breaking news
Prakasam District News
-
క్వార్టర్ ఫైనల్స్కు చైన్నె జట్లు
మేదరమెట్ల: రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావినూతలలో జరుగుతున్న సంక్రాంతి కప్ అంతర్రాష్ట్ర క్రికెట్పోటీల్లో సౌత్జోన్సీసీ చైన్నె, ఎంఆర్సీసీ చైన్నె జట్లు విజయం సాధించి క్వార్టర్ఫైనల్స్కు చేరాయి. ఆదివారం ఉదయం సౌత్జోన్సీసీ చైన్నె జట్టు ఏసీసీ లెవెన్ విజయవాడ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చైన్నె జట్టు 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విజయవాడ జట్టు 16.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో సౌత్జోన్ సీసీ చైన్నె జట్టు క్వార్టర్ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్లో జీడీసీఏ లెవెన్–ఎంఆర్సీసీ చైన్నె జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన జీడీసీఏ లెవెన్ జట్టు ముందుగా బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 152 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఎంఆర్సీసీ చైన్నె జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 4వికెట్ల తేడాతో చైన్నె జట్టు విజయం సాధించి క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. నేటి మ్యాచ్లు: ఉదయం శ్రీసీసీ చైన్నె ఎస్ఎస్ఎస్సీ హైదరాబాద్ జట్ల మధ్య, మధ్యాహ్నం ఏడీసీఏ లెవెన్ అనంతపురం–ఎస్కేఎం సీసీ చైన్నె జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. -
సమష్టి కృషితో పార్టీ బలోపేతం
మార్కాపురం టౌన్: కార్యకర్తల సమష్టి కృషితోనే పార్టీని బలోపేతం చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. పొగాకు రైతులకు అండగా పొదిలిలో చేపట్టిన విజయవంతమైందని, అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో కూడా మార్కాపురం నియోజకవర్గం మొదటి 5 స్థానాల్లో నిలిచిందన్నారు. ఇది నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త చేసిన కృషేనన్నారు. రానున్న రోజుల్లో పార్టీని అభివృద్ధి చేసి మన గౌరవాన్ని పెంపొందించుకుందామని కోరారు. అందరం సమష్టిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. త్వరలో వార్డు కమిటీల సమావేశంలో కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురలీకృష్ణ, పార్టీ పట్టణ అద్యక్షులు, కౌన్సిలర్ సలీం, వైస్ ఛైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మగ్బుల్ బాషా, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, సిరాజ్, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, శ్రీనివాసులు, చాటకొండ చంద్ర, నాగరాజు, పార్టీ కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌస్ మొహిద్దీన్, పత్తి రవిచంద్ర, పోరుమామిళ్ల విజయలక్ష్మి, రోజ్ లిడియా, సుస్మిత, చెన్నలక్ష్మి, మహమ్మద్ రఫీ, కరిముల్లా, ఉస్మాన్, రామడుగు రమేష్, దాసరి వెంకటేశ్వర్లు, బూదాల గురవయ్య, ఉత్తమకుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నాం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
ఘాట్రోడ్డులో నిలిచిన లారీ
● 3 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్ ● నట్టడివిలో చలిగాలులతో ప్రయాణికుల అవస్థలు పెద్దదోర్నాల: సాంకేతిక కారణాలతో ఓ ఇసుక లారీ నడిరోడ్డుపై నిలిచిపోవడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్లోని చింతల, తుమ్మబైలు గిరిజన గూడేల నడుమ ఆదివారం జరిగింది. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తడంతో సంఘటనా స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రం వైపు నుంచి శ్రీశైలంకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల, తుమ్మలబైలు మధ్య సాంకేతిక కారణాలతో నడిరోడ్డులో నిలిచిపోయింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఆర్టీసీబస్సులు, టూరిస్ట్ బస్సులు, టారీలు ట్రిప్పర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ, లారీల సిబ్బంది రోడ్డుకడ్డంగా ఉన్న లారీని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొందరు మెకానిక్లతో రోడ్డుకు అడ్డంగా నిలిచిన లారీకి మరమ్మతులు చేశారు. 3 గంటల తర్వాత లారీని రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. చలి తీవ్రతతో ప్రయాణికుల అవస్థలు నట్టడివిలో మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. దీంతో ప్రయాణికుల కష్టాలు చెప్పేవీ కావు. స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తగా శ్రీశైలం వెళ్లే వాహనాలను మండల కేంద్రంలోని గణపతి చెక్పోస్టు వద్ద నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వాహనాలను శ్రీశైలానికి అనుమతించారు. త్రిపురాంతకం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నేషనల్ హైవేపై జరిగింది. వివరాల్లోకి వెళితే..త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి సమీపంలో రాంబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై మరో వ్యక్తిని ఎక్కించుకుంటుండగా వినుకొండ వైపు వెళుతున్న వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వరి నాట్లు వేసుకునేందుకు తెల్లవారుజామున బయలుదేరి వెళుతూ ప్రమాదానికి గురవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఎస్సై శివ బసవరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
మార్కాపురం రూరల్ (మార్కాపురం): రైలు కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం మార్కాపురం గజ్జలకొండ రైల్వేస్టేషన్ మధ్య జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మొద్దులపల్లి గ్రామానికి చెందిన భీమనబోయిన శివ (22) ఆదివారం ఉదయం రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని గుర్తించి స్థానికులు రైల్వే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఏఎస్సై వెంగళరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఆత్మహత్య చేసుకున్నాడా..?లేదా పొరపాటున పడ్డాడా అన్న అంశంపై రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే పెళ్లైన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో భార్య, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రాచర్ల: గేదెలను అపహరించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆకవీడుకు చెందిన గోతం శేషయ్య గేదెలు, గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో నష్టాలు రావడంతో మద్యానికి అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. ఈ క్రమంలో నష్టాలు ఎలాగైనా తీర్చాలని దొంగతనాలకు పూనుకున్నాడు. అతనితో కలిసి గేదెల వ్యాపారం చేస్తున్న నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన వడ్ల శ్రీను, అతని బావ పసుల రాజు, మరో వ్యక్తి మండ్ల బాలరంగయ్య..వీరు నలుగురు కలిసి గేదెలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన ఆకవీడులో ఒక దొడ్డిలో గేదెలు చూసిన తరువాత అదే రోజు అర్ధరాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో కంచెలో ఉంచిన ఒక గేదెతో పాటు ఒక కోడెదూడ, ఒక దున్నపోతును అపహరించి మార్కెట్లో రూ.2,40,000లకు విక్రయించారు. గేదెలు కనిపించడం లేదని పేరం వెంకట సుబ్బారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో ఈ నలుగురు దొంగతనం చేశారని నిర్ధారణ కావడంతో రాచర్లఫారం గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాల పక్కన ఉన్నారని సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
నాయకుల అండతో రాష్ట్రంలో డ్రగ్స్ సామ్రాజ్యం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రాజకీయ నాయకుల అండదండలతో డ్రగ్స్ వ్యాపారం సామ్రాజ్యం విస్తరించిందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. డ్రగ్స్ను అరికట్టాలి, యువత భవిష్యత్ను కాపాడాలి అనే అంశంపై ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులైనా దొరకవేమో కానీ అన్ని వేళలా డ్రగ్స్ మాత్రం అన్నీ చోట్లా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఒకప్పుడు చాటుమాటు వ్యవహారంలా సాగే డ్రగ్స్ దందా నేడు నడిబజారుకెక్కిందన్నారు. చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో అడ్డూ అదుపు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో గంజాయి సాగులో ఉందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఏడాదికి రూ.25 వేల కోట్ల మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారని తెలిపారు. గంజాయి మాఫియాకు పాలక పార్టీల అండదండలే కారణమని మండిపడ్డారు. గంజాయి నిర్మూలన కోసం పనిచేస్తూ హత్యకు గురైన పెంచలయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం.విజయ మాట్లాడుతూ రోజూ గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నా, క్వింటాళ్ల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా గంజాయి రవాణా ఆగడం లేదని , దీని వెనక ఉన్న శక్తులను అరెస్టు చేస్తేనే కానీ ఈ మహమ్మారి పీడ వదలదని స్పష్టం చేశారు. గంజాయి కట్టడికి హోంశాఖ తగినస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. డైఫీ ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామిలు మాట్లాడుతూ పాలక పార్టీల వల్లే డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాది ఎస్కే మోబినా, ఐద్వా నగర కార్యదర్శి ఆదిలక్ష్మి, నగర నాయకులు కె.రాజేశ్వరి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జువ్వాజి రాజు, డైఫీ జిల్లా నాయకులు పి.కిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జి.రమేష్, కె.యోబు, బి.రత్నం పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ధ్వజమెత్తిన మహిళా నాయకులు -
పథకం ప్రకారమే హత్య
గిద్దలూరురూరల్(బేస్తవారిపేట): మండలంలోని దంతరేపల్లిలో భార్య, కూతురు కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్లు గిద్దలూరు సీఐ కె.సురేష్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సారమేకల హరికి.. లక్ష్మీదేవితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే భార్యతో వచ్చిన విభేదాలతో 15 ఏళ్లుగా లక్ష్మిదేవి వేరువేరుగా ఉంటున్నారు. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి ఇల్లు, పొలాలు చూసుకుని భార్య లక్ష్మీదేవితో గొడవపడి వెళ్తుండేవాడు. దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకొని సమయం కోసం ఎదురుచూసింది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన హరి గ్రామానికి వచ్చాడు. 5వ తేదీన భార్య, కుమార్తెతో గొడవ పడ్డారు. దీంతో వారిద్దరూ పథకం ప్రకారం ముఖంపై కారం చల్లి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. సంజీవరాయునిపేట వీఆర్వో ఇచ్చిన రిపోర్టు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం నిందితులు ఇద్దరిని దంతరేపల్లిలో అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఒంగోలు టౌన్: ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం...మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన నైనాల శ్రీనివాసరావు (28) జామకాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. శనివారం జామకాయలు అమ్మకం ముగించుకొని ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు. త్రోవగుంట సమీపంలోకి రాగానే ఆటో బోల్తా పడింది. నైనాల శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇనమనమెల్లూరులో విషాదం నెలకొంది. మృతుడి భార్య పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒంగోలు సిటీ: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలు మండలంలో కరవదిలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రస్థాయి మహిళా బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.40 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.25 వేలు, నాల్గవ బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.15 వేలు, ఆరో బహుమతి రూ.10 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 8978095030 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
వందేళ్ల సంబురం..!
ఒంగోలు సిటీ: ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శత జయంతి ఉత్సవాలు పండుగలా సాగాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో దేశ నలుమూలల నుంచి వేలాది మంది పాఠశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 20 ఏళ్ల నుంచి యువత మొదలుకొని 80 ఏళ్ల వృద్ధుల వరకు వయసు, హోదాలు, పదవులు పక్కనపెట్టి శతజయంతి ఉత్సవాల్లో ఆడుతూ పాడుతూ, గంతులు వేస్తూ కేరింతలు కొట్టారు. చిన్నానాటి జ్ఞాపకాలను, ఆనాటి మధుర స్మృతులను తలుచుకుంటూ మనసారా నవ్వుకున్నారు. ఎక్కడో పుట్టి, ఇక్కడ కలిసి, ఎక్కడో పెరిగి ఐదారు దశాబ్దాల అనంతరం మళ్లీ కలిసి అరుదైన జ్ఞాపకాలు నెమరేసుకుని బరువెక్కిన గుండెలతో తిరిగి వెళుతున్నామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలు గుండెను బరువెక్కించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పూర్వ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో నగరం మొత్తం కళకళలాడింది. సుమారు 2 వేలకు మందిగా పైగా పూర్వవిద్యార్థులు, అతిథులు పాల్గొనడంతో పీవీఆర్ స్కూల్ గ్రౌండ్స్ ఉత్సవ వేదికగా మారింది. వేడుకల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదన్నారు. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పీవీఆర్ హైస్కూల్లో చదువుతున్న వారిలో ఎంతో మంది గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు. దశాబ్దాల కాలం తర్వాత అందరూ ఒకేసారి కలుసుకునేలా వందేళ్ల ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రిటైర్డు డీజీపీ నండూరి సాంబశివరావు, ప్రముఖ వైద్యులు (యూఎస్ఏ) రంగరాజన్ వంటి ప్రముఖులు ఎందరో పీవీఆర్ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నామని తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు ఆదివారం నాడు చేపట్టిన పలు కార్యక్రమాలతో విద్యాభివృద్ధి సామాజిక బాధ్యతగా నూతన సంకల్పానికి వేదికగా నిలిచింది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నళినిప్రియ డ్యాన్స్ అకాడమీ వారి నాట్యాలు, చందు డ్యాన్స్ అకాడమీ వారి నృత్యం, పీవీఆర్ 76–77 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన పీవీఆర్ చరిత్ర వంటి సాంస్కతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పూర్వ విద్యార్థుల పరిచయాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి ఆత్మీయ సత్కారాలు వేడుకలకు మరింత వన్నె తెచ్చాయి. వేడుకల సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ఫైలాన్ను బాలికల పాఠశాల వద్ద మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం హెడ్ మాస్టర్గా పనిచేసిన కొప్పోలు హనుమంతరావును గురప్రుబగ్గీపై పాత పీవీఆర్ స్కూల్ నుంచి బాలుర స్కూల్ వరకు ఊరేగింపుతో ఆహ్వానం పలికారు. శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, దేనువుకొండ సుబ్బయ్య, మాంటిస్సోరి ప్రకాష్లను పలువురు అభినందించారు. ఉత్సవాల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, బత్తిన మదన్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది హాజరు విద్యార్థుల ఆత్మీయ కలయికతో పులకించిన పాఠశాల ప్రాంగణం -
లారీని ఢీకొని ఒకరు మృతి
రాచర్ల: లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని యడవల్లి క్రాస్ రోడ్డు వద్ద అమరావతి–నంద్యాల జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు పట్టణానికి చెందిన పరిశపోగు అభిషేక్(30) , డ్రైవర్ ఇల్లూరి నరేంద్ర ఇద్దరు కలిసి గిద్దలూరు నుంచి కంభానికి కారులో బయలుదేరారు. అదే సమయంలో నంద్యాల నుంచి నరసరావుపేటకు మొక్కజొన్న లోడుతో ముందు వెళుతున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు లారీ వెనుకభాగంతో బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిశపోగు అభిషేక్ (30)అనే యువకుడు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై. పి.కోటేశ్వరరావు తెలిపారు. -
గురుదేవోభవ..
రథంపై ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆయన ఏ రాజకీయ నాయకుడో, ప్రజాప్రతినిధో కాదు.. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయునిగా తమకు చదువు చెప్పి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న 93 ఏళ్ల కొప్పోలు హనుమంతరావును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు రథంపై ఉంచి ర్యాలీగా ఊరేగించారు. పూర్వవిద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆయన్ను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.– సాక్షి, ఒంగోలు -
వ్యాపారులపై పెరిగిన దాడులు
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వంలో వ్యాపారాలు జరగక తమ దుకాణాలను మూసివేసుకుంటున్నారని, దానికి తోడుగా వ్యాపారులు, వైశ్యులపై దాడులు ఎక్కువయ్యాయని రాష్ట్ర మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొదిలిలో పోలీసులు ఆర్యవైశ్య వ్యాపారులైన అవినాష్, యాదా కోటేశ్వరరావుపై ఏ విధంగా దాడులు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందన్నారు. దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఊరంతా ఏకమై బంద్ నిర్వహిస్తే ఆయనను వీఆర్కు పంపి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, రేషన్ డీలర్గా రాజీనామా చేయాలని దర్శి మండలంలో ఆర్యవైశ్యుడైన సత్యనారాయణపై ఒత్తిడి తీసుకొచ్చారని, తాను దశాబ్దాల కాలంగా డీలర్గా కొనసాగుతున్నానని, రాజీనామా చేయనని కోర్టునుంచి స్టే తీసుకొస్తే అతనిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారన్నారు. సత్యనారాయణ భయంతో గుడిలో దాక్కుంటే అతనిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జ్యోతి అనే ఆర్యవైశ్య మహిళ భర్త ఆర్ధిక ఇబ్బందులతో కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లిందని, ఆమెను రాత్రి 7.30 నుంచి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఉంచారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ఒక ప్రేమోన్మాది యువతి తండ్రి ఒప్పుకోలేదని ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను దాడి చేసి చంపేశాడని, ఈ దాడులన్నీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగినవేనన్నారు. ఈ రోజు వైశ్యులు వ్యాపారాలు చేసేందుకు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి నాయకులు ఆర్యవైశ్య ఓట్లతో గెలిచారన్నారు. దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఉగ్రరూపం చూపించాల్సి వస్తుందని, వారిని భయపెడితే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేది ఆర్యవైశ్యులేనని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు చందాల వసూలు: పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రోడ్డుపై ఏర్పాటు చేస్తామని చెప్పి సిగ్గులేకుండా చందాలు వసూలు చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టలేకుండా పోతోందని వెల్లంపల్లి విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం కోసం రూ.1750 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారని, అందుకు తమకేమీ అభ్యంతరం లేదని, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కేవలం రూ.50 కోట్లు ఖర్చుపెట్టలేక చందాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేశాం, రాష్ట్రం అంతా వైశ్యుల వద్ద డబ్బులు దండుకొనిరమ్మని టీడీపీ గూండాలను పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఒక విగ్రహానికి అయ్యే ఖర్చుపెట్టుకోవటానికి చంద్రబాబు ప్రభుత్వానికి చేతకాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే గతంలో మీరేం చేశారని టీడీపీ నుంచి కొంతమంది వైశ్యులు బయటికి వస్తున్నారని, గతంలో జగన్మోహన్రెడ్డి వైశ్యుల కోసం చేసిన సహాయం మీ చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేడని అన్నారు. ఈబీసీ నేస్తమని ప్రతి పేద ఆర్యవైశ్య కుటుంబాన్ని ఆదుకుంది జగన్మోహన్రెడ్డి అని, జగనన్న కాలనీల్లో స్థలాలు మంజూరు చేశారని, మీరేమైనా వారి కోసం ఒక్క పథకం అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకు చెందిన ఒకాయన మంత్రి ఉన్నాడని, కొంతమంది నాయకులు ఉన్నారని, ఘోరంగా తమ సామాజికవర్గంపై దాడులు చేస్తుంటే నోరుమూసుకొని చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. -
బీసీ సామాజిక రక్షణ చట్టం చేయాలి
ఒంగోలు టౌన్: రజక వృత్తిదారుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు రక్షణ చట్టం చేయాలని, అపార్ట్మెంట్లలో పనిచేసేవారి మీద, వాచ్మెన్ల మీద జరిగే దాడులు, వేధింపులు, అక్రమ నిర్బంధాలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య డిమాండ్ చేశారు. ఎల్బీజీ కార్యాలయంలో ఆదివారం రజక సంఘం జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాచకొండ వెంకట కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భాస్కరయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీసీలందరికీ సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నామమాత్రంగా కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని, వెంటనే వివిధ వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి విధివిధానాలు తయారు చేయాలని కోరారు. జీవో నంబర్ 27 ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో వృత్తిలో ఉన్న రజకులకు రూ.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని, కనీస వేతనం రూ.1800 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు పొదిలి శ్రీనివాసులు, రాయల మాలకొండయ్య, ఎ.రమణమ్మ, ఎం.శ్రీనివాసులు, సీహెచ్.శ్రీనివాసులు, చీమకుర్తి కోటేశ్వరరావు, గుర్రపుశాల శ్రీను, అమరయ్య, యోగమ్మ, మల్లికార్జున పాల్గొన్నారు. సంఘ క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
ఎడ్ల పోటీలతో రైతుల్లో ఆనందం
యర్రగొండపాలెం: తెలుగుదనం ఉట్టిపడేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతోందని, జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చేలా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటుచేసి రైతుల మోములో ఆనందం తీసుకొచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ఆదివారం ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. అధికారం లేనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలను ఉత్తేజపరచడం హర్షించదగిన విషయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి, ఆవకాయ అంటూ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని, అక్కడ ఆవకాయ మాత్రమే మిగులుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడి బతికే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యవసాయాన్ని దండగ చేసిన చంద్రబాబు కూటమికి వ్యతిరేకంగా వ్యవసాయం అంటే పండుగ అని, మన సంస్కృతికి అద్దంపట్టే ఎద్దుల పోటీలకు ఆశేషంగా ప్రజలు తరలిరావడం శుభపరిణామమని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతులకు పండగని, నష్టం వచ్చినా వ్యవసాయం చేయాల్సిందేనని, ఎందుకంటే వ్యవసాయమే రైతు జీవనమన్నారు. వ్యాపారమని, ఉద్యోగమని, ఒక వేళ రైతులు వ్యవసాయం చేయకుంటే ప్రజలంతా పస్తులు పండుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్అలీబేగ్, మార్కాపురం మునిసిపల్ చైర్మన్ చిర్లంచెర్ల మురళీకృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ ఐవీ.సుబ్బారావు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, ఎంపీపీలు దొంతా కిరణ్గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి సుబ్బమ్మ, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, వాగ్యా నాయక్, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పీ కృష్ణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, ఎం.రాజశేఖర్, పి.రాములు నాయక్ పాల్గొన్నారు. -
పోర్టు పనులను పరిశీలించి ఏపీఎంబీ సీఈఓ
కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ఏపీ మారిటైంబోర్డు సీఈఓ అభిషేక్శర్మ, ఎస్డీఓ రాజశేఖర్ ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం పోర్టు నిర్మాణంలో జరుగుతున్న పనులు, ఎంతమేర పూర్తి చేశారు, ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ ఉన్నాయనే అంశాలను పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం ఈ ప్రాంత అభివృద్ధికి కీలకం కానున్న నేపథ్యంలో త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిశోర్ తదితరులు ఉన్నారు. -
‘పొట్ట’ కొట్టకే పిట్టా!
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పైరును కళ్ల ముందే పిట్టలు నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపట్నంతోపాటు పరిసర ప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయంలో వేలాది పిట్టలు వరి కంకులపై వాలి గింజలు తొలిచేస్తుండటంతో విలవిల్లాడుతున్నారు. పక్షులను బెదరగొట్టేందుకు పొలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాస్తున్నా మరో దిక్కున పంటపై వాలి నాశనం చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు చేసేదేమీ లేక పంటను వదిలేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని, పిట్టలను తోలేందుకు కూలీలను నియమించినా ప్రయోజనం కానరావడం లేదని రైతులు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పక్షుల బెడద నుంచి పంటను రక్షించుకునే మార్గాలు సూచించాలని కోరుతున్నారు. – కొత్తపట్నం -
మృత్యుంజయులు..!
మద్దిపాడు: లారీ డ్రైవర్ నిద్ర మత్తులో కారును ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ప్రమాదం నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం జాతీయ రహదారిపై మద్దిపాడు ఫ్లైఓవర్పై జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మూడో సంవత్సరం విద్యార్థులు సంక్రాంతి సెలవు రావడంతో స్నేహితులి కారు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో మద్దిపాడు ఫ్లైఓవర్పై వెళుతుండగా హర్యానాకు చెందిన కంటైనర్ లారీ నిద్రమత్తులో కారు కుడివైపుబలంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లాడు. కారులోని విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు గమనించి లారీ డ్రైవర్ను అప్రమత్తం చేశారు. వెంటనే లారీ డ్రైవర్ బ్రేకులు వేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీయడంతో ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులోనికి తీసుకొని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కారును 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన లారీ ప్రాణాలతో బయటపడిన యువకులు -
శతాబ్ది ఉత్సవాలు
అట్టహాసంగా ఒంగోలు సిటీ: ఒంగోలు విద్యా చరిత్రలో అతి అరుదైన ఘట్టంగా స్థానిక పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖులంతా ఈ వేడుకలను జ్ఞాపకాల జాతరగా మలిచారు. పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాన్ని మించి నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. విద్యా సంస్కృతులతో, భావోద్వేగాలతో ఆ ప్రాంగణమంతా కళకళలాడింది. శనివారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో శతాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. పీవీఆర్ స్కూల్ చరిత్రను ప్రతిబింబించే నృత్య రూపకం ఆకట్టుకుంది. చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు వారి ప్రదర్శనలో పాఠశాల శతాబ్ది కాల ప్రయాణం కళాత్మకంగా ఆవిష్కృతమైంది. నళిని ప్రియా కూచిపూడి నృత్యానికేతన్ వారి గణపతి స్తోత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభను కమిటీ కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్ సారథ్యంలో కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు అధ్యక్షతన ప్రారంభించారు. సుదీర్ఘకాలం హెడ్మాస్టర్గా పనిచేసిన కొప్పోలు హనుమంతరావు, ఇతర గురువులను ఘనంగా సత్కరించారు. హోదాలు, పదవులు పక్కనబెట్టి చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమం ఆద్యంతం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది. సుమారు 2000 మంది పూర్వ విద్యార్థులు, అతిథులు పాల్గొనడంతో పీవీఆర్ స్కూల్ గ్రౌండ్స్ ఉత్సవ వేదికగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల పరిచయాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి ఆత్మీయ సత్కారాలు వెరసి వేడుకలకు మరింత వన్నెతెచ్చాయి. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, నిర్వాహకులు దేనువుకొండ సుబ్బయ్య, బోడపాటి వెంకట సుబ్బారావు, మాంటిస్సోరి ప్రకాష్, పలువురు నాయకులు, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు, ప్రముఖులతో కళకళలాడిన ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు -
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
ఒంగోలు సబర్బన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. స్థానిక డీటీసీ కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అతివేగంతో ప్రమాదాలు జరుగుతాయన్నారు. అజాగ్రత్తగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు చెప్పారు. ప్రతి బస్సులో అనుభవం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించాల్సిందిగా సూచించారు. సుదీర్ఘ దూర ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లను ఉంచాలని, డ్రైవర్ విశ్రాంతి నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిందారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చడంతో పాటు, అత్యవసర ద్వారం విధిగా పరిశీలించాలన్నారు. ప్రయాణికులు అత్యవసర పరిస్థితులలో సహాయం పొందేందుకు ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ 9281607001 నంబర్ను బస్సులో స్పష్టంగా చదువుకోగలిగిన రీతిలో ప్రదర్శించాలని ఆదేశించారు. సంక్రాంతి సమయంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే సర్చార్జి అనుమతి ఉందని, అంతకు మించి వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లతో పాటు రవాణా శాఖ ఏఓ శ్రీనివాసులు, సుధాకర్, రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, కిరణ్ప్రభాకర్, జగదీష్, ధర్మేంద్ర, సురేంద్ర ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులకు హెల్ప్లైన్ నంబర్ 9281607001 ఏర్పాటు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో డీటీసీ సుశీల -
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ సెలక్షన్స్
సింగరాయకొండ: ఆంధ్రప్రదేశ్ ఆధునిక కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఏఆర్సీఅండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో రాష్ట్రస్థాయి ఆధునిక కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తేళ్ల వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్స్లో పాల్గొనే క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, ఆధార్కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9502388413 నంబర్లను సంప్రదించాలని కోరారు. సింగరాయకొండ: మండల కేంద్రంలోని చాకలిపాలేనికి చెందిన కుంభా యమ కిషోర్(31) నెల రోజులుగా కనిపించడం లేదని అతని తల్లి శివకుమారి శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 10వ తేదిన ఒంగోలు లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని, తిరిగి రాలేదని ఎక్కడ వెతికినా ప్రయోజనం లేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. కొనకనమిట్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని గొట్లగట్టులో ఈ నెల 14 నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు, నాల్గవ బహుమతి రూ.3 వేలను అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న జట్లు ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9912312365, 8096476870 నంబర్లను సంప్రదించాలని కబడ్డీ పోటీల నిర్వాహకులు ఎన్.వెంకటేశ్వర్లు, గుమ్మా శ్రీనివాసులు కోరారు. ఒంగోలు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ నెల 13న జిల్లాస్థాయి సంప్రదాయ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి జి.రాజరాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వం, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు తాడాట, తొక్కుడు బిళ్ల, కర్రసాము, తాడు లాగుడు పోటీలు ఉంటాయని, పురుషులకు కర్రసాము, ఏడు పెంకులాట, తాడులాగుడు, గాలిపటాలు పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9గంటలకు స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకానులు పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖకు సంబంధించి ఈ నెల12న క్రికెట్ టీమ్ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల క్రికెట్ గ్రౌండ్లో జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 2 నుంచి 7వ తేదీ వరకు నెల్లూరు, వెంకటగిరిలలో జరుగుతున్నాయని వెల్లడించారు. అందులో భాగంగా ప్రకాశం సర్కిల్ టీమ్కు ప్రాతినిధ్యం వహించేందుకు జట్టు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన ప్రకాశం విద్యుత్ సర్కిల్లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. -
బాబు నిర్బంధ పాలనను వ్యతిరేకించండి
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన నాయకుల మీద నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్న చంద్రబాబు పాలనను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. మల్లయ్య లింగం భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమన్నారు. అప్పలరాజు మీద వున్న 19 కేసులు ప్రజా సమస్యల మీద పనిచేసిన కేసులే వున్నాయని తెలిపారు. వాటిలో కూడా 13 కేసులను కొట్టివేయడం జరిగిందని, నాలుగు కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. హోం శాఖ మంత్రి వంగలపూడి వనిత రైతులు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక చంద్రబాబు మెప్పు పొందేందుకే అప్పలరాజుపై కేసు బనాయించారని విమర్శించారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించే క్రమంలో ప్రశ్నించే నాయకులను కేసులతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవుపలికారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జజ్జూరి జయంతి బాబు, ఏపీ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, పి.కల్పన, శ్రీరాం శ్రీనివాసరావు, సుబ్బారావు, ఎంఎస్ సాయి పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
బేస్తవారిపేట: కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం రాత్రి బేస్తవారిపేట జంక్షన్లోని ప్లైఓవర్పై జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..నంద్యాల జిల్లా గాజులపల్లెకు చెందిన షేక్ అప్పునపల్లి అల్లాబకాష్(35), గిద్దలూరుకు చెందిన పీరయ్య, షేక్ ఖాశీంపీరాలు కంభంలోని ఓ గృహంలో టైల్స్, మార్బుల్స్ బిగించారు. ముగ్గురు మోటార్సైకిల్పై గిద్దలూరు వెళ్తున్న సమయంలో బేస్తవారిపేట జంక్షన్ ప్లైఓవర్పై ఎదురుగా కంభం వైపు వెళ్తున్న కారు బస్ను ఓవర్ క్రాస్ సమయంలో ఢీకొట్టింది. మోటార్సైకిల్ నడుపుతున్న అల్లాబకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పీరయ్య, ఖాశీంపీరాలను హైవేరోడ్డు అంబులెన్స్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోటార్సైకిల్ నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బేస్తవారిపేట ప్లైఓవర్పై ఘటన -
నాణ్యమైన వైద్యం.. అత్యుత్తమ విద్య
ఒంగోలు టౌన్: రాజకీయ, సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలిచిన ఒంగోలు ఎంతోమంది సినిమా దర్శకులను, నటులను, రచయితలను అందించింది. మరెంతోమంది కవులకు పుట్టినిల్లుగా పేరొందింది. వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఒంగోలులో పుట్టి పెరిగారు. వైద్యరంగంలో కూడా ఒంగోలుకు ప్రత్యేక స్థానం వుంది. దాన్ని నేటి తరం వైద్యులు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అత్యుత్తమ ప్రతిభతో ఆధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా వ్యాధులు వస్తే జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యేవారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్, చైన్నెలకు పరుగులు పెట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సమయాల్లో ఆపద్భాందువుల్లా ఆదుకుంటున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా హైదరాబాద్, చైన్నెలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నగరంలోనే మంచి వైద్య చికిత్సలు చేసి ప్రాణాలను కాపాడుతున్నారు. సంతాన సాఫల్యం కోసం గతంలో విజయవాడ, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకునేవారు. నెలనెలా చికిత్స కోసం వెళ్లలేక ఇబ్బందులు పడేవారు. అసలు వైద్యం కంటే ప్రయాణ ఖర్చులే ఎక్కువయ్యేవి. కానీ ఇప్పుడు ఒకడుగు రైల్వే స్టేషన్ వైపు వేస్తే జాయ్ హాస్పిటల్ వస్తుంది. ఇటు కర్నూలు రోడ్డుకు వెళితే విశ్వాస్ మల్టీ హాస్పిటల్ కనిపిస్తుంది. పండరీపురం బైపాస్ ఎక్కితే ఫెర్టీ కేర్ వచ్చేస్తుంది. నగరంలో ఎటువైపు వెళ్లినా చాలు సంతాన సాఫల్య చికిత్స లభిస్తుంది. విద్యారంగంలో కూడా ఒంగోలు నగరం పేరు ప్రఖ్యాతలు పొందింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో రాష్ట్ర స్థాయి బోధన కలిగిన కళాశాలలు ఉన్నాయి. నేటి తరానికి అవసరమైన విద్యనందిస్తున్నాయి. ఆధునిక ఏఐని సైతం చక్కగా బోధించే ఉపాధ్యాయులున్నారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో పేరెన్నికగన్న బ్రాండ్లు ఒంగోలు ప్రజలకు అందుబాటు ధరల్లో దుస్తులను విక్రయిన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ రకాల వ్యాపారాలు, వ్యాపకాలు ఇప్పుడు ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యలో విప్లవం ... ఫ్యాషన్ ప్రభంజనం.. అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో వైద్య చికిత్సలు అందిస్తున్న ఒంగోలు వైద్యులు అందుబాటులోనే కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు విద్యారంగంలోనూ దూసుకొని పోతున్న జిల్లా కేంద్రం ప్రసిద్ధి చెందిన కళాశాలలు..ప్రముఖులకు నెలవు -
హోరాహోరీగాక్రికెట్ పోటీలు
