Prakasam District News
-
పెట్రోలు బంకుల్లో విస్తృత తనిఖీలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో ప్రభుత్వానికి చెందిన మూడు విభాగాల అధికారులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘కల్తీ కమ్మక్కు..కేసుల గమ్మత్తు’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తూనికల, కొలతల విభాగం, సివిల్ సప్లయీస్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ పెట్రోల్ బంకుతో పాటు నగరంలో ఐదు పెట్రోలు బంకుల్లో, పేర్నమిట్ట, మర్రిచెట్లపాలెం పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశారు. వినియోగదారులకు అనుమానం వచ్చినప్పుడు అక్కడికక్కడే పెట్రోలు, డీజిల్ను పరీక్షలు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
మూడు ఎకరాల్లో పసుపు సాగు చేశాను. సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పసుపు తవ్వుతుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి కనబడటం లేదు. ధరలు కూడా సగానికి పడిపోయాయని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది పెట్టుబడులు కూడా వస్తాయో రావో అన్న అనుమానం కలుగుతుంది. పసుపు తవ్విన తర్వాత వండి, పాలిషింగ్ చేయడానికి అదనంగా రూ.50 వేల వరకు ఖర్చు వస్తుంది. – షేక్ అబ్దుల్ వహీద్, పసుపు రైతు, కంభం గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించుకున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి వారు అప్పుల పాలవుతున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి. – నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కంభం -
జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపిక
సంతనూతలపాడు: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జూనియర్ హాకీ బాల, బాలికల జట్ల ఎంపిక శనివారం సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్లను ఎంపిక చేశారు. సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్.నరసింహారావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుందరరామిరెడ్డి, పీడీ కే.వనజ, హాకీ అసోసియేషన్ సభ్యులు టి.రవికుమార్, పి.రవి, మాధవరావు, విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, డైట్ సీనియర్ లెక్చరర్ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాటలతో జనం మోసపోయారు
దర్శి: గత ఎన్నికల్లో చంద్రబాబు మోసపు మాటలు విని రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయనతో పాటు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. ముందుగా ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మళ్లీ జగన్ సీఎం అవడం ఖాయం: విద్యుత్ ప్రభపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది నెలల క్రితం తన గెలుపు కోసం కృషి చేసి ఎన్నికల్లో ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ అంటే ప్రతి ఒక్కరికీ గుండె నిండా ధైర్యం, మనస్సు నిండా ప్రేమ ఉందన్నారు. జగన్న పాలన ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేనా ఉందన్నారు. గత ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకోలేకపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఈ సారి ఎన్ని కూటములు ఎదురైనా జగనన్న సీఎం అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. జగనన్నకు అబద్ధం చెప్పడం చేతకాదన్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి సీఎం అయ్యి ప్రజలను మళ్లీ దారుణంగా మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని ఓట్లు అడిగేందుకు వెళ్తే చెప్పులు, చీపుర్లతో కొడతారని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మరొక వ్యక్తి నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని అన్నారని, ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రశ్నిస్తానన్న ఆయన ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గిట్టుబాటు ధరలు అందక రైతుల ఇక్కట్లు: జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. జగనన్న హయాంలో క్వింటా మిరప ధర రూ.30 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.10 వేలు కూడా లేదన్నారు. ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు రైతులను నిలువునా మోసగించారన్నారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పి యువతను దారుణంగా మోసం చేశారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, దొనకొండ మాజీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, నాయకులు కర్ణా భాస్కర్రెడ్డి, కుందురు నరశింహారెడ్డి, కేసరి ప్రసాద్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయలేదు మహిళలను మోసం చేస్తే చీపుర్లు, చెప్పులతో కొడతారు మరొక వ్యక్తి ఎన్నికల ముందు ప్రశ్నిస్తా అని కనిపించకుండా పోయాడు ధ్వజమెత్తిన దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
రూ.30 వేల బిల్లుకు రూ.20 వేల లంచం !
చీమకుర్తి: నెలకు రూ.15 వేల జీతం కోసం ఔట్సోర్సింగ్పై పనిచేసే వాచ్మెన్కు రెండు నెలల జీతం రూ.30 వేల బిల్లు చేయాలంటే తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. తానంత ఇచ్చుకోలేనని ఎంత వేడుకున్నా కనికరించకపోవడంతో చివరకు వాచ్మన్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్.శిరీషా, స్థానిక గిరిజన గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. చీమకుర్తి గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో వాచ్మెన్గా గురవయ్య ఏడు సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ మూడేళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల 23 నుంచి దాదాపు రెండు నెలలు పాటు వేసవి సెలవులు కావడంతో ఆ రెండు నెలలకు జీతం ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. బిల్లు చేస్తే తనకు వచ్చేదే రూ.30 వేలు...అలాంటిది రూ.20 వేలు ఇచ్చుకోలేనని ప్రిన్సిపాల్ను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపాల్ కనికరించకపోవడంతో చేసేది లేక గురవయ్య నేరుగా ఒంగోలులోని ఏసీబీ డీఎస్పీ కార్యాలయ సిబ్బందికి తన గోడు చెప్పుకున్నాడు. ఏసీబీ అధికారులు సూచించిన ప్రకారం శనివారం సాయంత్రం గురవయ్య తన వద్ద రూ.17,500 మాత్రమే ఉన్నాయని ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్కు ఇచ్చాడు. అదే సమయంలో డీఎస్పీ ఎస్.శిరీషా ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి అక్కడకు వచ్చి ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్సిపాల్ వద్ద ఉన్న రూ.17,500ను రెడ్హ్యాండెడ్గా స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపాల్ను రిమాండ్కు పంపించనున్నట్లు డీఎస్సీ శిరీషా తెలిపారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీహెచ్.శేషు, రమేష్బాబు, ఎస్సైలు జేబీఎన్ ప్రసాద్, మస్తాన్ షరీఫ్, వారి సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. నెలకు రూ.1.50 లక్షల జీతం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ కేవలం రూ.15 వేల జీతంతో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న వాచ్మన్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి చివరకు తన ఉద్యోగానికి ముప్పు తెచ్చుకున్నాడని పాఠశాల సిబ్బందే ఈసడించుకుంటున్నారు. ఔట్సోర్సింగ్ వాచ్మన్ జీతం బిల్లు చేసేందుకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కక్కుర్తి ఏసీబీకి పట్టుబడిన ప్రిన్సిపాల్ -
ప్రకాశించని పసుపు
కంభం: రాష్ట్రంలో పసుపు పంట ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో ప్రకాశం ఒకటి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో దీనిని పండిస్తున్నారు. కంభం, గిద్దలూరు, బేస్తవారి పేట, కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, సీఎస్పురం, దర్శి మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బోర్లపైనే ఆధారపడి రైతులు పసుపు వేశారు. పంట చేతికొస్తే అప్పులు తీరుతాయని గంపెడాశలు పెట్టుకున్నారు. పది రోజుల నుంచి పసుపు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దిగుబడి చూస్తుంటే సగానికి పైగా తగ్గిపోవడంతో రైతు కంటిమీద కునుకు కరువైంది. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో ఈ ఏడాది కూడా అప్పులపాలు కాక తప్పదని రైతన్నలు వాపోతున్నారు. ఎకరాకు పెట్టుబడి రూ.1.5 లక్షలు: పసుపు పంటకు పెట్టుబడి అధికంగా ఉంటుంది. విత్తనం పసుపు కొనుగోలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కలుపుతీయడం, నీటి పారుదలకు కలిపి సుమారు లక్ష రూపాయల వరకు వస్తుంది. పసుపు పంటను తవ్విన తర్వాత నూర్పిడికి, పాలిషింగ్కు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. మనుషులతో పసుపు తవ్వించడానికి ఎకరాకు రూ.15 వేల వరకు అవుతుండటంతో రైతులు పసుపును ట్రాక్టర్లతో దున్ని ఆ తర్వాత మహిళా కూలీలతో ఏరుకొని గ్రేడింగ్ చేసుకుంటున్నారు. కౌలు రైతులైతే ఎకరాకు కౌలు కింద రూ.20 నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుండటంతో వారికి పెట్టుబడి రూ.లక్షన్నర దాటుతుంది. తగ్గిన దిగుబడి ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఈ ఏడాది పసుపు పంటను బోర్లపైనే ఎక్కువగా ఆధారపడి రైతులు సాగు చేసుకున్నారు. పసుపు పంటకు నీరందించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పంటకు సరిపడా నీరందకపోవడం, తెగుళ్లు సోకడం తదితర కారణాలతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు దాదాపు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 20 నుంచి 25 క్వింటాళ్లకు పడిపోయిందని, దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగానికి పడిపోయిన ధరలు గతేడాది క్వింటా రూ.13 వేల వరకు పలికిన ఎండు పసుపు ప్రస్తుతం సగానికి పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎండు పసుపు క్వింటా ధర రూ.7– రూ.8 వేల వరకు ఉందని రైతులు చెబుతున్నారు. ఇటు దిగుబడులు రాక, అటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పండిన పంటను నిల్వ ఉంచుకొని అప్పులు పెంచుకోవడం ఎందుకులే అనుకొని రైతులు వచ్చిన ధరలకే దళారులకు అమ్మేస్తుండటంతో రైతుల కన్నా దళారులకు అధిక లాభాలు వస్తున్నాయి. ఆశలన్నీ అంతర పంటపైనే.. గతంలో పసుపులో అంతర పంటగా చెరకు సాగు చేసే వారు. ప్రస్తుతం అడవి పందుల బెడద అధికంగా ఉండటంతో చెరకు సాగు తగ్గిపోయింది. దాని స్థానంలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తున్నారు. పసుపు పంట చేతికొచ్చే మూడు నెలల ముందు రైతులు పసుపు సాళ్లలో అరటి పిలకలు వేస్తారు. పసుపు పంట తవ్వకాలు పూర్తయ్యే సరికి అరటి పంటకు 3 నెలల కాలం కలసి వస్తుంది. తద్వారా అరటి తోటలు త్వరగా కాపు వస్తుంది. కనీసం అరటి సాగన్నా కలిసొస్తుందో లేదో అని రైతులు ఎదురుచూస్తున్నారు. -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో
యర్రగొండపాలెం: మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట కొలుకుల గ్రామానికి చెందిన ప్రజలు శనివారం రాస్తారోకో చేశారు. ఈ నెల 19వ తేదీన మండలంలోని కొలుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న వెలివెల చంటి మోటారు బైక్పై పెద్దారవీడు మండలం కుంట వద్దకు వెళ్తున్నాడు. స్థానిక అనకుంట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఆయనతో పాటు ఆటోలో ప్రయాణం చేస్తున్న సూర్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతున్న చంటి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. చంటికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబానికి న్యాయం చేయాలని వారు పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులతో చర్చించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పి.చౌడయ్య చెప్పినా వారు సంతృప్తి చెందలేదు. మృతుడు చంటి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో గాయపడిన మండలంలోని అమానిగుడిపాడుకు చెందిన సూర్య సత్యనారాయణ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిసింది. -
నీటి రక్షణకు కృషి చేయాలి
● మంత్రి స్వామి సింగరాయకొండ: ప్రతిఒక్కరూ నీటి రక్షణకు కృషి చేయాలని, నీటి నిల్వలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కోరారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న రైతువారీ కుంటలకు శనివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్న మంత్రి స్వామి తొలుత కనుమళ్ల పంచాయతీ పెద్దకనుమళ్లలో రైతువారీ కుంటకు శంకుస్థాపన చేశారు. జల రక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సింగరాయకొండ నుంచి మురుగునీరు తమ గ్రామంలోని చెరువులో కలుస్తోందని, ఆ నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి, కలెక్టర్ను కోరారు. అనంతరం గురుకుల పాఠశాల వద్ద నూతనంగా రూ.24 వేలతో నిర్మించిన రైతువారీకుంటను వారు ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో బంధువుల కొట్లాట
తాళ్లూరు: స్థలం వివాదంలో బంధువుల మధ్య కొట్లాట జరగడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని శివరామపురంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పోటు వెంకటేశ్వర్లు, పోటు సీతయ్య అన్నదమ్ములు. వీరికి పక్క పక్కనే సొంత స్థలాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ స్థలాల్లో అన్నదమ్ములిద్దరూ మెరక తోలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. మధ్యలో బంధువులు కలగజేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంకటేశ్వర్లు బంధువు పోటు కోటయ్య తీవ్ర గాయాలతో ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం సీతయ్య కుమారుడు విజయవాడ నుంచి వచ్చి వెంకటేశ్వర్లు బంధువు పోటు వీరాంజనేయులుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బంధువులు ఆయన్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబాన్ని హతమార్చేందుకు యత్నం
అర్థవీడు (బేస్తవారిపేట): పాతకక్షల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి అర్థవీడు మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న గోదేసి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ సర్వీస్ తీగను నిందితులు తొలగించారు. ఆ తీగపైన ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ను కూడా తొలగించి ఇంటి వెనుక వైపున్న డోర్, బాత్ రూమ్ వద్ద తీగను పడేశారు. శనివారం తెల్లవారుజామున రాజేంద్రప్రసాద్ తల్లి నరసమ్మ బాత్రూంకు వెళ్లేందుకు తలుపు తీయగానే స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలి పెద్దగా కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తం కావడంతో అందరికీ ప్రమాదం తప్పింది. ఎవరో తమ కుటుంబాన్ని హతమార్చేందుకు విద్యుత్ తీగలు తెచ్చి పడేసినట్లు వారు గుర్తించారు. రెండేళ్ల క్రితం పొలంలో స్టార్టర్ పెట్టెకు విద్యుత్ సరఫరా చేసి తమను చంపేందుకు కుట్ర పన్నారని, ఆ సమయంలో అదృష్టవశాత్తూ స్టార్టర్పై గోతం తొలగించే సమయంలో స్వల్ప విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని వారు తెలిపారు .తొమ్మిది నెలల క్రితం ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచినట్లు బాధితులు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారని, వారే తమను చంపేందుకు శుక్రవారం అర్ధరాత్రి కూడా విద్యుత్ తీగల ద్వారా కుట్ర పన్నారని బాధితుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుదర్శన్యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పట్టపగలే మూడు గృహాల్లో చోరీ
పామూరు: మండల కేంద్రం పామూరు ఎన్జీఓ కాలనీ 5వ లైన్లో ఓ ఇంట్లో, నేతాజీనగర్ ఒకటో లైన్ సమీపంలోని ఒకే నివాస గృహంలో వెనుక, ముందు వైపు ఇళ్లలో శనివారం ఉదయం వరుస చోరీలు చోటుచేసుకున్నాయి. మండలంలోని దూబగుంట్ల మాజీ సర్పంచ్ మితికాల గురుస్వామి నేతాజీనగర్ 1వ లైను సమీపంలో నివాసం ఉంటున్నాడు. పనిపై గురుస్వామి నెల్లూరు వెళ్లగా అతని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల కోసం ఉదయం 9 గంటల తర్వాత ఆస్పత్రికి వెళ్లి 12 సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి ప్రధాన డోర్, బీరువా తాళాలు, కబోర్డ్లు పగులగొట్టి ఉన్నాయి. నగదు, వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. నగదు రూ.1.5 లక్షలు, 64 గ్రాముల నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. అదే ఇంట్లో బాడుగకు ఉంటున్న రమణారెడ్డి కుటుంబ సభ్యులు పనిపై బయటకు వెళ్లి 11.30 గంటల సమయంలో తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కబోర్డ్లో ఉన్న రూ.18 వేల నగదు మాయమైనట్లు చెప్పారు. సమీపంలోని ఎన్జీఓ కాలనీ 5వ లైన్లో నివాసం ఉంటున్న బి.కోటేశ్వరరావు, అతని భార్య ఉపాధ్యాయులు. ఇద్దరూ ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లారు. వారి పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోటేశ్వరరావు ఇంటికి వచ్చి చూసే సరికి గ్రిల్ తాళాలు, ప్రధాన డోర్, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని మొత్తం 12 గ్రాముల ఉంగరం, పాపటి బిళ్ల, ముక్కుపుడకలు రెండు, రూ.2 లక్షల నగుదు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీలపై గురుస్వామి, కోటేశ్వరరావు, రమణారెడ్డిలు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి సంఘటన స్థలాలను ఎస్సై టి.కిషోర్బాబు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించి వివరాలు సేకరిస్తున్నాయి. చోరీ సమయంలో ఓ కార్ ఆ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టపగలే చోరీలు జరగడంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రూ.3.68 లక్షల నగదు, 76 గ్రాముల బంగారం మాయం -
ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేదు
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వర్గీకరణపై బిల్లు చేయకుండా కేవలం ఆర్డినెన్స్ జారీ చేయటమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వైఎస్సార్ సీపీకి మొదటి నుంచి చిత్తశుద్ధి ఉందన్నారు. తాము ఎప్పుడూ ఒకేమాట మీద ఉన్నామన్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంటు ప్రకారం అందరికీ మేలు జరగాలన్న విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీలకు నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు, సంక్షేమ పథకాలు దామాషా ప్రకారం ఇచ్చామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టం చేశాం, ఒక కమిటీని వేశాం, ఈ విధంగా కమిటీ నివేదిక ఇచ్చిందని చట్టసభల్లో ప్రవేశపెట్టి చర్చకు అవకాశం ఇచ్చేవారన్నారు. ఒక చట్టసభలో మొదటగా బిల్లు ప్రవేశపెట్టడం, తరువాత దానిపై చర్చ జరపటం చివరగా బిల్లు పాస్ చేసి ఆమోదానికి గవర్నర్కు పంపడం ఇది పద్ధతి అని.. ఈ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఒక లైను స్టేట్మెంటు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో చట్టం చేయకుండా బిల్లు ప్రవేశపెట్టకుండా అసెంబ్లీ అయిపోయిన తరువాత గవర్నర్కు పంపించి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి తరువాత చేద్దామని చెప్పటమేంటని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు రిజర్వేషన్ విధానాన్ని, రోస్టర్ పాయింట్లును ప్రశ్నిస్తున్నారన్నారు. జిల్లా యూనిట్గానా, రాష్ట్రం యూనిట్గా తీసుకుంటారో చెప్పాల్సి ఉందని, మళ్లీ 2025–26 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ పద్ధతి మారుస్తామని చెబుతున్నారని డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన వెంట పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
ఆటో బోల్తాపడి మహిళా కూలీ మృతి●
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కనిగిరిరూరల్: ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పట్టణంలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన కూలీలు ఆటోలో పీసీపల్లి మండలం తలకొండపాడుకు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో మండలంలోని విజయగోపాలపురం మలుపు వద్ద చిల్లచెట్లు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇండ్లా లక్ష్మమ్మ (50) కిందపడటంతో తలకు బలమైన గాయమై.. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. రావూరి సంజమ్మ, వరమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో కనిగిరి వైద్యశాలకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా నలుగురు కూలీలకు స్వల్పగాయాలయ్యాయి. ఈమేరకు ఎస్సై టీ శ్రీరాం సంఘటనా స్థలానికి వెళ్లి సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
24 నుంచి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద ఉన్న జిల్లా స్థాయి మహిళా ప్రాంగణంలో ఈ నెల 24వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ వై.అంజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు మహిళలకు ఈ శిక్షణ ఇస్తారన్నారు. 15 నుంచి 45 సంవత్సరాల్లోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మేనేజర్ అంజమ్మ కోరారు. మరిన్ని వివరాలకు 8333921346 మొబైల్ నంబర్ను సంప్రదించాలన్నారు. వరిగడ్డి దగ్ధమై రూ.2 లక్షల ఆస్తి నష్టం దర్శి: వరిగడ్డి వామి దగ్ధమై రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన శుక్రవారం పట్టణంలోని పుట్ట బజారులో చోటు చేసుకుంది. బాధితురాలు మస్తాన్బీ తెలిపిన వివరాల మేరకు గేదెలు మేపుకునేందుకు 7 ఎకరాలకు పైగా వరిగడ్డి తీసుకొచ్చి వామి వేసుకున్నారు. శుక్రవారం వరి గడ్డి వామి నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు అదుపు చేసినా వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో టపాసుల శబ్దాలు వస్తున్నాయి. నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పొగాకు రైతుల దోపిడీకి కుట్ర
ఒంగోలు సిటీ: పొగాకు రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం మైసూరులో నేడు కేజీ పొగాకు రూ.360లకు కొనుగోలు చేస్తుంటే జిల్లాలో మాత్రం రూ.280 కి కొనుగోలు చేయడం దారుణమన్నారు. గత ఏడాది వచ్చిన ధరల ఆధారంగా ఈ సారి రైతులు ఖర్చులు ఎక్కువైనా పొగాకు సాగు చేశారన్నారు. కూలీ, కౌలు, బ్యారన్ రేట్లు భారీగా పెరిగాయని చెప్పారు. అయినా గత సంవత్సరం వచ్చిన సరాసరికి తగ్గించి కొనుగోలు చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు సాగు ఎక్కువైనందున ధరలు రావన్న ప్రచారం సాగుతోందని, దీనిని రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. పొగాకు కొనుగోలు సీజన్ ప్రారంభంలోనే దోపిడీ మొదలైందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయంగా పొగాకుకు మంచి డిమాండ్ ఉంది కనుకనే మైసూరులో అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్న విషయాన్ని జిల్లా రైతులు గుర్తుంచుకోవాలన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలుస్తోందన్నారు. గతంలో పొగాకు రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రైతుల నష్టపోకుండా ఉండేందుకు అప్పుడు సీఎంగా ఉన్న జగన్ మోహన్రెడ్డి రూ.200 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి అండగా నిలిచారన్నారు. ఫలితంగా ధరలు పుంజుకున్నాయని చెప్పారు. మార్క్ఫెడ్ కూడా లాభపడిందన్నారు. సిండికేట్ అయి దగా.. సిగరెట్ తయారీదారులు వ్యాపారస్తులను సిండికేట్గా చేసుకుని రైతులను దగా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న ధరలకు మరో రూ.10 నుంచి రూ.20 వరకూ తగ్గించి కొనుగోలు చేయాలన్న కుట్ర కూడా జరుగుతోందన్నారు. రూ.270 సరాసరి వస్తేనే అసలు దక్కుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నాటకలో కొనుగోళ్లు పూర్తి కాలేదని, బయ్యర్లు అందరూ అక్కడే ఉన్నారని, వారు వచ్చే వరకూ రైతులు వేచి చూడాలని సూచించారు. రూ.300పైన అయితేనే అమ్ముకోవాలన్నారు. ప్రభుత్వం కూడా రైతులను వంచిస్తే ఊరుకోమని, మా పార్టీ, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. మా పార్టీ ఎంపీలు రైతు సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రైతులకు తెలిపి అండగా నిలవాలని సూచించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిరప, కంది, పత్తి రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒక వైపు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతుంటే మరో పక్క పొగాకు మార్కెట్లో ధరలు దిగజారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, పంటలు కొనేనాథుడే కరువయ్యారని విమర్శించారు. సమావేశంలో ఒంగోలు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు మండల పార్టీల అధ్యక్షులు మన్నే శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారుల సిండికేట్కు కుయుక్తులు కర్నాటక మార్కెట్లో కేజీ రూ.360 జిల్లాలో కేజీ రూ.280కే కొనుగోలు అన్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు -
మృతదేహానికి పోస్ట్మార్టం
9 నెలల తర్వాత చీమకుర్తి: దాదాపు 9 నెలల క్రితం ఉరేసుకొని మృతి చెందిన పులివర్తి బాలసుబ్రహ్మణ్యం మృతదేహానికి శుక్రవారం రిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ సుబ్బారావు ఆధ్వర్యంలో చీమకుర్తిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడు బాలసుబ్రహ్మణ్యం భార్య గౌరీ పూర్ణ ఫిబ్రవరి 13వ తేదీన తన భర్త మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మరణం వెనుక మామ, మరిది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివర్తి బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది జూన్ 6వ తేదీన చీమకుర్తి పట్టణంలోని గాంధీనగర్లో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. అయితే తన భర్త మరణానికి కుటుంబ ఆస్తుల వివాదమే కారణమని భార్య అనుమానం వ్యక్తం చేశారు. దీంతో శ్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహానికి తహసీల్దార్ ఆర్.బ్రహ్మయ్య, ఎస్సై కృష్ణయ్య, మృతుడి భార్య, బంధువుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేగానీ గౌరీపూర్ణ అనుమానాలు నివృత్తి కావని పోలీసులు చెబుతున్నారు. భర్త మృతికి బంధువులే కారణమని భార్య అనుమానం పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో శవ పరీక్ష -
బాధితులకు భరోసా ఇవ్వాలి
దర్శి: సమస్యలు చెప్పుకొనేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరముందని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన దర్శితోపాటు ముండ్లమూరు, తాళ్లూరు పోలీస్స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ల ఆవరణలో పరిశుభ్రత, గదులు, రిసెప్షన్ కౌంటర్లు, మహిళా సహాయ కేంద్రాలతోపాటు దర్శిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. శాంతి భద్రతలు కాపాడటంతోపాటు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని, వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాత్రి వేళ గస్తీని ముమ్మరం చేయాలన్నారు. చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు శక్తి యాప్, సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాలు, సీసీ కెమేరాలు, హెల్మెట్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం స్థానిక సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎస్పీ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐ రామారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్సైలు మురళీ, నాగరాజు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచన దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి స్థల పరిశీలన -
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ●
● నలుగురికి తీవ్ర గాయాలు టంగుటూరు: రాంగ్ రూట్లో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన ఇట్టా ఆదర్శి కుటుంబ సభ్యులు వీరేంద్రబాబు, హాసిని, దీపిక, తన్మయి తేజ ఒంగోలు నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చే సరికి రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటో బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 ఆంబులెన్స్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య సింగరాయకొండ: గుర్తు తెలియని వ్యక్తి(40) విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరేసుకుని మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత కలికవాయకు వెళ్లే రోడ్డులో పాల ఫ్యాక్టరీ వెనుక వైపు చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కథనం ప్రకారం.. మృతుడి శరీరంపై తెలుపు గడులతో కూడిన నిండుచేతుల లేత నీలం రంగు చొక్కా, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసిన వారు 9121102135, 9121102136కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందకూరు ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ముస్లింల అభ్యున్నతికి కృషి
యర్రగొండపాలెం: రాజకీయాలకు అతీతంగా ముస్లింల అభ్యున్నతికి సహకరిస్తానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మాచర్ల రోడ్డులోని ముస్లిం షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేయడాన్ని ఆపేది లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ముస్లింలు తనకు ఎంతగానో సహకరించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించేదుకు కృషి చేస్తానని, ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో పయనిస్తూ పేదల పక్షాన పోరాడతానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ మసీదుల ముల్లాలు, పెద్దలు హిదయతుల్లా, మొహమ్మద్, ఎస్.మజీద్, ఎం.కరీముల్లా బేగ్, సయ్యద్ జబీవుల్లా, సయ్యద్ మగ్బూల్బాష, షేక్.ఉస్మాన్, సయ్యద్ షాబీర్బాష, షేక్.బుజ్జి, షేక్.కాశిం, షేక్.వలి, ఏఒన్ గ్లోబల్ అధినేత మొగల్ షంషీర్అలిబేగ్, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, మదర్ థెరిసా విద్యా సంస్థల అధినేత బి.వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కె.ఓబులరెడ్డి, కందూరి కాశీవిశ్వనాఽథ్, ఒ.సుబ్బారెడ్డి, ఎస్.ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, జి.వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఎల్లేష్ యాదవ్, చంద్రకాంత్ నాయక్, ఎ.ఆదినారాయణ, ఎం.ఆదిశేషు, సూరె శ్రీనివాస్, కె.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైపాలెంలోని షాదీ ఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరు -
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉత్సవ సేవా కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, మేకలవారిపల్లి రెడ్ల సంఘం పర్యవేక్షణలో 18వ పర్యాయం నిర్వహించిన ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు రైతులు, పశుపోషకులు భారీగా హాజరయ్యారు. హోరాహోరీగా ఎడ్ల పందేలు ఆరు పళ్ల సైజు ఎడ్ల బండలాగుడు పోటీల్లో మొత్తం 17 జతల ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రకాశం, గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన గిత్తలు బండ లాగుతుండగా ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు, కేరింతలతో ఉత్సాహపరిచారు. వ్యాఖ్యాత, రిఫరీగా వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి వ్యవహరించారు. ప్రజలకు సత్రాల్లో భోజన వసతి సమకూర్చారు. గరుడ వాహనంపై శ్రీవారుశుక్రవారం వెలుగొండ తిరునాళ్ల కావడంతో భక్తులు పోటెత్తారు. శ్రీవారు గరుడ వాహనంపై శ్రీరామమూర్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ప్రత్యేక పల్లకిపై ఊరేగించారు. భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉభయదాతలుగా కూనపల్లి శేషఫణిశర్మ, ప్రసాదశర్మ, దూర్జటిశర్మ, వీరబద్రశర్మ, శ్రీకాంతశర్మ, రామచంద్రపవన్కుమార్, శాంతమూర్తి, జానకీరామ్ దంపతులు వ్యవహరించారు. ఈఓ చెన్నకేశవరెడ్డి్, సేవా కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం మోహినీ ఉత్సవం, గజోత్సవం, తినునాళ్ల, పగలు ఎడ్ల పందేలు, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. -
ఏఎస్సై బాషాకు రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక సేవా పతకం
సింగరాయకొండ: రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక సేవాపతకం ఉగాది–2025 కు ఏఎస్సై షేక్ మహబూబ్బాషా ఎంపికయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మహబూబ్ బాషా మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర ప్రభుత్వ ఉత్తిష్ట సేవాపతకం, 70 నగదు అవార్డులు, 25 గుడ్ సర్వీస్ ఎంట్రీ, 5 ప్రశంస పత్రాలు అందుకున్నానని వివరించారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బీ మహేంద్రలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం ఒంగోలు మెట్రో: నరసం, కళా మిత్రమండలి, తెలుగు లోగిలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క కవి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని రచనలు చేయాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని సరైన దిశకు మళ్లించి దిశా నిర్దేశం చేసేలా కవిత్వం ఉండాలన్నారు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ సమాజ శ్రేయస్సునే కోరుకుంటుందని, అందుకే తామంతా సాహిత్య మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. కళా మిత్రమండలి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు సంచాలకత్వంలో కవి సమ్మేళనం నిర్వహించారు. పోతుల పెద వీరనారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, ఓరుగంటి ప్రసాద్, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మిడసల మల్లికార్జునరావు, బీరం అరుణ, బండారు సునీత, జి పద్మజ, యన్.నరసమ్మ, యు.వి.రత్నం, పిన్ని వెంకటేశ్వర్లు, నిమ్మల వెంకయ్య, గుండుపల్లి రాజేంద్రప్రసాద్, కేఎస్వీ ప్రసాద్, చుండూరి శ్రీనివాసరావు, హనుమంతరావు, అంగలకుర్తి ప్రసాద్, పాల్గొన్నారు. పౌష్టికాహారంతో మాతృమరణాల నివారణ ఒంగోలు సిటీ: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే మాతృమరణాలు నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారి చాంబర్లో ఇటీవల సంభవించిన మాతృ మరణాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏఎన్ఎంలు, సీహెచ్వోలు ప్రమాద సంకేతాలున్న గర్భిణులు, అనీమియా, అధిక రక్తపోటు, మధుమేహం, ఎపిలెప్సీ, ప్రసవ పూర్వ రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి వారికి సరైన సమయంలో వైద్య సేవలు అందించటం ద్వారా మాతృమరణాలు నివారించవచ్చన్నారు. జిల్లా పరిధిలో మాతృ మరణాలు సంభవిస్తే అందుకు కారకులైన సిబ్బంది పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ కర్త డాక్టర్ సూరిబాబు, ఐ.ఎం.ఎ, ఫోగ్సి ప్రతినిధులు డాక్టర్ జాలాది మణిబాబు, డాక్టర్ కమల, డాక్టర్ పి.పద్మజ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిని, డాక్టర్ అనంత కుమారి, డాక్టర్ చలపతి, డాక్టర్ శిరీష ప్రియదర్శిని, సుగుణమ్మ డీపీహెచ్ఎన్ఓ. డి.శ్రీనివాసులు, మాస్ మీడియాధికారి, అర్ధవీడు ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి డాక్టర్ జవహర్ కుమార్ పాల్గొన్నారు. -
రాయితీ రాదోయ్..!
