తి పాల్గొన్నారు. పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి రామగిరి(మంథని): రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన కెపాసిటర్లు అమర్చుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ మాధవరావు సూ చించారు. కల్వచర్ల, బుధవారంపేట(రామ య్యపల్లి)లో మంగళవారం పొలంబాట చేపట్టారు. కల్వచర్లలో ఓవర్లోడ్ నియంత్రణకు 100 కేవీ సామర్థ్యంగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. కెపాసిటర్లు బిగిస్తే విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు నియంత్రణలోకి వస్తాయన్నారు. విద్యుత్ మోటార్లపై భారం ప డదని తెలిపారు. మంథని డివిజన్ ఏఈ ప్రభాకర్, ఏడీఈ కనకయ్య, ఏఈ మహేందర్, సబ్ ఇంజినీర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులపై శ్రద్ధవహించాలని జిల్లా పంచా యతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. వెంకట్రావుపల్లె, కాచాపూర్లో చేపట్టిన ప్రత్యే క పారిశుధ్య పనులను మంగళవారం మండల పంచాయతీ అధికారి అనిల్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెగ్రిగేషన్ షెడ్డు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తీరు పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు సాగర్రావు, రేవతి పాల్గొన్నారు. క్వింటాలు పత్తి రూ.6,866 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,866 ధర పలికింది. కనిష్టంగా రూ.5,003గా, సగటు రూ.6,455గా ధర నమోదైందని మార్కెట్ సెక్రటరీ మనోహర్ తెలిపారు. రైతుల నుంచి 525 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
కొత్త గనులతోనే మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని: కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని గుర్తింపు కార్మి క సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే–11గనిపై మంగళవారం జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత గనులు మరో పదేళ్లలో మూతపడతాయని, కొత్త గనుల కోసం సింగరేణి వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడ్డ రూ.33 వేల కోట్లను వెంటనే చెల్లించాలని విన్నవించామని ఆయన వెల్లడించారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి కోల్బెల్ట్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదని అన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, రాజు, మహేశ్, రంగు శ్రీను, ఎస్.వెంకట్రెడ్డి, నాయిని శంకర్ పాల్గొన్నారు. -
ముగ్గు పోస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి: పేదల దశాబ్దాల సొంతింటి కల సాకారమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనలు పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గతఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పేదల సొంతింటి కల నెరవేర్చుతామని, ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇ స్తామని ప్రకటించారు. అంతేకాదు.. తమ ఎన్నిక ల మేనిఫెస్టోలోనూ చేర్చి ప్రచారం విస్తృత పర్చారు. తొలుత మోడల్ ఇళ్ల నిర్మాణం.. జిల్లాలో తొలుత మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, ఓదెల మండలంలోని శాన కొండ, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, పెద్దపల్లిలోని నిమ్మనపల్లి గ్రామాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముగ్గు పోస్తున్నారు. అద్దె కొంపలు.. అనేక అవస్థలు జిల్లాలోని వేలాది పేద కుటుంబాలు ఇంకా అద్దె కొంపల్లోనే అసౌకర్యాల మధ్య కాలం వెళ్లదీస్తున్నా యి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,91,836 ఉండగా, ఇందులో 3,97,585 మంది పురుషులు, 3,94,251 మంది మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, 13 మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోంచి తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ ప్రజాప్రజాలన సభలు, ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందాయి. భారంగా బతుకులు.. పల్లెల్లోనూ ప్రస్తుతం ఒక బెడ్రూమ్ ఇంటి అద్దె కనీసం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతోంది. అయినా, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగదులు, నీటి సౌకర్యం సరిగా ఉండడంలేదు. మున్సిపాటీల్లో ఇదే ఇంటికి రూ.5వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె పలుకుతోంది. ఇక్కడా ఇరుకు గదులు, అసౌకర్యాలు, నీటి వసతి ఉండడంలేదు. ఇక గోదావరిఖనిలో అయితే, సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. అపార్ట్మెంట్లలో అయితే ఇంతకు రెట్టింపు పలకడంతో పేదలు, సామాన్యులు ఆ ఇళ్లలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో స్లమ్ ఏరియా ల్లోని అరకొర వసతులు ఉన్నా సర్దుకు పోతున్నారు. కూలీనాలీ పనులు చేసుకునే రోజూవారీ కూలీలు.. నెలకు సంపాదించే ఆదాయంలో అగ్రభాగం ఇంటి అద్దెకే వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. నియోజవర్గానికి 3,500 ఇళ్ల కేటాయింపు.. తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కేటాయించే 10,500 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలు తలదాచుకునేందుకు ఆశ్రయం లభిస్తుందనే గంపెడాశతో ఎదురు చూస్తున్నాయి. జిల్లాకు తొలిదశలో గత జనవరి 26వ తేదీన 1,708 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరిస్తున్నారు. ప్రయోగాత్మక గ్రామాల్లో లబ్ధిదారులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్న ప్రారంభోత్సవాలు జిల్లాకు 10,500 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ మద్దిర్యాల 59 బంజేరుపల్లి 71 శివపల్లి 08 కోనరావుపేట 140 రొంపికుంట 170 అడవి సోమన్పల్లి 180 మచ్చుపేట 20 శానగొండ 200 రామారావుపల్లి 110 నిమ్మనపల్లి 130 రత్నాపూర్ 290 అంకంపల్లి 110 కాట్నపల్లి 120 -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిరూరల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీ ఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. నియోజకవర్గంలోని 86మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (రూ.86.60లక్షలు), 471మందికి సీఎంఆర్ఎఫ్ (రూ.కోటి 27 లక్షల) విలువైన చెక్కులను జిలాల కేంద్రంలో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపారని అన్నారు. ఇళ్లులేని పేదల గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రంఽథాల య సంస్థ చైర్మన్ అన్నయ్య, నాయకులు సుమన్రెడ్డి, సంపత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, రామ్మూర్తి, శంకర్, సురేందర్ పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు సుల్తానాబాద్(పెద్దపల్లి): త్వరలోనే అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 38 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.38,04,408 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 6, ఏడో వార్డుల్లో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ రాంచందర్రావు, మున్సిపల్ కమిషనర్ నియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్విండో ఇన్చార్జి శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి ఓదెల(పెద్దపల్లి): సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అద్దంలా మెరుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. ఓదెల, ఇందుర్తిలో చే పట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీల పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాయకులు ఆళ్ల సుమన్రెడ్డి, మూల ప్రేంసాగర్రెడ్డి, గోపు నారాయణరెడ్డి, చీకట్ల మొండయ్య, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ప్రారంభం మండల కేంద్రంలోని వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ను ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
మహిళలు.. మనీరాణులు!
● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్య లకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందారు. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలపాటు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
‘ఎనీమియా’ను నియంత్రిస్తాం
● బాధితులకు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారిసాక్షి: ఎనీమియా బారిన ఎవరు పడతారు? డీఎంహెచ్వో: మనిషిలోని అవయవాలను పనిచేయించే ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఎనీమియా బారినపడతారు. అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది. సాక్షి: జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది బాధితులను గుర్తించారు?డీఎంహెచ్వో: కేంద్ర ప్రభుత్వం ఎనీమియాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం మా సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో 1,43,159మంది మహిళలు, 10 నుంచి 19ఏళ్లలోపు వయస్సుగల పిల్లలు 1,56,580 మంది వరకు ఉన్నారు. 6 నుంచి 59 నెలలోపు వయసుగల వారు 95,309 మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసు గలవారు 78,290మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వరకు ఎనీమియాతో బాధపడుతున్నారని మా సర్వేలో తేలింది. సాక్షి: మందులు అందుబాటులో ఉన్నాయా? డీఎంహెచ్వో: గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ఎనీమియా ముక్త్భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అవసరాలకు అనుగుణంగా పీహెచ్సీల స్థాయిలోనూ మందులు పంపిణీ చేస్తున్నాం. 