మేదరమెట్ల: రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి కప్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా రెండో రోజైన శనివారం జరిగిన రెండు మ్యాచ్ల్లో చైన్నె జట్లు విజయం సాధించాయి. ఉదయం జరిగిన మొదటి మ్యాచ్లో స్పార్టన్ వారియర్స్ తిరుపతి –సౌత్జోన్ సీసీ చైన్నె జట్లు తలపడ్డాయి. స్పార్టన్ వారియర్స్ తిరుపతి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన త్జోన్ సీసీ చైన్నె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన స్పార్టన్ వారియర్స్ తిరుపతి జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్ ఎంఆర్సీసీ చైన్నె– ఓకేషనల్ సీసీ బెంగులూరు జట్ల మధ్య జరగ్గా బెంగుళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఎంఆర్సీసీ చైన్నె జట్టు 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్లు చివరి వరకు హోరాహోరీగా సాగాయి. నేటి మ్యాచ్లు: ఆదివారం ఉదయం ఏసీసీ లెవెన్ విజయవాడ–సౌత్జోన్ సీసీ చైన్నె జట్ల మధ్య, మధ్యాహ్నం జీడీసీఏ లెవెన్ గుంటూరు– ఎంఆర్సీసీ చైన్నె జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చైన్నె జట్ల విజయం -
హద్దు మీరితే మూల్యం తప్పదు
ఒంగోలు టౌన్: ఐదేళ్ల పాలనలో దేశంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కనివినీ ఎరుగని విధంగా అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి హద్దుమీరి విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు హెచ్చరించారు. ఏబీఎన్ టీవీ డిబేట్లో జగన్ మోహన్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలను కప్పిపుచ్చి, రైతుల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే ఎల్లో మీడియాను రంగంలోకి దించారని ఆరోపించారు. జగనన్నను ఉద్దేశించి విషసర్పం అని కువిమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తుందెవరో, తటస్తుల పేరుతో టికెట్లను అమ్ముకున్నదెవరో, పార్టీల మార్పులను ప్రోత్సహించిందెవరో ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీతో, ఢిల్లీలో బీజేపీతో ఒకేసారి ఇద్దరితో కాపురం చేస్తూ నీతిమాలిన రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసున్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిత్వ హననం: భూ సేకరణ పేరుతో అమరావతి రైతులను మోసం చేస్తున్నారని చుండూరి మండిపడ్డారు. సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు వేల ఎకరాలను దోచిపెడుతున్న చంద్రబాబు వైఖరిని ప్రశ్నించిన జగనన్నపై అక్కసుతో వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఐదేళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రజలకు జగనన్న ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కరోనా సమయంలో కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించారని, ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను అందించారని, గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లిన పాలనా దక్షకుడు జగనన్నను విమర్శించడం నైతికంగా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను, పేద బిడ్డలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, దాన్ని పూర్తి చేయడం చేతకాక పీపీపీ పేరుతో పేదప్రజలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని హితవు పలికారు. మెడికల్ కళాశాలను కట్టడానికి డబ్బులు లేవని ఒట్టి చేతులు చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1500 కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా బడా కార్పొరేట్లకు 99 పైసలకే భూములు కట్టబెట్టడం ఎవడబ్బ సొమ్మని పంచుతారని ప్రశ్నించారు. రేపు మా ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ యాజమాన్యం, యాంకర్ల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టం అందరికీ సమానమేనని నిరూపించాలని కోరారు. న్యాయవాది హరిబాబు మాట్లాడుతూ టీవీ డిబేట్ అనే సాకుతో మాజీ ముఖ్యమంత్రి జగనన్న మీద వ్యక్తిగత విమర్శలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, గౌడ్ విభాగం జిల్లా అధ్యక్షులు తాతా నరసింహ గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్ర, డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి రెడ్డి, శ్రీనివాసరావు, అమర్, పులసు సురేష్ , దేవా, అశోక్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర
ఒంగోలు టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్న విషయంపై శనివారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన ‘పందెం కోడి – కయ్యానికి రెఢీ’ అనే కథనానికి ఎస్పీ హర్షవర్థన్ రాజు స్పందించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోడి పందేలు, పేకాట ఇతర జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందేలు, జూదాలు, గుండాట నిర్వహించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎవరైనా కోడి పందేలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కోడి పందేలను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కోడి పందేల్లో పట్టుబడిన వ్యక్తులను బైండోవర్ చేయాలని, పందేలు ఉపయోగించే కత్తులు తయారు చేసే వారు, వాటిని సరఫరా చేసేవారు, పందెం నిర్వహించేందుకు స్థలాలను కేటాయించే వారిని గుర్తించాలన్నారు. పండుగ రోజు కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడైనా కోడి పందాలు జరుగుతున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. -
కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవం
● గంధ మహోత్సవానికి హాజరైన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తాళ్లూరు: కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో హజరత్ సయ్యద్ నాగూర్ మీరావళి షరీఫ్ దర్గా ద్వితీయ గంధ మహోత్సవానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా దర్గా పూజారి షేక్.ఖాసీంవళి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ గంధ మహోత్సవం జరుపుకోవడం వలన ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దాదాపు 7 వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీఫ్, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్రెడ్డి, ఆలోకం హరిబాబు, మండల నాయకులు షేక్ లతీఫ్ (బచ్చా), గూడా గోపాల్రెడ్డి, షేక్ లతీఫ్, కటకంశెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం, గోపు శ్రీనువాసరెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి విష్ణు, యత్తపు మధుసూదన్రెడ్డి, జక్కుల రామకృష్ట, గుజ్జుల యోగిరెడ్డి, గుజ్జుల వెంకటేశ్వరరెడ్డి (గోల్డ్), షేక్ మస్తాన్వళి, సైదా, అలీషా కాలేషా, ఖాసీంవలి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
రంగుల సోయగం.. సంక్రాంతి సంబరం
ఒంగోలు టౌన్: ఖాకీల కవాతు, బూట్ల చప్పుళ్లతో గంభీరమైన వాతవరణం ఉండే పోలీస్ పరేడ్ గ్రౌండ్.. శుక్రవారం రంగురంగుల ముగ్గులతో సింగారించుకున్న సీతాకోకచిలుకలా దర్శనమిచ్చింది. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తరలివచ్చిన పోలీసుల కుటుంబ సభ్యులతో కళకళలాడింది. గంగిరెద్దుల విన్యాసాలు, పొట్టేళ్ల ప్రదర్శన, నింగినంటిన గాలిపటాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, పెయింటింగ్ పోటీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను ఆయన సతీమణి శృతి దండు ప్రారంభించారు. కలెక్టర్ సతీమణి పి.సుజాత, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, దామచర్ల నాగసత్యలత హాజరయ్యారు. రంగవల్లుల పోటీల్లో 100 మందికి పైగా మహిళలు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేశారు. ఏఆర్ ఎస్సై నాగేశ్వరరావు సతీమణి సీహెచ్ కళ్యాణి ప్రథమ బహుమతి, ఉలవపాడు పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ బి.సాహిత్య ద్వితీయ బహుమతి, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి సతీమణి బి.నాగలక్ష్మి తృతీయ బహుమతి, ఏఆర్ పీసీ రోశయ్య సతీమణి టి.నాగవేణి, దొనకొండ పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ షేక్ షన్ను వరసగా 4, 5 బహుమతులు సాధించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐ రమణారెడ్డి, ఎస్సైలు, ఏఆర్ ఎస్సైలు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి వేడుక రంగవల్లులు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు కుటుంబాలు కలెక్టర్ సతీమణి సుజాత, ఎస్పీ సతీమణి శృతి, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక చేతుల మీదుగా బహుమతి ప్రదానం -
11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి
● ఉత్తర్వులు అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి.సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి.ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీ, సీహెచ్వీ కోటేశ్వరరెడ్డిని కంభం ఎంపీపీ, సీహెచ్ ప్రసూనను సంతనూతలపాడు ఎంపీపీ, జి.పద్మనాభరెడ్డిని దోర్నాల ఎంపీపీ, ఎం.రూపాదేవిని తాళ్లూరు ఎంపీపీ, వి.సుధాకరరెడ్డిని దర్శి ఎంపీపీ, వి.శ్రీనివాసులరెడ్డిని శింగరాయకొండ ఎంపీపీ, బీఎస్వీ ప్రసాద్ను సంతమాగులూరు ఎంపీపీకి బదిలీ చేసి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ సీఈఓ పి.బాలమ్మ, పరిపాలనాధికారి చల్లా శ్రీనివాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల: రావినూతలలో సంక్రాంతి కప్–2026 టీ20 అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యన్నారాయణ ప్రారంభించారు. ఉదయం మ్యాచ్లో ఏస్ప్రె లెవెన్ హైదరాబాద్ జట్టుపై ఏసీసీ లెవెన్ విజయవాడ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం మ్యాచ్లో క్లాసిక్ లెవెన్ సీసీ జట్టుపై జీడీసీఏ లెవెన్ గుంటూరు టీమ్ గెలుపొందింది. ప్రారంభ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కరణం చెంచుపున్నయ్యచౌదరి, గళ్లా రామచంద్రరావు, అమరనేని ఆంజనేయులు, పూరిమెట్ల లక్ష్మీరమేష్, డీఎల్డీఓ సువార్తమ్మ, అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా శనివారం ఉదయం స్పార్టన్ వారియర్స్ తిరుపతి–సౌత్ జోన్ సీసీ చైన్నె జట్లు, మధ్యాహ్నం ఎంఆర్సీసీ చైన్నె–ఓకేషనల్ సీసీ బెంగళూరు జట్లు తలపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు. -
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
ఒంగోలు సబర్బన్: క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రెవెన్యూ అధికారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల సంబంధిత అంశాలపై జేసీ గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాయింట్ కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను డీఆర్ఓలకు, డివిజన్ లెవెల్ ఆఫీసర్ల వద్ద ఉన్న అధికారాలను తహసీల్దార్లకు ప్రభుత్వం బదలాయించిందన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయ ఫలాలు క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా కనిపించాలన్నారు. భూముల మ్యుటేషన్, ఆన్లైన్, సర్వే తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఇకపై ప్రతినెలా రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. ఫైళ్లన్నీ ఆన్లైన్లోనే పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తహసీల్దార్లు అందరూ టూర్ డైరీ రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరును డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ నిరంతరం గమనిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. 22(ఏ) భూముల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. సబ్ డివిజన్ చేయడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన ప్రక్రియపైనా అధికారులకు అవగాహన కల్పించారు. ఈనెల 11వ తేదీలోగా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో డీఆర్ఓ బి.చినఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు, అద్దంకి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, సబ్ రిజిస్ట్రారులు, తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు, దేవదాయ శాఖ ఈవోలు పాల్గొన్నారు.అనంతరం మార్కాపురం జిల్లాకు ఇన్చార్జిలుగా ఉన్న కలెక్టర్, జేసీ, డీఆర్ఓతోపాటు ఆర్డీఓలు, ఇన్చార్జి సబ్ కలెక్టర్లను ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. రైతులకు 11 లోగా పట్టాదారు పాస్పుస్తకాలు పంచాలి ప్రకాశం, మార్కాపురం జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
మేధావుల పుట్టినిల్లు.. పీవీఆర్ హైస్కూల్
ఒంగోలు సిటీ: పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్.. ఒంగోలులోని ఈ హైస్కూల్ గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వందేళ్ల క్రితం నిర్మించబడి దశల వారీగా అభివృద్ధి చేయబడిన పీవీఆర్ హైస్కూల్ ఒంగోలు నగరానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారిలో ఎంతో మంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా రాణిస్తున్నారు. లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. నేటికీ విజయవంతంగా నడుస్తున్న పీవీఆర్ హైస్కూల్.. మేధావుల పుట్టినిల్లుగా పేరొందింది. సాధారణంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటారు. కానీ, విద్యా దానం ఇంకా గొప్పదని చాటిచెప్పేందుకు నిలువెత్తు నిదర్శనంగా పీవీఆర్ హైస్కూల్ నిలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీవీఆర్ పాఠశాలకు ఉన్నంత పేరు మరో పాఠశాలకు లేదంటేనే.. పీవీఆర్ హైస్కూల్ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటైన ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దింది. అలాంటి పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది. నేడు, రేపు పీవీఆర్ బాలుర హైస్కూల్లో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. భారీగా పూర్వ విద్యార్థులు తరలిరానున్నారు. పాఠశాల చరిత్ర... కరవది జమిందారు భరద్వాజసగోత్రీకుడైన పిశుపాటి బంగారుభొట్లు, వెంకట లక్ష్మమ్మ కుమారుడు పిశుపాటి వెంకట రంగయ్య 1871వ సంవత్సరంలో జన్మించారు. ఈయనకు సుందరమ్మతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా, ప్రథమ సంతానం బంగారుభొట్లు, ద్వితీయ కుమారుడు వెంకట్రాయశర్మ, కనిష్ట కుమారుడు లక్ష్మీనారాయణ. రెండో కుమారుడు అయిన వెంకట్రాయశర్మ 1892లో జన్మించారు. ఈయన కరవది గ్రామంలోని వేణుగోపాలస్వామి, సీతారామస్వామి, రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉండి దేవాలయ నిర్వహణకు సుక్షేత్రమైన 50 ఎకరాల పంట భూమిని 16–1–1922 తేదీన దానం చేశారు. వెంకట రంగయ్య బ్రిటీషు పరిపాలన కాలంలో నెల్లూరు జిల్లా బోర్డు మెంబరుగా పనిచేశారు. ఈయన 1898లో తన పేరు మీద ఒంగోలులో ఎలిమెంటరీ పాఠశాల ప్రారంభించారు. ఆ తర్వాత దానిని పిశుపాటి వెంకట రంగయ్య హిందూ మిడిల్ స్కూల్గా అభివృద్ధి చేసి పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. 27–1–1922 తేదీన తన 51వ ఏట ఆయన మరణించడంతో ఆయన ద్వితీయ పుత్రుడు వెంకట్రాయశర్మ పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయించి 1925వ సంవత్సరంలో పిశుపాటి వెంకట రంగయ్య హిందూ మిడిల్ స్కూల్గా నూతన భవనంలోకి మార్చారు. దివంగత నర్శింగోలు జనార్దనరావు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పాఠశాలను అభివృద్ధిలోకి తెచ్చారు. 1950లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్, గుంటూరు వారి ఉత్తర్వుల ప్రకారం అప్పటి మున్సిపల్ చైర్మన్ దివంగత దారా గోపాలశాస్త్రి ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపాలిటీలో పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్) స్కూల్ వీలీనమైంది. అప్పటి నుంచి పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్) మున్సిపల్ స్కూల్గా పిలవబడుతోంది. 1950 వరకు 8వ తరగతి వరకు మాత్రమే ఉంది. 1951–52 విద్యా సంవత్సరంలో 9వ తరగతి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఎస్ఎల్సీ ప్రథమ సంవత్సర మొదటి బ్యాచ్ని మార్చి 1954లో దివంగత నర్సింగోలు జనార్దనరావు ఆధ్వర్యంలో ప్రారంభించి పబ్లిక్ పరీక్షలు రాయించారు. అనంతరం 1989లో పీవీఆర్ పాఠశాలను బాలురు, బాలికల పాఠశాలలుగా విభజించి విద్యాబోధన చేస్తున్నారు. పూర్వ విద్యార్థుల్లో ఎందరో ప్రముఖులు... పీవీఆర్ హైస్కూల్లో చదివిన అనేక మంది నేడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఎంతో మంది ప్రముఖులుగా రాణిస్తున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు పీవీఆర్ పూర్వ విద్యార్థి. నేటి శతాబ్ది ఉత్సవాల సభకు ఈయనే అధ్యక్షత వహించనున్నారు. విశ్రాంత డీఐజీ తోట వెంకట్రావు, విశ్రాంత ఐజీ బత్తిన శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వాసిరాజు ప్రకాశం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షేక్ సలీం, నాటక, సినీ రచయిత మరుధూరి రాజా, తదితర ప్రముఖులంతా పీవీఆర్ పూర్వ విద్యార్థులే. వీరంతా శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పీవీఆర్ పూర్వ విద్యార్థులైన ఎందరో మేధావులు, వందలాది మంది పూర్వ విద్యార్థులు శతాబ్ది ఉత్సవాలకు తరలిరానున్నారు. 1925లో పిశుపాటి వెంకట రంగయ్య (పీవీఆర్) పేరుతో పాఠశాల ఏర్పాటు వందేళ్లుగా ఎందరో మేధావులను తీర్చిదిద్దిన పాఠశాల నేటి నుంచి శతాబ్ది వేడుకలు భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు ఎంతో ప్రసిద్ది చెందిన పీవీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలను పూర్వ విద్యార్థులంతా కలిసి నేడు, రేపు అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టగా, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించినప్పటికీ పెయింటింగ్కు కొద్ది రోజుల క్రితమే టెండర్లు ఖరారు చేసి కేవలం మూడు రోజులు ముందుగా పనులు చేపట్టడంతో అరకొరగా జరిగాయి. అసంపూర్తిగా పెయింటింగ్ వేయడంతో పాటు వేడుకలు నిర్వహించనున్న పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్ను శుక్రవారం వరకూ కూడా పరిశుభ్రం చేయించలేదు. మరుగుదొడ్లు సైతం అధ్వానంగా ఉన్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. దీంతో పూర్వ విద్యార్థులే సొంత నిధులతో వేడుకలకు అత్యవసరమైన కొన్ని పనులు చేయించుకున్నారు. ఎంతో పేరున్న పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుండగా, యాజమాన్యమైన నగర పాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పూర్వ విద్యార్థులు, ఉత్సవాల కమిటీ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు మధుబాబు
అద్దంకి: మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న ఉప్పాల మధుబాబు అంతర్జాతీయ స్థాయి మస్టర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యాడు. దాంతో మధుబాబును శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆల్ఇండియా మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మధుబాబు అద్భుత ప్రతిభ కనబరిచి 800 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్, 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 4x1500 మీటర్ల పరుగు పందెంలోనూ బంగారు పతకం సాధించాడు. దాంతో మధుబాబును థాయిలాండ్లో నిర్వహించనున్న అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, ఉపాధ్యాయులు, అభినందించారు. గిద్దలూరు రూరల్: పురుగుల మందు కలిసిన కుడితి తాగి మూడు పాడిగేదెలు మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని కంచిపల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన బూతరాజు గురవయ్య పాడిగేదెలకు గుర్తుతెలియని వ్యక్తులు కుడితిలో పురుగుల మందు కలిపి తాగించారు. దీంతో నాలుగు పాడిగేదెల నోటి నుంచి నురుగు వచ్చి కిందపడి గిలగిలా కొట్టుకున్నాయి. గమనించిన గురవయ్య పశువైద్యశాఖ ఏడీ బాలునాయక్కు సమాచారం అందించారు. పశువైద్యాధికారి శ్రావణ్కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకుని వైద్య సేవలు అందించారు. ఈలోగా మూడు పాడిగేదెలు మృతి చెందాయి. ఒకటి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు పాడిగేదెల మృతితో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గురవయ్య తెలిపాడు. ఒంగోలు సబర్బన్: సఖి వన్స్టాప్ సెంటర్ కోసం అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు వాహనాన్ని కలెక్టర్ పి.రాజాబాబు కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్కు కేటాయించిన ఈ వాహనం ద్వారా అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, బాలికలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించే వెసులుబాటు ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలు లేదా పిల్లలు టోల్ ఫ్రీ నంబర్ 181 లేదా 1098 కు కాల్ చేసి తక్షణ సేవలను పొందవచ్చన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్లు 24 గంటలు అందుబాటులో ఉండి తాత్కాలిక ఆశ్రయం, తక్షణ వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ తదితర సేవలను అందజేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సువర్ణ, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ డీసీపీఓ పీ దినేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. టంగుటూరు: జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు మహారాష్ట్రలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ చాంపియన్షిప్కు తుల్లిబల్లి క్రాంతి కుమార్ ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా కోచ్ గుడిపల్లి మురళి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల షూటింగ్ బాల్ జట్టు తరఫున క్రాంతి కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో వ్యక్తిగత క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు ఆకాంక్షించారు. -
ఎట్టకేలకు రామతీర్థం నీరు విడుదల
● 20 రోజుల అనంతరం మండలానికి రామతీర్థం నీరు మర్రిపూడి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు, మర్రిపూడి, వెలిగండ్ల, సీఎస్పురం మండలాలకు రామతీర్థం జలాలు 20 రోజులుగా అందక తల్లడిల్లుతున్న తరుణంలో ‘మణులొద్దు మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు’ అన్న శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం గురువారం ప్రచురితమైంది. దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు స్పందించారు. ఆయన ఆదేశాలతో 600 ఎంఎం జీఆర్పీ పైపులను కొన్ని లీకులను మరమ్మతులు చేయించి, మర్రిపూడి శివారులోని గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంక్ నింపారు. అక్కడ నుంచి ఓవర్హెడ్ ట్యాంక్కు ఎక్కించి మండలంలోని 33 గ్రామాలకు గురువారం రామతీర్థం జలాలు సరఫరా చేశారు. పామూరు, కనిగిరి, సీఎస్పురం, వెలిగండ్ల మండలాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. మరో 5 రోజుల్లో పశ్చిమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో రామతీర్థం జలాలు అందిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ తెలిపారు. -
తెల్లరాయి అక్రమ మైనింగ్పై కొరడా
● అక్రమ మైనింగ్ క్వారీపై దాడులు ● వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు కందుకూరు: తెల్లరాయి అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఎట్టకేలకు మైనింగ్శాఖ అధికారులు కదిలారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘తెల్లరాయి పచ్చని దోపిడీ’ కథనంపై స్పందించిన మైనింగ్ అండ్ విజిలెన్స్ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ క్వారీపై దాడులు చేశారు. ఆశాఖ సహాయ సంచాలకుడు రామచంద్ర ఆధ్వర్యంలో అధికారుల బృందం వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువు గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో సాగుతున్న తెల్లరాయి తవ్వకాలను అడ్డుకున్నారు. అక్కడ తవ్వకాలు చేస్తున్న భారీ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాహనాలను వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారా, క్వారీ వద్ద ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారా లేదా వంటి విషయాలు బయటకు రావడం లేదు. ఈ దాడుల్లో ఎంత మందిని అదుపులోకి తీసుకున్నా, అక్రమ మైనింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల సంగతేంటి అనేది సస్పెన్స్గా మారింది. అదే సందర్భంలో దాడులకు వెళ్లిన మైనింగ్శాఖ అధికారులను అక్కడ నుంచి కదలకుండా అడ్డుకునే ప్రయత్నం పెద్దఎత్తున జరిగినట్లు సమాచారం. తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్న అధికారులు సాయంత్రానికి వాహనాలను వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్కు చేర్చగలిగారు. -
హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రం
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, జిల్లా స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి అన్నారు. యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నగరంలోని అంబేడ్కర్ భవనం నుంచి ప్రకాశం భవనం ముందు మెయిన్రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేసుకుంటూ నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, నిద్ర లేపేందుకే నిరసనలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంటు, మెడికల్ కళాశాలలు, నిరుద్యోగ భృతి వంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తోందని విమర్శించారు. స్వప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నారని, రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. అక్రమ కేసులు ఎత్తేయాలి: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల గురించి మాట్లాడితే వారిపై కేసులు, గంజాయి కేసులు, పీడీ యాక్ట్ పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమంటే భర్తీ చేయకుండా ప్రశ్నించే గొంతుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులను అరెస్టు చేశారని, ప్రభుత్వం చేసే అక్రమాలపై ప్రశ్నించడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. వెంటనే పెట్టిన కేసులను ఎత్తేయాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు టౌన్ ఏఐవైఎఫ్ కన్వీనర్ ఊటికొండ గోపి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి పాకనాటి మనోహర్రెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి చాగంరెడ్డి కృష్ణచైతన్యరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మలిశెట్టి దేవా, సిటీ స్టూడెంట్ ప్రెసిడెంట్ మెట్టెల వెంకటేష్, ఒంగోలు నియోజకవర్గ స్టూడెంట్ ప్రెసిడెంట్ వేముల శ్రీకాంత్, సంతనూతలపాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అన్వేష్, స్టూడెంట్ వింగ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుంటక అంజిరెడ్డి, కనిగిరి, దర్శి, తాళ్లూరు, దర్శి, మార్కాపురం విద్యార్థి విభాగాల అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి విష్ణుచౌదరి, వై.మహేందర్రెడ్డి, సంజీవ్రెడ్డి, విద్యార్థి నాయకులు చందు, శివరెడ్డి, గంగవరపు రిషి, లెనిన్, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు -
ముమ్మరంగా ఏర్పాట్లు
ఎడ్ల పందేలకుయర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న స్థలంలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే ఎడ్లపందేలను తిలకించేందుకు రావాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. 4 విభాగాలుగా జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి ఎడ్లు పాల్గొంటున్నాయని నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ ఎడ్ల పోటీలకు గాను వివిధ సైజుల్లో బండలను ఏర్పాటు చేశారు. సీనియర్ ఎద్దుల పోటీలకు 2100 కిలోలు, న్యూ కేటగిరీ ఎద్దుల పోటీలకు 1,500 కిలోలు, 6 పండ్ల ఎద్దుల విభాగం పోటీలకు 1,200 కిలోలు, 2 పండ్ల విభాగం పోటీలకు 800 కిలోల బరువున్న బండలను సిద్ధం చేశారు. ఒక్కో విభాగంలో 9 నగదు బహుమతులు అందజేయనున్నారు. ఎద్దుల విడిది కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. పందేలు జరిగే సమయంలో ఎటువంటి తోపులాట, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎద్దుల పోటీలను తిలకించేలా గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, రాష్ట్రంలో ఉన్న ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. కాగా ఈ నెల 14వ తేదీన మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పర్యవేక్షిస్తారని వారు తెలిపారు. -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
మద్దిపాడు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేయాలని పాఠశాల డైరెక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత పెంచేందుకే వంద రోజుల కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు సామర్థ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ ఆడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి -
విద్యుత్ ఫీడర్లలో సాంకేతిక సమస్యలు అధిగమించాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ లైన్లలోని ఫీడర్లలో సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒంగోలు రామ్నగర్లోని విద్యుత్ భవన్ కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ముఖ్యంగా ఫీడర్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కార్యాచరణ చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు గురైన సాంకేతిక పరివర్తకాలను వెంటనే మార్చి వాటి పనితీరు మెరుగుపరచాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పరివర్తకాలు చోరీ కాకుండా ఏపీటీఎస్, స్థానిక పోలీసులు, గ్రామస్తుల సాయంతో గస్తీ కాస్తూ చోరీలను అరికట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీవీ.ఉషారాణి, పి. శ్రీనివాసులు, ఏపీటీఎస్ సీఐ, బిటీ.నాయక్, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు -
వలస కార్మికుల సమాచారం సేకరించండి
ఒంగోలు టౌన్: వలస కార్మికుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని, గ్రామ, వార్డు మ్యాపింగ్ను పూర్తి సమాచారంతో సిద్ధం చేసి ఉంచుకోవాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విలీనమైన పోలీసు స్టేషన్ల అధికారులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పోలీసు స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల స్థానాలను, దిశలను మార్చాలని చెప్పారు. కవరేజీ పరిధిని విస్తరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో నిర్లక్ష్యంగా ఉండవద్దని స్పష్టం చేశారు. రికార్డులను సమయానుకూలంగా, కచ్చితంగా నిర్వహించాలని, ప్రాపర్టీ, ప్రభుత్వ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. రికార్డులన్నింటిని క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టిమ్స్ పోర్టల్ (సీసీటీఎన్ఎస్)లో పొందుపరచాలన్నారు. ప్రాథమిక విచారణ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్, ఇన్వస్టిగేషన్ రిజిస్టర్, ఈ కంప్లైంట్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. అఽధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్ కాపీతో పాటు దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ–సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్, ఈ–సాక్ష్యం వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లను కొత్త ఫార్మెట్ ప్రకారం నిర్వహించాలని వివరించారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయడం, మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేయడం చాలా ముఖ్యమని ఎస్పీ తెలిపారు. వీటికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కందుకూరు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ జి.మంగారావు, అద్దంకి సీఐలు మల్లికార్జునరావు, సుబ్బరాజు, సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, ఎస్హెచ్ఓలు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్థన్రాజు పాల్గొన్న విలీన పోలీసు స్టేషన్ల అధికారులు -
కబ్జా ఆపండి
కళ్లు తెరవండి.. ఒంగోలు టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కొనుగోలు చేసిన అగ్రహారం, వెంగముక్కల పాలెం భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నగర కమిటీ నాయకులు గురువారం భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల రైతుల వద్ద నుంచి భూములను కొనుగోలు చేసి లేఔట్లు వేసి 20,800 మంది పట్టాలు రెడీ చేశారన్నారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో నాటి ప్రభుత్వం లబ్ధిదారులకు హామీ పత్రాలను ఇచ్చిందన్నారు. కానీ బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఆ స్థలాల గురించి గానీ పేదల గురించి పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రెండు సెంట్ల ప్రకారం పంపిణి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కరికీ స్థలం మంజూరు చేయలేదని పండిపడ్డారు. చంద్రబాబు అఽధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట చెబుతూ ప్రజలను మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల జీవితాలతో పాలకులు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. వెంగముక్కలపాలెంలోని సర్వే నంబర్ 170, 171,172లో సుమారు 170 ఎకరాల భూమిని 8 వేల లబ్ధిదారులకు కేటాయించారని, నేటికీ కూడా వాటిని స్వాధీనం చేయకపోవడంతో కొందరు రైతులు హద్దు రాళ్లను తొలగించి భూమిలో పొగాకు సాగు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన అధికారులు చోద్యం చూడడం బాధాకరమన్నారు. అఽధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాన్ని వారికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి కబ్జా కాకుండా కాపాడాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్, బి.వెంకటేశ్వరరావు, భావనారాయణ పాల్గొన్నారు. భూములు ఆక్రమిస్తున్నా పట్టించుకోరా..? ఇళ్ల స్థలాల భూములు పరిశీలించిన సీపీఎం నేతలు -
పచ్చని దోపిడీ !
తెల్లరాయి..ఏ ఖనిజం వెలికితీయాలన్నా గనుల శాఖ అనుమతి తప్పనిసరి. కానీ, అధికార టీడీపీ నేతలకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వేస్తున్నారు. అడ్డగోలు దోపిడీతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో లభ్యమయ్యే తెల్లరాయికి ఎలక్ట్రానిక్ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో అక్రమంగా మైనింగ్ చేస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. సహజ వనరుల్ని దోచేస్తున్నా గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం విస్తుగొలుపుతోంది. వెలికితీసిన తెల్లరాయి -
108 ఉద్యోగుల సమ్మె నోటీసు
ఒంగోలు టౌన్: ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన 108 ఉద్యోగులు అనివార్య పరిస్థితిలో సమ్మెకు వెళ్లనున్నట్లు గురువారం ప్రకటించారు. 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా వినతిపత్రాలు అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, దీంతో సమ్మెకు వెళ్తున్నామని 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ గురువారం ప్రకటించింది. ఇప్పటికే అనేక రూపాలలో నిరసన తెలియజేసినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దాంతో అనివార్య పరిస్థితుల మధ్య ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు కమిటీ వివరించింది. సమ్మె కాలంలో ప్రజలకు కలిగే అసౌకర్యానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 108 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్కు వినతిపత్రాలు అందించినట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గాలిరెడ్డి తెలిపారు. మార్కాపురం, ప్రకాశం జిల్లా అధికారులకు వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ భాస్కర్, ఒంగోలు డివిజన్ కార్యదర్శి బి.భాస్కర్, అధ్యక్షుడు దాసు దినేష్, పుల్లయ్య, పవన్ కుమార్, మార్కాపురం డివిజన్ ఉద్యోగులు ఎస్డీ వహాబ్, ఎన్.శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎస్కే చాంద్ బాషా, ఎస్డీ మహమ్మద్ రఫీ, కాశీనాయక్, లక్ష్మయ్య, డి.శ్రీను, కె.చెన్నారావు, ఏ.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రవాణాశాఖపై సానుకూల దృక్పథం ముఖ్యం
ఒంగోలు సబర్బన్: ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్టీఏ అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వాహనాల ఫిట్నెస్, ఏటీఎస్, ఆర్సీ, లైసెన్స్ల జారీలో జాప్యంపై ఐవీఆర్ఎస్లో వ్యక్తమైన ప్రజల అభిప్రాయాల మీద సమావేశంలో చర్చించారు. డీటీసీ సుశీల వివరణ ఇస్తూ.. సాంకేతిక సమస్యలతో వివిధ పత్రాల జారీలో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు. వివిధ పత్రాల జాప్యంపై గ్రీవెన్స్లో నమోదైన అర్జీల గురించి రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ.. జిల్లా స్థాయిలో రవాణాశాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రవర్తన కూడా ముఖ్యమన్నారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రాజాబాబు -
దుకాణాల తొలగింపులో ఉద్రిక్తత
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న దుకాణాల సముదాయాన్ని అధికారులు గురువారం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణాల తొలగింపులో అధికారుల తీరుపై ఆగ్రహించిన చిరు వ్యాపారులు స్థానిక నటరాజ్ సెంటర్లో నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిరువ్యాపారులను తరిమికొట్టారు. జేసీబీలతో దుకాణాల తొలగింపును వ్యాపారులు అడ్డుకోవడంతో ఏఎస్సై పోతురాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. దుకాణాలు తొలగించే క్రమంలో చిరువ్యాపారులకు, వైద్యశాల అధికారులకు నడుమ స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. వైద్యశాలలో నూతనంగా మార్చురీ గది, ప్రహరీ నిర్మించేందుకు దుకాణాలు అడ్డుగా ఉన్నాయని, అందుకే వాటిని తొలగించాలని అధికారులను కోరినట్లు సూపరింటెండెంట్ మహేశ్వరి తెలిపారు. చిరువ్యాపారులను తరిమికొట్టిన పోలీసులు పెద్దదోర్నాల మండల కేంద్రంలో ఘటన -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
ఒంగోలు వన్టౌన్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియరల్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. నగరంలోని సంతపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గురువారం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేకంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, వసతి గృహాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలపై అవగాహన కల్పించారు. వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా ఆయన మాటలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహ నిర్వాహకులు అంకబాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలినేనిచెరువు కేంద్రంగా...
వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువు గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని నెల్లూరుకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున తెల్లరాయి తవ్వకాలకు పాల్పడుతున్నారు. గ్రామ పరిధిలో రెవెన్యూ భూముల్లో ఈ మైనింగ్ జరుగుతోంది. వీరికి నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేత సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంతో ఈ అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు అభ్యంతరాలు చెబుతున్నారు. అయినాసరే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్కు రజనీష్
మార్కాపురం టౌన్: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో కమలా స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.రజనీష్ గోల్డ్ మెడల్ సాఽధించారు. ఏప్రిల్లో థాయిలాండ్లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు స్కూల్ కరస్పాండెంట్ పవన్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రజనీష్ 35+ వయసు కేటగిరీలో హైజంప్, 4–100 రిలే రన్నింగ్లో గోల్డ్ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని వివరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పి.శివశంకర్, స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సింధూజ, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరూప్ రంజన్ అభినందించారు. -
రెండు జిల్లాల్లోనూ గణతంత్ర దిన వేడుకలు
● ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లాతో పాటు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలోనూ దేశభక్తి ఉట్టిపడేలా 77వ భారత గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.హర్షవర్థన్రాజు, జేసీ ఆర్.గోపాలకృష్ణతో కలిసి రెండు జిల్లాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవానికి సన్నాహక ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏర్పాటు చేసే విధంగానే నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో కూడా ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేడుకల ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, సీటింగ్, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విజయంతంగా వేడుకలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆకట్టుకునేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం ఆర్డీఓలు ప్రసన్నలక్ష్మి, కేశవర్దన్రెడ్డి, శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్రెడ్డి, జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు విరివిగా రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు పీడీసీసీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా సాంకేతిక కమిటీ సమావేశం గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2026 ఖరీఫ్ సీజన్కు గాను, 2026–27 రబీ సీజన్కు సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ దాని అనుబంధ రంగాల్లోని ఉత్పత్తులకు రుణాలు అందించాలన్నారు. వ్యవసాయ రుణాలు రైతులకు ఏ మేరకు ఇవ్వాల్లో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా, సూక్ష్మ సాగు విధానాన్ని ప్రోత్సహించేలా సహకార బ్యాంకులు రైతులకు అవసరమైన రుణాలను విరివిగా మంజూరు చేయాలని సూచించారు. అలాగే రైతులకు సరైన సమయంలో, సరైన మొత్తంలో రుణం అందేలా చూడాలని కలెక్టర్ బ్యాంకు అధికారులకు సూచించారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంకు సీఈఓ పిడివి శర్మ, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ జేడీలు ఎస్ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్, ప్రకృకృతి వ్యవసాయాధికారి వి.సుభాషిణి, పీడీసీసీ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పి.రాజాబాబు -
ఖోఖో అడ్డాగా కనిగిరి గడ్డ
కనిగిరి రూరల్: ఖోఖో పోటీల్లో కనిగిరి విద్యార్థినులు సత్తా చాటుతున్నారు. ఏకంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కనిగిరి పేరును చాటిచెబుతున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలోని ఖాజీపేటలో నిర్వహించనున్న 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళా ఖోఖో జట్టుకు మొత్తం 15 మంది ఎంపికయ్యారు. వారిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కనిగిరికి చెందిన నలుగురు విద్యార్థినులు ఉన్నారు. డి.శివనాగలక్ష్మి, ఎస్.పావని, ఎం.సఖియా, జి.భవాని ఎంపికయ్యారు. వీరు గత నెల 24 నుంచి 26వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్జీఆర్ స్టేడియంలో నిర్వహంచిన 58వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వరుసగా మూడు సార్లు విజేతలుగా నిలిచారు. ఈ టీంలోని ఖోఖో క్రీడాకారులంతా కనిగిరి ఖోఖో అకాడమీకి చెందిన వారే కావడం గమనార్హం. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థినులు వారం రోజుల నుంచి కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర జట్టు శిక్షణ తరగతుల్లో ఉన్నారు. క్రీడాకారులను ఖోఖో కోచ్ బీ కాశీవిశ్వనాథరెడ్డి, ఖోఖో సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.సీతారాంరెడ్డి, ఖోఖో సంఘ రాష్ట్ర కార్యదర్శి కే హనుమంతరావు, ఎంఎన్ఎం కళాశాల కరస్పాండెంట్ ఏలూరి సుబ్బారావు అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలన్నదే లక్ష్యం : డి.శివనాగలక్ష్మి జాతీయ, రాష్ట్ర, జిల్లా, యూనివర్శిటీ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న డి.శివనాగలక్ష్మి అనేక అవార్డులు, ప్రశంసలు పొందింది. బెస్ట్ చేజర్, బెస్ట్ రన్నర్, బెస్ట్ ఆల్ రౌండర్గా ప్రతిభ కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో అండర్ 17 విభాగంలో 2019లో ఉత్తర ప్రదేశ్లోని అలిగ్రాలో, 2020లో రాజస్థాన్లోని జైపూర్లో, 2021లో జాతీయ స్థాయి జూనియర్స్ విభాగంలో ఒడిశాలో, 55వ సీనియర్స్ విభాగంలో మహారాష్ట్రలో, 2023లో 56వ సీనియర్స్ విభాగంలో న్యూఢిల్లీలో, 2024లో 57వ సీనియర్స్ విభాగంలో ఒడిశా (పూరిలో)లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో అండర్ 14లో రెండు సార్లు, అండర్ 17లో మూడు సార్లు, సబ్ జూనియర్ విభాగంలో రెండు సార్లు, సీనియర్స్ విభాగంలో 5 సార్లు, యూనివర్శిటీ స్థాయిలో 2 సార్లు ఆడింది. యూనివర్శిటీ స్థాయిలో 2021లో కర్ణాటకలో, 2022లో కేరళలో జరిగిన ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. బెస్ట్ ప్లేయర్గా 55వ, 56వ, 57వ, 58వ సీనియర్స్ విభాగంలో అవార్డులు సాధించింది. త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఏపీ జట్టును విజేతగా నిలుపుతామనే ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయి ఖోఖో క్రీడల్లో ఆడి గోల్డ్ మెడల్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యమని శివనాగలక్ష్మి తెలిపింది. కనిగిరిలో బీపీఈడీ సెకండియర్ చదువుతోంది. పీఈటీ కావాలన్నదే లక్ష్యం : ఎం.సఖియ ఖోఖో క్రీడల్లో బెస్ట్ రన్నర్గా అనేకసార్లు ప్రశంసలు, అవార్డులు సాధించింది. జాతీయ, రాష్ట్ర, యూనివర్శిటీ స్థాయి ఖోఖో క్రీడల్లో ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్స్ (జార్ఖండ్లోని రాంచీ)లో, అండర్ 14 నేషనల్స్ (మహారాష్ట్రలోని పూనే)లో జానియర్స్ నేషనల్స్ (వెస్ట్ బెంగాల్)లో, ఖేలో ఇండియా (తమిళనాడు)లో, జూనియర్స్ నేషనల్స్ (చత్తీస్ఘడ్)లో, అండర్ 19 నేషనల్స్ (మహారాష్ట్ర)లో, యూనివర్శిటీ నేషనల్స్ (కేరళ)లో పాల్గొంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రభుత్వ పీఈటీ ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యంగా తెలిపింది. ప్రస్తుతం కనిగిరిలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. -
ఎస్సై వేమనపై చర్యలు తీసుకోవాలి
పొదిలి రూరల్: గత నెలలో పొదిలిలో ఆర్యవైశ్య వ్యాపారి అవినాష్తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రంగా దాడిచేసిన ఎస్సై వేమనపై ఇంత వర కూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పొదిలిలో పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్య మంత్రితోపాటు హోంమంత్రి, జిల్లా మంత్రి జోక్యం చేసుకున్నారని, మీడియాలో వార్తలు వచ్చాయని, 15 రోజులైనా ఆ ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. వీఆర్కు పంపితే ఎస్సైపై చర్యలు తీసుకున్నట్లా అని రాంబాబు ప్రశ్నించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కొత్తలో అవినాష్ తండ్రి టీడీపీలో చేరినట్లుగా ఆయనే చెప్పారని, ఆ పార్టీకి చెందిన సానుభూతిపరుడిపై ఎస్సై దుర్మార్గంగా దాడిచేస్తే కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించారని, అంతకు మించి ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పొదిలి ప్రాంత ఆర్యవైశ్యులందరూ న్యాయం కోసం ధర్నా, బంద్ చేసినప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. తాను వెళితే పార్టీ పరంగా భావించి అవినాష్ కుటుంబానికి న్యాయం జరగదని వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని అన్నా రాంబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆర్యవైశ్య ఓట్లున్న మార్కాపురం నియోజకవర్గంలో తనను పిలిచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేయిస్తే తనను ఓడగొట్టారని, అయినా బాధపడటంలేదని అన్నారు. ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగితే అందరూ స్పందించాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. చీటికి మాటికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేవారు ఎస్సై వేమన ఆర్యవైశ్య వ్యాపారిపై దాడిచేస్తే ఎందుకు స్పందించడం లేదని రాంబాబు ప్రశ్నించారు. ఈ సంఘటనకు పార్టీలతో సంబంధం లేకుండా ఆర్యవైశ్యులందరూ పొదిలిలో ఐక్యంగా ఉండి బంద్లో పాల్గొన్నారన్నారు. ఇప్పటికైనా అవినాష్ కుటుంబానికి న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. పొదిలి కొండను మర్రిపూడిలోనికి తీసుకెళ్లవద్దని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని తాను మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, మస్తాన్వలి, శ్రీనివాసులు, సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిధులతో పనులు.. పచ్చ నేత ఫోజులు
యర్రగొండపాలెం: అధికారం ఉందన్న అహంకారంతో పచ్చనేతలు మిడిసి పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులకు తామే విరాళాలు ఇచ్చినట్లు ఫోజులు కొడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ నాయకుడు గూడూరి ఎరిక్షన్బాబు ఎటువంటి హోదా లేకపోయినా శిలాఫలకాలు ఆవిష్కరిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోని తన వర్గం నాయకులతోపాటు కొందరు అధికారులు చేస్తున్న భజనతో ఉబ్బితబ్బుబ్బవుతున్న ఎరిక్షన్బాబు ప్రభుత్వం తమదే కదా ఏమి చేసినా చెల్లుతుందని భావిస్తున్నట్టుగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం ఎరిక్షన్బాబు చేతులమీదుగా అందించి ప్రొటోకాల్కు తిలోదకాలిచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ సభలు టీడీపీ సమావేశాలకు ఏమాత్రం తీసిపోవడం లేదన్న విమర్శలున్నాయి. వేదికలపై టీడీపీ నేతలను చూసిన రైతులు వచ్చిన దారినే వెనుదిరగడంతో గ్రామ సభలు వెలవెలబోయాయి. అన్ని వర్గాలకు చెందిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటికీ తీసుకోకపోవడం గమనార్హం. ఏ హోదా ఉందని.. బుధవారం పెద్దదోర్నాల మండలంలోని పెద్ద బొమ్మాలాపురం పంచాయతీలో పీఆర్, ఐటీడీఏ, ఎఫ్డీఆర్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎరిక్షన్బాబు శంకుస్థాపన చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు నియోజవర్గంలోని పలు పంచాయతీల్లో పనులకు కేవలం భూమి పూజతో సరిపెట్టుకున్నారు. ఇది కూడా తప్పిదమే అని ప్రశ్నించే వారు లేకపోవడంతో శిలాఫలకాలు వేసుకోవడం, వాటిపై తమ పేర్లు లిఖించుకోవడం వరకు పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించి, ప్రారంభించిన పెద్దదోర్నాల మండల పరిషత్ కార్యాలయాన్ని ఎరిక్షన్బాబు మరోసారి రిబ్బన్ కట్ చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తయిన ఆ భవనాన్ని ఎంపీపీ గుమ్మా పద్మజ ఎల్లేష్ యాదవ్ ప్రారంభించారు. సెంటిమెంట్ కారణాలతో కొత్త భవనంలోకి అధికారులు ఇంకా మారలేదు. దీనిని ఆసరాగా తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీడీఓ కార్యాలయ భవనంతోపాటు పెద్ద బొమ్మలాపురంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఆ అధికారే పూర్తి స్థాయిలో ఖర్చుపెట్టి స్వామి భక్తిని చాటుకున్నారని విమర్శలు వినవస్తున్నాయి. పెద్ద బొమ్మలాపురంలో శిలాఫలకంపై ‘ఇట్లు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ’ అని రాయించడాన్ని చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. భజన బృందం డైరెక్షన్లో ఎరిక్షన్ యాక్షన్ ఏ హోదా లేని వ్యక్తితో శిలాఫలకాల ఆవిష్కరణలు పెద్దదోర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో ‘చెల్లికి మళ్లీ పెళ్లి’ సీన్ రిపీట్ పెద్దబొమ్మలాపురంలో శిలాఫలకంపై ‘ఇట్లు టీడీపీ గ్రామ కమిటీ’ లిఖింపు భారీ ఎత్తున అయిన ఖర్చంతా స్వామి భక్తి చాటుకున్న పీఆర్ అధికారిదే.. -
విద్యార్థి యువజన నాయకులపై రౌడీషీట్లా...?
ఒంగోలు టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి రౌడీషీట్లు పెట్టడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...మీ ఆస్తులు అడగడం లేదు, ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని, కేసులు, జైళ్లతో విద్యార్థి యువజన నాయకులను అణిచివేయలేరని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలనకు బదులుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకుల మీద కేసులు ఎందుకు పెడుతున్నారో మంత్రి లోకేష్ చెప్పాలని నిలదీశారు. విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద పెట్టిన రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన నాయకులు మీకు రౌడీ షీటర్లుగా కనిపించడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన నాయకుల మీద అక్రమంగా బనాయించిన కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్, కొత్తపట్నం మండల అధ్యక్షుడు దొరం హేమంత్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు లెనిన్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నారా లోకేష్ కేసులు, జైళ్లతో ప్రశ్నించే నాయకులను అణిచివేయలేరు వైజాగ్లో విద్యార్థి నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి వైఎస్సార్ సీపీ విద్యార్థి యువజన విభాగం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్ -
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
గిద్దలూరు రూరల్: మండలంలోని దేవనగరం గ్రామంలో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నిడికంటి రామకృష్ణ(42) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరుకుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.సురేష్ తెలిపారు. గిద్దలూరు రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి 100 రోజుల జైలుశిక్ష రూ.15 వేల జరిమానా, 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తూ జడ్జి కె.భరత్చంద్ర తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే..సీఐ కె.సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మందు తాగి వాహనం నడుపుతూ ముగ్గురు పట్టుబడ్టారు. వారిని జడ్జి ముందు హాజరు పరచగా జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టంగుటూరు: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కాకుటూరివారిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీకాంత్, కౌటిల్య ఇద్దరూ టంగుటూరు నుంచి స్వగ్రామానికి పోతుండగా వెనుక నుంచి జయవరం గ్రామానికి చెందిన వసంత్ ప్రమాదవశాత్తు కారుతో వెనక నుంచి బలంగా ఢీకొనగా ద్విచక్ర వాహనదారులకు శ్రీకాంత్, కౌటిల్య తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కారు నడుపుతున్న వసంత్ స్వల్ప గాయాలు కాగా ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమళ్లీశ్వరరావు తెలిపారు. -
అధైర్య పడకండి.. అండగా ఉంటా
దర్శి: అధైర్యపడొద్దు..అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక శివరాజనగర్లో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ నాయకుడు కవలకుంట్ల లాజరు, అనారోగ్యంతో ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న లాజర్ను, అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త పోరుమామిళ్ల చెన్నయ్యను, భర్త, కుమారున్ని కోల్పోయిన బండారు సరళ, బాపనపల్లి పోచమ్మలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మల్లె రామకృష్ణ, బత్తుల వెంకటేశ్వర్లు, రైతువిభాగం అధ్యక్షుడు కరిపిరెడ్డి రమణారెడ్డి, దొంతా ఏడుకొండలు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ మల్లె వెంకటేశ్వర్లు, పోరుమామిళ్ల శ్రీను, ముప్పూరి కొండయ్య, సానుకొమ్ము చలపతి, కత్తి పెద్దపెంచలు, రాచర్ల వెంకటేశ్వర్లు, షేక్ కరీముల్లా, ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తన్నీరు పాపయ్య, తన్నీరు అంకమ్మ, ఉయ్యాల వెంకటాద్రి, షేక్ ఖాశీం, ఉమ్మడి లక్ష్మణ్, కాండ్రకుంట శ్రీనివాసులు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
శ్రీగంధం చెట్ల నరికివేత కేసులో ఐదుగురు అరెస్ట్
కంభం మండలం తురిమెళ్లకు చెందిన బెల్లంకొండ నాయుడు స్వగ్రామంలో 2.85 ఎకరాల పొలంలో అటవీ శాఖ అనుమతితో శ్రీగంధం చెట్లు సాగు చేస్తున్నాడు. 2025 సెప్టెంబర్లో రెండు పర్యాయాలు పొలంలోని 10 శ్రీగంధం చెట్లు నరికి ముక్కలుగా చేసుకుని విక్రయించాడు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి చెందిన మండ్ల నరసింహులు, మండ్ల వేణు, షేక్ ఫారుఖ్, భూపని రామయ్య, బేస్తవారిపేట మండలం జేబీకే పురానికి చెందిన భూపని శివ రెండు మోటారుసైకిళ్లపై నాయుడు పొలంలో శ్రీగంధం చెట్లు నరికేందుకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంటాడారు. తురిమెళ్ల బస్టాండ్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు రెండు బైకులు, గొడ్డలి, రంపం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
మణులొద్దు..మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు..!
చీమకుర్తి మండలంలో పగిలిన సాగర్ తాగునీటి పైపులు 20 రోజులుగా 4 మండలాలకు నిలిచిన తాగునీటి సరఫరా మర్రిపూడి రక్షిత మంచినీటి పథకం. మర్రిపూడి: జిల్లాలోని మర్రిపూడి, కనిగిరి, వెలిగండ్ల, పామూరు, సీఎస్పురం మండలాల్లో సుమారు 230 గ్రామాలకు దాదాపు 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను గుర్తించి పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం కావడంతో ఆయా గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా నిలిచిపోయినా ఒక్క ప్రజాప్రతినిధి దీనిపై స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రామతీర్ధం రిజర్వాయర్ నుంచి మర్రిపూడి మండలం వయా కనిగిరి, పామూరు, సీఎస్పురం, వెలిగండ్ల మండలాల ప్రజల దాహర్తి తీర్చేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో రూ. 91 కోట్లు కేటాయించారు. రామతీర్థం రిజర్వాయర్ నుంచి 5 మండలాలకు నీరు సరఫరా చేసేందుకు 600 ఎంఎం జీఆర్పీ పైపులైన్ నిర్మించి ప్రతిరోజు 18 లక్షల లీటర్లు నీరు ఫిల్టర్ బెడ్ల ద్వార శుద్ధి చేసి ఆయా గ్రామాలకు తాగునీరు అందించారు. అందులో భాగంగా మర్రిపూడి మండలంలోని 32 గ్రామాలకు పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేసేందుకు రూ.5 కోట్లు కేటాయించి గ్రామశివారులో రక్షత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి, గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మిగిలిన మండలాలకు ప్రతిరోజు తరలిస్తారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. ఇది పరిస్థితి.. చీమకుర్తి మండలంలోని రామతీర్థ జలాశయం నుంచి సాగర్ జలాలు తరలించే పైపులైన్లు ఆ మండలంలోని బక్కిరెడ్డిపాలెం నుంచి నిప్పట్లపాడు పరిసరాల్లో సుమారు 5 ప్రాంతాల్లో పగిలిపోయాయి. అయితే పైపులు పగిలిన ప్రాంతంలో రైతులు వరి సాగు చేసి ఉన్నారు. పైపులైన్ మరమ్మతులు చేసేందుకు వెళ్లిన అధికారులతో పంటను కోసే వరకు మరమ్మతులు చేయడానికి వీల్లేదని రైతులు అడ్డు తగిలారు. అయితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇదే విధంగా సమస్య ఎదురైతే రైతులతో మాట్లాడి వారికి నష్టపరిహారం చెల్లించి మరమ్మతులు చేసి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈ తాగునీటి సమస్యనూ పట్టించుకునే వారే కరువయ్యారు. పాలకులు గానీ, అధికారులు గానీ రైతులతో మాట్లాడి వారిని సర్దిచెప్పి మరమ్మతులు చేయాలన్న తపన ఒక్కరిలోనూ లేదు. కొంత మంది అధికారులు అందుబాటులో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు, పాడైపోయిన వాటిని హడావుడిగా మరమ్మతులు చేయించి మొక్కుబడిగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఫ్లోరైడ్ నీరే అందుతోంది. వందలాది గ్రామాలకు నీటి సరఫరా లేకపోవడంతో గ్రామాల్లో శుద్ధజలకేంద్రాలు ఊపందుకున్నాయి. అందిన కాడికి దోచుకుంటూ బబుల్వాటర్ను ప్రజలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిద్రమత్తువీడి ప్రజల కష్టాలు తీర్చేందుకు పైపులైన్ మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 230 గ్రామాల్లో దాహం కేకలు. అధికారుల నిర్లక్ష్యం సాక్షిగా 20 రోజులుగా ప్రజల గొంతెండుతోంది. వందలాది గ్రామాల ప్రజలు దాహం కేకలు నేతలకు వినిపించడం లేదు. ప్రజల సమస్యలపై అలివిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శించే ప్రజాప్రతినిధులు, అధికారులు మాకే సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండటంతో ఇప్పట్లో దాహం కేకలు తీరే మార్గం కనిపించడం లేదు. సుమారు 230 గ్రామాల్లో దాహం కేకలు పైపులు పగిలిన ప్రాంతంలో సాగులో ఉన్న వరి పైరు 20 రోజులుగా నీటి సరఫరా నిలిచినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు -
తప్పుల తడకగా పాస్ పుస్తకాలు
గిద్దలూరు (బేస్తవారిపేట): ఎన్నికల సమయంలో రీసర్వేపై కూటమి నాయకులు విషం కక్కారు. ప్రతి గ్రామంలో మీ భూములు ఎవరో తీసుకుంటారని విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన పాస్పుస్తకాల్లో తప్పులు సరిదిద్ది రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్పుస్తకాలు రైతులకు అందజేస్తామని ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా.. రీ సర్వే ఒక్క గ్రామంలో పూర్తి చేయలేదు. ఇక ఆర్భాటంగా గ్రామ సభలు పెట్టి అందిస్తున్న పాస్పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. అన్నీ తప్పులే.. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో మొదటి విడతగా దాదాపు 700 పాస్పుస్తకాలు వచ్చాయి. ఇందులో త్రిపురాపురానికి 201, తిమ్మాపురానికి 453, నరసింహునిపల్లెకు 46 పాస్పుస్తకాలు రాగా వాటిని అందజేస్తున్నారు. అయితే వాటిలో సర్వే నంబర్లు, ఆధార్ నంబర్, మరికొందరికి భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు రావడంతో రైతులు నిలదీశారు. దీంతో తప్పులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సరి చేసి ఇస్తామని సర్దిచెప్పి వెనుతిరిగారు. ఉన్నది 10 సెంట్లు.. పాస్ పుస్తకంలో 20 సెంట్లు చట్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన పాపితోటి ఓబులేసు 3 నెలల కిందట 10 సెంట్ల భూమికి పాస్పుస్తకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. అయితే 10 సెంట్ల బదులు 20 సెంట్లు రావడమే కాకుండా పాపితోటి ఓబులేసు అని కాకుండా పారుతొట్టి ఓబులేసు అనే పేరు మీద వచ్చింది. ఆధార్ నంబరు కూడా తప్పు రావడంతో రైతు బిక్కముఖం వేశాడు. ఇలా వందల పాస్పుస్తకాలు తప్పులు తడకగా రావడంతో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. తప్పులు వచ్చిన మాట వాస్తవమే గిద్దలూరు మండలానికి మొదటి విడతగా 700 పాస్పుస్తకాలు వచ్చాయి. వాటిని రైతులకు అందజేస్తున్నాం. అయితే చాలా వరకు ఫొటోలు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంలో తప్పులు వచ్చిన మాట వాస్తవమే. రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో వాటిని సరిచేస్తాం. – ఆంజనేయరెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు. -
మీది నాది కంఠశోషే..
సింగరాయకొండ: ‘‘మీది నాది కంఠశోష మాత్రమే..ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వే తరలింపు ఎయిర్ఫోర్స్ అధికారులు ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. నేను కేవలం మీ అర్జీని ఉన్నతాధికారులకు చేరుస్తాను. నేను నిమిత్త మాత్రుడిని’’ అని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ వీ అనిల్కుమార్రెడ్డి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేక కమిటీ జేఏసీ సభ్యులకు వివరించారు. మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వే తరలింపు సాధ్యాసాధ్యాలపై బుధవారం నాలుగు గ్రామాల ప్రజల విజ్ఞప్తిపై జాతీయ రహదారి పీడీ అనిల్కుమార్రెడ్డి కనుమళ్ల జంక్షన్లోని ఎమర్జెన్సీ రన్వే ప్రాంతానికి వచ్చి గ్రామస్తులను కలుసుకున్నారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వే ప్రారంభమైతే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. రోడ్డుకు ఇరువైపులా పేద, మధ్య తరగతి ప్రజలకు చెందిన సుమారు 400 ఎకరాల భూమి ఉందని, అంతేకాక ఈ ప్రాంత ప్రజలు పశుపోషణపై ఆధారపడుతూ జీవిస్తుంటారని పశువులను ఈ భూముల్లో మేపుకుంటారని కానీ రన్వే నిర్మిస్తే తమతో పాటు రోడ్డు దాటడానికి పశువులు కూడా ఇబ్బందులు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య రన్వే నిర్మించటం వలన రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ ప్రాజెక్టును వేరొక ప్రాంతానికి తరలించారని విజ్ఞప్తి చేశారు. దీనిపై జాతీయ రహదారి పీడీ వీ అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్మాణం వలన వరదల సమయంలో సరుకు రవాణాకు, యుద్ద సమయాల్లో అవసరాలకు ఫైటర్జెట్ వంటి యుద్ధ విమానాలు ల్యాండ్ అవటానికి ఈ రన్వే ఎంతో ఉపయోగమన్నారు. రోడ్డు దాటడానికి వీలుగా అండర్పాస్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించటానికి మాత్రమే వచ్చానని, అంతేతప్ప రన్వే తరలింపు నిర్ణయం తీసుకునే స్థాయి తనది కాదన్నారు. రన్వే తరలింపు రాజకీయ నాయకుల చేతుల్లో ఉందన్నారు. వారం రోజుల క్రితం రన్వే ప్రాంతాన్ని ఎయిర్ఫోర్స్ అధికారులు పరిశీలించి వెళ్లారని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా రన్వే నిర్మిస్తారా లేక తరలిస్తారా అనేది ఆధారపడి ఉంటుందని వివరించారు. రన్వే నిర్మాణం వలన ప్రజలు పడే ఇబ్బందులను రాతపూర్వకంగా అర్జీ ఇస్తే ఆ అర్జీని పై అధికారులకు పంపుతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ కమిటీ సభ్యులు పెరల్ డిస్టిలరీ నుంచి జీవీఆర్ ఆక్వా కంపెనీ మధ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, సర్వీసు రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేయటంతో పీడీ అనిల్కుమార్రెడ్డి సర్వీసు రోడ్డు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలించారు. జాతీయ రహదారి కన్సల్టెంట్ సురేష్బాబు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేక జేఏసీ కమిటీ సభ్యులు, సింగరాయకొండ, కలికవాయ, కనుమళ్ల, మూలగుంటపాడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
జిల్లాకు తలమానికంగా రామాయపట్నం పోర్టు
గుడ్లూరు: జిల్లాకు తలమానికంగా మారనున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. బుధవారం ఆయన రామాయపట్నం పోర్టును సందర్శించారు. పోర్టు నిర్మాణ పనులు, భూసేకరణపై కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీతో కలిసి సమీక్షించారు. ఆయా పనుల్లో పురోగతిని అధికారులు, పోర్టు సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సముద్రంలోకి వెళ్లి బెర్తుల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరు డివిజన్లోని గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు మండలాలను ప్రకాశం జిల్లాలో కలిపారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నం పోర్టు పనుల పురోగతిని పరిశీలించినట్లు చెప్పారు. భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం తెట్టులో నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట పోర్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, నవయుగ కాంట్రాక్టరు కంపెనీ ప్రతినిధి నారాయణ, మారిటైమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శివరాం, బీపీసీఎల్ ఇండోసోల్ ప్రతినిధులు, తహశీల్దార్ బాల కిశోర్, ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల వారిని ప్రకటించారు. రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీలుగా మార్కాపురానికి చెందిన ఉడుముల నారాయణరెడ్డి, ఒంగోలుకు చెందిన కత్తి కోటేష్బాబు, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా కొండపికి చెందిన దగ్గుమాటి రాజమోహనరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా కొండపికి చెందిన పాటిబండ్ల వేణుగోపాల్ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు వన్టౌన్: ఎస్సీ కార్పొరేషన్లోని వివిధ పథకాల ద్వారా రుణాలు తీసుకున్న వారు ఏప్రిల్లోపు తిరిగి పూర్తిగా చెల్లిస్తే రుణంపై వడ్డీని మాఫీ చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మంజూరైన పథకాలకు సంబంధించిన రుణాలు పొందిన లబ్ధిదారులు కోవిడ్–19 కారణంగా తిరిగి కట్టలేకపోయారన్నారు. ఆ రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని టైప్ 3, టైప్ 4 కింద కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది ఖాళీలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ నెల 11వ తేదీ లోపల వచ్చిన దరఖాస్తులను సమగ్రశిక్షా కార్యాలయంలో అందజేయాలని అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దాసరి అనీల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో టైప్–3 కింద ఖాళీ పోస్టుల వివరాలు వరుసగా ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ 8, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ 12, ఏఎన్ఎంలు 5, అకౌంటెంట్లు 3, అటెండర్లు 1, హెడ్కుక్ 1, అసిస్టెంట్ కుక్లు 9, డే వాచ్ఉమెన్ 1, స్కావెంజర్లు 3 చొప్పున మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. అలాగే టైప్ 4 కింద వార్డెన్లు 12, పార్ట్టైమ్ టీచర్లు 9, చౌకీదార్ 8, హెడ్కుక్ 10, అసిస్టెంట్ కుక్ 22 చొప్పున మొత్తం 61 ఖాళీలు ఉన్నాయి. 45 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. ఒంగోలు వన్టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ మార్ట్, బీఎస్ఈల్, శ్రీ చక్ర హ్యుందాయ్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ , శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విజన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ప్యాకింగ్–పికింగ్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సిస్టమ్ ఆపరేటర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేస్తారన్నారు. టెన్త్, ఇంటర్మీడియేట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జీతం నెలకు రూ.12 వేల నుంచి రూ.22 వేల వరకు, పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇస్తారని తెలిపారు. జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇంటర్వ్యూకు ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా పరిధిలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న టన్నెల్ విద్యుత్ బకాయిలు రూ.107 కోట్లకు పెరిగాయి. విద్యుత్ అధికారులు నోటీసులు ఇస్తున్నా స్పందన లేదని తెలుస్తోంది. కొండలా పెరిగిపోతున్న విద్యుత్ బకాయిలు ఎలా వసూలు చేయాలో విద్యుత్శాఖ అధికారులకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై మార్కాపురం విద్యుత్శాఖ ఈఈ నాగేశ్వరరావును వివరణ కోరగా బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. -
ఖర్చులకు డబ్బివ్వలేదని కసితీరా నరికాడు
బేస్తవారిపేట: మండల కేంద్రమైన బేస్తవారిపేటలో ఈ నెల 2వ తేదీన వృద్ధుడిని దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బేస్తవారిపేట బీసీ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న జయంపు కృష్ణను తనతోపాటు ఉంటున్న మరో వ్యక్తి అత్యంత దారుణంగా నరికేసిన విషయం తెలిసిందే. ఇంటి ఖర్చులకు పింఛను డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే నిందితుడు హత్య చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు. బుధవారం బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వృద్ధుడి హత్య కేసుతోపాటు కంభం మండలం తురిమెళ్ల గ్రామంలో శ్రీగంధం చెట్ల నరికివేతకు పాల్పడిన నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. వివరాలు.. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి చెందిన కొమరోలు చిన్న రంగయ్య బేస్తవారిపేట బీసీకాలనీలో ఓ గృహాన్ని అద్దెకు తీసుకుని ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఒంటరివాడైన జయంపు కృష్ణతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి పొట్టేళ్ల వ్యాపారంతోపాటు మాంసం విక్రయిస్తుండేవారు. కృష్ణకు ఒకటో తేదీన వృద్ధాప్య పింఛను రూ.4 వేలు వచ్చాయి. ఇంట్లో సరుకులు లేవు, కొంత డబ్బు ఇవ్వాలని చిన్న రంగయ్య కోరగా కృష్ణ ఇవ్వలేదు. ‘రోజూ నా డబ్బులతో వండిపెడితే తింటున్నావు పింఛను వచ్చింది కదా ఇప్పుడైనా డబ్బులివ్వు’ అని రంగయ్య గట్టిగా అడిగాడు. ఈ క్రమంలో ఉదయం, సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణపై పొట్టేళ్లు నరికే కత్తితో రంగయ్య దాడి చేశాడు. తల భాగం, చేతులపై నరకడంతో తీవ్ర రక్తస్రావంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం బీసీ కాలనీ పరిసరాల్లో నిందితుడు చిన్న రంగయ్యను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కంభం సీఐ మల్లికార్జున, ఎస్సైలు ఎస్వీ రవీంద్రారెడ్డి, శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి.. పింఛను సొమ్మును ఇంటి ఖర్చులకు అడిగిన సహచరుడు హత్యకు కొద్ది గంటల ముందు ఇద్దరి మధ్య వాగ్వివాదం వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
మేం చెప్పింది చేయకుంటే బదిలీనే..!