మీరు రైతులు కాదోయ్..బేస్తవారిపేట: రైతు విశిష్ట గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలోని రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులందరూ తప్పనిసరిగా 14 అంకెల గుర్తింపు కార్డు తీసుకోవాలంటూ వ్యవసాయశాఖ అధికారులు గత కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్మర్ రిజిస్ట్రేషన్కు గడువు విధించారు. అయితే సొంత భూములున్న రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం కౌలు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 3,65,755 మంది కాగా పీఎం కిసాన్ పథకం నగదు జమ అవుతున్నవారి సంఖ్య 2,41,454. వీరిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతులు 2,29,565 కాగా పీఎం కిసాన్ పొందుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు 1,70,655 మంది మాత్రమే. జిల్లాలో 2024లో 33,041 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయగా ఈ ఏడాది 45 వేల మందికి కార్డులివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ కొత్త కార్డుల జారీ ప్రక్రియలో అడుగులు ముందుకు పడలేదు. రైతుల్లో ఆందోళన ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని గుర్తింపు కార్డు ఉంటేనే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణలో పరికరాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ సేద్యంపై రాయితీ, పంట రుణాలు, పెట్టుబడి సాయం లాంటి పథకాలు నేరుగా పొందేందుకు వీలు కలుగుతుంది. నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు లాంటి ఇతర సేవలు పొందవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియనుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులు, అసైన్మెంట్ భూమి, రిజర్వుడ్ ఫారెస్ట్ భూములు, ఇనామ్ భూముల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లో అవకాశం కల్పించకపోవడమే రైతులు ఆందోళనకు ప్రధాన కారణం. ఒక చోటే నమోదు.. ఆన్లైన్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఒకచోట మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక రైతు రెండు గ్రామ పంచాయతీల్లో గానీ, ఇతర మండలాల్లో గానీ భూములు కలిగి ఉంటే అలాంటి వారు ఒక్క చోటే నమోదు చేసుకోవాలి. గతంలో ఎన్ని చోట్ల భూములు ఉంటే అన్ని చోట్ల నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఒక చోట నమోదు చేసుకుని మరో చోటికి వెళ్తే ఇది వరకే రిజిస్ట్రేషన్ పూర్తయిందని చూపిస్తోంది. వలస బాటలో రైతులు అన్నదాతలకు ఖరీప్, రబీలో సాగు చేసిన పంటలు కలిసిరాలేదు. వాతావరణం అనుకూలించక, తెగుళ్లతో దిగుబడులు పడిపోయాయి. పెట్టుబడులు సైతం చేతికిరాక, పండిన అరకొర పంటలకు ధరల్లేక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. కుటుంబ పోషణ కోసం పిల్లాపాపలతో కలిసి చాలా మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో రైతులను తిప్పలు తెచ్చిన కూటమి ప్రభుత్వం కౌలు రైతులు, అసైన్డ్, ఆర్వోఎఫ్, ఇనామ్ భూముల రైతుల నమోదుకు కొర్రీ ఈ నెల 25తో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు రైతు విశిష్ట గుర్తింపు కార్డు ఉంటేనే పథకాలంటున్న సర్కారునాటికీ.. నేటికీ ఎంత తేడా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భూములున్న రైతులతో పాటు కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందజేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెబుతోంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మాత్రం కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కౌలు రైతులకు మొండిచెయ్యి చూపినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మెడికల్ షాపుల్లో విజిలెన్స్ దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలో విజిలెన్స్ దాడులతో మెడికల్ షాపు యజమానులు హడలెత్తిపోయారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, నిషేధిత మందులు విక్రయించడం లాంటి ఫిర్యాదులు రావడంతో ఈగల్ టీమ్, విజిలెన్స్ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, కంభం, టంగుటూరు మెడికల్ షాపుల్లో 10 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. మందుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించకపోవడం, వినియోగదారులకు బిల్లులు చెల్లించకపోవడం, అల్ప్రాజోలాం, కోడిన్ దగ్గు మందు, గర్భస్రావ ఔషధాలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయించడం తదితర కారణాలపై 10 మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశారు. ముందస్తు సమాచారంతో షాపుల మూసివేత... అయితే విజిలెన్స్ దాడులు జరగనున్నట్లు డ్రగ్ కంట్రోల్ కార్యాలయం నుంచి మెడికల్ షాపులకు ముందస్తు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో నగరంతో పాటుగా జిల్లాలోని అనేక మండలాల్లో మెడికల్ షాపులను మూసివేశారు. నెలవారీ ముడుపులకు అలవాటు పడిన డ్రగ్ కంట్రోల్ కార్యాలయ సిబ్బంది నిర్వాకంతో మెడికల్ యజమానులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో విజిలెన్స్ టీమ్ తనిఖీలు నామ మాత్రంగా జరిగినట్లయిందని ప్రచారం సాగుతోంది. డ్రగ్ కంట్రోల్ అధికారుల వివరణ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
పొన్నలూరు: చేపల వేటకి వెళ్లిన యువకుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు.. నూకతోటి నాగేశ్వరరావు, పోలమ్మ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు చిరంజీవి(18) పుట్టుకతోనే మూగ, చెవిటి కావడంతో చదువు మానేసి గ్రామంలో పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు తల్లికి సైగల ద్వారా చెప్పి గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న మాలోల్ల వాగు దగ్గరకు వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల విచారించింది. బంధువుల సాయంతో టార్చి లైట్ల వెలుగులో మాలోల్ల వాగు పరిసరాల్లో వెతికినా జాడ కనిపించలేదు. పక్కనే ఉన్న యర్రగుంట వాగులో వెతకగా చిరంజీవి విగతజీవిగా నీటిపై తేలియాడుతూ కనిపించాడు. అప్పటికే చీకటి పడి పొద్దుపోవడంతో మృతదేహాన్ని వెలికితీయలేదు. గురువారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై అనూక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్ట్మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. వల ఒకచోట... మృతదేహాం మరో చోట చిరంజీవి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టడానికి వేసిన వల, అతని చెప్పులు, దుస్తులు మాల్లోల వాగు వద్ద ఉండగా.. చిరంజీవి మృతదేహాం మాత్రం ఈ వాగుకు సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న యర్రగుంట వాగులో బయటపడటం అనుమానాలకు కారణమైంది. చిరంజీవి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించాడా.. లేక చంపి పడేశారా? అనే చర్చ నడుస్తోంది. దివ్యాంగుడైన చిరంజీవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. వాగులో తవ్విన గుంతలో పడి యువకుడు మృతి పొన్నలూరు మండలం చెన్నిపాడులో సంఘటన -
మద్యానికి బానిసలై.. అన్నదాతలను క్షోభ పెట్టి..
సింగరాయకొండ: మద్యం వ్యసనానికి బానిసలై, డబ్బు కోసం దొంగలుగా మారి పొలాల్లో డీజిల్ ఇంజన్లు, సోలార్ ప్లేట్లు చోరీ చేస్తున్న దొంగలు ముగ్గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి రూ.85 వేల నగదు, డిజిల్ ఇంజన్ను స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ హజరత్తయ్య వెల్లడించారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామానికి చెందిన గౌతుకట్ల అశోక్, పొన్నూరి రాంబాబు, పాటిబండ్ల శ్రీకాంత్ మద్యానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో డబ్బు కోసం టంగుటూరు, సంతనూతలపాడు మండలాల పరిధిలోని పొలాల్లో చోరీలకు పాల్పడేవారు. గత ఏడాది ఫిబ్రవరిలో కందులూరు, ఎర్రజర్ల గ్రామాల మధ్య పొలాల్లో పైడి శ్రీను అనే రైతుకు చెందిన 20 సోలార్ ప్లేట్లు, ఈ ఏడాది మార్చి మొదటి వారంలో టంగుటూరు మండలం మల్లవరప్పాడులోని పెద్దచెరువు దక్షిణం వైపు కట్ట మీద ఉన్న నాగినేని రంగారావుకు చెందిన డీజిల్ ఇంజన్, అలాగే 10 రోజుల క్రితం సంతనూతలపాడు నుంచి మైనంపాడు వెళ్లే రోడ్డులో ఉన్న పొలాల్లో 15 సోలార్ ప్లేట్లు చోరీ చేసినటులపోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. గురువారం తనిఖీలు నిర్వహించే సమయంలో అనుమానాస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ చెప్పారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది డి శ్రీనివాసరావు, ఎస్ వెంకటరావు, మహేష్, ఖాదర్వలి, నాగార్జునను సీఐ అభినందించారు. డీజిల్ ఇంజన్లు, సోలార్ ప్లేట్ల దొంగలు ముగ్గురికి సంకెళ్లు నిందితుల వివరాలు వెల్లడించిన సింగరాయకొండ సీఐ -
వైఎస్ జగన్ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు అన్నా, జంకె
మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన నియోజకవర్గ నాయకులను వైఎస్ జగన్కు పరిచయం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు నేతలు తెలిపారు. మార్కాపురం టౌన్, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల నాయకులు పాల్గొన్నారు. -
రైతుకి గిట్టదు!
బోర్డుకి పట్టదు..నాలుగేళ్లుగా లాభాలు చవిచూసిన పొగాకు రైతు నేడు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన దిగుబడులతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వేలం కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పెరిగిన ఖర్చులతో ప్రస్తుతం వేలం కేంద్రాల్లో నమోదవుతున్న ధరలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగు సమయంలో అటు బోర్డు అధికారులు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి నేడు జిల్లాలో పొగాకు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
అప్పుల పాలు కావాల్సిందే
19 ఎకరాల సొంత పొలం, 35 ఎకరాల కౌలుకు తీసుకున్న పొలంలో పొగాకు సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం మల్లె తెగులు కారణంగా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సాగు ఖర్చులు కూడా గత సంవత్సరం ఎకరాకు రూ.1.50 లక్షలు అయితే ఈ సంవత్సరం రూ.2 లక్షలు అయింది. ఈ సంవత్సరం కేజీ ధర 400 రూపాయలు ఉంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. ఆశించిన ధర లేకపోతే అప్పుల పాలు కావాల్సిందే. – తాటికొండ రామచంద్రరావు, పొగాకు రైతు, పచ్చవ తగ్గిన దిగుబడి నేను 11 ఎకరాల్లో పొగాకు సాగుచేస్తున్నా. గత సంవత్సరం ఎకరాకు 1.50 లక్షల రూపాయలు ఖర్చయితే.. ఈ సంవత్సరం 2 లక్షలు ఖర్చయింది. ప్రతి సంవత్సరం ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ సంవత్సరం కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కిలో ధర రూ.400 ఉండాలి. లేకపోతే నష్టాలు చవిచూడాల్సిందే. – పాలడుగు జగదీష్, పొగాకు రైతు, చిర్రికూరపాడు -
సామాజిక పింఛన్లు ఇంకా పీకేద్దాం!
ఒంగోలు జీజీహెచ్లో సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చి వేచి ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా అర్హులైన ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదు. కానీ ఎక్కడికక్కడ వడపోత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పింఛన్లు పీకేయడమే లక్ష్యంగా సదరం సర్టిఫికెట్లు, ఆరోగ్య పరిస్థితి తనిఖీ పేరుతో క్యాంపులు నిర్వహించడంపై దుమారం రేగుతోంది. పింఛను సొమ్ము పెంచామని గొప్పలు చెబుతూనే.. వెరిఫికేషన్ పేరుతో ఆర్థిక ఆసరాను నిలిపివేస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్త పెన్షన్లు ఇవ్వకపొగా ఉన్న వాటినీ ఎత్తేస్తున్నారని పలువురు లబ్ధిదారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా పింఛన్లను పరిశీలించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. సాకులు చూపుతూ కత్తెర వేస్తుండటం గమనార్హం. వెరిఫికేషన్కు రావాలని సరైన సమాచారం ఇవ్వకుండానే, క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లుగా నమోదు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని చక్కదిద్దుకునేందుకు అవకాశం కల్పించకపోగా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకోవడం లేదని పింఛను లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లకే పింఛను పేరుతో కూటమి వంచన కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సీఎం చంద్రబాబునాయుడు ఈ హామీపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 50 ఏళ్లు నిండిన వారు సుమారు లక్ష మంది వరకు పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ, డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అడ్డగోలుగా పింఛన్ల నిలిపివేత ఒక్క ఫిబ్రవరి నెలలోనే సీకేడీ(క్రానిక్ కిడ్నీ డిసీజ్) పింఛన్లు 415 నిలిపివేశారు. చిరునామాలు లేవని, వెరిఫికేషన్కు రాలేదని కారణంగా చూపారు. వాస్తవానికి సీకేడీ పింఛనుదారులు మంచానికే పరిమతమయ్యారా లేదా అని పరిశీలించి, వేలిముద్రలు, ఫొటోలతో సహా యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు ఉన్నా అటువంటివి ఏమీ చేయకుండానే పింఛను నిలిపివేయడం పాలకుల తీరుకు అద్దం పడుతోంది. అదే విధంగా రూ.15 వేలు పింఛను పొందుతున్న పక్షవాతం బాధితులు, మరొకరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోలేని వారి పింఛన్లను కుడా పరిశీలన పేరుతో పీకేశారు. దివ్యాంగులకు జెల్ల కొట్టేందుకు స్కెచ్ దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు జిల్లాలోని 33184 మంది దివ్యాంగుల సర్టిఫికెట్లను తనిఖీ చేస్తున్నారు. అంగవైకల్యంతో బాధపడుతూ రూ.6 వేలు పెన్షన్ తీసుకుంటున్న వారి వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. దీనికిగాను చీమకుర్తి, కొండపి, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నియమించిన వైద్యులు కాకుండా ఇతర వైద్యులతో ధ్రువపత్రాల పరిశీలన చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు జీజీహెచ్లో ఇతర విభాగాలకు చెందిన వైద్యులు కూడా దివ్యాంగులను పరిశీలించి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. కొత్త పింఛన్లు గగనమే.. జనవరి నుంచి నూతన పింఛన్లు అందిస్తామని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ఏడాది నవంబర్లో ప్రకటించారు. జనవరి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి నూతన పింఛన్లు పంపిణీ చేస్తామని అర్భాటం చేశారు. ప్రస్తుతం మార్చి నెల ముగుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రారంభించలేదు. గతంలోనే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న ఒక్కరికీ పింఛను మంజూరు చేయలేదు. వెరిఫికేషన్ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తుండటంతో అర్హులందరూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరిలో జిల్లాలో 17 రకాల పింఛనుదారులు మొత్తం 2,85438 మంది ఉండగా.. మార్చి నెలలో ఆ సంఖ్య 2,83854కు పడిపోయింది. అంటే 1584 మందిని పింఛను జాబితా నుంచి తొలగించారు. సదరం వెరిఫికేషన్ మరో పది రోజులపాటూ కొనసాగనుందని సమాచారం. పెన్షన్ల తనిఖీ వెనుక ఏరివేతలే లక్ష్యం ఇప్పుడు దివ్యాంగుల వంతు.. సదరం వెరిఫికేషన్ క్యాంపుల్లో పడిగాపులు నూతన పెన్షన్ల మంజూరుపై 10 నెలలుగా దాటవేత ధోరణి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని వంచన ‘వెఎస్సార్ సీపీ హయాంలో వారికి పింఛన్లు మంజూరయ్యాయి. అంటే వారంతా ఆ పార్టీ సానుభూతిపరులే. పింఛన్లు పీకేస్తే అంతా దారికొస్తారు. అర్హత ఉన్నా సరే అనర్హత వేటు వేస్తే సరి. కొత్త పింఛన్ల సంగతి తర్వాత చూద్దాం’ కూటమి ప్రభుత్వ పాలకుల తీరు అచ్చు ఇలాగే ఉంది. సామాజిక పింఛన్ల తనిఖీ పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు ఆర్థిక భరోసా కోల్పోతున్నారు. పింఛన్లు తొలగించడం సరికాదు తనిఖీ పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు. సదరం వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఎటువంటి కారణం చూపకుండా పింఛన్లు ఆపేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా గమనిస్తున్నాం. అవసరమైతే జిల్లాలో దివ్యాంగులతో కలిసి ఉద్యమం చేపడతాం. – దొంతిరెడ్డి గోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు -
అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం!
