Prakasam District News
-
విద్యుదాఘాతానికి పెయింటర్ బలి
పొదిలి: పట్టణంలోని తాలూకా కార్యాలయం సమీపంలో నివాసం ఉండే బూచిరాజు నాగరాజు (45) పెయింట్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వీధిలో ఓ ఇంటికి పెయింట్ వేస్తున్నాడు. పెయింట్ వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్ వైర్లు తగలడంతో నాగరాజు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. తీవ్రంగా గాయపడిన నాగరాజు కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగనన్నను సీఎం చేసుకోవాలి
తాళ్లూరు: 2029 ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్యెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా గురువారం రాత్రి తూర్పుగంగవరం పడమటి బజార్ బూచేపల్లి యూత్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బూచేపల్లి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా కరోనాలో రెండేళ్లు ఇబ్బందులు ఉన్నా నవరత్నాలను 100 శాతం అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలు, రైతులు జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సి బాధ్యత మనదేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్రెడ్డి, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, జిల్లా లీగల్సెల్ కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కల్చరల్ విభాగం అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, నియోజకవర్గ ప్రచారం విభాగం అధ్యక్షుడు యత్తపు మధుసూదన్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, రైతు అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజ్జుల వెంకటేశ్వర్లురెడ్డి (గోల్డ్), గొల్లపూడి యర్రయ్య, గువ్వల సత్యనారాయణరెడ్డి, సోషల్ మీడియా నాయకులు కొనికి గోవిందరాజు యాదవ్, బొజ్జా సంజీవ్కుమార్, సర్పంచ్ షేక్ వలి, పార్టీ నాయకులు గూడా శ్రీధర్రెడ్డి, గూడా ప్రసాద్రెడ్డి, ఎడమకంటి రాజాగోపాల్రెడ్డి (గోపి), కై పు వెంకట కృష్ణారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, ఐ.విజయభాస్కర్రెడ్డి (పాదయాత్ర), గుద్దేటి శ్రీనివాసరెడ్డి (జగన్), గువ్వల తిరుపతి (రాయుడు), పడమట బజార్ యాత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి -
దళితుడి ఇల్లు కూల్చివేత
చీమకుర్తి: మండలంలోని మర్రిచెట్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో చిన్న స్థలంలో రేకులతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేశారని దాసరి రాజేశ్వరి, ఆమె భర్త దాసరి రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిర్మించుకున్న ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వేకువ జామున కూల్చేశారని, వారు గతంలో తమ ఇంటిపైకి దాడికి కూడా దిగారని ఈ సందర్భంగా పోలీసులకు బాధితులు గుర్తు చేశారు. సర్వే నెంబర్ 195లో 2 సెంట్ల భూమిని గతంలో రవి నాన్న దాసరి నాగేశ్వరరావు పేరు మీద ఉంది. దానిలో ఇంటిని నిర్మించుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారని భయాందోళనతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఒకసారి ఇదే విషయంపై రవి ఇంటిపైకి వచ్చిన వారిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టినా లేక బైండోవర్ చేసినా ఇప్పుడు తన ఇంటిని ఎవరూ కాల్చే వారు కాదని గుర్తు చేశారు. అంతే కాకుండా ఈ విషయం అడిగినందుకు తనపై దాడి చేసిన వారు ఫిర్యాదు చేయటంతో తనపైనే కేసు నమోదు చేస్తున్నారని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పోలీస్స్టేషన్లో సీఐని అడిగినందుకు తనను తన భార్య, ఎస్సై, ఇతర వ్యక్తుల ముందే చొక్కా పట్టుకొని సీఐ లోపలకు లాక్కెళ్లాడని, ఆయనపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఎస్సైకి దాసరి రవి ఫిర్యాదు చేశారు. దానిపై సీఐని వివరణ కోరగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రవి న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడి చొక్కా పట్టుకున్న సీఐ సీఐపై ఎస్సైకి ఫిర్యాదు -
తౌషిక్ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
సింగరాయకొండ: సింగరాయకొండ మండలంలోని శ్రీచైతన్య నవోదయ స్కూలులో ఫిబ్రవరిలో జరిగిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ మౌలాబి, ఆలీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమ కుమారుడు తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారని, ఇది ముమ్మాటికీ అవాస్తవమని తల్లిదండ్రులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ స్కూలు యాజమాన్యం రమణారెడ్డి, ఆయన కుమారుడు చైతన్యకు కొమ్ముకాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తౌషిక్ది ముమ్మాటికీ హత్యేనని ఆత్మహత్య కాదని చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపకుండా దోషులకు కొమ్ముకాస్తూ వారిని కేసు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. పంచనామా సమయంలో కూడా సంఘటన జరిగిన ప్రదేశం వద్ద కాకుండా ఒంగోలు జీజీహెచ్ వద్ద పంచనామా చేశారని ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని, మృతదేహంపై ఉన్న గాయాలకు ఎలాంటి సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్రంగా విచారించిన హైకోర్టు ఈకేసులో విచారణాధికారులుగా ఉన్న పోలీసులు, ఇతర అధికారుల సెల్ఫోన్లు, సీసీ టీవీ ఫుటేజ్లతో పాటు అన్ని ఆధారాలను భధ్రపరచాలని, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ జరిపించాలని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఎస్పీ వీ హర్షవర్దన్రాజును ఆదేశించింది. తౌషిక్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించటంతో ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, ఈ కేసులో మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరించిన ఎస్సై బీ మహేంద్ర, ఇతర అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ప్రకాశం ఎస్పీకి ఆదేశాలు కేసుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకోవాలని సూచన కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిన సీఐ, ఎస్సైపై సమగ్ర విచారణ జరపాలి పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశం -
తెప్పోత్సవానికి ఏర్పాట్ల పరిశీలన
రాచర్ల: నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నీటి గుండంలో జరిగే తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మార్కాపురం కలెక్టర్ ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తెప్పోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని అధికారులకు సూచించారు. నీటి గుండం వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని ఆదేశించారు. భక్తులు నీటి గుండంలో స్నానాలకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, గిద్దలూరు, రాచర్ల తహసీల్దార్లు అంజనేయరెడ్డి, ఎల్.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు అన్నారు. స్థానిక ఎన్జీఓ భవన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిల విడుదల వేగవంతం చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ను వెంటనే నియమించి ఇంటేరియం రిలీఫ్ మంజూరు చేయాలని, అదే విధంగా పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిరంతర కృషి ఫలితమని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలన్నీ సాధించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. సంక్షేమం కోసం అసోసియేషన్ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని, పీఆర్సీ కమిటీ నియామకం, సరెండర్ లీవ్కు సంబంధించిన బిల్లులు సహా ఇతర పెండింగ్ బిల్లుల త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కే శివ కుమార్, సహాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పి.మాధవి, ఉపాధ్యక్షులు బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పీ రామాంజనేయులు, ఆర్ దీపక్ కుమార్, బీ విజయ్ కుమార్, కే కోటేశ్వరమ్మ, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి బీ కృష్ణ కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు యం శ్రీనివాసరావు, డీ వెంకటేశ్వర్లు, డీ మధుసూదన రెడ్డి, కే రాజేష్ బాబు, వీ హరి బాబు, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్, కార్యదర్శి షేక్ మగ్దుం షరీఫ్, జిల్లా కన్వీనర్ సీహెచ్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ● దేహశుద్ధి చేసిన బంధువులు కురిచేడు: పదో తరగతి పరీక్షల చివరి రోజు ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం పదో తరగతి పరీక్షలు ముగియడంతో స్థానిక వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువులకు ఒకసారి కనిపించి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ విద్యార్థిని పీఎస్ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లగా అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసి ఆ విద్యార్థిని బంధువులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కాలనాగులై కాటేస్తుంటే ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు రక్షణ కరువైంది. కంచె చేను మేసిన చందంగా ఉపాధ్యాయులు తయారవుతున్నారు. మండలంలో ఏడాదిన్నరలో నాలుగు పాఠశాలల్లో విద్యార్థినులతో ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిద్రావస్థను వీడి కీచక గురువులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
అద్దంకి రూరల్: పొలంలో పనులు చేసుకుంటూ జగనన్న పాటలు పెట్టుకున్నారన్న అక్కసుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన అద్దంకి మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్ సీపీ కార్యకర్త లక్కిరెడ్డి వెంకటరెడ్డి, అతని భార్య మల్లేశ్వరిలు పొలంలో కూలీలతో పాటు పసుపు కొమ్ములు కోసుకునే పని చేస్తున్నారు. సమీపంలో నిలిపి ఉన్న ట్రాక్టర్లో కూర్చొన చిన్న పిల్లాడిని కూలీలంతా జగనన్న పాటలు పెట్టమని చెప్పడంతో పాటలు పెట్టాడు. కూలీలంతా పాటలు వింటూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బైకుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పాటలు ఆపమని ఆ కుర్రాడిని కొట్టేందుకు ప్రయత్నించారు. అది చూసిన వెంకటరెడ్డి పాటలు పెట్టుకుంటే మీకేంటి బాధ అనడంతో చేతిలో ఉన్న బటన్ నైఫ్తో వెంకటరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ముఖానికి గాయమవడంతో అతని భార్య, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షురాలైన మల్లేశ్వరి అక్కడకు వచ్చి ప్రశ్నించింది. టీడీపీ కార్యకర్తల్లో ఒకరు ప్యాంట్ విప్పి అసభ్యంగా మాట్లాడుతూ ఏం పీక్కుంటారో పీక్కోండి.. ప్రభుత్వం మాది..మీకు దిక్కున్నచోట చెప్పుకొండి..అని బైకుపై పరారయ్యారు. గాయాలపాలైన వెంకటరెడ్డిని స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. -
జూనియర్ సివిల్ జడ్జిగా గౌతమి
ఒంగోలు టౌన్: అకుంఠిత దీక్ష, నిరంతరం కృషి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి ఉంటే అసాధ్యమైనదేదీ లేదని నల్లూరి గౌతమి చాటి చెప్పారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకొని పుట్టిన ఊరికి, తలిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఒంగోలుకు చెందిన నల్లూరి గౌతమి తాజాగా విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తి చేసుకున్న ఆమె ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో నిర్వహించిన ఇంటర్వ్యూలో అద్భుత ప్రతిభచాటి సివిల్ జడ్జిగా నియాకపత్రాన్ని అందుకున్నారు. ఒంగోలు నగరం మంగమూరులో నివాసం ఉండే గౌతమి తలిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఇద్దరూ ఉపాధ్యాయులు. శ్రీనివాసరావు 2017 గుండెపోటుతో మరణించారు. తల్లి ఉదయలక్ష్మి ప్రస్తుతం పేర్నమిట్ట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. తలిదండ్రులు ఆశయాలను అర్థం చేసుకున్న ఆమె తొలి నుంచి చదువుల్లో రాణించారు. ఒంగోలులోని మాంటిస్సోరి పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ ఎన్టీఆర్ మోడల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. విశాఖపట్టణంలోని ప్రతిష్టాత్మక దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఒకవైపు చదువుకుంటూనే ఏ మాత్రం తీరక దొరికినా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒంగోలులోని భూమి స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యురాలిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం గౌతమికి స్వచ్ఛత అవార్డు ఇచ్చి గౌరవించింది. సామాన్యులకు, నిరుపేదలకు సత్వర న్యాయం అందించడమే తన లక్ష్యమని గౌతమి చెప్పారు. నల్లూరి గౌతమి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో స్వగ్రామం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంతో పాటు ఒంగోలులోని మంగమూరు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు: మండలంలోని పెద్దవరం సమీపంలో శుక్రవారం వేకువ జామున కారు బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శివ కథనం ప్రకారం..పెద్దవరంలో వివాహానికి కారులో హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో కురిచేడు వైపు వెళ్తున్నారు. కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు.. వాగులో బోల్తా కొట్టింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి కారులో ప్రయాణిస్తున్న నలుగురిని బయటకు తీసి చూడగా హైదరాబాద్కు చెందిన శింగనమల నాగేశ్వరరావు (55)కు తీవ్ర గాయాలై కొన ఊపిరితో ఉన్నట్లు గమనించారు. 108 వాహనానికి సమాచారం అందించగా సిబ్బంది నాగేశ్వరరావు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడు నాగేశ్వరరావు హైదరాబాద్లో కన్జుమర్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మార్కాపురం టౌన్: ఎస్ఐఆర్ (సర్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా నిర్వహించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఏఎం అబ్దుల్ సుభాన్, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఎంపీజే ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ) పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని, అయితే ప్రస్తుతం కులం, మతం, పార్టీల పరంగా విభజించబడిందా అనేలా విమర్శలు వస్తున్నాయన్నారు. -
రైతులను నట్టేట ముంచిన బాబు
తమకు చెందిన 1.17 ఎకరాల భూమిని సర్వేయర్ ద్వారా కొలతలు వేయాలని సుబ్బాయమ్మ దరఖాస్తు చేసుకుంది. స్థానిక సర్వేయర్తో జనవరి 9వ తేదీ 2025న కొలతలకు వస్తామని నోటీసులు పంపారు. పండుగ సెలవులు కావడంతో జనవరి 19వ తేదీన కొలతలు వేశారు. అయితే జనవరి 7వ తేదీ కొలతలు వేయకుండానే ఈ భూమి మీది కాదని డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపించింది. ఈ విషయంపై కలెక్టర్ను కలిసినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. తన మాటలు కలెక్టర్ వినకుండానే ఆఫైల్ను పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం కోర్టును ఆశ్రయించానని చెబుతోంది. ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఎంతసేపూ తన మనుషులకు ఎలా లబ్ధి చేకూర్చాలన్న ధ్యాసలోనే ఉన్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం రైతు విభాగ నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, అన్ని రకాలుగా అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పార్టీకి సంబంధించి అన్ని రకాల అనుబంధ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేద్దాం.. రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బూచేపల్లి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డెయిరీని మూతేయించి పాడి రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రుణమాఫీ చేసి అండగా నిలిచారని, వైఎస్ జగన్ మోహన్రెడ్డి పెట్టుబడి సాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం సకాలంలో అందజేయడమే కాకుండా ఆర్బీకేల ద్వారా అన్ని సేవలను రైతు ముంగిటకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసి ఉచిత పంటల బీమా అమలు చేసి సకాలంలో సాయం అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క దర్శి నియోజకవర్గంలో మిర్చి, మొక్కజొన్న ఇలా రకరకాల పంటలకు పంట నష్టపరిహారం కింద సుమారు రూ.7 లక్షల వరకూ అందుకున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉంటేనే సమాజంలోని అన్ని వర్గాలు బాగుంటాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా అందజేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలను కొనేవారు లేక అన్నదాతలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట వేయాలని అధికారుల ద్వారా ప్రోత్సహించారని, తీరా పంట చేతికొచ్చిన తర్వాత మొండి చేయి చూపారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెస్పీ ధరలకే మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు కొనుగోలుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యతను మరిచిన చంద్రబాబు రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారులు రైతుల కష్టానికి ధరలు నిర్ణయిస్తున్నారని, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం.ప్రసాదరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్ల రవీంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, రైతు విభాగం నాయకులు శంకరరావు, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. భూ మాయ..!సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు గాడి తప్పుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి కోట్లాది రూపాయల విలువైన భూమిని అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరు మీదకు ఆన్లైన్లో మార్పులు చేసి లబ్ధిదారుల పొట్టకొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓ రెవెన్యూ అధికారి అక్రమాలకు అంతేలేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. సదరు అధికారి రియల్ వెంచర్లలో భాగస్వాములుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల తీరుతో నష్టపోతున్నట్లు దర్శికి చెందిన ఓ వృద్ధురాలు వేదన చెందుతోంది. సదరు అధికారి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనిచేసి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో మరింత చెలరేగిపోయి భారీ ఎత్తున భూములు బదలాయించి కోట్లు గడించారని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నోటీసుకు వెళ్లడంతో వారిని సైతం మేనేజ్ చేసే పనిలో పడ్డారని ఆశాఖ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనాయకులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ వివాదాల నుంచి బయటపడాలన్న ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శిలోని ఓ వెంచర్లో భాగస్వామిగా మారిన సదరు అధికారి ఫ్రీహోల్డ్లో రూ.కోట్ల విలువైన భూమిని అనువంశీకం కిందకు మార్పు చేశారు. ఈ భూముల్లో రియల్ఎస్టేట్ వెంచర్ వేశారు. అలాగే ఎర్రబాలెంలో బ్రిటీష్ కాలం నుంచి ఉన్న భూముల రికార్డులు కూడా తారుమారు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఐదు ఎకరాల భూమికి సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు భూమి విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దొనకొండ రాజధాని అని పుకార్లు రావడంతో అధికార టీడీపీ నేతలు భూములపై వాలిపోయి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై క్రైస్తవ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా యథేచ్ఛగా దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల వెంకట సుబ్బయ్య భార్య సుబ్బాయమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బాయమ్మ మామ వెంకట సుబ్బయ్యకు సర్వే నంబర్ 178లో 2.35 ఎకరాల భూమి ఉంది. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని తన భర్త వెంకట సుబ్బయ్యకు 1.17 ఎకరాల భూమి, ఆయన సోదరుడు వెంకటేశ్వర్లుకు 1.17 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. ఇవి ఇనామ్ భూమి కావడంతో అమ్మడానికి లేదని ఫ్రీహోల్డ్లో పెట్టి ఉంది. 2025 జనవరి నెల వరకు ఈ భూమి ఫ్రీ హోల్డ్లోనే ఉంది. 2025 ఫిబ్రవరి నెలలో వెంకటేశ్వర్లుకు సంబంధించిన 1.17 ఎకరాల భూమి, వెంకట సుబ్బయ్యకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన 44 సెంట్లు భూమి కలిపి వెంకటేశ్వర్లు కొడుకుల పేరుపై ఎక్కించారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ నుంచి తీసివేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు వెసులుబాటు కల్పించారు. -
రక్తకన్నీరు..
ప్రతి ఏడాది వేసవిలో రక్తం కొరత ఉంటుందని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బ్యాంకర్లు, కార్పొరేట్ కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు తమ ఉద్యోగుల చేత రక్త సేకరణ చేస్తుంటారని, వీరిలో కాలేజీ విద్యార్థుల నుంచి రక్తం సేకరించడం అధికంగా ఉంటుందని సమాచారం. సహజంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లాలో రక్త సేకరణ క్యాంపులు నిర్వహిస్తుంటారని, కాలేజీలకు సెలవుల కారణంగా వేసవిలో రక్త సేకరణ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తం నుంచి జీజీహెచ్కు 30 శాతం ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. చాలా వరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ కూడా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి జీజీహెచ్కు అందలేదని సమాచారం. ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 540 నర్సింగ్ హోంలు, వివిధ రకాల ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 90 ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులున్నారు. ఇక్కడ ప్రతినిత్యం వందల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. సుమారు 150 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెండు కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు చేస్తున్నారు. లెక్కకు మిక్కిలిగా స్టంట్లు వేస్తున్నారు. ఇంకా మోకాలి ఆపరేషన్లు, మహిళల గర్భసంచి సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఒక్క జీజీహెచ్లో జరిగే ఆపరేషన్లకే రోజుకు 15 యూనిట్లకు పైగా రక్తం అవసరమవుతుంది. ఒంగోలులోని మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులకు 50 నుంచి 75 యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర ఆపరేషన్లు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం కోసం బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. జీజీహెచ్కు వెళితే అక్కడ అవసరమైన రక్తం దొరకదు, ప్రైవేటుకు వెళితే రెడ్క్రాస్కు వెళ్లమంటారు. అక్కడకు వెళితే ఒట్టిచేతులు చూపుతున్నారని బాధితులు వాపోతున్నారు. నగరంలో రక్త నిల్వలు ఇలా.. జిల్లాలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒంగోలు నగరంలోని జీజీహెచ్తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. నగరంలో జీజీహెచ్, రెడ్క్రాస్లతోపాటు మొత్తం కలుపుకొని 6 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో జీజీహెచ్లో ఏ పాజిటివ్ 27, బీ పాజిటివ్ 42, ఓ పాజిటివ్ 47, ఏబీ పాజిటివ్ 5 యూనిట్ల రక్తం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏ నెగిటివ్ 1, బీ నెగిటివ్ 2, ఓ నెగిటివ్ 2, ఏబీ నెగిటివ్ జీరో యూనిట్లు ఉన్నాయి. రెడ్ క్రాస్లో ఓ పాజిటివ్ హోల్ బ్లడ్ 2, పాకెట్ సెల్ 19, ఏ పాజిటివ్ హోల్ బ్లడ్ 3, పాకెట్ సెల్ 5, బీ పాజిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్సెల్ 17, ఏబీ పాజిటివ్ రెండు రకాలు నిల్వలు లేవు. ఓ నెగిటివ్ పాకెట్ సెల్ 1, హోల్ బ్లడ్ జీరో, ఏ నెగిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్ సెల్ 1, బీ నెగిటివ్ రెండు రకాలు అందుబాటులో లేవు, ఏబీ నెగిటివ్ కూడా నిల్వలు లేవు. న్యూ విజన్ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ 4, బీ పాజిటివ్ 45, ఓ పాజిటివ్ 21, ఏబీ పాజిటివ్ 06 నిల్వలు ఉన్నట్లు నిర్వాహకుడు జి.నాగేశ్వరరావు తెలిపారు. నెగిటివ్ బ్లడ్ గ్రూపులు ఏవీ అందుబాటులో లేవని తెలిపారు. మార్కాపురం జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంకులో ఓ పాజిటివ్ 2, బీ పాజిటివ్ 3 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా గ్రూపులు, నెగిటివ్ బ్లడ్ పూర్తిగా నిల్వలు లేవని సమాచారం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒంగోలు, గుంటూరుకు పరిగెత్తాల్సి వస్తోందని మార్కాపురం జిల్లా ప్రజలు చెబుతున్నారు. దీంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయి ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. నెగిటివ్ బ్లడ్ కోసం తిప్పలు... కాస్త ప్రయత్నిస్తే పాజిటివ్ రక్తం దొరుకుతుంది కానీ ఎంత ప్రయత్నించినా నెగిటివ్ రక్తం దొరకడం కష్టమవుతోంది. ప్రస్తుతం జీజీహెచ్లో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు మొత్తం కలుపుకొని కేవలం 5 యూనిట్ల నెగిటివ్ రక్తం మాత్రమే నిల్వలున్నాయి. రెడ్ క్రాస్లో ఏ నెగిటివ్ 1, ఓ నెగిటివ్ 1 యూనిట్ మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు బ్లడ్ బ్యాంకు న్యూ విజన్లో అయితే ఓ నెగిటివ్ 1 యూనిట్ ఉండగా మిగతా ఏ, బీ, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం నిల్వలు లేవు. దాంతో నెగిటివ్ రక్తం అవసరమైతే దాతలను వెదుక్కోవాల్సి వస్తోంది. అరుదైన ఏబీ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కోసం ఒక్కోసారి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఎంత డబ్బు వెచ్చించినా ఏబీ నెగిటివ్ రక్తం దొరికే వరకు గ్యారంటీ ఉండడంలేదని తెలుస్తోంది. -
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కల్యాణం శుక్రవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కమనీయంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. స్వామి వారి కల్యాణాన్ని కన్నులారా తిలకించిన భక్తులు భక్తితో పరవశించిపోయారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రంగనాయకా..పాహిమాం అంటూ భక్తజనం పులకించిపోయారు. రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలోని కల్యాణ మండలంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. – మార్కాపురం టౌన్ – రాచర్ల -
అబద్ధపు హామీలతో మోసగించిన బాబు
వైఎస్సార్సీపీ విద్యుత్ ప్రభపై మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పక్కన మేరుగు నాగార్జున, కారుమూరి, వెంకాయమ్మ వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభ దగ్గర జనసందోహం చీమకుర్తి రూరల్: చంద్రబాబు అలవికాని అబద్ధపు హామీలు ఇచ్చి..అరకొరగా అమలు చేసి ప్రజలను మోసగించాడని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. చీమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి గంగా బాలత్రిపుర సుందరీ సమేత మోక్షరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గంగమ్మ తల్లి తిరునాళ్లలో ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాయ మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని, 2029లో చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కూటమి పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేరని, రైతన్నలు పండించిన ఏ పంటకు మద్దతు ధర ప్రకటించిన పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల పక్షాన గిట్టుబాటు ధరల కోసం పోరాడితే అక్రమ కేసులు, అరెస్టులు, బెదిరింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. మీ అక్రమ కేసులకు ఏ ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్త భయపడడని 2029లో చంద్రబాబుకి తగిన మూల్యం తప్పదన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకు పార్టీ, బూచేపల్లి కుటుంబం కూడా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న అంటేనే జనం అని, జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను పార్టీ చూడకుండా, మతం చూడకుండా కులం చూడకుండా చెప్పినవి, చెప్పనవి కూడా నెరవేర్చారన్నారు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ఏపంటకూ మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వంలో విఫలమైందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్రెడ్డి, దుంపా చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదింతల ఆనందం
● ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఒంగోలు సిటీ: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2వ తేదీ గురువారం ఇంగ్లిష్ పరీక్షతో ముగిశాయి. దీంతో విద్యార్థులు సంతోషంగా కేరింతలు కొట్టారు. స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ సెండాఫ్ చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 28,316 మంది విద్యార్థులకు గాను, 28,150 మంది హాజరుకాగా, 166 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఫ్లయింగ్స్క్వాడ్, స్టేట్ ఫ్లయింగ్ స్క్వాడ్, అధికారులు మొత్తం 88 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. బై బై.. ఇంటర్లో కలుద్దాం.. -
శారద శిల్పకళా మందిరంలో ఉచిత అడ్మిషన్
అద్దంకి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీ శారద శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 4 సంవత్సరాల కోర్సును ఉచితంగా నేర్పించనున్నట్లు పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరిన వారికి రాతి శిల్పకళను నేర్పుతారని తెలిపారు. ఈ శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి, రెండో సంవత్సరం నుంచి స్టైఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కోర్సులో చేరదలుచుకున్న వారు శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ డీ రవీంద్ర చారి, శిల్పి, శ్రీ శారద శిల్పకళామందిరం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, 8142711990, 9849211807 వారికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలోని ఉత్సాహవంతమైన యువతీ యువకులు ఈ సదవకాశం వినియోగించుకోవాలన్నారు. మార్కాపురం టౌన్: రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు మార్కాపురం ఆర్టీసీ డిపో ద్వారా భక్తుల, ప్రయాణీకుల సౌకర్యార్థం 4 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తుల కోసం ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రంతో సర్పంచ్ల పదవీకాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. 2021 మార్చిలో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. వారి పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల్లో పాలన చేయనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, ఈఓఆర్డీలు, ఎంఈఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, మండల వ్యవసాయాధికారులు, మండల హార్టీకల్చర్ అధికారులు, మత్స్యశాఖ అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు 2, 3 పంచాయతీలను కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 924 గ్రామ పంచాయతీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ సర్పంచ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. వీరందరూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో 21 మండలాల్లో 406 పంచాయతీలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు ఈఓపీఆర్డీలు ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఆయా గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, వీధిలైట్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. -
వాడ్ని బయటకు నెట్టు !