6నుంచి 59నెలల పిల్లలకు ఏడాదికి రెండు సిరప్ బాటిళ్లు అవసరం. ఇక పాఠశాలల్లో చదివే వారికి వీక్లీ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అందిస్తున్నాం. పెద్దపల్లిరూరల్: ‘మనిషికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ శాతం పడిపోవడమే ఎనీమియా.. దీనిబారిన పడుతున్న వారిని గుర్తించి మందులు, సిరప్ అందిస్తున్నాం.. ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. జిల్లాలో 13,935మంది గర్భిణులు, 12,540 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారని, వీరిలో 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు. పిల్లలు, మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తోందన్నారు. బాధితులను గుర్తించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ అందిస్తూ ఎనీమియా నియంత్రణకు పాటుపడుతున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ‘సాక్షి’తో ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: ఎనీమియా నియంత్రణపై సిబ్బందికి అవగాహన ఉందా?డీఎంహెచ్వో: ఎనీమియా ముక్త్భారత్ అమలు తీరు, సాధించాల్సిన లక్ష్యం, అనుసరించాల్సిన పద్ధతులపై ఫార్మసిస్ట్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. బాధితులను గుర్తించి సకాలంలో మందులు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. వయసును బట్టి మోతాదు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం. -
‘ఎల్ఆర్ఎస్’లో 25 శాతం రాయితీ
● గడువులోగా ఫీజు చెల్లిస్తేనే వర్తింపు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: గడువులోగా ఎల్ఆర్ఎస్ రు సుం చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని, 24 గంటల్లోగా ప్రొసీడింగ్స్ జారీచేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్థానిక మున్సిపల్ కా ర్యాలయంలో సోమవారం ఎల్ఆర్ఎస్, లే ఔట్ క్రమబద్ధీకరణపై డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. జిల్లాలో 16వేల స్థలాల క్రమబద్ధీకరణ కోసం యజమానులకు ఫీజు వివరాలు అందించామని అన్నారు. ఇప్పటివరకు 400మంది మాత్రమే స్పందించారని ఆయన పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం మున్సిపల్ ఆఫీసులో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. క్రమబద్ధీకరణ పూర్తికాని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో లింక్ చేశామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. అధికారులతోనూ సమావేశం.. అంతకుముందు కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారుల తో సమావేశమై అక్రమ లేఔట్లపై సమీక్షించారు. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించారు. ఆర్డీవోలు గంగ య్య, సురేశ్, కమిషనర్లు వెంకటేశ్, మనోహర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 2డీ ఎకో సేవలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా 2డీ ఎకో సేవలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్లినికల్ కార్డియాలజిస్ట్గా నియమితులైన ప్రియాంక కలెక్టర్ను కలిశారు. -
చెత్త సేకరణ అస్తవ్యస్తం
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని బల్దియాల్లో తడి, పోడి చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడం లేదు. చెత్తను రోజూ వేరుచేసి సేకరించాల్సి ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి నుంచి రోజూ సుమారు 180 టన్నుల చెత్త వెలువడుతోంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలనే లక్ష్యంతో ప్రతీ ఇంటికి ఉచితంగా రెండేసి ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. చెత్త సేకరించే సైకిల్ రిక్షాలు మొదలుకొని ఆటో ట్రాలీల వరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేలా ఏర్పాట్లు ఉన్నా.. అంతా కలిపి సేకరించడం సాధారణంగా మారింది. ట్రాక్టర్లకు మైకులు పెట్టి తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని అధికారులు ప్రచా రం చేస్తున్నా ఆచరణలో అమలు కావడంలేదు. ప్రచారం సరే.. అమలు ఏది? ‘ప్రతిఒక్కరూ ఇంట్లోనే తడి, పొడి చెత్త వేరుచేయండి.. తడి చెత్తతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో సేంద్రియ ఎరువు తయారు చేసుకోండి.. పొడి చెత్తను విక్రయించి అదనంగా ఆదాయం పొందండి.. మిగిలిన చెత్తన మాత్రమే ఆటో ట్రాలీలకు ఇవ్వండి’ అని మైకులతో హోరెత్తిస్తున్నారు. తడి, పొడి చెత్తను కలిపివేయడంతో కలిగే నష్టాల గురించి వివరిస్తూ చేసే ప్రచార హోరు, కాగితాల్లో లెక్క లు తప్ప ఆచరణలో ఎక్కడా వేర్వేరుగా సేకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సమయానికి రాక.. రోడ్లపైనే పారబోత చెత్త తరలించే వాహనాలు సమయానికి నివాసాలకు వెళ్లడంలేదు. దీంతో బల్దియాల్లో చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. అవగాహన లేకపోవడంతో తడి, పొడి చెత్త విభజన చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో తడి, పొడి చెత్త సేకరణ అమలు కావడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే బల్దియా అధికారులు స్పందిస్తున్నారు. కొన్ని వార్డులు, డివిజన్లలో రెండ్రోజులకోసారి చెత్త తరలించే వాహనం రావడంతో అప్పటివరకు ఇళ్లలోనే నిల్వ ఉంటోంది. చేసేది లేక స్థానికులు కాలనీలో రోడ్ల వెంట పారబోస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను సంప్రదించగా.. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తామని తెలిపారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉన్నా.. కలిపే సేకరిస్తూ.. డంపింగ్ యార్డుల్లో కాల్చివేస్తూ.. కాగితాల్లోనే వేర్వేరు సేకరణ ప్రక్రియ అవగాహన లోపం, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం బల్దియాల్లో లోపిస్తున్న పారిశుధ్యం ఈచిత్రంలో కాలిపోతున్న చెత్త రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్యార్డులోనిది. మొత్తం 50 డివిజన్ల రోజూ 83 వాహనాల్లో సుమారు 118 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఆర్ఎఫ్సీఎల్కు చెందిన ఖాళీస్థలాల్లో వేస్తున్నారు. తద్వారా ఇంటివద్దే తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణ ప్రక్రియ అమలు కావడం లేదు. ఇలా సేకరించిన తడిపొడి చెత్తను డంప్కార్డులో కుప్పగా పోసి తగలబెడుతున్నారు. ఇవి తడి, పోడి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన త్రిబుల్ డస్ట్బిన్లు. రామగుండం కార్పొరేషన్ పరిధి మార్కండేయకాలనీ తగర వీధిలోనివి. తడి, పొడి, హానికరమైన చెత్తను ఆ డబ్బాల్లో వేయాల్సి ఉంది. అవగాహనలేక స్థానికులు నిర్లక్ష్యంతో మొత్తం చెత్తను డబ్బాల్లో నింపుతున్నారు. సిబ్బంది సైతం చెత్తను డంపింగ్యార్డుకు అలాగే తరలిస్తున్నారు. -
సీఐఎస్ఎఫ్ సేవలు భేష్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ భద్రతకు సీఐఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నా యని రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత ప్రశంసించారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్ఎఫ్ బ్యారక్స్లో సోమవారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఆయన భద్రతా దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి మా ట్లాడారు. దేశభద్రత, కీలకఆస్తుల రక్షణలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అమోఘమన్నారు. కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ ముఖేష్కుమార్, ఎన్టీపీసీ అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బల్దియాలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభంకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రా రంభమైంది. జోన్కు ఒక డివిజన్ చొప్పున రో జూ 12 డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహి స్తారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు కమిషనర్ (ఎఫ్ఏసీ) అరు ణశ్రీ పర్యవేక్షణలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. చెత్త కుప్పలను తొలగించడం, మురుగునీటి కాలువల్లో పూడిక తీయడం తదితర పనులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14వ తే దీ వరకు పారిశుధ్య పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పనులు తనిఖీ చేశారు. జాతీయ పోటీల్లో ప్రతిభ మంథని: పట్టణానికి చెందిన సిటోరియో కరా టే విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ని ర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్ర తిభ కనబర్చినట్లు ఇన్స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. సబ్ జూనియర్ కుమితే విభాగంలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు. బండారి మణికంఠ, ఎం.శివ, బాసాని మనోహర్, అక్షిత బంగారు, మనస్వి, అద్వితి వెండి, సహస్ర, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించిన వారిలో ఉన్నారని వివరించారు. క్వింటాలు పత్తి రూ.6,913 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,913 ధర నమోదైందని మార్కెట్ కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్ట ధర రూ.5,016, సగటు ధర రూ.6,611గా నమోదైందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 202 మంది రైతుల నుంచి 746 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎఫ్ఎల్ఎన్ జిల్లా రిసోర్స్ పర్సన్ రవి సూచించారు. ఉపాధ్యాయులు చతుర్విద ప్రక్రియల ద్వారా విద్యాబోదన చేయాలన్నారు. ఊశన్నపల్లె ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, రికార్డులు పరిశీలించారు. వ్యక్తిగత పరిశీలనతోనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచవచ్చని తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, స్కూల్ హెచ్ఎం సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత, సురేశ్, కుమార్, శ్రీవాణి ఉన్నారు. ‘పట్టు’తో రైతులకు లాభాలు జూలపల్లి(పెద్దపల్లి): పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక లాభాలు వస్తాయని పరిశోధన కేంద్రం రీజినల్ సెరికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ వినో ద్కుమార్ అన్నారు. జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శివారు రైతువేదికలో సోమవారం పట్టురైతు దినోత్సవం నిర్వహించారు. పట్టు పరిశ్రమ అధికారులు పట్టు పురుగుల పెంపకం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ, మార్కెటింగ్పై అవగాహన కల్పించా రు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాఘవేంద్ర, అధికారి తిరుపతిరెడ్డి, సూపరింటెండెంట్ దాసు, మండల అధికారి మహేశ్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
‘ఎనీమియా’ను నియంత్రిస్తాం
● బాధితులకు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారిసాక్షి: ఎనీమియా బారిన ఎవరు పడతారు? డీఎంహెచ్వో: మనిషిలోని అవయవాలను పనిచేయించే ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఎనీమియా బారినపడతారు. అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది. సాక్షి: జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది బాధితులను గుర్తించారు?డీఎంహెచ్వో: కేంద్ర ప్రభుత్వం ఎనీమియాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం మా సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో 1,43,159మంది మహిళలు, 10 నుంచి 19ఏళ్లలోపు వయస్సుగల పిల్లలు 1,56,580 మంది వరకు ఉన్నారు. 6 నుంచి 59 నెలలోపు వయసుగల వారు 95,309 మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసు గలవారు 78,290మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వరకు ఎనీమియాతో బాధపడుతున్నారని మా సర్వేలో తేలింది. సాక్షి: మందులు అందుబాటులో ఉన్నాయా? డీఎంహెచ్వో: గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ఎనీమియా ముక్త్భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అవసరాలకు అనుగుణంగా పీహెచ్సీల స్థాయిలోనూ మందులు పంపిణీ చేస్తున్నాం. 6నుంచి 59నెలల పిల్లలకు ఏడాదికి రెండు సిరప్ బాటిళ్లు అవసరం. ఇక పాఠశాలల్లో చదివే వారికి వీక్లీ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అందిస్తున్నాం. పెద్దపల్లిరూరల్: ‘మనిషికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ శాతం పడిపోవడమే ఎనీమియా.. దీనిబారిన పడుతున్న వారిని గుర్తించి మందులు, సిరప్ అందిస్తున్నాం.. ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. జిల్లాలో 13,935మంది గర్భిణులు, 12,540 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారని, వీరిలో 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు. పిల్లలు, మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తోందన్నారు. బాధితులను గుర్తించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ అందిస్తూ ఎనీమియా నియంత్రణకు పాటుపడుతున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ‘సాక్షి’తో ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: ఎనీమియా నియంత్రణపై సిబ్బందికి అవగాహన ఉందా?డీఎంహెచ్వో: ఎనీమియా ముక్త్భారత్ అమలు తీరు, సాధించాల్సిన లక్ష్యం, అనుసరించాల్సిన పద్ధతులపై ఫార్మసిస్ట్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. బాధితులను గుర్తించి సకాలంలో మందులు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. వయసును బట్టి మోతాదు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం. -
అన్ని రంగాల్లో ముందుండాలి
కోల్సిటీ(రామగుండం): ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లతోపాటు రాయితీ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆకాంక్షించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. అరుణశ్రీ మాట్లాడుతూ.. ఈరోజు ఏం సా ధించామో సాయంత్రం అవలోకనం చేసుకోవా లన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి ఆట లు ఉపకరిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి బ హుమతులు అందజేశారు. ఉత్తమ పారిశుధ్య కా ర్మికులను సత్కరించారు. నగరపాలక సంస్థ డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఊర్మిళ, శ్వేత, ప్రి యదర్శిని, శమంత, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నూనె లతామోహన్, ప్రతినిధులు వెంగళ పద్మలత, పరిపూర్ణ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ బల్దియాలో మహిళా దినోత్సవం -
● 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు ● జిల్లా విద్యాధికారి మాధవి