గిద్దలూరు రూరల్: ఆ కుటుంబానికి పేదరికం శాపంగా మారింది. ఇంటి యజమాని చనిపోతే అంత్యక్రియలు చేయలేని స్థితిలో వారిని నిలబెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో నివాసం ఉంటున్న పానుగంటి దానియేలు(48)కు కాలేయ సంబంధిత వ్యాధితో గురువారం మృతి చెందాడు. వృత్తిరీత్యా పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే దానియేలు మృతి చెందడంతో భార్య సౌదమ్మ దీనంగా రోదిస్తోంది. భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్ద భర్త శవాన్ని పెట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కుమారుడు, కుమార్తె చిన్న పిల్లలు కావడం, భర్త అర్ధంతరంగా మృతి చెందడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటోంది. ‘గేట్’లో అంకిరెడ్డిపల్లె విద్యార్థికి ఆలిండియా 272వ ర్యాంకు గిద్దలూరు రూరల్: గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో మండలంలోని అంకిరెడ్డిపల్లెకు చెందిన షేక్.మహమ్మద్ జాతీయ స్థాయిలో 272వ ర్యాంక్ సాధించాడు. గుంటూరు ఏఎన్యూలో 90 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసిన మహమ్మద్ ఫిబ్రవరి 2న హైదరాబాద్లో ‘గేట్’ రాయగా గురువారం ఫలితాలు వెల్లడయ్యాయి. మహమ్మద్తోపాటు అతడి తండ్రి షేక్ పీరావలిని గ్రామస్తులు అభినందించారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం సింగరాయకొండ: పాకల బీచ్లో బుధవారం గల్లంతైన చాట్రగడ్డ సిసింద్రీ(27) మృతదేహం కొత్తపట్నం మండలం మడనూరు సముద్ర తీరంలో లభ్యమైనట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. సిసింద్రీ టంగుటూరు మండలం ఎం.నిడమానూరు ఎస్సీ కాలనీలో నివసిస్తుంటాడు. తన బంధువులైన యువకులతో కలిసి బుధవారం పాకలలో సముద్ర స్నానానికి వచ్చి గల్లంతైన విషయం తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జిల్లాకు రూ.10 వేల కోట్లు కేటాయించండి
ఒంగోలు సిటీ: వెనుకబడిన జిల్లాగా గుర్తించబడిన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి పది వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ మేరకు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జీ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాట్లాడుతూ దశాబ్దకాలం అనేక ఉద్యమాలు, జైలుశిక్షల ఫలితంగా వెనుకబడిన జిల్లాగా కేంద్రం ప్రకటించినప్పటికీ జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపే దిశగా నిధులు కేటాయించలేదన్నారు. పాలకవర్గాలు సైతం జిల్లా అభివృద్ధిని విస్మరించారని పలువురు వక్తలు దుయ్యబట్టారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే నిధులు కేటాయించాలని, దామాషా ప్రకారం నిధులు రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో గ్రానైట్, ఆక్వా, పొగాకు వంటి వనరుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం జమవుతుందన్నారు. జిల్లా ప్రజానీకానికి చెందిన ఈ సంపదలో జిల్లా వాటాగా రూ.10 వేల కోట్లు ఒకే విడత అందిస్తే వెలిగొండ, సంగమేశ్వరం, పాలేటిపాడు, గుండ్లకమ్మ వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని అన్నారు. దీంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అన్నిరకాలుగా ప్రగతి సాధిస్తుందన్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన ప్రకాశం జిల్లా బీపీ, షుగర్ వంటి వ్యాధుల్లో మాత్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కరువై మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలు వ్యాధుల బారిన పడటమే అందుకు కారణమని విశ్లేషించారు. సాగునీటి వనరులు లేక వ్యవసాయం అభివృద్ధి చెందక ఉపాధి అవకాశాలు కరువై ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ రూ.లక్ష కోట్ల అప్పులతో రూపొందించటం ప్రజలను అప్పుల్లోకి నెట్టే చర్యగా విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రం రూ.46 వేల కోట్ల అప్పు చేయడం ప్రజలకు మరో భారంగా పరిణమిస్తోందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.లక్ష కోట్ల గ్రాంట్ కోసం ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సీపీఎం నిర్వహంచిన ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు చైతన్యవంతులై ఉద్యమం చేపడతారని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం సీనియర్ నాయకుడు పెంట్యాల హనుమంతరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.వెంకటరావు, కేజీ మస్తాన్, కంకణాల రమాదేవి, పెంట్యాల కల్పన, జుజ్జూరు జయంతిబాబు, కాలం సుబ్బారావు, వి.బాలకోటయ్య, బంకా సుబ్బారావు, వెల్లంపల్లి ఆంజనేయులు, టంగుటూరు రాము, ఉబ్బ ఆదిలక్ష్మి, పల్లాపల్లి ఆంజనేయులు, కిలారి పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్, ఎస్.స్వామిరెడ్డి, నెరుసుల వెంకటేశ్వర్లు, వి.మోజస్, తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కేఎఫ్ బాబు, ఎస్డీ హుస్సేన్, కంకణాల వెంకటేశ్వర్లు, ఎస్కే అమీర్, ఉబ్బ వెంకటేశ్వర్లు, దామా శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజా సమస్యలు పరిష్కరించండి సీపీఎం ధర్నాలో పలువురు వక్తలు -
కన్నవారికి కడుపుకోత
కురిచేడు: అన్నదమ్ముల ఈత సరదా వారి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. ఈత కొట్టేందుకు చెరువులో దిగి లోతైన గుంతలో చిక్కుకుని నీటిలో మునిగి ఇద్దరు సోదరులు మృతిచెందారు. ఈ సంఘటన కురిచేడు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కురిచేడులోని పడమరహరిజనవాడకు చెందిన బత్తుల నరసింహారావు, కల్పన దంపతుల కుమారులు బత్తుల అభి (10), బత్తుల పాల్ (8) మధ్యాహ్న సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు హరిజనవాడ పక్కనే ఉన్న చిన్నచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే, అక్కడ లోతైన గుంత ఉండటంతో నీటిలో మునిగి మృతిచెందారు. మరో బాలుడు మాలపోలు నాని భయపడి ఇంటికొచ్చి పెద్దలకు చెప్పడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి అభి, పాల్ మృతదేహాలను బయటకు తీశారు. తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. అన్న కోసం తమ్ముడు దూకి... ఉదయం పాఠశాలకు వెళ్లి ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నానికి ఇంటికొచ్చిన అభి, పాల్ పుస్తకాలు ఇంట్లో పెట్టి బహిర్భూమికని చెప్పి పక్కనే ఉన్న చిన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా అభి ఈత కొడదామంటూ తమ్ముడికి చెప్పి చెరువులో దూకాడు. కానీ, ఎంతసేపటికీ బయటకు రాలేదు. దాంతో భయపడిన పాల్ పరిగెత్తుకుంటూ హరిజనవాడ వచ్చి అతని స్నేహితుడు మాలపోలు నానికి జరిగిన విషయం చెప్పి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. నాని చూస్తుండగానే పాల్ కూడా తన అన్న కోసం చెరువులో దూకాడు. ఇద్దరూ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో నాని ఇంటికొచ్చి అభి, పాల్ కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సాయంతో గాలించగా, చెరువులోని లోతైన గుంతలో చిన్నారులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిని బయటకు తీసి ఇంటికి తరలించారు. తల్లిదండ్రులకు వీరిద్దరే సంతానం కాగా, తండ్రి నరసింహారావు బేల్దారి పనులు చేస్తుంటాడు. తల్లి కల్పన పొలం పనులకు వెళ్తుంటుంది. కూలీనాలీ చేసుకుని బిడ్డలను పాఠశాలకు పంపి చదివిస్తున్నారు. బత్తుల అభి 4వ తరగతి, పాల్ 3వ తరగతి చదువుతున్నారు. పెరిగిపెద్దయ్యాక తమకు అండగా ఉంటారనుకున్న పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకుని కంటతడి పెట్టారు. పడమర హరిజనవాడ మొత్తం విషాదం అలముకుంది. చెరువులో ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, బంధువులు -
గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలి
● రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఒంగోలు సిటీ: ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి రిజిస్టర్ చేసి సకాలంలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు, ప్రోగ్రాం అధికారులకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. స్కూల్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి వేసవిలో వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాలని సూచించారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త, సీహెచ్ఓ రక్తహీనతతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందిస్తే మాతృమరణాలు నివారించవచ్చని తెలిపారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలు బరువు తక్కువగా ఉంటే గుర్తించి న్యూట్రీషన్ రీహాబిలిటేషన్ సెంటర్కు రిఫర్ చేసి శిశుమరణాలు నివారించాలని ఆదేశించారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలు సకాలంలో వేసి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు రాష్ట్ర బాల సురక్ష కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఓఆర్ఎస్ ద్రవం తయారు చేసుకోవడం గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఽఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డాక్టర్ పి.పద్మజ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ హేమంత్, చల్లా ప్రభాకర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి
● జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు మద్దిపాడు: మండలంలోని అన్ని పంచాయతీల పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అఽధికారి (డీపీఓ) జి.వెంకట నాయుడు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఇనమనమెళ్లూరు పంచాయతీని గురువారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ఇంటి పన్నుల వసూళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. పంచాయతీలో ఇంకా వసూలు కావాల్సి ఉన్న 2.78 లక్షల రూపాయల పన్నులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఉదయం, సాయంత్రం, సెలవు దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండి నూరుశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని చెప్పారు. వారంలో మూడు రోజుల పాటు ఐవీఆర్ సర్వే జరుగుతుందని, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉండేందుకు ప్రతిరోజూ గ్రామాల్లో చెత్త సేకరణ జరగాలని సూచించారు. పీఆర్ఒన్ యాప్లో టాస్క్లను వెంటనే పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఈఓపీఆర్డీ రఘుబాబుతో డీపీఓ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో హౌస్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్లను నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
పొన్నలూరు: చేపల వేటకి వెళ్లిన యువకుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు.. నూకతోటి నాగేశ్వరరావు, పోలమ్మ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు చిరంజీవి(18) పుట్టుకతోనే మూగ, చెవిటి కావడంతో చదువు మానేసి గ్రామంలో పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు తల్లికి సైగల ద్వారా చెప్పి గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న మాలోల్ల వాగు దగ్గరకు వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల విచారించింది. బంధువుల సాయంతో టార్చి లైట్ల వెలుగులో మాలోల్ల వాగు పరిసరాల్లో వెతికినా జాడ కనిపించలేదు. పక్కనే ఉన్న యర్రగుంట వాగులో వెతకగా చిరంజీవి విగతజీవిగా నీటిపై తేలియాడుతూ కనిపించాడు. అప్పటికే చీకటి పడి పొద్దుపోవడంతో మృతదేహాన్ని వెలికితీయలేదు. గురువారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై అనూక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్ట్మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. వల ఒకచోట... మృతదేహాం మరో చోట చిరంజీవి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టడానికి వేసిన వల, అతని చెప్పులు, దుస్తులు మాల్లోల వాగు వద్ద ఉండగా.. చిరంజీవి మృతదేహాం మాత్రం ఈ వాగుకు సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న యర్రగుంట వాగులో బయటపడటం అనుమానాలకు కారణమైంది. చిరంజీవి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించాడా.. లేక చంపి పడేశారా? అనే చర్చ నడుస్తోంది. దివ్యాంగుడైన చిరంజీవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. వాగులో తవ్విన గుంతలో పడి యువకుడు మృతి పొన్నలూరు మండలం చెన్నిపాడులో సంఘటన -
పాకల బీచ్లో యువకుడు గల్లంతు?
● మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు సింగరాయకొండ: పాకల బీచ్లో బుధవారం ఓ యువకుడు తప్పిపోయిన సంఘటన మిస్టరీగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. టంగుటూరు మండలం ఎం.నిడమానూరు గ్రామానికి చెందిన సిసింద్రీ(27), అతని బంధువులు హర్ష, దినేష్ పాకల బీచ్కు వచ్చారు. వీరు ముగ్గురూ బీచ్లో పూటుగా మద్యం తాగారు. బీచ్ ఒడ్డున సిసింద్రీ వేసుకున్న దుస్తులు ఉన్నాయి తప్ప అతని చెప్పులు కనపడలేదు. మద్యం మత్తులో ఉన్న హర్ష, దినేష్ ఒక్కోసారి ఒక్కోమాట చెబుతున్నారు. ముగ్గురమే వచ్చామని ఒకసారి, ఆరుగురం కలిసి వచ్చామని మరో చెబుతుండటంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. వీరికి మద్యం మత్తు దిగితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. సిసింద్రీ సముద్ర స్నానం చేస్తూ కొట్టుకుపోయాడా లేక మరెవరితోనైనా వెళ్లాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది. కాగా సిసింద్రీ తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. సిసింద్రీ బేల్దారి పని చేస్తుంటాడని, అతని బంధువులు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉన్నారని ఎస్సై చెప్పారు. తాళ్లూరులో పొగాకు బ్యారన్ దగ్ధం ● రూ.8 లక్షలు ఆస్తి నష్టం తాళ్లూరు: ప్రమాదవశాత్తు పొగాకు బ్యారన్ దగ్ధమైన సంఘటన తాళ్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఇడమకంటి నాగిరెడ్డికి చెందిన బ్యారన్లో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దాదాపు 1200 పొగాకు కర్రలు కాలిపోవడంతో రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేశారు. -
బాలల భద్రత, సంరక్షణకు విఘాతం కలిగించొద్దు
● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఒంగోలు సిటీ: కొంతమంది ఉపాధ్యాయులు బాలల భద్రత, బాలల సంరక్షణకు విఘాతం కలిగించటం, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడడం విచారకరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం అన్నారు. కనిగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి పాఠశాలలో సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖతో పాటు పోలీసు, ఐసీడీఎస్, డీసీపీయూ కలిసి దర్యాప్తు చేపట్టి ఇంకా ఎంతమంది బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడనే విషయాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక ను రెండు రోజుల్లోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు తగిన కౌన్సిలింగ్, తల్లిదండ్రులతో ఉపాధ్యాయులకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జిల్లాలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశిస్తూ, పోలీస్, ఐసీడీఎస్ సమన్వయంతో డీసీపీయూ ద్వారా పిల్లలకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశించారు. -
శేష వాహనంపై శ్రీవారు
కొనకనమిట్ల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల జయజయ ధ్వానాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీవారికి రోజుకొక అవతారంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారు పల్లకిలో అలంకరించిన శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీవారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో వెలుగొండ పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవ ఉభయదాతలుగా మారెళ్ల నాగ వెంకట దిలీప్కుమార్, తిరుపతిరావు, వెంకట సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గురువారం శ్రీవారు హనుమంత వాహనంపై శ్రీవారి ఉత్సవం జరుగుతుందని ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు. -
కేసుల్లో సమగ్ర విచారణ చేయాలి
● ఎస్పీ దామోదర్ ఒంగోలు సిటీ: కేసుల్లో సమగ్ర విచారణ చేసి త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో నమోదైన నకిలీ డాక్యుమెంట్స్, స్టాంపులు, భూ అక్రమ, ఫోర్జరీకి సంబంధించిన 109 కేసులపై ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ఆయా కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, పురోగతి, నిందితుల అరెస్టు, చార్జిషీటు దాఖలు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి, కేసుల సంబంధిత డాక్యుమెంట్స్, సీడీ ఫైల్స్ పలిశీలించారు. కేసుల సత్వర పరిష్కారానికి సూచనలిచ్చారు. ఒకే ప్రాంతానికి చెందిన పలు కేసులను ఇతర పోలీస్ అధికారులకు కేటాయించారు. ఈ కేసుల్లో నకిలీ పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని సిట్ అధికారులకు సూచించారు. నకిలీ డాక్యుమెంట్స్ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆధారాలతో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు, రిజిస్ట్రార్ వారి సహకారం, సమన్వయంతో దర్యాప్తు చేయాలని, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, భూములపై రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర పత్రాలను సంబంధిత శాఖల ద్వారా వెరిఫై చేసి వాటికి సంబంధించిన వాస్తవ యజమానులు, డాక్యుమెంట్లను గుర్తించాలన్నారు. ఈ కేసుల్లో దర్యాప్తు మరింత వేగవంతం చేసి నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయాలని, పూర్తయిన కేసుల్లో చార్జిషీట్లు ఫైల్ చేసి కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, సిట్ టీం సీఐలు పాల్గొన్నారు. -
అన్ని కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండో విడత పొగాకు వేలం బుధవారం ప్రారంభమైంది. రెండు జిల్లాల్లో కలిపి రెండో విడత 7 వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలోని ఒంగోలు–2 వేలం కేంద్రంతో పాటు వెల్లంపల్లి, టంగుటూరు, కనిగిరి వేలం కేంద్రాల్లో, నెల్లూరు జిల్లాలోని కందుకూరు–2తో పాటు కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో కూడా వేలం నిర్వహించారు. రెండో విడత నిర్వహించిన వేలం కేంద్రాల్లో రైతులు ఆనవాయితీగా ఒక్కో వేలం కేంద్రానికి కేటాయించిన గ్రామాల నుంచి లక్కీ నంబరు 9 వచ్చేలా ఒక్కో రైతు 18 పొగాకు బేళ్లు ట్రాక్టర్లలో వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. తొలిరోజు 1420 బేళ్లు రాగా 15 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. మొత్తం 24 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. రెండు జిల్లాల్లో కలిపి నిర్వహించిన వేలంలో కేజీ పొగాకు అత్యధికంగా రూ.280 పలికింది. అత్యల్పంగా రూ.260కి పడిపోయింది. నిన్నటి వరకు అత్యల్ప ధర రూ.270, రూ.278 వరకు ధర ఒక్కసారిగా రూ.260కి పడిపోయింది.ఈ సంవత్సరం పొగాకు సీజన్ పూర్తవగానే తొలివిడతగా ఈ నెల 10వ తేదీ ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు–1 వేలం కేంద్రంతో పాటు కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు–1 వేలం కేంద్రంలో కూడా ప్రారంభమైంది. రెండో విడత వేలాన్ని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ బ్రహ్మయ్య కూడా ఉన్నారు. వేలం తీరును వ్యాపారులతో కలిసి పరిశీలించారు. ఆయనతో పాటు ఒంగోలు పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు, వేలం కేంద్రం నిర్వహణాధికారి జే.తులసితో పాటు పొగాకు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 7 వేలం కేంద్రాల్లో ప్రారంభం కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్పం రూ.260 ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ -
పోలింగ్ బూత్లు, ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి
● డీఆర్వో చిన ఓబులేసు ఒంగోలు సిటీ: పోలింగ్ బూత్లు, ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని డీఆర్వో చిన ఓబులేసు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో మంగళవారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తామని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు సరిగ్గా ఉన్నదీ, లేనిది గుర్తిస్తామని, పోలింగ్ బూత్కు 1400 ఓట్లు దాటితే వేరే కొత్త పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తామన్నారు. పొలిటికల్ పార్టీలు బీఎల్ఏలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. చనిపోయిన వారి ఓట్లు తెలపాలని, వారి ఓట్లు తొలగించటానికి ప్రజల సహకరించాలని కోరారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధనరెడ్డి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, వెంకట శివ రామిరెడ్డి, జాన్సన్, ఎ.కుమార్, వరకుమార్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, వెంకటరావు, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, వేష పోగు సుదర్శన్, వెంకటస్వామి, రమేష్, తహశీల్దార్లు, ఎన్నికల అధికార్లు రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర,పాల్గొన్నారు. -
కాలేజీ బస్సు దగ్ధం
పొన్నలూరు: పార్కింగ్లో ఉన్న కళాశాల బస్సులో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ సంఘటన పొన్నలూరు మండలంలోని చెరువుకొమ్ముపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెరువుకొమ్ముపాలెం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థులను కందుకూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ బస్సులో పొన్నలూరు జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బస్సు విద్యార్థులతో సహా చెరువుకొమ్ముపాలెం చేరుకుంది. విద్యార్థులు దిగిపోయిన తర్వాత డ్రైవర్ పాఠశాల సమీపంలో బస్సును నిలిపి భోజనం చేసేందుకు కె.అగ్రహరం వెళ్లారు. ఇంతలోనే బస్సులో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గమనించి మంటలను అదుపు చేసి, అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. బస్సు షార్ట్ సర్క్యూట్తోనే దగ్ధమైందా లేక ఎవరైనా ఆకతాయిలు నిప్పుపెట్టారా? అని విచారణలో తేలాల్సి ఉంది. -
రాయితీ!
రైతు నెత్తినకూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వంచించాడు. అన్నదాత సుఖీభవ పేరుతో సాయం అందిస్తానని చెప్పి మోసగించాడు. మిరప, వరి, కంది, ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు విలవిల్లాడుతున్నారు. తాజాగా సబ్సిడీపై యంత్ర పరికరాల పేరుతో ప్రభుత్వం దగా చేస్తోంది. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు యంత్రాలు అంటగడుతూ చేస్తున్న మోసంపై రైతులు భగ్గుమంటున్నారు. -
టెన్త్ పరీక్షల్లో ముగ్గురు ఇన్విజిలేటర్లు రిలీవ్
సింగరాయకొండ: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఇన్విజిలేటర్లను డీఈఓ కిరణ్కుమార్ రిలీవ్ చేశారు. సింగరాయకొండ మండలంలో నాలుగు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలను డీఈఓ కిరణ్కుమార్ మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వి.ఆనందరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్.వెంకటేశ్వర్లు, మరో ఉపాధ్యాయుడు పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి విధుల నుంచి తప్పించారు. రెండు ఆలయాల్లో చోరీ ● 3 సవర్ల బంగారం, 2 సీసీ కెమెరా డీవీఆర్ బాక్స్లు అపహరణ టంగుటూరు: మండలంలోని వల్లూరులో రెండు ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు తెగబడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. 3 గ్రాములకు పైగా బంగారు కాసులు, ఇత్తడి కిరీటం, సీసీ కెమెరా డీవీఆర్ బాక్స్ అపహరించారు. అలాగే శివాలయంలో సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్ ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమల్లీశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. -
టీచర్ సస్పెన్షన్.. హెచ్ఎంకు షోకాజ్
కనిగిరి రూరల్: కనిగిరిలోని ఓ పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీచర్ డి.వెంకట రంగారెడ్డిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమస్యను చట్టపరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. రాస్తారోకో చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై, అలాగే ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్పై వేటు.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టీచర్ రంగారెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్ కుమార్ విలేకర్లకు తెలిపారు. అలాగే సమస్య బయటపడి పది రోజులైనా నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్కూల్ వద్ద ఆందోళన టీచర్ అసభ్యకర ప్రవర్తనపై పది రోజుల క్రితమే బాలికలు ఫిర్యాదు చేసినా హెచ్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లి హెచ్ఎంను నిలదీస్తున్న క్రమంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్న ఇన్చార్జి సీఐ భీమానాయక్.. ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపారు. లైంగిక వేధింపుల కేసులో టీచర్కు రిమాండ్ చట్టాన్ని అతిక్రమించొద్దని కనిగిరి డీఎస్పీ సూచన స్కూల్ వద్ద హెచ్ఎంతో బాలికల బంధువుల వాగ్వివాదం సర్దిచెప్పి పంపించిన పోలీసులు -
బానిస బంధనాల నుంచి విముక్తి
● కలెక్టర్ తమీమ్అన్సారియా చొరవతో కూలీలకు స్వేచ్ఛ ఒంగోలు సిటీ: వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి, యజమాని బానిసత్వంలో బంధించాడు. అయిన వారికి, ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్న వారికి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబరులో కలెక్టర్ తమీమ్ అన్సారియా రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపట్నం మండలంలోని ఆలూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలు చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ తోటల్లో పనికి వెళ్లారు. వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని, వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గర్భిణి, బాలింతలతోనూ బలవంతంగా పని చేయిస్తున్నట్లు యానాది సంఘాల మహా కూటమి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఏడు కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించి ఒంగోలు తీసుకొచ్చారు. కలెక్టర్ చేతుల మీదుగా రిలీఫ్ సర్టిఫికెట్లతో పాటు స్వీట్లు, దుస్తులు, ఇతర వంట సరుకులను అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు. దయనీయ స్థితిలో ఉన్న తమకు స్వేచ్ఛ కల్పించిన కలెక్టర్ తమీమ్అన్సారియా కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, డీఎస్వో పద్మశ్రీ,, పౌరసరఫరాల సంస్థ డీఎం వరలక్ష్మి, తహసీల్దార్ మధు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్.సునీల్ కుమార్ (సార్డ్స్), శ్యామ్, పాషా, డేవిడ్ (ఐ.జె.ఎం.), ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కారును ఢీకొన్న అంబులెన్స్
● రెండు వాహనాల్లో ఉన్న 8 మంది సురక్షితం సింగరాయకొండ: ముందు వెళ్తున్న కారు వేగం ఒక్కసారిగా నెమ్మదించడంతో వెనుకనే వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి ఢీకొట్టిన సంఘటన సింగరాయకొండలోని కందుకూరు ఫ్లయ్ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రెండు వాహనాల్లో మొత్తం 8 మంది ఉండగా ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. మిగిలినవారు సురక్షితంగా ఉన్నారు. హైవే పోలీసుల కథనం ప్రకారం టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంకు చెందిన అమృతకుమార్ తన స్నేహితులు ముగ్గురు, కారుడ్రైవర్ సాయితో కలిసి శ్రీకాళహస్తి వెళ్తున్నారు. కందుకూరు ఫ్లయ్ఓవర్ ఎక్కే సమయంలో రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో డ్రైవర్ సాయి కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో వెనకాలే వేగంగా వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. కారు డివైడర్ పైకి ఎక్కగా.. బెలూన్లు తెరుచుకోవటంతో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ సాయిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అంబులెన్స్ విజయవాడలో పేషెంట్ను దింపి తిరుగు ప్రయాణంలో బెంగుళూరు వెళ్తోంది. ప్రమాదం ధాటికి కారు ధ్వంసమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. -
ప్రాజెక్ట్స్ సర్కిల్ డీఎస్ఈగా హరికృష్ణ రాజు
● గుండ్లకమ్మ–1 ఈఈగా శ్రీహరి ఒంగోలు సబర్బన్: జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్(డీఎస్ఈ)గా వీఎస్.హరికృష్ణరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కంభం సర్కిల్ డీఈగా పనిచేస్తూ డీఎస్ఈగా పదోన్నతి పొందారు. అందులో భాగంగా ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయంలో డీఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్స్–1 ఈఈగా ఐ.శ్రీహరి కూడా ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కూడా కంభం డీఈగా పనిచేస్తూ ఈఈగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఇద్దరూ ప్రాజెక్ట్స్ ఎస్ఈ సీ.నాగమురళీ మోహన్ను కలిసి రిపోర్టు చేశారు. పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ కొరిటెపాడు: భారత పొగాకు బోర్డు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బి.విశ్వశ్రీ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బి.విశ్వశ్రీని పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, పలువురు వ్యాపారులు, రైతులు కలిసి అభినందనలు తెలిపారు. మధుసూదన్ శాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం ఒంగోలు మెట్రో: జిల్లాకు చెందిన సాహితీవేత్త, కవి, విమర్శకుడు మార్కాపురం శ్రీ సాధన సాహితీ వేదిక కన్వీనర్ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రిని 2025 ఉగాది సందర్భంగా కుర్రా కోటిసూర్యమ్మ స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులకు రెండు దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం అందిస్తున్న ఈ విశిష్ట పురస్కారానికి ఈ సంవత్సరానికి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన స్వస్థలం గుడ్లూరులో పుట్టిన డాక్టర్ మధుసూదన్ తెలుగు, సంస్కృత సాహిత్యాల్లో వందలాది విమర్శనా వ్యాసాలు, కవితలు, అంతర్జాతీయ పరిశోధన సంచికల్లో విశిష్ట వ్యాసాలు రచించారని, మార్కాపురంలో శ్రీ సాధన సాహిత్య వేదిక నెలకొల్పి అక్కడి నెలనెలా వెన్నెలను పునరుద్ధరించడం ద్వారా 60 పై చిలుకు సాహిత్య సదస్సులు నిర్వహించారన్నారు. విద్యారంగంలో 25 సంవత్సరాలు డిగ్రీ కళాశాల ఆచార్యులుగా తనదైన శైలిలో పని చేస్తూ వేలాది మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని చెప్పారు. వారి విస్తృత సేవలకు గుర్తింపుగా ఈ విశ్వావసు నామ తెలుగు ఉగాది సందర్భంగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఈనెల 29వ తేదీ శనివారం ఉదయం నిర్వహించే శ్రీకృష్ణదేవరాయ ఉగాది కవితా మహోత్సవంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం ఒంగోలు మెట్రో: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఈనెల 27 న గురువారం సాయంత్రం ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మిడసల మల్లికార్జునరావు, కనమాల రాఘవులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొంటారని, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారన్నారు. కార్యక్రమానికి ముందుగా చందూ డ్యాన్స్ అకాడమీ చిన్నారులచే నృత్యాలు ఉంటాయని, సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భక్త చింతామణి, రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకాల్లో కొన్ని ఘట్టాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. -
కన్నీటి వీడ్కోలు
వైవీ మాతృమూర్తికి ● వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకు మేదరమెట్లకు వచ్చిన జగన్ ● సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు ● కుటుంబ సభ్యులకు పరామర్శ ● అర్ధగంటపాటు అక్కడే గడిపిన జననేతసాక్షి ప్రతినిధి,బాపట్ల: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మృతిచెందగా స్వగ్రామం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు మంగళవారం బంధువులు, పార్టీశ్రేణుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలుసుకొని వేలాదిగా కార్యకర్తలు, అభిమానులే కాదు సామాన్య జనమూ తరలి వచ్చారు. ఎంతగా అంటే జనం తాకిడికి జగన్ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ తర్వాత జగన్ వైవీ ఇంటికి చేరుకొని అక్కడ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించి చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మ, చిన్నాన్నలు వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్రెడ్డిలతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ పలకరించి పరామర్శించారు. భుజంతట్టి ఓదార్చారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మ, మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇతర బంధువులతో మాట్లాడారు. అర్ధగంట పాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో గడిపారు. వైఎస్సార్ సీపీ నేతలను పేరుపేరునా పలకరించారు. వైవీ ఇంటి నుంచి జగన్ తిరుగు ప్రయాణంలోనూ ఆయన వాహనం ముందు చేరిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పిచ్చమ్మ భౌతిక కాయానికి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా వెంకట రాంబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్బాబు, చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ తదితరులు నివాళులర్పించారు. -
ఆధార్కార్డుల నవీకరణ పటిష్టంగా నిర్వహించాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి ఒంగోలు సిటీ: ఆధార్కార్డుల నవీకరణ ప్రక్రియ జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆధార్కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియ పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆధార్ కార్డుల నవీకరణ పెండింగ్ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, జీఎస్డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధార్ నమోదు కేంద్రాలన్నీ పని చేయాలన్నారు. కొత్తగా జన్మించిన శిశువుల ఆధార్ ఎన్రోల్మెంట్ కు సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అనే విధానాన్ని అవలంబించాలన్నారు. నవీకరణ ప్రక్రియపై ప్రజలకు తక్షణమే అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఏ ఆస్పత్రిలో శిశువు జన్మించినా తక్షణమే ఆ శిశువు ఆధార్ నమోదు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ ఐడీ నమోదులో పెండింగ్ ఉండరాదని ఆదేశించారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ఐసీడీఎస్ పీడీ హేన సుజన, ఉదయ్ సంస్థ ప్రతినిధులు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రావిడెంట్ ఫండ్ను వెంటనే ఇప్పించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్ర పౌరసరఫరా సంస్థలో హమాలీలుగా పనిచేసి చనిపోయిన, రిటైర్డ్ అయిన, మానుకున్న వారికి సంబంధించిన ప్రావిడెండ్ ఫండ్ ను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకు మరణించిన 9 మంది కార్మికుల కుటుంబాలకు పీఎఫ్, పెన్షన్ ఇప్పించడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీలు శ్రీనివాసరెడ్డి, శేషయ్య, సుబ్బారావు, నాగరాజు, వెంకటేశ్వరరెడ్డి, శ్రీను, రంగయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. బంగారు బాల్యానికి స్కోచ్ అవార్డు ఒంగోలు సిటీ: జిల్లాలో బాల్యవివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల్లో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండటంతో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఏ.తమీమ్ అన్సారియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని రూపొందించారు. త్వరలోనే న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. అవార్డు సాధించిన కలెక్టర్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. -
కూటమి తంట!