కురిచేడు: పచ్చనేతల అక్రమాలకు ఒత్తాసు పలకలేదని పంచాయతీ కార్యదర్శిని అన్యాయంగా బదిలీ చేయించారు. ఈ సంఘటన మండలంలోని బయ్యవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని బయ్యవరంలోని చేపల చెరువును మూడేళ్లకు రూ.13,70,000లకు కురిచేడు సొసైటీ వారు లీజుకు తీసుకున్నారు. దానికి సంబంధించి మొదటి సంవత్సరం లీజు చెల్లించారు. రెండో ఏడాది జూన్ 2025 నాటికి రూ.4,60,000 మొత్తాన్ని పంచాయతీకి చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ క్రమంలో గత ఏడాది జూన్, జూలై నెలల్లో చేపల చెరువులోని చేపలను మొత్తం అమ్ముకొని సొమ్ము చేసుకొని పంచాయతీకి ఏం చెల్లించలేదు. సెప్టెంబర్ నెల ఆఖరులో కురిసిన మోంథా తుఫాన్ను సాకుగా చూపి చేపలు కొట్టుకుపోయాయని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి కనిగిరి డివిజన్ డెవలప్మెంట్ అధికారి కె.శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. ఆయన గత నెలలో బయ్యవరం చేపల చెరువులు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానికంగా విచారించి ఎటువంటి నష్టం జరగలేదని డీపీఓకు నివేదిక పంపించారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో చేపలకు నష్టం వాటిల్లినా పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదని, కాంట్రాక్టరే భరించాల్సి ఉందని అగ్రిమెంట్లో నిబంధన ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ వాటిని అతిక్రమించి తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చాడు. మాకు అనుకూలంగా నివేదిక ఇవ్వకుండా అలవలపాడు పంచాయతీ బదిలీ చేయిస్తామని బెదిరించారు. అయితే దీనికి పంచాయతీ కార్యదర్శి అంగీకరించకపోవడంతో కార్యదర్శిని మంగళవారం అలవలపాడు పంచాయతీకి బదిలీ చేశారు. అయితే పంచాయతీకి నష్టం వాటిల్లికుండా చూసిన కార్యదర్శిని అక్రమంగా బదిలీ చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు రాబట్టి గ్రామాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులపై పచ్చనేతల దౌర్జన్యం తుఫాన్కు నష్టం వాటిల్లిందని నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి నష్టం వాటిల్లలేదని నివేదిక ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శి బదిలీ -
మూల్యం తప్పదు
కూటమి నేతల వైఖరికి నాగులుప్పలపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శిస్తున్న అహంకార పూరిత విధానాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జనసేన నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఉప సర్పంచ్ ఉలిచి నాగేశ్వరరావును మంగళవారం పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలనే కుట్రతో చేస్తున్న ఇలాంటి దాడులడు ఏమాత్రం భయపడమన్నారు. ఇలాంటి హేయమైన దాడులకు భవిష్యత్లో పెద్ద మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఉలిచి నాగేశ్వరరావుకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, పాలడుగు రాజీవ్, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మాచవరం సర్పంచ్ ఇనగంటి రమణారెడ్డి ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ఉలవపాడు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు అన్నారు. కందుకూరు పోలీస్ సబ్డివిజన్ను ప్రకాశం జిల్లాలో విలీనం ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉలవపాడు పోలీస్స్టేషన్ను ఎస్పీ పరిశీలించారు. పోలీస్స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి సూచనలు చేశారు. పోలీస్స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చెడు నడత కలిగిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, కందుకూరు డీఎస్పీ హెచ్వీ.బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్బాషా, ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
బేస్తవారిపేట: పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మానాయక్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రణాళిక పక్కాగా నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏ, బీ గ్రేడ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచనలు ఇచ్చారు. మెనూ అమల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కలిసి అల్పాహారం తిన్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా లేదా అనే వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, టాయిలెట్స్ను పరిశీలించారు. హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు. పొన్నలూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని కె.అగ్రహారం గ్రామంలో చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి సీటీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రావినూతల సునీల్, షేక్ షరీఫ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.700 ఎంట్రీ ఫీజు చెల్లించి 8వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.50,116, రెండో బహుమతి రూ.25,116 అందజేస్తామన్నారు. వివరాలకు 9959596461, 8520085670 నంబర్లను సంప్రదించాలని కోరారు. అద్దంకి రూరల్: భవనం పరంజాలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అద్దంకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన తాళ్లూరి మహేష్ (26) భవననిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అద్దంకి గరటయ్య కాలనీలోని ఓ భవనం ఎక్కి పనిచేస్తుండగా జారి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు వన్టౌన్: ప్రకాశం జిల్లాను రహదారి ప్రమాద రహితంగా చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణతో భద్రత–సాంకేతికతతో పరివర్తన అనే ఇతివృత్తంతో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేలా నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నివారణకు చర్యలు చేపట్టామన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగర మేయర్ గంగాడ సుజాత, డీటీసీ ఆర్.సుశీల, ఆర్అండ్బీ ఈఈ గోపీ నాయక్, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసు శాఖ విభజనకు కసరత్తు
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో పోలీసుశాఖ విభజనకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మార్కాపురం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చడంతోపాటు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి మార్చడంతో ఆ రెండు నియోజకవర్గాల పోలీసు స్టేషన్లను ప్రకాశం జిల్లాలోకి మార్చనున్నారు. ఇక మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పొదిలి పోలీసుస్టేషన్లు దర్శి డీఎస్పీ పరిధిలో ఉండగా ఈ రెండింటినీ మార్కాపురం జిల్లాకు మార్చనున్నారు. ప్రస్తుతం నూతన జిల్లాలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, కనిగిరి, పామూరు సర్కిల్లు ఉండగా మార్కాపురం, కనిగిరి సబ్డివిజన్లు ఉన్నాయి. కొత్తగా పొదిలి, త్రిపురాంతకం సర్కిళ్లు కూడా మార్కాపురం జిల్లాలోకి రానున్నాయి. రెండు మూడు రోజుల్లో అమరావతిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కాపురం డివిజన్లో అన్నీ పోలీసుస్టేషన్లు కలిపి 300 నుంచి 350 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇంకా పలు స్టేషన్లలో పోలీసులు, హోంగార్డుల కొరత ఉంది. నూతన జిల్లా ఏర్పాటుతో సమస్య తీరనున్నట్లు తెలుస్తోంది. పలు విభాగాల రాక.. నూతన జిల్లాకు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్పార్టీ పోలీసులతో పాటు అడ్మిన్ ఎస్పీ, పోలీసు ట్రైనింగ్ కాలేజీ, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, ఏసీబీ, సీబీసీఐడీ, ఫింగర్ ప్రింట్స్ క్లూస్టీం, ఐటీ కోర్టీమ్, పోలీసు కంట్రోల్ రూం, సీసీఎస్, ట్రాఫిక్ పోలీసుస్టేషన్, మహిళా పోలీసుస్టేషన్ తదితర విభాగాలకు చెందిన 750 నుంచి 800 వరకూ సిబ్బంది రానున్నారు. వీరందరికీ మార్కాపురంలో వసతి, కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగుల బదిలీలు, ఇన్చార్జి అధికారుల నియామకం, సిబ్బంది క్వార్టర్స్ తదితర అంశాలపై దృష్టి సారించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్పీ కార్యాలయంలో గతంలో పెద్ద భవనాన్ని నిర్మించారు. అనివార్య కారణాల వలన ఆ భవనాన్ని ప్రారంభించలేదు. ఇటీవలే ఎస్పీ హర్షవర్ధనరాజు నూతన భవనంతోపాటు సిబ్బంది క్వార్టర్స్ను, ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేయాల్సిన భధ్రతా చర్యలను సూచించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో సీఐ సుబ్బారావు ఏర్పాట్లు చేస్తున్నారు. -
450 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
టంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన స్థానిక కొండపి ఫ్లైఓవరు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేట నుంచి నెల్లూరు వైపునకు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ లారీలో 450 బస్తాల పీడీఎస్ బియ్యం గుర్తించారు. అనంతరం లారీని, అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసు స్టేషనుకు తరలించి, అన్నలదాసు పవన్ రాజు, కిషోర్, శ్రీనివాసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. దర్శి: ఉద్యోగులు, కార్మికులందరూ సుఖసంతోషాలుగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆకాంక్షించారు. దర్శి నియోజకవర్గ 2026 నూతన సంవత్సర సీఐటీయూ క్యాలెండర్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఐటీయూ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ సీఐటీయూ పేద కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగ, కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కరించే కార్యకర్తలు సీఐటీయూ సంఘాలకు ఉన్నారని చెప్పారు. ప్రజల పక్షాన పనిచేసే ప్రజా సంఘాలు ఉండాలని, వారికి తమ మద్దతు, సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల ఐక్యత, పోరాటం లక్ష్యాలతో సీఐటీయూ ఏర్పడి అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్స్, కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సరంలో కార్మికుల పోరాటాలు విజయవంతం కావాలని కోరారు. ఈ ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ ఎస్ఎం బాషా, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ బట్టు రామారావు, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మజ్ఞువలి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మిరెడ్డి, సీఐటీయూ మండల నాయకులు ఉప్పు నారాయణ, షేక్ కాలే బాషా, సీహెచ్ ఆదినారాయణ, గర్నిపూడి జాన్ సామ్యేల్, సందు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్లూరు: మండలంలోని రామాయపట్నం పోర్టును ఎస్పీ హర్షవర్ధన్రాజు మొండివారిపాలెం వద్ద మంగళవారం సందర్శించారు. అనంతరం ఇండోసోలార్ ప్లాంటును పరిశీలించారు. ఆయన వెంట కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, గుడ్లూరు సీఐ మంగారావు, ఎస్ఐ వెంకట్రావు, మైరెన్ ఎస్ఐ షరీఫ్ ఉన్నారు. బల్లికురవ: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కొప్పెరపాడులో ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు మొదటి నుంచి 4 బహుమతులు వరుసగా రూ.15,116, రూ.10,116, రూ.7,116, రూ.3,116 అందజేస్తున్నట్లు చెప్పారు. బెస్ట్ రైడర్ డిసెండర్లకు రూ.1116 అందజేస్తున్నామని, పాల్గొనదలచిన వారు ఎంట్రీలు పంపాలని కోరారు. పూర్తి వివరాలకు పీ రామకృష్ణ, సెల్: 9494899882 నంబరును సంప్రదించాలని కోరారు. -
జగన్ ఒక్కరే
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సీఎంకురిచేడు: 2019 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. మండలంలోని పొట్లపాడులో వేంచేసి ఉన్న గుత్తికొండ రామయోగి స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మాట్లాడారు. వారికి దారిపొడవునా మహిళలు పూలు చల్లుతూ హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తిరునాళ్లకు వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాయమాటలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మన పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిందని, మరో మూడేళ్ల ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, ప్రతి ఒక్కరికీ తగిన గుణపాఠం చెపుదామని చెప్పారు. దొనకొండ, కురిచేడు మండలాల పార్టీ కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, నాయకులు నుసుం ప్రతాప్రెడ్డి, నుసుం గోవిందారెడ్డి, నుసుం ఆరుద్రరెడ్డి, మహానందరెడ్డి ఉన్నారు. -
అవినీతి సొమ్ముతో కళ్లు మూసుకున్న పచ్చనేత
యర్రగొండపాలెం: ఎటువంటి హోదా లేని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబుకు అవినీతి సొమ్ముతో కళ్లు మూసుకొనిపోయాయని, అధికారం ఉందని తన మదాన్ని ప్రదర్శిస్తున్నాడని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండలంలోని నరసాయపాలెంలో సోమవారం రాత్రి జరిగిన యోగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ఆయన మాట్లాడారు. గంజాయి కొట్టిన గాలి బ్యాచ్ మాట్లాడే భాషకు మించి, బాధ్యతలను విస్మరించి మాట్లాడటం ఎరిక్షన్బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. నీవు దద్దమ్మలా వ్యవహరించడం నియోజకవర్గ ప్రజలు గుర్తించి నిన్ను ఓడించి నీపై ఉన్న అపనమ్మకాన్ని చూపించారని, ఇంత గాలిలో కూడా గెలవలేకపోయిన ఆయన ఇకపై కూడా గెలవలేనన్న భావనతో జనాలను పీడించుకొని తింటున్నాడని మండిపడ్డారు. పేద జనాల సొత్తును పీక్కొని తింటూ వారికష్టార్జితాన్ని స్వాహా చేస్తున్నాడని ఎరిక్షన్బాబుపై విరుచుకుపడ్డారు. త్వరలో బిచానా ఎత్తేయటానికి సిద్ధంగా ఉన్న ఆయన తెగబడి అక్రమార్జన కోసం పాకులాడుతున్నాడన్న విషయం నియోజకవర్గం కోడై కూస్తోందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, కందుల సత్యనారాయణ చౌదరి, కందూరి కాశీవిశ్వనాథ్, సూరె శ్రీనివాసులు, పబ్బిశెట్టి శ్రీను, గోళ్ల కృష్ణ, ఒంగోలు సుబ్బారెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం, రాములు నాయక్, హరి నాయక్, సురేష్ నాయక్, గాయం శివారెడ్డి, ఎం.యోగయ్య, ఎస్.వెంకటయ్య, జి.నాగార్జునరెడ్డి, కె.వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వేకు మరమ్మతులు
సింగరాయకొండ: విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వేకు జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న కేఎంసీ కంపెనీ 2020 జనవరిలో సుమారు రూ.52.38 కోట్ల అంచనా వ్యయంతో 3.60 కిలోమీటర్ల దూరం రన్వే పనులు ప్రారంభించగా కాల పరిమితి 5 సంవత్సరాలు విధించారు. ఈ నెలతో కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో సదరు కాంట్రాక్టు దక్కించుకున్న కేఎంసీ కంపెనీ జాతీయ రహదారి అధికారుల సూచనలతో మరమ్మతు పనులు చేపట్టింది. వాస్తవానికి సిమెంటు రోడ్డు కాలపరిమితి సుమారు 20 ఏళ్లు ఉంటుంది. కానీ మొదటి నుంచి విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వే పనులు నాశిరకంగా చేయటంతో సిమెంటు రోడ్డు చాలా చోట్ల దెబ్బతిని అనేక రోడ్డు ప్రమాదాలు జరగటంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రన్వే ప్రాజెక్టు కాలపరిమితి పూర్తి కావస్తుండటంతో సదరు కాంట్రాక్టరు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టినట్లు జాతీయ రహదారి అధికారులు వివరించారు. -
104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
ఒంగోలు టౌన్: న్యాయం కోసం 104 ఉద్యోగులు రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 104 బాధ్యతలను చేపట్టిన భవ్య హెల్త్కేర్ ఏజెన్సీస్ యాజమాన్యం ఉద్యోగులను వేధిస్తోందని కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయినా అటు ప్రభుత్వం గానీ, ఇటు భవ్య యాజమాన్యం కానీ స్పందించడం లేదు. అసలు ఉద్యోగుల నిరసనను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చిరుద్యోగులైన 104 ఉద్యోగులు అనివార్యంగా రోడ్డెక్కారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భవ్య యాజమాన్యం వేధింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు సత్వరం న్యాయం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థలో విధులు నిర్వహిస్తున్న డీఈఓలకు జీఓ నంబర్ 7 ప్రకారం రూ.18,500 జీతం చెల్లించాలని , క్యాజువల్ సెలవులను పునరుద్ధరించాలని, బఫర్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, యాజమాన్యం తరపున పీఎఫ్ వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కొవ్వూరి రవివర్మ, బాషా, వంశీ, రమేష్, రవి, వస్తాద్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేసు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, కళావతి, విజయజ్యోతి, మాధురిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జేసీ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృపిత్ చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారి కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 329 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత
ఒంగోలు టౌన్: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చాంబర్లో 16వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ కూడా అయిన కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. రూ.10 కోట్లతో జీజీహెచ్కు నూతన హంగులు కల్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీజీహెచ్లో మంచినీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటుగా రోగుల కోసం వెయిటింగ్ హాల్, నూతన ఓపీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సమావేశం ఆమోదం తెలిపింది. ధోబీ మిషన్ కొనుగోలు, పేషంట్ల రద్దీ కారణంగా ఫిజియోథెరపిస్ట్ నియామకానికి ఆమోదం తెలిపింది. నర్సింగ్ స్కూలు, కాలేజీ విద్యార్థుల వసతి కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సెక్యూరిటీ, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలని, రోజు వారీ తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కమిటీలో నిర్ణయించారు. జీజీహెచ్ ఆవరణలోని షాపింగ్లను క్రమబద్ధీకరించి నిబంధనల మేరకు అద్దెలు వసూలు చేయాలని, ఆక్సిజన్, స్టేషనరీ సరఫరాను సమీక్షించాలని నిర్ణయించారు. వైద్యులు, సిబ్బంది విధులు సరిగా నిర్వహించేలా చూడాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విధులకు హాజరుకానీ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలను తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు ఆమోదం లభించింది. సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సూపరింటెండెంట్ డా.మాణిక్యరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు నామినేని కిరణ్, తిరుపతి రెడ్డి, ఏడుకొండలరావు, ఆర్ఎంఓ మాధవీలత, ఏడి అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
బాఽధితులకు సత్వర న్యాయం అందిస్తాం
● ఎస్పీ హర్షవర్ధన్రాజు మార్కాపురం: న్యాయంకోసం పోలీసుల వద్దకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఇన్చార్జి ఎస్పీ వి.హర్షవర్ధనరాజు అన్నారు. స్థానిక స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలకు చెందిన 48 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయి. ఆయా ఫిర్యాదులపై ఇన్చార్జి ఎస్పీ సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిగణలోనికి తీసుకుని సంఘటనా స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను భయపడకుండా నేరుగా పోలీసు అధికారులకు తెలపవచ్చని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎక్కువగా చీటింగ్, ఆర్థిక తగాదాలు, భూ తగాదాలపై ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. డీఎస్పీ నాగరాజు, మార్కాపురం, త్రిపురాంతకం సీఐలు సుబ్బారావు, అసం, గిద్దలూరు రూరల్, పొదిలి సీఐలు రామకోటయ్య, రాజేష్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
వంద పడకల ఆస్పత్రి కడితే సెల్యూట్ చేస్తా..
● వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జి అశోక్కుమార్ అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం రానున్న మూడేళ్లలో అద్దంకిలో 100 పడకల ఆస్పత్రి కడితే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి సెల్యూట్ చేసి క్షమాపణ చెబుతానని మంత్రి గొట్టిపాటి రవికుమార్కు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. కూటమి నాయకులు భోగాపురం ఎయిర్పోర్టును 18 నెలల కాలంలోనే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే భోగాపురం పూర్తయ్యేందుకు ఎవరు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. 2008లో అద్దంకి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 పడకల ఆస్పత్రి లేకపోవటం సిగ్గు చేటన్నారు. అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమార్ తన ఛాలెంజ్ను స్వీకరించి ముందుకు రావాలని అశోక్కుమార్ స్పష్టం చేశారు. కందుకూరు: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మండలాల సరిహద్దులు మార్చడం కుదరదని, విలీన గ్రామాల సమస్యతో నిలిచిపోయిన కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఆయన ఆకస్మికంగా కందుకూరు మున్సిపాలిటీలో పర్యటించారు. మొదట ఉప్పుచెరువు రోడ్డులోని ఎంఐజీ లే–అవుట్, టిడ్కో ఇళ్లు, స్విమ్మింగ్ పూల్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కోర్టు కేసులతో నిలిచిపోయిన కందుకూరు మున్సిపల్ ఎన్నికలను 2027లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిసినా నుడా పరిధిలోనే ఉంటుందని, అభివృద్ధి నిధులు కూడా అక్కడ నుంచే విడుదలవుతాయన్నారు. కొత్తపట్నం: టాస్క్ఫోర్స్ పోలీసులు లుంగీలు ధరించి మారువేషంలో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకుని ఒంగోలు నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం ఈ దాడులు చేశారు. పట్టుబడిన 9 మంది నుంచి రూ.4,490 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దాడులు చేసిన వారిలో టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్ సీఐ యు.సుధాకర్, ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్బాషా, సిబ్బంది ఉన్నారు. -
కట్టకిందపల్లిలో కలకలం
కనిగిరిరూరల్: అదో మారుమూల గ్రామం. చీమ చిటుక్కుమన్నా గ్రామస్తులందరికీ క్షణాల్లో సమాచారం తెలుస్తోంది. ఒకే ఇంట్లో రెండు నిర్జీవంగా పడి ఉండటంతో వెలిగండ్ల మండలం కట్టకిందపల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉలిక్కిపడిన గ్రామస్తులు వివాహిత మహిళ బండ్లముడి నాగలక్ష్మి(33) రక్తపు మడుగులో పడి ఉండటం, ఆ ఇంట్లోనే పోలీస్ ఉద్యోగి.. పురుగుల మందు తాగి నురుగులు కక్కుతూ పడిఉండడంతో చూసిన గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నేళ్ల నుంచి నాగలక్ష్మి సేనావలి పొలంలో కూలి పనులకు వెళుతుంది. నాగలక్ష్మితో కలిసి మరికొందరు కూలి పనులకు వెళ్లారు. అయితే నాగలక్ష్మి సేనావలి అద్దెకు తీసుకుని నివసిస్తున్న ఇంట్లో నిర్జీవులుగా కన్పించడంలో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. బయటపడింది ఇలా.. ఘటన జరిగిన ఇంటికి వెనుక వైపు కొద్ది దూరంలోనే సేనావలి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పొలాలు ఉన్నాయి. పొగాకు తోటకు నీళ్లు కట్టేందుకు రావాల్సిన నాగలక్ష్మి మధ్యాహ్నం దాటినా రాలేదు. దీంతో ఇంటి దగ్గరికి వెళ్లి గమనించగా.. ఇద్దరు విగతజీవులుగా పడిఉన్నారు. విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందింది. అసలేం జరిగింది.. ? ఘటన స్థలాన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య చాలా సేపు పెనుగులాట, గొడవ జరిగినట్లు ఘటనా స్థలిని చూస్తే తెలుస్తోంది. సేనావలి నాగలక్ష్మిని గోడకేసి గట్టిగా కొట్టడం వల్లే తలకు బలమైన గాయమై మృతి చెంది నట్లు భావిస్తున్నారు. గొడవలో నాగలక్ష్మి చనిపోయిన తర్వాత సేనావలి భయంతో పురుగుమందు తాగి ఆపస్మారక స్థితికి చేరాడు. అయితే వివాహిత నాగలక్ష్మిని హత్యచేసి భయంతో పురుగుల మందు తాగినట్లు నటిస్తున్నాడని.. స్థానికులు భావించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరారు. వారిద్దరి అస్పత్రికి తరలించే ప్రయత్నాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. డీఎస్పీ రంగ ప్రవేశంతో వారిద్దరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సేనావలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సేనావలి స్వగ్రామం అద్దంకిగా తెలుస్తోంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందన్నది విచారణలో తేలాల్సి ఉంది. నా భార్యను అన్యాయంగా చంపాడు నా భార్య నాగలక్ష్మిని పొలం పనికి అని పిలిచి అన్యాయంగా చంపాడని నాగలక్ష్మి భర్త నెమలయ్య వాపోయాడు. కేవలం దురుద్దేశంతోనే అన్యాయంగా హత్య చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించాడు. విచారణలో విషయాలన్నీ తెలుస్తాయి: సీఐ శ్రీనివాసరావు కట్టకిందపల్లిలో ఇద్దరు మృతిపై సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని చెప్పారు. కట్టకింద పల్లి గ్రామంలో సేనావలి అద్దెకు తీసుకున్న ఇంట్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని, నాగలక్ష్మి మృతి చెందగా, సేనావలిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి 6.30 గంటలకు తీసుకురాగా చికిత్స పొందుతూ 7 గంటలకు మృతి చెందాడని తెలిపారు. దీనిపై ఫిర్యాదు తీసుకుని హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. సేనావలి పోలీస్ శాఖలో పనిచేస్తాడని తెలిసిందని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇద్దరు మృతితో ఉలిక్కిపడిన గ్రామం అసలేం జరిగిందని గ్రామమంతా చర్చ అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ మార్కాపురం: మార్కాపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మానాయక్ వార్డెన్లను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మార్కాపురం, బేస్తవారిపేట, గిద్దలూరు, కనిగిరి డివిజన్ల పరిధిలోని 44 వసతి గృహాల ఏఎస్డబ్ల్యూ, హెచ్డబ్ల్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామని, ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలుచేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెలా వైద్యులతో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్డబ్ల్యూ రామకృష్ణారెడ్డి, వార్డెన్లు పాల్గొన్నారు. -
పందెం బరి సిద్ధం..
యర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఎడ్ల పందేల కోసం గ్రౌండ్ను సిద్ధం చేశారు. ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆయన స్వయంగా అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులను కలిపి కమిటీలుగా ఏర్పాటు చేసి ఆయా పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో జరిగే పందేల్లో పాల్గొన్న ఎడ్లు ఈ పోటీల్లో కాలు దువ్వి రంకెలు వేయనున్నాయి. ఏపీ రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఎడ్లు వచ్చి నియోజకవర్గ ప్రజలకు కనువిందు చేయనున్నాయి. ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ వారు ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తుండేవారు. 20 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఈ ఎడ్ల పోటీలు ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంలో నిర్వహించడంపై ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు సీనియర్, న్యూ కేటగిరీ, 6 పండ్లు, 2 పండ్ల విభాగాలుగా విభజించి పశుపోషకులను ఆహ్వానిస్తున్నారు. ఒక్కొక్క విభాగంలో 9 నగదు బహుమతులను నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం రూ.14.85 లక్షల బహుమతుల్లో అన్ని విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు భారీ మొత్తంలో ఉండటం వలన పశు పోషకులు తమ ఎడ్లతో పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న దాదాపు 10 ఎకరాల స్థలంలో పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎడ్ల పందేలు వీక్షించేందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించేలా చూస్తున్నారు. పోటీలు జరిగే గ్రౌండ్కు సమీపంలోనే తమ ఎడ్లను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పుష్కలంగా నీరు ఉండేలా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎద్దులతో పాటు వచ్చే పశుపోషకులు, రైడర్లకు, ఎడ్ల పందేలు వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ భోజన వసతులు కల్పిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏరా్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
నాణ్యమైన దిగుబడులు సాధించాలి
● పొగాకు బోర్డు ఆర్ఎం కందుకూరు: సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పొగాకు సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని పొగాకు బోర్డు ఆర్ఎం ఎస్ రామారావు అన్నారు. కనిగిరి రోడ్డులోని ఒకటో పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం మండలంలోని కోవూరు, నరిశెట్టివారిపాలెం, పందలపాడు గ్రామాలను సందర్శించి పొగాకు రైతులకు అవగాహన కల్పించారు. విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల అనేక అనర్ధాలు వస్తాయని, అంతర్జాతీయ మార్కెట్పై ప్రభావం ఉంటుందన్నారు. బోర్డు అధికారులు సూచించిన పురుగు మందులను మాత్రమే వాడాలన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా జీవామృతం, పచ్చిరొట్ట వంటి ఎరువుల వినియోగం వల్ల మంచి దిగుబడులు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి వీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో సోమవారం లారీ, బస్సు, స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, రవాణా వాహన డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్ సుశీల ప్రారంభించారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, సౌజన్యంతో హెల్త్ చెకప్లను నిర్వహించినట్లు ఉప రవాణా కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు హెల్త్ చెకప్లు చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విజయ లక్ష్మి, డాక్టర్ రామాంజనేయులు, ఎల్ సురేంద్ర ప్రసాద్, మోటార్ వాహన తనిఖీ అధికారి, కే జయ ప్రకాష్, యు ధర్మేంద్ర, బీభాను ప్రకాష్, డీ జస్వంత్ సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు, పరిపాలన అధికారి ఎం శ్రీనివాసులరావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్చార్జి డీపీఓగా ఒంగోలు జిల్లా డీపీఓ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మిదేవీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ బాల చెన్నయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: వీఆర్వోపై వీఆర్ఏ దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ సైదులు సోమవారం తెలిపారు. పట్టణంలోని 7వ సచివాలయం వీఆర్వో వాడల రామ కోటేశ్వరరావు పై దరిమడుగు వీఆర్ఏ కాశీం కారు తాళం విషయంలో దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో వీఆర్ఏపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొన్నలూరు: మండలంలోని మాలపాడు కేజీబీవీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి సుభాషిణి తెలిపారు. విద్యాలయంలో అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అకౌంటెంట్ పోస్టుకు డిగ్రీ–బీకాం, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 11 లోగా ఒంగోలు సమగ్ర శిక్షణ కార్యాలయంలో అందజేయాలని కోరారు. -
హైస్కూళ్లు, కాలేజీల వద్ద పోలీసుల నిఘా
ఒంగోలు టౌన్: జిల్లాలోని మహిళలు, బాలికలపై వేధింపులు ఎక్కువయ్యాయంటూ ‘నారా వారి పాలనలో నారీ విలాపం’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ హర్షవర్ధన్రాజు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పటిష్టం చేశారు. జిల్లాలోని అన్నీ హైస్కూళ్లు, కాలేజీల వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం గం.5.30 వరకు డ్రోన్ కెమెరాలతో పోలీసులు పహారా కాశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్న సమయంలో ఆకతాయిలు అల్లర్లు చేస్తే భరతం పట్టేందుకు ఆకాశ మార్గాన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థినుల పట్ల ఎవరైనా అమర్యాదగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లలో విడిచే సమయంలో పరిసరాలను గమనించాలని చెప్పారు. ఎవనరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల వద్ద రోడ్డు కనపడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు స్కూలుకు వచ్చే సమయానికి అర్ధగంట ముందు పరిసరాలను గమనించాలన్నారు. కాలేజీల వద్ద కానీ, స్కూళ్ల వద్దకానీ ఎవరైనా అల్లర్లు చేసినా, విద్యార్థినులను ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
రాష్ట్రాన్ని అమ్మడమే బాబు విజన్