● అసిస్టెంట్ లైన్మెన్పై విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు చౌదరి రంకెలు సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు కొందరు అధికారులు కూడా రెచ్చిపోతున్నారు. ఒంగోలు విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు చౌదరి ఒక చిరుద్యోగిపై చిందులేయడం సంచలనం సృష్టిస్తోంది. లింగంగుంట్ల మద్దిపాడు సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఒంగోలు డివిజన్ డీ త్రీకి బదిలీ చేశారు. ఈ మేరకు సీఎండీ చైర్మన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కట్టా వెంకటేశ్వర్లుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈ వెంకటేశ్వర్లు మార్చి 10వ తేదీ డీ త్రీ అసిస్టెంట్ లైన్మెన్గా పోస్టింగు ఇవ్వాల్సిందిగా ఈఈ హరిబాబును ఆదేశించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏఎల్ఎం వెంకటేశ్వర్లురెడ్డి పోస్టింగు కోసం ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇది జరుగుతుండగానే మద్దిపాడు సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న సునిల్ కు డిస్టిక్ స్టోర్స్కు పోస్టింగు ఆర్డర్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు తనకు కూడా పోస్టింగు ఇవ్వమని అడిగేందుకు గురువారం ఈఈ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే బయట ఉన్న అటెండర్ నిన్ను ఈఈ గారు లోపలకు రానీయవద్దని చెప్పారని అడ్డుకున్నారు. ఈ లోపు సీసీ కెమెరాలోంచి వెంకటేశ్వర్లు రాకను గమనించిన ఈఈ హరిబాబు చౌదరి తన చాంబర్ నుంచి ఆగ్రహంగా బయటకు వచ్చారు. వచ్చీ రాగానే వెంకటేశ్వర్లును ఉద్దేశించి ‘‘బయటకు పో..బయటకు పో..’’ అంటూ రంకెలేశారు. వాడ్ని బయటకు నెట్టమని అటెండర్ను ఆదేశించారు. అంతటితో ఊరుకోకుండా ‘‘వీడ్ని సస్పెండ్ చేయండి’’ అంటూ హూంకరించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో చిత్రీకరిస్తుండగా అతడినుద్దేశించి ‘‘వీడియో తీస్తే ఏమవుద్ది...తీసుకో’’ అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఈఈ హరిబాబు ఎంత రెచ్చిపోతున్నప్పటికీ ఏఎల్ఎం వెంకటేశ్వర్లు రెడ్డి మాత్రం మౌనంగా తలవంచుకొని నిలబడ్డారు. ముడుపులు ఇవ్వలేదన్న కోపంతోనే... ఈఈ హరిబాబు చౌదరికి ముడుపులు ఇవ్వకుండా ఏఎల్ఎం వెంకటేశ్వర్లు రెడ్డి బదిలీ ఆర్డర్ తెచ్చుకున్నాడన్న కోపంతోనే విచక్షణ కోల్పోయి దూషణలకు పాల్పడినట్లు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. విద్యుత్ శాఖలో బదిలీల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఉద్యోగిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈఈ హరిబాబును సస్పెండ్ చేయాలి... ఆఫీసులో అందరిముందు తనను అకారణంగా దూషించిన ఈఈ హరిబాబును ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఎల్ఎం వి.వెంకటేశ్వర్లు రెడ్డి విజ్ఞప్తి చేశారు. తోటి ఉద్యోగినన్న కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించారని, మనస్తాపంతో తానేదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇలా మరో ఉద్యోగికి జరగకుండా ఈఈపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. -
కరుణాంతరంగ.. దీవించు గంగ
గంగమ్మ తల్లి దేవాలయంలో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ రామతీర్థంలో మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మచీమకుర్తి రూరల్: గ్రానైట్ ఖిల్లా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచిన రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల బుధవారం రాత్రి రంగరంగ వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు హాజరై గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి శరణు వేడారు. చీమకుర్తి మండలం రామతీర్థం నిధిలో వెలసిన గంగా, బాలత్రిపురసుందరీ సమేత మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు మొక్కులు చెల్లించారు. తిరునాళ్ల సందర్భంగా మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానం, గంగమ్మ తల్లి ఆలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఐదు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, తిరునాళ్లకు హాజరైన భక్తులకు వివిధ సామాజిక సత్రాల్లో అన్న సంతర్పణ చేశారు. చీమకుర్తి సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రామతీర్థంలో బూచేపల్లి ప్రత్యేక పూజలు మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, గంగమ్మ తల్లి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేయించారు. రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల బాగా జరగాలని, ముందుగా మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో తరువాత గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ చీమకుర్తిలో యువకుని హత్య? ఉలవపాడులో చోరీ ● 8 సవర్ల బంగారం అపహరణ ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడు రిజర్వు కాలనీలోని రెండో లైనులో ఓ ఇంట్లో చోరీ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. షేక్ షాహిద్కు రిజర్వు కాలనీ రెండో లైన్ లో సొంత గృహం ఉంది. కొంత కాలంగా సికింద్రాబాద్ లో ఉద్యోగ నిమిత్తం నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కింద పోర్షన్ అద్దెకి ఇచ్చి పైన ఇక్కడకు వచ్చినప్పుడు నివాసం ఉంటారు. 45 రోజుల క్రితం ఉలవపాడుకు వచ్చి తిరిగి సికింద్రాబాద్కు వెళ్లాడు. మంగళవారం రాత్రి కింద పోర్షన్ లో అద్దెకు ఉండేవారు గమనించి పైన దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. బుధవారం వచ్చి పరిశీలించగా బీరువా పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్బాషా, ఎస్సై సుబ్బారావు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బీరువాలో ఉన్న 8 సవర్ల బంగారు నగలు చోరీకి గురయ్యాయని బాధితుడు తెలిపారు. క్లూస్ టీమ్వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీమకుర్తి: చీమకుర్తిలో మంగళవారం రాత్రి మందిరాల వేడుకలో పాల్గొని ఇంటికి చేరుకున్న యువకుడు తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. చెవి నుంచి రక్తం కారిన మరకలు, కనుబొమ్మలు, మెడపై రక్తపు గాట్లు, గుండెలపై కమిలిన మచ్చలు ఉండటంతో యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం మృతుడి భార్య కార్తికేయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం, అందిన సమాచారం మేరకు.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన రామయోగి పెయింట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా చీమకుర్తిలోని గాంధీనగర్లో ఇంటిని అద్దెకు తీసుకొని భార్య కార్తికేయి, రెండేళ్ల కుమారుడు యోగేష్తో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి చీమకుర్తిలో మందిరాల సంబరాలకు భార్య, కుమారుడితో కలిసి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. మరో గంట తర్వాత రామయోగిని తనతోపాటు పనిచేసే ముగ్గురు స్నేహితులు వచ్చి మందిరాల సంబరాల పేరుతో వెంట తీసుకెళ్లారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య ముగ్గురు స్నేహితులు రామయోగిని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మృతుడి భార్య కథనం ప్రకారం.. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న రామయోగి తన భార్యతో రెండు మూడు మాటలు మాట్లాడి తొలుత మంచంపై, కాసేపటి తర్వాత నేలపై పడుకున్నాడు. బుధవారం ఉదయం ఇంటి పనులు చేసుకుంటూ భర్తను నిద్ర లేపే ప్రయత్నం చేయగా ఎలాంటి కదలిక లేదు. భర్త మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ దాసరి ప్రసాదరావు, ఎస్సై పీవీ కృష్ణయ్య పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానంతో కార్తికేయితోపాటు మృతుడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి సోదరుడు యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీ కృష్ణయ్య తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. రామయోగి చెవి వద్ద రక్తపు మరకలు, మెడపై గాయంమృతదేహం వద్ద విలపిస్తున్న సోదరుడు యోగేశ్వరరావు 12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సిందే.. రామతీర్థం నిధిలో వైభవంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల మోక్షరామలింగేశ్వరస్వామి ఆలయంలో వేలాది భక్తుల పూజలు ఐదు విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు మృతుడు పెయింటింగ్ వర్కర్ రాత్రి ఇంటికి వచ్చి పడుకుని, తెల్లవారేసరికి శవమైన వైనం శరీరంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మృతుడి భార్యతోపాటు ముగ్గురు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు -
ప్రాణాలు తీసిన ప్రేమ
తాడేపల్లిరూరల్: ఇద్దరి మధ్య ప్రేమ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ కుటుంబాలు పలుమార్లు ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేమికుడు దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు బుధవారం మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ యువతి బంధువులు పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన మేరకు.. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామానికి చెందిన దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతూ మానేసి ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. విజయవాడలో నివాసముండే అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, అతడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతనెల 18వ తేదీ శివారెడ్డితో ఆ విద్యార్థిని ఫోన్లో మాట్లాడుతుండగా ఆమె తల్లి గమనించింది. అనంతరం ఆ యువతి తల్లిదండ్రులు మీర్జాపేట వెళ్లి శివరామిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, చెంచులక్ష్మితో గొడవ పడ్డారు. శివరామిరెడ్డి ఇకమీదట ఆ అమ్మాయి జోలికి రాకుండా చూసుకుంటామంటూ నాగిరెడ్డి, గ్రామపెద్దలు వారికి చెప్పారు. 19వ తేదీ ఆ విద్యార్థిని, మరో యువకుడు ఫోన్చేసి శివరామిరెడ్డిని మార్కాపురం పిలిచారు. అక్కడ అతడిపై దాడిచేసి ఫోన్ లాక్కున్నారు. మీర్జాపేటలో కూడా రెండువర్గాల వారు తరచూ ఘర్షణ పడ్డారు. గత 25న ఆ విద్యార్థిని బంధువులు శివరామిరెడ్డిని దోర్నాల పిలిపించి దుర్భాషలాడి కొట్టారు. ఈ నేపథ్యంలో 30వ తేదీ ఇంట్లో నుంచి హడావిడిగా వెళ్లిన శివరామిరెడ్డి కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చి పడిపోయాడు. అతడిని మార్కాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు పురుగుమందు తాగాడని చెప్పారు. దీంతో అతడిని తాడేపల్లి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ విద్యార్థిని కుటుంబసభ్యులు బలవంతంగా పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దోషుల్ని శిక్షించాలని కోరారు. తాడేపల్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి యువతి బంధువులు పురుగుమందు తాగించారన్న మృతుడి తల్లిదండ్రులు అంతకుముందు మార్కాపురం మీర్జాపేటలో రెండువర్గాల ఘర్షణ -
కొండకు నిప్పు పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు
రాచర్ల: రాచర్ల ఫారెస్ట్ బీట్ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్లో నివాసం ఉంటున్న కటారి కృష్ణయ్య, కుంచపు సురేష్ అనే వ్యక్తులు నల్లమలలోని గూనికొండ నుంచి గుర్రాలకొండ వరకు బుధవారం నిప్పు పెట్టారు. అటవీ ప్రాంతంలోని నెమళ్లు, జింకలతోపాటు వన్యప్రాణుల ఆవాసాలకు నష్టం కలిగిస్తున్నారన్న అభియోగంపై ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులపాటు రిమాండ్ విధించారని ఫారెస్టు డీఆర్ఓ బి.వంశీకృష్ణకుమారి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మానాయక్ తెలిపారు. ● తన కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమన్న మౌలాబీ సింగరాయకొండ: మండల కేంద్రంలోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి తౌషిక్ మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ విద్యార్థి తల్లి మౌలాబీ తన కుమారునిది ముమ్మాటికీ హత్యేనని ఇప్పటికే పలు విధాల నిరసనలు తెలిపి చివరికి బుధవారం ఆ పాఠశాల వద్ద కూర్చొని తన నిరసన తెలిపింది. దీంతో పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు గంటన్నరకు పైగా ఆమె తన నిరసన తెలపగా చివరికి ఆమె బంధువులు కారులో వచ్చి ఆమెను బతిమిలాడి అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. తన కుమారుడి మరణానికి ముమ్మాటికీ శ్రీ చైతన్య నవోదయ స్కూలు యాజమాన్యమే కారణమని తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని ఆమె రోదించటంతో పాటు స్కూలు యాజమాన్యాన్ని దుర్భాషలాడింది. సింగరాయకొండ: మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డులో ఉన్న రాఘవయ్య కాలనీలో గత నెల 14వ తేదీ డాక్టర్ దువ్వూరి అనిల్కుమార్ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న చీమకుర్తి గ్రామానికి చెందిన తన్నీరు శ్రీహరిబాబును బుధవారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 30.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 548 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వేలిముద్రలు పడకుండా హ్యాండ్ గ్లౌజ్లు వాడుతూ స్క్రూడ్రైవర్, రాడ్డు ఉపయోగించి చోరీలు చేశాడన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్సై మహేంద్ర వివరించారు. అద్దంకి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎల్ఐసీ ఏజెంట్ మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కొమ్మాలపాటి గోపీ నాఽథ్ (27) గేదెల మేత కోసం ఉదయాన్నే తన మోటారు సైకిల్పై పొలానికి వెళ్లారు. గడ్డి మోపు తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో పొలంలో వేసిన విద్యుత్ వైరు మడ్గర్కు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్కు రాజగోపాల్ నగర్కు చెందిన యమునతో ఆరు నెలల క్రితం వివాహమైంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివాహమైన ఆరు నెలలకే భర్త అర్ధంతరంగా తనువు చాలించడంతో యమున కన్నీరు మున్నీరుగా విలపించింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
వరుడు వధువాయె..!
● గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారం కనిగిరిరూరల్: మండలంలోని గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారంతో వివాహం జరిగింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆ గ్రామంలోని 7 గోత్రాలు, సుమారు 5 ఇంటి పేర్ల కుటుంబాలకు చెందిన వారి వివాహ వేడుకల్లో వరుడు వధువుగా అలంకరించుకోవడం ఆచారం. ఈక్రమంలో గుడిపాడు కొత్తపాలెంలో దాదిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీదేవిల వివాహం బుధవారం జరిగింది. వివాహంలో వారి ఆచారం ప్రకారం ముందుగా పెళ్లి కుమారుడు కృష్ణారెడ్డి పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. ఊరేగింపుగా ఎదురు నడిచే కార్యక్రమం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది -
రాష్ట్రాన్ని గాలికొదిలేసిన బాబు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వదిలేసి జగన్మోహన్రెడ్డిని తిట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదని విమర్శించారు. పీ4 ద్వారా ఏం కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.1500, ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టేశారని అన్నారు. పీ4 విజయవంతం అయిందని డబ్బాలు కొట్టుకుంటున్నారని, అసలు ఈ కార్యక్రమం ద్వారా ఏం చేశారో చెప్పాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3.33 లక్షల కోట్లు అప్పులు చేశారని, మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మీరు అంతకుమించి అప్పులు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, దాచుకో, దోచుకో, పంచుకో అన్న రీతిన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడైనా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి.. అమరావతి విషయంలో జగన్మోహన్రెడ్డి వ్యతిరేకం కాదని, విశాఖ అభివృద్ధికి కూడా జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ కాదనరని, గతంలో తాత్కాలిక భవనాలు కట్టి కాలక్షేపం చేశారన్నారు. ప్రస్తుతమైనా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో దేవాలయాలు అభివృద్ధి జరిగాయని, అలాగే కోనసీమలో రథం కాలిపోతే వెంటనే చేయించి ఇచ్చారన్నారు. సెక్యులర్ దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టొదన్నారు. జగన్ వెంటే మేము.. ‘‘మా ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎలా ఉన్నారు... ఇప్పుడు ఎలా ఉన్నారు? గిట్టుబాటు ధర అప్పటి, ఇప్పటి పరిస్థితులపై అందరూ బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, ప్రజలు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నార’’ని కారుమూరి అన్నారు. జగన్తో మేమున్నామంటూ పార్టీ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రైతులు, కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలల నిర్మాణం, పోర్టులు, హార్బర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం నమోదు విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు పెద్ద ఎత్తున చేపట్టారని, ఇందుకు అందర్నీ అభినందించారు. మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు ముందంజలో ఉన్నారన్నారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్చార్జ్లు, నియోజకవర్గ పరిశీలకులతో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ నిర్మాణం, కమిటీలు, పార్టీ స్థితిగతులు, రోజు వారీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై దిశనిర్దేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి, మాజీ మంత్రులు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్లు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, యర్రగొండపాలెం, దర్శి, కొండపి, ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిశీలకులు పిడతల ప్రవీణ్కుమార్రెడ్డి, మాదాసి వెంకయ్య, మీర్జా షంషీర్ అలిభేగ్, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న కారుమూరి నాగేశ్వరరావు, పక్కన శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, సురేష్, మేరుగు నాగార్జున, బత్తుల, అన్నా రాంబాబు, చుండూరి రవిబాబు, దద్దాల తదితరులుసమీక్ష సమావేశంలో పాల్గొన్న బూచేపల్లి, కారుమూరి, వెంకాయమ్మ, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, పరిశీలకులు -
వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ విజయ సునీత పెద్దదోర్నాల: జిల్లాకు తలమానికంగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజుకు 4 మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాలన్నారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన డీజిల్, గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ప్రాజెక్టు ఈఈ అబూతాలిం, స్పెషల్ కలెక్టర్ శ్రీధరరెడ్డి, శివరామిరెడ్డి, తతదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న రెవెన్యూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే 6 నెలలు రెవెన్యూ సమస్యలపై దృష్టిపెట్టాలని తెలిపారు. రీసర్వే జరిగే గ్రామాలకు ప్రతిరోజూ తహశీల్దార్లు వెళ్లాలన్నారు. మ్యుటేషన్లు, 22ఏ భూములు, ఇతరుల భూముల వంటి వాటిలో అధికారులకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. జిల్లాలో వీఆర్ఓలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవన్నారు. పదే పదే వచ్చే అర్జీలపై నేరుగా ఫీల్డు సర్వే చేయాలన్నారు. పీజీఆర్ఎస్పై ప్రతిరోజూ రిపోర్టు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్, కనిగిరి ఇన్చార్జ్ ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎస్ఓ అంకయ్య, జిల్లాలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో విద్యుత్ సర్కిల్లోని వినియోగదారులకు వారి సర్వీసు నంబరుల మొదటి నంబరు 4కు బదులు 7 గా మార్చినట్లు ఏడీఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో సర్వీసు నంబరు ఉదాహరణకు 4222101012345 స్థానంలో 7222101012345 మార్చినట్లు తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించేటప్పుడు సర్వీసు నంబరులో మొదట 4కు బదులు 7 మొదలయ్యేలా చూసుకోవాల్సిందిగా సూచించారు. మార్కాపురం రూరల్: జిల్లా ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించే జలజీవన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా బుధవారం మండలంలోని గొట్టిపడియ గ్రామం వద్ద రూ.1290 కోట్లతో జరుగుతున్న జలజీవన్ మిషన్ పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో శాశ్విత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, సుజల నీటిని ఇంటింటికీ సరఫరా చేయనున్నారన్నారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పశ్చిమాసియా యుద్ధం వంటింట్లో మంటలు రేపుతోంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలు సగటు జీవిని గాయపరుస్తున్నాయి. తొలుత గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ధరల పెరుగుదలకు శ్రీకారం చుట్టినట్లయింది. గ్యాస్ ధరలు పెరగడంతో పాలు, పెరుగు, సిమెంట్, వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ కోసం ఏజెన్సీల దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. పాల కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నాడు. వంటనూనె కోసం చేతులు కాల్చుకుంటున్నాడు. అయినా సరే పాలకులకు పట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తుంటే ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదని జనం ఆందోళన చెందుతున్నారు. -
తాగునీటి విషయంలో నిర్లక్ష్యం సహించం
అద్దంకి: ఈ వేసవిలో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై, కొరిశపాడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొరిశపాడు రిజర్వాయర్కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా తాగు నీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో వర్షం నీరు వృథాగా పోకుండా జల సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వేసవిలో చెరువులు, కాలువల పూడికతీత పనులు, జంగిల్ క్లియరెన్స్, లింక్ కెనాల్స్ శుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అద్దంకి పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్సన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఎస్డీసీ విజయ జ్యోతి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. -
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి
మార్కాపురం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో మార్కాపురం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాసి, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కార్మిక వర్గానికి బ్లాక్ డే అని అన్నారు. ఇప్పటి వరకూ ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని నాలుగు లేబర్ కోడ్ల అమలు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛిద్రం చేస్తున్నాయని, కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేయాలని, పాత కార్మిక చట్టాలను అమలుచేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం హేయమైన చర్య అన్నారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీ బాలనాగయ్య, పట్టణ కో కన్వీనరు సుబ్బరాయుడు, నాయకులు నాగరాజు బాషా, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, నాయక్, హరి, సలామ్ ఖాన్, శ్రీను, శేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
అద్దంకి: ప్రజల్లో నమ్మకం కలిగేలా అధికారులు సేవలందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కొత్తగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై మరింత దృష్టి సారించి సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, రెవెన్యూ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. మండల స్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ, ప్రతిరోజూ ఉదయం పారిశుధ్యం, ఉపాధి హామీ పనులను పరిశీలించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహిస్తున్న తీరును రోజుకు ఒక గ్రామం చొప్పున పరిశీలించాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, భూగర్భ నీటిమట్టం పెంచడం వంటి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని హెచ్చరించారు. ఆయా విషయాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారుల పనితీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వచ్చే మూడు నెలల కాలాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రత్యేక ప్రణాళిక అవసరం .. ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులు పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. దీనికోసం వచ్చే మూడు నెలల కాలానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడం, పంటల మార్పిడి దిశగా వారిని ప్రోత్సహించడం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. వెబ్ల్యాండ్, మ్యుటేషన్, 22(ఏ), ఇతరములు వంటి రెవెన్యూ సమస్యలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. రెవిన్యూ క్లినిక్ , మీకోసం కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలను పునరావృతం కాకుండా సహేతుంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఎండార్స్మెంట్ స్పష్టంగా ఉండాలన్నారు. డివిజన్లోని 22(ఏ) భూముల సమస్యను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో తాను విస్తృతంగా పర్యటిస్తానని తెలిపారు. సమావేశాల్లో సీపీఓ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఆర్టీఓ జాన్సన్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్తమ్మ, ఏడీఏలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అంతంతమాత్రమే!
ఆస్తి పన్ను చెల్లింపులు మార్కాపురం టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆస్తి పన్ను చెల్లించేందుకు భవన యజమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పోరేషన్తోపాటు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, చీమకుర్తి, పొదిలి, అద్దంకి, కందుకూరు, పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు గడిచిన రెండు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. వార్డు సచివాలయ సిబ్బందిని టీమ్లుగా విభజించి పన్ను చెల్లించేలా భవనాల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పురపాలక సంఘాల్లో పన్ను బకాయిలు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన మేర మున్సిపల్ ఖజానాకు నగదు జమ కానట్టు తెలుస్తోంది. వసూళ్లు సగమే..! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది విధించిన పన్ను, పాత బకాయిలతో కలిపి రూ.139.85 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.76.25 కోట్లు మాత్రమే చెల్లించారు. ఒంగోలు కార్పొరేషన్లో రూ.83.14 కోట్ల డిమాండ్ ఉండగా మార్చి 31 నాటికి రూ.40.48 కోట్లు, మార్కాపురం మున్సిపాలిటీలో రూ.13.49 కోట్లకుగాను రూ.8.29 కోట్లు, గిద్దలూరులో 5.50 కోట్లకుగాను రూ.3.81 కోట్లు, కనిగిరిలో రూ.5.82 కోట్లకుగాను రూ.3.77 కోట్లు, దర్శిలో రూ.5.92 కోట్లకుగాను రూ.3.55 కోట్లు, చీమకుర్తిలో రూ.5.36 కోట్లకుగాను రూ.3.24 కోట్లు, పొదిలిలో రూ.4. 57 కోట్లకుగాను రూ.2.18 కోట్లు, అద్దంకిలో రూ.5.71 కోట్లకుగాను రూ.4.59 కోట్లు, కందుకూరులో రూ.10.34 కోట్లకుగాను రూ.6.34 కోట్లు వసూలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన డిమాండ్ ఉన్న మొత్తంలో సుమారు 60 శాతం మేర పన్ను ప్రజలు చెల్లించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆస్తి పన్ను వడ్డీపై నూరు శాతం రాయితీ ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్ల కాలంలో కేవలం 50 శాతం మాత్రమే రాయితీ ఇవ్వడంతో పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేస్తే వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని భవనాల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో పన్ను బకాయిలు రూ.139.85 కోట్లు ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి చెల్లించినది రూ.76.25 కోట్లు వడ్డీపై 50 శాతం రాయితీ ఇచ్చినా ఫలితం నామమాత్రం -
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అక్షరాలా రూ.12 కోట్లు విలువజేసే ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో సర్కారు పెద్దలు స్కామ్కు తెరతీశారు. టీడీపీ కార్యాలయానికి కారు చౌకగా కట్టబెట్టేందుకు పార్టీ పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో అధికారులు సైతం స్వామిభక్తిని చాటుకుంటూ శరవేగంగా ఫైల్ సిద్ధం చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అరెకరా స్థలానికి ఏడాదికి రూ.1000 లీజుతో 66 ఏళ్ల కాలపరిమితితో ఇచ్చేందుకుసంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని తెలుస్తోంది. స్థలం ఇంకా కేటాయించకపోయినా టీడీపీ నాయకులు మాత్రం కార్యాలయ నిర్మాణానికి సిద్ధమవుతుండడం కొసమెరుపు. ప్రభుత్వ స్థలం..పార్టీ చేసుకుందాం! -
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే..
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గడిచిన రెండేళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్నారని, పాలనలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు. జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో మళ్లీ సీఎంగా చేసుకుందామన్నారు. సోమవారం రాత్రి సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడు సమీపంలోని నిధిలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ప్రభలపై మాజీ మంత్రి, సంతనూతపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జునతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలోని కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానంతోపాటు బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, రాజకీయాలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పఽథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని కొనియాడారు. కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించకుండా నిలువునా ముంచారని మండిపడ్డారు. ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచురెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఎంపీపీ విజయ నాగేశ్వరావు, స్థానిక నాయకులు ములకలపల్లి సుబ్బారావు దొడ్డపాటి శ్రీనివాసరావు ఆంజనేయులు, పెద బ్రహ్మయ్య, మంగపాటి శ్రీను, ఇనగంటి పిచ్చిరెడ్డి, పాలడుగు రాజీవ్, వాకా కోటిరెడ్డి, కందుల డానియేల్, వేమా శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు. 2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు గుమ్మళంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ మంత్రి మేరుగు -
మోటారు బైకుల దొంగ అరెస్టు
● 27 మోటారు బైకుల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు ఒంగోలు టౌన్: కళ్లు మూసి తెరిచేలోపే మోటారు బైకులను చోరీ చేసి ఉడాయించే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన అద్దేటి ఏడుకొండలు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో మోటారు బైకులు చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఒంగోలు ఒన్టౌన్, టూ టౌన్, తాలుకా పోలీసు స్టేషన్ల పరిధిలోనే కాకుండా మద్దిపాడు, అద్దంకి, పల్నాడు జిల్లా వినుకొండ, నరసరావుపేట, గుంటూరు జిల్లా నగరంపాలెం, కొండూరు పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 27 మోటారు బైకులను దొంగిలించాడు. మంగళవారం నగరంలోని మామిడిపాలెం సెంటర్ నుంచి భాగ్యనగర్ వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయితో సహా పట్టుబడ్డాడు. తహసీల్దార్ మధుసూదనరావు సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని, బైకులను సీజ్ చేశామని డీఎస్పీ వివరించారు. కాగా, బైకుల చోరీ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీతోపాటుగా సీఐ నాగరాజు, ఏఎస్సై కె.సురేష్, హెచ్సీలు ఎం.సాయి, జి.విజయ్, కానిస్టేబుల్ అనిల్ తదితరులను ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందించారు. -
టిప్పర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
● విషాదంలో చిన జమ్ములమడక కాలనీ బల్లికురవ: ఆడుతూ, అల్లరి చేస్తూ, ముద్దులొలికే మాటలతో సందడి చేస్తున్న చిన్నారిని మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం పంచాయతీ చిన జమ్ములమడక కాలనీ వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. చిన జమ్ములమడక కాలనీకి చెందిన పరిమి ఏసు, శిరీషా దంపతుల రెండో కుమారుడు పెరిడిపాల్(3) ఇంట్లో నుంచి ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చాడు. వెలమవారిపాలెం నుంచి గుండ్లకమ్మ నది వైపు అతివేగంగా వెళ్తున్న టిప్పర్ చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన తర్వాత ఆగకుండా వేగంగా వెళ్తున్న టిప్పర్ను స్థానికులు వెంబడించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. కాగా, స్నేహ సంస్థకు చెందిన టిప్పర్లు రోజూ కొప్పరపాడు వైపు నుంచి, కూకట్లపల్లి రోడ్డు నుంచి గుండ్లకమ్మ నది వైపు ఇసుక, గ్రావెల్ తెచ్చేందుకు అతివేగంగా వెళ్తూ ప్రజల ప్రాణాలలను బలితీసుకుంటున్నాయని వెలమవారిపాలెం, కొత్తూరు, అరుణగిరి, జమ్ములమడక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. -
ఉసురు తీసిన అతివేగం
పామూరు: లారీ డ్రైవర్ అతి వేగం ఒకరిని బలి తీసుకోగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి నాగరాజు, తన భార్య నారాయణమ్మ, కుమార్తె అనన్యకృష్ణ, కుమారుడు రిత్విక్రాముతో కలిసి గత కొంత కాలంగా బెంగళూరులో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి సామగ్రితో సహా స్వగ్రామం గొల్లపల్లికి మినీ లారీలో వస్తున్నారు. సోమవారం రాత్రి తిరగలదిన్నె వద్ద ఓ లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. దానిని మినీ లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో క్యాబిల్లో కూర్చుని ఉన్న నారాయణమ్మకు తీవ్ర, ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు మోస్తరు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను పామూరు సీహెచ్సీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నారాయణమ్మ(28) చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ మహేంద్ర అతివేగమే ప్రమాదానికి కారమని స్థానికులు చెబుతున్నారు. మరో గంటలో ఇంటికి వెళ్తామనగా.. భార్య మృత్యువాతపడటం, కుమార్తె, కుమారుడు గాయాలపాలవడంతో నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నారాయణమ్మ భౌతికకాయాన్ని కనిగిరి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి రిత్విక్ రాము చికిత్సపొందుతున్న చిన్నారి అనన్యకృష్ణ మృతురాలు దాసరి నారాయణమ్మ ఆగిఉన్న లారీని ఢీకొన్న మినీ లారీ ప్రమాదంలో మహిళ మృతి భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలు -
బెట్టింగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు బేస్తవారిపేట/కంభం/రాచర్ల: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ను కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. మంగళవారం బేస్తవారిపేట, కంభం, గిద్దలూరు, కొమరోలు పోలీస్స్టేషన్లను తనిఖీ చేయడంతోపాటు రాచర్ల మండలంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఎస్పీ మాట్లాడుతూ.. బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఆరుగురిని ఇటీవల అరెస్టు చేశామని, బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్న యువకుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామన్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జునరావు, గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య, కంభం, బేస్తవారిపేట ఎస్సైలు శివకృష్ణరెడ్డి, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు రాచర్ల: నల్లమల అభయారణ్యంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్రాజు తెలిపారు. మంగళవారం రంగనాయకస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. నీటి గుండం, వాహనాల పార్కింగ్, కల్యాణ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దేవస్థానం చైర్మన్ నరసింహులు, ఈవో మల్లవరపు నాగయ్య, గిద్దలూరు రూరల్ సీఐ జే.రామకోటయ్య, రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–డి శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
మార్కాపురం రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రూప్–డి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు తేదీని పొడిగించిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎస్.నిర్మలా జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని, స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 99892 85530, 89850 90926ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పు వెల్లడించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం మేరకు.. వెలిగండ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బద్దిపూడి అనోక్ 2022 జూలై 24న తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో వెలిగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై పి.విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేయగా ఒంగోలు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఎ.పల్లపురాజు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసులు సాక్షులను సకాలంలో హాజరుపరచడంతో కేసు విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొంటూ పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.75 వేలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ కేసు రుజువు చేస్తోందని ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్లు ఈవీ స్వామి, యల్లమంద, కె.సాయి హరికృష్ణారెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు: ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం కేసులో మొదటి నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి మంగళవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.పద్మజ కథనం ప్రకారం.. 2017 నవంబర్ 30న చీమకుర్తి ఏకలవ్యనగర్లోని పాలపర్తి వెంకట్రావు నివాసంలో చీమకుర్తి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వి.శ్రీనివాసులు పలువురు అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో ఆకస్మిక తనిఖీ చేశారు. 3.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, పాలపర్తి వెంకట్రావు, బొర్రా సింహాచలం(విశాఖ)పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సమయంలో రెండో నిందితుడు మరణించగా, మొదటి నిందితునిపై విచారణ పూర్తి చేశారు. నిందితునిపై నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ● రూ.9.25 లక్షల సొత్తు రికవరీ కొండపి: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుకందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కొండపి మండలం జాళ్లపాలెం గ్రామానికి చెందిన ముదిరెడ్డి రామలక్ష్మమ్మ మార్చి 7వ తేదీన ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లింది. ఉదయం 11:30 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉన్నాయి. రెండు బంగారు గొలుసులు, ఒక నల్లపూసల దండ, రెండు జతల చెవిపోగులు, రెండు పాపట బిల్లలు చోరీ అయ్యాయని బాధితురాలు ఫిర్యాదు చేయగా కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్కుమార్ దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత సాయంతో పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి వినయ్కుమార్రెడ్డి(21)ని నిందితుడిగా గుర్తించారు. మంగళవారం ఉదయం కొడపి–జాళ్లపాలెం మార్గంలో ఒకటో కిలోమీటర్ రాయి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిండితుడి నుంచి రూ.9.25 లక్షల విలువైన 78 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కొండపి సీఐ, ఎస్సైతోపాటు సిబ్బంది సుధాకర్, రవి, అనిల్, అంజయ్యను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు. కనిగిరి రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పెరుగు మురళీకృష్ణ(మాజీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్), పెరుగు తిరుపతమ్మ(వెదుళ్లచెరువు సర్పంచ్, వెలిగండ్ల మండలం), సంగు సుబ్బారెడ్డి(కనిగిరి రూరల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పొన్నలూరు: కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తున్న బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు వివరాలు మేరకు.. కనిగిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్న సమయంలో కందుకూరు నుంచి కనిగిరి ప్రాంతానికి బయలుదేరింది. ఈ బస్సులో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే నాగిరెడ్డిపాలెం సమీపంలోకి రాగానే బస్సు స్టీరింగ్ సాంకేతిక లోపంతో అదుపు కోల్పోయింది. దీన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుకు ప్రమాదం జరగకుండా వెంటనే పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో కొంత దూరం వెళ్లిన తరువాత బస్సు ఆగిపోయింది. ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిపోయి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలు తప్పిన పెను ప్రమాదం -
