breaking news
Phanindra director
-
8 వసంతాలు సీన్స్పై తీవ్ర అభ్యంతరం.. స్పందించిన దర్శకుడు!
ఇటీవల విడుదలైన లేడీ ఓరియంటెడ్ చిత్రం 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ ప్రేమకథా చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లలో ఆదరణ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఈ మూవీలో రెండు సీన్స్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన కాశీలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా అని డైరెక్టర్ను ప్రశ్నించారు. అయితే ఈ సమావేశానికి దర్శకుడు హాజరు కాలేదు.ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్రాహ్మణ వర్గం పట్ల తనకు అమితమైన గౌరవముందని తెలిపారు. సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారని.. వారి నాలుకపైనే సరస్వతి కొలువై ఉంటుందని దర్శకుడు తన పోస్ట్లో రాసుకొచ్చారు. కేవలం ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదన్నారు.ఫణీంద్ర తన ఇన్స్టాలో రాస్తూ.. 'నేరం చేసేవాళ్లు వారి విచక్షణా స్వభావంతోనే చేస్తారు.. కానీ వారి కులం, మతం ఆధారంగా చేయరు.. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారని నేను చూపించే ప్రయత్నం చేశా. కేవలం ఒక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి , మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు. ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను చదివి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి బట్టే నేరం చేస్తాడు. అంతేకానీ, అతని మతం, కులం అందుకు కారణం కాదు. అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఈ సినిమాలో కలపకండి. వేదికపై పంతులు అనకుండా ఉండాల్సింది. మీరు దాన్ని సరిచేయటంలో తప్పులేదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది మా టీమ్ ఉద్దేశం కాదు. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. -
ఆ శక్తి సినిమాకే ఉంది: ఫణీంద్ర నర్సెట్టి
‘‘సాహిత్యం, కవిత్వం, భాష విలువలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోతున్నాయి. భాషని బతికించే శక్తి సినిమాకే ఉంది. మా ‘8 వసంతాలు’ చూసిన తర్వాత ఎవరో ఒకరు ఆ భాషపై ఇష్టాన్ని పెంచుకోవచ్చు. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ నాకు సందేశాలు పంపుతుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతికా సనీల్కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’.హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ– ‘‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ కోసం స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టింది.బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా నా కథలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన గౌరవాన్ని కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణమే ‘8 వసంతాలు’. నేను రాసుకున్న శుద్ధీ అయోధ్య పాత్రకు అనంతిక కరెక్టుగా సరిపోయారు. నటిగానే కాదు... తనకి మార్షల్ ఆర్ట్స్తో పాటు దాదాపు 13 కళల్లో ప్రవేశం ఉంది. పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఫిల్మ్గా ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్లో ‘8 వసంతాలు’ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత ఎలాంటి కథలు చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని చెప్పారు. -
' ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు'.. ఆసక్తిగా 8 వసంతాలు ట్రైలర్
అనంతిక సానిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం '8 వసంతాలు'. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఒక అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్తోనే ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.Directed by #PhanindraNarsettiProduced by @MythriOfficialStarring… pic.twitter.com/8C5x3Noi8V— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025 -
బేబీ పాత్రే హైలైట్
రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా రూపొందిన చిత్రం ‘ఫిబ్రవరి 14’. ‘బ్రీత్ హౌస్’అనేది ఉపశీర్షిక. బేబీ ప్రేమ, దిలీప్ రాథోడ్, స్మైలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కడగాన సత్యారావు నిర్మించారు. వి.యస్. ఫణీంద్ర దర్శకుడు. హీరో, హీరోయిన్ లేని ఈ సినిమాకు బేబీ ప్రేమ పాత్ర హైలైట్గా నిలుస్తుందనీ, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.