ఒంగోలు టౌన్: రాష్ట్రాన్ని అమ్ముకోవడమే చంద్రబాబు విజన్ అని, అధికారంలోకి వచ్చినపుడల్లా రాష్ట్రాన్ని అమ్మడమే తప్ప ప్రజలకు ఆయన చేసిన మేలేమీ లేదని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతో మాట్లాడి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే శిష్యుడు రేవంత్రెడ్డి మాటకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వడు కానీ రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మనకు రావాల్సిన వాటాలను రేవంత్రెడ్డిని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. భోగాపురం ఎయిర్పోర్టును నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2023లో శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన వేదిక నుంచే జీఎమ్మార్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఆ వీడియోలే లేకుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ప్రజల కళ్లకు గంతలు కట్టేవాళ్లన్నారు. సోషల్ మీడియా ఉండటం వల్లే ఎల్లో మీడియా కుట్రలు సాగలేదన్నారు. చంద్రబాబు అబద్ధాలన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. మన జిల్లాకు సంబంధించి రామాయపట్నం పోర్టు కూడా పూర్తి కావచ్చిందని, నాలుగు పోర్టులు, హార్బర్లు పూర్తవుతున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ప్రజలంతా కోటి సంతకాలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సుదీర్ఘకాలం పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని కనిపించిన వారికల్లా చెబుతుంటాడని, కానీ ఒక్క పోర్టు కట్టడానికి ఆయనకు ప్రాణం ఒప్పలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినపుడల్లా రాష్ట్రాన్ని అమ్ముకోవడం, పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కోవడం, విద్య వైద్యాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. మళ్లీ అఽధికారంలోకి రామన్న నమ్మకంతోనే ఎకరం 99 పైసలకే కోట్లాది రూపాయల విలువైన భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నాడని ధ్వజమెత్తారు. టాటా, లూలూ కంపెనీలు వేలంలో భూములు కొనలేవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తి చేస్తుందని, ఢిల్లీలో బీజేపీతో చేతులు కలుపుతుందని, ఇదేం ద్వంద నీతని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తికి పవర్ స్టార్ ఎలా వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. పవర్స్టార్కు సినిమా వ్యాపారానికంటే రాజకీయాలే మంచి లాభసాటిగా ఉన్నట్లుందని విమర్శించారు. ఆయన శాఖలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ చిడతలు పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. మెప్మాపై ఎమ్మెల్యేకు కోపం ఎందుకు... ఒంగోలు మెప్మాలో జరిగిన అక్రమాల గురించి 15 రోజుల్లో విచారణ నివేదిక ఇస్తామన్నారు. నెల రోజులు దాటినా ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని చుండూరి రవిబాబు ప్రశ్నించారు. బినామీ రుణాల గురించి ఎమ్మెల్యే జవాబు చెబుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అవినీతి చేసిన వారి గురించి తేల్చకుండా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ప్రయోజం ఏంటన్నారు. అవినీతికి పాల్పడిన వారి వివరాలను వెల్లడించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే శిష్యుడు రేవంత్రెడ్డి మాటకే అధిక ప్రాధాన్యం టాటా, లూలూ యాజమాన్యాలు భూములు కొనలేని దుస్థితిలో ఉన్నాయా..? ఎకరా భూమిని 99 పైసలకే కట్టబెట్టడం దేనికి చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క పోర్టూ ఎందుకు కట్టలేకపోయారు..? వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజం -
పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
● మార్కాపురం ఇన్చార్జి కలెక్టర్ రాజాబాబు మార్కాపురం రూరల్ (మార్కాపురం): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరమవుతాయని, ప్రజలు పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పి. రాజాబాబు ప్రజలకు తెలిపారు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో సోమవారం వికసిత భారత్ రాంజీ చట్టంపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం కింద గ్రామస్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను తెలయచేసేలా గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరుగుతాయన్నారు. స్వచ్ఛ సంక్రాంతి పేరుతో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల స్వచ్ఛత, ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. ప్రతి నెలా పరిసరాల శుభ్రతపై ప్రత్యేక ఇతివృత్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు తమతో పాటు ఇంటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవీ, డ్వామా పీడీ జోసఫ్కుమార్, ఇన్చార్జి సబ్కలెక్టరు శివరామిరెడ్డి, సర్పంచ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ను కలెక్టరు పరిశీలించారు. -
త్వరలో ప్రతి డిపోలో ఆర్ఓ ప్లాంట్
● ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్రెడ్డి అద్దంకి: ప్రతి ఆర్టీసీ డిపోలో త్వరలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గ్యారేజీలోని వర్కర్లు, స్వీపర్లకు యూనిఫాం, స్వెట్టర్లను పంపిణీ చేశారు. తరువాత సీనియర్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలో 1300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. ప్రతి డిపోలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2020 నుంచి పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం ఇవ్వడం లేదా వారికి ఆర్థిక ప్రయేజనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్గో ద్వారా రూ.200 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. డిపో మేనేజర్ రామ్మోహనరావు, గ్యారేజ్ సిబ్బంది, వర్కర్లు, పాల్గొన్నారు. -
8 నుంచి క్రికెట్ టోర్నమెంట్
పొన్నలూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని బాలిరెడ్డిపాలెంలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సానేపల్లి రాజశేఖర్రెడ్డి తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్లు రూ.799 ఎంట్రీ ఫీజు చెల్లించి 7వ తేదీ లగోఆ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.30,116, రెండో బహుమతి రూ.15,116 అందజేస్తామన్నారు. వివరాలకు 9959442356, 8688201688 నంబర్లను సంప్రదించాలని కోరారు. 11 నుంచి మూడు జిల్లాలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీఎస్పురం(పామూరు): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సీఎస్పురంలో ఈనెల 11వ తేదీ నుంచి కేఎస్ రాయల్, ఎస్వీ ప్రసాద్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. టోర్నీలో విజేతలకు బహుమతులు వరుసగా మొదటి బహుమతి రూ.75 వేలు, ద్వితీయ రూ.40 వేలు, తృతీయ రూ.20 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 10వ తేదీ లోగా రూ.1000 చెల్లించి జట్టు పేరును నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9347142615, 9848084818 నంబర్లను సంప్రదించాలని కోరారు. ● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మార్కాపురం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్టీయూ మార్కాపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపికై న ప్రసాద్, దేశానాయక్ తెలిపారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య తెలిపారు. అదే విధంగా ఆర్థిక కార్యదర్శిగా సీహెచ్ గాలెయ్య, గౌరవ అధ్యక్షునిగా రామదాసు, గౌరవ సలహాదారునిగా రాఘవరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షునిగా యూసఫ్ షరీఫ్, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాదరావు, ఖాదర్ బాషాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, దస్తగిరి, జయశ్రీ, నబిఖాన్, శ్రీలత, సోఫియారాణి, వేణుగోపాల్, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
మత్తులో చిత్తు
కంభం టు గిద్దలూరు రహదారిపై రోడ్డు పక్కనే పడిపోయిన మందుబాబు తప్ప తాగి రాచర్ల నుంచి అనుమలవీడు గ్రామానికి వెళ్లే రోడ్డుపై పడిపోయిన మందుబాబు రాచర్ల బస్టాండ్ సెంటర్లోని టీ స్టాల్ వద్ద రోడ్డు పక్కనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధికో మద్యం దుకాణం, అడుగుకో బెల్టుషాపు ఏర్పాటు చేసి ప్రజల ఒళ్లు, ఇళ్లను గుల్ల చేస్తోంది. బెల్టుషాపుల ద్వారా మద్యాన్ని వాడవాడలా ఏరులై పారిస్తోంది. చాలా మంది మువకులు మద్యం మత్తులో పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యం, సరసమైన ధరకే మద్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతను మత్తులో ముంచేందుకు నాశిరకం మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్కడబడితే అక్కడ తప్పతాగి పడిపోయిన మందుబాబులు దర్శనమిస్తున్నారు. మార్కాపురం జిల్లా రాచర్ల బస్టాండ్ సెంటర్లో 24 గంటలు మద్యం అమ్మకాలు నిర్వహిస్తుండటంతో యువకులు మద్యం తాగి రోడ్లపైకి వచ్చి మత్తు ఎక్కువై కిందపడి దొర్లుతుండటంతో.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. – రాచర్ల -
45 ఏళ్ల తరువాత అపూర్వ కలయిక
మార్కాపురం: ‘అరేయ్ ఎలా ఉన్నావ్..రా నిన్ను చూసి ఎన్నేళ్లయింది. ఎంత మారిపోయావ్..పిల్లలంతా క్షేమమా’... ఓరేయ్ వెంకటేశ్వర్లు నువ్వంటరా.. అసలు గుర్తుపెట్టలేదురా’ అంటూ పలికరింపులు, ఆత్మీయ ఆలింగనాలతో నాటి మధుర స్మృతులను గురు్ుత్కతెచ్చుకున్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1979–90లో పదో తరగతి చదివిన విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చమత్కార సంభాషణలు, చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మనసారా నవ్వుకున్నారు. సుమారు 120 మంది చిన్ననాటి స్నేహితులంతా కలిసి తమ పాత జ్ఞాపకాలను, తీపి గుర్తులకు గుర్తుకు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ రిటైర్డు అయిన పూర్వ విద్యార్థులు ఎస్ఎల్ సుబ్బారావు, విల్సన్ ఐజక్, ఆకుల వెంకటేశ్వర్లు, కాటం వెంకటరమణ, గొంట్ల వెంకటేశ్వర్లు, షేక్ షబ్బీర్ తదితరులను మిత్రులు ఘనంగా సన్మానించారు. మిత్ర బృందం అధ్యక్షుడు సయ్యద్ సుభానీ, కార్యదర్శి జీవీ వర ప్రసాద్గుప్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ కదం శ్రీనివాసరావు, డీవి ప్రసాద్, ఎస్ లక్ష్మి సుబ్బారావు, నాగెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
దుండగులు చించివేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు ● బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకుల ఫిర్యాదు నాగులుప్పలపాడు: మండలంలోని ఈదుమూడి గ్రామంలో నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో కట్టిన ఫ్లెక్సీలను బ్లేడుతో కోసివేసినట్లుగా చినిగిపోయి ఉన్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలు చించివేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమ్మూరి సుధాకర్, గ్రామాధ్యక్షుడు యడవల్లి మోహనరావు, మండల సెక్రటరీ మున్నంగి డేవిడ్రాజు, అక్కి సాంబయ్య, కొమ్మూరి అశోక్, కొమ్మూరి నాగేశ్వరరావు, మున్నంగి చంద్రశేఖర్, కొమ్మూర ఆదాం, మొండితోక రాజేంద్ర, లంబు సుబ్బయ్య తదితరులు ఉన్నారు. -
చెక్డ్యాంలో పడి యువకుడు మృతి
మేదరమెట్ల: జరుగుమల్లి(సింగరాయకొండ): మండలంలోని కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి కొత్తపల్లి నిఖిల్ జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎల్ అనూరాధ తెలిపారు. ఇటీవల అండర్–14 రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జరగనున్న జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు. ఈ సందర్భంగా నిఖిల్ను, వ్యాయామ ఉపాధ్యాయుడు నర్రా కోటేశ్వరరావులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. చీరాల రూరల్: చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తీరంలో సందడి వాతావారణం నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్రస్నానానికి తీరానికి తరలిరావడంతో షూటింగ్ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోయింది. ఈ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్ వారి మాస్టర్ కనిష్క సమర్పించే ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్, మౌనిక శర్మ హీరో హీరోయిన్గా నటిస్తున్నారని, వీరిరువురికి ఇదే మొదటి సినిమా అని చెప్పారు. సినిమాలో నటీనటులుగా సుహాసిని మణిరత్నం, వినోద్కుమార్, ఇంద్రజ, శుభలేక సుధాకర్, అన్నపూర్ణమ్మ, తదితరులు ఉన్నట్లు చెప్పారు. కొరియోగ్రఫీ సంతోష్, బాలకృష్ణ, ఫైట్స్ రాజు, ప్రొడ్యూసర్గా పి.నాగరాజు వ్యవహరించనున్నారని తెలిపారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఈ నెల 13 వరకు షూటింగ్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. -
పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు
యర్రగొండపాలెం: తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయానికి అద్దంపట్టే పండుగ సంక్రాంతి అని, అటువంటి పండుగ సందర్భంగా పశు పోషకులను ప్రోత్సహించటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికారం ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన ఎడ్ల పందేల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్రాంతి అంటే పంటలు, పశు సంపద మన ప్రధాన సాంప్రదాయమని అన్నారు. ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటారని, వారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల తరువాత యర్రగొండపాలెం వేదికగా ఎడ్ల పందేలు జరగబోతున్నాయన్నారు. మన సంస్కృతిని భావితరాలకు ఇవ్వడం కోసం ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో నాలుగు విభాగాలుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ పోటీలను తిలకించి ఆశీర్వదించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పెద్ద ఎత్తున తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఎడ్లను తీసుకొని రావాలని, ప్రతి రైతు గర్వించేలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూర్చుతున్నామని చెప్పారు. ఎడ్ల పందేలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ముందుగా ఎడ్ల పందేలు నిర్వహించే స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న కేఎస్ ప్లాట్లలో సిద్ధం అవుతున్న గ్రౌండ్ను ఆయన పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్గౌడ్, గుమ్మా ఎల్లేష్ యాదవ్ పద్మజ, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, ఆనికాల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, వివిధ విభాగాల నాయకులు కందూరి కాశీవిశ్వనాథ్, పెద్దకాపు వెంకటరెడ్డి, షేక్.షెక్షావలి, మిడత నరసింహరావు, మేడగం వెంకటరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, ఎల్.రాములు, ఆర్.అరుణాబాయి, గార్లపాటి శారద, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, షేక్.కాశింపీరా, మహ్మద్ కాశిం, తమ్మినేని సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, తోకల ఆవులయ్య యాదవ్, పి.రామయ్య, సురేష్ నాయక్, అట్టా వెంకటరెడ్డి, హరినాయక్ పాల్గొన్నారు. -
9 నుంచి రావినూతలలో సంక్రాంతి కప్
మేదరమెట్ల: ఈనెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొరిశపాడు మండలంలోని రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావినూతల క్రికెట్ స్టేడియంలో 32వ అంతర్ రాష్ట్ర టీ 20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కారుసాల నాగేశ్వరరావు (బాబు) తెలిపారు. ఆర్ఎస్సీఏ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈపోటీలు సంక్రాంతి కప్–2026 పేరుతో నిర్వహిస్తామన్నారు. నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 16 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. 20–20 ఫార్మాట్లో పోటీలు జరుగుతాయని, ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు రూ.3 లక్షలు, రెండో జట్టుకు రూ.2 లక్షలు, మూడో జట్టుకు రూ.1 లక్ష నగదు బహుమతితో పాటు కప్లు అందచేయనున్నట్లు నాగేశ్వరరావు (బాబు) తెలిపారు. సినీనటుడు యర్రా రఘుబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తాను ఇక్కడే అందుబాటులో ఉంటానన్నారు. అలాగే ఫైనల్స్కు ఓ ప్రముఖ వ్యక్తిని క్రికెట్ స్టేడియంకు తీసుకు వచ్చేందుకు ఆయన చేతుల మీదుగా సంక్రాంతి కప్ను విజేతకు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మోపర్తి వెంకట్రావు, పూనాటి వెంకట్రావు, అప్పారావు, బ్రహ్మానందం, నరసింహారావు, పూనాటి బసయ్య, రామినేని శ్రీను, చేబ్రోలు నాగేశ్వరరావు, జయంత్బాబు, వల్లెపు శ్రీకాంత్, బండారు రామాంజనేయులు, అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఒంగోలు సిటీ: జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ టీచర్స గిల్డ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమావేశంలో పలు తీర్మానాలను చర్చించి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ను సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ కేటాయించాలన్నారు. ఎయిడెడ్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు సీఆర్ఎంటీలను కేటాయించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేసే పీఈటీ పండిట్లకు పదోన్నతి సౌకర్యం కల్పించాలన్నారు. ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు కలెక్టర్ పూల్లో జిల్లా యూనిట్ గా కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు వి.చిరంజీవి, బాదం రామకృష్ణారెడ్డి, జే.శివకుమార్, కమ్మా రమేష్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
ఒంగోలు: జాతీయస్థాయి అండర్ 20 జూనియర్ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పుత్తూరు అంబరీష్(ఈపీ విభాగం), ఏకాంబరం వెంకట సాయి మహిత (సాబరే) విభాగంలో రాణించి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిద్దరిని రాష్ట్ర అసోసియేషన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 5 నుంచి 10 వరకు ఒడిషా రాష్ట్రం కటక్ పట్టణం జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో జరిగే 33వ జాతీయ జూనియర్ ఫెన్సింగ్ పోటీల్లో మన రాష్ట్రం తరఫున వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ కోటా సాయి మనోహర్లు అభినందించారు. -
అమెరికా కండకావరాన్ని ఖండించాలి
ఒంగోలు టౌన్: అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ దక్షిణమెరికాలోని వెనిజులా దేశంపై దాడి చేయడమే కాకుండా ఆ దేశాధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడం అమెరికా కండకావరానికి నిదర్శనమని, ప్రజాస్వామికవాదులంతా ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్ పిలుపునిచ్చారు. వెనిజులాపై అమెరికా దాడులను ఖండిస్తూ ఆదివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ రెండు రోజులుగా వెనిజులా దేశంపై అమెరికా మారణాయుధాలతో దాడులు చేసి సామాన్యులను సైతం హతమార్చడం కిరాతకమన్నారు. ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలన్న కుట్రతో ట్రంప్ రౌడీయిజానికి పాల్పడుతున్నాడని, వెనిజులా సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా నేరుగా జోక్యం చేసుకోవడం ప్రపంచ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. పాలస్తీనా భూ భాగంలో వేలాది మంది పసిపిల్లలను క్రూరంగా హత్య చేసిందన్నారు. అమెరికా దాష్టికాలపై భారత దేశం స్పందించాలని, వెంటనే పార్లమెంటును సమావేశపరిచి వెనిజులా ఘటనను ఖండించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు బి.పద్మ, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, చొప్పర జాలన్న, పద్మ, హనుమంతరావు, దారా సుబ్బారావు, దాసరి వెంకటేష్, సి.తిరుమలరావు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ను శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం పోరాట పంథాలో పయనిస్తూ హక్కులను కాపాడుకొని భావితరాలకు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవటం కోసం ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.అమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీనారాయణ, ఐఫియా కౌన్సిలర్ పీవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. -
నారీ విలాపం
మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగికదాడులు చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు బడిలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోయింది. వీటికి తోడు బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో జిల్లాలో 1564 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ● రోజుకు ఇద్దరు మహిళలపై నేరాలు ● నాలుగు రోజులకో బాలికపై లైంగికదాడి ● బడిలో కూడా రక్షణ కరువు ● ప్రేమ పేరుతో మోసపోయిన ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య ● బాలికను నాగార్జున సాగర్ తీసుకెళ్లి లైంగికదాడి ● పని ప్రదేశంలో మహిళలపై పెరిగిన లైంగికదాడులు ● దిశను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ● గత ఏడాది కాలంలో మిస్ అయిన బాలికలు: 136 మంది, మహిళలు: 264 మంది బిలాల్ నగర్లో బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు నగరంలోని బిలాల్ నగర్లో ఒక బాలికను వేధిస్తున్నట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే మీ కోసం వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాడు. డీఎస్పీని కలిసి తన కూతురికి రక్షణ కల్పించడమంటూ వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకోవడానికి బడికి వెళితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చదువుకోడానికి బడికి వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. అదే పాఠశాలలో చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయుడు వీరి మీద కన్నేశాడు. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులను సాయంత్రం స్కూలు వదిలిన తరువాత కూడా వేచి ఉండమని చెప్పాడు. విద్యార్థులందరూ వెళ్లి పోయాక ఆ చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన చూసి భయపడిపోయిన చిన్నారులు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పడంతో కేసు నమోదు చేయడమే కాకుండా కీచక గురువును సస్పెండ్ చేశారు.నారా వారి పాలనలో..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మరింతగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. ఆ తరువాత వరుసగా బాలికల మీద లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహిళల సంగతి సరే సరి. ప్రతి రోజూ అదనపు కట్నం కోసమో, ఇతరత్రా కారణాలతో మహిళల మీద నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళా హోం మంత్రి పాలనలో కూడా మహిళలకు రక్షణ లేకుండాపోవడం బాధాకరమని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు ఇద్దరు మహిళలపై అఘాయిత్యం.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ఇద్దరు మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారు. కట్నం కోసం హతమార్చడం కావచ్చు, అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస, ఇతరత్రా కారణాలతో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి 2024లో 475 కేసులు నమోదు కాగా, 2025లో 440 కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో 915 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళల హత్యలు, కిడ్నాపులు వంటి కేసులు 2024లో 274 నమోదు కాగా, 2025లో 180 కేసులు నమోదవడం గమనార్హం. మొత్తం మీద మహిళలకు వ్యతిరేకంగా 2024లో 855 కేసులు, 2025లో 709 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ రెండేళ్లలో 1564 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్కటే ప్రతి రోజూ రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. పోలీసు స్టేషన్ గడప తొక్కని కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఊహించడం కష్టం. మహిళల రక్షణ కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ను మూలనడేసిన చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చింది. శక్తి యాప్ను నామమాత్రంగా మహిళల ఫోన్లలో డౌన్లోడ్ చేసి ఇక దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ యాప్ వల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. బాలికలకు రక్షణేది.. జిల్లాలో బాలికల మీద లైంగికదాడులు పెరిగిపోయాయి. బాలికల మీద ఈ రెండేళ్లలో 177 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది పోలీసు రికార్డులు పరిశీలిస్తే నాలుగు రోజులకో బాలిక మీద లైంగికదాడి జరిగినట్లు తెలుస్తోంది. పిక్కిలి ఆంజనేయులు అనే టీడీపీ నాయకుడు యర్రగొండపాలెం మండలంలోని ఒక గ్రామంలో కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తినుబండరాల కోసం దుకాణానికి వెళ్లిన 9, 8 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మభ్య పెట్టి దుకాణం వెనకకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కురిచేడు పరిసరాలకు చెందిన ఒక 16 ఏళ్ల బాలికను రాగుల శ్రీను అనే కామాంధుడు మాయమాటలతో నాగార్జున సాగర్కు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించి ఐదు రోజుల పాటు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టకుండా రాజీ చేసేందుకు ప్రయత్నించారు. దళిత సంఘాలు రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం..ఆత్మహత్య.. ఇటీవల నగరానికి చెందిన ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎంటెక్ చదువుకున్న బాలిక నగరానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సదరు యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడగడంతో నీ కులం వేరు మా కులం వేరు అంటూ మొహం చాటేశాడు. యువకుడి ఇంటికి వెళ్లిన యువతిని నెట్టివేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ ఘటనలోనూ యువకుడి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.ఆగని బాలికలు, మహిళలు మిస్సింగ్లు... జిల్లాలో బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు రికార్డుల ప్రకారమే గత ఏడాది కాలంలో 136 మంది బాలికలు, 264 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అయితే పోలీసుల అప్రమత్తత కారణంగా ఈ కేసుల్లో 90 శాతానికి పైగా ట్రేస్ చేశారు. అయినా కొంతమంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. 2024 జూన్లో మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ శివారులోని కపిల్ లేఔట్ వద్ద సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. తొలుత ఈ బాలిక మిస్సింగ్ అయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదిక రావడంతో పోలీసులు విచారణ కొనసాగించారు. ఏడాదిన్నర తరువాత 2025 డిసెంబర్ 31న నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో బాలిక కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో నమోదైన కేసులు: 1564 బాలికల మీద లైంగికదాడుల కేసులు: 177 మహిళలు, బాలికలపై దాడులు పెరగడం ఆందోళనకరం రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగిక దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చివరికి పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? గ్రామగ్రామానికి మద్యం అందుబాటులోకి రావడంతో మహిళలపై హింస కూడా పెరిగింది. గృహహింస గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదన్నట్లుగా తయారైంది. మహిళల సాధికారిత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం మహిళ రక్షణ గురించి నోరుమెదపడం లేదు. – ఎం.విజయ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుమద్య నిషేధం చేయడం ఒక పరిష్కారం ఇటీవల కాలంలో మద్యం తాగడం ఎక్కువైపోయింది. ప్రభుత్వం టార్గెట్ విధించి మరీ తాగిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. చిన్నపిల్లలు సైతం మద్యం తాగుతున్నారు. దీంతో పాటుగా అశ్లీల చిత్రాల ప్రసారం మితిమీరింది. మద్యపానాన్ని నిషేధించాలి. విష సంస్కృతిని కట్టడి చేయకుండా మహిళలపై హింసను అరికట్టడం అసాధ్యం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వాలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి -
సీపీఐ వందేళ్ల పండుగను విజయవంతం చేయండి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్ కుమార్ ఒంగోలు టౌన్: తెలంగాణలోని ఖమ్మంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న సీపీఐ వందేళ్ల పండుగను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఆదివారం సీపీఐ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవరర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సయ్యద్ మౌలాలి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా స్వాతంత్య్రానంతరం దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా అనేక పోరాటాలు చేసిన ఘనత సీపీఐకు దక్కుతుందని తెలిపారు. అధికారం కోసం పాకులాడకుండా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడిందన్నారు. అందుకే అఽధికారంలో లేకపోయినప్పటికీ వందేళ్లుగా దేశ ప్రజలు సీపీఐని ఆదరిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ.. ఏనాడూ ప్రజల సమస్యల కోసం పాటుపడని బీజేపీ.. నేడు పరిపాలన చేస్తోందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బరితెగిస్తోందని విమర్శించారు. దశాబ్దాల క్రితం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తోందని, దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా నల్లచట్టాలతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా తీసుకురాలేదని, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నాడని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో దళితులు, వెనకబడిన వర్గాలు, మహిళలు, మైనార్టీలపై దాడులు పెచ్చుమీరిపోయాయని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని జైలుకు పంపిస్తున్నారని, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలన మీద పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లూరి మురళి, ఆర్.రామకృష్ణ, ఎం.విజయ, ఆర్.లక్ష్మి, ఎస్కే ఖాశీం, డి.శ్రీనివాస్, ఎం.రమేష్, కొత్తకోట వెంకటేశ్వర్లు, వి.హనుమారెడ్డి, శ్రీరాం శ్రీనివాసరావు, కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని దుప్పి మృతి
వలేటివారిపాలెం: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుప్పి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు వలేటివారిపాలెం మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామం వద్ద 167 బీ హైవే రోడ్డును ఆడ పొడ దుప్పి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు పక్కన పడిపోయింది. దీన్ని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి హనుమంతురావు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన దుప్పిని స్థానిక పశు వైద్యశాలకు తరలించారు. సహాయ సంచాలకుడు డాక్టర్ చెన్నకేశవులు సూచనల మేరకు పోకూరు డాక్టర్ సుధాకర్ దుప్పికి శవ పరీక్షలు నిర్వహించి ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. ఫారెస్ట్ అధికారి హనుమంతురావు అడవిలో దుప్పిని దహనం చేశారు. చీమకుర్తి రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని బండ్లమూడి గ్రామంలో బండ్లమూడి యువజన సంఘం ఆధ్వర్యంలో 7వ జిల్లా స్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఎస్సై వెంకట కృష్ణయ్య పాల్గొని క్రీడాకారులకు సూచనలు ఇచ్చారు. ఈ టోర్నమెంట్ 15వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
అంధుల్లో ఆత్మవిశ్వాసం నింపిన బ్రెయిలీ
ఒంగోలు వన్టౌన్: అంధులకు అక్షర జ్ఞానం ప్రసాదించి, ఆత్మవిశ్వాసం నింపిన మహనీయుడు బ్రెయిలీ అని రాష్ట్ర సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ చైర్మన్ గుడిపూటి నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఆర్ఓ బి.చిన ఓబులేసు మాట్లాడుతూ దివ్యాంగులకు సింగిల్ రేషన్ కార్డు జారీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 మంది విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్ టాప్లు పంపిణీ చేశారు. దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండరును ఆవిష్కరించారు. తొలుత కలెక్టరేట్ వద్ద ఉన్న బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవీంద్రబాబు, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామసుబ్బయ్య, విజువల్లి ఛాలెంజ్డ్ అన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రతన్ రాజు, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, దివ్యాంగ ఉద్యోగుల ప్రకాశం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు, సూర్య చారిటబుల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించారు. -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ కేసులు
ఒంగోలు సిటీ: కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఒంగోలులోని ఆయన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎవరు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారో, దైవ సంబంధ కార్యక్రమాలపై కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వీటన్నింటి మీద ప్రజలు తీర్పు ఇచ్చిన రోజున రెట్టింపు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాను స్వాగతిస్తున్నామని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు. అయితే జిల్లా కేంద్రమైన మార్కాపురానికి దగ్గరగా ఉన్న దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలిపితే బాగుండేదని స్థానిక నాయకులు, ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. రానున్న రోజుల్లో దీనిపై పార్టీ నాయకుల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్ల వారీగా జిల్లాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు పూర్తి చేసిందన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి నీళ్లు అందించాలన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద కోలాహలం ఒంగోలు లోని రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండపి నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ లను గజమాలతో సత్కరించారు. అనంతరం వై.వి.సుబ్బారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. -
శనగకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనాలి
మద్దిపాడు: శనగ పంటకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని పలువురు శనగ రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్కు విన్నవించారు. శనివారం ఆయన మండలంలోని రైతుల పరిస్థితి కనుక్కోవడానికి గుండ్లాపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పంటలకు పెట్టే పెట్టుబడి, పంట దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులను శనగ పంట గురించి అడగడంతో గత రెండు సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలేక చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకున్నామని తెలిపారు. శనగ పంటకు ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరకన్నా, సబ్సిడీపై ప్రభుత్వం ఇస్తున్న శనగ విత్తనాల ధర ఎక్కువగా ఉందని అన్నారు. అందువల్లే ఈ ఏడాది రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే విత్తనాలకు ఎక్కువ కొనుగోలు చేయలేదని తెలిపారు. అంతే కాకుండా గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిధిలో ఉన్న తమ గ్రామాల్లో పంటలకు నీటి వసతి కోసం ఆయిల్ ఇంజన్లు సబ్సిడీ పై ఇప్పించాలన్నారు. ప్రస్తుతం మండలానికి ఒకే ఒక డ్రోన్ ఇచ్చారని, దాని వలన రైతులకు ఉపయోగం లేదన్నారు. గ్రామానికి ఒక డ్రోన్ ఇస్తే మందుల పిచికారీకి సులువుగా ఉంటుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ అన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు, ఏడీఏ రమేష్, మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి జీ స్వర్ణలత ఏఈఓ శేషయ్య వీఏఏలు పాల్గొన్నారు. -
అధికారులా.. రాజకీయ నాయకులా..