లేబర్ కోడ్లకు నిరసనగా రేపు బ్లాక్ డే
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ ఒకటో తేదీన బ్లాక్ డే నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.రమేష్ తెలిపారు. సోమవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీన కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి పనికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బలిపీఠం ఎక్కించే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కార్మికుల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తకోట వెంకటేశ్వర్లు, సీహెచ్ మోజెస్, ఎంఎస్ సాయి, మంజుదార్ పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఐదు రోజుల పనిదినాన్ని అమలు చేయాలని కెనరా బ్యాంకు అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ కె.రవికుమార్ డిమాండ్ చేశారు. అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో జరిగిన బ్యాంకు అధికారుల సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకు ఉద్యోగులు నైపుణ్యాన్ని, నైతికతను దెబ్బతీయవద్దని కోరారు. బ్యాంకింక్ రంగంలో 90 శాతం వ్యాపారం క్షేత్రస్థాయి సిబ్బంది వల్లనే జరుగుతుందని స్పష్టం చేశారు. కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం రీజనల్ హెడ్ బీమా రాఘవేంద్ర, సంఘం తిరుపతి సర్కిల్ డీజీఎస్ హిమతేజ రెడ్డి, ఏజీ ఎస్ కిషోర్ రెడ్డి, రీజనల్ సెక్రటరీ రఘువర్మ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సౌరభం
మార్కాపురం టౌన్: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1405 నుంచి 1459 సంవత్సరాల మధ్య కాలంలో విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లు దేవాలయాల్లోని 18 శాసనాల ద్వారా తెలుస్తోంది. నెల్లూరు సీమను పరిపాలించిన సిద్దిరాజు తిమ్మ రాజయ్య రాయలవారి ఆదేశాల మేరకు మార్కాపురం చెన్నకేశవ స్వామి గర్భాలయ, అంతరాలయ, మధ్యరంగ మండపాలు, మహాద్వార నిర్మాణం, గర్భగుడిపై విమాన గోపుర నిర్మాణాలు జరిగాయి. 1529న అచ్యుత దేవ మహారాయులు మిగిలిన దేవాలయాన్ని నిర్మించారు. గాలి గోపురాన్ని 1929లో లింగరాజు అనే భక్తుడు, అనంతరం రామనం యోగేశ్వరరావులు పూర్తి చేశారు. 1936లో శ్రీరంగం శ్రీవాసమమలై జీయర్స్వామి గోపుర కలశ స్థాపన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం నిర్వహించారు. ఈ గోపురం జీర్ణోద్ధరణ 2013లో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు అద్భుత శిలా సంపద: చెన్నకేశవుని ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయం. అన్నదమ్ముల స్తంభాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఆస్థాన మండపం చుట్టూ ఒకే రాతితో చుంచు నిర్మాణంలో ఒంపులతో చెక్కడంతో శోభాయమానంగా కనిపిస్తుంది. చుంచుకూ విశేషమైన ప్రాముఖ్యం ఉంది. మానవ దేహానికి సంకేతాలుగా 9 అంతస్తులతో, గవాక్షాలతో అతిసుందర గాలిగోపురం ఈ క్షేత్రం ప్రత్యేకం. ఆలయంలో 13 మంది ఆళ్వార్లు, వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వామి, గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకస్వామి అంతరాలయాలు ఉంటాయి. ఉత్సవమూర్తులు నిత్య నీరాజనాలు, పూజలు అందుకోవడం ఆలయంలో విశేషం. శ్రీదేవి భూదేవిలతో కలిసి చెన్నకేశవుడు భక్తులను అనుగ్రహిస్తాడు. అన్నదమ్ములైన ఇద్దరు శిల్పులు మధ్యలో తెరకట్టి ఒకరినొకరు చూసుకోకుండా చెక్కిన శిల్పాలు అచ్చు ఒకేలా ఉంటాయి. మొత్తం 40 స్తంభాలు సకల ప్రాణి సమూహాలకు చిహ్నాలుగా ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి వారికి చక్రం, శంఖం, గధ ఉండి ఎడమ చేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులకు కొంగు బంగారమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ధనుర్మాసంలో సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి మూలవిరాట్ను ఆపాదమస్తకం అభిషేకించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఉత్సవాలు ఇలా... చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకు లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 1న అంకురార్పణ, 2వ తేదీ గురువారం సూర్యవాహనం, (తెల్లవారితే శుక్రవారం స్వామి వారి కల్యాణం), 3న చంద్రవాహనం, 4న సింహ, 5న శేష, 6న వ్యాళి, 7న పొన్న, 8న హనుమంత, 9న గరుడ, 10న గజ వాహనం, 11న సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం జరుగుతుంది. 12న అశ్వవాహనం, 13న హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారికి వసంతోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రూ.8 కోట్లతో నాలుగు ప్రకార రాజగోపురాలను నిర్మించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రకార రాజగోపురాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఈనెల 4న రాజగోపురాలకు కలశాలు, నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. -
షంషీర్ను పరామర్శించిన నేతలు
మార్కాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ షంషీర్ అలీబేగ్ తండ్రి ఉస్మాన్బేగ్ మృతి చెందడంతో ఆయన మృతదేహానికి సోమవారం పలువురు నేతలు నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నివాళులర్పించి షంషీర్ను ఓదార్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు షంషీర్ను ఒదార్చారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణా, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, డాక్టర్ చప్పళ్ళి కనకదుర్గ, ఉడుముల కోటిరెడ్డి, గౌతంనాగిరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఎన్. చంద్రమౌళి, శ్రీనివాసరావు, చాతరాజుపల్లి శ్రీనివాసులు, సిరాజ్, మురారి వెంకటేశ్వర్లు, ఉత్తమ్, గొలమారి సత్యనారాయణరెడ్డి, బూదాల గురవయ్య, మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, రంగారెడ్డి, గపూర్, నజీర్, నల్లబోతుల కొండయ్య, రమణారెడ్డి, గుంటక చెన్నారెడ్డి, గౌస్మోహిద్దిన్, ధర్మానాయక్, తదితరులు నివాళులర్పించారు. -
మందలించాడని హత్య చేశాడు
బేస్తవారిపేట: భార్య పట్ల ప్రవర్తన మార్చుకోవాలని మందలించినందుకు చిన్న మామను హత్య చేశాడని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం సాయంత్రం బేస్తవారిపేటలోని గాంధీబజార్ సమీపంలో ఈనెల 22వ తేదీన జరిగిన హత్య కేసుపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కొమరోలు మండలం పొట్టిరెడ్డిపల్లెకు చెందిన పొద్దుటూరి పీరావలికి బేస్తవారిపేటకు చెందిన దూదేకుల రాజాహుస్సేన్ కుమార్తె కరిష్మాతో జనవరి 24న వివాహమైంది. అయితే పీరావలి భార్యను సక్రమంగా పట్టించుకోకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. విషయం కరిష్మా తల్లిదండ్రులకు, బాబాయ్ కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ విషయంపై పీరావలిని చిన్నమామ ఖాజావలి మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న పీరావలి ఎలాగైన చిన్నమామను హత్య చేయాలని యూట్యూబ్లో మర్డర్ చేసే వీడియోలు చూశాడు. దూదేకుల ఖాజావలి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రోకలిబండతో తలపై కొట్టి కత్తితో గొంతులో పొడిచాడు. దీంతో ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సొంతమామ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నిద్రపోతున్న రాజాహుస్సేన్ను చంపేందుకు ఫోర్క్ స్పూన్తో దాడిచేశాడు. మామ, అత్త అప్రమత్తమై దాడిని అడ్డుకుని అల్లుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. హంతకుడు బయటకు పరుగెత్తి పరారయ్యాడు. నిందితున్ని సోమవారం బేస్తవారిపేట ఆర్కే జంక్షన్లో కంభం సీఐ మల్లికార్జున అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తాకట్టు పెట్టిన సొమ్ము ఇవ్వాలని ఎస్టీల ధర్నా
అద్దంకి రూరల్: తాకట్టు పెట్టిన సొమ్ము తిరిగి ఇవ్వనంటున్న వ్యాపారిపై ఎస్టీలు ధర్నాకు దిగారు. ఈ సంఘటన సోమవారం రాత్రి అద్దంకిలో జరిగింది. ఎస్టీలు తెలిపిన వివరాల మేరకు..తాము 7 ఏళ్ల క్రితం కాలనీలోని 20 మంది బంగారు చైన్లు, ఉంగరాలను పట్టణంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి వద్ద 20 సవర్ల వరకు తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకున్నారు. పనులు చేసుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లి 5 నెలల క్రితం తిరిగి వచ్చి డబ్బు చెల్లిస్తాం బంగారం ఇవ్వమని వ్యాపారిని అడిగారు. అయితే ఆ వ్యాపారి బంగారం లాకర్లో ఉందని తీసుకువచ్చి ఇస్తానని ఇన్నిరోజులు కాలయాపన చేశాడు. ఇప్పుడు తన వద్ద బంగారం లేదని, మీ ఇష్టం వచ్చిన వారి చెప్పుకోండని దుర్భాషకు దిగాడు. దీంతో చేసేది లేక వారంతా పోలీస్స్టేషన్ను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సోమవారం షాపు వద్ద ధర్నాకు దిగారు. వ్యాపారికి అధికార పార్టీ అండ ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. -
చట్టబద్ధత పేరుతో డ్రామా
అమరావతికి కనిగిరి రూరల్: ప్రజలు, రైతులను మభ్యపెట్టేందుకు అమరావతి రాజధానికి చట్టబద్ధత, అసెంబ్లీలో తీర్మానం అంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధత పేరుతో డ్రామాకు తెరలేపారన్నారు. అమరావతికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలం గడిపారని గుర్తు చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని అభివృద్ధి అంటూ వేల కోట్లు అప్పు చేశారన్నారు. గతంలోనే రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారని, మళ్లీ ఇప్పుడు 30 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, ఇంత భూమి ఎందుకని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, వైఎస్సార్ సీపీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారన్నారు. 2028కి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెబుతూనే, మరోవైపు తరువాత ఎవరైనా అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే ఉండాలని తీర్మానం చేస్తున్నారన్నారు. దీనిని బట్టి 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామన్నా నమ్మకం చంద్రబాబుకే లేదని అర్ధమవుతోందన్నారు. కొత్త భవనాలు కట్టకుండా, పనులు చేయకుండా డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలులో విఫలం కావడం, పాలనలో వైఫల్యంతో టీడీపీ నేతల్లోనే నైరాశ్యం నెలకొందన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, రాజధాని రైతులను మభ్యపెట్టేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతమివ్వాలనే ఉద్దేశంతోనే రాజధానికి చట్టబద్ధత అంశాన్ని హడావిడిగా తెరపైకి తెచ్చారని దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం రాజధాని, ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించడానికే సర్కార్ పన్నాగం చంద్రబాబు తీరుపై కనిగిరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దద్దాల ధ్వజం -
నేటి నుంచి హరిహర క్షేత్రం వార్షిక వేడుకలు
చీమకుర్తి: చీమకుర్తిలోని హరిహర క్షేత్రం 20వ వార్షిక వేడుకలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. దానికి సంబంధించిన కరపత్రాలను సోమవారం చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి వేదపండితులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ హరిహర క్షేత్రం నిర్మించి నేటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా రానున్న రెండు రోజుల పాటు ప్రముఖ వేదపండితుల చేతుల మీదుగా హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు, అయ్యప్పస్వామి మహా పడిభజన, పూర్ణాహుతి, నగరోత్సవం, హరిహర శాంతి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని, ప్రసాదాలను స్వీకరించాలని హరిహర క్షేత్రం ఆలయ కమిటీ నిర్వాహక కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరణ 31వ తేదీ నుంచి రెండు రోజుల పాటు వార్షికోత్సవాలు -
అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
మార్కాపురం టౌన్: అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. అయితే కొంత మంది అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యంగా తీసుకోవడం, అనుమతి లేకుండా వేదిక నుంచి వెళ్లిపోవడం వంటి విషయాలను కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా వేదిక నుంచి ఎలా వెళ్లిపోతారని అసహనం వ్యక్తం చేశారు. అర్జీలను పరిష్కరించకుండా మాయమాటలతో క్లోజ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సమస్యలను లాజికల్గా పరిశీలించి పరిష్కారం చూపేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు తిరస్కరించే విధంగా తహసీల్దార్లు ప్రవర్తించవద్దని హితవు పలికారు. ప్రజా సేవకోసమే ఉన్నామని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని క్షణంగా పరిశీలించి వ్యక్తిగతంగా విచారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న మండలాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, నిర్లక్ష్యం చేసిన తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అన్ని అర్జీలను కేటగిరి వారీగా విభజించి సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ పి.ప్రభాకర్, కనిగిరి ఇన్చార్జి ఆర్డీఓ శివరామిరెడ్డి, గనులశాఖ ఏడీ రవివర్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీ నాయక్, ఉద్యానవనశాఖ అధికారి రమేష్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్డు డైరెక్టర్ జెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం ప్రజలు తిరస్కరించే విధంగా ప్రవర్తించవద్దని హితవు -
జనసేన నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సింగరాయకొండ: మండలంలోని పాకల గ్రామానికి చెందిన జనసేన మండల అధికార ప్రతినిధి సంకె నాగరాజుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి గాయపరిచారు. స్థానికుల కథనం ప్రకారం సంకె నాగరాజు, సైకం ఫణీంద్ర కలిసి చేపల వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం కోసం సంకె నాగరాజుతో రూ. 4.50 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. కానీ ఆదాయంలో ఒక్క రూపాయి ఇవ్వకపోగా పెట్టుబడిని కూడా సైకం ఫణీంద్ర తన ఆధీనంలో ఉంచుకున్నాడు. నగదు విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రూ.2.50 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుని రూ. లక్ష ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం బస్టాండ్ సెంటర్లోని సంకె నాగరాజు స్టూడియో వద్దకు వచ్చిన ఫణీంద్రను డబ్బులు ఇవ్వాలని అడగగా నన్నే డబ్బులు అడుగుతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతావు అంటూ గొడవ చేసి వెళ్లి తరువాత తన తండ్రి సైకం సుబ్బారావు, తమ్ముడు సైకం ఆనంద్, అతని బాబాయి మొత్తం నలుగురు కర్రలు తీసుకుని వచ్చి సంకె నాగరాజుపై దాడి చేశారు. అతని సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి జనసేన మండల ప్రదాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు గాయపడ్డ నాగరాజును కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. నాగరాజును జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కనపర్తి మనోజ్కుమార్, మండల అధ్యక్షుడు అయినాబత్తిన రాజేష్ పరామర్శించి దోషులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
వివాహేతర సంబంధం బయట పడుతుందనే..
త్రిపురాంతకం: ముక్కుపచ్చలారని చిన్నారి తులసి హత్య కేసు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ యూ నాగరాజు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. త్రిపురాంతకానికి చెందిన ఎం.వెంకట తులసి వందన గత గురువారం హత్యకు గురైంది. ఈ కేసులో నిందితురాలు షేక్ భాజీబీని యర్రగొండపాలెం రోడ్డులో వై జంక్షన్ వద్ద ఆదివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చిన్నారి తులసి తండ్రి ఎం.శివారెడ్డికి ఇంటికి సమీపంలో నివాసముంటున్న షేక్ భాజీబీతో మూడేళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. దీని వల్ల శివారెడ్డి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దాంతో కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. తిరిగి గత ఐదు నెలలుగా ఫోన్ కాల్స్, రాకపోకలు సాగుతున్నాయి. ఇరవై రోజుల నుంచి శివారెడ్డి..భాజీబీ ఇంటిలో ఉంటూ వచ్చాడు. బయటకు వచ్చే క్రమంలో కుమార్తె తులసి చూడడంతో తిరిగి గొడవ జరిగే అవకాశం ఉందని, మధ్య అడ్డుగా ఉన్న తులసిని హతమారిస్తే తమకు ఎలాంటి అడ్డూ లేకుండా పోతుందని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి గురువారం తెల్లవారుజామున ఇంటి బయట తులసి నిద్రిస్తున్న సమయంలో భాజీబీ ఇంటికి శివారెడ్డి తీసుకెళ్లగా అరవకుండా నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు గట్టిగా పట్టుకుని, మెడకు డోర్ స్ప్రింగ్, చార్జర్ వైర్ వేసి బిగించి, రోకలి బండతో కంటిపైన తలపైన కొట్టి హతమార్చడంతో తులసి మృతి చెందింది. కేవలం తమ సంబంధం బయటపడి గొడవలకు దారితీస్తుందని తులసిని హతమార్చారు. ఈ కేసులో ఎస్పీ వీ హర్షవర్థన్రాజు ప్రత్యేక దృష్టి సారించి తగిన సూచనలు చేసి కేసు వేగవంతంగా పూర్తి చేశారు. సీఐ అసాన్ కేసు దర్యాప్తు మేరకు శివారెడ్డి, భాజీబీ ఇద్దరూ కలిసి చిన్నారి తులసిని హత్యచేసినట్లు తెలిపారు. శివారెడ్డిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. సీఐ అసాన్, ఎస్ఐ శివరామయ్య పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
నల్లమలలో ఆధ్యాత్మిక పరిమళం
రాచర్ల: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నెమలిగుండ్ల రంగనాయకస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామి కల్యాణం, తెప్పోత్సవానికి తరలివచ్చే వేలాది భక్తులతో నల్లమల అటవీ ప్రాంతం జనసంద్రంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నెమలిగుండ్ల క్షేత్రంలో 1994 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం, రాత్రి శేషవాహనం, హనుమంత వాహనం, 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణం, రాత్రి గురుడ వాహనం, గజవాహనం, 4వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు స్వామి తెప్పోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య తెలిపారు. ఆలయానికి చేరుకునేదిలా.. నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రానికి గిద్దలూరు నుంచి కొండపేట, అంబవరం, వెల్లుపల్లి మీదుగా చేరుకోవచ్చు. అదేవిధంగా గిద్దలూరు నుంచి వయా రాచర్ల, అనుములపల్లె, జేపీ చెరువు మీదుగా కూడా వెళ్లవచ్చు. అలాగే తుడిమెళ్ల మీదుగా అక్కపల్లె, చోళ్లవీడు, చినగానిపల్లె, జేపీ చెరువు గ్రామాల మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఆకర్షణీయంగా జలపాతం: నెమలిగుండ్ల రంగనాయకస్వామి కొండపై ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద పుట్టిన గుండ్లకమ్మ నది జలపాతంగా రంగనాయకుని దేవస్థానం వద్ద కొండపై నుంచి గుండంలో పడుతుండటం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గుండ్లకమ్మ నదీ జలాలు నల్లమల అడవుల గుండా రాచర్ల మండలంలోని చినగానిపల్లె, ఆకవీడు, అచ్చంపేట చెరువులే కాకుండా కంభం మండలంలోని తుడిమెళ్ల, కంభం పెద్ద చెరువుతో పాటు మార్కాపురం చెరువుకు చేరి అక్కడి నుంచి తూర్పు దిశగా పయనించి సముద్రంలో కలిసిపోతాయి. వర్షాలు లేకపోయినా నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం వద్ద ఉన్న నీటి గుండం ఎండిపోదని పెద్దలు చెబుతున్నారు. సంస్కృతిక కార్యక్రమాలు: నెమలిగుండ్ల రంగనాయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో 2వ తేదీ రాత్రి 9 గంటలకు సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం, 3వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సినీ గాయకులచే మ్యూజికల్ నైట్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మూడు రోజుల పాటు కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సత్రాల్లో అన్నసంతర్పణ: బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు మూడు రోజుల పాటు ఆలయ ఆవరణలోని కృష్ణదేవరాయుల కాపు, బలిజ, గోపాలకృష్ణ యాదవ, కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, బ్రహ్మణ, ఆర్యవైశ్య, విశ్వబ్రహ్మణ, మేదర సత్రాల్లో అన్నసంతర్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. దేవస్థానం ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా దాతల సహకారంతో మజ్జిగ, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. – మల్లవరపు నాగయ్య, దేవస్థానం కార్యనిర్వహణాధికారి -
వడగండ్ల వాన
బేస్తవారిపేట/కంభం: బేస్తవారిపేట, కంభం మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం పడింది. ఎండు మిర్చి కోసం పొలాల్లో పంటను ఆరబెట్టుకున్న రైతులు ఒక్కసారిగా వర్షం మొదలవడంతో ఇబ్బందులు పడ్డారు. కంభం నుంచి కందులాపురం రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడింది. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బేస్తవారిపేటలోని పాత సినిమాహాల్ సెంటర్, నేకునాంబాద్ రోడ్డులో చెట్టు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ప్రభంజనం
వైఎస్సార్ సీపీఊరేగింపుగా వస్తున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున రామతీర్థంలో క్రేన్లు, కార్యకర్తల సాయంతో ప్రభ తడికను లేపి నిలబెడుతున్న దృశ్యంచీమకుర్తి: రామతీర్థం తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ ప్రభ తడిక తరలింపు కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన వేలాది మంది పార్టీ శ్రేణులు చుట్టు పక్కల గ్రామాల నుంచి చీమకుర్తికి తరలివచ్చారు. చీమకుర్తి నుంచి రామతీర్థంలోని గంగమ్మ సన్నిధిలోకి ప్రభ తడిక తరలించే కార్యక్రమాన్ని ఆదివారం భారీ ఊరేగింపుతో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బూచేపల్లి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పార్టీ జెండాలతో పాల్గొన్నారు. రామతీర్థం తిరునాళ్ల సందర్భంగా ఈనెల 31న చీమకుర్తిలో మందిరాల సంబరాలు, వచ్చేనెల 1న రామతీర్థంలో గంగమ్మ తిరునాళ్ల జరుగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా వచ్చే నెల 1న రామతీర్థంలోని గంగమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసే తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ తరఫున చీమకుర్తిలో నిర్మించిన ప్రభ తడికను బూచేపల్లి కల్యాణ మండపం వద్ద నుంచి చీమకుర్తి మెయిన్ రోడ్డు మీదుగా ఊరేగింపుగా రామతీర్థంలోని నిధిలోకి తరలించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని గుర్రాలపై పార్టీ నాయకులు ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రభ తరలింపు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ప్రభ తడికను తరలించే ముందు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రభను నిర్మించటానికి పార్టీ కార్యకర్తలు, ప్రభ నిర్మాణంలో అనుభవం ఉన్న వారు గత వారం పదిరోజుల నుంచి చీమకుర్తిలో చెమటోడ్చి నిర్మించారు. రామతీర్థంలో ప్రభను క్రేన్ల సాయంతో నిలబెట్టి మోకులు కట్టి నిలబెట్టడంలో పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమని నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, బడే అయ్యపరెడ్డి, గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎడ్ల పోటీల విజేతలకు బహుమతులు
మార్కాపురం రూరల్: మండలంలోని బోడపాడులో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల్లో విజేతలకు శనివారం సాయంత్రం బహుమతులు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతిని సూర్యపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన ఏఎస్పీ సుంకి సురేంద్రరెడ్డి ఎడ్లజత 1584.5 అడుగులు లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు అందుకోగా మార్కాపురం జిల్లా బోడపాడు గ్రామానికి చెందిన లక్కు ఆంజనేయులు ఎడ్లజత 1527 అడుగులు లాగి రెండో స్థానంలో నిలిచి రూ.80 వేలు, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి ఎడ్ల జత 1492.3 అడుగులు లాగి 3వ స్థానంలో నిలిచి రూ.60 వేలు, 4వ స్థానంలో మార్కాపురం జిల్లా బొడిచర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రరెడ్డి ఎడ్ల జత 1238.5 అడుగులు లాగి రూ.40 వేలు, 5వ స్థానంలో కడప జిల్లా రుకావారిపల్లెకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్ ఎడ్ల జత నిలిచి రూ.30 వేలు, 6వ స్థానంలో మార్కాపురం జిల్లా వీరాయపాలెం గ్రామానికి చెందిన దూదేకుల చాంద్బాషా ఎడ్లజత నిలిచి రూ.20 వేలు, 7వ స్థానంలో నంద్యాల జిల్లా జిల్లెళ్ల గ్రామానికి చెందిన గుటిక హేత్విక్ రెడ్డి ఎడ్లజత నిలిచి రూ.10 వేలు గెలుపొందాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జత నిర్వాహకులకు రూ.5 వేలు చొప్పున అందజేశారు. పోటీలను వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. -
బెట్టింగ్ కేసులో ఇద్దరికి సంకెళ్లు
దర్శి: క్రికెట్ బెట్టింగ్ కేసులో కమ్యూనికేటర్ బోర్డును ఆపరేటింగ్ చేసే ఇద్దరిని సీఐ వై.రామారావు శనివారం అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ నాగులమీరా, జరుగుమల్లికి చెందిన షేక్ సిద్ధయ్యలను అరెస్ట్ చేసి దర్శి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. హనుమంతునిపాడు: మండల కేంద్రం హనుమంతునిపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. సీతారాముల వారికి ముస్లింలు వెండి పాదుకలను శనివారం సమర్పించారు. గ్రామస్తులు షేక్ షరీఫ్ బ్రదర్స్ సాఫ్టవేర్ ఉద్యోగులు. శనివారం స్వామి వారికి పాదుకలను బహూకరించారు. ఈ సందర్భంగా సీతారాముల వారికి రూ.లక్ష విలువైన వెండి పాదుకలు ఇవ్వాలని మొక్కు ఉండటంతో స్వామి వారికి ప్రత్యేకంగా పాదుకలు తయారు చేయించి గ్రామోత్సం చేస్తూ స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో వారి బంధుమిత్రులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: విధి నిర్వహణలో ఊహించని ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని సుజాత నగర్లో నివశించే జంపాల వెంకట రమణయ్య ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో వున్న ఆయన శనివారం సాయంత్రం మోటారు బైకుపై భాగ్యనగర్ నుంచి వస్తుండగా ఒక్కసారిగా కుక్క అడ్డు వచ్చింది. దీంతో మోటారు బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటి గోడ తలకు తగిలింది. బలమైన గాయాలైన రమణయ్యను వెంటనే జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య మృతి సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్ సీఐ జగదీష్ హాస్పిటల్కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ● ఒకరికి గాయాలు త్రిపురాంతకం: జాతీయ రహదారిపై బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ సమీపంలో శనివారం సోమేపల్లి రోడ్డు దాటే క్రమంలో ఈప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సోమేపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటకృష్ణ కాలు విరగ్గా తలకు బలమైన గాయమైంది. 108లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వినుకొండ తరలించారు. -
కూటమిది పేదలను ముంచే ప్రభుత్వం
ఒంగోలు సిటీ: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తనకు తాను మంచి ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటోందని, రెండేళ్లుగా అన్ని రకాలుగా విఫలం చెంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్యాత 5.40 లక్షల పెన్షన్లు తొలగించారని, మరో ఏడున్నర లక్షల పెన్షన్లను తొలగించేందుకు బడ్జెట్లో కోత విధించారని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో సెకీ ఒప్పందంలో 2.49 పైసలకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో జగనన్న అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒక వేళ అవినీతి జరిగి ఉంటే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుందని, రేపు మళ్లీ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేయకుండా ఉండేందుకు 25 ఏళ్ల పాటు సీలింగ్ విధించారని మండిపడ్డారు. ఇండోసోల్ కంపెనీకి జగనన్న హయాంలో 4 వేల ఎకరాలు కేటాయించారని, అప్పుడు ఆ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 8 వేల ఎకరాలు కేటాయించడంలో పరమార్థం ఏమిటని ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కింద రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, దేశం మొత్తం కిలోమీటరుకు రూ.20 నుంచి 21 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కిలోమీటరుకు రూ.81 కోట్లు ఖర్చు చేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చుండూరి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో? చంద్రబాబు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని చుండూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను పెంచుకునేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తోందని ఆరోపించారు. సుధీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు కనీసం ఒక్క పోర్టును నిర్మించిన పాపాన పోలేదన్నారు. జగనన్న ఐదేళ్ల పాలనలో నాలుగు పోర్టులు నిర్మించి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వేయి కిలోమీటర్ల తీరం ఉందని, సన్రైజ్ స్టేట్గా పేరుపెట్టి డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఒక తరానికి కూడా నేరవేరడం లేదన్నారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు. ముస్లింలను ప్రశాంతంగా బతకనివ్వరా? ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలు ప్రశాంతంగా బతకనీయకుండా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేధింపులకు పాల్పడుతున్నారని చుండూరి ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలకు కష్టాలు వచ్చిపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కొత్తపట్నం బ్రిడ్జి వద్ద ఉన్న ముస్లిం శ్మశానవాటిక స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని గమనించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దశరాజుపల్లి వద్ద రెండు ఎకరాల స్థలం ఇచ్చి కౌన్సిల్లో తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ముస్లిం ఖబరస్థాన్ స్థలాన్ని రద్దు చేసి దొంగదెబ్బ తీశారని విమర్శించారు. ఒకవైపు ముస్లిం సమాజం ఖబరస్థాన్ స్థలం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా కౌన్సిల్లో పెట్టి రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న షాదీఖానాను ఎందుకూ పనికిరాకుండా మూలనపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలన వచ్చిన తర్వాత నగరంలోని ఉర్దూ స్కూల్ను పడగొట్టడం ముస్లిం సమాజాన్ని తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలపై జరుగుతున్న వరస దాడులతో భయాందోళన నెలకొందని చెప్పారు. నగరంలోని మినీ స్టేడియం వద్ద ఉన్న గౌస్ హోటల్లో సామాన్లను బయట పడేయడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ నెల 26వ తేదీన అర్ధరాత్రి నగరంలో పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన దాడిని ముస్లిం సమాజం ఆత్మగౌరవం మీద కొట్టిన దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. రాయల్ యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను బలవంతంగా పడగొట్టడం ద్వారా ముస్లింలు వ్యాపారాలు చేసుకునేందుకు వీల్లేదని హెచ్చరించినట్లు ఉందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా రాయల్ యాడ్ ఏజన్సీస్ ఏర్పాటు చేసిన హోర్డింగులను పడగొట్టారని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ముస్లింలపై దాడులు ఆపకుంటే శాంతియుతంగా నిరసనకు దిగుతామని చుండూరి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు దాసరి కరుణాకర్, చిన్నా, రోండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మల్లిశెట్టి దేవా పాల్గొన్నారు. పింఛన్లు తొలగించేందుకు బడ్జెట్లో కోత విధించిన సర్కార్ ఒక్క పోర్టును కూడా చంద్రబాబు నిర్మించిన పాపాన పోలేదు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందే నిరుపేదలను వేధిస్తున్న కూటమి శాసనసభ్యులు వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజం టీటీడీ చైర్మన్ది సిగ్గుమాలిన చర్య పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ బీఆర్ నాయుడు నిర్వాకం సిగ్గు చేటని, ఆయనతో రాజీనామా చేయించాలని చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికారం శాశ్వతమని భావిస్తూ రాష్ట్రంలోని నిరుపేద ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూములు కబ్జా చేస్తూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేల కొమ్ము కాస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. -
అశ్రునయనాలతో అనిల్, లియో అంత్యక్రియలు
● విషాదం అలుముకున్న పెదారికట్ల ఎస్సీ కాలనీ కొనకనమిట్ల: మార్కాపురం వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తండ్రి, కొడుకు అంబటి అనిల్, ఐదు నెలల చిన్నారి లియో (పేరు పెట్టాల్సి ఉంది) మృతదేహాలకు శనివారం స్వగ్రామం పెదారికట్ల ఎస్సీ కాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విషాదకరమైన సంఘటనతో కాలనీలో విషాదం అలుముకుంది. జోహార్ అనిల్, జోహార్.. అంటూ గ్రామస్తులు, బంధుమిత్రుల ఆర్తనాదాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అన్నప్రాసన రోజే అనంతలోకాలకు.. మండలంలోని పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన అంబటి అనిల్ (27) తన భార్య సౌజన్యతో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అనిల్ చిన్న వయసులో ఉండగానే తల్లి నిర్మల చనిపోయింది. అప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యలైన మాలకొండయ్య, కమలమ్మల వద్ద ఉంటూ చదువుకొని ప్రయోజకుడయ్యాడు. రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగా సౌజన్యను వివాహం చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అనిల్, సౌజన్య ముద్దుల తనయుడు ఐదు నెలల చిన్నారికి ఈ నెల 26వ తేదీ గురువారం పెదారికట్ల ఎస్సీ కాలనీలో అన్నప్రాసన జరగాల్సి ఉంది. చిన్నారికి లియో హృదన్ అనే పేరు పెట్టాలని నిర్ణయించి బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో తమ గ్రామానికి వస్తున్నారు. గురువారం ఉదయం బస్సు మార్కాపురం దాటింది. మరో 40 నిమిషాల్లో ఊరులో ఉంటామన్న ఆనందంలో ఉండగానే బస్సుకు యాక్సిడెంట్ జరగటం.. బస్సులో మంటలు చెలరేగటం క్షణాల్లో జరిగాయి. అనిల్, సౌజన్య, చిన్నారిని తీసుకుని బస్సు నుంచి బయటకు రావాలనే ప్రయత్నంలో సౌజన్య బయటపడి ప్రాణాలు దక్కించుకోగా మంటలు ఎక్కువై బయటకు రాలేక తండ్రి, కొడుకు ఇద్దరూ సజీవ దహనమై అన్నప్రాసన రోజే అనంతలోకాలకు చేరారు. అల్లారు ముద్దుగా పెంచా: మాలకొండయ్య, అనిల్ తాతయ్య అనిల్ ఐదు నెలల వయసులోనే అమ్మ చనిపోయింది. అందరూ వాడిని నువ్వే సాకాలి అంటే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశా. చెప్పులు కుట్టి కూలీ నాలి చేసి పెంచా. వాడు కూడా మంచిగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. నన్ను అనిల్ చిన్నప్పటి నుంచి అయ్యా..అని ఆప్యాయంంగా పిలిచేవాడు. వాడు ప్రయోజకుడయ్యాడు. పెళ్లి చేశాం. ఇక ఇబ్బంది ఏమీ లేదని, నన్ను మంచిగా చూసుకుంటాడని, నాకు తలకొరివి పెడతాడని బతుకుతున్నా. ఇంతలో ఈ ఘోరం చూడాల్సి వచ్చిందంటూ అనిల్ తాతయ్య మాలకొండయ్య భోరున విలపించాడు. అన్నప్రాసన చేసేందుకు వస్తున్నాడని ఫంక్షన్కు అన్నీ ఏర్పాట్లు చేశాం. గురువారం ఉదయం ఒకసారి ఫోన్ చేసి మార్కాపురం దాక వచ్చామని, మరో కొద్దిసేపట్లో ఊరికి వస్తామని చెప్పాడు. మనవడి కోసం పెదారికట్ల బస్టాండ్లో ఎదురు చూస్తుండగా ఈ వార్త తెలిసి అందరం మార్కాపురం వెళ్లి మనవడు, మనవరాలు, ముది మనవడి కోసం ఎదురు చూశాం. మనవరాలు ఒక్కతే కనిపించింది. తండ్రి, కొడుకు ఇద్దరూ కనిపించక పోవడంతో గుండెలు పగిలిపోయాయని మాలకొండయ్య పిక్కటిల్లేలా ఏడ్చాడు. -
ఉపాధి పనుల్లో అవకతవకలు
● సంతకాలు, వేలిముద్రలు లేకుండానే వేతనాల చెల్లింపు ● ఉపాధి సిబ్బందిపై పీడీ జోసఫ్కుమార్ మండిపాటు ● రూ.1.24 లక్షల జరిమానా ● రూ.57 వేల రికవరీ మర్రిపూడి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రజావేదిక నిర్వహించారు. ప్రజా వేదికకు డ్వామా పీడీ జోసఫ్కుమార్ హాజరయ్యారు. 2024–25 ఏడాదికి సంబంధించి మండలంలోని 21 పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులపై ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం విచారించి గ్రామసభలు నిర్వహించింది. ఉపాధి సిబ్బంది చేసిన అవకతవకలను గుర్తించి ప్రజావేదికలో బహిరంగంగా చదివి వినిపించారు. మండలంలోని అంకేపల్లిలో ఫారం ఫాండ్, రావెళ్లవారిపాలెంలో కమ్యూనిటీ ఫారంఫాండ్ పనులు చేయకుండా రూ.95 వేలు బిల్లులు డ్రా చేశారని సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. చిమటలో బొల్లా వెంకటేశ్వర్లు పనికి హాజరు కాకుండా వేతనాలు చెల్లించారు. శివయ్యకుంట పని చేయకుండా రూ.32 వేలు డ్రా చేశారని గుర్తించారు. చిమట–రామాయపాలెం రహదారికి ఇరువైపులా 400 మొక్కలు వేసినట్లు రికార్డుల్లో ఉందని, ఆ ప్రదేశంలో పరిశీలిస్తే 50 మొక్కలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. పన్నూరు, గుండ్లసముద్రం గ్రామాల్లో పనిచేయకుండా వేతనాలు చెల్లించినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. గార్లపేటలో చనిపోయిన వంగిపురం అబ్రహం ఖాతాలో రూ.402 ఎందుకు జమయ్యాయని, అవి వెంటనే తొలగించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మర్రిపూడి, కెల్లంపల్లి, తంగెళ్ల గ్రామాల్లో కొలతల్లో తేడా వచ్చాయని, రెండు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకు నగదు జమైనట్లు సామాజిక తనిఖీ సభ్యులు గుర్తించారు. మండలంలో 522 పనులు చేయగా కూలి రూపంలో రూ.5,226345 చెల్లించారు. మెటీరియల్ రూపంలో రూ.28,51219 ఖర్చు చేశారు. పంచాయతీరాజ్లో 67 పనులకుగాను కూలీల వేతనాల రూపంలో రూ.23,370 చెల్లించారు. మెటీరియల్ రూపంలో రూ. 2,96,54,297 చెల్లించినట్లు పీడీ వివరించారు. మండలంలో జరిగిన పనుల గురించి రూ.1.24 లక్షల జరిమానా విధించామని, రూ.57 వేలు రికవరీ పెట్టినట్లు చెప్పారు. ఎంపీడీఓ ఎస్కే నాగూర్వలి, ఏపీఓ జి.రాంబాబు, ఏఓ విద్యాసాగర్రెడ్డి ఎస్ఆర్పీ, డీఆర్పీలు, ఫీల్ట్ అసిస్టెంట్లు ఉన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
బోరున విలపిస్తున్న మృతుడు అనిల్ సోదరి, బంధువులుఘోర బస్సు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారు, ఆత్మీయులను పోగొట్టుకున్న కుటుంబాల వారు తమ వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చారు. చనిపోయిన వారి ముఖాలు కనిపించక, మృతదేహాలను చూడలేక ‘ఇదేం ఘోరం’ అని రోదించారు. చివరిచూపు చూసే అవకాశం లేకుండా పోయిందని గుండెలు పగిలేలా విలపించారు. మార్కాపురం జీజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. మార్కాపురం టౌన్: మార్కాపురం మండలంలోని రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన 14 మందికి చెందిన మృతదేహాలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి డీఎన్ఏ రిపోర్టులు వచ్చాయి. మృతుల బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. డీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా బాడీలను ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ప్రమాదంలో 14 మంది సజీవదహనం అయ్యారు. అందులో జిల్లాకు చెందిన వారు పది మంది ఉండగా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. జిల్లా కొనకనమిట్ల, పొదిలి, కనిగిరి, వలేటివారిపాలెం, నెల్లూరు జిల్లా నుంచి కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుంచి మృతుల కుటుంబ సభ్యులు వచ్చారు. బంధువుల రోదనలతో జీజీహెచ్ ప్రాంగణం మార్మోగింది. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారు వివిధ కారణాలతో సొంత గ్రామాలకు బయలు దేరారు. కొద్ది గంటల్లో వారు వస్తున్నారని ఆశగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బస్సు ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. ఎన్నో ఆశలతో పండుగకు వెళుతున్నాం అనుకుంటున్న కొందరు, తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని భావించి వస్తున్న మరి కొందరిని బస్సు ప్రమాదం విగత జీవులుగా మార్చిందని మృతుల బంధువులు విలపించారు. గుండె నిండిన భారంతో చివరి చూపు చూసుకోవాల్సిన రక్త సంబంధీకులను కాలిబూడిదైన మృతదేహాల రూపంలో ఎలాచూడాలో అర్థంకాక కంటతడి పెట్టుకున్నారు. అంబులెన్స్లో మృతదేహాలను బరువెక్కిన హృదయాలతో స్వస్థలాలకు తీసుకెళ్లారు. చివరి చూపు కరువై..గుండె బరువై..బస్సు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంతో చెలరేగిన మంటలను ఆదుపుచేయటంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్యశాఖ, మున్సిపల్శాఖతో అన్ని శాఖల అధికారుల సమన్వయం పనిచేశాయని, 28 మందిని కాపాడామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించటం, అక్కడ వారికి మెరుగైన వైద్యం సేవలను ఆరోగ్యశాఖ సిబ్బంది అందించారన్నారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి కారకులైన డ్రైవర్లకు చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు. జీజీహెచ్ వద్ద వివిధ శాఖలకు చెందిన అధికారులు మృతుల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ ఎం.విజయసునీత శనివారం పరామర్శించారు. ప్రమాద బాధితులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్లాలని వారికి భరోసా కల్పించారు. చిన్న గాయాలతో కోలుకుని ఇంటికి వెళ్లిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ శ్రీనివాసులు, డీఎంహెచ్వో వాణీశ్రీ, జిల్లా మలేరియా అధికారి రాహుల్, వైద్యశాలలోని వైద్యులు, అధికారులు ఉన్నారు. -
జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా..