టెన్త్ పరీక్షలకు 41 కేంద్రాలు పెద్దపల్లిరూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సుమారు 7వేల మంది విద్యార్థుల కోసం 41 పరీ క్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వి ద్యాధికారి మాధవి తెలిపారు. కలెక్టరేట్లో సోమ వారం అధికారులు, సూపరింటెండెంట్ ప్రకాశ్ తో కలిసి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈనె ల 21 నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏ ర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్ పరీక్షలకు 91మంది గైర్హాజరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ వార్షిక పరీక్షలకు మొత్తం 91మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షకు 4,801మంది విద్యార్థులకు 4,710మంది హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరు శాతం 98.10శాతంగా ఉందని వివరించారు. -
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
● రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా ● బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారిగోదావరిఖని: చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించా రు. రామగుండం పోలీస్ కమిషనర్గా సోమవా రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంత రం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపా దం మోపుతావని, ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. ఠాణాలకు వచ్చే వారి సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తూ, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్.. అంబర్ కిశోర్ ఝా 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పోలీస్ అధికారి. 2011లో తొలిసారి ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీ, 2012 వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలిఎస్పీగా పనిచేశారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, అదే ఏడాది కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి లభించింది. రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అంతకుముందు వరంగల్ సీపీగా పనిచేశారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన సీపీకి మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ సో మవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీసీపీగా పనిచేసిన చేతన హైదరాబాద్లోని వుమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీ అయిన విషయం విదితమే. దరఖాస్తుల ఆహ్వానం పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్) పథకం కోసం ఈనెల 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ సోమవారం తెలిపారు. రాష్ట్ర ఆహారశుద్ధి సంస్థ ఆధ్వర్యంలో 35 శాతం రాయితీతో అందించే రుణాల కోసం ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం డీఆర్పీ రామకృష్ణ, సెల్ నంబరు 63053 45388లో సంప్రదించాలన్నారు. దరఖా స్తులను కలెక్టరేట్లోని రూం నంబరు 231లో గల జిల్లా పరిశ్రమల కేంద్రంలో అందించాలని కోరారు. -
కమిటీల పేరిట కాలయాపన
గోదావరిఖని: కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సింగరేణి యాజమాన్యం కమిటీల పేరిట కాలయాపన చేయడం సరికాదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. జీడీకే–2,2ఏ, జీడీకే–5 ఓసీపీ, ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన పర్యటించారు. ఉద్యోగులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్ట్రక్చరల్ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి మధ్య జరిగిన చర్చల్లో యాజమాన్యం వాదన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ చెల్లింపు భారం రూ.91కోట్లు సంస్థపైనే పడుతుందని చెప్పడం సరికాదన్నారు. రూ.35వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికే రావాల్సి ఉందన్నారు. ఒక్కపైసా ఆర్థికభారం పడని మారుపేర్ల కార్మికుల పిల్లల ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు గత గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందాన్ని యాజమాన్యం ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇదే సమస్యపై గుర్తింపు సంఘంతో మళ్లీ కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ యూనియన్ సుధీర్ఘ పోరాట ఫలితంగా సొంతింటి పథకంపై కోలిండియా కూడా ఒక నిర్ణయానికి వచ్చిందని, సింగరేణిలో మాత్రం జాప్యం చేస్తోందన్నారు. గెలిచిన సంఘం సరైన వైఖరితో లేక పోవడంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆసరి మహేశ్, సీహెచ్ వేణుగోపాల్రెడ్డి, పి.శ్రీనివాసరావు, దాసరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి -
పల్లె నాడీ పట్టేందుకు..