ఒంగోలు సిటీ: జిల్లాలోని అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే.. అధికార పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ప్రొటోకాల్ పాటించకుండా ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులోని పాత జెడ్పీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ఆద్యంతం గరంగరంగా సాగింది. అధికారుల తీరు మీద జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్చార్జ్ల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు: కనీసం పంచాయతీ మెంబరుగా కూడా ఎంపిక కాని వ్యక్తులను నేరుగా డీఆర్సీ మీటింగ్లలో పెద్దపీట వేసి గౌరవిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారుల తీరును అలుసుగా తీసుకున్న పంచాయతీ కార్యదర్శులు సైతం రెచ్చిపోతున్నారని, మండల అధికారులు ఎమ్మెల్యేలను కలవకుండా పార్టీ ఇన్చార్జ్ల చుట్టే ప్రదక్షిణ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో స్పీకరుకు కంప్లైంట్ చేసినా అధికారుల తీరు మారలేదన్నారు. పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బారుకు అధికారులు ఎలా హాజరవుతారు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎవరు పంపిణీ చేయాలని అధికారులపై ప్రశ్నలు సంధించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడ్డారు. ఎమ్మెల్యే తాటిపర్తి వేస్తున్న ప్రశ్నలకు తమ వద్ద జవాబు లేక నీళ్లు నమిలారు. కలెక్టర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎంపీడీవోలు మండల సర్వసభ్య సమావేశాలను వాయిదా వేస్తున్నారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ మాత్రం దానికి సమావేశాలు ఎందుకని దుయ్యబట్టారు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారులు చేసే దుర్మార్గాలకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెలిగొండ విషయంలో ప్రచార ఆర్భాటం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది కేవలం ప్రచారం మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిర్వాసితుల పేర్లు నమోదు చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో బాధితులందరినీ గుర్తించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల దోర్నాల ప్రజలు భూములు కోల్పోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. టీ5 కాలువ నిర్మించకపోతే దోర్నాల, పుల్లలచెరువు రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సుంకేసుల, గుండంచర్ల, కలనూతల గ్రామాల ప్రజలు ఖాళీ చేయకుండా ప్రాజెక్టు పూర్తి కాదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందజేయకుండా 2026 లో వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీ5 కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయమై సమావేశంలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎమ్మెల్యే తాటిపర్తి నిలదీశారు. పేరెంట్స్ మీటింగ్కు పిలవని ఎంఈఓలు.. యర్రగొండపాలెం నియోజకవర్గంలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్కు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను, ఎమ్మెల్యే అయిన తమను ఎందుకు పిలవలేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డీఈవో ను నిలదీశారు. యర్రగొండపాలెం ఎంఈఓను ఒకసారి సమావేశానికి పిలిపించమని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ పూర్తిగా పక్కన పెట్టేసిన ఎంఈఓలు టీడీపీ ఇన్చార్జ్లకు జీ హుజూర్ అంటున్నారని విమర్శించారు. ప్రొటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కు పిలవకపోతే ఇక ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు ఎందుకని జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్చార్జ్ల చేత జెండా వందనం చేయించారని, వారికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. రూ.8,52,15,36,700 బడ్జెట్ ఆమోదం: జెడ్పీ సమావేశంలో 2026–2027 సంవత్సరపు బడ్జెట్ను ఆమోదించారు. 2026–27 సంవత్సరంలో రూ.8,52,15,36,700 ఆదాయాన్ని అంచనా వేశారు. అందులో రూ.8,50,81,82,396 వ్యయాన్ని చూపించారు. రూ.1,33,54,304 ను మిగులు చూపుతూ తయారు చేసిన బడ్జెట్ను ఆమోదించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ బీ చిన ఓబులేసు, బాపట్ల జిల్లా డీఆర్ఓ గంగాధరగౌడ్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.అంబులెన్స్ నడపలేని అసమర్ధ ప్రభుత్వం.. కొత్త జిల్లా ఏర్పాటుకు ఆహ్వానం లేదు.. ఇటీవల మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా జరిగిన ప్రభుత్వ కార్యకలాపాలకు దేనికి కూడా ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు ప్రొటోకాల్ పట్టదా అని నిలదీశారు. జిల్లాలోని దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారుల మీద కోర్టుకు వెళతామన్నారు. ఉల్లి రైతులకు ప్రభుత్వ సహకారం అందించాలి వైపాలెం నియోజకవర్గంలోని నడిగడ్డలో ఉల్లి పండించే రైతుకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నడిగడ్డలో ప్రతి ఏడాది 1600 ఎకరాల వరకు ఉల్లి సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కర్నూలు ప్రాంతంలో ఉల్లి పండించే రైతులకు ఇచ్చినట్లుగానే నడిగడ్డ రైతులకు కూడా ప్రభుత్వం సహకారం అందించాలన్నారు.రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలుట్ల పీహెచ్సీలో వైద్యులు ఉండటం లేదని ప్రజలు అనారోగ్యం బారిన పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నిధుల ద్వారా పీహెచ్సీకి తాను అంబులెన్స్ను మంజూరు చేయించినా డ్రైవర్ను నియమించకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అంబులెన్స్ వద్దని ఎంపీకి అధికారులు లెటర్ రాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ను నడపలేని ప్రభుత్వం ఎందుకని ఎద్దేవా చేశారు. జిల్లా పరిషత్ సమావేశానికి అధికార కూటమి ఎమ్మెల్యేలలో కేవలం ఒక్కరు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు నగరంలోనే ఉన్నా సమావేశం వైపు తొంగిచూడలేదు. ఎంపీ మాగుంట సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. -
ఎకై ్సజ్ శాఖ విభజన
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎకై ్సజ్ శాఖను విభజించారు. నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో ఎకై ్సజ్శాఖ విభజనలో భాగంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని ఆరు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లను చేర్చారు. వీటి పరిధిలో 87 వైన్షాపులు, 8 బార్లు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. విభజనతో 4 నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాలోకి వచ్చాయి. దీంతో మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, కంభం, పొదిలి ఎకై ్సజ్ స్టేషన్లు నూతన జిల్లాలోకి వచ్చాయి. వీటి పరిధిలో 84 వైన్షాపులు, 8 బార్లు ఉన్నాయి. మార్కాపురం స్టేషన్ పరిధిలో 13, యర్రగొండపాలెం పరిధిలో 14, కనిగిరిలో 21, గిద్దలూరులో 13, కంభం 11, పొదిలి పరిధిలో 16 వైన్షాపులు ఉన్నాయి. బార్ల విభాగంలో మార్కాపురంలో 5, గిద్దలూరు, కనిగిరి, పొదిలిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. జిల్లా విభజనతో మార్కాపురం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఒంగోలు సూపరింటెండెంట్ను ఇన్చార్జిగా నియమించారు. ప్రకాశం జిల్లాలో నూతనంగా చేరిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని ఎకై ్సజ్ స్టేషన్లను కూడా ఒంగోలు పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని పోస్టులను విభజించాల్సి ఉంది. దీంతో పాటు నూతన జిల్లాలో మినిస్ట్రీరియల్ స్టాఫ్ను నియమించాల్సి ఉంది. నూతన జిల్లాలోకి బదిలీపై వచ్చేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంతమంది ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, పశ్చిమ ప్రకాశంలో ఊరూరా బెల్టుషాపులు, గంజాయి, నాటుసారా, గోవా లిక్కర్ ఉన్నాయి. ఇటీవలే దోర్నాల, యర్రగొండపాలెం, అర్దవీడు మండలాల్లో పలువురు గంజాయి సాగుచేయగా, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఇక వాస్కోడిగామా ట్రైన్లో గోవా రాష్ట్ర లిక్కర్ బాటిళ్లు జోరుగా మార్కాపురం వస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత నూతనంగా జిల్లాకు వచ్చే ఎకై ్సజ్ అధికారులపై ఉంది. మార్కాపురం జిల్లాలో ఆరు ఎకై ్సజ్ స్టేషన్లు ప్రకాశం జిల్లాలో చేరిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ఎకై ్సజ్ స్టేషన్లు ఒంగోలు పరిధిలోకి.. -
పొగాకు మాటున గంజాయి సాగు
అర్దవీడు: మండలంలోని మాగుటూరులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి శనివారం తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన బి.తిరుపాలు తన పొగాకు పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడే గంజాయి మొక్కలు తొలగించి వాటిని దహనం చేశారు. అనంతరం తిరుపాలును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. ఒంగోలు టౌన్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 5వ తేదీ వీబీజీ రాంజీ చట్టం–2025పై అవగాహన కల్పించడానికి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.జోసఫ్ కుమార్ తెలిపారు. శనివారం డ్వామా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కూలీలకు కల్పించే పనిదినాలు 100 నుంచి 125కు పెంచడం, పథకానికి కేంద్రం రాష్ట్ర నిధులు 60–40 నిష్పత్తిలో ఖర్చు చేయడం, వ్యవసాయ పనుల కాలంలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేయడం, డిమాండ్ ఆధారంగా కాకుండా ముందుగా కేటాయించిన నిధుల ప్రకారమే గ్రామాల్లో పనులు గుర్తించడం గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఒంగోలు వన్టౌన్: చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు అని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి బిలియనీర్ ఎలా అయ్యాడని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన.. స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పరిపాలన సరిగ్గా లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు. గ్రామాల్లో టీడీపీ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తిరుమలలో స్వామివారి బంగారం రికార్డుల్లో ఎంత ఉంది, ఎక్కడ పెట్టారు.? అని అడిగితే టీటీడీ ఈవో నుంచి సమాధానం రావడం లేదన్నారు. పచ్చగా ఉన్న వందల ఎకరాల టీటీడీ భూములను కార్పొరేట్ సంస్థలకు పంచుతున్నారని మండిపడ్డారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు సరిగ్గా రావడం లేదన్నారు. యూనివర్శిటీలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులు కన్నీళ్లతో ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 30 శాతం మాత్రమే ఇస్తా మని, మిగిలిన 70 శాతం డబ్బు విద్యార్థులే భరించుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు విజయేంద్ర బహుజన్ పాల్గొన్నారు. -
జనగణనలో కులగణన నిర్వహించాలి
● బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్లా సుబ్బారావు ఒంగోలు వన్టౌన్: జనగణనలో కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్లా సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రీబాయి ఫూలే జయంతి కూడా నిర్వహించి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 2024 ఎన్నికలలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీలలో ఒకటైన 50 సంవత్సరాలు నిండిన బీసీలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా రూ.1,500 ఇవ్వాలని, యువతకు నిరుద్యోగ భృతి రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2010 యూనిట్లకు బీసీలను గుర్తించి మంజూరు చేయకుండా, సబ్సిడీ డబ్బులు బ్యాంకులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తక్షణమే నిధులు మంజూరు చేసి బీసీలకు యూనిట్లు మంజూరు చేయాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ 1931లో బ్రిటిష్ ప్రభుత్వంలో చివరిసారిగా కులగణన జరిగిందని, తక్షణం కులగణన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, బొట్ల రామారావు, రాష్ట్ర కన్వీనర్ అజీజ్, జిల్లా కన్వీనర్ గుంటూరి మస్తాన్రావు, బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఫణిదపు సుధాకర్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ పేరయ్య, సీపీఐ రెడ్స్టార్ నాయకుడు భీమవరపు సుబ్బారావు, గిరిజన సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకుడు పేరం సత్యం, ఉడుతా మంత్రాలు, బీసీ నాయకురాలు శేషమ్మ, దేవరంపాటి శ్రీదేవి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షురాలు దూళ్ల దుర్గాభవాని, అప్పారావు, రజక నాయకుడు ఉప్పలపాటి వేణు, బీసీ నాయకుడు బొట్లా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పీవీఆర్ పూర్వ విద్యార్థుల భారీ ర్యాలీ
● 10, 11 తేదీల్లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ఒంగోలు సిటీ: నగరంలోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీవీఆర్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ గాంధీ రోడ్డు, దక్షిణం బజార్, పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా ఆర్పీ రోడ్డు, సాయిబాబా ఆలయం మీదుగా సాగింది. పీవీఆర్ పూర్వ విద్యార్థి, ప్రస్తుత వెంకట రమణ హాస్పిటల్ అధినేత డాక్టర్ సీతారామయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకించి మహిళా పూర్వ విద్యార్థులు పాల్గొని ఆకర్షణగా నిలిచారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరగబోయే పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలలో అందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. -
మార్కాపురం డిపో అభివృద్ధికి చర్యలు
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న మార్కాపురం ఆర్టీసీ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జోన్ 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలోని జిల్లా ప్రజా రవాణా కార్యాలయాన్ని ఆర్ఎం సత్యనారాయణతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఒంగోలు వైపు వెళ్లే బస్సులకు ప్రత్యేక ప్లాట్ఫారాలు, అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. బస్టాండును ఆధునికీకరించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు పెంచుతామన్నారు. శ్రీశైలానికి ప్రస్తుతం 11 సర్వీసులు నడుపుతున్నామని, త్వరలో సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీ్త్రశక్తిలో భాగంగా 60 శాతం నుంచి 100 శాతానికి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. మార్కాపురం జిల్లాలోని మార్కాపురంతో పాటు కనిగిరి పొదిలి, గిద్దలూరు డిపోల్లో 300 బస్సులు ఉన్నాయని, వీటి సంఖ్య కూడా పెంచుతామని తెలిపారు. మార్కాపురం పట్టణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్టాండులో ప్లాట్ఫారాలు పెంచడంతో పాటు టాయిలెట్లు, ఇతరత్రా సౌకర్యాలు మెరుగుపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎం నరసింహులు, ఏడీయం ధనలక్ష్మి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈడీ నాగేంద్రప్రసాద్ ఇన్చార్జి ఆర్ఎంగా సత్యనారాయణ -
మాయాజాలం
జరుగుమల్లి వెలుగులో జరుగుమల్లి (సింగరాయకొండ): జిల్లాలోని జరుగుమల్లి వెలుగు అధికారుల తీరు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతోంది. గతంలో వీఏఓగా పని చేసిన సుకన్యను ఉద్దేశం పూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆమైపె వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలిగా ముద్ర వేసి టీడీపీ నాయకులు, ఆశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఆమెను వీఓఏగా విధుల నుంచి తొలగించినా ఆన్లైన్లో పేరు తొలగించకుండా ఫోర్జరీ సంతకాలతో సంవత్సర కాలంగా జీతం డ్రా చేసుకుంటున్నారు. చివరికి రూ.12.76 లక్షలు చెల్లించాలంటూ సుకన్యపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదీ..జరిగింది జరుగుమల్లి మండలం వావిలేటిపాడు–2 గ్రామైఖ్య సంఘం వీఓఏగా గ్రామానికి చెందిన సుకన్య గతంలో విధులు నిర్వర్తించింది. ఆమెను 2024 డిసెంబర్లో తొలగించి కడియాల అనూరాధను నియమించారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి భార్యను వీఓఏగా నియమించకూడదు. అనూరాధ భర్త ఆర్టీసీ డ్రైవర్. అంతేగాక గ్రూపుల్లో సభ్యులు కాని వారిని కూడా వీఓఏగా నియమించకూడదు. అనూరాధ 2023లో గ్రామంలోని వల్లూరమ్మ గ్రూపు నుంచి సభ్యుల ఆమోదం మేరకు పక్కకు వెళ్లింది. ఆ ప్రకారం గ్రూపు సభ్యులు తీర్మానం చేసి సంతకాలు కూడా చేశారు. ఇటీవల అనూరాధ గ్రూపు సభ్యులకు తెలియకుండా ఎటువంటి తీర్మానం లేకుండా తన పేరు వల్లూరమ్మ గ్రూపులో ఆన్లైన్లో నమోదు చేసుకుంది. అధికారుల సహకారంతో ఏడాదిగా వీఓఏగా ఆన్లైన్లో పేరు లేనప్పటికీ అనూరాధ గ్రామైఖ్య సంఘానికి తెలియకుండా ఫోర్టరీ సంతకాలతో జీతం డ్రా చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.12.76 లక్షలు చెల్లించాల్సిందే ప్రస్తుతం వావిలేటిపాడు–2 వీఓఏకు సంబంధించి ఆన్లైన్లో చూపిస్తున్న రూ.12.76 లక్షలు చెల్లించాల్సిందేనని తనపై ఏపీఎం జయరాజ్, సీసీ సాంబయ్య ఒత్తిడి చేస్తున్నారని సుకన్య ఆరోపిస్తోంది. తాను చెల్లించాలని చెప్తున్న రూ.12.76 లక్షల మొత్తానికి పూర్తి ఆధారాలతో సహా ఏపీఎం జయరాజ్కు వివరించానని, తాను ఒక్క రూపాయి కూడా చెల్లించక్కరలేదని, అవసరమైతే గ్రామైఖ్య సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరానని, ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని సుకన్య అధికారుల పనితీరును దుయ్యబడుతోంది. ఇప్పటికీ నాలుగుసార్లు మీ కోసం కార్యక్రమంలో తనను నగదు చెల్లించాలని వేధిస్తున్నారంటూ అర్జీలు కూడా ఇచ్చానని, సుకన్య డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పుడు ఏపీఎం జయరాజ్ ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని సుకన్య కన్నీటిపర్యంతమవుతోంది. గ్రామ సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో గ్రూఫు సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరానని, సంవత్సరం కాలంగా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వెలుగు అధికారుల ఒత్తిడితో తన ఆరోగ్యం కూడా దెబ్బతిందని, తనకు ఏదైనా జరిగితే దానికి అధికారులే బాధ్యత వహించాలని సుకన్య కోరుతోంది. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతి పరురాలనే కారణంతో తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి తన పేరు ఆన్లైన్లో తొలగించాలని, తాను చెల్లించాలని చెబుతున్న రూ.12.76 లక్షలకు గ్రూపు సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఏకపక్షంగా వావిలేటిపాడు–2 వీఓఏ సుకన్య తొలగింపు ఆమెను తొలగించి ఏడాది దాటినా అన్లైన్లో మారని పేరు నిబంధనలకు విరుద్ధంగా కొత్త వీఓఏ నియామకం ఫోర్జరీ సంతకాలతో జీతం డ్రా సమగ్ర విచారణ కోసం మాజీ వీఓఏ సుకన్య డిమాండ్సుకన్య పేరును వెంటనే తొలగిస్తాం: వావిలేటిపాడు–2 వీఓఏగా ఆన్లైన్లో ఉన్న సుకన్య పేరును వెంటనే తొలగిస్తాం. ఆన్లైన్లో ఆమె రూ.12.76 లక్షలు చెల్లించాలని చూపుతోంది. కానీ సుకన్య చెబుతున్నట్లు ఆన్లైన్కు, ఆఫ్ లైన్కు తేడా వస్తుంది. కొన్ని పద్దులు తప్పుగా నమోదయ్యాయి. దీనిపై విచారించేందుకు వచ్చే వారంలో డీఆర్డీఏ ఏజీఎం ఉదయ్ వస్తున్నారు. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. – డి.జయరాజ్, ఏపీఎం, జరుగుమల్లి -
వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు
కొత్తపట్నం: వైఎస్సార్ సీపీ నాయకుడు, విశ్రాంత వీఆర్వో వీరేపల్లి రామచంద్రారెడ్డి సతీమణి పద్మ గత నెల 16వ తేదీ మరణించారు. శనివారం కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో నిర్వహించిన పెద్ద కర్మకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పలువురు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి హాజరై పద్మ చిత్రపటానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు వైవీ భద్రారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్ల మెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పల్లప్రోలు మల్లికార్జున్రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రరెడ్డి, ఈతముక్కల మాజీ సర్పంచ్ దాసూరి గోపాల్రెడ్డి, శ్రీమన్నారాయణ, కటారి శంకర్, దుంపా చెంచిరెడ్డి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నాయుడు, పాలడుగుల రాజీవ్ ఉన్నారు. పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు. పార్టీ అండగా ఉంటుందని పద్మ కుటుంబ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి ధైర్యం చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులు వి.వెంకట సుబ్బారెడ్డి, వి.ప్రమీల, వి.మదన్మోహన్రెడ్డి, వి.శశికళ, బద్దేల రమేష్రెడ్డి, వి.శ్రీధర్రెడ్డి, వి.శ్రీవిధ్య, వి.కార్తికేయరెడ్డి పాల్గొన్నారు. వెంకట్రామిరెడ్డికి వైవీ సుబ్బారెడ్డి నివాళులు మద్దిపాడు: వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి తండ్రి, ఎంపీపీ వాకా అరుణ మామ అయిన వాకా వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన సోదరుడు వైవీ భద్రారెడ్డి దంపతులు, పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితర ప్రముఖులు ఇనమనమెళ్లూరు చేరుకుని వెంకట్రామిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్దిపాడు ఎంపీడీఓ వి.జ్యోతి, నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, పార్టీ నాయకులు బి.వెంకటేశ్వర్లు, కేవీ రమణారెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, కొమ్మూరి కనకారావు మాదిగ,దుంపా యలమందారెడ్డి, పాకనాటి మహానందరెడ్డి, పల్లపాటి అన్వేష్, నాదెండ్ల మహేష్, కంకణాల సురేష్, పైడిపాటి వెంకట్రావు, బొమ్మల దాసు, బెజవాడ రాము, బొమ్మల రామాంజనేయులు, మేరుగు పద్మ, రాయపాటి విల్సన్, నారా సుబ్బారెడ్డి, పాలడుగు రాజీవ్, పులి వెంకటరెడ్డి, రాంబాబు, గ్రామ నాయకులు ఆకుల శ్రీను, నైనాల శశ్రీను, కోటి, గద్దె జాలయ్య, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించారు. -
చంద్రబాబు కక్ష.. నెల నెలా శిక్ష
ఈ మహిళలది మార్కాపురం మండలం మొద్దులపల్లి గ్రామం. వీరు మోస్తోంది రేషన్ బియ్యం. ప్రతి నెలా ఇదే సీన్. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసేవే అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా రద్దు చేసింది. ఇంటి వద్దే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో కార్డుదారులకు నెల నెలా శిక్ష తప్పడం లేదు. రేషన్ సరుకుల కోసం కాలినడకన 3 కి.మీ ప్రయాణం మార్కాపురం మండలం మొద్దులపల్లి వాసుల ఆవేదన మా ఊరిలో రేషన్ షాపు పెట్టాలి గత ప్రభుత్వంలో మాకు రేషన్ కష్టాలు తెలియవు. మా ఊరిలో రేషన్ షాపు లేకపోయినా గతంలో ఇంటి వద్దకు వచ్చి బియ్యం, చక్కెర ఇచ్చారు. బండ్లు తీసేయడంతో మా గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి యాచవరంలో రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నాం. మా గ్రామంలో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – మరియమ్మ, జయమ్మ, కేశమ్మ మార్కాపురం మండలం మొద్దులపల్లిలో 280 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ రేషన్ దుకాణం లేకపోవడంతో కార్డుదారులు 3 కి.మీ దూరంలోని యాచవరం గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొందరు వాహనాలపై వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. వాహన సౌకర్యం లేనివారు, మహిళలు నడుచుకుంటూ వెళ్లి రేషన్ బియ్యం, చక్కెర తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు లేవని, తమ గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – మార్కాపురం రూరల్ (మార్కాపురం) -
యడవల్లిలో ఇరువర్గాల ఘర్షణ
పెద్దదోర్నాల: దీర్ఘకాలంగా గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో అవి పెరిగి పెరిగి పెద్దవయ్యాయి. రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి పరస్పరం ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలు గురు, శుక్రవారాల్లో జరిగాయి. దాడుల్లో ఓ వర్గానికి చెందిన బత్తుల ఏడుకొండలు, కుంచెపు రాములు, కుంచెపు వెంకట్రాముడులతో పాటు మరో వర్గానికి చెందిన నడిపి పోలయ్య, శంకర్, యల్లమ్మ, సంఘవిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంధువులు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకట రమణయ్యతో పాటు పలు మండలాలకు చెందిన ఎస్సైలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అందిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని యడవల్లిలో నాలుగేళ్ల క్రితం ఇరువర్గాల నడుమ ఓ వ్యవహారంపై తీవ్రస్థాయిలో గొడవలు తలెత్తాయి. గొడవలకు కారణమైన వారిని గ్రామ పెద్దలు, కుల పెద్దలు తీవ్రంగా మందలించారు. జనవరి ఒకటో తేదీన ఓ వర్గానికి చెందిన బత్తుల ఏడుకొండలును మరో వర్గానికి చెందిన కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. దీంతో గ్రామంలో మళ్లీ గొడవలు చెలరేగాయి. తమ వర్గానికి చెందిన యువకుడిపై దాడి జరగటంతో ఆగ్రహించిన మరో వర్గానికి చెందిన వ్యక్తులు శుక్రవారం మరో వర్గంపై దాడులకు తెగబడటంతో నడిపి పోలయ్య, శంకర్, యల్లమ్మ, సంఘవిలకు గాయాలయ్యాయి. పోలీస్ పికెట్ ఏర్పాటు ఇరువర్గాల నడుమ వివాదాలు చెలరేగి ఘర్షణ చోటు చేసుకోవడంలో మార్కాపురం సీఐ సుబ్బారావుతో పాటు మార్కాపురం, పెద్దారవీడు ఎస్సైలు అంకమరావు, సాంబశివయ్యలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరోసారి దాడులు చోటు చేసుకోకుండా గ్రామంలో ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇరు పార్టీల నాయకులు, కుల పెద్దలను పిలిచి భవిష్యత్లో మళ్లీ గొడవలు జరుగకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇరువర్గాలకు చెందిన పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పరస్పరం దాడి పలువురికి గాయాలు -
ఆర్టీసీ విభజన
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ప్రకాశంలో ఉన్న ఆర్టీసీని కూడా విడదీసి మార్కాపురం జిల్లాలో కలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన మార్కాపురం జిల్లాలో మార్కాపురం డిపోతో పాటు గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోలను కలిపారు. ఆర్ఎంగా ఒంగోలు ఆర్ఎం సత్యనారాయణను ఇన్చార్జిగా నియమించారు. ఇప్పటి వరకూ ఈ నాలుగు డిపోలు ఒంగోలు రీజియన్ పరిధిలో ఉండేవి. ఒంగోలు ఆర్ఎం కార్యాలయం నుంచి పరిపాలన సాగేది. నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో ఆర్టీసీ అధికారులు నూతన జిల్లాకు స్థానిక డిపోలో ఆర్ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మార్కాపురం కేంద్రంగా నాలుగు డిపోలకు సంబంధించి పరిపాలన సాగనుంది. రెగ్యులర్ ఆర్ఎంను నియమించేంత వరకూ ఒంగోలు ఆర్ఎం మార్కాపురం ఇన్చార్జి ఆర్ఎంగా వ్యవహరించనున్నారు. మార్కాపురం బస్టాండ్ జిల్లా కేంద్రం బస్టాండుగా మారనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫారాలను పెంచడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఒంగోలు బస్సులు నిలిపే ప్రాంతంలో వర్షం పడితే బురదమయంగా మారుతుంది. నూతన ప్లాట్ఫారాలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కర్నూల్ ఘాట్లో ప్రమాదం
● చెట్టును ఢీకొన్న కారు ● యువకుడి మృతి పెద్దదోర్నాల: వేగాన్ని అదుపు చేసుకోలేని ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కర్నూల్–గుంటూరు జాతీయ రహదారి రోళ్లపెంట గిరిజన గూడెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భరత్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం.. నందికొట్కూర్ నుంచి ఒంగోలుకు నలుగురు యువకులతో బయల్దేరిన కారు రోళ్లపెంట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరుకు తరలించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట రమణయ్య తెలిపారు. మద్దిపాడు: ఓ యువకుడు మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని నాగన్నపాలెంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమ్కుమార్..అంజయ్య అనే వ్యక్తితో కలిసి మద్యం తాగుతున్నాడు. మాటల సందర్భంలో కాలనీలోని ఒక యువతితో ఎందుకు మాట్లాడుతున్నావని అంజయ్య ప్రశ్నించాడు. మాటమాట పెరిగి అంజయ్య వీపుపై ప్రేమ్కుమార్ కత్తితో పొడిచాడు. ఎందుకు పొడుస్తున్నావంటూ అడ్డు వచ్చిన రాతికింది బ్రహ్మయ్యను కూడా పొడవడంతో తొడపై గాయమైంది. కాలనీ వాసులు స్పందించి క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. రిమ్స్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని నాయపాము శృతి ఏషియన్ యోగా పోటీలకు ఎంపికై ంది. యోగాసన భారత్లో భాగంగా మహారాష్ట్రలో డిసెంబర్ 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు 6వ సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న శృతి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్కు ఎంపికై ందని జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం గిరిజ తెలిపారు. గ్రామస్తులు, దాతల సహకారంతో శిక్షణ పొందుతున్న శృతి కఠోర దీక్షతో అంచలంచలుగా ఎదిగిందని హెచ్ఎంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ, ఉపాధ్యాయులు అభినందించారు. ఉలవపాడు: తాను దక్షిణాఫ్రిక వెళ్లేందుకు డబ్బులు ఇవ్వకుంటే చనిపోతానని గుర్తుతెలియని మందు తాగి బెదిరించబోయి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చాగల్లులో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వల్లెపు వంశీకృష్ణ (27) దక్షిణాఫ్రికలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది ఆగస్టులో స్వగ్రామం వచ్చి నెల పాటు ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ వెళ్లాలని తండ్రి వల్లెపు శ్రీనివాస్, తాత వెంకట సుబ్బారావును అడిగాడు. అక్కడికి ఇక వద్దని, ఇక్కడే ఉండాలని వంశీకృష్ణకు సర్ది చెప్పారు. తండ్రి, తాతను బెదిరించి అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకుని డిసెంబర్ 21వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఉలవపాడు సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే నెల 23వ తేదీన ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న కుమారుడు కుంచాల దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో జారిపడి వైఎస్సార్ సీపీ నాయకుని మృతి
సంతమాగులూరు (అద్దంకి ): ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో కాలు జారి పడి మండలంలోని మావిళ్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ మండల చేనేత విభాగం అధ్యక్షుడు చిమటా రాంబాబు (36) గురువారం గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్డర్ చింతలపూడి అశోక్కుమార్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వూట్ల నాగేశ్వరరరావు, సర్పంచ్ డి.సుబ్బారావు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. అర్ధవీడు: మండలంలోని మాగుటూరు గ్రామంలో ఓ రైతు సాగు చేస్తున్న పొగాకు తోటలో 7 గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, రైతును విచారిస్తున్నారు. గంజాయి సాగు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎకై ్సజ్ అధికారులు హెచ్చరించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అశోక్కుమార్ -
సీజనల్ వ్యాధులపై జీవాల పెంపకందారులకు అవగాహన
కనిగిరిరూరల్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పశు వైద్యాధికారులు, సిబ్బంది పర్యటించారు. ‘మూగ జీవాల మృత్యు ఘోష’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కనిగిరి ఏడీఏహెచ్ గజ్జల శ్రీనివాసులరెడ్డి ఆదేశాలతో అన్ని మండలాల్లో పశువైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జీవాలు, పశుకాపరులతో మాట్లాడారు. జబ్బున పడ్డ గొర్రెలు, మేకలను పరిశీలించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. జీవాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వివరించారు. నట్టల నివారణ మందు, టీకాలను సకాలంలో వేయించుకోవాలని సూచించారు. పశు వైద్య కేంద్రాల్లో ఉన్న మందులను అవసరమైన రైతు సేవా కేంద్రాలకు పంపిణీ చేయించి, చికిత్స చేయిస్తామని ఏడీఏహెచ్ వెల్లడించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో కంచర్లవారిపల్లి వైద్యుడు కె.రాజశేఖర్రెడ్డి, పశు వైద్యాధికారులు, పశువర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డీఆర్ఓ ఓబులేష్, ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, రవాణాశాఖాధికారి సుశీల, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మార్కాపురం ఆర్టీఓ శ్రీ చందన, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎంవీఐ మాధవరావు, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
వేడుక.. కిక్కెక్కింది..!
కొత్త ఏడాది పేరుతో జిల్లా మొత్తం మద్యం మత్తులో మునిగింది. ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహించిన మత్తు సంబరంగా మారింది. చంద్రబాబు పాలనలో నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి, బెల్టుషాపులకు అడ్డుకట్ట లేకుండా, ఈవెంట్ల పేరుతో రూ.కోట్లల్లో లిక్కర్ తాగించింది. రెండు రోజుల్లో రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ప్రజల ఆనందం పేరుతో సర్కారు దోపిడీకి తెగబడిందని అర్థమవుతోంది. ‘స్వర్ణాంధ్ర’ను ‘మద్య ఆంధ్ర’గా మార్చింది. ఇక కేకులు, బిర్యానీలు సైతం హాట్ హాట్గా అమ్మకాలు జరిగాయి. 10 వేల కేకులు కట్... నూతన సంవత్సర వేడుకలకు కులమతాలకు అతీతంగా కేకులు కట్ చేశారు. దీంతో నగరంలో నూతన సంవత్సరం ఒక్క రోజే సుమారు 10 వేలకుపైగా కేకులు అమ్ముడుపోయాయి. ఒంగోలు నగరంలో మొత్తం 25కుపైగా చిన్న, పెద్ద బేకరీలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రముఖ బేకరీలోనే 1200 కిలోల కేకులు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇక పూలదండలు, బొకేల వ్యాపారం కూడా రూ.లక్షల్లో జరిగినట్లు సమాచారం. ఒంగోలు టౌన్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు మత్తుమత్తుగా జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్ల సమయాలను అర్ధరాత్రి వరకూ పొడిగించడం, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు ఉండటంతో 24/7 అమ్మకాలు సాగాయి. డిసెంబర్ చివరి రెండు రోజులు జరిగిన మద్యం అమ్మకాలు చూసి ఎకై ్సజ్ అధికారులు సైతం విస్తుపోయారు. ఒంగోలు నగర శివారులో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో ఒక్కరోజు రాత్రే సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే మద్యం ఏరులై పారినట్లు నగరంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రూ.30 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు... జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో బీరు కంటే లిక్కర్ వ్యాపారమే ఎక్కువగా జరిగింది. ఒంగోలు మద్యం డిపో పరిధిలో కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, పర్చూరు, అద్దంకి, చీమకుర్తి ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. డిసెంబర్ 30వ తేదీ ఒంగోలు ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 2435 కేసుల లిక్కర్, 933 కేసుల బీరు విక్రయాలు జరిగాయి. కందుకూరు సర్కిల్ పరిధిలో 1149 కేసుల లిక్కర్, 366 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అద్దంకి సర్కిల్ పరిధిలో 1017 కేసుల లిక్కర్, 305 కేసుల బీర్లు తాగారు. చీరాల పరిధిలో 921 లిక్కర్, 335 బీరు కేసులు, సింగరాయకొండ పరిధిలో 826 లిక్కర్, 270 బీర్ల కేసులు అమ్ముడు పోయాయి. పర్చూరు పరిధిలో 686 లిక్కర్, 221 బీర్లు, చీమకుర్తి పరిధిలో 503 లిక్కర్, 228 బీర్ల కేసుల విక్రయాలు జరిగాయి. మొత్తం 7537 లిక్కర్, 2658 బీర్ల కేసులు విక్రయించగా, రూ.6,05,12,814 వ్యాపారం జరిగింది. డిసెంబర్ 31 రూ.6,29,24,874 విలువైన వ్యాపారం... డిసెంబర్ 31వ తేదీ ఒంగోలు సర్కిల్ పరిధిలో 2057 లిక్కర్, 863 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. పర్చూరు సర్కిల్ పరిధిలో 1167 లిక్కర్, 310 బీర్ కేసులు, చీరాల సర్కిల్ పరిధిలో 1163 లిక్కర్, 505 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. అద్దంకి పరిధిలో 1125 లిక్కర్, 311 బీర్ కేసులు, సింగరాయకొండ పరిధిలో 922 లిక్కర్ కేసులు, 231 బీర్ కేసులు తాగేశారు. చీమకుర్తి పరిధిలో 846 లిక్కర్ కేసులు, 281 బీర్ కేసులు, కందుకూరు పరిధిలో 508 లిక్కర్, 128 బీర్ కేసులు లాగించేశారు. మొత్తం 7788 లిక్కర్ కేసులు తాగారు. 2629 కేసుల బీర్లు కూడా పీకలదాకా ఎక్కించేశారు. రూ.6,29,24,874 విలువైన వ్యాపారం జరిగింది. మార్కాపురం మద్యం డిపో పరిధిలోనూ భారీగా అమ్మకాలు... మార్కాపురం డిపో పరిధిలో యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పొదిలి ఎకై ్సజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ డిపో పరిధిలో డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు రూ.61 కోట్ల వ్యాపారం జరగ్గా, చివరి రెండు రోజులే సుమారు 10 కోట్ల రూపాయలకుపైగా అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఇది కాకుండా నూతన సంవత్సరం వేడుకల కోసం ముందస్తుగా కొనుగోలు చేసిన మద్యం సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా సుమారు రూ.30 కోట్ల విలువజేసే మద్యాన్ని పీలకదాకా తాగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఒక్కరాత్రే 40 లక్షల రూపాయల మద్యం... ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు నగరంలో నింగినంటాయి. ఈ వేడుకల్లో మద్యం ఏరులైపారింది. నగర శివారులో ఇటీవల ఒక వెంచర్ వేశారు. అందులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకల కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మద్యం కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని కోసం నిర్వాహకులు నగరంలోని మద్యం దుకాణాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మద్యం కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు రూ.1499 నుంచి రూ.19,999 వరకూ టికెట్ ధర వసూలు చేశారు. ఈవెంట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేయడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుండడంతో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ నగరంలో నూతన సంవత్సర ఈవెంట్లు చాలా జరిగాయి. అయితే ఈ దఫా కొత్తగా మద్యం చేర్చడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఈ తరహా సంస్కృతి సరికాదని అంటున్నారు. రెండు రోజుల్లో లక్షకుపైగా బిర్యానీలు.. ఇటీవల ఒంగోలులో బిర్యానీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రోజూ బిర్యానీ తినేవారి సంఖ్య ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటళ్లలో రోజుకు 1000కిపైగా బిర్యానీలు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. నూతన సంవత్సర సంబరాలలో ఈ సంఖ్య రెట్టింపైందని తెలిసింది. డిసెంబర్ 31వ తేదీ 2500 నుంచి 3000 బిర్యానీలు అమ్ముడుపోయినట్లు ఓ హోటల్ యాజమాని చెప్పారు. ఒంగోలు నగరంలో ఇలాంటి పెద్ద హోట ళ్లు, రెస్టారెంట్లు 30 వరకు ఉన్నాయి. దీంతోపాటు వీధికో బిర్యానీ పాయింట్ ఉంది. ఇవి సుమారు 50కిపైగా ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్కరోజే 50 వేలకుపైగా బిర్యానీలు లాగించేసినట్లు సమాచారం. 30, 31 తేదీల్లో లక్షకుపైగా బిర్యానీలు బిగించినట్లు తెలుస్తోంది. -
తల్లడిల్లిన తల్లి మనుసు
పొదిలి: కన్న కొడుకును కళ్ల ముందే ఎవరైనా చావగొడుతుంటే ఏ తల్లీ తట్టుకోలేదు. అందులోనూ వ్యాపారం, కుటుంబం, ఇళ్లు తప్ప మరో యావ లేని బిడ్డను గొడ్డును బాదినట్లు ఎస్సై చావబాదుతుంటే అతని తల్లి తల్లడిల్లిపోయింది. పొదిలిలో ఎస్సై వేమన కొట్టిన దెబ్బలకు అవినాష్ శరీరానికి గాయాలవగా, ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన అవినాష్ తల్లి జయప్రద మనసుకు తగిలిన గాయం ఇప్పట్లో మానేలా లేదు. ఆ సంఘటనను ఆమె మర్చిపోలేకపోతోంది. గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఉలిక్కిపడుతోంది. తన తల్లి రోదిస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని, చేయని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించానా అని మానసిక క్షోభకు గురవుతున్నానని అవినాష్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అవినాష్పై ఎస్సై వేమన విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనపై అవినాష్ తల్లి జయప్రద గురువారం తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ఎరువుల లారీ వచ్చి మా కొట్టు ముందు ఆగింది. ఇరవై బస్తాలు మాత్రమే లారీలో నుంచి కొట్టులోకి దించాల్సి ఉంది. ఆ సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ పోలీస్ జీపు వచ్చి ఆగింది. లారీని తీయమని పోలీసులు చెబుతున్నారేమో అనుకున్నా. ఎవర్రా లారీ ఇక్కడ పెట్టిందని గద్దిస్తూ ఎస్సై వేమన లారీ డ్రైవర్ను కొట్టాడు. తీస్తున్నా సార్ అనే లోపే.. ఎవడిదిరా ఈ కొట్టు అంటూ ఎస్సై ఆగ్రహించాడు. సార్ సార్ అంటూ నా కొడుకు దుకాణం బయటకు వచ్చాడు. అసలు అంతకు ముందే ఏదో జరిగి కక్షపెట్టుకున్నట్లుగా నా కొడుకును లాఠీ తీసుకుని ఎస్సై కొట్టాడు. సార్ ఏమైంది సార్.. కొట్టొద్దు సార్.. అంటూ నా కుమారుడు వేడుకుంటున్నా ఎస్సై పట్టించుకోకుండా ఒల్లంతా వాతలు పడేలా కొట్టాడు. నా కొడుకు చేతికి రక్తపు గాయమైంది. ఎస్సై దెబ్బలు తట్టుకోలేక అమ్మా..అమ్మా అంటూ అల్లాడిపోయాడు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లి నా కొడుకును పోలీసు జీపులో ఎస్సై ఎక్కించాడు. సార్..సార్ ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పండి సార్ అంటూ నేను ఏడుస్తూ ఎస్సైని అడిగాను. అయినా పట్టించుకోకుండా కొట్టుకుంటూ బూతులు తిడుతూ జీపులో ఎక్కించుకుని పోలీస్స్టేషన్కి తీసుకెళ్లాడు. అంతలో నా భర్త కోటేశ్వరరావు దుకాణం వద్దకు రాగా, జరిగిన విషయం చెప్పాను. వెంటనే పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన నా భర్తపై కూడా ఎస్సై దారుణంగా దాడి చేశాడు. ఆ దెబ్బలతో అవమానంగా ఇంటికి వచ్చిన నా భర్తను, కొడుకును చూసి నేను, నా కోడలు భోరున విలపించాము. అవినాష్ గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి పోలీసులు మళ్లీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నా కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందాము. పోలీసులకు ఫోన్ చేశాను. సార్ మా బిడ్డను ఏమీ చేయొద్దు సార్.. ఇప్పటికే దెబ్బలు తగిలి అల్లాడిపోతున్నాడంటూ వేడుకున్నాను. పది నిముషాల్లో పంపిస్తామని పోలీసులు సమాధానం చెబుతున్నారేగానీ పంపించలేదు. సార్ అవినాష్ను పంపించండి సార్.. దెబ్బలు తగిలాయి.. మా నాయన ఏడని నా మనమడు కూడా ఏడుస్తున్నాడు.. పంపించండి సార్ అంటూ పలుమార్లు వేడుకున్నాము. అర్ధరాత్రి దాటిన తర్వాత బిడ్డను పంపించారు. ఇంట్లో అందరం ఏడ్చుకుంటూ కూర్చున్నాము. మనం ఏం తప్పు చేశామని ఈ శిక్ష అంటూ మానసిక క్షోభ అనుభవించాము. -
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వేడుకలు
ఒంగోలు వన్టౌన్: నూతన సంవత్సర వేడుకలను స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు కేక్ కట్ చేశారు. కలెక్టర్ను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్యేలు విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు, ఒంగోలు, అద్దంకి డివిజన్ల ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన కొందరు హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, బ్యాగులు, ఫ్యాన్లు అందించారు. ఒంగోలు సిటీ: సిలబస్ మార్పులు, సంస్కరణలతో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కాంట్రాక్ట్ లెక్చరర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కె. ఆంజనేయులు సూచించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రతినిధులు గురువారం ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రానున్న పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టీకల్, థియరీ పరీక్షల నిర్వహణలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం న్యాయం చేస్తామని డీఐఈఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరుకుంట సురేష్, నాయకులు బీవీ కాశీరత్నం, వెంకట్రావు తదితరులు ఉన్నారు. -
మృత్యుఘోష..!