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఒంగోలులోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉన్న సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎస్పీ హర్షవర్ధన్రాజు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి కల్యాణోత్సవం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాముల వివాహం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ధర్మం, న్యాయం, ప్రేమ, కర్తవ్య నిర్వహణ వంటి ఉన్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రతి రోజూ 100కు పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒంగోలు మీద నుంచి మరో 150 బస్సులు వెళ్తున్నట్టు అంచనా. మొత్తం మీద 250 బస్సులు ప్రతి రోజూ బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరుపతికి నడుస్తున్నాయి. మార్కాపురం, ప్రకాశం జిల్లాలే కాకుండా పల్నాడు జిల్లా వినుకొండ, నరసరావుపేటకు చెందిన అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండడంతోప్రైవేటు బస్సులకు గిరాకీగా మారింది. భీతావహంగా ఉన్న ఘటనా స్థలంసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మందిని బలిగొన్న బస్సు ప్రమాదానికి కారణమెవరన్న అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే రవాణా శాఖ అధికారుల అవినీతి, మైనింగ్, పోలీసు అధికారుల నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోంది. కారణమెవరైనప్పటికీ పొట్టచేత పట్టుకొని వలస వెళ్లిన బడుగులు బలయ్యారు. వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోయాయి. కుటుంబాన్ని పోషించే దిక్కులేక కొందరి జీవితాలు రోడ్డున పడ్డాయన్నది మాత్రం సత్యం. సమాధానాలు లేని సందేహాలు... హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ సరిగా లేదని మూడు నెలల క్రితమే రవాణా శాఖ అధికారులు రూ.30 వేల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జరిమానా విధించిన అధికారులు బస్సును రోడ్డుపై నడిచేందుకు ఎందుకు సమ్మతించారో తెలియడంలేదు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో బయలుదేరిన బస్సులో ఎక్కువగా కనిగిరి, పామూరు, సీఎస్పురం, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఎక్కారు. నిజానికి ఈ బస్సు జగిత్యాల నుంచి కోరుట్ల, శిరికొండ, మేడ్చల్, హైదరాబాద్, మాచర్ల, వినుకొండ, పొదిలి మీదుగా వెళ్లాల్సి ఉంది. రిజర్వేషన్ షీట్లో కూడా ఇదే రూట్ ఉంది. కానీ మాచర్ల వచ్చిన తరువాత బస్సును యర్రగొండపాలెం వైపు ఎందుకు దారి మళ్లించాడన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారే లేరు. తెల్లవారుజామున 4.30 సమయంలో బస్సు యర్రగొండపాలెం చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే బస్సు స్టీరింగ్ బేరింగ్ సరిగ్గా పనిచేయడంలేదని, దాంతో సుమారు గంట సేపు యర్రగొండపాలెంలో బస్సు నిలిపినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఆ సమయంలో మెకానిక్లు ఎవరూ లేకపోవడంతో డ్రైవర్తో కలిసి బస్సు యజమాని హరికృష్ణారెడ్డి స్వయంగా మరమ్మతు చేసినట్లు సమాచారం. అంతక ముందు కూడా రెండు మూడు సార్లు బస్సు ఆగిపోయిందని ప్రాణాలు దక్కించుకున్న క్షతగాత్రులు చెబుతున్నారు. ఎందుకు బస్సు ఆగిపోతుందని అడగ్గా బ్యాటరీ సమస్య ఉందని,వేరే వాళ్లకి చెప్పాము తీసుకువస్తున్నారని చెప్పి బస్సును స్టార్ట్ చేశాడని అంటున్నారు. మరమ్మతులు అయిన తర్వాత వెళితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, తమ వారిని కోల్పోయే వారం కాదని విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్ యువరాజు ఉన్నప్పటికీ ప్రమాద సమయంలో బస్సు ఓనర్ హరికృష్ణ బస్సు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం అనుమతించిన రూట్లో ప్రయాణం చేయకుండా తన ఇష్టమొచ్చిన రూట్లో బస్సును ఎందుకు తీసుకొచ్చాడో తెలియాల్సి ఉంది. ఇదంతా రవాణా శాఖ అధికారుల వైఫల్యమన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న రవాణా శాఖ అధికారులు బస్సుల రూట్లను కూడా పర్యవేక్షించడంలేదన్న సత్యం బయటపడింది. మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం... మార్కాపురం పలకల గనుల సమీపంలో కొండలమీద మూల మలుపు వద్ద కంకరలోడుతో వచ్చిన టిప్పర్ రావడం వల్లనే ఘోర ప్రమాదం జరిగిందన్నది నిజం. ఒకవేళ ఆ సమయంలో టిప్పర్ కనుక రాకపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. 14 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యేవి కావేమో. ఆ సమయంలో అటుగా కంకరలోడుతో టిప్పర్ రావడంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సందేహం వ్యక్తం చేశారు. నిబంధనలను గాలికి వదిలేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి బంధువుదని ప్రచారం జరుగుతోంది. ప్రమాదకర మలుపు వద్ద సూచికలు ఏవీ.. మార్కాపురం హైవేపై పోలీసులు గస్తీ ఉన్నా బస్సు వేగాన్ని బట్టి నిలబెట్టే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయవరం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులున్నా బస్సును ఆపిఉండే వీలుండేదేమో. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్లను గుర్తించడం, మూలమలుపుల వద్ద జాగ్రత్తలు సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం వంటివి పోలీసులు చేయాల్సి ఉంది. రాయవరం కొండపై ఉన్న మూలమలుపు వద్ద సూచికలు ఏర్పాటు చేసినట్లు కనిపించడంలేదు. దీంతో ఈ పాపంలో పోలీసులకు కూడా వాటా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బస్సులో గ్యాస్ సిలిండర్ ? బస్సు ప్రమాదం సంభవించినప్పుడు క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం తెలిసిందే. కళ్లు మూసి తెరిచేలోపే బస్సు అగ్నికి ఆహుతవడం, బస్సులోని 14 ప్రయాణికులు కాలిబూడిదవడం జరిగిపోయింది. అయితే ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్సులో 5 కిలోల ఫుల్ గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ సిలిండర్ పేలడం వల్లనే మంటలు రేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో పోలీసు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.నిర్లక్ష్యం..యమపాశమైంది!– ఒంగోలు టౌన్ -
ప్రాణం తీసిన బైక్ సరదా
చీమకుర్తి: బైక్ రైడింగ్ సరదా ఒకరు ప్రాణం తీసింది. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తిలోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతూ టీ కాలక్షేపం పేరుతో 10 మంది విద్యార్థులు పాఠశాల ఆవరణ నుంచి బయట ఉన్న టీ స్టాల్ వైపు వచ్చారు. వారిలో ఇద్దరు విద్యార్థులు స్నేహితుడి బైకు తీసుకొని సరదాగా చీమకుర్తి బైపాస్ రోడ్డులో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారిలో బైక్ నడుపుతున్న బొడ్డు తరుణ్పాల్ బైకు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో తరుణ్పాల్(15) అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై వెనక కూర్చున్న మరో విద్యార్థి ఈర్ల రోహిత్ తలకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన తరుణ్పాల్ తల్లిదండ్రులు బొడ్డు నాగేశ్వరరావు, నాగలక్ష్మి స్వస్థలం చీమకుర్తిలోని నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు. ఇప్పటికే నాలుగు పరీక్షలు రాశారు. శనివారం మరో పరీక్షకు సన్నద్ధమవుతూ టీ కోసం అని ఇలా బయటకు వెళ్లి మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్రంగా గాయాలపాలై పరిస్థితి విషమంగా ఉన్న మరో విద్యార్థి ఈర్ల రోహిత్ చీమకుర్తిలోని జగన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ప్రసాదరావు కేసు వివరాలను విచారిస్తున్నారు. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ టీ కాలక్షేపం పేరుతో బైక్ రైడింగ్ -
పెద్దదోర్నాలలో చిరుతపులి కలకలం
● ఆశ్రమం వెళ్లే దారిలో తిరిగినట్లు రైతుల సమాచారం పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని శ్రీశైలం రహదారిలోని ఆశ్రమం వెళ్లే దారిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం ఆశ్రమానికి వెళ్లే దారిలో చిరుతపులి సంచరించినట్లు కొందరు రైతులు తెలపటంతో అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా చిరుతపులి అడుగులు, గుర్తులు కనబడకపోవటంతో అధికారులు ఆశ్రమం దారిలో ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. చిరుతపులి సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని వివరణ కోరగా చిరుతపులి సంచారంపై ఎటువంటి ఆధారాలు లభించలేదని, శుక్రవారం డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో పాటు ట్రాప్డ్ కెమెరాలను ఏర్పాటు చేసి శనివారం సైతం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒంగోలు టౌన్: గిద్దలూరు సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఒంగోలు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కాపురం: నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ కోరారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పీ ఆవులయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మాలకొండయ్య, సుబ్బరాయుడు, పీరావలి, వెంకటేశ్వరరెడ్డి, రూతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలో వరసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలను నివారించడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు షేక్ సత్తార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక రెండు రోజులు హడావుడి చేయడం తప్పితే దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే చర్యలు శూన్యమన్నారు. ప్రైవేటు బస్సుల నిర్వాహకుల అక్రమాలను కట్టడి చేయకుండా అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలలో రిజిస్టర్ చేయించుకోవడం, ఒకే నంబర్ మీద అనేక వాహనాలను నడపడం వంటి వాటిని రవాణా శాఖ అధికారులు తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదని, నెలవారి మామూళ్లకు అలవాటు పడిపోయిన అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల మితిమీరిన వేగం ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటుందని, లారీ డ్రైవర్లను తక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారని, ప్రయాణికుల కోసం నగరంలోనే గంటల తరబడి తిరగాల్సి రావడం డ్రైవర్ల మీద ఒత్తిడి పెంచుతుందన్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో ట్రావెల్ బస్సులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం దారుణమన్నారు. మార్కాపురం ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
మార్కాపురం రూరల్: మార్కాపురం పరిధిలోని రాయవరం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం జీజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కర్నూలు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రూ.10 లక్షలు, అమలాపురంలో జరిగిన ఘటనలో రూ.25 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపురంలో జరిగిన ఘటనలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఎక్కువమంది కూలీలు కావడంతో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపకూడదని కోరారు. ఈయన వెంట ఎమ్మార్పీయస్ నాయకులు సాలెంరాజు, పీటర్ మాదిగ, జయరాజు మాదిగ, రమేష్ మాదిగ తదితరులు ఉన్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
హనుమంతునిపాడు: సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా మండల పరిధి వెంగపల్లిలో శుక్రవారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ఐదు ఎడ్ల జతలు వచ్చాయి. బేస్తవారిపేట, మార్కాపురం, పుల్లల చెరువు, బొడిచర్ల, రాచర్ల మండలాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో మార్కాపురం మండలం బొడిచర్లకు చెందిన తిండి నక్షత్రారెడ్డి ఎడ్లు 1220 అడుగులు లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు చెందిన బొర్రా రవిజేత ఎడ్లు నిలిచాయి. మూడో స్థానంలో గిద్దలూరు మండలం బురుజుపల్లికి చెందిన యర్రమల సాహితరెడ్డి ఎడ్ల జత నిలిచాయి. ప్రథమ బహుమతిగా రూ.50,116, రెండో బహుమతిగా రూ.40,116, మూడో బహుమతిగా రూ.30,116, నాల్గవ బహుమతిగా రూ.20,116 అందజేశారు. పోటీలు రాయి వెంకటేశ్వరరెడ్డి, దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. -
బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఒంగోలు టౌన్: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం నాయకుల బృందం శుక్రవారం పరామర్శించింది. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ ఉపాధి కోసం వలస వెళుతున్న బాధితులు తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాల్లో మృతి చెందడం, తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం కావడం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా నామ మాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. చట్టాలను కఠినంగా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, రాజకీయ ప్రయోజనాలనాశించిన పాలకులు ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం చాలా తక్కువగా ఉందని, మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదం సాధారణ ఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాల వలన జరిగిన మానవ విపత్తని చెప్పారు. ఫిట్నెస్ వాహనాలను నడపడం, టూరిస్ట్ పర్మిట్ పేరుతో స్టేజ్ క్యారేజీలుగా నడపడం, తనిఖీలు కాగితాలకు పరిమితం కావడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీజీహెచ్ను సందర్శించిన వారిలో కంకణాల రమాదేవి, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, కాలం సుబ్బారావు, రఘురాం, జి.శ్రీనివాసులు ఉన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న సీపీఎం నాయకులు ఒంగోలు జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన సీపీఎం బృందం -
దివ్యాంగుడిపై టీడీపీ నేతల దాడి
తాళ్లూరు: గ్రామాల్లో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇందుకు తూర్పు గంగవరం పంచాయతీ పరిధిలోని సోమవరప్పాడులో జరిగిన ఘటనే తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన యద్దల సురేష్ దివ్యాంగుడు. దీంతో తాగునీటి కోసం తన ఇంటి వద్దకు నీటిని సరఫరా చేసేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాడు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుమతితో మంగళవారం కోటయ్య అనే వ్యక్తి సాయంతో ఇంటి వద్దకు నేరుగా పైపులతో కుళాయి ఏర్పాటు చేయిస్తున్నాడు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన సానే సురేష్, యమ్మని వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి ఎవరు అనుమతి తీసుకొని కుళాయి ఏర్పాటు చేస్తున్నావని ప్రశ్నించారు. కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుమతి తీసుకున్నానని సురేష్ చెప్పగా.. శ్రీ ఈ గ్రామంలో ఏం చేయాలన్నా మా అనుమతి తీసుకోవాల్సిందేనశ్రీని పనులను అడ్డుకున్నారు. ఏ పని చేయాలన్నా మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ తరువాత దుర్భాషలాడుతూ దాడి చేశారని సురేష్ వాపోయాడు. అడ్డుగా వచ్చిన నా తల్లిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎస్సై లేరని నాలుగు రోజుల నుంచి పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారని తెలిపాడు. ప్రస్తుతం ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నానని, గంగమ్మ తిరునాళ్ల లోపు చంపేస్తామని బెదిరిస్తున్నారని, నాకు ప్రాణ హానీ ఉందని, నాకు ఏనదైనా జరిగితే సానే సురేష్, సానే ఆంజనేయులు, యమ్మని వెంకటేశ్వర్లు బాధ్యులని తెలిపాడు. తాగునీటికి కుళాయి వేయిస్తుండగా దౌర్జన్యం మా అనుమతి లేకుండా ఎలా వేస్తున్నావంటూ బెదిరింపు బాధితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన -
సీతారాముల కల్యాణం.. చూతము రారండి!
దర్శి: శ్రీరామనవమి వేడుకలను నియోజకవర్గంలో కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. బూచేపల్లి ప్రత్యేక పూజలు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పట్టణంలో పలు రామాలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. కొత్తపాలెం రామాలయంలో, పొదిలిరోడ్డు రామాలయం, కురిచేడురోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం, కొత్తరెడ్డిపాలెం రామాలయాలలో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరయ్యారు. స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కురిచేడు రోడ్డులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మలను దుశ్శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. వేద ఆశీర్వచనం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, మాజీ నెడ్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ కర్ణా వెంకటరెడ్డి, యరమల మధు,శ్రీనివాసరెడ్డి, న్సిలర్లు మేడం మోహన్రెడ్డి, ఆవుల జ్యోతి శివారెడ్డి, నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్భాషా, అన్నవరపు వెంకట రవి, మేడగం బాల కృష్ణారెడ్డి, కేసరి ప్రసాద్రెడ్డి, రహమాన్, వెన్నపూస పేరిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమి రెడ్డి చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మేడం కోటిరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మీ రెడ్డి, గంజి వెంకటేశ్వరరెడ్డి, ఉడుముల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాజరైన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
పొగాకు బ్యారన్ దగ్ధం
లింగసముద్రం: అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మారెడ్డిపాలెంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..కశిరెడ్డి వెంకటేశ్వర్లుకు చెందిన బ్యారన్ క్యూరింగ్లో ఉండగా ప్రమాదవశాత్తు గొట్టాలపై పొగాకు కర్ర పడడంతో మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న రైతులు కొందరు పక్కనే ఉన్న మోటార్ల ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతసేపటికి మంటలు అదుపులోనికి రాకపోవడంతో కందుకూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. జె.పంగులూరు: శ్రీరామనవమి పురస్కరించుకొని పంగులూరులో శనివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ఒంగోలు జాతి, మైసూర్, నాటు ఎద్దులకు పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో గెలిచిన ఎడ్లకు మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గవ బహుమతి రూ.7 వేలు, ఐదవ బహుమతి రూ.5 వేలు, ఆరవ బహుమతి రూ.3 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9848909630, 9948425772 నెంబర్లను సంప్రదించాలని కోరారు. త్రిపురాంతకం: వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అశ్వవాహనసేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. అశ్వవాహన సేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: మూడు సంవత్సరాల కాలంలో వందకు పైగా ఫారిన్ బాడీ ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో, పల్మనరి స్పెషాలిటీ వైద్య సేవలందిస్తున్న అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్రబాబు, డాక్టర్ భానుతేజ మాట్లాడుతూ... ఫారిన్ బాడీలు ఏర్పడినప్పుడు సకాలంలో వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యమన్నారు. 3 నెలల పసిపిల్లల నుంచి 90 ఏళ్ల వృద్దుల వరకు ఫారిన్ బాడీ కేసులలో నాణ్యమైన వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. గత మూడేళ్లుగా ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసి వందలాది మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన సాంకేతికతను ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేసినట్లు చెప్పారు. తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మార్కాపురం టౌన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని జవహార్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుంకేసుల గ్రామానికి చెందిన ముంగమూరి చంటి(30) రెండేళ్లుగా స్థానిక జవహర్ కాలనీలో నివాసం ఉంటూ వాహన డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తతాన్నడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్సై సైదుబాబు సంఘటనా స్థలానికి చేరుకొని ఇనుపగేట్కు ఉన్న తాళం పగులగొట్టించి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీస్తున్న వలసలు..
మార్కాపురం/పొదిలి: సంవత్సరాల తరబడి పాలకులు వెనుకబడిన ప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి ఏరియాల్లో కూలీలకు శాశ్వత ఉపాధి కల్పించే పరిశ్రమలను, పనులను కల్పించకపోవడంతో వలసలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో బస్సు, లేదా ఇతర ప్రయాణికుల రవాణా వాహనాలు ప్రమాదాలు జరిగిన సంఘటనల్లో వలస కూలీలే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. కనిగిరి ప్రాంతంలోని నిమ్జ్, దొనకొండ ఏరియాలకు సంబంధించిన పారిశ్రామికవాడ ఆయా చోట్ల నిర్దేశించిన ఎంఎస్ఎంఈ పార్కులు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. దీంతో వందలాది మంది కూలీలు తెలంగాణ ప్రాంతాల్లో, బెంగళూరుకు వలసలు వెళ్తున్నారు. వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలను ప్రజలు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మృత్యువార్త చెప్పలేక.. చెప్పకుండా ఉండలేక.. ప్రమాద ఘటనలు మృతి చెందిన వారి వివరాలు వైద్యశాల అధికారులు సిబ్బందికి తెలిసినప్పటికీ వారి బంధువులకు చెప్పేందుకు కొంత సంశయించారు. మరణించిన వారి మృతదేహాలను కచ్చితంగా గుర్తించలేకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. మరో వైపు వారి బంధువులు కుటుంబ సభ్యుల పరిస్థితిని గమనించిన వైద్యశాల సిబ్బంది వారికి మరణ వార్త సమాచారం ఇచ్చేందుకు కొంత జాప్యం చేశారు. దీంతో తమ వారు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు కొంతసేపు అల్లాడిపోయారు. ఎట్టకేలకు నిర్ధారించుకుని వైద్యశాల సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బస్సు మార్కాపురం ఎందుకు వచ్చినట్టో..! తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో బయలుదేరిన బస్సు గమ్యస్థానమైన నెల్లూరు జిల్లా వింజమూరుకు చేరాల్సి ఉంది. ఈ క్రమంలో వినుకొండలో దిగేందుకు ఎక్కిన ప్రయాణికులను మాచర్లలోనే దించినట్టుగా తెలుస్తోంది. మరో వైపు వినుకొండ స్టేజీలో ఈ బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఎక్కాల్సి ఉంది. వినుకొండ వైపునకు వెళ్లకుండా మాచర్ల నుంచి మార్కాపురం వైపునకు ఈ బస్సు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూటు పర్మిట్ ఒక వైపునకు తీసుకుని మరో రూటులో ప్రయాణాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురంలో దిగాల్సిన ప్రయాణికులు కూడా బస్సులో ఎవరూ లేరు. వినుకొండ, కురిచేడు, దర్శి, పొదిలి షార్ట్కట్ రూట్ అయినా మార్కాపురానికి బస్సు ఎందుకు వచ్చిందనేది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
గ్రామస్తులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ
బల్లికురవ: క్వారీ ఏర్పాటులో పర్యావరణ–ప్రజాభిప్రాయ సేకరణకు సమీప గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అనుమతులు పొందాలి. ప్రజాభిప్రాయ సేకరణలో మీ గ్రామ అభివృద్ధికి పాటుపడతాం, నిరుద్యోగ యువతకు క్వారీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంటూ నిర్వాహకులు హామీలు గుప్పించారు. అయితే ఈ హామీలు నీటి మూటలే తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. గురువారం బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ క్వారీల వద్ద గుట్టు చప్పుడు కాకుండా రెండు గ్రామాల వ్యాపారులు, దళారులతో అభిప్రాయ సేకరణతో మమ అనిపించారు... వివరాల్లోకి వెళితే..కొణిదెన రెవెన్యూలోని సర్వే నంబర్ 339–3డి, 3బీ, 996–3బీలో 5,446 హెక్టార్కు గ్రావెల్ సాధారణ మట్టిరోడ్ మెటల్ 47999 క్యూబిక్ మీటర్లకు, కలర్ గ్రానైట్ 11999 క్యూబిక్ మీటర్లకు డీఎం గ్రానైట్ క్వారీ అనుతులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. క్వారీ ఏర్పాటు ఏసే సమీప గ్రామాలైన బల్లికురవ, నక్కబొక్కలపాడు, చెన్నుపల్లి, కొండాయపాలెం, మల్లాయపాలెం, వేమవరం, కొప్పరపాలెం, కొణిదెన గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు ఆహ్వానంతో పాటు ప్రజలకు మైక్ ద్వారా ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే ఇవేమి చేయకుండా తమకు అనుకూలమైన వేమవరం, మల్లాయపాలెం గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు, దళారులను పిలిపించుకుని ఇక్కడ క్వారీ ఏర్పాటులో ఇబ్బందులు ఏమీ లేవని పథకం ప్రకారం అంతా ఒకే అని చెప్పించుకున్నారు. బతుకుదెరువుకు పరాయి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ క్వారీలో భద్రత చర్యలు, నిబంధనలు పాటించకపోవటంతో ప్రాణలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం అంటున్న అధికారులు..మాముళ్ల మత్తులో క్వారీల వైపు కన్నెత్తి చూడటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అద్దంకి ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ రవినాయక్, పర్యావరణ శాఖ అధికారులు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు హజరయ్యారు. -
ఈ పరిస్థితి పగవానికి కూడా రాకూడదు
అకస్మాత్తుగా బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. నిద్రలో ఉన్న మేము లేచి చూసేసరికి మంటలు పెరుగుతూ ఉన్నాయి. కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సులో ఒక్కసారిగా అందరూ కేకలు పెట్టడం గందరగోళంగా ఉంది. వెంటనే పక్కన ఉన్న ఎగ్జిట్ డోర్ తీసి బస్సులో నుంచి బయటికి దూకాం. నాకు కాలు, తలపై, భుజంపై దెబ్బలు తగిలాయి. నాతోపాటు ముగ్గురం బయటికి వచ్చాం. మరో వ్యక్తి మహేంద్ర మా కళ్ల ఎదుటే లోపల ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. బస్సులో నుంచి మంటలు ఎక్కువై కళ్లముందే మనుషులు సజీవదహనం అవుతుంటే ఏ సాయం చేయలేక ఆ ప్రమాదాన్ని చూస్తూ ఉండలేక అల్లాడిపోయాం. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. – కుమ్మరికుంట అబ్రహం, వెలిగండ్ల మండలం చౌడవరం చచ్చిపోతామనుకున్నాం.. పామూరుకు రిజర్వేషన్ చేసుకొని వస్తున్నా. తెల్లవారుజామున పెద్ద మంటలు, దట్టమైన పొగ రావడంతో ఒక్కసారిగా అందరూ భయపడి పెద్దగా అరుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. చనిపోతామని అనుకున్నాం. బస్సు లారీని ఒక్కసారిగా ఢీకొనడంతో నా తల పైన టాపు తగిలి చీలింది. 6 కుట్లు పడ్డాయి. మమ్మల్ని అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. – మైలారి చిట్టిబాబు, శంకరాపురం, పీసీపల్లి మండలం -
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజలకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ యాదవ్లు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. జె.పంగులూరు: శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పంగులూరులో ఈ నెల 28న రాష్ట్రస్థాయి బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గవ బహుమతి రూ.7 వేలు, ఐదో బహుమతి రూ.5 , ఆరో బహుమతి రూ.3 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9848909630, 9948425772 నంబర్లను సంప్రదించాలని కోరారు. టంగుటూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన వల్లూరమ్మ ఆలయంలో గురువారం హుండీలను దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 3 నెలల 21 రోజులకు గాను 10 హుండీలు లెక్కించగా రూ.18, 25, 257 నగదు, 5 గ్రాముల బంగారం, 33 గ్రాముల వెండి, 51 అమెరికా డాలర్లు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, సభ్యులు సుమన్, ఆలయ అర్చకులు, శ్రీనివాస సేవా సంఘ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. మొత్తం 41 రోజులకు గాను రూ.24,18,460 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు తెలిపారు. లెక్కింపును అమరావతి అమరలింగేశ్వరస్వామి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ కె.రేఖ పర్యవేక్షించారు. దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకరరావు, పాలకమండలి సభ్యలు పాల్గొన్నారు. ● చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి టంగుటూరు: ముందు వెళ్తున్న ట్రాక్టర్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జూనో బేకరీ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు వైపు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ నామాల బాష తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా లారీ, ట్రాక్టర్ను పక్కకు జరిపారు. -
ఇక్కడే మెడికల్ కాలేజీ కట్టి ఉంటే మెరుగైన చికిత్స!
మార్కాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ ప్రకాశంలో సుమారు 7 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మార్కాపురం మండలం రాయవరం వద్ద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. సుమారు 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. అయితే 2024 ఎన్నికల నోటిపికేషన్తో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో మెడికల్ కళాశాల పనులను నిలిపివేసింది. దీంతో నిర్మాణ సామగ్రిని, సంబంధిత సంస్థ తరలించుకునిపోయింది. ఆ తరువాత పీపీపీ విధానంలో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్ల నుంచి మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్మించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. నాడు జిల్లా వైద్యశాలను జీజీహెచ్గా మార్చి 75 మంది స్పెషలిస్టు వైద్యులను, 500 బెడ్లను ఏర్పాటుచేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం మార్కాపురం జీజీహెచ్లో 14 మంది మాత్రమే వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్లను కర్నూలు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు తదితర మెడికల్ కాలేజీలకు బదిలీ చేశారు. గురువారం ఉదయం మార్కాపురం మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన దుర్ఘటనలో 14 మంది చనిపోగా 28 మంది గాయపడ్డారు. అయితే స్థానికంగా వైద్యులు, సిబ్బంది, అత్యాధునిక వైద్యపరికరాలు లేకపోవడంతో క్షతగాత్రులకు తాత్కాలిక చికిత్స చేసి ఒంగోలు, గుంటూరు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్కాపురంలో మెడికల్ కాలేజీని ఈ రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు బాధితులకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చి ఉండేవని పలువురు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వమే మెడికల్ కాలేజీని కట్టాలని కోరుతున్నారు. -
దిన గండం.. మృత్యు తాండవం!