● గ్రామాల బాట పట్టిన సిమ్స్ వైద్య విద్యార్థులు ● ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ● ఒక్కో విద్యార్థికి ఐదు కుటుంబాలు దత్తత ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ సాక్షి: గ్రామాల్లో మెడికోలు ఏం చేస్తారు? ప్రిన్సిపాల్: వైద్య విద్యార్థులు గ్రామాల్లో దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు షెడ్యూల్ ప్రకారం కేటాయించిన రోజు వెళ్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. వ్యక్తుల వారీగా రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ఏమైనా సమస్యలు వెలుగులోకి వస్తే ప్రాథమిక సలహాలు ఇస్తున్నారు. అవసరమైతే జీజీహెచ్ బోధన ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్లపై అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచూ వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. అన్ని అంశాల్లో వారికి పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. కోల్సిటీ(రామగుండం): ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న వైద్య విద్యార్థులు గ్రామాల బాట పడుతున్నారు. కుటుంబాలను దత్తత తీసుకుని పల్లెవాసుల ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్యచికిత్స పొందే లా సలహాలు, సూచనలు అందిస్తున్నారు గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్– ప్రభుత్వ) కాలేజీ విద్యార్థులు. దత్తత విధానం, అమలు తీరు, దాని ప్రయోజనాలు, లక్ష్యంపై సిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుసింగ్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు.. -
అన్ని రంగాల్లో రాణించాలి
గోదావరిఖనిటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవనిలో సగంగా ఉన్న మహిళలు.. అవకాశాల్లో సగం అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. సీ్త్ర లేనిదే జననం లేదని, ఎక్కడైతే సీ్త్రలు పూజింపబడతారో అక్కడ భోగభాగ్యాలు విలసిల్లుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, ఏజీపీ శంతన్కుమార్, సభ్యులు కిషన్రావు, సీహెచ్ శైలజ, పాత అశోక్, ఎస్.సంజయ్కుమార్, మహిళా ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా మట్టి తరలింపు సరికాదు
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో డంప్ చేసి, అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్ఎస్ కార్మిక సంఘం ప్రతినిధి కౌశిక హరి ఆరోపించారు. పార్టీ అనుచరులతో శనివారం మట్టి రవాణా చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. హరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ నేతృత్వంలోనే టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్నారు. దానిని బడా వ్యాపారులకు విక్రయిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని, అయినా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మట్టి అక్రమ తరలింపును అధికారులు అడ్డుకోకుంటే తామే అడ్డుకుంటామని కౌశిక హరి హెచ్చరించారు. సీఐటీయూ నేతల నిరసన పెద్దపల్లిరూరల్: సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో శనివారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. జగిత్యాలలో ఆశ వర్కర్పై జరిగిన దాడి శోచనీయమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేయడం సరికాదన్నారు. బాధిత మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, సాగర్, సుశీల, పద్మ, కనకతార, రాజేశ్వరి, భూలక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డు నుంచి, జెడ్పీటీసీ స్థానం వరకూ పోటీచేసేందుకు నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు కందుల శ్రీనివాస్, కడారి అశోక్రావు, కొమ్ము తిరుపతి యాదవ్, రాజన్న పటేల్, మహేందర్ యాదవ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10న అప్రెంటిషిప్ మేళా రామగుండం: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో నిర్వహించే ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళాకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి శనివారం కోరారు. అప్రెంటిషిప్ మేళాలో తోషిబా, ఎల్అండ్టీ, జాన్సన్ లిఫ్ట్స్, ఇండియా టాటా, ఏరోస్పేస్, వరుణ్ మోటార్స్, ఆదర్శ మోటార్స్, రాణే ఇంజిన్ వాల్వ్స్, ఐటీసీ టెక్నాలజీ తదితర కంపెనీలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువీకరణపత్రాలతో పదో తేదీ ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఆయన కోరారు.