మూగ జీవాలకనిగిరిరూరల్: జిల్లాలో అత్యధికంగా పశు సంపద ఉండే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. వ్యవసాయం కంటే పశు ఆధారిత కుటుంబాలే అధికం. ఏ పల్లె చూసినా ప్రతి ఇంట్లో కనీసం ఒక గేదే.. రెండు గొర్రెలు, లేదా మేక పిల్లలు ఉంటాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాన మూగ జీవాలు మృత్యు ఘోష పెడుతున్నాయి. సీజనల్ వ్యాధులు, వింత రోగాలతో జబ్బులు సోకి మృతువాత పడుతుండటంతో పశు పోషకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో లబోదిబోమంటున్నారు. మందులెక్కడ..? బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఒకట్రెండు రకాల మందులు, నట్టల నివారణ మందులు తప్ప మిగిలిన మందులు ఇవ్వడం లేదు. దీంతో గొర్రెల కాపరులు వేల రూపాయలు వెచ్చింది ఖరీదైన మందులు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొన్ని జీవాలు తట్టుకుంటున్నా సకాలంలో వైద్యం అందక కొన్ని జీవాలు మృత్యువాతపడుతున్నాయి. వైద్యులు కరువే.. జిల్లాలోని 36 మండలాల్లో 84 పశు వైద్య శాలలు, 55 గ్రామీణ పశు వైద్య శాలలున్నాయి. కనిగిరి నియోజవర్గంలోని ఆరు మండలాల్లోని 135 పంచాయతీల్లో 3 ఏడీహెచ్ కార్యాలయాలు ఉన్నాయి.పశువైద్య 3 ఏడీహెచ్ పాయింట్లు ఉన్నాయి. కనిగిరి ఏడీహెచ్ పరిధిలోని రెండు మండలాల్లో నాలుగు పశు వైద్య శాలలు, సీఎస్పురం ఏడీహెచ్ పరిధిలో నాల్గు పశువైద్యశాలలు, హెచ్ఎంపాడు ఏడీహెచ్ పరిధిలో రెండు నాలుగు పశు వైద్యశాలు, ఒక ఆర్ఎల్వీ పాయింట్లు ఉన్నాయి. తాజాగా మార్కాపురం జిల్లా, పాత పశ్చిమ ప్రకాశంలోని నాల్గు నియోజకవర్గాల్లో కనిగిరి, సీఎస్పురం, హెచ్ఎంపాడు, వై పాలెం, త్రిపురాంతకం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, పొదిలి, గిద్దలూరులలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులున్నాయి. కానీ కనిగిరి ఆరు మండలాల్లో ఏడీహెచ్ పోస్టులు భర్తీగా ఉన్నా.. మిగతా చోట్ల వైద్యులు లేరు. వెలిగండ్ల మండలంలోని రెండు వైద్యశాలల్లో డాక్టర్లు లేరు. హెచ్ఎంపాడులో రెండు వైద్యశాలల్లో డాక్టర్లు లేరు. కనిగిరి మండలంలోని రెండు వైద్యశాలలకు ఒక్కరే ఉన్నారు. పీసీపల్లిలో రెండు వైద్యశాలలకు ఒక్కరే, సీఎస్పురంలో రెండు వైద్యశాలలకు ఒక్కరే, అంబవరం వైద్యశాలలో కనీసం అటెండర్ కూడా లేదు. ఇన్చార్జిల పాలనతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. వ్యాధులతో పశుపోషకుల బెంబేలు.. చలికాలంలో జీవాలకు సీజనల్ వ్యాధులు విపరీతంగా సోకుతున్నాయి. గొర్రెలు, మేకలకు పీపీఆర్( పారుడు) వ్యాధి, ఆర్స్ వ్యాధి, మసూచి, చిటుకు, నోటి జబ్బు, కాళ్లకు పండ్లు, కళ్ల మసక ఇలా అనేక రోగాలతో గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా గొర్రెలు ఎక్కువగా చనిపోతున్నాయి. ఈ వ్యాధికార సూక్ష్మ జీవులు శరీరంపై వాలడం వల్ల జీవాలకు వచ్చి వ్యాధులు మరొకరికి సోకుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు రెండు మూడు దొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తల్లి నుంచి బిడ్డను కూడా వేరు చేసి పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. గడిచిన నెల రోజుల్లో ఆరు మండలాల్లో 300లకు పైగా గొర్రెలు చనిపోయినట్లు గొర్రెల కాపరులు వాపోతున్నారు. ఒక్క చాకిరాలలోనే మూడు దొడ్లలతో 20కి పైగా గొర్రెలు చనిపోగా.. మరో 30కి పైగా వ్యాధుల బారిన పడినట్లు కాపరులు తెలిపారు. కనిగిరి, హెచ్ఎంపాడు, సీఎస్పురం, పీసీపల్లి, వెలిగండ్ల, పామూరు మండలాల్లో అనేక చోట్ల గొర్రెలు, మేకలు సీజనల్ వ్యాధులతో నేలపట్టి ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో మందులు నిల్: చంద్రబాబు సర్కార్లో పశు వైద్య శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గుర్యయింది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గొర్రెల, పశు కాపరులకు సంబంధించి ఒక్క మందు ఇవ్వలేదు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉంటారు. అయితే తొలకరి సమయంలో అక్కడ డీ వార్మింగ్( నట్టల నివారణ మందులు) టీకాలు తప్ప మిగిలిన మందులు లేవు. మండల కేంద్రాల్లో ఉన్న ఏడీహెచ్ పాయింట్లలో, పశు వైద్య శాలల్లో కూడా అరకొర మందులు సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు సక్రమంగా లేవు. గత వైఎస్సార్ సీపీ హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పశు పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మందుల కొరత లేకుండా చేశారు. తమ జీవాలకు రోగాలు వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు పరిగెత్తకుండా రైతు సేవా కేంద్రాల్లో మందులను, సీజనల్ వ్యాధుల టీకాలను అందుబాటులో ఉంచారు. రైతు సేవా కేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంట్ల చేత తక్షణం వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. 1962 ద్వారా సంచార అంబులెన్స్ పశువైద్య సేవలను ఫోన్ ద్వార ప్రజలకు అందించారు. రోగాలతో మృతి చెందుతున్న గొర్రెలు, మేకలు జీవాలను కాపాడుకునేందుకు కాపరులు తంటాలు రైతు సేవా కేంద్రాల్లో మందులు నిల్.. వేధిస్తున్న వైద్యుల కొరత మూగజీవాలు మృత్యు ఘోష పెడుతున్నాయి. అంతు పట్టని రోగాలతో నేలకొరుగుతుండటంతో పశుపోషకులు అల్లాడిపోతున్నారు. కళ్ల ముందే జీవాలు మృత్యువాత పట్టడాన్ని పశుపోషకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పశువైద్యశాలల్లో వైద్యుల కొరత.. మందుల కొరతతో పశుపోషకుల కష్టాలు చెప్పేవీ కావు. -
పతనానికి చేరువైన చంద్రబాబు ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రైతులను మోసం చేస్తూ ఈవెంట్ మేనేజర్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, రెండేళ్ల పాలన కూడా పూర్తవకుండానే పతనానికి చేరువైందని, ప్రజల్లో ఉన్న నైరాశ్యమే అందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు గ్రాఫిక్స్ చూపిస్తూ అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, 50 వేల ఎకరాలు కావాలని అక్కడి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలన దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షులా సాగుతోందన్నారు. సమాజంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగిందని, పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయని తెలిపారు. పోలీసుల దౌర్జన్యాలు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలు వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత రాటుతేలేలా చేశాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున ఎలాంటి పోరాటాలు చేయడానికై నా వైఎస్సార్ సీపీ కేడర్ సిద్ధమవుతోందన్నారు. కొండపిలో హద్దులు దాటిన అవినీతి... కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి హద్దులు దాటిందని, ప్రజావ్యతిరేకత భారీగా మూటగట్టుకుంటోందని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం జరిగిన నూతన సంవత్సర వేడుకలు టీడీపీలో పూర్తి నైరాశ్యాన్ని నింపాయన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలతో దూసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 8 వేల పైచిలుకు కార్యకర్తలతో రాష్ట్రంలో 15 లక్షల మందితో జగనన్నకు బలమైన సైన్యం తయారవుతోందన్నారు. జగనన్నను సీఎం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి తాయిలాలు, శుభవార్తలు, వరాలు ప్రకటించలేదని సురేష్ విమర్శించారు. ప్రజలందరూ ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నారని, అరకొరగా ఇచ్చిన పథకాలు రాష్ట్ర ప్రజలను నైరాశ్యంలోకి నెట్టేశాయని అన్నారు. -
కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి
ఒంగోలు టౌన్: గత ఏడాది సాధించిన దానికన్నా కొత్త సంవత్సంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలందించాలని చెప్పారు. వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. సమాజానికి గొప్ప సేవలందించే అవకాశం పోలీసు ఉద్యోగులకు ఎక్కువగా ఉంటుందని, ప్రజలకు మేలు చేకూర్చి వారి అభిమానాన్ని పొందాలని చెప్పారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకొనిరావాలన్నారు. డీటీసీని సందర్శించిన ఎస్పీ ... పోలీసు కానిస్టేబుల్ శిక్షణ జీవితాన్ని మేలుమలుపు తిప్పాలని, అందుకనుగుణంగా క్రమశిక్షణతో కానిస్టేబుల్ శిక్షణ పొందాలని ఎస్పీ సూచించారు. శిక్షణ సమయంలో గాయాలు కలగకుండా అప్రమత్తంగా వుండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలతో పాటుగా ఉన్నత శిఖరాలను చేరాలన్న మీ ఆశలను నెరవేర్చుకోవాలన్నారు. డీటీసీలో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఆర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎస్పీ హర్షవర్థన్ రాజు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అద్దంకి: బైక్ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్యభర్తలకు తీవ్ర గాయాలు కాగా భార్య మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అద్దంకి–దర్శి రహదారిలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వంతెనపై గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన చల్లా ఏడుకొండలు, అతని భార్య రవణ (45 ) గేదెలకు తౌడు తీసుకుని రావడం కోసం భర్త టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఎక్కి అద్దంకి వెళుతున్నారు. ఈ క్రమంలో వారి వాహనం గుండ్లకమ్మ వంతెనపైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో భార్యభర్తలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ముండ్లమూరు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చేరుకునే లోపే రవణ మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ గేదెలను మేపుకుంటూ జీవనం సాగించే ఏడుకొండలకు ఇద్దరు కుమారులు కాగా.. హైదరాబాద్లో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సంఘటన వివరాలు తెలసుకున్న పోలీసులు కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ జోష్..
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను గురువారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి, చీమకుర్తిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేశారు. యర్రగొండపాలెంలో స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేశారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కాపురంలో పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 680 కిలోల భారీ కేక్ కట్చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కనిగిరిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణయాదవ్, గిద్దలూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి వారిని సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు, నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు – సాక్షి, ఒంగోలు -
మహిళ హత్య కేసులో జీవిత ఖైదు
ఒంగోలు: మహిళను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసిన కేసులో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ 8వ అదనపు జిల్లా, ఫ్యామిలీ కోర్టు జడ్జి జి.దీన బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2019 సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూచిపూడి–చెంచిరెడ్డిపల్లి సమీపంలోని ఆంధ్రాకొండ వద్ద ఓ మహిళను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని దహనం చేసినట్లు గుర్తించిన పోలీసులు మృతురాలు కనిగిరికి చెందిన షేక్ అలియాస్ పొలిచర్ల రజియాబేగం (35)గా గుర్తించారు. ఆమెకు షేక్ ఖాదర్బాషాతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానం పెంచుకుని ఆమెను కడతేర్చాలని ఖాదర్బాషా పథకం రచించాడు. అందులో భాగంగా ఆమెను మోటారు బైకుపై సంఘటన స్థలానికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను హత్య చేసి షేక్ జిలానిబాషా అనే వ్యక్తితో కలిసి పెట్రోలు, కిరోసిన్ పోసి తగులబెట్టాడు. దీనిపై మృతురాలి తల్లి షేక్ మీరాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు టీవీవీ ప్రతాప్కుమార్, కె.వెంకటేశ్వరరావు, ఎస్సై జి.శివన్నారాయణలు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేయడంతో పాటు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ప్రధాన నిందితుడు షేక్ ఖాదర్బాషాపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ అతనికి జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. రెండో నిందితుడు జిలానిబాషాపై నేరం రుజువు కాలేదని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శీనారెడ్డి వాదించగా కోర్టు లైజన్లు ఏఎస్సై సత్యశ్రీనివాస్, షేక్ ఇమామ్ హుస్సేన్లు కేసు విచారణను వేగవంతం చేసి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి నేర నిరూపణకు సహకరించారు. టీడీపీ కార్యకర్తపై సీఐ దాడి లింగసముద్రం: టీడీపీ కార్యకర్త వెన్నపూస నాగిరెడ్డిని గుడ్లూరు సీఐ మంగారావు కొట్టడంతో గ్రామస్తులు ఎదురుతిరిగిన సంఘటన మండలంలోని మొగిలిచర్ల పంచాయతీ నరసింహాపురంలో బుధవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసేందుకు అడ్డుగా ఉన్న పేడదిబ్బలు తొలగించే విషయంలో గ్రామస్తులు కొందరు అడ్డుతగిలారు. ఇక్కడ సిమెంటు రోడ్డు అవసరం లేదని, కావాలని వేస్తున్నారని కాంట్రాక్టర్ను అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు వచ్చి అది ప్రభుత్వ భూమిగా తేల్చారు. నివాసాలు ఉన్నచోట సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అవసరం లేని చోట ఎందుకు వేస్తున్నారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో సీఐ మంగారావు, ఎస్సై నారాయణలు తమ సిబ్బందితో కలిసి నారసింహాపురం వెళ్లి గొడవకు కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో వెన్నపూస నాగిరెడ్డిపై చేయి చేసుకున్నారు. మనస్తాపం చెందిన నాగిరెడ్డి పురుగుమందు తాగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని మహిళలు పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పురుగుమందు తాగబోయిన కార్యకర్త పోలీసులకు ఎదురుతిరిగిన గ్రామస్తులు -
మార్కాపురం జిల్లా అభివృద్ధికి కృషి
మార్కాపురం: నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేస్తామని ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటులో భాగంగా బుధవారం తర్లుపాడు రోడ్డులోని వెలుగొండ పునరావాస కాలనీలో నిర్మించిన హైస్కూల్లో నూతన జిల్లా కలెక్టరేట్ను మంత్రి బాలవీరాంజనేయస్వామితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. నూతన కలెక్టరేట్ భవనానికి ప్రభుత్వం నిధులిస్తామని తెలిపిందని, అదికూడా ఏర్పాటు చేస్తామన్నారు. మార్కాపురంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల్లో మార్కాపురం జిల్లాను వెంటనే చేర్చాలని ఆదేశించారు. జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. మంత్రి బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ 2026లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్రాజు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలతో పాటు డీఆర్ఓ ఓబులేసు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. -
హవ్వా..ఇదేమి చోద్యం!
● జగనన్న ఫ్లెక్సీ తొలగింపు గిద్దలూరు రూరల్: వైఎస్సార్ సీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి తన పుట్టిన రోజుతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు హైవేలో ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీని మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. కామూరి రమణారెడ్డి జనవరి 1న తన పుట్టిన రోజు సందర్భంగా 30 అడుగుల జగనన్నతో ఉన్న భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అనుమతులు లేవంటూ జగనన్న ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారి శాంతి మున్సిపల్ సిబ్బంది సాయంతో కటౌట్ను ట్రాక్టర్లో తీసుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానికులు జగనన్న ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కామూరి రమణారెడ్డి తాను ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీకి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు తొలగించడం చాలాదారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారులు పాలన కొనసాగిస్తున్నారన్నారు. పట్టణంలో కేవలం కూటమి నాయకులకు చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు, ఎల్ఐసీ ఆఫీస్తో పాటు ఆర్టీసీ బస్టాండ్ పలు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జగన్ అభిమాని కొప్పుల నరసింహులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారు. -
రెండో అదనపు ఏపీపీగా నల్లూరి అవనీష్
ఒంగోలు: జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నల్లూరి అవనీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్పులు ఇచ్చారు. అవనీష్ ఈ హోదాలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. త్రోవగుంటకు చెందిన అవనీష్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. 2014 నుంచి ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. 7 నుంచి రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నీ సీఎస్పురం(పామూరు): సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.లక్ష, రూ.70 వేలు, రూ.50 అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 6వ తేదీ లోగా రూ.2 వేల ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9666531005, 9441325629 నంబర్లను సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొన్న లారీ ● వృద్ధుడి దుర్మరణం పామూరు: మోటార్ బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం పామూరు సరిహద్దులోని 167బీ జాతీయ రహదారి పామూరు నుంచి సీఎస్పురం బైపాస్పై బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎస్పురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మేకల నారయ్య నెల్లూరు జిల్లా నర్రవాడ నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్పై తన స్వగ్రామం వెళ్తున్నాడు. పామూరు నుంచి సీఎస్పురం జాతీయ రహదారి 167బీ బైపాస్పై ఎదురుగా వస్తున్న లారీ.. బైక్ను సైడ్గా ఢీకొట్టింది. ఘటనలో మేకల నారయ్య రోడ్డుపై పడిపోగా ప్రైవేటు అంబులెన్స్లో పామూరులోని ఓ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తరలిస్తుండగా క్షతగాత్రుడు మేకల నారయ్య (68) మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులు నక్కల సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జిలానీబాషా తెలిపారు. నారయ్య మృతితో కంభంపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. -
చంద్రబాబుకు పీడీ యాక్ట్ వర్తించదా ?
ఒంగోలు టౌన్: ప్రజలవాణి వినిపించిన సీపీఎం నాయకుడు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమని సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ మండిపడ్డారు. 2019 –2024ల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు వారిని నేరస్తులుగా ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై ప్రభుత్వం విధించిన పీడీ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎల్బీజీ కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పొత్తూరి సురేష్కుమార్ మాట్లాడుతూ వేతనాల పెంపు, కాలుష్య నియంత్రణ, బలవంతపు భూ సేకరణపై ప్రజల తరుపున గొంతు వినిపించే ప్రజాతంత్రవాదులపై ప్రభుత్వాలు అసాధారణ పరిస్థితిలో ఉపయోగించే పీడీ చట్టం, ఉపా చట్టం ప్రయోగించి నిర్బంధించడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. అప్పలరాజు ప్రజల తరుపున ప్రశ్నిస్తే నేరస్తునిగా పరిగణించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎందుకు నిర్భంధించలేదని ప్రశ్నించారు. పోలీసులు దేశంలో పీడీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా పోలీసులపై కేసులు పెట్టొచ్చని తెలిసిన రోజు చట్టాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. బ్రిటీష్ పాలనకు మించిన నిర్బంధం విధిస్తున్న పాలకులకు బ్రిటీష్ పాలకులకు పట్టిన గతే పడుతుందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో పేదల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే మాబు మాట్లాడుతూ పాలకవర్గం చెప్పుచేతుల్లో నడుస్తున్న పాలకవర్గం ప్రజా ఉద్యమకారులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో మీసా చట్టం ప్రయోగించిన ప్రభుత్వాలు కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేశారు. పీడీ యాక్ట్ ఉపయోగించి ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకుంటే పొరపాటు పడినట్టేనన్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో ఎం.అయ్యపురెడ్డి, చుండూరి రంగారావు, పమిడి వెంకటరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఏవీ పుల్లారావు, నురుసుల వెంకటేశ్వర్లు, మాదాల వెంకటరావు, బెజవాడ శ్రీనివాసరావు, కనపర్తి సుబ్బారావు, నల్లూరి నరసింహరావు పాల్గొన్నారు. -
శాంతి భద్రతలను పరిరక్షిస్తాం
● మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు మార్కాపురం: నూతన మార్కాపురం జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ప్రతి బాధితునికి తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుట్కా, గంజాయి, నాటుసారా లాంటి అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ పరిసర ప్రాంతాలు, పాత బిల్డింగ్, పోలీసు క్వార్టర్స్ను పరిశీలించి పోలీసు పరిపాలనా కార్యక్రమాలకు ఉపయోగపడేలా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పట్టుపరిశ్రమ శాఖ, ఎస్వీకేపీ కళాశాల పరిసరాలను పరిశీలించారు. మంత్రి స్వామితో పాటు కలెక్టర్ రాజాబాబు, డీఎస్పీ నాగరాజు, ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, మార్కాపురం, త్రిపురాంతకం, కనిగిరి, యర్రగొండపాలెం, పామూరు సీఐలు సుబ్బారావు, హసన్, శ్రీనివాసులు, అజయ్కుమార్, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మార్కాపురం కౌన్సిల్ సమావేశం వాయిదా
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ కృష్ణ హాజరైన కౌన్సిలర్లు మార్కాపురం టౌన్: మార్కాపురం మున్సిపల్ సమావేశం కోరంలేక బుధవారం వాయిదా పడింది. పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు మున్సిపల్ సమావేశం నిర్వహించి అధికారులు, నాయకులు గుర్తించిన పలు అభివృద్ధి పనులపై చర్చించి వాటి అమోదం కోసం కౌన్సిల్ మీటింగ్ ఎర్పాటు చేస్తారు. అయితే బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు, అధికారులు రాకపోవడంతో పాటు కోరం కూడా లేక వచ్చే నెలకు చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ వాయిదా వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో మార్కాపురానికి ఇన్చార్జి కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్దన్రాజుతో పాటు పలువురు అధికారులు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రథమ పౌరుడైన తనకు కనీస ఆహ్వానం లేకుండా ప్రొటోకాల్ మరిచారని మండిపడ్డారు. పట్టణ పరిధిలో కార్యాలయాల ప్రారంభం సందర్భంగా సున్నం, బ్లీచింగ్ తదితర పారిశుధ్య పనులకు కౌన్సిల్ ఆమోదించిన వస్తువులు మాత్రం అవసరమని ఎద్దేవా చేశారు. పట్టణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ మీటింగ్కు సభ్యులు రాకపోవటంతో పాటు జిల్లా అధికారులు మార్కాపురం వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు కూడా సమావేశానికి హాజరు కాకపోవటంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు ముందున్నారన్నారు. మున్సిపల్ సమావేశానికి వైస్ చైర్మన్–2 చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు సిరాజ్, కొత్త కృష్ణ, సలీం, ముంగుమూరి శ్రీనివాసులు, భాను, దేవకరుణమ్మ, చాటకొండ చంద్రశేఖర్, కో ఆప్షన్ మెంబర్ గుంటక వనజాక్షి హాజరయ్యారు. కోరం లేకపోవడమే కారణం ప్రొటోకాల్ పాటించని కూటమి నాయకులు మండిపడిన మున్సిపల్ చైర్మన్ కృష్ణ -
డివిజన్ స్థాయిలోనూ రెవెన్యూ క్లినిక్లు
అద్దంకి: జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లీనిక్లను త్వరలో డివిజన్ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, ఐదు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా బాపట్లలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారని చెప్పారు. నూతన రెవెన్యూ డివిజన్లలో భాగంగా అద్దంకి రెవెన్యూ డివిజన్గా చేశారన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చ అర్జీల్లో 70 శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయని, అంధుకే రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేశామన్నారు. నెల తరువాత ఆర్డీఓ స్థాయిలో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన రెవెన్యూ డివిజన్ తొలి అర్డీఓగా (ఇన్చార్జి) నియమితులైన లక్ష్మీ ప్రసన్న అన్నారు. పట్టణంలోని అర్అండ్బీ బంగ్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా అద్దంకిని రెవెన్యూ డివిజన్గా చేసిందని చెప్పారు. డివిజన్ పరిధిలో అద్దంకి, దర్శి నియోజకవకవర్గాల్లోని 10 మండలాలుంటాయని చెప్పారు. -
పొదిలి కొండ వివాదంపై హైకోర్టు స్టే
పొదిలి రూరల్: పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంపై పొదిలి–మర్రిపూడి మండలాల్లో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి పొదిలి కొండను మర్రిపూడి మండలంలో కలుపుతున్నట్లు జీవో తెచ్చామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పొదిలి మండల వాసులు పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పృథులగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ పొదిలి కొండ పొదిలికి చెందినదే అనే పూర్తి ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారు దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఈవిషయంపై ఆలయ పరిరక్షణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఒంగోలు: రాష్ట్ర స్థాయి అండర్ 20 ఫెన్సింగ్ పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానంలో నిలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ప్రతిభ చాటారు. ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను బుధవారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.నవీన్, ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి వి.నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
ఊరూవాడ..మద్యం, గంజాయి వినియోగం పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ప్రైవేటు మద్యం అందుబాటులోకి వచ్చింది. ఊరికి రెండు బెల్టు దుకాణాలు వెలిశాయి. వీధివీధికి మద్యం అందుబాటులోకి రావడంతో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దానికి అనుబంధంగా రోడ్డ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు తలుపులు బార్లా తెరిచింది. దాంతో ఊరికి రెండు మూడు బెల్టు షాపులు వచ్చాయి. అదే స్థాయిలో మద్యం సేవించే వారి సంఖ్య కూడా పెరిగింది. మద్యం కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. జిల్లాలో 2025 సంవత్సరంలో బహిరంగంగా మద్యం తాగుతున్న 20031 మందిపై కేసులు నమోదయ్యాయి. 2024వ సంవత్సరంలో ఈ సంఖ్య 14,978 ఉండగా ఈ ఏడాది 33.736 శాతం పెరిగింది. జిల్లాలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం అందుబాటులో లేని గ్రామం ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించలేరు. అసలు దుకాణం వద్దకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. 2024లో 4,136 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 5,808 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,363 మందిని కోర్టులో హాజరుపరచగా జరిమానాలు, జైలు శిక్షలు విధించింది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు చెప్పవచ్చు. ఈ ఏడాది 757 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం 13.29 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గడం ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది 29 నార్కోటిక్స్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 31 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రతి రోజూ గంజాయి పట్టుబడుతోంది. రైళ్లలో గంజాయి రవాణా ఎకై ్సప్రెస్ వేగంగా జరుగుతోంది. తాజాగా పశ్చిమాన గంజాయి సాగు వెలుగుచూడడం ఆందోళన కలిగించే అంశం. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో ఇచ్చిన వివరాల ప్రకారం... మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో మహిళలపై హింస పెరిగింది. మహిళలు, బాలికల మిస్సింగ్ ఆగలేదు. 2025లో జిల్లాలో 136 మంది బాలికలు, 292 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అలాగే వరకట్నం వేధింపులు, గృహహింస, హత్య, కిడ్నాప్ తదితర మహిళలపై నేరాలకు సంబంధించి 709 కేసులు నమోదయ్యాయి. బాలికలపై లైంగికదాడులకు సంబంధించి గత ఏడాది 92 కేసులు నమోదు కాగా ఏడాది 85 కేసులు నమోదయ్యాయి. ఫోక్సో కేసుల్లో 7.67 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో బాలికలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. శక్తి యాప్ను 18,034 మంది మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేశారు. లైంగిక నేరాల విషయంలో 346 మందిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు. జిల్లాలో 2025వ సంవత్సరంలో 632 దొంగతనాలు జరిగాయి. సుమారుగా రూ.8.70 కోట్లు చోరీ అయ్యాయి. సీసీ ఫుటేజీలు, ఫింగర్ ప్రింట్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీగా రికవరీ చేశారు. ప్రాపర్టీ నేరాల్లో రూ.4.44 కోట్లను రికవరీ చేశారు. వీటితోపాటుగా నైట్ బీట్స్, విజిబుల్ పోలీసింగ్, సీసీ, డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచడంతో గణనీయంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్ చలనాలను కూడా భారీగా వసూలు చేయడం గమనార్హం. ఈ ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.2.02 కోట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా జరిమానాల రూపంలో రూ.1,77,24,500 వసూలు చేశారు. 2024లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కేవలం రూ.60,63,140 మాత్రమే వసూలు చేశారు. ఈ ఏడాది వసూలు చేసిన మొత్తం రెట్టింపుకంటే ఎక్కువగా ఉంది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా నేరాలను కట్టడి చేయడానికి సీసీ కెమెరాలు, డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. జిల్లాలో 32 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. దీని ద్వారా 6474 ప్రదేశాల్లో నిఘా ఉంచారు. 502 మ్యాట్రిక్స్ సీసీ కెమెరాలు, 5737 ప్రైవేటు కెమెరాలతో కలుపుకొని మొత్తం 6239 సీసీ కెమెరాలు నిఘా నేత్రం తెరచి పర్యవేక్షిస్తున్నాయి. డయల్ 112 కు 18,426 కాల్స్ రాగా వాటికి పోలీసులు సకాలంలో స్పందించారు. జిల్లాలో వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 3891 మంది వలస కార్మికులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 1214 మంది రౌడీ షీటర్లు ఉండగా వారిలో 173 మంది మాత్రం చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ఎంఎస్సీడీ ద్వారా 65,576 మందిని చెక్ చేయగా వారిలో 190 మంది పాత నేరస్తులున్నట్లు గుర్తించి ముందస్తు జాగ్రత చర్యలు తీసుకున్నారు. మోంథా తుఫాను సమయంలో మూసీ వాగు వరదల్లో చిక్కుకున్న 121 మంది వలస కూలీలను రక్షించడంలో పోలీసులు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో 8371 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 7,818 మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది 11,705 కేసులు విచారణలో ఉండగా 2025లో 13018 కేసుల్లో 7897 కేసులను డిస్పోజల్ చేయడం ద్వారా 6 శాతం కేసులను తగ్గించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగానే జిల్లాలో ఈ ఏడాదిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సమర్ధవంతమైన పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కేసులను ఛేదిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అందుకే రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపడతాం. హెల్మెట్ లేకుండా హైవే ఎక్కడానికి అనుమతించం. మహిళలు, బాలికల రక్షణ కోసం విస్తృతంగా అవగాహన చర్యలు చేపడతాం. ప్రజల భద్రతే ప్రధాన అంశంగా నేర రహిత సమాజ నిర్మాణం దిశగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుంది. – ఎస్పీ హర్షవర్థన్ రాజు -
పురుగుమందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కంభం: పురుగుమందు తాగి కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన కొమరోలు నాగరాజు(48) పొలాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి రాత్రి పురుగుమందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు గిద్దలూరులోని ప్రైవేట్ వైద్యశాలకుతరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు వైద్యశాలలో మృత దేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సింగరాయకొండ: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ దగ్ధమైంది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్–8 వ లైనులో సయ్యద్ మొబిన్ ఇంటివద్ద జరిగింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. మొబిన్ లారీలకు బాడీ మెకానిక్గా పనిచేస్తుంటాడు. ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లేందుకు మోటారుసైకిల్ ఇంటి బయట పెట్టి ఇంటి గేటు వేసే క్రమంలో హఠాత్తుగా ఆయిల్ ట్యాంకు కింద నుంచి మంటలు చెలరేగి ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచాయి. ఈ సమయంలో ట్యాంకులో పెట్రోల్ నిండుగా ఉంది. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా తగలబడింది. ప్రమాద స్థలాన్ని ఎస్సై బి. మహేంద్ర పరిశీలించారు. మార్కాపురం: పదో తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 144 ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు, సీఆర్ఎంటీలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను గమనించి వారి అభివృద్ధికి, చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అన్నీ పాఠశాలల హెచ్ఎంలు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకూ అంశాల వారీగా రెమిడీయల్ సెషన్స్ ఎసెస్మెంట్ నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేసి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన హెచ్ఎంలను అభినందించారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఎం శ్రీనివాసులు, మార్కాపురం, ఒంగోలు ఎంఈఓలు రాందాస్నాయక్, కిశోర్, హెచ్ఎంలు చంద్రశేఖర్రెడ్డి, శ్రీదేవీ పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: చిన్నారుల్లో మానసిక, శారీరక రుగ్మతలను ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భగీరథి సూచించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని బాల భవిత కేంద్రంలో ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్పై జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భగీరథి మాట్లాడుతూ పీడీయాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ తిరుపతిరెడ్డి, జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతం, డాక్టర్ నాగార్జునరెడ్డి, డీఈఐసీ మేనేజర్ స్టెఫీగ్రాఫ్, స్టేట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ప్రతినిధి డాక్టర్ వినయ్ శిక్షణ ఇచ్చారు. చిన్నవయసులోనే వచ్చే వ్యాధులు, మానసిక రుగ్మతలు, ఎదుగుదలలో లోపాల గురించి వివరించారు. చిన్న వయసులో వచ్చే వ్యాధులను ఎంత త్వరగా పసిగడితే అంత తొందరగా చికిత్స చేయవచ్చని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సునీత, జయలక్ష్మి, కరవది అనిల్, విద్య, రాజా, రాము తదితరులు పాల్గొన్నారు. -
వెంకటేశ్వర్లు సేవలు ఆదర్శం
పొన్నలూరు: రైతు కుటుంబంలో జన్మించి రాజకీయ నాయకుడిగా, దాతగా ముళ్లమూరి వెంకటేశ్వర్లు సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని వెంకుపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ముళ్లమూరి వెంకటేశ్వర్లు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ముళ్లమూరి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ, సర్పంచ్గా అనేక రాజకీయ పదవులు చేపట్టి గ్రామ, మండల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ స్థాపించింది మొదలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు నిస్వార్ధ హృదయంతో అనేక గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడటంతో పాటు కొండపి నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వేల సంఖ్యలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించి మంచి దాతగా పేరు పొందారన్నారు. వైఎస్సార్ సీపీ తరపున సంతాప సభను నిర్వహించి ఘన నివాళి అర్పించామని, భవిష్యత్లో ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యచరణ కార్యదర్శి కాటా మాధవరావు, కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి మండలాల కన్వీనర్లు బచ్చుల కోటేశ్వరరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పిన్నిక శ్రీనివాసరావు, గడ్డం మాల్యాద్రి, కాటా మల్లికార్జున, యర్రా రామకృష్ణ, కూరపాటి లక్ష్మినారాయణ, ముప్పా కోటేశ్వరరావు, జ్యేష్ఠ వేణు, యంప్రాల మాధవ, అనుమోలు ప్రసాద్, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఎస్కే మస్తాన్వలి, మన్నెం రవణయ్య పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: నూతన సంవత్సర వేడకల సందర్భంగా అనుమతులు లేకుండా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కట్ చేయడం, డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, రోడ్డు కూడళ్లలో గుంపులుగా గుమిగూడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, ఇతర సున్నితప్రాంతాల దగ్గర లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, దాబాలను నిర్దేశించిన సమయంలో మూసివేయాలని చెప్పారు. నగరంలో రాత్రి 10 గంటల తరువాత కర్నూలు రోడ్డు బైపాస్ ఫ్లైఓవర్ను మూసివేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంతో పాటుగా జిల్లాలోని ముఖ్య పట్టణాలు, ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలోని కొప్పోలు రోడ్డు, మంగమూరు రోడ్డు, పేర్నమిట్ట రోడ్డుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు... జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 136 పోలీసు పికెట్లు, 56 మొబైల్ పార్టీలు, 30 డ్రంక్ అండ్ డ్రైవ్, ఎన్ఫోర్స్మెంట్ టీంలు, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటు చేయనున్నుట్లు వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వెంకుపాలెంలో ముళ్లమూరి వెంకటేశ్వర్లు విగ్రహం ఆవిష్కరణ ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరిక -
బాబు పాలనలో వ్యవస్థలన్నీ కుదేలు
పొన్నలూరు: చంద్రబాబు పాలనలో ప్రస్తుతం వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టి కుదేలయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్తో కలిసి పర్యటించిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు, కేసులు తప్పా ప్రజల సంక్షేమం ఏమీ లేదన్నారు. పోలీసులను పావుగా వాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా అధికారపార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతి పక్ష పార్టీ నేతలు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతూ ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత విధ్వంస పాలనతో పేద ప్రజలకు ఆర్ధిక భరోసా, రక్షణ లేకుండా పోతోందన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లిక్కర్, ఇసుక, మట్టి, గంజాయి మాఫియాగా తయారై రాష్ట్రంలో దోచుకుంటూ శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రజా పక్షాన నిలవాలన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాబోవు రోజుల్లో ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి... చంద్రబాబు ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, దాడులకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగి పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారికి అండగా నిలవాలన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో కార్యకర్తల కృషి, ప్రజల ఆశీస్సులతో కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్, కొండపి నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పిల్లి తిరుపతిరెడ్డి, కాటా మాధవరావు, గడ్డం మాల్యాద్రి, కాటా మల్లికార్జున, యర్రా రామకృష్ణ, అనుమోలు ప్రసాద్, మార్తాల వెంకటేశ్వరరెడ్డి, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
లైంగిక దాడి..ఆపై హత్య..!