రోడ్ టెర్రర్.. ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఇలా.. ప్రమాద వివరాలు 2024 2025 ప్రాణాంతకమైన ఘటనలు 373 320 స్వల్ప,తీవ్ర గాయాలైన ఘటనలు 500 437 మృతులు 390 343 క్షతగాత్రులు 893 905 మొత్తం ప్రమాదాలు 873 757 విషాద ఘటనలు కోకొల్లలు ట్రావెల్.. హడల్ ఒంగోలు టౌన్: ప్రయాణం సాఫీగా సాగుతోందని భావిస్తున్నంతలోనే విధి వెక్కిరిస్తోంది.. మృత్యువు పలకరిస్తోంది! రహదారుల నిర్మాణంలో లోపాలు, వాహనదారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త, నిద్రమత్తు, అతి వేగం.. ఇలా కారణాలు ఏవైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఓ దుర్ఘటనను మరువక ముందే మరో ప్రమాదం సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా పెద్ద సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతుండడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. కుటుంబాన్ని పోషించే పెద్ద లేక, చేతికందివచ్చిన కొడుకు పోయి, కళ్ల ముందు తిరగాడే కూతురు దుర్మరణం చెంది కన్నీరు మున్నీరవుతున్న వారెందరో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలు ఏ బస్సు ప్రయాణంలోనో హఠాత్తుగా పేగుతెంచుకొని వెళ్లి పోతే ఆ కుటుంబాలను ఓదార్చలేం. అదో అంతులేని విషాదం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రహదారులపై నెత్తుటి ధారలు 2024లో 390, 2025లో 343, 2026లో ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి తీవ్రమైన ఘటనలు మే మాసంలోనే అత్యధికం కొనకనమిట్ల, కంభం, మార్కాపురంలో వరుసగా ట్రావెల్ బస్సు ప్రమాదాలు మార్కాపురం ప్రమాదంలో 14 మంది సజీవ దహనం పెద్దదోర్నాల మండలంలో గడిచిన 7 వారాల్లో ఏడుగురు మృతి -
ప్రాణ భయంతో రూ.5 లక్షలు వదిలేసి దూకేసి..
కొనకనమిట్ల/కంభం: కొనకనమిట్ల మండలం చింతగుంట గ్రామానికి చెందిన వెలుగోటి గురవయ్య (60) ఇటీవల రంజాన్ పండక్కి తన కుమారులు ఉంటున్న హైదరాబాద్కు వెళ్లాడు. గురవయ్య, తన కుమారులతో పాటు బంధువులు కొంతమంది గతేడాది గ్రామంలోని రామాలయానికి సంబంధించిన డబ్బులు రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు శుక్రవారం జరిగే శ్రీరామ నవమికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్లో బేల్దారి పని చేస్తున్న తన చిన్న కొడుకు చిన ఖాజావలి దగ్గర నుంచి రూ.5 లక్షలు తీసుకొని బుధవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఎక్కి స్వగ్రామం వస్తున్నాడు. మార్కాపురం మండలం రాయవరం దాటిన తర్వాత గురువారం ఉదయం ఒక్కసారిగా ఘోర ప్రమాదం జరగడంతో రూ.5 లక్షలతో ఉన్న సంచిని బస్సులోనే వదిలేసి ప్రాణభయంతో కిటికీలో నుంచి దూకాడు. నగదు ఉన్న సంచి మంటల్లో కాలిపోయింది. ఒంగోలు టౌన్: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శిగా కంకణాల రమాదేవి ఎంపికయ్యారు. గురువారం ప్రజా సంఘాల కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా నెరుసుల మాలతి, ఉపాధ్యక్షురాలిగా ఎస్కే మున్వర్ సుల్తానా, సహాయ కార్యదర్శిగా జి.ఆదిలక్ష్మి, కోశాధికారిగా బి.రాజ్యలక్ష్మితో సహా ఐదుగురు అఫీసు బేరర్లతో మొత్తం 17 మందితో జిల్లా కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయడం కంటే ముందుగానే డబ్బు ఇవ్వాలన్నారు. మహాశక్తి పథకం ద్వారా 18 నుంచి 56 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు 1500 రుపాయలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దాని గురించి అసలు ప్రస్తావించడం లేదని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులను ఇంటి దగ్గరే అందిస్తామని చెప్పారని, అసలుకే ఎసరు పెడుతూ కందిపప్పు, పంచదార ఇవ్వడం మానేశారని దుయ్యబట్టారు. ప్రజలు కోరకుండానే మద్యం పాలసీ తీసుకొచ్చి విచ్చలవిడిగా మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. జిల్లాలో 183 మద్యం దుకాణాలు ఉండగా వేలాది బెల్ట్ షాపులు 24 గంటలు ప్రజలకు విశేష సేవలందిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మహిళలు, చిన్నారులపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. -
ఆర్టీసీ బస్లో మహిళకు గుండెపోటు
● సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన డాక్టర్ గిద్దలూరు(బేస్తవారిపేట): ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా అదే బస్సులో ఉన్న డాక్టర్ సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గిద్దలూరు–నంద్యాల ఘాట్లో బుధవారం చోటుచోసుకుంది. గిద్దలూరు నుంచి కర్నూలు వెళ్లేందుకు హసీనాబాను అనే బహిళ ఆర్టీసీ బస్ ఎక్కింది. మార్గమధ్యలో బస్లో కుప్పకూలిపోయింది. సెల్ఫోన్ సిగ్నల్ లేదు.. అంబులెన్స్ వచ్చేందుకు అవకాశం లేదు. ఆర్టీసీ బస్ను డ్రైవర్ ఒక పక్కకు తీసి నిలిపారు. తోటి ప్రయాణికులు ఆందోళన చెందుతున్న తరుణంలో అదే బస్లో ఉన్న నంద్యాల ఎంఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కందుల ఉమామహేశ్వరరెడ్డి పరిస్థితిని గమనించారు. మహిళకు 15 నిమిషాల పాటు సీపీఆర్ చేయగా ఆమె కళ్లు తెరిచి ఊపిరి తీసుకుంది. మహిళ ప్రాణం నిలబెట్టిన వైద్యుడికి ప్రయాణికులంతా కృతజ్ఞతలు తెలిపారు. ● ఒకరిని పట్టుకుని చితకబాదిన స్థానికులు సింగరాయకొండ: మండల కేంద్రమైన సింగరాయకొండలోని ఆంజనేయనగర్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి యత్నించగా స్థానికులు అప్రమత్తమై ఒకరిని బంధించారు. దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున చోటుసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంజనేయనగర్ సమీపంలో నివసిస్తున్న పాదర్తి సురేష్ ఇంటి ప్రహరీ దూకిన దొంగలు వెనుక వైపు తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సురేష్ గమనించి ఇంటి లోపలికి వచ్చిన అస్సాం రాష్ట్రానికి చెందిన రతన్బైగాను గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో సురేష్ భార్య పెద్ద పెట్టున కేకలు వేయడంతో దొంగల ముఠా సభ్యులు పరారయ్యారు. రతన్బైగా సైతం ఇంటి యజమానిపై దాడికి యత్నించి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు వచ్చి చితకబాదారు. పోలీసులకు సమాచారం అందిచగా స్టేషన్లో ఎవరూ అందుబాటులో లేరని బదులివ్వడంతో చేసేది లేక డయల్కు 100కు కాల్ చేశారు. మరో అరగంట తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను చితకబాదిన తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని స్థానికులు చెప్పారు. దొంగ కాదు.. పిచ్చోడట! రతన్బైగాను పోలీసులు తమ బైక్పై స్టేషన్కు తరలించారు. అతడికి తెలుగు రాదని, హిందీలో ప్రశ్నిస్తే నలుగురం వచ్చామని చెప్పాడని రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో కూడా ఉందని, అయితే పోలీసులు మాత్రం పిచ్చోడని చెబుతున్నారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంభం: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి కంభంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంభానికి చెందిన సయ్యద్ సద్దాం (32) టైల్స్ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఎవరికీ ‘చెప్పు’కోలేక..!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. – సాక్షి, ఒంగోలు బూట్లకు బదులు చెప్పులతో వెళ్తున్న ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్ విద్యార్థినులు విద్యా మిత్ర కిట్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా.. -
28న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: ఈనెల 28న స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్స్లో అండర్–19 వన్ డే, మల్టీ డే క్రికెట్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా కలర్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. వివరాలకు 9573424360, 9246222999ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు: ప్రకాశం జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల కబడ్డీ పోటీలను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు పి.విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రాడాకారులు ముందుగా క్రీడాభారతి యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ఒక పాఠశాల నుంచి, గ్రామం నుంచి ఎన్ని టీములైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వివరాలకు 9849429839, 96031 62699ను సంప్రదించాలని సూచించారు. గుడ్లూరు: ప్రైవేటు స్కూల్ బస్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయిన ఘటన మండలంలోని సాలిపేట– రావూరు గ్రామాల మధ్య బుధవారం జరిగింది. తల్లిదండ్రుల సమాచారం మేరకు..మండలంలోని చేవూరు గ్రామంలోని సాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్ ఉలవపాడు మండలం రామాయపట్నం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రావూరు సమీపం దగ్గర అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్ అజాగ్రత్త వలనే ఈప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుడ్లూరు: గూడ్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన బంగారం బ్రాస్లెట్ను బస్లో మర్చిపోయి దిగింది. వెంటనే గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్ డ్రైవర్కు ఫోన్ చేయగా సీటులోనే బంగారం బ్రాస్లెట్ పడి ఉంది. కండక్టర్ తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలికి గుడ్లూరు పోలీసులు బ్రాస్లెట్ అప్పగించారు. నిజాయతీగా బంగారాన్ని అప్పగించిన ఆర్టీసీ కండక్టరు, డ్రైవర్లను పోలీసులు, బాధితురాలు అభినందించి శాలువతో సన్మానించారు. గిద్దలూరు రూరల్: మండలంలోని నరవ గ్రామ సమీపంలో గల నీటి కుంటలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిల్లెల సాలమ్మ(85) గ్రామంలో ఒంటరిగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది నీటి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సాలమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కాగా, పదేళ్ల క్రితం కుమారుడు మరణించాడు. కుమార్తెకు వివాహమై సాలమ్మకు దూరంగా ఉంటోంది. ఒంటరి జీవితాన్ని భరించలేని సాలమ్మ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23వ తేదీన నీటి కుంటలో పడి మృతి చెందింది. నీటి కుంటలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రజలు సహకరించాలి
ఒంగోలు సబర్బన్: జనాభా లెక్కల సేకరణకు ప్రజలు సహకరించాలని జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణను బుధవారం ఒంగోలులో ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పర్యవేక్షించారు. ఫీల్డ్ ట్రైనర్లకు గృహ గణన చేసే విధానం, యాప్లో వివరాల నమోదు, సమాచార సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు పట్టణంలో నాలుగు బృందాలకు క్షేత్ర స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించడంలో ఎదురయ్యే సమస్యలు, యాప్లో వివరాల నమోదు సమయంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా జనాభా లెక్కల సేకరణ సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని ఫీల్డ్ ట్రైనర్లకు రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా సిబ్బందికి క్షేత్ర స్థాయిలో అవగాహన కోసం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నివాసంలో మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు సేకరించి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్ మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జనాభా లెక్కల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫీల్డ్ ట్రైనర్లకు క్షేత్ర స్థాయి శిక్షణ -
చట్టాలను అతిక్రమిస్తే జైలుకే..
● జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ మార్కాపురం: మనుషులు ఆవేశంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి, నిగ్రహం నశించి చట్టాలను అతిక్రమిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మార్కాపురంలోని సబ్జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మంచి, చెడును గ్రహించే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, అవి లేని రోజున సమాజంలో శాంతి ఉండదని అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జైల్లో అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట సబ్జైలు సూపరింటెండెంట్ విజయ్కుమార్, ప్యానల్ న్యాయవాదులు ఎస్కే జహీర్, సలామ్, సిబ్బంది ఉన్నారు. -
ఒంగోలులో హైటెక్ వ్యభిచారం
ఒంగోలు టౌన్: నగరంలో ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే భాగ్యనగర్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యనగర్ రెండో లైనులో నివాస గృహాల మధ్య ఉన్న రెండు అపార్టమెంట్లలో ఒక మహిళ హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బుధవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక మహిళా నిర్వహకురాలితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్థికంగా స్థితిమంతురాలైన నిర్వాహకురాలికి నగరంలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె ఆన్లైన్ విధానంలో కాల్ గర్ల్స్ను ఏర్పాటు చేస్తూ విటుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ● ఎస్పీ హర్షవర్థన్రాజు హెచ్చరిక ఒంగోలు టౌన్: మోడిఫైడ్ సెలెన్సర్లతో చెవులను హోరెత్తించేలా శబ్ధం చేస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టే బైకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. నగరంలో గత నాలుగు నెలలుగా ప్రత్యేక డ్రైవ్లో గుర్తించి తొలగించిన మోడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ సెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తు చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక శబ్ధాల వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అధిక కాంతినిచ్చే లైట్లను వాహనాలకు అమర్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, తాలుకా సీఐ విజయ కృష్ణ, ఆర్ఐ సీతారామిరెడ్డి, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓగూరులో సచివాలయానికి తాళం కందుకూరు రూరల్: మండలంలోని ఓగూరులో స్వర్ణ గ్రామ సచివాలయానికి గ్రామస్తులు బుధవారం తాళం వేశారు. సదరం స్లాట్ బుక్ చేసుకునేందుకు స్థానికులు కొందరు సచివాలయానికి ఉదయం 10.30 గంటలకు రాగా సిబ్బంది ఎవరూ లేరు. కాసేపు ఆగి మళ్లీ రాగా తలుపులు తీసి ఉన్నాయి కానీ ఉద్యోగులు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సచివాలయానికి తాళం వేసి ఎంపీడీఓ రత్నజ్యోతికి అప్పగించారు. ఈ విషయమై ఎంపీడీఓ స్పందిస్తూ.. పంచాయతీ కార్యదర్శి డీపీఓ కార్యాలయంలో ఎలక్షన్ వర్క్లో ఉన్నారని, డిజిటల్ అసిస్టెంట్ మెడికల్ లివ్లో ఉండటంతో ఇన్చార్జిని నియమించామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్వేలో ఉండగా, ఇన్చార్జి డిజిటల్ అసిస్టెంట్, మహిళా సంరక్షణ కార్యదర్శి సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టాలరని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
న్యాయవాది దుర్మరణం
బైక్ను ఢీకొట్టిన కంటైనర్..ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒంగోలు నగరానికి చెందిన ఓ న్యాయవాది దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన న్యాయవాదులు గంటా శ్రీనివాసరావు, టి.విజయసారథి, కె.మారుతినందన్, పసుపులేటి వెంకట పవన్ కుమార్ బుధవారం రాత్రి రెండు మోటారు బైకులపై మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్కు వెళ్లారు. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేసి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజువారిపాలెం వద్దకు రాగానే అతి వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయవాది గంటా శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మారుతి నందన్ను తొలుత ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చైన్నె తరలించారు. మరో బైక్పై ఉన్న ఇద్దరు న్యాయవాదులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన గంటా శ్రీనివాసరావు ఒంగోలు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు రాజీవ్ నగర్లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన గంటా శ్రీనివాసరావు కుటుంబానికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, న్యాయవాదులు ఇనకొల్లు వెంకటేశ్వర్లు, దారా వశిష్ట, వై.సునీల్ కుమార్, చక్కా బాలచెన్నయ్య, పెన్నా నాగరాజు, లక్ష్మణ్ కుమార్, కేవీ శేషారెడ్డి సంతాపం తెలిపారు. బార్లో న్యాయవాదులందరితో సన్నిహితంగా మెలిగే మంచి స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో న్యాయవాది పరిస్థితి విషమం.. చైన్నెకి తరలింపు న్యాయవాది ‘గంటా’ మృతికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం -
హాయివే కాదు సుమా!
పని చేసి అలసిన ఓ బాలుడు వేగంగా దూసుకెళ్తున్న వాహనంపై మండుటెండలో నిద్రిస్తున్న దృశ్యాన్ని చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై ఒంగోలు శివారులోని త్రోవగుంట వద్ద ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. ఓ లోడ్ ట్రక్ అంచున ప్రమాదకర స్థితిలో నిద్రిస్తున్న బాలుడు.. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రక్ గమ్యస్థానానికి చేరుకునేలోపు ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. – సాక్షి, ఒంగోలు -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఒంగోలు టౌన్: జిల్లాలో చెడునడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గంజాయి, పేకాటను కట్టడి చేసేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. తరచుగా గ్రామాలను సందర్శిస్తూ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయాలని, సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఇతరా శాఖలతో సమన్వయం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సైబర్నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, కొత చట్టాలు, శిక్షలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేసే విధంరగా ప్రోత్సహించాలని, పోలీస్ స్పందన వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలన్నారు. బహింరంగంగా మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, డీసిఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష -
జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది..
ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాధీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వాన వెలిసింది.. నష్టం మిగిలింది
మార్కాపురం: గతవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి మొత్తం 1182 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. 1292 మంది రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి తదితర పంటలు పూర్తిస్థాయిలో నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా మొక్కజొన్నతోపాటు అలసంద, వరి, పొద్దుతిరుగుడు పంటలు అకాల వర్షానికి నేలకొరిగాయి. మార్కాపురం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం రాళ్లపల్లి గ్రామంలోనే అత్యధికంగా 213 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. యర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి, పుల్లలచెరువు, పొదిలి, అర్ధవీడు, తదితర మండలాల్లో రైతులు కూడా నష్టపోయారు. ప్రకాశం జిల్లాలో 770 మంది, మార్కాపురం జిల్లాలో 522 మంది రైతులు నష్టపోయారు. 533.42 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి, అలసంద పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో వరిసాగు చేసిన రైతులు 102 మంది, మొక్కజొన్న రైతులు 151 మంది, పొద్దుతిరుగుడు రైతులు 225 మంది, రాగి సాగు చేసిన 43 మంది రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి, గన్నవరం, వెలిగండ్ల, పి నాగులవరం, రామగోపాలపురం, కనిగిరి మండలంలోని జమ్మలమడక, హెచ్ఎంపాడు మండలంలోని నందనవనం, సీఎస్పురం మండలంలోని అరివేముల, కంభం మండలంలోని రావిపాడు, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మార్కాపురం మండలంలోని చింతగుంట్ల గ్రామాల్లో రైతులు నష్టపోగా దర్శి మండలంలోని కొర్లమడుగు, కొత్తపల్లి, లక్ష్మీ నారాయణపురం, త్రిపురసుందరపురం, పెద్ద ఉయ్యాలవాడ, రామచంద్రాపురం, బసిరెడ్డిపల్లి, లింగసముద్రం మండలంలోని పెద్దపవని గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆ పరిహారం కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో గత వారం కురిసిన అకాల వర్షానికి మళ్లీ పంటలు దెబ్బతినడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబు సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
ప్రారంభమే ఢమాల్
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభం రోజే రైతులకు భారీషాక్ ఇచ్చారు వ్యాపారులు. కేజీకి కేవలం రూ.250ల ప్రారంభ ధరతో వేలాన్ని ప్రారంభించారు. రైతులు ఊహించిన ధరలకు దరిదాపుల్లో కూడా ప్రారంభ ధరలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధరలు ఇదే విధానంలో కొనసాగితే భారీ నష్టాలతో నిండా మునుగుతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగే అవకాశం లేదని అటు బోర్డు అధికారులు, ఇటు వ్యాపారుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పొగాకు రైతులకు భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 ఏడాది పొగాకు సీజన్కు సంబంధించిన వేలం ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొదటి విడతలో భాగంగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో వేలాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా కందుకూరు–1 వేలం కేంద్రంలో 18 బేళ్లను వేలానికి ఉంచారు. కేజీకి రూ.250 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే క్వింటా పొగాకు రూ.25 వేలు మాత్రమే వచ్చింది. అదీ నాణ్యమైన బ్రైట్గ్రేడ్ పొగాకు రూ.250లు మాత్రమే ఇచ్చారు. దీంతో రైతులు ప్రారంభ ధరల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు భారీ స్థాయిలో పెరిగాయని ఈ విధమైన ధరలు ఇస్తే కోలుకోలేకుండా దెబ్బతింటామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే ధరలు ఈ విధంగా ఉంటే ఇక లోగ్రేడ్ పొగాకు ధరలు ఎంత దారుణంగా ఉంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధమైన ధరలతో వేలం కొనసాగితే సరాసరి ధరలు భారీగా పడిపోతాయని భావిస్తున్నారు. కర్ణాటక మార్కెట్లో సరాసరి ధర రూ.230లు వచ్చిందని, ఇక్కడ ఆ ధరలు కూడా వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, వ్యాపారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగా లేనందున ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పొగాకు రైతుల భవిష్యత్ ఏంటో మొదటి రోజు వేలంలోనే స్పష్టమైంది. -
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాధీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. గతంలో తీరానికి దగ్గరగా చేపల వేట సాగించిన పాండిచ్చేరి రాష్ట్రం కరైకల్కు చెందిన సోనాబోట్లు పెద్దల కుట్ర..! -
నేటి నుంచి పొగాకు వేలం
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో ఎదురైన జాప్యానికి తెరపడనుంది. ఎట్టకేలకు జిల్లాలో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం నుంచి జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఈ ఏడాది పొగాకు ధరలపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ధరలు లేక నష్టాలు మూటగట్టుకున్నామని, ఈ ఏడాదైనా గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకోవాలంటూ రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఆకు నాణ్యంగా ఉండటంతో ధరలు బాగుంటాయనే ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం పొగాకు మార్కెట్ అంత ఆశాజనకంగా లేదనే భయం కూడా రైతులను వెంటాడుతోంది. కర్ణాటక పొగాకు వేలంలో వస్తున్న ధరలే దీనికి కారణం. ఇటువంటి పరిస్థితుల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం ప్రక్రియ రైతుల భవిష్యత్ను నిర్ణయించనుంది. తొలి దశలో రెండు కేంద్రాలు పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి, కందుకూరు–1, కందుకూరు–2, పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలు జిల్లా పరిధిలో ఉంటే కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిలో కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగిలిన 9 వేలం కేంద్రాల్లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి వేలం ప్రారంభమవుతుందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏడాది పొగాకు వేలం ప్రారంభ ధరలపై రైతుల్లో పలు అంచనాలు ఉన్నాయి. 90.20 మిలియన్ కేజీలకు అనుమతి 2025–26 పొగాకు సీజన్కు సంబంధించి 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు విక్రయించుకునేందుకు బోర్డు అనుమతి ఉంది. ఈ ఏడాది పెరిగిన విస్తీర్ణం నేపథ్యంలో దాదాపు 130 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వేలం ప్రక్రియ ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగియక పోవడంతో ఇక్కడ వేలం ప్రారంభం ఆలస్యమైంది. వచ్చే నెల నాటికి కాని కర్ణాటక వేలం ముగిసే అవకాశం లేనందున తొలి విడతగా రెండు వేలం కేంద్రాల్లో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రారంభ ధరలు ఎంత ఉంటాయనే దానిపై రైతుల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఽగిట్టుబాటు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. సరాసరి ధరలు మెరుగ్గా ఉంటేనే.. ధరలు లేక గతేడాది పొగాకు రైతులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. నాణ్యత మెరుగ్గా ఉన్నందున ఆ మేరకు ధరలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కిలో పొగాకు రూ. 350 తగ్గకుండా ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరాసరి ధరలు కూడా తగ్గకుండా ధరలు ఉండాలని కోరుతున్నారు. కర్ణాటక మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో వ్యాపారులు ధరలు ఇవ్వలేదు. మొదట్లో రూ.320ల వరకు ధరలు ఇచ్చి ఆ తర్వాత కోత పెట్టి రూ.280 ఇచ్చారు. దీంతో సరాసరి ధరలు అక్కడి మార్కెట్లో రూ.230లు మించడం లేదు. ఇదే ధరలను వ్యాపారులు ఇక్కడి మార్కెట్లో అమలు చేస్తే రైతులకు కోలుకోలేని దెబ్బ తగలుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలంలో ఏ మేరకు ధరలు వస్తాయో చూడాల్సి ఉంది. తొలి విడతగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభం వచ్చే నెల 9వ తేదీ నుంచి మిగిలిన వేలం కేంద్రాల్లో కూడా.. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ధరలపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా లేదంటూ ఆందోళన కర్ణాటకలో రూ.230ల వరకు పరిమితమైన సరాసరి ధరఈ ఏడాది జిల్లాలో పండిన పొగాకు నాణ్యంగా మెరుగ్గా ఉండటం రైతులకు సానుకూలాంశం. దాదాపు 60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో దిగుబడులు మాత్రం తగ్గాయి. గతేడాది ఎకరానికి 9, 10 క్వింటాళ్ల ఆకు దిగుబడి వస్తే ఈ ఏడాది అది 6,7 క్వింటాళ్లకు మాత్రమే పరిమితమైందని రైతులు చెప్తున్నారు. దిగుబడి తగ్గినా విస్తీర్ణం ఎక్కువ ఉండటంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తులు వస్తాయని భావిస్తున్నారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● రూ.9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం కనిగిరి రూరల్: పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ ఏవీ రమణకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ 9,49,800 నగదు, 30 గ్రాముల బంగారు సరుడు, ఏపీ 27బీఎం 3997నెంబర్ గల మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనిగిరిలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కనిగిరి శివారులో పొదిలి రోడ్డులోని లారీ ఆఫీసు వద్ద సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సందీప్ కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వడ్డమాను శివారెడ్డి(అంకిరెడ్డి పాలెం, గుంటూరు జిల్లా)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడటంతోపాటు దర్శిలో బైక్ అపరిహించినట్లు నిందితుడు అంగీకరించాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 చోరీ కేసులు నిందితుడిపై నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడి అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
హామీల అమలులో చంద్రబాబు విఫలం
పుల్లలచెరువు: సూపర్ సిక్స్ పథకాలు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మరిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెంలో శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు.. తన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పింఛను ఎగ్గొట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ది, సంక్షేమం ఊసే లేదని, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 22 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, ఆ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలని సూచించారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు మరో రెండేళ్లు ఓపిక పట్టాలని సూచించారు. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ అండ్ కో సాగిస్తున్న అరాచకాల్లో పాలుపంచుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, వారిని వదిలే ప్రసక్తి లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వాగ్యానాయక్, రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్.రాములు, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కె.రఘు, నాయకులు ఆవుల రవణారెడ్డి, గడ్డం సుబ్బయ్య, రోసిరెడ్డి, వాసు, శ్రీనివాసరెడ్డి, చరణ్రెడ్డి, నాసర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని తుంగలో తొక్కారు సుబ్బారెడ్డిస్వామి తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి -
టీబీ వ్యాధిపై అపోహలు వద్దు
ఒంగోలు టౌన్: టీబీ వ్యాధిపై అపోహలు తొలగించుకొని వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు సూచించారు. వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పల్మనాలజీ హెచ్ఓడీ డా.రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సు లో సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ టీబీ నయమయ్యే వ్యాధి అని తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన వైద్య చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పారు. సీఎస్ఆర్ఎంఓ డా.మాధవీలత మాట్లాడుతూ వృద్ధుల్లో టీబీ వ్యాధి గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యులు రంజిత్ బాషా, సాంబశివరావు, కుమార్ వర్మ, పల్మనాలజీ సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల ఇంటి అద్దెలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో వారు నివసిస్తున్న ఇళ్లకు ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల ఆజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎకరా 99 పైసల చొప్పున సొంత వ్యక్తులకు కట్టబెడుతున్న చంద్రబాబుకు రాష్ట్రంలోని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వడానికి మనసురావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాల గురించి రచ్చ చేసిన కూటమి నాయకులు ఇప్పుడు టిడ్కో గృహాల గురించి నోరు విప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ నగరంలోని సరళాదేవి నగర్, దత్తాత్రేయ కాలనీల్లో 20 ఏళ్లుగా ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అర్హులైన వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, ఎంఏ సాలార్, వీరారెడ్డి, హనుమారెడ్డి, ఎం.విజయ, చిరంజీవి, సీతారామయ్య, అంజయ్య పాల్గొన్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
● డీఈఓ రేణుక పొన్నలూరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లోని పరీక్షా కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ప్రతి రోజూ తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. మాస్ కాపీయింగ్ వంటివి లేకుండా పర్యవేక్షకులు గట్టి నిఘా ఉంచారన్నారు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి బయట వ్యక్తులు వెళ్లకుండా పరిక్ష ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట పరీక్ష కేంద్రం చీఫ్ అనురాధ ఉన్నారు. కంభం: విద్యుదాఘాతానికి వృద్ధురాలి మృతి చెందింది. ఈ ఘటన మండలంలో యర్రబాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మద్దిరాల గంగమ్మ(60) ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో పొలంలోకి వెళ్లి వెతకగా స్టాటర్ పెట్టే వద్ద విద్యుతాఘాతానికి గురై పడి ఉంది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు మార్కాపురం: పోలీసుశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన సమర్ధవంతమైన పోలీసు సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అనంతరం మార్కాపురం జిల్లాలో జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక నిమిత్తం మార్కాపురం, పొదిలి ప్రధాన రహదారిపై రాయవరం గ్రామ సమీపంలో ఉన్న సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. కార్యాలయ ఏర్పాటుకు భూమి స్థితి, రవాణా సౌకర్యాల అందుబాటు, భధ్రతా పరమైన అంశాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి అవకాశాలను పోలీసులతో సమీక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వు వంటి కీలక విభాగాలను ఏర్పాటుచేసేందుకు అనువైన పరిస్థితులపై చర్చించారు. ఈయన వెంట డీఎస్పీ నాగరాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై వేమన అధికారులు పాల్గొన్నారు. పొదిలి: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వారి సమస్యలు పోలీస్ పరిధిలో తక్షణమే పరిష్కారం అయ్యేలా పోలీసులు శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు రకాల కేసులపై సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలో నమోదైన కేసులపై సమీక్ష చేశారు. పురోగతి, దర్యాప్తు తీరు గురించి ఆరా తీశారు. తరుచూ జరుగుతున్న నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో వృత్తి నైపుణ్యతతో శాసీ్త్రయ పద్ధతులతో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు, బాదితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూను వేగవంతం చేయాలని నిందితులను పట్టుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, ఇతర అనుమానిత వస్తువుల వాడకం, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల, రాంగ్ రూట్లో ప్రయాణాలు, మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్ను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల్లో జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు, సీఐ రాజేష్ ఉన్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
● ఒకరు మృతి బల్లికురవ: కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మేదరమెట్ల – నార్కెట్పల్లి నామ్ రహదారిలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న టి.సుబ్రమణ్యం (53) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి, డ్రైవర్కి ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రభకు బూచేపల్లి వెంకాయమ్మ పూజలు
చీమకుర్తి: రామతీర్థం తిరునాళ్ల సందర్భంగా వైఎస్సా ర్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ప్రభకు సోమవారం చీమకుర్తిలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పూజలు చేశారు. మరో వారం రోజుల్లో జరగనున్న తిరునాళ్ల సందర్భంగా ప్రభ తడికను నిర్మిస్తున్నందున ప్రభ వద్దకు వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి ప్రభకు పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, వైస్ ఎంపీపీ బాపతు వెంకటరెడ్డి, పార్టీ నాయకులు గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, సోమా శేషాద్రి, బడే అయ్యపరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కష్టాలు తీర్చండి
కార్మికనగర్ వాసుల ఒంగోలు సబర్బన్: కార్మిక నగర్ బాధితులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి కష్టాలు తీర్చాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని కార్మిక నగర్ బాధితులతో వచ్చి కలిశారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్కు కార్మిక నగర్ వాసులు గోడు వెల్లడించారు. చుండూరు రవిబాబు మాట్లాడుతూ సుమారు 70 నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతినిధులు కార్మిక నగర్లో పర్యటించి భాదితులతో మాట్లాడి వారి గోడును ఆలకించామని, ఇటువంటి అన్యాయం ఒంగోలు చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 15–20 సంవత్సరాలుగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 186లో సుమారు 4.40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కార్మిక నగర్లోని పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కార్మిక నగర్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆ భూమి ‘ఇనాం’ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో (ఆర్ఎస్ ఆర్) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కొంతమందికి రెవెన్యూశాఖ వారు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళ జేసీబీలతో వచ్చి కార్మిక నగర్లోని నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. కనీసం ఇంట్లోని వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఏ అధికారంతో, ఏ రికార్డులతో ఆ భూమి తమదేనని పేదల ఇళ్లను కూల్చివేశారో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా ప్రైవేటు వ్యక్తుల భూమి ఉంటే వారు ముందుగా కొలతలు వేసుకొని, చట్ట ప్రకారం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా అన్ని ప్రశ్నించారు. కానీ అందరి పేదల ఇళ్లు పడేసి వారి జీవనానికి, వారి హక్కులకు భంగం కలిగించారన్నారు. గత 45 రోజులుగా బాధితులు ఆరుబయట ఎండలో, రాత్ర చలిలో, దోమలతో గడుపుతున్నారు. ఈనాటికీ కనీసం రెవెన్యూవారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ముందుగా కార్మిక నగర్ బాధితులకు తాత్కాలిక నివాసాలు కల్పించాలని జేసీకి విన్నవించారు. ఇళ్లు కోల్పోయిన దానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. బాధితులకు శాశ్వత నివాస పట్టాలు మంజూరు చేయాలి ఇళ్లు కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జేసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల్లో అన్యాయం
ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీల కార్యదర్శుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయంపై ప్రకాశం భవన్ ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలో బెన్హర్ మాట్లాడుతూ కార్యదర్శుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని జోన్–3 (ప్రకాశం, నెల్లూరు, గుంటూరు) పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయం దారుణమైందన్నారు. ఆత్మగౌరవంతో కూడిన పదోన్నతుల కోసం చేసిన న్యాయపోరాటంలో వచ్చిన తాజా తీర్పు అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. కోర్టులో వాస్తవాలను, ఆధారాలను ఎన్ని నిరూపించినా అన్యాయానికే బలం తోడై న్యాయం వెనకబడిందని ఆవేదన చెందారు. ముఖ్యంగా జోన్–3 లో గ్రేడ్–3 నుంచి డ్–2 ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయం వర్ణనాతీతంగా మారిందన్నారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 లోని రూల్ 24 ప్రకారం జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి తప్పనిసరిగా జోనల్ సీనియారిటీ లిస్టును అధికారికంగా పబ్లిష్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాతే కచ్చితమైన సీనియారిటీ లిస్ట్ను బహిర్గతం చేయాలన్నారు. కానీ ఇక్కడ ఏ సీనియారిటీ లిస్టును అధికారికంగా చూపకుండా, అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా, రహస్యంగా దొడ్డిదారిన ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోందని కార్యదర్శులందరికీ తెలుసు, కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలంటే చాలా మంది భయపడుతున్నారన్నారు. రిలేనిరాహార దీక్షలో కార్యదర్శులు అనపర్తి నాగేశ్వర రావు, కే.వెంకట్రావుతో పాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ ప్రకాశం భవన్ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సంతమాగులూరు (అద్దంకి రూరల్): బైకు మీద వెళుతున్న యువకుడిని బోలెరొ వాహనం ఢీకొట్టగా మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..బతుకుదెరువు నిమిత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన రోహిత్ (22) సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్లో వెళుతుండగా వినుకొండ నుంచి నరసరావుపేట వెళుతున్న అరటికాయల లోడు వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో రోహిత్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. ● జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఒంగోలు సబర్బన్: అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 278 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతతో, సత్వరం పరిష్కరించేలా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను నిలువునా మోసం
కొండపి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసినట్లు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్ల తర్వాత ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ పేరిట పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అక్కడ ప్రకటించిన 10060 ఉద్యోగాలు కూడా ఒక్క నోటిఫికేషన్తో ఇవ్వడం లేదని నాలుగు విడతల్లో 41 నోటిఫికేషన్లతో వచ్చే అక్టోబర్ వరకు సాగదీస్తున్నారని విమర్శించారు. వలంటీర్లను తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, ప్రజలను వంచించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఖాళీ పోస్టులు 1,72,000 ఉండగా కేవలం 10 వేల పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. 66 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. కార్యక్రమంలో కొండపి మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, టంగుటూరు మండల కన్వీనర్ చింతపల్లి హరిబాబు, మర్రిపూడి మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, హరీష్ వరుణ్, రవీందర్రెడ్డి, వెంకారెడ్డి, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, మండవ మాలకొండయ్య, మేదరమెట్ల భరత్, మల్లికార్జున, బ్రహ్మారెడ్డి ఈశ్వర్, యామవరపు వీర వసంతరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, షేక్ వన్నూరు, వంశీ, శ్రీకాంత్రెడ్డి, శ్రీహరిబాబు, నజీర్, నాగేశ్వరరావు, పెట్లూరు కృష్ణమూర్తి, గర్నిపూడి రమేష్, పర్చూరి సుబ్బయ్య, సుల్తాన్, కొర్నేలు, సాంబశివరావు, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ధాన్యపు గింజ కొనాలి