మాటల మంట..‘‘రాజకీయంగా జనసేన పార్టీ నిలదొక్కుకోవడమే కాకుండా, 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు జిల్లా కూటమిలో చిచ్చు రేపింది. పవన్ లేకపోతే టీడీపీ ఉండేది కాదు అని మాట్లాడటం సమంజసం కాదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ మా వల్లే గెలిచాడంటూ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు సైతం సోషల్ మీడియా వేదికగా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇదే అంశంపై జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు సైతం చోటుచేసుకోడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ మంటలు రాజేస్తున్నారు. కులం ప్రస్తావనలు సైతం తీసుకొస్తున్నారు. దీంతో కూటమి నేతలు, కార్యకర్తల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. అసలే జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు మరింత దిగజారినట్లు తెలుస్తోంది. కారుకూతలు కూస్తే కంఠం తెగుద్ది... టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ నేపథ్యంలో చెరుకూరి ఫణికుమార్ అనే జనసేన కార్యకర్త విడుదల చేసిన ఆడియో సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకుల పిచ్చి పిచ్చి కామెంట్లు వినదలచుకోలేదని చెప్పిన ఆయన కారుకూతలు కూస్తే కంఠం తెగుద్దని హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. మద్యం దుకాణాలు ఇవ్వకపోయినా, రేషన్ దుకాణాలు ఇవ్వకపోయినా, రోడ్డు కాంట్రాక్టులు ఇవ్వకపోయినా అడగడం లేదని, జనసేన మీద కామెంట్స్ చేస్తే మాత్రం సహించేది లేదని కుండబద్దలు కొట్టాడు. టీడీపీలోని అధికార పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా జనసేన కార్యకర్తలను తూలనాడుతున్నారని, కులహంకారంతో ప్రవర్తిస్తే బాగుండదని హితవు పలికాడు. ప్రపంచ మేధావి అని చెప్పుకునేవాళ్లు చొక్కాలు నలిగి రాజమండ్రి జైల్లో ఎలా ఉన్నారో అంటూ అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబు గురించి ప్రస్తావించిన ఆయన మళ్లీ అలా ఉండడానికి ఇష్టమైతే మాతో గొడవ పెట్టుకోండని సలహా ఇచ్చాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, కులహంకారంతో రెచ్చిపోతే టీడీపీ గతి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అనడం వివాదానికి మరింత అగ్గిరాజేసినట్టయింది. 2019లో పొత్తు పెట్టుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, అలాంటి పరిస్థితి పునరావృతమైతే ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ ఆడియో జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. సింగరాయకొండలో టీడీపీ భూ కబ్జాపై ఫిర్యాదు.. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో తెలుగుదేశం నాయకులు భూ కబ్జాకు చేసిన ప్రయత్నాలపై జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని బాలుర వసతి గృహం వెనక సోమరాజుపల్లి లో సర్వే నెంబర్ 686లో మిగిలి ఉన్న 1.50 సెంట్ల స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో గృహనిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీలోని పెద్ద తలకాయల అండదండలతో అధికారుల నోళ్లు మూయించిన పచ్చ ముఠాపై జనసేన ఫిర్యాదు చేయడం కూటమి పార్టీల మధ్య విభేదాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. ఒంగోలులో మూడు ముక్కలాట... జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనసేన పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. రియాజ్ జనసేన, అరుణ జనసేన, బాలినేని జనసేనలుగా విడిపోయింది. రియాజ్ వర్గం మొదట్నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉంటుండగా, అరుణ ప్రస్తుతం బాలినేని వర్గంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. బాలినేని పేరు వింటేనే చాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నువ్వు ఏ పార్టీలో చేరినా నిన్ను దేవుడు కూడా రక్షించలేరని ఎమ్మెల్యే దామచర్ల బహిరంగంగానే హెచ్చరించిన నేపథ్యంలోనే బాలినేనిని ఒంగోలులో అడుగుపెట్టకుండా కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గిద్దలూరు నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమై టీడీపీ మీద తీవ్రమైన విమర్శలు చేసిన ఆమంచి స్వాములు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అధికార టీడీపీ నాయకుల తీరుపై మండిపడిన బెల్లంకొండ సాయిబాబా పత్తా లేకుండా పోయాడు. ఒంగోలు నగరంలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జడా నాగేంద్ర కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులను ఏదో రకంగా అణిచివేస్తున్నట్లు జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో తమకు కార్పొరేషన్ పదవులు వస్తాయని చాలా మంది జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకునే రాయపాటి అరుణ ఊహల్లో విహరించారు. ఆ ఇద్దరికి చివరికి మొండిచేయి చూపించడంతో మింగలేక కక్కలేక తెగ ఇబ్బంది పడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులు నమ్మించి మోసం చేసినట్లు ఈ ఇద్దరు నాయకులు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య పెరిగిన దూరం.. ఎన్నికల ముందు కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన జిల్లా నాయకులు, కార్యకర్తల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఇటీవల కాలంలో మరింత దిగజారినట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన నాయకులు కూడా అక్రమ వ్యాపారాల్లో వాటాలను ఆశించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ వీరిని దగ్గరకు రానీయడం లేదు. జనసేన నాయకులను కలుపుకునే ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో జనసేన నాయకులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా అప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి మొదలుకొని యర్రగొండపాలెం వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మద్యం దుకాణాలు, రేషన్ అక్రమ సరఫరా, మైనింగ్ రవాణా చేసుకుంటున్నారని జిల్లా జనసేన నాయకులు వాపోతున్నారు. మా నోట్లో మట్టి కొడుతున్నారని లబోదిబోమంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో జిల్లా టీడీపీ, జనసేనల్లో అలజడి 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది నేనే అంటూ చేసిన ప్రకటనపై అభ్యంతరాలు టీడీపీ, జనసేన కార్యకర్తల నడుమ సోషల్ మీడియా వార్ జనసేనతో పొత్తు 95 శాతం టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని తెలుగు తమ్ముళ్ల ఎదురుదాడి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రపంచ మేధావి చొక్కా తడిసిందంటూ జనసేన పోస్టులు కులహంకారంతో మాట్లాడుతున్నారంటూ టీడీపీ వారిపై ఆగ్రహం కారుకూతలు కూస్తే కంఠం తెగుద్దంటూ తమ్ముళ్లకు హెచ్చరిక -
రక్షణ కల్పించాలని బాధితురాలి ఆవేదన
ఒంగోలు టౌన్: నాకు, నా బిడ్డకు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.. తనను లైంగికంగా, మానసికంగా వేధించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ లో ఎల్జీఎస్ కే సరోజ కోరారు. మంగళవారం ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ హాలులో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడింది. అర్బన్ హెల్త్ సెంటర్లో లాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న కోకిలగడ్డ సురేంద్ర బాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ మహమ్మద్ అన్సారీలు తనను లైంగికంగా వేధించడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టారని తెలిపింది. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికీ ప్రయాజనం లేకుండా పోవడంతో విధిలేని పరిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. తాలుకా పోలీసు స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే సీఐ అజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. న్యాయస్థానానికి వెళ్లిన తనకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని, నిందితులను అరెస్టు చేయాలని తాలుకా పోలీసులను ఆదేశించారని తెలిపారు. దాంతో తాలుకా పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేశారని, అప్పటి నుంచి నిందితులు నా కుటుంబ సభ్యులతో పాటుగా నన్ను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాలుకా పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతూ ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. -
జంట హత్య కేసులో నిందితుడు అరెస్టు
పెద్దదోర్నాల: మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో జరిగిన జంట హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో దాయాదుల నడుమ సెంటున్నర స్థలం కోసం వివాదం కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీనీ తీర్చేందుకు గుంటూరులో ఉన్న దూదేకుల నూర్జహాన్బీతో పాటు ఆమె తోబుట్టువులు బొమ్మలాపురం వచ్చారు. ఈ నెల 6 తేదీన ఇరువర్గాల నడుమ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 7వ తేదీ తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న దూదేకుల నాగూర్వళి అతడి పెద్దమ్మ దూదేకుల నూర్జహాన్బీలను మరో వర్గానికి చెందిన దూదేకుల ఖాశింవలి మరికొందరు బందువులతో కలిసి వారిపై పెట్రోలు పోసి నిప్పటించారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఒంగోలుకు తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. దూదేకుల నూర్జహాన్బి భర్త మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 17వ తేదీ సోమవారం నిందితుడిని చిన్నదోర్నాల అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసులో సంబంధం ఉన్న మిగిలిన నిందితులను అదుపులోనికి తీసుకుంటామని తెలిపారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీయస్పీ నాగరాజు -
నడి రోడ్డులో విద్యుత్ టవర్
సీసీ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన హెచ్టీ విద్యుత్ టవర్● ఇడుపూరు–1 పునరావాస కాలనీలో కాంట్రాక్టర్ నిర్వాకం మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న కలనూతల గ్రామస్తులు మార్కాపురం సమీపంలోని ఇడుపూరు–1 పునరావాస కాలనీలో ఉంటున్నారు. ఈ గ్రామంలో విద్యుత్ హెచ్టీ టవర్ను సంబంధిత కాంట్రాక్టర్ నడి రోడ్డుపై ఏర్పాటు చేసి తన నిర్వాకాన్ని చాటుకున్నాడు. గ్రామస్తులు ఎలా రాకపోకలు సాగిస్తారనే ఆలోచన కూడా లేకుండా హెచ్టీ లైన్ టవర్ ఏర్పాటు చేయడాన్ని చూసిన ప్రజలు ఇదెక్కడి విడ్డూరమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న హెచ్టీ విద్యుత్ టవర్ను పక్కన ఏర్పాటు చేయాలని కలనూతలవాసులు కోరుతున్నారు. -
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి
● కలెక్టర్ తమీమ్అన్సారియా ఒంగోలు సిటీ: విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖాధికారులతో జీఓ 117, డ్రాపౌట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఓ 117ను ఉపసంహరించిన తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించి ఇప్పటికే సన్నాహక మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కూడా సంబంధిత విద్యా శాఖల అధికారులు, పాఠశాలల అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో అధ్యయనం చేశామని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలుపై తల్లిదండ్రులను సంప్రదించి వారికి వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకునేలా ఎంఈఓలు పంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాల కమిటీల సమావేశంలో స్కూళ్ల వివరాలను వారికి అర్థమయ్యేలా వివరించి నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందేలా ఎంఈఓలు చూడాలన్నారు. నిర్దేశించిన గడువు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా విద్యా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. డ్రాపౌట్ పిల్లలు ఎందుకు డ్రాప్ అవుతున్నారో గుర్తించి వారిని బడిలో చేర్పించేలా విద్యా శాఖాదికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఏ కిరణ్ కుమార్, మండల విద్యా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్, రాష్ట్ర కార్యదర్శి ఈదులముడి మధుబాబు కోరారు. ఒంగోలులో మంగళవారం జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొప్పరాజు చిన రాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమన్, మధుబాబు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మెప్మా, సెర్ఫ్లలో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందని, ప్రస్తుతం అందరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు, భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపీడీకి గురయ్యేట్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బయటకు నెట్టవద్దన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆప్కాస్ రద్దుపై ఏర్పడిన అనిశ్చితిని ప్రభుత్వం తొలగించాలని కోరారు. జిల్లా నాయకులు రాఘవరావు, రాయుడు, నాగమల్లేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
దొనకొండ: మండలంలోని గంగదేవిపల్లిలో లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య తిరునాళ్లను పురస్కరించుకొని మంగళవారం ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో 5 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరయ్య స్వామి ఎడ్ల జత 3759 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన జి.నాగిరెడ్డి ఎడ్లు 3751 అడుగులు లాగి రెండవ స్థానం, యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన షేక్.నజీర్బాషా ఎడ్లు 3500 అడుగులు లాగి మూడోస్థానం, నంద్యాల జిల్లా గడ్డివేముల మండలం పెసరాయి గ్రామానికి చెందిన సయ్యద్ కలామ్ బాషా ఎడ్లు 3250 అడుగుల లాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులకు దాతల సహకారంతో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు బహుమతులు అందజేశారు. బండలాగుడు పోటీలను తిలకించడానికి వచ్చిన ప్రజలకు గ్రామస్తులు సహాకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. -
హంస వాహనంపై దేవదేవుడు
కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం శ్రీవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పల్లకిపై శ్రీవారి ఉత్సవమూర్తిని నరసింహుని అవతారంలో అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య వెలుగొండ వీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి, పల్లకి మోసి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుందురు కాశిరెడ్డి, ఉభయదాతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, సింహాద్రీచార్యులు ఉభయదాతలతో కలిసి స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్న సంతర్పణ చేశారు. బుధవారం శ్రీవారు శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
వికృతంగా..!