ఒంగోలు టౌన్: కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం..సంఘటనా స్థలంలో ఒక్క ఆధారమూ లేదు. కానీ జిల్లా పోలీసులు చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ పరిధిలో జూన్ 23న లభించిన బాలిక మృతదేహం లభ్యమైంది. విచారణలో బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్ 23వ తేదిన మద్దిపాడు మండలం దొడ్డవరంపాడు గ్రామ పరిధిలోని కపిల్ లే అవుట్స్ వెనక కుళ్లి పోయిన స్థితిలో గుర్తు తెలియని బాలిక మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. గ్రామ వీఆర్వో దండేల మౌనిక ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం వచ్చిన నివేదిక ప్రకారం హత్యగా నిర్ధారించారు. ఎస్పీ ఆదేశాలతో రూరల్ సీఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన బాలికను గుర్తించేందుకు జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో సింగరాయకొండ గ్రామంలోని మూలగుంటపాడు రోడ్డులో సుందర్నగర్కు చెందిన మోదడుగు తిరుపతమ్మ కూతురు తప్పిపోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను సంప్రదించి వివరాలను సేకరించారు. బాలిక ఫొటోలను చూసిన తిరుపతమ్మ చనిపోయిన బాలిక తన కూతురేనని నిర్ధారించింది. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు నిందితుల వివరాలను రాబట్టారు. పొన్నలూరు మండలం విప్పుకుంట గ్రామానికి చెందిన దుద్దెల చెన్నకృష్ణ, అదే గ్రామానికి చెందిన దేవరాజు వంశీ, ప్రస్తుతం సింగరాయకొండలో నివసిస్తున్న విప్పకుంట గ్రామానికి చెందిన డబ్బుకొట్టు కోటయ్యలు బాలికనుహత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి రెండు రాష్ట్రాల్లో గాలించాల్సి వచ్చింది. నిందితులు తెలంగాణాలోని హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, నెల్లూరుల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. హత్య చేసినప్పటి నుంచి స్వగ్రామానికి రాకుండా రహస్యంగా ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు అంగీకరించారు. లైంగిక దాడి విషయం బయట చెబుతుందేమోనన్న భయంతో గొంతునులిమి చంపివేసినట్లు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. బాలిక హత్య కేసును చేదించడంలో రూరల్ సీఐ శ్రీకాంత్బాబు, మద్దిపాడు ఎస్సై జి.వెంకట సూర్య, సిబ్బంది షేక్ కరీం, సద్దాం హుసేన్, ఆర్.కృపానందం, వి.హనుమంతరావులను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మద్దిపాడు మండలంలో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆరు నెలల క్రితం కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యం సాంకేతికత సాయంతో నిందితుల అరెస్టు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ -
మీ అనుభవాలే స్ఫూర్తిగా ముందడుగు
ఒంగోలు టౌన్: పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మీ అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మెరుగ్గా ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న 14 మంది విశ్రాంత పోలీసు అధికారులకు, వారి కుటంబసభ్యులను ఎస్పీ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వం సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సంచలనం సృష్టించిన అనేక దొంగతనం కేసులను చేధించారని గుర్తు చేశారు. అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచారని కొనియాడారు. పోలీసు శాఖలో ఎంతో ఒత్తిడితో కూడుకున్న విధులను నిబద్ధతతో నిర్వర్తించారని ప్రశంసించారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిజాయితీగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులుగా ఎంతో మంది అభిమానాన్ని పొందారని చెప్పారు. మీ సేవలను, అనుభవాలను పాఠాలుగా స్వీకరిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించడం అనేది గొప్ప సంప్రదాయంగా, ఇలాంటి కార్యక్రమాలు ఏటా నిర్వహించడం ద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజును విశ్రాంత పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. ఆర్ఐ సీతారామిరెడ్డి, సంఘ నాయకులు జె.రామమూర్తి, కేవీ సుబ్బారావు, షేక్ ఖాశీం, షేక్ అల్లాబక్షు, ఎం.ప్రసాదరావు, రాజయ్య, షేక్ షుకూర్, వీవీ నారాయణ, కె.వెంకటేశ్వరరెడ్డి, తిమోతి, పి.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత పోలీసు అధికారుల సన్మాన సభలో ఎస్పీ హర్షవర్థన్ రాజు -
మార్కాపురం ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీల నియమాకం
ఒంగోలు ప్రతినిధి: కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇన్చార్జి ఎస్పీగా ప్రకాశం ఎస్పీ హర్షవర్థన్ రాజును నియమించింది. అర్ధరాత్రి వరకు మందేసి చిందేయొచ్చు ఒంగోలు టౌన్: మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకలను మరింత నిషాగా నిర్వహించుకునేందుకు రైట్ రైట్ చెప్పింది. ఒకవైపు మహిళా సంఘాలు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితేనేం అంటూ చంద్రబాబు ప్రభుత్వం మరింత ఎక్కువగా తాగేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయ సమయాలను పొడిగించినట్లు తెలిపారు. మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు సమయం పొడిగించామన్నారు. బార్లు, ఈవెంట్ పర్మిట్లు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లైసెన్సులు కలిగిన వారికి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, నాటుసారా, కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాల సమయం పొడిగించడంతో ఇక మందుబాబులకు అడ్డుఅదుపూ లేకుండా పోతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ● జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాలు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ షాపుల తనిఖీలు, దీపం 2 పథకం అమలు, ధాన్యం సేకరణ, రెవెన్యూ రాబడి, నీటి ఆడిటింగ్, నీటి బడ్జెట్, భూగర్భ జలాల వాస్తవ తనిఖీ, నీటి వనరుల విశ్లేషణ, కేంద్ర ప్రాయోజిత పథకాల పనుల పురోగతి, గృహ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు పరిశీలించినప్పుడే సంబంధిత సమస్య నాణ్యతతో పరిష్కరించేలా వీలవుతుందన్నారు. గ్యాస్ పంపిణీ, రేషన్ పంపిణీలలో వినియోగదారులతో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే వారి అభిప్రాయాలు తీసుకుంటామని, ఏ వినియోగదారుడైనా వంట గ్యాస్ అందించే డెలివరీ, రేషన్ సరుకులు అంశాలలో ఫిర్యాదు చేస్తే సంబంధిత వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, మైనింగ్, కమర్షియల్ టాక్స్ శాఖల అధికారులు రెవెన్యూ రాబడిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. వీడియో సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, మాధురి, కళావతి, కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. పి.రాజాబాబుఎస్పీ హర్షవర్థన్ రాజు -
స్వరూపం మారనున్న ఉమ్మడి జిల్లా..
ఒంగోలు సబర్బన్/మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్వరూపం మారుతోంది. 28 మండలాలతో ప్రకాశం జిల్లాను పునర్వ్యవస్థీకరిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్.నెం.523, 524లను జారీ చేసింది. అలాగే నూతనంగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉంటాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు నియోజకవర్గాన్ని, బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, మర్రిపూడి, పొన్నలూరు మండలాలతో కూడిన కందుకూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటైంది. ఒంగోలు రెవెన్యూ డివిజన్లో కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ, ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు మండలాలు ఉంటాయి. కొరిశపాడు, జే పంగులూరు, అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దొనకొండ మండలాలు మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం తాజా ఇచ్చిన ఉత్తర్వుల్లో దర్శి నియోజకవర్గం మొత్తం ప్రకాశం జిల్లాలోనే ఉండనుంది. అద్దంకిలో నూతన డివిజన్ కార్యాలయం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్ ఇన్చార్జిగా ఒంగోలు ఆర్డీవో వ్యవహరించనున్నారు. మార్కాపురం, కనిగిరి నేడు మార్కాపురానికి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో నూతన జిల్లా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టరుతో పాటు డీఆర్ఓ వివిధ శాఖల అధికారులు బుధవారం మార్కాపురం రానున్నారని ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జీవోను విడుదల చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల కార్యాలయాలను పరిశీలించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసే కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ రాజబాబు పరిశీలించనున్నారు. ఎస్పీ ఆఫీసును కూడా పరిశీలించనున్నారు. -
కీచక ఉపాధ్యాయుడు
దర్శి: విద్యార్థులకు విద్యా బుద్ధలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తాను గురువునన్న సంస్కారాన్ని మరిచి పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి పట్టణం కురిచేడు రోడ్డులో నివాసముండే ఇద్దరు చిన్నారులు ఓ ప్రభుత్వ స్కూలులో ఐదో తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు వీరితో చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం చిన్నారులు ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. సాయంత్రం వారి ఇద్దర్ని స్కూలులోనే ఉండమని చెప్పాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ పెట్టాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళన చెందిన సదరు విద్యార్థినులు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. మంగళవారం ఉదయం చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఎంఈఓ రమాదేవి స్కూలులో చోటుచేసుకున్న పరిణామాలపై చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఆమె ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా సదరు ఉపాధ్యాయుడు అధికార పార్టీకి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని కేసు నుంచి తప్పించేందుకు కొంత మంది టీడీపీ నాయకులు రాజీ ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎస్ఐ మురళీని వివరణ కోరగా విద్యార్థినుల తల్లిదండ్రులు కేసు పెట్టలేదని చెప్పారు. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులపై అసభ్య ప్రవర్తన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తుల దేహశుద్ధి ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేసిన డీఈఓ -
ఓవరాల్ చాంపియన్ ఒంగోలు
ఒంగోలు: పాలిటెక్నిక్ కాలేజీల అంతర్జిల్లాల పోటీల్లో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎ.నిర్మల్కుమార్ ప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. త్వరలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణించి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సాంకేతిక విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి డీఎస్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలులో నిర్వహించిన పోటీలు ఆకట్టుకున్నాయని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నర్రా శ్రీనివాసరావు, ఇతర పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొని విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజేతల వివరాలు వరుసగా జావెలిన్ త్రో: ఎస్కే అభిలాష్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ), యు.ఉపేంద్ర (కంభం ఎస్వీకేపీ), ఈ.నాగేంద్రబాబు (ఒంగోలు డీఏ ప్రభుత్వ) లాంగ్జంప్: ఎం.జస్వంత్నాయక్(కంభం ఎస్వీకేపీ), టి.గోపి(ఒంగోలు డీఏ ప్రభుత్వ), వి.పవన్కుమార్ (కంభం ఎస్వీకేపీ) హైజంప్: ఎం.జస్వంత్నాయక్ (కంభం ఎస్వీకేపీ), పి.అమన్(ఒంగోలు డీఏ ప్రభుత్వ), పి.అశోక్ (కందుకూరు ప్రభుత్వ) ట్రిపుల్ జంప్: టి.గోపి(ఒంగోలు డీఏ ప్రభుత్వ), వి.పవన్కుమార్( కంభం ఎస్వీకేపీ), ఎస్కె షఫి (కందుకూరు ప్రభుత్వ) ఆటల పోటీలు: బ్యాడ్మింటన్ సింగిల్స్: ఎం.సూర్యకిరణ్ (సెయింట్ ఆన్స్ చీరాల), సీహెచ్ రఘు (ఒంగోలు పేస్ ), డి.అభినవ్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ) బ్యాడ్మింటన్ డబుల్స్: ఎం. సూర్యకిరన్, టి.మనోజ్ (సెయింట్ ఆన్స్ చీరాల) , సీహెచ్ రఘు, ఎస్కే ఆసిఫ్ (పేస్), పి.విజయ్కుమార్, కె.జస్వంత్ (కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్) టేబుల్ టెన్నిస్ సింగిల్స్: ఆర్.యశ్వంత్ (రైజ్ పాలిటెక్నిక్), ఎ.వపన్ (కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్), టి.సాత్విక్ (పేస్) టేబుల్ టెన్నిస్ డబుల్స్: ఆర్.యశ్వంత్, ఎస్కె షాహెజాద్ (రైజ్), ఎస్.పూజిత్, ఎ.పవన్ (కందుకూరు ప్రకాశం), కె. సుధీర్, జి.ఉమాశంకర్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ) చదరంగం: టి.మనోజ్(చీరాల సెయింట్ ఆన్స్), ఎస్కే ఇస్మాయిల్( రైజ్), ఈ.హర్షవర్థన్ ( కంభం ఎస్వీకేపీ) బాల్ బ్యాడ్మింటన్: పేస్ కాలేజీ, కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్, ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ వాలీబాల్: చీరాల సెయింట్ ఆన్స్, ఒంగోలు డీఏ ప్రభుత్వ, కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్ కబడ్డీ: చీరాల సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్, ఒంగోలు డీఏ ప్రభుత్వ, పేస్ పాలిటెక్నిక్ కాలేజి ముగిసిన పాలిటెక్నిక్ కాలేజీల అంతర్జిల్లాల పోటీలు కంభం పాలిటెక్నిక్ కాలేజీకి వ్యక్తిగత చాంపియన్షిప్ -
సత్తా చాటిన ఈతముక్కల విద్యార్థినులు
కొత్తపట్నం: పాలిటెక్నిక్ జిల్లాస్థాయి బాలికల ఆటల పోటీల్లో ఈతముక్కల కాలేజీ విద్యార్థినులు సత్తా చాటారు. రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఏడు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన 220 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఈతముక్కల విద్యార్థులు వాలీబాల్, ఖోఖోలో విన్నర్లుగా నిలిచారు. ఖోఖో రన్నర్గా ఖమ్మం పాలిటెక్నిక్ విద్యార్థులు, వాలీబాల్ రన్నర్గా పేస్ కాలేజీ విద్యార్థులు గెలిపొందారు. షటిల్ సింగిల్ విన్నర్గా రైజ్ కాలేజీ, రన్నర్గా కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ గెలిపొందారు. షటిల్ డబుల్స్లో విన్నర్గా ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ, రన్నర్గా రైజ్ కాలేజీ విద్యార్థులు గెలుపొందారు. చెస్పోటీల్లో విన్నర్గా ఈతముక్కల కాలేజీ విద్యార్థులు, రన్నర్గా పేస్ కాలేజీ విద్యార్థినులు నిలిచారు. మొత్తం మీద ఓవరాల్ గేమ్స్, స్పోర్ట్స్ చాంపియన్గా ఈతముక్కల విద్యార్థునులు కై వసం చేసుకున్నారు. అనంతరం కాలేజీలో బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు బత్తుల జీవన్కుమార్, డీఎన్వీ రత్నబాబు, కాలేజీ ప్రిన్సిపాల్ వి.ఏసుప్రసాద్రావు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా
ఒంగోలు: జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 26 నుంచి 28 వరకు విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 40వ జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఒంగోలుకు చెందిన బాలబాలికలు బ్లాక్ బెల్ట్, కలర్ బెల్టు విభాగంలో బంగారు, వెండి, రజిత పతకాలను కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన చిన్నారులను, శిక్షణ ఇచ్చిన అంతర్జాతీయ కోచ్ కరిముల్లాను జాతీయ తైక్వాండో అధ్యక్షుడు బీవీ రమణయ్య, ఏపీ పోర్టు వర్కర్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లాబాషా, ఎమరన్ విజయ్, సీవీఎన్ పాలకమండలి సభ్యులు అభినందించారు. బాలురు బ్లాక్ బెల్ట్ విభాగం: జి.మహదేవ్ కార్తీక్, జి.విజ్ఞాన్, జయప్రకాష్,ప్రశాంత్(బంగారు), విఘ్నేష్(వెండి) బాలుర కలర్ బెల్టులు: షేక్ అబ్దుల్ అక్మల్, షేక్ సాదాబ్, రుత్విక్, శివసూర్య, లోహిత్రెడ్డి (వెండి), హేమంత్సాయి, అద్వితేజ్ (రజిత ) బాలికలు బ్లాక్ బెల్ట్: అభిషిక్త (బంగారు), కోమల నాగశ్రీ, నాగశ్రీ (వెండి) బాలికల కలర్ బెల్ట్: సహస్త్రరెడ్డి, కావ్యశ్రీ, సాజీదాలు (రజిత) పతకాలను కై వసం చేసుకున్నారు .. -
ఆర్యవైశ్యుల నిరసన గళం
పొదిలి: పట్టణంలోని ఎరువుల వ్యాపారి యాదాల కోటేశ్వరరావు, అతని కుమారుడు అవినాష్లను లారీ రోడ్డుపై ఉంచి అన్లోడ్ చేయిస్తున్నారనే కారణంతో ఎస్సై వేమన విచక్షణా రహితంగా కొట్టినందుకు నిరసనగా ఆర్యవైశ్యులు, వ్యాపారులు సోమవారం శాంతిర్యాలీ నిర్వహించారు. పట్టణంలో బంద్ పాటించారు. ఆర్యవైశ్యులు, వ్యాపారులు దుకాణాలను మూసి వేసి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందుగా సీఐ రాజేష్ కుమార్ నిర్వాహకులకు నచ్చచెప్పేందుకు అమ్మవారిశాల వద్దకు వచ్చారు. ఎస్సైపై చర్యలు తీసుకుంటారని, ర్యాలీ విరమించుకోవాలని కోరారు. ఈ సమయంలో బాధితుడు కోటేశ్వరరావు కోడలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ రోడ్డుపై పెట్టి అన్లోడ్ చేయిస్తున్నాడని తన భర్తను కొట్టారని, కొడుకు స్టేషన్లో ఉన్నాడని వచ్చిన మా మామను కూడా కక్ష కట్టినట్లుగా ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలని నిలదీసింది. ర్యాలీ ఆద్యంతం అవినాష్కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అవినాష్కు దెబ్బలు తగిలిన ఫొటోలను యువత, మహిళలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని యువకులు ప్రశ్నించారు. తొలుత పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారిశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. చిన్న బస్టాండ్ నుంచి ప్రధాన రహదారి మీదుగా పెద్ద బస్టాండ్ చేరింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు గునుపూడి భాస్కర్ ఇతర సంఘం నాయకులు, బాధితుడు కోటేశ్వరరావుతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ సాజిదాకు వినతిపత్రం అందించారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం దండించవచ్చు. కానీ చిన్న కారణం చూపి ఇంత దుర్మార్గంగా దాడి చేయటం ఎక్కడా జరగలేదని బాధితుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లాడు. తాను తన కొడుకు స్టేషన్లో ఉన్నాడని వెళ్లానని, సార్ ఏమిటి విషయం అనే లోపునే చెంపపై కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు కొడుతున్నారు అని నేను అడిగేలోపే మళ్లీ, మళ్లీ కొట్టాడన్నారు. అవమానకరంగా అసభ్యకరంగా తిట్టాడని, కారణం ఏమిటో కూడా చెప్పకుండానే శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగా మరొకరికి జరగకుండా ఎస్సైని కఠినంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని డీటీని అభ్యర్ధించారు. బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్యులు, వ్యాపారులు మద్దతు కూడగట్టుకుని నిరసనలు చేపడతామని ఆర్యవైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వి.కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు గునుపూడి సుబ్బారావు, గునుపూడి మధుసూదన్, పందిటి మురళి, యక్కలి శేషగిరిరావు, మేడా నరసింహారావు, వేమా శ్రీనివాసరావు, సతీష్, శ్యాం, మాజీ ఎంపీటీసీ గునుపూడి మాధవి, సోమిశెట్టి శ్రీదేవి, అప్పల శంకర్, కలవా సత్యం, వెంకట రామయ్య, అప్పల సత్యం, భవాని మురళి, శ్రీను, విశ్వనాథపురం నుంచి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు. అసలు ఇంత కక్షతో ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు లారీ డ్రైవర్ను ఎస్సై ముందుగా కొట్టాడు. లారీ తీసేయిస్తున్నాను సార్ అనే లోపే లాఠీతో నాపై దాడి చేశాడు. అసలు ఇంత కక్షపెట్టినట్లుగా ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు. జీబులో ఎక్కించుకుని కొట్టాడు. స్టేషన్ బయట కూడా కొట్టాడు. చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాను. అక్కడికి కూడా పోలీసులు వచ్చి స్టేషన్కు తీసుకెళ్లారు. నా కోసం వచ్చిన నా తండ్రిని విచక్షణా రహితంగా చెంప పగిలేలా ఎస్సై కొట్టాడు. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని, రాత్రి 12.30 గంటల సమయంలో వదిలేశాడు. బాధితులకు న్యాయం చేయాలి అవినాష్, కోటేశ్వరరావులకు న్యాయం చేయాలి. అందుకు కారణమైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు సూచనలు చేయాలి. – బొగ్గవరపు సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు – బాధితుడు అవినాష్ -
ఆలయం సమీపంలో మద్యం షాపొద్దు..
మార్కాపురం టౌన్: చరిత్ర ప్రసిద్ధి చెందిన మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాడవీధిలో వైకుంఠ ఏకాదశినాడు స్వామివారు దర్శనమిచ్చే ఉత్తర ద్వారానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయుడు బజారులోని ఏటీఎం సెంటరు వద్ద మాడవీధి పరిధిలో మద్యం దుకాణానికి ఎకై ్సజ్ శాఖాధికారులు ఎలా అనుమతి ఇస్తారని మండిపడుతున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నాయుడు బజారు నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూగా ఉండాల్సిన పరిస్థితి. మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేస్తే కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో మద్యం ప్రియులు తమ ఆగడాలను ఎక్కువ చేస్తారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణం వద్దని ఎమ్మెల్యే, ఆలయ ఈఓకు వినతిపత్రం మార్కాపురం పట్టణంలోని నాయుడుబజారులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో ప్రాంత మహిళలైన శాసనాల సరోజినీ, సరయు, పార్వతీ, క్రిష్ణకుమారి తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. చెన్నకేశవస్వామి ఉత్తర ద్వారం కేవలం 15 మీటర్ల లోపే ఉందని వివరించారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో మద్యందుకాణం ఏర్పాటు చేస్తే పగలు రాత్రి అనే తేడాలే కుండా మద్యం తాగిన అల్లరిమూకలు చేసే ఆగడాలకు అంతులేకుండా పోతుందన్నారు. మార్కాపురం చరిత్రలో నాలుగు మాడవీధుల పరిధిలో మద్యం షాపు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని వివరించారు. దైవసన్నిధి ప్రాంతంలో షాపు ఏర్పాటు చేయడం హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అన్నారు. వినతిపత్రం అందచేసిన వారిలో ఇందిర, సుబ్బారావు, వెంకటరత్నం, సత్యనారాయణ, బాలయ్యతో పాటు సుమారు 20 మంది సంతకాలు చేసి అందజేశారు. -
నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలివ్వాలి
● జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో కలెక్టర్ ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.25,045 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.16,505 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారని, నూరు శాతం రుణాలు మంజూరుచేసి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లకు చెప్పారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి గేదెల రుణాల మంజూరు కోసం బ్యాంకులకు పంపారని బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లాలో పీఎంఈజీపీ పథకం కింద పరిశ్రమల స్థాపనకు 102 దరఖాస్తులు పరిశ్రమ శాఖ నుంచి రుణాల మంజూరు కోసం బ్యాంకులకు పంపించారని, పరిశీలించి వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస రావు,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్, ఆర్బీఐ ఏజీఎం రోహిత్ అగర్వాల్, నాబార్డ్ ఏజీఎం రవికుమార్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
ఒంగోలు సిటీ: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరిగే విధంగా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీలో జిల్లాలోని పోలీసు అధికారులకు సోమవారం వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్థన్రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ రాజాబాబు, 7వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి టి.రాజా వెంకటాద్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025వ సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు జిల్లావ్యాప్తంగా నమోదైన అన్ని రకాల కేసులపై జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల దర్యాప్తు సత్వరం పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సంబంధిత చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. పైకి సివిల్ వివాదాలుగా కనిపిస్తున్నప్పటికీ నేరాలకు ఆస్కారం ఉన్న కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మరింత దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రణాళికలు రూపొందించుకోవాలి... సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్రాజు మాట్లాడుతూ నేరాల తీరును విశ్లేషించాలని, వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందడుగు వేయాలని కోరారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్తో జిల్లాలో నేరాలు కొంత వరకు తగ్గాయన్నారు. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అదేవిధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇతర శాఖల జిల్లా ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో తక్కువ కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. డయల్ 112 ద్వారా వెంటనే స్పందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు పోలీసింగ్ను మరింత చేరువ చేసేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి... ఒంగోలు 7వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి రాజావెంకటాద్రి మాట్లాడుతూ కొత్త చట్టాల గురించి, సైబర్ నేరాలు, ప్రాపర్టీ నేరాల గురించి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిచేయాలని కోరారు. పలు అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసపత్రాలు, రివార్డులు అందజేశారు. నేర సమీక్ష సమావేశంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, డీటీసీ డీఎస్పీ జి.గురునాథబాబు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.అజయ్బాబు, కనిగిరి ఏజేసీజే కోర్టు ఏపీపీ ఎస్.రఘునాథరావు, ఒంగోలు ఎకై ్సజ్ కోర్టు ఏపీపీ కె.శ్రావణ్ కుమార్, స్పెషల్ పీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, జిల్లాలోని అడిషనల్ పీపీలు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్న పోలీసు అధికారులుమాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు, పక్కన ఎస్పీ హర్షవర్థన్రాజు ఆ విధంగా మెరుగైన సేవలు అందించాలి కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు, జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాజావెంకటాద్రి పిలుపు జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్ష సమావేశం -
వీఆర్కు పొదిలి ఎస్సై
ఒంగోలు టౌన్: పొదిలి ఎరువుల వ్యాపారులు, తండ్రి కొడుకులైన యాదాల కోటేశ్వరరావు, అవినాష్ మీద జులుం ప్రదర్శించిన పొదిలి ఎస్సై వేమనపై వేటు పడింది. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆయనను వీఆర్కు బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ పొదిలి పట్టణంలోని పాతూరు ప్రధాన రహదారిపై అవినాష్ ఎరువుల దుకాణం ఎదుట లారీ నిలబెట్టి ఉంచి ఎరువుల బస్తాలు అన్లోడ్ చేయిస్తుండగా ఎస్సై వేమన అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే లారీ డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. దుకాణం యజమాని అవినాష్ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకొని కొట్టుకుంటూ పోలీసు జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకొని పోలీసు స్టేషన్కు వెళ్లిన అవినాష్ తండ్రి కోటేశ్వరరావుపై కూడా చేయి చేసుకున్నారు. ఈ విషయంపై వ్యాపారవర్గాలు సీరియస్గా తీసుకున్నాయి. మరుసటి రోజే పొదిలిలో ర్యాలీ నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అయితే ర్యాలీ జరగకుండా అధికార పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. పరోక్షంగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయినా ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టువిడవలేదు. ఇప్పుడు కనుక మౌనంగా ఉంటే ఆ తరువాత ఇంతకంటే ఎక్కువగా దాడులు జరుగుతాయని, ఇప్పుడే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న తలంపుతో బంద్ పాటించాలన్న నిర్ణయానికే వచ్చారు. సోమవారం పొదిలిలో బంద్ పాటించడమే కాకుండా ర్యాలీగా బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రం అందజేశారు. ఎస్సై వేమనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వేమన మీద పలు ఆరోపణలు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొదిలి ఎస్సై వేమన రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ యాజమానులకు వత్తాసు పలుకుతూ కొందరు లారీ యాజమానులను వేధించడంపై అప్పటి ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదులు వచ్చాయి. అధికార పార్టీ అండదండలు చూసుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను వీఆర్కు పంపించడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై వేమనను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. -
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ఒంగోలు: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 28వ అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడలు, ఆటల పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములకన్నా విజయాన్ని సాధించాలనే కాంక్ష, తపన పెరుగుతాయన్నారు. ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. పోటీల్లో ప్రతిభ చాటిన జట్లు జనవరిలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాల్బాల్, చదరంగం పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్: వంద మీటర్ల పరుగు: యు.ఉపేంద్ర (కంభం ), వి.పవన్కుమార్(కంభం), మదన్(ఒంగోలు డీఎ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ) 200 మీ. పరుగు: ఎం.జస్వంత్నాయక్(కంభం), వి.ధనుష్(కంభం ), ఎన్.కిరన్ (ఒంగోలు డీఎ ప్రభుత్వ పాలిటెక్నిక్) 400 మీ.పరుగు: ఎం.బాలత్రినేష్(అద్దంకి), వి.శ్రీధర్(కందుకూరు), పి.శ్రీకాంత్(అద్దంకి) 800 మీ.పరుగు: ఎన్.మహీంద్ర(ప్రకాశం పాలిటెక్నిక్), జి. డాన్కిసిక్(కందుకూరు ప్రభుత్వ), ఎం.గోపీకృష్ణ(ప్రకాశం పాలిటెక్నిక్) 1500 మీ పరుగు: కె.దేవేంద్ర(ప్రకాశం పాలిటెక్నిక్), జి.డాన్కిసిక్, వి.జస్వంత్( కందుకూరు ప్రభుత్వ) 4X100 మీ. రిలే: కంభం ఎస్వీకేపీ(ప్రథమ), రైజ్ పాలిటెక్నిక్ (ద్వితీయ) , పేస్ పాలిటెక్నిక్(తృతీయ) 4x400 మీ. రిలే: కందుకూరు ప్రభుత్వ(ప్ర ఎమ), కంభం ఎస్వీకేపీ(ద్వితీయ), డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ ( తృతీయ) బహుమతులు సాధించారు. షాట్పుట్: పి.సుకుమార్(ప్రథమ), వి.ప్రీతం రాజు(ద్వితీయ), కె.పవన్(తృతీయ) డిస్కస్త్రో: వి.ప్రీతంరాజు(కందుకూరు ప్రభుత్వ), కేవీ దుర్గారెడ్డి(వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ చీరాల), టి. రాజు(ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ) -
టాస్క్ఫోర్స్ పోలీసులకు ఎస్పీ అభినందనలు
ఒంగోలు టౌన్: టాస్క్ఫోర్స్ పోలీసులను ఎస్పీ హర్షవర్థన్రాజు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు అధికారులతో రైజ్ కాలేజీలో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నమోదైన దొంగతనాలు, ఇతర నేరాల కేసులు, పోలీసులు తీసుకున్న నిర్ణయాల గురించి లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్, ఎస్సై సుదర్శన్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాసులుకు ప్రశంసపత్రాలు అందజేశారు. -
చిత్తశుద్ధితో ఉద్యోగం చేయాలి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగాలు పొందిన 8 మందికి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వ సర్వీసులోకి వస్తున్నందుకు వారిని అభినందించారు. విధి నిర్వహణలో నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● సబ్కలెక్టరు కార్యాలయం ఎదుట హిందూ సంఘాల నిరసన మార్కాపురం: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భూములను కాపాడాలని హిందూసంఘాల నాయకులు సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వీరారావు, ఉపాధ్యక్షుడు జీసీహెచ్ వెంకటరెడ్డి, కార్యదర్శి గురునాథం మాట్లాడుతూ దేవస్థానానికి చెందిన 250 ఎకరాల ఆలయ భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించడం సరికాదన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఇనాముదారులు దేవాలయ అభివృద్ధి కోసం అప్పట్లో ఈ భూములను కేటాయించారని, వారి ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఎండోమెంట్ చట్టానికి విరుద్ధంగా ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమని అన్నారు. స్వామి ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూ మార్పిడి విధానాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.ప్రసన్న, రమాదేవీ, తులసీ, సునీత, గురుస్వామి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.