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: కనపర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో పాటు రోజుకు కనీసం ఒక్క లారీ ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద వరి ధాన్యం పండించి రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులను సోమవారం మేరుగు నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్న తీరును రైతులు నాగార్జున దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎత్తిపోతల పథకం కింద 5 గ్రామాల్లో ఉన్న రైతాంగం సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశామని, పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసిందన్నారు. దీంతో చాలా మంది రైతులు దళారులకు బస్తా రూ.1000, రూ.1100 లకు అమ్ముకున్నారని తెలిపారు. చివరలో ఏదో మొక్కుబడిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రోజుకి కనీసం ఒక్క లారీ కూడా రైతుల వద్ద నుంచి సరుకు ఎత్తడం లేదని వాపోయారు. జేసీకి వినతిపత్రం: రైతుల బాధలు విన్న మేరుగు నాగార్జున వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించడమే కాకుండా నేరుగా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిని కలిసి రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం చాకిరీ చేసి కష్టపడి పండించిన పంటను దళారులకు నిలువునా అమ్ముకుంటున్న రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. కనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రోజుకు 10 లారీల ధాన్యం కొనుగోలు చేస్తే కానీ రైతుల వద్ద సరుకు నాణ్యత లోపించకుండా ఉంటుందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నేరుగా కొనుగోలు చేసినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలా కొనకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, పార్టీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, పార్టీ నాయకులు వాకా అరుణ కోటిరెడ్డి, కాకర్ల వెంకటేష్, నారపరెడ్డి, కుక్కల గోపాల్ రెడ్డి, పాకనాటి సుందర రామిరెడ్డి, నారపురెడ్డి, ఎస్.ముత్యాల్ రెడ్డి, శ్రీహరి, అంజిరెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి, పి.జోగారెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, సోమిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతలేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని తన చాంబర్లో జేసీ అన్నీ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ వినియోగం, సరఫరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పౌర సరఫరా అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు అవసరమైన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు నిల్వలు అందుబాటులో ఉంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ పద్మశ్రీ,, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వర రావు, జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు, డీటీసీ సుశీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డీఈఓ రేణుక, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, శ్రియా వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావుతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ కొరడా
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 41 రోజుల పాటు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 189 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,82,394 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కోడి పందేలు నిర్వహిస్తున్న 84 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,10,180 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్పై కేసు నమోదు చేసి 3 ల్యాప్టాప్లు, 21 సెల్ ఫోన్లతో పాటుగా రూ.24 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కమ్యునికేటర్, బోర్డు, 3 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే మాట్కా నిర్వహిస్తున్న 5 స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి నుంచి రూ.15,760 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 98 మంది కోడి పందేలు ఆడే పాత ముద్దాయిలు, నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు చెప్పారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు 1500 మందికి పైగా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్ బెట్టింగుల గురించి అప్రమత్తం చేశామన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను పర్యవేక్షించాలని, అనుమానాస్పద కార్యక్రమాలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. -
వంట తంటా
గ్యాస్ మంట..ఒంగోలు నగరం బాలాజీనగర్లో ఇంటి బయట కట్టెలపొయ్యితో వంటలు చేసుకుంటున్న మహిళలుపశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీపాయింట్లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. చాలా వరకు హోటళ్ల వారు గ్యాస్ పొయ్యిల బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కర్రీపాయింట్లు, హోటళ్లను మూసేశారు. కొన్ని ఇళ్లలోనూ గ్యాస్స్టవ్లకు బదులు ఆరుబయట కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – సాక్షి, ఒంగోలు -
జాబ్క్యాలెండర్ అంటూ చంద్రబాబు మోసం
పుల్లలచెరువు: జాబ్ క్యాలెండర్ అంటూ మరోసారి నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ఐటీ వరం గ్రామంలో శనివారం రాత్రి వేణుగోపాల స్వామి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కేవలం వారి కార్యకర్తలు లాభపడడానికి మాత్రమే పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ను విడుదల చేస్తాం రాసి పెట్టుకోండి అని చెప్పిన మంత్రి లోకేష్ సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం కంటి తుడుపుగా నాలుగు ఉపాధ్యాయ పోస్టులు వేసి చేతులు దులుపుకుంటునారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని రూ.3 వేలు ఇస్తానని సంతకాలు చేసి బాండ్లు ఇచ్చారని ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా ఇంత వరకు ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఈ 22 నెలల్లో రూ.13 వేల కోట్లు నిరుద్యోగులకు ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, బియ్యం మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రఘు. సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల రవణారెడ్డి, మాజీ ఎంపీపీ లాజర్, నాయకులు చరణ్రెడ్డి, నాసర్రెడ్డి, గడ్డం సుబ్బయ్య, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ రాస్తారోకో
పెద్దదోర్నాల: నేషనల్ హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ హసానాబాద వాసులు సోమవారం టోల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు అధికారులు ముందస్తుగానే జమ్మిదోర్నాల టోల్ ప్లాజాగా పేరు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్ మాట్లాడుతూ ఎకరా రూ.2 కోట్ల విలువైన భూములను టోల్ ప్లాజా నిర్మాణం కోసం తమ గ్రామస్తులు కేవలం రూ.4 లక్షలకే ఇచ్చారన్నారు. టోల్ ప్లాజా నిర్మాణానికి భూములు ఇచ్చిన గ్రామస్తుల వాసుల కోరిక మేరకు టోల్ ప్లాజాకు హసానాబాద టోల్ ప్లాజా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట రమణయ్య సంఘటనా స్థలికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్, కే మల్లిఖార్జునరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం సబ్కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ప్రతి ఆరు నెలలకు మంజూరు చేయాల్సిన కరువు భత్యాన్ని, రిటైర్డు అనంతరం రావాల్సిన బెనిఫిట్స్, సరెండర్ లీవులు సకాలంలో చెల్లించడం లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంత వరకూ చెల్లించలేదని, 12వ పీఆర్సీ సమయం రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు పీ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో 117 జీవోను రద్దుచేసినట్లుగా చెబుతున్న ప్రభుత్వం అదే విధమైన జీవో 19, 20 తీసుకువచ్చి ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఒకే పాఠశాలలో విద్య కొనసాగిస్తున్నారని, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నా నెల నెలా పదోన్నతులు నిలిపివేయడం వలన ఆ ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని, కేజీబీవీల్లో పనిచేస్తున్న వారికి ఎంటీఎస్ వర్తింపచేయాలని, కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించాలని, 50 ఏళ్లు నిండిన వారికి డిపార్టుమెంట్ పరీక్షలకు సంబంధం లేకుండా 24 ఏళ్ల స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ఎంఈఓల బదిలీలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సబ్కమిటీ సభ్యులు టీ సుబ్బరాయుడు, కే తిరుమల, టీ రామారావు పీసీ వెంకటేశ్వర్లు, జే ఆనందరావు, జీ రామకృష్ణ, రంగస్వామి, జే రాఘవేంద్రరావు, సీహెచ్ శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ నారాయణరెడ్డి, టీ శ్రీనివాసులు, యం కోటేశ్వరరావు, శోభన్బాబు, శ్రీనివాస నాయక్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తల కష్ట, నష్టాలకు తగిన ప్రతిఫలం
పొదిలి: కూటమి ప్రభుత్వంలో కష్టపడుతూ, నష్టపోతూ ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన ప్రతిఫలం వచ్చేలా చేసేందుకు వైఎస్.జగన్మోహనరెడ్డి నిర్ణయించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి ఏలూరు ముసి ఆంజనేయస్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ జగన్మోహనరెడ్డి నిలిచారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, పేదలు సంకల్పం తీసుకున్నారన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ వారినే వెన్నుపోటు పొడిచేందుకు కాచుకు కూర్చున్న వారిపై చర్యలు తప్పవన్నారు. మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే అజండాగా కూటమి నేతలు పని చేస్తున్నారన్నారు. ఎదురవుతున్న కష్టాలను అనుభవిస్తూనే, జగనన్న కోసం పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారన్నారు. కార్యకర్తలకు వచ్చే ఇబ్బందులను, సమస్యలను పరిష్కారం చేసేందుకు తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అన్నా కృష్ణ చైతన్య, రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, గొలమారి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ సలహామండలి మాజీ అధ్యక్షుడు కొండ్రగుంట సుబ్బారావు, అన్నవరం బ్రహ్మారెడ్డి, ఉప్పలపాడు మాజీ ఎంపీటీసీ కొణతం రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బూచి నాగిరెడ్డి, ఏలూరు, ఓబులక్కపల్లి, పాములపాడు, అక్కచెరువు, ఆముదాలపల్లి, మల్లవరం, రామాపురం సర్పంచ్లు తాల్లూరి సింగయ్య, ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కోదండరామిరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, రెడ్డెబోయిన వెంకటేశ్వర్లు, కసిరెడ్డి కోటిరెడ్డి, మాజీ సర్పంచ్లు కొండ్రగుంట శ్రీనివాసరావు, పూనె చిన వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కొండాయపాలెం నారాయణరెడ్డి, మూగ చింతల రామాంజనేయరెడ్డి, గురుగుపాడు నారాయణరెడ్డి, ఈగలపాడు యోగిరెడ్డి, రామిరెడ్డి, మండలంలోని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వ్యాఘ్ర వాహనంపై బాలాత్రిపురసుందరీదేవి
త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రుల్లో భాగంగా వ్యాఘ్ర వాహన సేవ శనివారం వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, ఉభయదాతల పూజలు, హోమాలు వైభవంగా వేదపండితులచే నిర్వహించారు. వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం శనివారం ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆదాయంలో భాగంగా కుంకుమార్చన ద్వారా రూ.20,880, తలనీలాలు రూ.32,925, ప్రత్యేక దర్శనం రూ.4,12,600, రూం అద్దెలు రూ.31,360, లడ్డు ప్రసాదాలు రూ.2,15,560, అన్నదానం రూ.1,60,035 ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు తెలిపారు. ఒంగోలు సబర్బన్: విద్యుత్ వినియోగదారుల కోసం ఆదివారం సెలవు రోజు అయినా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ బిల్లులు ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చన్నారు. కొనకనమిట్ల: మండలంలోని పాతపాడులో అగ్ని ప్రమాదంలో పొగాకు బ్యారన్ పూర్తిగా కాలిపోయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొండపురెడ్డి పెదవెంకటరెడ్డి, చినవెంకటరెడ్డ్లికు చెందిన పొగాకు బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ జరుగుతోంది. బ్యారన్లో సుమారు 1100 పొగాకు అల్లుడు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్లలోని పొగాకు అల్లుడు కర్ర మొత్తం పూర్తిగా కాలిపోయింది. బ్యారన్లోని టైర్లు, రేకులు, అల్లుడు కర్ర అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయాయి. మంటల ధాటికి బ్యారన్ గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. అల్లుడు కర్ర, బ్యారన్ మొత్తం రూ.3 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో శనివారం అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి ఆలయ అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ప్రత్యేక పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, చైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, కృష్ణదేవరాయుల కాపుబలిజ, ఆర్యవైశ్య, గోపాలకృష్ణ యాదవ అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. -
న్యాయం కోసం పోరాటం..
తౌషిక్ మృతిపై న్యాయం కోసం తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీ ఎక్కని గడప లేదు. మొక్కని అధికారి లేడు. కలెక్టర్ పి.రాజాబాబును కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్పీ హర్షవర్థన్రాజును కలిసి న్యాయం చేయమని వేడుకున్నారు. చివరకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి నిరసన చేపట్టారు. అయినా కనుచూపు మేరలో న్యాయం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల తౌషిక్ తల్లి మౌలాబి అర్ధరాత్రి శ్మశాన వాటికకు వెళ్లి కుమారుడి సమాధిపై పడి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. బుధవారం కనిగిరిలోని ఒక మూడంతస్తుల బిల్డింగు ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేగింది. నెల రోజులుగా ఆ ఇంట్లో సంతోషం లేదు. రంజాన్ పండుగ సందడి లేదు. ఆ తల్లిదండ్రులు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
కల్లూరివారిపాలెంలో పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ.6 లక్షల ఆస్తి నష్టం పొన్నలూరు: మండలంలోని కల్లూరివారిపాలెం గ్రామంలో కల్లూరి దిబ్బయ్య, మువ్వా శ్రీనివాస్రెడ్డి, జొన్నకూటి పెదచెన్నయ్య, అంబారపు వెంకటస్వామికి చెందిన ఉమ్మడి పొగాకు బ్యారన్ శనివారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం వలన సుమారు 1200 పొగాకు కర్రలు, బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో దాదాపుగా రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. -
కరుణించు ఖుదా..
ఒంగోలు ఈద్గా మైదానంలో ప్రార్థన చేస్తున్న ముస్లింలుపొదిలిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలుఒంగోలు టౌన్: దేశ ప్రజలందరినీ కరుణించు ప్రభు... ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఖుద్బా ప్రసంగం చేసిన మౌలానా రంజాన్ మాసం విశిష్టతను వివరించి చెప్పారు. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు నిష్టగా పాటించిన ఉపవాస దీక్షల స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సమాజంలోని పేదలను ప్రేమగా దగ్గరకు తీయాలని, అభాగ్యులను, అనాథలను ఆదరించి అక్కున చేర్చుకోవాలని చెప్పారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చదివించాలని ఉన్నత స్థానాలనధిరోహించేలా ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం జరిగిన దువాలో దేశ ప్రజల మధ్య సహోదర భావాన్ని పెంపొదించాలని, కులమతాలకతీతంగా ప్రజలందరిపై వరాల వసంతాన్ని కురిపించాలని అల్లాహ్ను వేడుకున్నారు. యుద్ధంలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు నలిగిపోకుండా రక్షించాలని, ప్రపంచ శాంతిని ప్రసాదించాలని కన్నీటితో దువా చేశారు. ఆలింగనంతో ఈద్ ముబారక్ చెప్పుకుంటున్న చిన్నారులు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు ఒంగోలులోని 22 మసీదులతో పాటుగా ఈద్గా మైదానంలో ప్రత్యేక నమాజు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపిన వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు, నాయకులు అలాయ్ బలాయ్ చేసుకొని సోదర భావం చాటుకున్న హిందూ, ముస్లింలు -
యుద్ధంపై పాలకుల మౌనం క్షమార్హం కాదు
ఒంగోలు టౌన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం పట్ల మన దేశ పాలకులు వ్యూహాత్మకంగా మౌనం పాటించడం క్షమార్హం కాదని జనసాహితి జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణయ్య స్పష్టం చేశారు. అంతర్జాతీయ కవితా దినాన్ని పురస్కరించుకొని ఎన్జీవో హోంలో శనివారం సామ్రాజ్యవాద యుద్ధంపై కవితాస్త్రాలు పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ అంతులేని పెట్రో దాహంతో , ఆయుధ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టేందుకు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ప్రపంచ ప్రజలపై యుద్ధాన్ని రుద్దుతున్నాయని మండిపడ్డారు. యుద్ధ ప్రభావం మన దేశంపై తీవ్రంగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని తెలిపారు. ఇప్పటికే మనదేశంలో వంటగ్యాస్ ధరలు పెంచారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెట్రోలు ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పారు. గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్లు మూతపడుతున్నాయని, దీంతో వందలాది మంది హోటల్ కార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు పెట్రోలు ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడం ఖాయమన్నారు. యుద్ధం పేదరికాన్ని మరింతగా పెంచుతుందని, ఆకలి చావులకు కారణమవుతుందన్నారు. యుద్దాన్ని ఖండించాల్సిన కేంద్రంలోని మోదీ సర్కార్ మౌనం పాటించడం బాధాకరమన్నారు. అనంతరం అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవిబాబు అనువదించిన ఆంగ్ల కవితల సంపుటి ‘కలమే నా ఆయుధం’ పుస్తకాన్ని కవి, రచయిత ఎస్ఎస్ హుస్సేన్ పరిచయం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన కవిత్వాన్ని అనువదించిన కొత్తపల్లి రవిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎజ్రాశాస్త్రి, రవికుమార్, కోటేశ్వరమ్మ, ఎంఏ సాలార్, ఎస్.లలిత కుమారి, ప్రసన్న, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏసుదాసు, డీవీ ఖాదర్ బాషా, యోహాన్రెడ్డి పాల్గొన్నారు. -
నేలకొరిగిన అరటి పంట
పెద్దారవీడు: మండల కేంద్రమైన పెద్దారవీడులో శుక్రవారం అకాల వర్షం, ఈదురు గాలులు కారణంగా అరటి చెట్లు నెలకొరిగాయి. గ్రామానికి చెందిన రైతు అల్లు వెంకటరెడ్డి సాగు చేసిన 2 ఎకరాల అరటి పొలంలో సాగు చేశానని, పంట చేతికి అందే సమయంలో వడగండ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు ఎక్కువగా రావడంతో పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 చెట్లు నేలకు కూలడంతో దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రస్తుతం అరటి పంట పూత, కాయ దశలో ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి అదుకోవాలని రైతు కోరారు. -
పసి ప్రాణం.. కోరుతోంది న్యాయం
ఒంగోలు టౌన్: సింగరాయకొండ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లో చదువుతున్న సయ్యద్ తౌషిక్ చనిపోయి నెల రోజులు దాటింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లాడు..అమ్మకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకొని రమ్మంటూ అడిగిన పసివాడు ...కళ్లు మూసి తెరచేలోపే నిముషాల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం ఏ తల్లిదండ్రులకైనా ఎలా నమ్మబుద్ధవుతుంది. పాపం పుణ్యం తెలియని బాలుడు, కల్లా కపడం ఎరగని చిన్నారి, మాయా మర్మంలేని పిల్లాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఎవరైనా ఎలా నమ్మగలరు. తౌషిక్ను చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తౌషిక్ను హత్య చేశారని లోకం కోడై కూస్తోంది. కానీ పోలీసులు మాత్రం తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నందు వల్లనే చనిపోయాడని ప్రకటించారు. నెల రోజులుగా ఆ తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. తన బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కనిపించిన అధికారికి దండం పెట్టి వేడుకుంటున్నారు. అయితేనేం పట్టించుకునే నాథుడే లేడు. పరామర్శించే నాయకుడే లేడు. తౌషిక్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదు... చిన్నారి తౌషిక్ అనుమానాస్పదంగా మరణించింది సింగరాయకొండలోని పాఠశాలలో. ఇది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు నియోజకవర్గం పరిధిలో ఉంది. కన్నీరు మున్నీరవుతున్న బాలుడి తల్లిదండ్రులను ఆయన పరామర్శించలేదు. నెల రోజులుగా ఆ పసిబాలుడి తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పలకరించని ఉగ్ర... మృతుడు తౌషిక్ స్వగ్రామం కనిగిరి. తండ్రి సయ్యద్ అలీ కారు డ్రైవర్. తల్లి మౌలాబీ సాధారణ గృహిణి. తౌషిక్ అనుమానాస్పద మృతిపై కనిగిరిలో మతాలకతీతంగా ప్రజలు భారీ ర్యాలీ చేశారు. అయినప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాత్రం కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని వెళితే కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖుల ఆదేశాలతోనే కేసు పక్కదారి... శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి అధికార పార్టీకి చెందిన ఒక నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సదరు నేత పోలీసులకు ఫోన్ చేసినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. అలాగే తౌషిక్ మృతి చెందిన రోజే పోలీసులకు జిల్లాకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి నుంచి కూడా ఫోన్ వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. తౌషిక్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ అదే రోజు బాలుడి తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట రోడ్డు మీద పడుకొని నిరసనకు దిగారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. అధికార పార్టీకి చెందిన వారు ఫోన్ చేయడంతో సింగరాయకొండ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడని, తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎలా చెబుతాడని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తౌషిక్ మృతిపై విచారణాధికారిగా కందుకూరు సీఐ అన్వర్ బాషాను నియమించారు. అధికారి మారినప్పటికీ పోలీసులు మాత్రం ఆత్మహత్య కోణం నుంచే విచారణ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుండడం గమనార్హం. చివరికి వారి అనుమానాలు నిజమయ్యాయి. విచారణ పూర్తి కాకుండానే తౌషిక్ ఆత్మహత్య చేసుకొని మరణించాడని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రకటించారు. చిన్నారి తౌషిక్ మరణించి నెలరోజులు దాటినా పరామర్శించడానికి మనసురాని మంత్రి, ఎమ్మెల్యే న్యాయం కోసం పోరాడుతున్నా నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయడానికి వెనకాడుతున్న పోలీసులు విచారణ కొనసాగుతుందంటూనే తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించిన డీఎస్పీ 11 ఏళ్ల చిన్నారి మృతిపై న్యాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకేం న్యాయం చేస్తుందని బాధితుల ప్రశ్న -
రామతీర్థంలో ప్రభ ఏర్పాటుకు బూచేపల్లి, మేరుగు పూజలు
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ ప్రభ పనులు ప్రారంభించడానికి శ్రీమోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 31వ తేదీ చీమకుర్తిలో మందిరాలు, ఏప్రిల్ 1వ తేదీ రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల నిర్వహిస్తారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గంగమ్మతల్లి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రభ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్రెడ్డి, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, యన్నం శేషురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నపల్లి నాగేశ్వరరావు పిన్నిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల వలంటరీ వింగ్ అధ్యక్షుడు చౌడారెడ్డి, కౌన్సిలర్ శేషాద్రి, నల్లూరి చంద్ర, ప్రతాప్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ఉప్పలపాటి వెంకటరావు, ప్రసాదరెడ్డి, చంద్ర, చిన్నికృష్ణ, లక్ష్మిరెడ్డి, అన్ను రాంబాబు, మక్కెన రాజేంద్ర, రావి లక్ష్మయ్య, ఖజా తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం..అపార నష్టం
మర్రిపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మర్రిపూడి మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాకర్ల, చిలంకూరు, శివరాయునిపేట తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో సాగుచేసిన లేత పొగాకు పూర్తిగా దెబ్బతిని పంట నేలకు ఒరిగింది. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో ఇళ్ల రేకులు పైకప్పులు లేచిపోయాయి. చెట్లు వేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు పడి సరఫరా నిలిచిపోయింది. చిమట, కాకర్ల గ్రామాల్లోని బ్యారన్ రేకులు ఎగిరి దూరంగా పడిపోయాయి. దీంతో క్యూరింగ్ జరుగుతున్న బ్యారన్లో పొగాకు పూర్తిగా తడిసిపోయింది. ఆయా గ్రామాల్లో దాదాపు రూ.2.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకర్ల గ్రామానికి చెందిన మొల్లల సుబ్బారెడ్డి, మనోహర్రెడ్డిలకు చెందిన ఒక్కో బ్యారన్లో 1200 పొగాకు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా రేకులు ఎగిరిపోయి, ఆకు తడిసిపోయింది. అలాగే చిమట గ్రామానికి చెందిన గంగిరెడ్డి మూడవ బ్రహ్మారెడ్డి, వెలుతుర్ల మాలకొండయ్య, భూంపల్లి రమణయ్య, రాగిపిండి శ్రీను, పులిచర్ల వెంకటసుబ్బయ్యలకు చెందిన బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా విపరీతంగా వీచిన గాలులకు బ్యారన్ పై కప్పులు లేచి దూరంగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు సుమారు రూ.1.5 లక్షల చొప్పున సుమారు రూ.11 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. -
రెడ్డి హాస్టల్లో అభివృద్ధి పనులు అభినందనీయం
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లో గురువారం రాత్రి నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మంచి చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దలు, దాతలను కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రొఫెసర్ డి.వెంకటేశ్వరరెడ్డి, హాస్టల్ కార్యదర్శి ఆదిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ఒంగోలు సిటీ: ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు, కొండపి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్లు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్లు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, కనిగిరి, ఒంగోలు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవిబాబు, డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టంగుటూరు: సింహపురి ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ ఫీజులు వసూలు చేసే క్రమంలో ప్రతి రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహదారులు, అత్యవసర పనుల నిమిత్తం పోయే వారు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. టంగుటూరు వైపు నుంచి ఒంగోలుకు అత్యవసర స్థితిలో ఉన్న రోగిని తరలించే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత వలన ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. నిత్యం ఇదే తీరు కొనసాగుతోంది. అధికారులు స్పందించి టోల్ ప్లాజా యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
కనిగిరిలో శ్మశాన రణం
కనిగిరిరూరల్: కనిగిరి పట్టణంలో వాల్మీకి బోయకులస్తుల శ్మశాన వివాదం శుక్రవారం పోలీసులు, అధికారులు తీరుతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ కులానికి చెందిన సీ అంజమ్మ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఆ సామాజికవర్గం వారు గురువారం రాత్రంతా జాగారం చేశారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి శ్మశానవాటికగా ఉపయోగిస్తున్న స్థలంలోనే తాము ఖననం చేస్తామని భీష్మించారు. రాత్రంతా హైవే పక్కనే శవాన్ని పెట్టుకుని జాగారం చేస్తూ నిరసన తెలిపారు. అయితే ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని.. రిజిస్టర్ భూమి అని, సర్వే నం 554లోని భూమిలో ఖననం చేయడానికి కుదరదంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న సంగతి విదితమే. తోపులాట..ఆర్తనాదాల మధ్య మృతదేహం తరలింపు.. వాస్తవం ఏమిటీ..తెరవెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే.. పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందన్న చర్చ నడుస్తోంది. భారీగా పోలీసులను మోహరించారు. కనిగిరి డివిజన్తో పాటు, ఇతర మండలాలకు చెందిన ఎస్సైలు, పోలీసులు, ప్రత్యేక బలగాలు వచ్చాయి. పది నిమిషాలు బాధిత వ్యక్తులతో మాట్లాడిన పోలీసులు హఠాత్తుగా వారిని నెట్టేసి మృతదేహాన్ని మున్సిపల్ ట్రాక్టర్లో ఎక్కించారు. ఈ క్రమంలో వాల్మీకి బోయకులస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్సై, పోలీసులు, వాల్మీకి బోయకులస్తులను నిర్ధాక్షణ్యంగా పక్కకు నెట్టి మృతదేహం ఉన్న ట్రాక్టర్ను పట్టణంలోని గార్లపేట రోడ్డులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. ఈక్రమంలో మృతురాలు అంజమ్మ కోడలికి, బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులను పెట్టి తోసేశారు. పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్మశాన వాటిక వద్ద నిరసన.. మృతురాలు అంజమ్మ బంధువులు కొందరు హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. తమకు చేసిన అన్యాయం, పాపం ఊరికే పోదని మృతురాలి బంధువులు దుమ్మెత్తి పోశారు. కనీసం మట్టి కూడా ఇవ్వకుండా ఖననం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము బీసీ సామాజిక వర్గానికి చెందిన వారం అని తీవ్ర అన్యాయం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సొంత బంధువులు వచ్చి.. అంత్యక్రియలు చేసుకోవాలని అధికారులు చెప్పారు. పోలీస్ పహారా.. అంజమ్మ భౌతిక కాయాన్ని తీసుకెళ్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు బోయపాలెం నుంచి ఎవరూ రోడ్డు మీదకు రాకుండా పోలీస్ పహారా పెట్టారు. సుమారు 30 మంది పోలీసులు, మహిళా పోలీసులు 9వ వార్డు బోయపాలెం కాలనీ ప్రధాన రహదారికి అడ్డంగా నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. కాగా.. రెండ్రోజుల నుంచి ఘటన ఏరియాలో కనిపించని రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్మశాన వాటిక స్థలం వద్ద ప్రత్యక్షమైనట్లు తెలిసింది. సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.. వాస్తవానికి వాల్మీకి బోయ కులస్థుల శ్మశాన వాటిక స్థలం సమస్య కొంత కాలం నుంచి ఉన్నా.. ఈ రెండేళ్లలో తీవ్ర జటిలంగా మారి రచ్చకెక్కుతోంది. అలాంటి సమయంలో క్షేత్ర స్థాయి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య మరింత తీవ్రం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భూ రిజిస్టర్ పట్టాదారుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం సర్వే నంబర్ 554లో తమకు రిజిస్టర్ అయిన భూమిలో కొందరు వ్యక్తులు అంత్యక్రియలు, ఖనన కార్యక్రమాలు చేసేందుకు వస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రిజిస్ట్రేషన్దారుడు గురువారం ఫిర్యాదు చేశాడు. శాంతిభద్రతల సమస్య రాకుండా ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం. – ఉప్పు శ్రీనివాసులు, సీఐ -
ఘనంగా జాళ్లపాలెం తిరునాళ్ల
కొండపి: మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్న మఠంగా ప్రసిద్ధిగాంచిన జాళ్లపాలెం గ్రామంలో ఏటా ఉగాది రోజున తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. హోమగుండంలో కొబ్బరి చిప్పలు వేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చూండూరి రవిబాబు, సీఈసీ సభ్యుడు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు నడిపింది. పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ, మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేశారు. డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొండపి సీఐ సోమశేఖర్ సహ ముగ్గురు సీఐలు, ఎస్సై ప్రేమ్కుమార్ సహా 11 మంది ఎస్సై లు, 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
వైభవంగా ప్రారంభమైన వసంత నవరాత్రులు
త్రిపురాంతకం: ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన వేదపండితుడు నాగఫణిశాస్త్రి, అర్చకుడు ప్రసాదశర్మ పూజలు, కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పల్లకి సేవ, రాత్రి పద్మవాహనంపై అమ్మవారి ఉత్సవం నిర్వహించారు. అలాగే పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి గ్రామోత్సవం వైభవంగా సాగింది. అర్చకుడు విశ్వనారాయణశాస్త్రి పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. భక్తులు గ్రామ కూడళ్లలో పందిళ్లు వేసి స్వామివారిని సాదరంగా ఆహ్వానించారు. భక్త బృందాల కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయాల ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
జగనన్న పాలనలో యాదవులకు సముచిత స్థానం
పెద్దారవీడు: రాష్ట్రంలో అన్ని విధాలా యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలో నల్లమల అడవిలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి తిరునాళ్ల సందర్భంగా బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ మాదిరిగానే యాదవుల సంక్షేమానికి వైఎస్ జగన్ కృషి చేశారన్నారు. యాదవులకు నామినేటెడ్ పదవులివ్వడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి కృషి చేసింది జగనన్న మాత్రమేనన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీసీలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఇంగ్లిష్ మీడియం చదువులు, ట్యాబ్లు అందడం లేదని, మధ్యాహ్నం భోజన పథకాన్ని సైతం నీరుగార్చారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఐక్యరాజ్య సమితి వేదికపై బీసీ బిడ్డలు అనార్గళంగా ఇంగ్లిష్లో ప్రసంగించింది జగనన్న పాలనలోనే అని గుర్తు చేశారు. జగన్నన్నను మరోమారు సీఎంగా చేసుకుంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా పట్టించుకున్న నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో యాదవుల కల్యాణ మండపం కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తే, ఆ ఫైల్ను నేడు తొక్కిపెట్టారన్నారు. వైఎస్ జగన్ కాగానే కాటమరాజు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, జగనన్నతోనే ఆ పనులకు శంకుస్థాపన చేయిస్తామని పేర్కొన్నారు. యాదవులంతా వైఎస్ జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అధికారం వెలగబెట్టిన టీడీపీ ప్రభుత్వం.. చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో సూపర్సిక్స్ అంటే మైన్స్, మగువ, మద్యం, ల్యాండ్స్, గంజాయి, డ్రగ్స్, డ్యాన్స్లు చేయడమేనని ఎద్దేవా చేశారు. కాటమరాజుస్వామి ఆలయ భూములను టీడీపీ నాయకులు తమ పేరుపై ఎక్కించుకుని ప్రభుత్వం నుంచి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. వైపాలెం నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమార్జనే లక్ష్యంగా ఇసుక, మట్టి మాఫియా చెలరేగుతోందని, ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మరీ లూటీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే కాటమరాజుస్వామి దేవాలయం అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. యాదవులపై ఎంతో ప్రేమతో కాటమరాజుస్వామిపై ట్వీట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగలు, దోపిడీదారుల ప్రభుత్వాన్ని గంగలో కలిపేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. యర్రగొండపాలెం గడ్డపై మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జురెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విధానాలను తూర్పారబట్టారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కఠారి శంకర్, వైఎస్సార్ సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణయాదవ్, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి ఏరువ శేషశయనారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తోకల ఆవులయ్య, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా ఎల్లేష్యాదవ్, దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం ముత్యాలయ్య, మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్యాదవ్, మాజీ సర్పంచ్లు గుమ్మా రాజయ్యయాదవ్, ఈర్ల రాజశేఖర్యాదవ్, పార్టీ నాయకులు ఒంటేరు నాగేశ్వరరావుయాదవ్, సుబ్బయ్య యాదవ్, గుమ్మా రామాంజనేయయాదవ్, నాలి కొండయ్యయాదవ్, మురారి గాలెయ్యయాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాటమరాజు ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి పూజలు హాజరైన ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యేలు అన్నా, కేపీ -
జిల్లా క్రీస్తు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని హవేలీ ఫంక్షన్ హాల్లో మార్కాపురం జిల్లా క్రీస్తు సంఘ ఐక్యవేదిక చారటబుల్ ట్రస్టు సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘ సువార్తీకులు 150 మంది హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడిగా నియమితులైన చాట్ల గంగయ్య తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా సింగ రాజేష్, ఉపాధ్యక్షులుగా గొంగటి ఏలియా, దర్శనం సుధీర్ బాబు, గుర్రంబాబు, కార్యదర్శులుగా ముటుకూరి దేవదానం, వేశపోగు భరత్, ఎనిబెర అచ్చయ్య, గుర్రం శరత్బాబు, కోశాధికారి బూదాల అశోక్కుమార్, ఈసీ మెంబర్లుగా పల్లె బాబు, దర్శి షాలెం రాజు, ఇంటూరి జయరాజు, పుప్పాల డేవిడ్, గౌరవ అధ్యక్షులుగా వంకాయలపాటి జర్మియ, చిలకా ఇజ్రాయేలు, రావినూతల సుధాకర్రావు, వేశపోగు బాలు దర్శనం పెద్ద యేసయ్య, గౌరవ సలహాదారులుగా కొంగలేటి సోలోమన్ రాజు, నన్నేపోగు సుందర్రాజు, వంకాయలపాడి డేవిడ్రాజు, గంగవరపు డేవిడ్ ఎన్నికై నట్లు పేర్కొన్నారు. ఒంగోలు సబర్బన్: విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో ఒంగోలు నగరంలో వార్డు సెక్రటరీలుగా పనిచేస్తున్న ఇద్దరికి చోటు దక్కింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పిట్టు రవికుమార్ రెడ్డి, వేల్సూరి హరిబాబు గురువారం ఓ ప్రకనటలో పేర్కొన్నారు. తమ నియామకానికి సహకరించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీలో స్థానం దక్కించుకున్న ఇద్దరిని ఒంగోలు నగర పాలక సంస్థ వార్డు సెక్రటరీల అసోసియేషన్ నాయకులు అభినందించారు. -
తౌషిక్ అనుమానాస్పద మృతి కేసు.. శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు
ఒంగోలు సిటీ: సింగరాయకొండలోని మూలగుంటపాడులో శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ.. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వ తేదీన త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలలో త్రీమెన్ కమిటీ చేపట్టిన విచారణలో పలు అవకతవకలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆ పాఠశాల గుర్తింపును 2026–2027 విద్యా సంవత్సరం నుంచి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్యం వివరణ ఇవ్వని కారణంగా గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. ● చిరుత దాడి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక పెద్దదోర్నాల: చిరుతపులి దాడిలో గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న చిన్నారుట్ల గిరిజన తండాకు చెందిన బాలికకు అటవీశాఖ అధికారులు రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. గురువారం నెక్కంటి ఫారెస్ట్ రేంజి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారుట్లకు చెందిన కుడుముల అంజలి తల్లి లింగేశ్వరికి నష్టనరిహారం చెక్కు అందజేశారు. గత ఏడాది ఆగస్టు నెల 13వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులు కుడుముల అంజయ్య, లింగేశ్వరితో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల బాలిక అంజమ్మ తలను నోట కరుచుకుని చిరుత అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేసి అడ్డుకున్నారు. నాటి నుంచి చిన్నారి అంజమ్మకు వైద్య చికిత్స చేయించిన అధికారులు గురువారం నష్టపరిహారం అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అఫీసర్ వెంకటయ్య, బీట్ ఆఫీసర్ మదన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: దారి తప్పిన ఓ చుక్కల దుప్పి జనావాసాల మధ్యకు ప్రవేశించింది. ఈ సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి జింకలు, దుప్పులు తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ క్రమంలో దారి తప్పిన ఓ చుక్కల దుప్పి మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు దాటి అర్ధరాత్రి వేళ పట్టణంలోకి ప్రవేశించింది. ఇందిరానగర్, ఫారంబజార్, శ్రీశైలం బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన చుక్కల దుప్పి ఎట్టకేలకు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ అధికారి హరి మాట్లాడుతూ.. అడవిలో అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులు జనావాసాల మధ్యకు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో అడవుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. ఒంగోలు: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో అంపైర్ల కొరతను అధిగమించేందుకు ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా నార్త్ జోన్ అకాడమీలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 ఏళ్లలోపు వయసు కలిగి స్థానిక క్రికెట్ టోర్న మెంట్లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఉన్న వారు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా తమ వివరాలను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెయిల్ ఐడీ pdcaongole@gmail. comకు పంపాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు ఏసీఏ ఆధ్వర్యంలో ఉచిత వసతి కల్పించడంతోపాటు ప్రయాణ ఖర్చులు అందిస్తారని తెలిపారు. వివరాలకు 9246222999ను సంప్రదించాలని సూచించారు. -
ఐపీఎల్ నాటికి బెట్టింగ్ను కట్టడి చేస్తాం
దర్శి: క్రికెట్ బెట్టింగ్ వలలో చిక్కుకుని అప్పులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. రానున్న ఐపీఎల్ సీజన్ నాటికి బెట్టింగ్ను పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పారు. బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలైన కొందరు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న వైనంపై ‘బెట్టింగ్ వల ప్రాణాలు విలవిల’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ప్రకాశం జిల్లా పోలీసులు స్పందించారు. బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు అనుమానం ఉన్న యువత కుటుంబ సభ్యులకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. చెడు స్నేహం, పిల్లలకు బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే మందలించాలని సూచించారు. తప్పని తెలియక, బెట్టింగ్రాయుళ్ల మాయమాటలు నమ్మి ఒకటీరెండు సార్లు పందెం కాసిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నామన్నారు. వారు మళ్లీ బెట్టంగ్లో పాల్గొన్నట్లు గుర్తిస్తే కటకటాల వెనక్కు నెడతామని చెప్పారు. బెట్టింగ్ను ఆదాయ మార్గంగా ఎంచుకుని యువతను ఆ ఊబిలోకి దించి, వారి జీవితాలు నాశనం చేస్తున్న వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెట్టింగ్ రాకెట్ను ఛేదించేందుకు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న నలుగురు నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు పరిశీలించి, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. రెండు లేదా మూడు రోజుల్లో బెట్టింగ్ రాకెట్ నిందితుల వివరాలు రాబడతామన్నారు. కార్యక్రమంలో సీఐ రామారావు, ఎస్సైలు శివ, మల్లికార్జున్ పాల్గొన్నారు. బాధితులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు బెట్టింగ్ రాకెట్ సూత్రధారులను వదిలే ప్రసక్తే లేదు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ -
పర్యవేక్షణ భారం!