రంగ రంగా..టీచర్ రంగారెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులుకనిగిరి రూరల్: ఐదు పదుల వయసు నిండిన ఆ టీచర్ రోజూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే లోలోన కుమిలిపోయిన బాలికలు ఇక భరించలేక నిజం బయటపెట్టారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కోపోద్రిక్తులై కీచక టీచర్ ఇంటిని ముట్టడించడంతోపాటు కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నమాజ్ చేసి మరీ నిరసన తెలపడం సంచలనం రేపింది. మంగళవారం కనిరిగి పట్టణంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు విద్యాశాఖ అధికారుల తీరును వేలెత్తి చూపాయి. ఇటీవల కొనకనమిట్ల మండలంలోని ఓ పాఠశాలలోనూ తమ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత బాలికలు ఏకంగా బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యురాలికి ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ సాగుతున్న తరుణంలోనే కనిగిరిలో మరో జుగుప్సాకర ఘటన వెలుగు చూడటంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు, విద్యాశాఖ అధికారుల వ్యవహార శైలిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల క్రితమే ఫిర్యాదు కనిగిరిలోని ఓ పాఠశాలలో సైన్స్ టీచర్ రంగారెడ్డి వికృత చేష్టలతో బాధింపబడిన బాలికలంతా 6, 7 తరగతులకు చెందిన వారు కావడంతో గత కొంత కాలంగా బయటకు చెప్పుకోలేకపోయారు. అయితే పది రోజుల క్రితం సుమారు ఏడుగురు విద్యార్థులు ధైర్యం చేసి టీచర్ అసభ్యకర ప్రవర్తనపై హెచ్ఎం కలువ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె డీఈఓకు విషయాన్ని లిఖత పూర్వకంగా తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో టీచర్కు మెమో ఇచ్చి వదిలేయడం గమనార్హం. ఈ క్రమంలో పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలికకు సోమవారం రుతుస్రావమైంది. తల్లిదండ్రులు ఆ బాలికను ప్రశ్నించడంతో.. టీచర్ వికృత చేష్టల గురించి చెప్పి కన్నీటి పర్యంతమైంది. బాలికకు వైద్యం చేయించిన తల్లిదండ్రులు మంగళవారం తమ బంధువులతో కలిసి కనిగిరిలోనే ఉంటున్న టీచర్ ఇంటిని ముట్టడించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు, ముస్లిం యువత, స్థానికులు కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నడి రోడ్డుపై ఇఫ్తార్ దువా, నమాజ్ చేసి నిరసన తెలిపారు. కీచక టీచర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా బాధిత విద్యార్థినులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ తీరుపై ప్రజలు, పోలీసుల ఆగ్రహం టీచర్ బాగోతంపై డీఈఓ కిరణ్కుమార్కు ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం మోమోతో సరిపెట్టడం నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది. విద్యాశాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ఇటు ప్రజలు, అటు పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలో ఓ టీచర్ నెలల తరబడి బాలికలను లైంగికంగా వేధిస్తున్నా ఇతర ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
శభాష్ ప్రణవి
● షూటింగ్లో రెండు రజతాలు సొంతం ● అభినందించిన ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్: న్యూఢిల్లీలో గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మాసాల్లో నిర్వహించిన 67వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో 10 మీటర్ల షూటింగ్(పిస్టల్) సీనియర్, జూనియర్ మిక్స్డ్ విభాగంలో కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామానికి చెందిన ద్వారం ప్రణవి సత్తా చాటి రెండు రజత పతకాలు సాధించింది. అలాగే ఖేలో ఇండియా యూనివర్శిటీ టోర్నమెంట్లో 4వ స్థానంలో నిలిచి ప్రతిభ చాటింది. ఆమెను మంగళవారం జిల్లా పోలీసు కార్యలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతోపాటు చదువులోనూ రాణించాలని సూచించారు. ప్రణవి వెంట ఆమె తండ్రి జాలిరెడ్డి ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలి ● డీఆర్డీఏ పీడీ నారాయణ ఒంగోలు వన్టౌన్: మండల సమాఖ్య రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.నారాయణ ఆదేశించారు. ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీ సెంటర్లో జిల్లాలోని 38 మండలాల మండల సమాఖ్య అకౌంటెంట్లకు మంగళవారం శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణంలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నెలలో అర్హులైన లబ్ధిదారులకు సిఫ్ను అప్పుగా మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు ఏ గ్రేడ్ పరిధిలోకి రావాలన్నారు. స్వయం సహాయక గ్రూపుల గ్రేడింగ్, సిఫ్ రికవరీలో ముందంజలో ఉండాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ఉద్యోగులు నరసింహరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి ఒంగోలు సిటీ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఒకటికి నాలుగు శాఖలకు సంబంధించిన పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అయినా పదోన్నతులు లేవని వాపోయారు. తమతో పాటు రిక్రూట్ అయిన సచివాలయ ఉద్యోగులు చాలా మంది పదోన్నతులపై వెళుతున్నా..మాకు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అన్ని అభివృద్ధి పనులతో పాటు వివిధ సర్వేలు చేయడంలో ఇంజినీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ శివ సూర్య తేజ, జిల్లా నాయకులు రామాంజనేయులు, వెంకట రమేష్, రాజేష్, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. -
సింహ వాహనంపై శ్రీవారు
కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం సింహ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై శ్రీవారిని ఊరేగించారు. ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఉభయదాతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, రమణాచార్యులు, సింహాద్రీచార్యులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించి శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారు హంస వాహనంపై దర్శనమిస్తారని ఈఓ తెలిపారు. -
నాలుగు పొగాకు బ్యారన్ల దగ్ధం
● రూ.40 లక్షల ఆస్తి నష్టం జరుగుమల్లి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తూ పొగాకు జారి మొద్దు గొట్టంపై పడటంతో పక్కపక్కనే ఉన్న నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధమై సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం రామచంద్రాపురంలో సోమవారం చోటుచేసుకుంది. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన రావి నాగేశ్వరరావుకు పొగాకు బ్యారన్లో పొగాకు కాలుస్తుండగా, ప్రమాదవశాత్తూ ఆకు జారి మొద్దు గొట్టంపై పడి మంటలు చెలరేగి బ్యారన్ తగలబడింది. పక్కనే ఉన్న మరో మూడు బ్యారన్లకు కూడా మంటలు అంటుకుని తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో ఒక బ్యారన్ సగం మాత్రమే తగలబడింది. బ్యారన్లతో పాటు ఆకు కూడా దగ్ధం కావడంతో బ్యారన్ల యజమానులు ఉన్నం వెంకట్రావు, రావి ఆదిలక్ష్మి, రావి ఆదెమ్మ, నేతి మాలకొండయ్య, నర్రా శ్రీనివాసరావు, నర్రా మురళి, పావులూరి రామారావు, పావులూరి వెంకటేశ్వర్లుకు సుమారు రూ.40 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మాత్రం రూ.21 లక్షల విలువ గల సామగ్రి కాపాడామని, కేవలం రూ.9 లక్షల సామగ్రికి మాత్రమే నష్టం జరిగిందని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది బి.సత్యన్నారాయణ, టి.బాలకృష్ణ, డి.వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాసులు పాల్గొన్నారు. కొండపి అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం... కొండపి అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్యారన్ల దగ్ధం సంఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు పొగాకు రైతులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన రామచంద్రాపురం కొండపి అగ్నిమాపక కేంద్రం పరిధిలోకి వస్తుంది. దీంతో రైతులు ముందుగా కొండపి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి చెప్పారు. కానీ, సిబ్బంది స్పందించకపోవడంతో చివరికి టంగుటూరు సిబ్బందికి సమాచారం అందించారు. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పేలోపు మరో రెండు బ్యారన్లు దగ్ధమైనట్లు రైతులు చెబుతున్నారు. కొండపి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి ఉంటే రెండు బ్యారన్లయినా దక్కి ఉండేవని అంటున్నారు. -
అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం
కురిచేడు: మండలంలోని పొట్లపాడు గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై ఎం.శివ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే దొనకొండ నుంచి నాయుడుపాలెం, వీవై కాలనీకి వెళ్లే మట్టిరోడ్డులో పొట్లపాడు పరిధిలోని అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉందని గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు త్రిపురాంతకం సీఐ జి.అస్సాన్, దొనకొండ, కురిచేడు ఎస్సైలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, మూడునాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని అంచనా వేశారు. చిలకపచ్చ రంగు చీర, వంకాయ రంగు లంగా, జాకెట్, కాళ్లకు చెప్పులు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ కారణంగా మృతి చెంది ఉంటుందని సీఐ అస్సాన్ తెలిపారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సమాచారం తెలిసిన వారు ఎస్సై ఎం.శివ (9121102163)ను సంప్రదించాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడి బంకు కూల్చివేత
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ నాయకుడి బంకును కూల్చివేయించిన పోలీసులు గ్రామంలో శాంతి, భద్రతల పరిస్థితిని పక్కనపెట్టి తమ ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గంగపాలెంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాజుల వెంకటనారాయణ తన ముత్తాతల కాలం నుంచి గ్రామ కంఠం స్థలంలో గడ్డి వామి, దిబ్బ ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ స్థలానికి సమీపంలో రేకులతో బంకును ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోనే ఉన్న గంగమ్మ గుడిని గ్రామస్తులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. వెంకట నారాయణకు వారసత్వంగా వస్తున్న గడ్డివామి దొడ్డి, పేడ దిబ్బ, దుకాణం ఎవరికీ అభ్యంతరం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వెంకట నారాయణను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ నేతలు సమయం కోసం వేచిచూశారు. గత నెల 10వ తేదీన గంగమ్మ తిరునాళ్ల కావడంతో అంతకంటే ముందే కుట్రకు తెరతీశారు. అమ్మవారి తేరు తిరగడానికి అడ్డుగా ఉందంటూ బంకును తొలగించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గత నెల 6వ తేదీన పోలీసులు వెళ్లి బంకును పక్కకు నెట్టించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన పెద్దమనుషులు పోలీసుల వద్దకు వెళ్లి జాతర అయిపోయిందని, బంకును తిరిగి ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు పోలీసులు సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపు 10 రోజుల క్రితం వెంకట నారాయణ ఆ స్థలంలో బంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సహించలేని గ్రామ టీడీపీ నాయకులు వైపాలెం పార్టీ నేతలతో కలిసి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. దీంతో జేసీబీతో సహా గ్రామానికి వెళ్లిన పోలీసులు బంకుతో సహా వారసత్వంగా వస్తున్న దొడ్డిలోని గడ్డివామి, ఆ పక్కన ఉన్న పేడ దిబ్బను ధ్వంసం చేయించారు. బంకును మరోసారి ఏర్పాటు చేసుకుంటాడన్న ఉద్దేశంతో రేకులను ముక్కలు చేయించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఎందుకింత అత్యుత్సాహం? గ్రామ కంఠం స్థలానికి హక్కుదారు ఎవరో నిర్ణయించాల్సింది రెవెన్యూ అధికారులు. కానీ పోలీసులు సొంత నిర్ణయం తీసుకుని తీసుకుని ఏకపక్షంగా వ్యవహరించడం గ్రామంలో చిచ్చు రాజేసింది. బంకు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పిన పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించి ధ్వంస రచనకు పూనుకోవడం ఎంత వరకు సమంజమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కూటమి నాయకులకు తలొగ్గిన పోలీసులు దుకాణం పెట్టుకోమని చెప్పి వెనువెంటనే కూల్చివేత గంగపాలెంలో రగులుతున్న వర్గపోరు -
ఇన్ఫార్మర్నే ఇరికించారు!