దేవుడిపైనే మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ఏర్పడి మూడు నెలలు అవుతున్నా దేవదాయ ధర్మాదాయ శాఖలో నేటికీ జిల్లా స్థాయి అఽధికారులను నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లాలో పలు శాఖలకు ఉన్నతాధికారులుగా ఇన్చార్జిలను నియమించి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే దేవదాయ శాఖకు మాత్రం కేవలం కార్యాలయ బోర్డు ఏర్పాటు చేసి అధికారిని నియమించకపోవడంతో ప్రజలు, పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లాను ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్గా ఎవరిని నియమించకపోవడంతో పనుల నిమిత్తం ఇక్కడి ప్రజలు ఒంగోలు ఏసీ కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. దేవదాయ శాఖ సిబ్బంది సైతం తమ సర్వీసు రికార్డులు, ఎన్ఓసీలు, సమస్యల పరిష్కార నిమిత్తం పొలోమంటూ ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈఓల పరిధిలోని ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలను కలుపుకొని సుమారుగా 470 వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, మార్కండేశ్వరస్వామి ఆలయం, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపురసుందరీదేవి ఆలయాలు, రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం, కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, పొదిలిలోని నిర్మమహేశ్వర ఆలయం, సీఎస్ పురంలోని భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణకు ఇప్పటి వరకు దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించాలని ప్రజలతో పాటు ఆ శాఖ సిబ్బంది కోరుతున్నారు. -
ప్రొటోకాల్ మరిచిన అధికారులు
మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ విస్మరించారు. పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అధికారులు టీడీపీ ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీల్లో ప్రచురించి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటోను పెట్టలేదు. ఈ సంఘటన పలు విమర్శలకు తావిస్తోంది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం పక్క నియోజకవర్గమైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో పెట్టకుండా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రం ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. పొరపాటున చేశారా.. కావాలనే చేశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కావడంతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు సబర్బన్: దైవానుగ్రహంతో జిల్లా సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు ఉద్బోధించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి స్వామిలతో పాటు కలెక్టర్ పి.రాజాబాబు దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మంగళ వాయిద్యాలతో అధికారులు, నాయకులకు స్వాగతం పలికారు. ప్రముఖ వేద పండితుడు దక్షిణామూర్తి సంవత్సర పంచాంగ శ్రవణం చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. వట్యం నాగేశ్వర విశ్వనాథ శర్మ, నాదెండ్ల నాగేశ్వరరావు, నడింపల్లి లక్ష్మీనారాయణ, పరాంకుశం శ్రీనివాసచార్యులకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ తరఫున ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వేదపండితులు షడ్రుచుల ఉగాది పచ్చడి అందజేశారు. వేడుకల్లో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఇంటర్ మూల్యాంకనణం ఈ నెల 21వ తేదీ నుంచి నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ శనివారం నుంచి ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ, హిందీ, ఒకేషనల్కు చెందిన ఇంగ్లిష్, జీఎఫ్సీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సీఎస్ఈ, లే, ఎల్ఎండీ కోర్సుల మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్జెక్టులకు సంబంధించిన చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు తప్పక హాజరుకావాలన్నారు. 22వ తేదీన ఈ సబ్జెక్టులకు సంబంధించిన స్క్రుటినైజర్లు హాజరుకావాలన్నారు. అన్ని రకాల యాజమాన్యాల ప్రిన్సిపాళ్లు ఇంటర్ బోర్డు నుంచి ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఒక్కరినీ రిలీవ్ చేయాలని కోరారు. ఉత్తర్వులు అందుకొని మూల్యాంకనానికి గైర్హాజరైన సంబంధిత కళాశాల యాజమాన్యంపై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
అకాల వర్షాలు
ఉమ్మడి జిల్లాలో ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం, మర్రిపూడి, కొనకనమిట్ల, బల్లికురవ, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మార్చిలో 38 డిగ్రీలకు సెల్సియస్కు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగుపాటు, ఈదురుగాలులు... వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులతో బుధవారం రాత్రి నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. కనిగిరి ప్రాంతంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి. దర్శి ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. త్రిపురాంతకం: అకాల వర్షాలకు మండలంలోని సోమేపల్లి గ్రామానికి చెందిన దూళ్ల గాలెయ్య, ఎం కోటేశ్వరరావు. డి.ఆంజనేయులకు చెందిన 8 ఎకరాల్లో అరటి చెట్లు పూర్తిగా విరిగిపడ్డాయి. దీంతో సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు సమీపంలోని పొలాల్లో తాటి చెట్టు గుబురుపై బుధవారం రాత్రి పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. అయితే అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న మిరప తోటల్లో కూలీలు ఇంటికి రావడంతో ప్రమాదం తప్పింది. పొదిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఓ మోస్త్తరు వర్షం కురిసింది. ఈగలపాడు, పాములపాడు, జువ్వలేరు, కుంచేపల్లి గ్రామాల్లో 20 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రైతులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో గాలులతో వడగండ్లు పడ్డాయి. జువ్వలేరులో బొప్పాయి తోటలకు కొంత మేర నష్టం వాటిల్లింది. -
స్పెషలాఫీసర్గా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పి. రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఈ నెల 17వ తేదీతో ముగియడంతో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ ప్రతిష్టతను పెంచడంతో పాటు నగర పౌరులకు మెరుగైన సేవలందేలా కృషి చేస్తామన్నారు. అమృత్ పథకం కింద ఒంగోలు నగరంలో రూ.450 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ పనులు ఏడాది కాలంలో పూర్తి చేస్తే నగర ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. నగర అభివృద్ధితో పాటు రెవెన్యూ రాబడిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ వైష్ణవి, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. -
అంత్యక్రియలు చేయొద్దు..
అది ప్రైవేట్ స్థలం..కనిగిరిరూరల్: ప్రైవేట్ స్థలంలో అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుకోవడంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన చొప్పరపు అంజమ్మ(70) గురువారం మృతి చెందింది. అంజమ్మకు ఖనన, అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్మీకి బోయకులస్తులంతా పురాతన కాలం నాటి శ్మశాన వాటిక వద్దకు తీసువెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అది ప్రైవేట్ స్థలమని, అక్కడ అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే తాతల కాలం నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకోవడానికి మీరెవరంటూ వాల్మీకి బోయకులస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 4 గంటల పాటు వాల్మీకి బోయ కులస్తులు మృతదేహంతో నిరసనకు దిగారు. ప్రభుత్వ, అధికారుల తీరుపై వాల్మీకి బోయకులస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు అంజమ్మ అంత్యక్రియలు జరిగాయి. వాల్మీకి బోయ కులస్తులేమంటున్నారంటే.. ‘మా తాత ముత్తాల కాలం నాటి నుంచి సర్వే నెంబర్ 554లోని భూమిలో వాల్మీకి బోయ కులస్తుల శ్మశాన వాటిక ఉంది. ఆ సర్వే నెంబర్లోని సుమారు 5 ఎకరాల భూమిలో దాదాపు 50 సెంట్ల స్థలంలో ఎప్పటినుంచో అంత్యక్రియల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ధరలు పెరగడంతో కొందరు రియల్ వ్యాపారులు అధికార పార్టీ నేతల అండతో ఆ భూమిలో అడుగు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని’ వాపోయారు. ఇప్పటికే మాపై కేసులు పెట్టారని, శ్మశానాన్ని రాత్రికి రాత్రి పెకలించారని, ఇటీవల శ్మశాన వాటికను చదును చేసేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. అందుకు వ్యతిరేకంగా గతంలో నిరసన ర్యాలీలు కూడా చేశామని వివరించారు. శ్మశాన వాటిక ఉన్న స్థలం సుమారు రూ.2 కోట్లపైనే పలుకుతుండటంతో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే రియల్ వ్యాపారులు అధికార పార్టీ అండతో తమ పై దౌర్జన్యం చేస్తున్నారని వాల్మీకి బోయ కులస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా వారికి మద్దతుగా ఉన్నారని వాపోయారు. శ్మశాన వాటిక భూమి మట్టిని ల్యాబ్ పరీక్షలు నిర్వహస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, వందల ఏళ్ల నుంచి అక్కడ శ్మశాన వాటిక ఉందని వాల్మీకి బోయకులస్తులు వాపోతున్నారు. అధికారులు ఇలా.. అయితే అధికారులు మాత్రం శ్మశాన వాటిక స్థలం ప్రైవేటు వ్యక్తుల భూమిగా, రిజిస్టర్ ల్యాండ్గా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక స్థలం కాకుండా.. మరో రెండు మూడు చోట్ల ప్రదేశాలు చూపిస్తున్నారు. కానీ వాల్మీకి బోయకులస్తులు దానికి అంగీకరించడం లేదు. పూర్వీకుల కాలం నాటి శ్మశాన వాటికలో తాము అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్తున్నారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం.. బాధిత వాల్మీకి బోయకులస్తులతో మాట్లాడుతున్నామని.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
పశ్చిమాసియా యుద్ధం సెగ మన వంటింటిని తాకింది. గ్యాస్ కంపెనీ ఏజెన్సీలు, అధికారులతో కుమ్మకై ్క చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్యాస్ కొరతను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలించి డొమెస్టిక్ సిలిండర్ రూ. 3600, కమర్షియల్ సిలిండర్ రూ. 5000 వరకూ విక్రయిస్తున్నారని సమాచారం. బ్లాక్లో సిలిండర్లను కొనలేక ఇటు ప్రజలు, అటు వ్యాపారస్తులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో పలు చోట్ల హోటళ్లు, కర్రీ పాయింట్స్ మూతపడ్డాయి. ఇడ్లీ, దోశలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న మధ్య తరగతి, చిరువ్యాపారుల ఉపాధికి గండి పడుతోంది. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు చేయడం గమనార్హం. యుద్ధం మొదలైన రోజు నుంచే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలు నిలిపివేసినట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఏజెన్సీలు కమర్షియల్ గ్యాస్ లేదని చేతులెత్తేశారు. అదే సమయంలో నల్లబజారు తలుపులు తెరుచుకున్నాయి. బ్లాక్ మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సిలిండర్లు లభ్యమవుతున్నాయి. యుద్ధానికి ముందు వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1982 ఉండగా యుద్ధం మొదలయ్యాక కేంద్రం రూ.115 పెంచడంతో ప్రస్తుతం రూ. 2.097లకు చేరుకుంది. అయితే ఏజెన్సీలు కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోవడంతో నల్లబజారులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.4500 నుంచి రూ. 5000కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.గ్యాస్ మాటలుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మూడు స్టార్ హోటళ్లతో పాటుగా 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 150 నుంచి 200 బడా హోటళ్లున్నాయి. ఇవి కాకుండా వీధి వీధికొకటి చొప్పున వెలిసిన చిన్న చిన్న హోటళ్లు మరో 1000కి పైగానే వున్నాయి. ఇళ్ల దగ్గర ఇడ్లీ, దోశలు వేసి అమ్ముకునే వాళ్లు మరో 500 మంది వరకు ఉన్నారు. 1200 నుంచి 1500 టీ స్టాల్స్ ఉన్నాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద న్యూడిల్స్ పాయింట్లు, చికెన్ పకోడి బండ్లు సుమారు 200 పైమాటే. ఇక కేటరింగ్లకు లెక్కలేదు. ఒక్కో స్టార్ హోటల్లో రోజుకు 10కి పైగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుంటారు. రెస్టారెంట్లలో నిత్యం 6 నుంచి 8 గ్యాస్ సిలిండర్లు పనిచేస్తూనే ఉంటాయి. రోజుకు సుమారు 10,200కు పైగానే గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 10 వేలకు పైగానే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. అయితే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాలుగు రోజల తర్వాత గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కావలసినప్పుడల్లా లభించే గ్యాస్ సిలిండర్లను రాత్రికి రాత్రే నల్లబజారుకు తరలించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించి అడ్డగోలు సంపాదనకు తెరదీశారని మండిపడుతున్నారు. వంటింకి మంట.. ప్రకాశం జిల్లాలో 5,51,759, మార్కాపురం జిల్లాలో 3,22,279 గృహ వినియోగదారులు ఉన్నాయి. ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 9,875 సిలిండర్లు అవసరం ఉండగా డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు సిద్ధం ఉన్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు ప్రకటించారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు, మార్కాపురంతో పాటుగా అనేక మండల కేంద్రాల్లో డొమోస్టిక్ గ్యాస్ సక్రమంగా లభించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు అనివార్యంగా డొమెస్టిక్ గ్యాస్ను వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నల్లబజారు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్ ధరలను ఆమాంతం పెంచేసి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ ఽసిలిండర్ రూ. 958కి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రూ. 1500లకు విక్రయించారు. ఆ తరువాత క్రమంగా పెంచుకుంటూ పోయిన అక్రమార్కులు గురువారం నాటికి ఒక్కో సిలిండర్ను రూ. 3000 నుంచి రూ.3600 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే సిలిండర్ ధర రూ.5000 వరకు పెరిగినా అశ్చర్యం లేదని చెబుతున్నారు. నగరంలోని సంతపేట సాయిబాబా ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఏటా అన్నదానం నిర్వహిస్తారు. గ్యాస్ కొరత తో ఈ ఏడాది అన్నదానం చేయడం లేదని ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా బోర్డు పెట్టడం గమనార్హం. మూతపడుతున్న హోటళ్లు... జిల్లా కేంద్రంలోని హోటళ్లపై యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక రెస్టారెంట్లు, హోటళ్లలో న్యూడిల్స్, పుల్కా, పూరి, ఇడ్లీ, స్టాటర్స్, చికెన్ స్నాక్స్లను పూర్తిగా ఆపివేశారు. వెజిటేరియన్ హోటళ్లలో కూడా వేపుళ్లను నిలిపివేశారు. పప్పు, సాంబరు, చారుతో సరిపెడుతున్నారు. ఊక పొయ్యి మీద వండే వాటిని మాత్రమే వడ్డిస్తున్నట్లు హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పలు హోటళ్లు ఊక పొయ్యిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. గ్యాస్ కొరతతో నగరంలో రోజుకో హోటల్ మూతపడుతోంది. నెల్లూరు బస్టాండు సెంటర్లో ఇటీవలే ప్రారంభించిన కొత్త హోటల్కు తాళం వేశారు. ముంగమూరు డొంకకు వెళ్లే దారిలో ఒక హోటల్ మూడు రోజులుగా తెరవడం లేదు. ఇక పూర్తిగా గ్యాస్ సిలిండర్ల మీదనే ఆధారపడిన టీ స్టాళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. కొన్ని టీ స్టాల్స్లో రూ. 5వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు రూ.10 విక్రయించిన టీ ఇప్పుడు రూ.15 పెంచారు. కాఫీ ధరలను సైతం రూ.30 లకు పెంచినట్లు చెబుతున్నారు. నగరంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద ప్రముఖ టీ స్టాల్ నాలుగు రోజులుగా తలుపులు తెరవడం లేదు. కేటరింగ్లు, ఇళ్ల వద్ద నిర్వహించే టిఫిన్ పాయింట్లలో ఇడ్లీ, దోశ ధరలను పెంచేశారు.నగరంలో నల్ల బజారు వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోని అధికారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు నల్లబజారు వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు నల్ల బజారు వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.యుద్ధం హోటల్ వర్కర్ల పొట్టకొడుతోంది. నగరంలోని పలు హోటళ్లు మూతపడుతుండడంతో అనేక మంది హోటల్ వర్కర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రెస్టారెంట్లు, బడా హోటళ్లలో కనీసం 100 వరకు పని చేస్తుంటారు. రోజువారి కూలీతో వంట మాస్టర్లు, సప్లయర్లు, క్లీనింగ్ స్టాఫ్ పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పుడు వీరంతా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు ప్రభుత్వ సాయం లేదు. ఇటు హోటల్ యాజమాన్యాలు అందించే చేయూతలేక అర్ధాకలితో జీవిస్తున్నామని వాపోతున్నారు. మాయదారి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. తిరిగి మాములు పరిస్థితులు ఎప్పుడు వస్థాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
24న సీపీఐ ధర్నాలు
మార్కాపురం: రాష్ట్రంలో అర్హులైన పేదలకు నివాస స్థలాలు, పక్కా గృహాలు, వ్యవసాయ కూలీలకు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీ ఈశ్వరయ్య తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నివాస స్థలాల కోసం రాష్ట్రంలో నిరుపేదలు అనేక దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు అధికారంలోనికి రాగానే వాగ్దానాలను గాలికొదిలేశారని చెప్పారు. పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల క్రితం టిడ్కో ఇళ్లు పూర్తయినా నేటికీ లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోవడంతో అవన్నీ శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై నా వాటిని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీలన్నీ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా పేట్రేగిపోతోందని, ప్రజలు తమ ఆస్తులను రక్షించుకునేందుకు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పిన కూటమి నాయకులు కొత్తవి ఇవ్వకపోగా అనర్హుల పేరుతో అర్హులను తొలగించారన్నారు. దళిత వాడల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్కే యాసీన్, అందె నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కె ఖాశీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఆటవిడుపు
● ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్ విద్యార్థులు మొత్తం 15,476 మందికి గాను, 15,035 మంది హాజరుకాగా, 439 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 6 పరీక్ష కేంద్రాలను, డీఈసీ 7 పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ 33 కేంద్రాల చొప్పున మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. స్నేహితులకు వీడ్కోలు చెబుతూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సొంత ఊళ్లకు వెళ్లే విద్యార్థులతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. సరిపడినన్ని బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. -
ప్రాణాలు విలవిల
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026యువకుల క్రికెట్ మోజు..డబ్బు ఆశను అడ్డంపెట్టుకుని బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. బెట్టింగ్ వలలో చిక్కుకున్న యువకులు అప్పులపాలై అవి తీర్చే దారి తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల దర్శి కేంద్రంగా ఉన్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టవడంతో బెట్టింగ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులకు ఎస్పీ చార్జ్మెమో ఇచ్చారు. దీంతో అసలు సూత్రధారులు అప్రమత్తమై దేశం దాటేశారన్న ప్రచారం సాగుతోంది. కాలం పూచిన తొలిపువ్వుబెట్టింగ్ వల..దర్శి: దర్శి నియోజకవర్గంలో దర్శి కేంద్రంగా నిర్వహించిన బెట్టింగ్ తీగలాగితే బెట్టింగ్ రాయుళ్ల డొంక కదిలింది. ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసి కూపీలాగడంతో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్ రాజు మంగళవారం 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలకు చార్జ్మెమోలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎస్పీ తీసుకుంటున్న చర్యలకు అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తీగ లాగడంతో బుకీలు పరార్: దర్శి కేంద్రంగా చేస్తున్న బెట్టింగ్ రాయుళ్ల ద్వారా నరసరావుపేటలో బెట్టింగ్కు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, వారి వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరకడం, వారి ద్వారా హైదరాబాద్లో మరో బెట్టింగ్ రాయున్ని కూడా అదుపులోకి తీసుకోవడంతో బెట్టింగ్ డొంక కదిలింది. దీంతో ప్రధానంగా బెట్టింగ్లు వేయించే బుకీలు గుట్టు చప్పుడు కాకుండా అడ్రస్ లేకుండా ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో తెరవెనుక అసలు పెద్దలు ఉన్నవారిని పట్టుకునేందుకు ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పది మంది అదుపులోకి.. మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 10 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు వచ్చి వారిని ఒంగోలు తీసుకెళ్లారు. దీంతో పట్టణంలో ఒక్క సారిగా కలకలం రేగింది. ప్రధాన బెట్టింగ్ రాయుళ్ల ముఠాకు సంబంధించి జిల్లాలోని 14 మంది వరకు శ్రీలంక, ఇతర దేశాలకు వెళ్లినట్లు సమాచారం. అసలు దోషులను పట్టుకుంటారా లేక వారిని వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది. – సాక్షి, ఒంగోలు ఇప్పటి వరకు 25 మందికి పైగా బలవన్మరణాలుదర్శి పట్టణంలో బెట్టింగ్కు అలవాటుపడిన యువకులు డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి బెట్టింగ్లు పెట్టి రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో అప్పుల వాళ్ల ఒత్తిళ్లకు తట్టుకోలేక, అందరికీ తెలిస్తే ఆ డబ్బు ఏం చేశారో చెప్తే కుటుంబం పరువు పోతుందని, ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్లు వేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు గత పదేళ్లలో దాదాపు 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కేబుల్ వర్క్ చేసుకునే కుటుంబానికి చెందిన ఒక యువకుడు బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఇంట్లో నుంచి పారిపోయాడు. అతను వెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. సరుకుల కంపెనీలో పని చేసే ఓ యువకుడు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ తోలుకుని జీవనం సాగించే వ్యక్తి కుమారుడు బెట్టింగ్ లకు పాల్పడి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి పెళ్లి అయి చిన్న పిల్లలు ఉన్నారు. మరో సరుకుల రవాణాకు సంబంధించిన పని చేసే యువకుడు కూడా బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి కూడా ఇదే బెట్టింగ్లకు బలయ్యారని చర్చించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 20 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
సీఎస్పురం(పామూరు): చెట్టుపై చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వి.బైలులో బుధవారం జరిగింది. ఎస్సై అనూక్ తెలిపిన వివరాలు... మండలంలోని వి.బైలు గ్రామానికి చెందిన జమకాల నడిపి ఓబయ్య(67) మంగళవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఓబయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కురిచేడు: పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పడమర వీరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చౌడేశ్వర కాలనీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నమ్మ ప్రతిరోజు లాగా బుధవారం కూడా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిర్చి కోతకు వెళ్లింది. పొలంలో మిరపకాయలు కోస్తుండగా సాయంత్రం ఉరిమిన ఉరుములకు పిడుగులు పడటంతో షాక్కు గురై మృతి చెందింది. పేద మహిళను మృత్యువు పిడుగు రూపంలో కబళించిందని తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దదోర్నాల: వాతావరణంలో మార్పుల ప్రభావంతో అకాల వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని బలిజపల్లె గిరిజన గూడెం సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. ఐనముక్కలకు చెందిన రైతు లింగాల అచ్చయ్యకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. లక్ష రూపాయల విలువ చేసే ఎద్దు మృతి చెందడంతో జీవనాధారాన్ని కోల్పోయానంటూ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు. కురిచేడు: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని బోదనంపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..బోధనంపాడు గ్రామానికి చెందిన వెలుతుర్ల బ్రహ్మారెడ్డి(79)కి సుమారు రూ.60 లక్షల వరకు అప్పులుఉన్నాయి. వాటిని తీర్చలేక కోర్టు నుంచి ఐపీ నోటీసులు అప్పులు ఇచ్చిన వారికి పంపాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పొలం అమ్మి అప్పులు తీర్చాలంటే కుటుంబ సభ్యులు అంగీకరించకలేదు. దీంతో గ్రామంలో ముఖం చూపించలేక మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బుదవారం ఉదయం గ్రామంలోని నిర్మానుష ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై తెలిపారు. ఒంగోలు సిటీ: పదో తరగతి హిందీ పరీక్షకు బుధవారం 28,572 మంది విద్యార్థులకు గాను 28,422 మంది హాజరు కాగా 150 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. డీఈఓ ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలు, మార్కాపురం జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలను, ఏసీజీ అండ్ డీఎంసీ అధికారులు 5 కేంద్రాలను తనిఖీ చేశారు. అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మొత్తం 80 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు రెండవ రోజు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు డీఈఓ పేర్కొన్నారు. -
బొల్లావులతో చిందులు.. కాటమరాజుకు మొక్కులు
పెద్దారవీడు: నల్లమల అభయారణ్యంలో పెద్దారవీడు మండల పరిధిలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవాని అమ్మవార్ల తిరునాళ్ల బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు, పూలమాలతో శోభాయమానంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్న సంతర్పణ చేశారు. తిరునాళ్ల సందర్భంగా రాత్రి వేళ భక్తుల కాలక్షేపానికి విద్యుత్ ప్రభలు, కోలాటం, నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భక్తిపారవశ్యం.. బొల్లావుల ఉత్సవం కాటమరాజు స్వామి తిరునాళ్ల సందర్భంగా బొల్లావుల ఉత్సవం భక్తులను ఆనందపరవశులను చేసింది. కనక తప్పెట్ల మోత, కొమ్ము బూర వాయిద్యం నడుమ యాదవులు వీరతాళ్లతో బొల్లావులను ఆడిస్తుండగా స్వామి వారి ఆలయం చుట్టూ మహిళలు పొంగళ్లతో ప్రదక్షిణలు చేశారు. మొక్కుబడి ఉన్న మహిళలు గంగాభవానీ అమ్మవారికి పట్టుచీరలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఊరేగింపుగా వచ్చిన బొల్లావులు కాటమరాజు సన్నిధిలో కొలువుదీరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
రైతాంగ వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి
● సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఒంగోలు టౌన్: దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువజనులు పోరాటాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఈనెల 23వ తేదిన భగత్సింగ్ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టే నిరసన కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై 7 రెట్లు అధికంగా భారం పడిందన్నారు. విదేశీ కంపెనీలకు చెందిన జన్యుమార్పిడి విత్తనాలు, నకిలీ విత్తనాలను ఇష్టం వచ్చిన ధరలకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చిందని తెలిపారు. దేశీయ రైతాంగానికి లేని హక్కులు విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టేందుకే విత్తన చట్టం తీసుకొచ్చినట్లు విమర్శించారు. ఇరాన్పై యుద్ధంతో ప్రపంచంలో వస్తు రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారని, రైతు పేదా తేడా లేకుండా విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.వీరారెడ్డి మాట్లాడుతూ...మన ఎగుమతులపై 17 శాతం అమెరికా సుంకాలు విధిస్తుంటే, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఎంతగొప్ప దేశభక్తో చెప్పాలన్నారు. అమెరికాతో చేసుకున్న అడ్డగోలు, దోపిడీ ఒప్పందాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు పొగడడం హాస్యస్పదమన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల హనుమంతరావు మాట్లాడుతూ సీబీఐ, ఈడీ వంటి నేరపరిశోధక సంస్థలను ఉసిగొల్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, 10 శాతం వాటా చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై 40 శాతం భరించాలని షరతులు విధించడం దారుణమన్నారు. సమావేశంలో రైతు నాయకులు ఎంఎస్ సాయి, ఎస్.లలితకుమారి, భీమవరపు సుబ్బారావు, ఎల్ రాజశేఖర్, చొప్పర జాలన్న పాల్గొన్నారు. -
ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాతం
దర్శి: దర్శిలో ఫ్లెక్సీల తొలగింపులో నగర పంచాయతీ కమిషనర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా పక్షపాతం చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలలో రాజకీయ పార్టీ నాయకులు ఫొటోలు ఉన్నాయని, రోడ్డుకు అడ్డం లేకున్నా ఫ్లెక్సీలను తొలగించారని ముస్లింలు పడ్డారు. ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీల తొలగిస్తుండటంతో అక్కడకు చేరుకున్న ముస్లింలు కమిషనర్ శ్రీరామ్మూర్తితో మాట్లాడారు. గడియార స్తంభానికి అడ్డంగా నడిరోడ్డులో ఉన్న టీడీపీ నాయకులు, రాజకీయ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు కడితే వాటిని ఎందుకు తీసివేయలేదని ప్రశ్నించారు. దీంతో కమిషనర్ మాట్లాడుతో రోడ్డుకు అడ్డంగా ఉందని, ఇక్కడ ఎవరు కట్టినా తీసేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు తీయలేదని, వారికి ఉన్న పర్మిషన్లు చూపించాలని కోరారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నాకు ఎటువంటి పార్టీలు లేవని చెబుతూనే వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి టీడీపీ ఫ్లెక్సీలను అక్కడే ఉంచారు. దీనిపై స్థానికులు కమిషనర్ను నిలదీయంగా..వారికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. అనుమతులు చూపించాలని ప్రశ్నించగా కమిషనర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా నగదు చెల్లించి అనుమతులు తీసుకుంటే ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు మాత్రమేతొలగింపు కమిషనర్ తీరుపై స్థానికుల ఆగ్రహం -
గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
అద్దంకి రూరల్: అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అద్దంకి ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అద్దంకి ఆరోగ్య రథం లోగోను బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రథం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు చేసి చికిత్స అందిస్తారని చెప్పారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అద్దంకి అభివృద్ధి చెందుతుందని డాక్టర్ అశోక్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాళ్లూరు: బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి తాళ్లూరు మండలంలో చేపడుతున్న పనులను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి బుధవారం పరిశీలించారు. హైవేకు అదనంగా భూమి అవసరమని గుర్తించారు. తాళ్లూరు గ్రామంలో 2.28 ఎకరాలు, మల్కాపురం గ్రామంలో 14 సెంట్ల భూమి అవసరమని అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా, భూ రికార్డులు పరిశీలించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించారు. రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అద్దంకి ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ బీవీ రమణారావు, ఎక్స్ప్రైస్ హైవే ఎస్డీసీ, వీఆర్ఓ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
వంటింట్లో నూనె మంట!
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 120 టన్నులకు పైగా నూనె విక్రయాలు ● అడ్డూ అదుపు లేని ప్లాస్టిక్ వస్తువుల ధరలు ● ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలంమార్కాపురం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి.! ఇరాన్తో అగ్ర రాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వస్తు సేవల రంగాలపై ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో వివిధ వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్కసారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజూ 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. ఐదు రోజుల క్రితం ఒక రకం కంపెనీ ఆయిల్ ధర రూ.162 ఉండగా ప్రస్తుతం రూ.170కి పెరిగింది. మరోరకం ఆయిల్ ధర రూ.115 నుంచి రూ.125కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహార పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, టిఫిన్ బండ్లు మూత వేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన వారం రోజుల వ్యవధిలో కూలింగ్ క్యాన్ల ధర రూ.450 నుంచి రూ.600కు బబుల్స్ రూ.130 నుంచి రూ.170కు, కవర్ల ప్యాకెట్ ధర రూ.175 నుంచి రూ.215కు ఎగబాకింది. గల్ఫ్ దేశాల నుంచి ముడిపదార్థాల దిగుమతికి అంతరాయం ఏర్పడటంతో ధరలపై ప్రభావం పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు. నూనె ధరలు తగ్గించాలి గత వారం రోజుల నుంచి నూనె ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలి. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టం. ప్లాస్టిక్ వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నారయి. అధికారులు స్పందించి కృత్రిమ కృత్రిమ గ్యాస్ కొరతను, ధరలను నియంత్రించాలి. – కరీముల్లా, మార్కాపురం 17వ బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
ఐనవోలు మేజర్లో మృతదేహం లభ్యం
కురిచేడు: మండలంలోని ఆవులమంద రోడ్డులోని ఐనవోలు మేజర్లోకి మహిళ మృతదేహం మంగళవారం కొట్టుకు వచ్చింది. ఏఎస్సై మోహనరావు కథనం ప్రకారం మార్కాపురం గ్రామానికి చెందిన గోగు గురవమ్మ(60) ఈనెల 9 వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మృతదేహం కాలువలో రబ్బరు చెట్లు తగిలి నిలిచిపోయింది. మృతదేహం బోర్లాపడి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. కాలువలో మృతదేహన్ని వెలికితీసి విచారించగా మార్కాపురం మహిళళగా గుర్తించామన్నారు. మృతురాలి బంధువుల ద్వారా నిర్ధారణ చేసుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేసినట్లు తెలిపారు. ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం ప్రకారం..చీరాల రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 7 ఏళ్ల బాలికపై బిట్ల అలియాస్ పిట్ల సూరిబాబు(45) నిర్మాణంలో ఉన్న ఒక డాబా ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లికి తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేశారు. చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ నిందితుడ్ని అరెస్టుచేసి కోర్టులో ఛార్జీషీటు దాఖలుచేశారు. సాక్షులను విచారణ అనంతరం నిందితునిపై అభియోగం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి పదేళ్ల కఠిన కారాగార ఽశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వంచే బాధిత బాలికకు రూ.75వేలు పరిహారం కింద చెల్లించాలని తీర్పులో వెలువరించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితునికి శిక్ష పడడంలో కృషిచేసిన ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ మొయిన్, ఇతర అధికారులు, కోర్టు లయజన్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. ● ఏప్రిల్ 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి ఒంగోలు వన్టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు 45 వరకూ ఉన్నాయని కలెక్టర్ పి.రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–4 పోస్టులు 12 , క్లాస్–4, 30 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్–2, టైపిస్టు–8, ఎంపిహెచ్ఏ సీ్త్ర,–1, ఏఎన్ఎం గ్రేడ్ 3, సీ్త్ర–1, ఫిషర్ మెన్–1, ఆఫీస్ సబార్డినేట్–13, మెసెంజర్–1, శానిటరీ మేసీ్త్ర–1, హెల్పర్–1, వాచ్మెన్–10, స్వీపర్–1, పీహెచ్ వర్కర్–2, పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అంధులకు–21, బధిరులకు–10, శారీరక వైకల్యం–4, ఆటిజం, మేధో వైకల్యం, నిర్ధిష్ట అభ్యాస వైకల్యం, మానసిక ఆరోగ్య, బహుళ వైకల్యాలు–7 పోస్టులుకు వేరు, వేరుగా దరఖాస్తులు చేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేది సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను, నిర్ణీత గడువు లోగా ప్రకాశం భవన్లోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
మార్కాపురం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ అదాలత్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం మార్కాపురంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్ అదాలత్లు నిర్వహించి, వినియోగదారుల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. ఒంగోలు సర్కిల్ పరిధిలో 26 అదాలత్లు, మార్కాపురంలో 6 అదాలత్లు నిర్వహించినట్లు వెల్లడించారు. తమ పరిధిలో 7 విద్యుత్ సర్కిల్స్ ఉండగా, ప్రతి నెలా 5 సర్కిళ్లలో అదాలత్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లుల చెల్లింపులో సమస్యలు, స్తంభాల ఏర్పాటులో జాప్యం లాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని వినియోగదారులకు సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలను తమ వద్దకు తీసుకురావద్దని, అవి తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అనంతరం 26 మంది విద్యుత్ వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డి.కృష్ణనాయక్, కె.కృష్ణ, కె.వెంకటేశ్వర్లు, ఎ.సునీత, ఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సియానాయక్, జిల్లా పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు. -
మట్టి మాఫియాకు యువకుడు బలి
కందుకూరు రూరల్: మట్టి మాఫియా యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వేయడంతో ఏర్పడిన పెద్ద పెద్ద గొయ్యిల్లో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బి.ప్రసాద్ (19) గేదెలు మేపుకునేందుకు పొలం వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులోకి గేదెలు తోలి శుభ్రం చేసేందుకు చెరువులోకి దిగాడు. లోతును గమనించకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. మట్టి మాఫియా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి అధిక లోతుగా మట్టిని తీయడంతో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. అవే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేతికందివచ్చిన కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ● ఇద్దరిపై 6ఏ కేసు నమోదు పామూరు: గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై అధికారులు దాడులు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రమైన పామూరుతోపాటు మండలంలోని గ్రామాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఎన్ఫోర్సుమెంట్ డీటీ కే.రాఘవేంద్ర భూపతి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీహెచ్.రవిబాబు, విజిలెన్స్ డీసీటీఓ బి.రామారావు ఆధ్వర్యంలో రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి దుకాణాల నుంచి 35 డొమెస్టిక్ సిలిండర్లు, 4 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని వారిపై 6ఏ కేసు నమోదుచేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. పామూరులోని పేట వీధి సమీపంలో షేక్.చిన్న ఖాజా రహమతుల్లా చెందిన రేకుల ఇంటిలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్ల నిల్వ ఉంచి అధికధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇండేన్ డొమెస్టిక్ ఫుల్ గ్యాస్ సిలిండర్లు 21, ఖాళీ సిలిండర్లు 02, భారత్ డొమెస్టిక్ ఖాళీ గ్యాస్ సిలిండర్లు 12, ఇండేన్ కమర్షియల్ ఖాళీ గ్యాస్ సిలెండర్ 1 మొత్తం 36 స్వాధీనం చేసుకుని చిన్న ఖాజా రహమతుల్లాపై 6ఏ కేసు నమోదుచేశామన్నారు. అదేవిధంగా మండలంలోని నుచ్చుపొద గ్రామంలోని చాకలివీధిలో నివాసంలో కౌలూరి ఖాజా రసూల్ అక్రమంగా నిల్వ ఉంచిన 3 కమర్షియల్ ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకుని అతనిపై 6ఏ కేసు నమోదు చేసి సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు స్వాధీనం -
సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదు
● రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా దిశగా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 22ఏ కేసులపై మరింత దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి అవసరమైన ఈ–కేవైసీ ప్రక్రియను లోపాలు లేకుండా చేయాలన్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందికే అప్పగించకుండా తహసీల్దార్లు కూడా రెగ్యులరుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి ముందుగా సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువైన నాలుగు వారాల్లోగా 22(ఏ) కేసులను పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ బి.ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
యర్రగొండపాలెం: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మండల కేంద్రమైన పుల్లలచెరువులోని కమ్మవారిపల్లెలో నివాసం ఉంటున్న మేడికొండ వెంకటేశ్వర్లు పొలం పనులకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంగతి తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యర్రగొండపాలెం సీఐ కె.అజయ్కుమార్, ఎస్సై బి.సాంబశివరావు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించగా నిందితులు ఎవరనేది తెలుసుకోగలిగామని డీఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని నామనాయక్ తండాకు చెందిన కోడావత్ రాజు అలియాస్ కుమార్, దేవరకొండ మండలంలోని మైనంపల్లి తండాకు చెందిన వడితే సాయికిరణ్తోపాటు మరో ఇద్దరు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు గతంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని, వీరిలో రాజు అనే వ్యక్తికి దాదాపు 100 చోరీ కేసుల్లో సంబంధం ఉందని చెప్పారు. స్థానిక మాచర్ల రోడ్డులోని మల్లాపాలెం గ్రామ క్రాస్ రోడ్డులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి బంగారు చైన్, గొట్టాల గొలుసు, నల్లపూసల దండ, రెండు జతల మాటీలు, రెండు జతల జుంకాలు, రెండు జతల బుట్టకమ్మలు, ఒక జత రాళ్ల కమ్మలు, ఒక జత కమ్మలు, రెండు చిన్న ఉంగరాలు, వెండితో చేసిన 5 జతల కాళ్ల పట్టీలు, మొలతాడు, రెండు గ్లాసులు, ఒక స్పూన్, 3 కుంకుమ భరణెలు, 6 గిన్నెలు వెరసి మొత్తం రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు ఉపయోగించిన హోండా సిటీ పాతకారును సీజ్ చేశామని, బీరువా తాళాలు పగలకొట్టేందుకు ఉపయోగించిన రెండు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చోరీ కేసును సకాలంలో ఛేదించిన సీఐ, ఎస్సైని డీఎస్పీ అభినందించారు. రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం నిందితుల వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు పుల్లలచెరువులో చోరీ కేసును వేగంగా ఛేదించిన పోలీసులకు అభినందనలు -
సర్పంచ్లపై కక్ష సాధింపు
బిల్లుల పెండింగ్తో గిద్దలూరు(బేస్తవారిపేట): రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న సర్పంచ్లపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భూమా గెస్ట్హౌస్లో నియోజకవర్గంలోని సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేపీ మాట్లాడారు. సర్పంచ్ల హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాస్తోందని, ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు, అంతర్గరోడ్లు, ప్రభుత్వ భవనాల కాంపౌండ్లు, పారిశుధ్య పనుల కోసం సర్పంచ్లు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్లు 15 రోజుల్లోపు తమ తీర్మానాలను అధికారులకు సమర్పించి, ఎంబుక్ల రశీదులను తీసుకుని వస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుందామని చెప్పారు. బకాయిలు వచ్చే వరకు పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిల్లుల మంజూరుపై సర్పంచ్ల ఆవేదన పిటికాయగుళ్ల సర్పంచ్ నర్రా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ సర్పంచ్లు భయపడాల్సిన పనిలేదని చట్టపరంగా ముందుకెళ్లి బిల్లులు సాధించుకుందామన్నారు. కందులాపురం సర్పంచ్ బత్తుల సూర్యప్రకాష్ దాదాపు రూ.కోటి విలువైన పనులు చేస్తే రూ.60 లక్షల వరకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కందులాపురం సెంటర్లో అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారని, వైఎస్సార్ సీపీ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే దుర్మార్గంగా అడ్డు తగులుతున్నారన్నారు. అర్ధవీడు సర్పంచ్ మునగాల వసంత మాట్లాడుతూ.. సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చు చేసి రోడ్ల పనులు చేశామని, రూ.40 లక్షల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధవీడు మండలంలో సర్పంచ్లకు తెలియకుండానే, ఎటువంటి తీర్మానాలు తీసుకోకుండానే పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సర్పంచ్లు సమావేశంలో తాము ఎదుక్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే కేపీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే కేపీ ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, ఎం వెంకట్రావ్, కడప లక్ష్మీదేవి, జెడ్పీటీసీలు సారె వెంకటనాయుడు, పగడాల శ్రీరంగం, బీవీ రాజయ్య, మాజీ ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, రవికుమార్యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు బి.ఓబులరావు, ఆవుల శ్రీధర్రెడ్డి, సీఆర్ఐ మురళి, గొంగటి చెన్నారెడ్డి, నాయకులు దొడ్డంపల్లి కృష్ణారెడ్డి, మానం బాలిరెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి, నెమిలిదిన్నె చెన్నారెడ్డి, దప్పిలి వెంకట్రామిరెడ్డి, పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులకు బాబు సర్కారు తూట్లు గ్రామాల్లో చేసిన పనుల బిల్లులు రెండేళ్లుగా నిలిపేయడం దుర్మార్గం రూ.కోట్లలో బకాయిలు పెట్టి అధికారుల చుట్టూ తిప్పుతారా? తీర్మానాలు లేకుండా టీడీపీ నేతలు పనులు చేస్తే బిల్లులెలా ఇచ్చారు? వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి ధ్వజం -
కన్నీళ్లు ఉప్పుంగి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్లుగా ఉప్పు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ధర ఉంటే ఉప్పు తయారీ ఉండదు. తయారీ ఉంటే ధర ఉండదు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండి ఉప్పు ఉత్పత్తి బాగా తయారవుతోంది. ఈ సారి మంచి ధర వస్తుందని ఆశించిన ఉప్పు రైతుకు పశ్చిమాసియా యుద్ధం శరాఘాతంగా మారింది. యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, వాణిజ్య సిలిండర్లను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ప్రభావం పలు రాష్ట్రాల్లోని హోటల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, చిన్నా పెద్దా హోటళ్లు మూత పడ్డాయి. అలాగే కేటరింగ్ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా ఉప్పునకు డిమాండ్ తగ్గిపోయింది. తగ్గిన ధరలు.. యుద్ధం కారణంగా హోటళ్లు, కేటరింగ్ సర్వీసులు మూతపడడంతో ఉప్పునకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ధరలు బాగా పతనమైపోయాయి. యుద్ధానికి ముందు 76 కేజీల బస్తా ధర గత నెలలో రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.200లకు పడిపోయింది. వాస్తవానికి ఉప్పు కనీస మద్దతు ధర రూ.250 ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాణ్యమైన ఉప్పు ధర రూ.200 పలుకుతుండగా, తక్కువ నాణ్యత గల ఉప్పు ధర రూ.170 నుంచి రూ.190 ధర ఉంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉండి ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన ఉప్పు రైతును యుద్ధం కోలుకోలేని దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన ఎగుమతులు.. యుద్ధం ప్రభావం ప్రధానంగా హోటల్ రంగంపై పడడంతో ఉప్పు ఎగుమతులు తగ్గిపోయాయి. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతుంది. మార్చి నెలకు ముందు ప్రతిరోజు మండలంలోని ఊళ్లపాలెం, బింగినపల్లి ప్రాంతాల నుంచి 5 నుంచి 7 లారీల వరకు ఉప్పు రవాణా చేసేవారు. ప్రస్తుతం కొనుగోలుదారుల కానీ, బ్రోకర్లు కానీ రాకపోవటంతో రోజుకు ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉంది. దీంతో ఉప్పుపై ఆధారపడే కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఉప్పుకు డిమాండ్ ఎప్పుడు వస్తుందోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉప్పు కొనుగోలు చేయాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉప్పుసాగు ఇలా.. ఉమ్మడి జిల్లాలో కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతోంది. 7 వేలకు పైగా రైతులు 10 వేలకు పైగా కూలీలు ఉప్పు సాగు పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తప్ప సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతుంది. ఎకరాకు 76 కేజీలు ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రకారం ప్రతినెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తుంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా అయింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి కావడంతో పాటు దిగుబడి బాగా వచ్చింది. అంతా ఆశాజనకంగా ఉందని రైతులు భావించారు. ఇంతలో వీరి ఆశపై యుద్ధం నీళ్లు జల్లింది. మంచి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు యుద్ధం నడ్డివిరిచేసింది. -
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
ఉప్పు కొఠారులలో ఉప్పు తయారీపశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఉమ్మడి జిల్లా ఉప్పురైతుల బతుకుల్లో మంటలు రేపుతున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ఉప్పు ధరలు కుప్పకూలి రైతు ఆందోళనలో మునిగిపోయాడు. యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడంతో చాలా రాష్ట్రాల్లో చిన్నా పెద్దా హోటల్స్ మూతపడుతున్నాయి. ఫలితంగా ఉప్పు కొనేవారులేక డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుకు యుద్ధం శాపంలా పరిణమించింది. యుద్ధానికి ముందు ఉప్పు బస్తా (75 కేజీ) ధర రూ.280 ఉండగా నేడు అమాంతం రూ.200లకు పడిపోయింది. -
ధరలు పడిపోతున్నాయి
యుద్ధం ప్రభావంతో ఉప్పు ధరలు తక్కువగా ఉన్నాయి. గత 15 రోజుల్లో 76 కేజీ ల బస్తాకు సుమారు రూ.80ల వరకు ధరలు పడిపోయాయి. యుద్ధం త్వరగా ముగిసి ధరలు పెరిగితే తప్ప ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఉంది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం ఉప్పు రైతుకు కష్టకాలం ప్రస్తుతం 76కేజీల నాణ్యమైన ఉప్పు ధర రూ. 200ఉండగా తక్కువ రకం ఉప్పు ధర రూ.170 ఉంది. యుద్ధం కారణంగా హోటళ్లు మూతపడటంతో ఉప్పుకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకు 5 పైగా లారీల్లో ఉప్పు రవాణా జరుగుతుండగా ప్రస్తుతం ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉండటంతో ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. – నాటారు వెంకటేష్, ఉప్పు రైతు, ఊళ్లపాలెం -
పోలీస్శాఖను కుదిపేస్తున్న బెట్టింగ్..
ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరగడం, దర్శిలో పలువురు అరెస్టవడం తెలిసిందే. అయితే దర్శిలో అసలు బుకీలను ఒదిలిపెట్టి సబ్ బుకీలను అరెస్టు చేయడంపై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ‘కేసును తిప్పేశారు’ అనే శీర్షికతో వచ్చిన కథనంతో ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్ అయ్యారు. ఊరూరా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నా పట్టించుకోకపోవడమే కాకుండా భారీ మొత్తంలో ముడుపులు తీసుకొన్న కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది బుకీలకు సహకరిస్తున్నట్లు ఎస్పీకి సమాచారం రావడంతో తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులకు నోటీసు ఇచ్చినట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తమ పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో విఫలం చెందినట్లు భావించిన ఎస్పీ జిల్లాలోని 15 మంది సీఐలకు, 25 మంది ఎస్సైలకు చార్జి మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో చార్జి మెమోలు ఇవ్వడం జిల్లాలో ఇదే ప్రథమం. ఇది జిల్లా పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది. -
ప్రజా ధనం లూటీ
● కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా టెండర్ల ద్వారా అప్పగింత ● పచ్చదనం టెండర్లలో కూడా పోటీ లేకుండా సింగిల్ టెండర్ ఆమోదం ● కౌన్సిల్, అధికారుల తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ● సాదాసీదాగా చివరి కౌన్సిల్ సమావేశంఒంగోలు సబర్బన్: అడ్డగోలుగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు...స్వయంగా కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించి దోచిపెడుతున్నారు. అదీ పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా పనులు అప్పగించి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నిలువునా పంచి పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్లో ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో మేయర్ జి.సుజాత అధ్యక్షతన నిర్వహించారు. 20 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. 9, 10 అంశాలను నిధుల దుర్వినియోగం కోసమే పెట్టారని 14వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అధికారులను నిలదీశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను ఒంగోలు నగర పాలక సంస్థ స్వయంగా చేపట్టవచ్చన్నారు. అలాంటిది తడి, పొడి చెత్తలను వేరుచేసి బయోవేస్ట్గా మార్చటానికి రూ.92 కోట్లు వెచ్చించాలని చూడటం అత్యంత దారుణమన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నాయని, అయినా ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ప్రజా ధనాన్ని అప్పనంగా కాజేసే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. అదీ కూడా పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా ఏ విధంగా టెండర్ను ఆమోదిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా 10వ అంశంలో కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచేందుకుగాను రూ.40 లక్షలు కేటాయించటం కూడా నిధులు దుర్వినియోగానికి పాల్పడటమేనన్నారు. అదీ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారానే కేటాయించటం అత్యంత దారుణమన్నారు. ఎస్ఎస్ ట్యాంకు–1కు ఉత్తరం వైపున 32వ డివిజన్ పరిధిలో పాత బైపాస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారని జనసేన సభ్యుడు, 18వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు(చిన్నారి) అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. కౌన్సిల్లో ఆమోదం లేకుండా, టెండర్ పిలవకుండా ఈ విధంగా పనులు చేస్తున్నారని నిలదీశారు. బీటీ రోడ్డు దాదాపు పూర్తయిందని, చివరగా ఒక లేయర్ బీటీ వేస్తే రోడ్డు పూర్తవుతుందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. మరి టెండర్ పిలవకుండానే సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేయాల్సిన అవసరం కాంట్రాక్టర్కు ఎందుకు ఉంటుందన్నారు. అంటే అధికారులు ఆ కాంట్రాక్టర్కు ముసుగులో ఏమైనా డబ్బులు ముట్ట చెప్పారా అని పలువురు కార్కొరేటర్లు చెవులు కొరుక్కున్నారు. చివరకు 20 అంశాలతో కూడిన కౌన్సిల్ సమావేశం పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ పద్దతిపై హెల్త్ విభాగంలో కన్సల్టెంట్ను బీసీఎస్ డాక్టర్ పత్తిపాటి పల్లవిని నియమించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టారు. అయితే కౌన్సిల్ ఆ నియామక ఆమోదాన్ని రద్దు చేసింది. గత కౌన్సిల్లో వాయిదా వేసిన 38వ డివిజన్లో పార్కుకు శ్రీ కృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలని స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన విన్నపాన్ని తిరిగి వాయిదా వేశారు. చివరకు కౌన్సిల్ చివరి సమావేశం సాదాసీదాగా సాగింది. కౌన్సిల్ సమావేశం అనంతరం కార్పొరేటర్లు అందరూ, అధికారులు కుటుంబ సభ్యులతో సహా వీడ్కోలు విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కే.వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవ రావు, వేమూరి సూర్య నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్ -
టీటీడీ చైర్మన్ను తక్షణమే తొలగించాలి
ఒంగోలు సిటీ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వికృత లీలలను ప్రజలందరూ చూశారని, తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకుల ప్రవర్తనను, అకృత్యాలను, వికృత చేష్టలను, అఘాయిత్యాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. గంజాయి తాగే ఎంపీలు, బీఆర్ నాయుడు లీలలను చూశారన్నారు. ఇంత బరితెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తుంటే జనసేన ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీ్త్రల పట్ల మాకు గౌరవం ఉందని చెప్పుకునే పవన్కళ్యాణ్, చంద్రబాబు సీ్త్రలను అవమాన పరుస్తున్న, సీ్త్రలను బ్లాక్మెయిల్ చేసేవారిని, మానభంగాలు చేసేవారిని, కించపరిచేవారిని పెట్టి పాలనను కొనసాగిస్తుంటే ప్రజలు వింతగా చూస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని మహిళలు నిరసన తెలుపుతుంటే మహిళలను నెత్తురు వచ్చేలా పిడిగుద్దులు గుద్దారన్నారు. అటువంటి వ్యక్తి దేవస్థానానికి అర్హుడు కాదని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల వివరాలు పంపాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో మూడేళ్ల నుంచి అసలు విద్యార్థులు లేకుండా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, జిల్లాలో కారుణ్య నియమకానికి అర్హులైన వారి వివరాలను ప్రభుత్వానికి 23వ తేదీ లోపు పంపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 41 మంది ఉపాధ్యాయులను రోజుకు వారానికి ఒక పాఠశాల చొప్పున డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారన్నారు. అలా పనిచేసే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఒక పాఠశాలకు శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని డీఈఓ సీవీ రేణుకను కోరారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారులకు కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించడం, ఎక్కువ రేట్లకు అమ్మడం, అక్రమంగా నిల్వచేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నప్పుడు అధిక ధరలు వసూలు చేయవద్దని చెప్పారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వ్యవధితో గ్యాస్ బుక్చేయించుకోవాలని చెప్పారు. ఒక్క సిలిండర్ ఉన్నవారు 5 రోజుల ముందు బుక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా స్పాట్ బుకింగ్ డిమాండ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య, సివిల్ సప్లయ్ డీటీలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో నిర్వహించిన జాతీయ అకడమిక్ సదస్సుల్లో ఒంగోలు విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అస్వన్ మార్గదర్శకత్వంలో రెండో సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్ సాయి ప్రత్యూష ఈ నెల 13,15 తేదీల్లో గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో జరిగిన జాతీయ సదస్సులో జెనరేషన్ జెడ్ 1997–2012 మెడికల్ విద్యార్థుల్లో డిజిటల్ డిటాక్స్ ప్రభావాన్ని అంచనా వేసే ఒక ఇంటర్వెన్షనల్ అధ్యయనం అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే ఇటీవల పుదుచ్చేరి జిప్మెర్ వైద్య కళాశాలలో జరిగిన సదస్సులో డాక్టర్ భాస్కరి మార్గదర్శకత్వంలో మూడో సంవత్సరం విద్యార్థిని షేక్ అలీనా పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ద్వితీయ బహుమతితో పాటు రూ.6 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. జాతీయ సదస్సులో పాల్గొని ద్వితీయ బహుమతులు సాధించిన పీజీలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులు సాధించిన జాతీయ స్థాయి బహుమతులు ఒంగోలు జీఎంసీలో బలమైన పరిశోధనా వాతావరణం, అకడమిక్ ప్రతిభను చాటిచెబుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.అశ్విన్, పి.దివ్య పాల్గొన్నారు. -
ప్రయాణికులుగా నటిస్తూ చోరీ
● 5 నెలల క్రితం జరిగిన చోరీ కేసులో దొంగల అరెస్టు ఒంగోలు టౌన్: అందరూ ప్రయాణికుల్లాగే బస్సు ఎక్కారు. అదును చూసి లగేజీ బ్యాగును కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం...బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు, బాబురావు దంపతులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో స్వగ్రామానికి వచ్చిన ఆ దంపతులు 2వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు ఒంగోలు సౌత్ బైపాస్ వద్దకు రాగానే భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ వద్ద ఆపారు. హిమబిందు, బాబురావు ఇద్దరూ బస్సు దిగి భోజనం చేసి మళ్లీ బస్సు ఎక్కారు. మరుసటి రోజు బెంగళూరు చేరుకున్న ఆ దంపతులు బ్యాగు తెరిచి చూడగా అందులో నగలు కనిపించలేదు. ప్రయాణ సమయంలో బస్సులో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలుకా పోలీస్స్టేషన్ సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలోని బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పసిగట్టింది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన ఫిరోజ్, హైదర్లు బ్యాగు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని 120 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో నగల బ్యాగులను బాధిత కుటుంబానికి అందజేశారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయకృష్ణ, ఎస్సై రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు అన్వర్బాషా, రామకృష్ణ, ఆర్.రాంబాబులను ఎస్పీ అభినందించారు.