సింగరాయకొండ: గంజాయి అమ్మేవారిని పట్టుకునేందుకు ఇన్ఫార్మర్ను రంగంలోకి దించి చివరికి ఆ ఇన్ఫార్మర్నే ఎకై ్సజ్ పోలీసులు కేసులో ఇరికించారని ఇన్ఫార్మర్ బంధువులు ఆరోపిస్తుండగా, ఎకై ్సజ్ పోలీసులు మాత్రం అసలైన నిందితులినే పట్టుకున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నిందితుల్లో ఒకరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయిన సంఘటన చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల ప్రకారం.. గత శనివారం స్థానిక బుంగబావి సెంటర్లో నివసిస్తున్న హరిశ్చంద్ర అనే యువకుడిని నీకు మద్యం సీసా ఇస్తా..నాకు గంజాయి కావాలంటూ ఎకై ్సజ్ కానిస్టేబుల్ నమ్మబలికాడు. గంజాయి తీసుకురావాలంటూ అతనికి రూ.9 వేలు డబ్బులిచ్చాడు. గంజాయి తెచ్చిస్తే మద్యం సీసా ఉచితంగా వస్తుందని ఆశపడిన హరిశ్చంద్ర తన స్నేహితుడైన బాలయోగినగర్కు చెందిన బల్సురి శివకు విషయం చెప్పి గంజాయి కావాలని అడిగాడు. దీంతో శివ పాతసింగరాయకొండ పంచాయతీ గుజ్జుల యలమందారెడ్డినగర్లో గంజాయి అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి రూ.6 వేలిచ్చి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఎకై ్సజ్ కానిస్టేబుల్కు గంజాయి ప్యాకెట్ ఇచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ వారిద్దరినీ పట్టుకుని మీరు గంజాయి అమ్ముతారా అని అడగడంతో.. మేము పలానాచోట గంజాయి తెచ్చామని వారు చెప్పారు. వారిద్దరినీ తీసుకుని గంజాయి అమ్మే మహిళ వద్దకు వెళ్లగా, తాను గంజాయి అమ్మడం లేదని, హరిశ్చంద్ర వద్ద తీసుకున్న రూ.6 వేలను కానిస్టేబుల్కు ఆ మహిళ తిరిగిచ్చింది. దీంతో కానిస్టేబుల్ హరిశ్చంద్ర, శివలను అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఆదివారం సెలవు కావడంతో కోర్టులో హాజరుపరచడం వీలుపడక సోమవారం వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచేందుకు స్నానం చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ పోలీసులను ఏమార్చి స్టేషన్ నుంచి శివ పరారయ్యాడు. దీంతో నిందితుల్లో ఒకరే దొరికారని, మరొకరి కోసం గాలిస్తున్నామని ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎకై ్సజ్ సీఐ శివకుమారిని వివరణ కోరగా, తమకు అందిన సమాచారంతో స్థానిక కందుకూరు రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న హరిశ్చంద్రను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద 100 గ్రాముల గంజాయి ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతను బల్సురి శివ వద్ద గంజాయి కొన్నానని చెప్పడంతో శివ కోసం గాలిస్తున్నామన్నారు. హరిశ్చంద్రపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. అయితే, ఈ కేసులో హరిశ్చంద్రను ఇన్ఫార్మర్గా వాడుకుని అన్యాయంగా ఇరికించారంటూ అతని బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు మాత్రం గుజ్జుల యలమందారెడ్డి నగర్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, ఆ విషయం పోలీసులకు తెలీకుండా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యవహారంలో ట్విస్ట్ ఎకై ్సజ్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 100 గ్రాముల గంజాయి స్వాధీనం ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ నుంచి పారిపోయిన ఒక నిందితుడు వేర్వేరు వాదనలు వినిపిస్తున్న ఎకై ్సజ్ పోలీసులు, బాధితులు -
పెద్దదోర్నాలలో చెయిన్ స్నాచింగ్
పెద్దదోర్నాల: మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన పెద్దదోర్నాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక వెచ్చా వెంకటసుబ్బయ్యనగర్ రెండో లైన్లో చీదెళ్ల లాలు, చీదెళ్ల శ్వేత దంపతులు నివాసముంటున్నారు. చీదెళ్ల శ్వేత మధ్యాహ్న సమయంలో ఆరుబయట నిలబడి పొరుగింటివారితో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని యువకుడు శ్వేత మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మండల కేంద్రంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొలుసు చోరీ చేసిన యువకుడు లైట్ నీలిరంగు ప్యాంటు, ముదురు నీలిరంగు షర్ట్, నలుపు రంగు టోపి ధరించి మొహానికి గుడ్డ కట్టుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.రేపు మెగా జాబ్మేళా ఒంగోలు వన్టౌన్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఒంగోలులోని శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకూ విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికై న వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 7989244381 సెల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆస్తి తీసుకుని కొడుకు గెంటేశాడు ● న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు వృద్ధుడి వినతి మార్కాపురం: వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు.. ఆస్తి రాయించుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో న్యాయం కోసం ఆ వృద్ధుడు సోమవారం మార్కాపురం సబ్కలెక్టర్ త్రివినాగ్ను ఆశ్రయించారు. వివరాలు.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీలోని కొత్తపల్లికి చెందిన లింగం కోటయ్యకు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన భార్య మృతి చెందింది. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న ఆయన వద్ద ఉన్న ఆస్తిని ఒక కొడుకు రాయించుకుని వెళ్లగొట్టాడు. గత్యంతరం లేని స్థితిలో కూతురు వద్ద ఉంటున్నాడు. ఇటీవల కుమారుని వద్దకు వెళ్లగా తన ఇంటికి రావద్దని హెచ్చరించాడని సబ్ కలెక్టర్ ఎదుట వాపోయారు. పొలం అమ్ముకుంటానంటే ‘నువ్వు అమ్మితే ఊర్లో ఎవరు కొంటారో చూస్తా’ అంటూ కుమారుడు బెదిరించాడని, పూట గడవడం లేదని, చావే శరణ్యమని ఆవేదన వెలిబుచ్చారు. తమరే న్యాయం చేయాలంటూ సబ్కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
తహసీల్దార్ కసురుకుంటున్నారు..
నా పేరు గూడా ధనలక్ష్మి. మాది పీసీపల్లి మండలం తురకపల్లి గ్రామం. నాన్న వెంకట పుల్లారెడ్డి బొరుగుల బట్టీ నిర్వహిస్తుంటారు. అమ్మ చిన్నమ్మ గృహిణి. మా నాన్న కష్టపడి పైసా పైసా కూడ బెట్టి 1996వ సంవత్సరంలో 20 సెంట్ల పొలం కొన్నారు. అప్పట్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు ఆన్లైన్ కాలేదు. ఆ విషయం గురించి మాకు అవగాహన కూడా లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని మాచవరం గ్రామానికి చెందిన నూరసాని నరసారెడ్డి, బోడా రవిచంద్రా రెడ్డి, మార వెంకటేశ్వర్లు మా స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారు. ఈ విషయంలో మండల సర్వేయర్ దగ్గరకు వెళితే మీరు పొజిషన్లో లేరంటూ దురుసుగా మాట్లాడుతున్నాడు. తహసీల్దార్ దగ్గరకు వెళితే కసురుకుంటున్నారు. 9 నెలలుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టర్ ఆఫీసులో రెండు సార్లు ఫిర్యాదు చేశాను. మళ్లీ ఈ రోజు రమ్మంటే వచ్చాను. మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వమే న్యాయం చేయాలి. -
కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేశారు
నా పేరు కె.రమేష్. మాది ఉప్పుగుండూరు గ్రామంలో మాదిగపల్లె. హోం గార్డుగా చేస్తున్నాను. ఒంగోలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే కేవీ సుబ్బయ్య మా ఊర్లో పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ విషయంపై పోలీసు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. వారి సూచనల మేరకు ఆ తరువాత కలెక్టరేట్లో ఫిర్యాదు చేశా. నేటి వరకు 10 సార్లు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదు. కానీ నేను హెడ్ కానిస్టేబుల్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశానని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నన్ను ఆర్థికంగా దెబ్బ తీయడమే కాకుండా పల్లెలో తనకు ఎదురు మాట్లాడేవారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ‘నాకు పోలీసు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి.. నన్నెవరూ ఏమీ చేయలేరంటూ’ రెచ్చిపోతున్నాడు. నాకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలి. -
అధికార పార్టీ నాయకుల జోక్యం
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల జోక్యం మితిమీరుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులను పచ్చ తమ్ముళ్లకు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా దానికో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. పనినిబట్టి రూ.10 నుంచి రూ.25 వేలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దాంతో కొంతమంది అధికారులు సైతం పచ్చ తమ్ముళ్లతో కుమ్మక్కయి రెండు చేతులా సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినా మండల స్థాయి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా జిల్లా స్థాయి అధికారులు ఫోన్ చేసి ఫలానా పని ఎందుకు చేయలేదని అడిగితే స్థానిక ఎమ్మెల్యే పేరు చెబుతుండడంతో మాకెందుకులే ఈ తలనొప్పులు అని సదరు అధికారులు మిన్నకుండిపోతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని ఒక ఎమ్మెల్యే తమ్ముడే అన్నీ ప్రభుత్వ కార్యాలయాల వ్యవహారాలను చూస్తున్నారు. మరో నియోజకవర్గంలో ఇన్చార్జి బావమరిది పనులను చక్కబెడుతున్నట్లు సమాచారం. గ్రీవెన్స్కు హాజరైన అర్జీదారులుశాఖల వారీగా ఫిర్యాదులు.. భయంతో ఫిర్యాదులు చేయడం లేదు... భూ కబ్జాలు, రాజకీయ నాయకుల వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి జిల్లావాసులు భయపడిపోతున్నారు. ఒంగోలు నగరంలో ఒక వృద్ధ దంపతుల ఇంటిని అద్దెకు తీసుకున్న ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించాడు. అతడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చాలని ఆ దంపతులు మౌనంగా రోదిస్తున్నారు. సుమారు రూ.10 కోట్లు విలువైన ఆ ఆస్తి ప్రస్తుతం రాజకీయ నాయకుడి కబ్జాలో ఉండడం గమనార్హం. జిల్లాలో ఇలాంటి కబ్జాలు ఎన్నో ఉన్నాయి. ఇక చిరుద్యోగుల వేధింపుల లెక్కేలేదు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ ఇచ్చిన మిర్చి రైతు పంటను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలుతో సహా జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో అనేక మంది పింఛన్లు తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరిగిపోయిన కాలుకు చికిత్స చేయించుకునేందుకు వెళ్లడమే నేరం అన్నట్లు ఓ వృద్ధురాలి పింఛన్ తొలగించారు. ఆరోగ్యం బాగాలేక పోవడంతో రీ అసెస్మెంట్కు హాజరుకాలేక పోయిన పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి పింఛన్ అన్యాయంగా తీసేశారు. ఇదే గత ప్రభుత్వంలో అయితే వలంటీర్లు ఇంటి దగ్గరకు పింఛన్లు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్లేవారు. ఏదైనా సమస్య ఉంటే దగ్గరుండి పరిష్కరించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా పింఛన్లు తొలగించడమే కాకుండా వాటిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం పట్ల ప్రజలు మండిపోతున్నారు. -
తహసీల్దార్ కసురుకుంటున్నారు..
నా పేరు గూడా ధనలక్ష్మి. మాది పీసీపల్లి మండలం తురకపల్లి గ్రామం. నాన్న వెంకట పుల్లారెడ్డి బొరుగుల బట్టీ నిర్వహిస్తుంటారు. అమ్మ చిన్నమ్మ గృహిణి. మా నాన్న కష్టపడి పైసా పైసా కూడ బెట్టి 1996వ సంవత్సరంలో 20 సెంట్ల పొలం కొన్నారు. అప్పట్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు ఆన్లైన్ కాలేదు. ఆ విషయం గురించి మాకు అవగాహన కూడా లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని మాచవరం గ్రామానికి చెందిన నూరసాని నరసారెడ్డి, బోడా రవిచంద్రా రెడ్డి, మార వెంకటేశ్వర్లు మా స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారు. ఈ విషయంలో మండల సర్వేయర్ దగ్గరకు వెళితే మీరు పొజిషన్లో లేరంటూ దురుసుగా మాట్లాడుతున్నాడు. తహసీల్దార్ దగ్గరకు వెళితే కసురుకుంటున్నారు. 9 నెలలుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టర్ ఆఫీసులో రెండు సార్లు ఫిర్యాదు చేశాను. మళ్లీ ఈ రోజు రమ్మంటే వచ్చాను. మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వమే న్యాయం చేయాలి. -
తొలిరోజు పకడ్బందీగా..
ఒంగోలు సిటీ/సాక్షి నెట్వర్క్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 183 కేంద్రాల్లో రెగ్యులర్ పరీక్షలు, 23 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ టెన్త్ తెలుగు పరీక్షకు మొదటి రోజు 29,637 మందికిగాను 488 మంది, ఓపెన్ స్కూల్ హిందీ పరీక్షకు 19 మందికిగాను 10 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని రామ్ నగర్లో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. -
38 మందికి కారుణ్య నియామక పత్రాలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య కోటాలో అర్హులైన 38 మందికి సోమవారం గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ తమీమ్అన్సారియా నియామక పత్రాలను అందించారు. ప్రభుత్వ సర్వీస్ లోకి వస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకష్ణ, డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పి.భానుసాయి ఒంగోలు: ఒంగోలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పి.భానుసాయిని బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఒంగోలులోనే విధులు నిర్వహిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికై న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రోషన్ ఒంగోలు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు చెందిన యర్రం షాలినీరెడ్డి ఒంగోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. గిద్దలూరు నుంచి జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికై న షేక్ ఖాజా రెహ్మాన్ను పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు ఒంగోలు టౌన్: జిల్లా సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్–3లకు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ)గా పదోన్నతులు కల్పించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఛాంబర్లో సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. పదోన్నతి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న డీఎంహెచ్ఓ డా.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్యర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పని చేస్తున్న 210 మందికి పదోన్నతులు కల్పించారు. పదోన్నతి లభించిన ఏఎన్ఎంలు వెంటనే వారికి కేటాయించి ప్రదేశంలో బాధ్యతలు స్వీకరించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఏవో గీతాంజలి, సూపరింటెండెంట్ రాజేష్, సీనియర్ సహాయకులు రాజేశ్వరి, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి ముండ్లమూరు (దర్శి): ఈతకు వెళ్లి మండలంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన కోడిగ రమేష్ కుమారుడు పవన్కుమార్ (10) విజయవాడ కృష్ణా నదిలో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పవన్ విజయవాడలో తన తాత ఇంట్లో ఉంటూ అక్కడ ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఒంటిపూట బడులు కావడంతో ఈత కొట్టేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలోకి వెళ్లాడు. ఇద్దరు మాత్రమే ఇంటికి వచ్చారు. పవన్కుమార్ ఇంటికి రాకపోవడంతో తమ పిల్లవాడు ఏడని ఆ ఇద్దరినీ అడుగగా నదిలో ఈతకు వెళ్లి మునిగి బయటకు రాలేదని చెప్పారు. దీంతో పిల్లవాడిని మునిగిన చోట వెళ్లి వెతకగా మృతదేహం కనిపించింది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రదక్షిణలు చేస్తూ!
దిక్కులు చూస్తూ..9 ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్ ఆపేశారు నా పేరు పఠాన్ జిలానీ ఖాన్. మాది గిద్దలూరు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పక్షవాతంతో బాధపడుతున్నాను. 9 ఏళ్లుగా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సదరం సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. సీకేడీ పింఛన్ లబ్ధిదారులకు గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో ఒంగోలు జీజీహెచ్లో రెండు సార్లు రీ అసెస్మెంట్ నిర్వహించారు. నవంబర్లో హాజరయ్యాను. ఆరోగ్యం బాగాలేకపోవడంతో డిసెంబర్లో హాజరుకాలేకపోయాను. జనవరి నుంచి నాకు పింఛన్ ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకు ఆపేశారో నాకు తెలియదు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అధికారులను కలిస్తే నా పింఛన్ను హోల్డ్లో పెట్టినట్లు చెబుతున్నారు. కొత్తగా మళ్లీ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. 9 ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్ను ఒక్క మాట కూడా చెప్పకుండా తీసేయడం దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. భూ ఆక్రమణలు, కబ్జాలు, భూముల రిజిస్ట్రేషన్లో అవకతవకలు, అవినీతి, అధికారుల వేధింపులు, రాజకీయ నాయకుల కక్షసాధింపు చర్యలతో ప్రజలు విసిగివేసారి పోతున్నారు. న్యాయం కోసం స్థానిక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుంతుందో తెలియక దిక్కులు చూస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వారిని ‘సాక్షి’ పలకరించింది. వారి సమస్యలను తెలుసుకుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక చుట్టూ తిరుగుతున్న ప్రజలు నెలల తరబడి కలెక్టర్ కార్యాలయానికి బాధితులు గత 9 నెలల్లో 35,793 దరఖాస్తులు పలుకుబడి ఉంటే క్షణాల్లో పరిష్కారం అధికార పార్టీ నేతలు చెబితే ఓకే కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులు వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నా కొన్ని పరిష్కారమయ్యేవంటున్న లబ్ధిదారులు -
నకిలీ పత్రాలలో ఆటో ఆమ్మి మోసం చేశారు...
నా పేరు షేక్ షంషాద్. ఒంగోలు నగరంలోని రంగుతోటలో నివాసం ఉంటున్నా. కుటుంబ పోషణ నిమిత్తం నేను, నా భర్త కలిసి షేక్.కాలేషా అనే అతడి వద్ద సెకండ్ హ్యాండ్లో రూ.1.80 లక్షలకు ఆటో కొనుగోలు చేశాం. నెలకు రూ. 6900 చొప్పున 8 నెలల కిస్తీ కట్టిన తరువాత నా పేరు మీద ఆటో ట్రాన్స్ఫర్ చేసేలా అంగీకారం చేసుకున్నాం. డబ్బులు కట్టిన తరువాత కాగితాలు ట్రాన్స్ఫర్ చేయమంటే ఆటో అమ్మిన వ్యక్తి మృతి చెందారని అబద్దాలు చెప్పారు. 4 నెలల్లో మొత్తం డబ్బులు చెల్లిస్తే ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మబలికారు. డబ్బులు మొత్తం కట్టాక నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకే ఆటోను ఆర్టీఓ పట్టుకొని కేసు పెట్టారు. ఆటో తీసుకొని నేను కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడితే సమాధానం చెప్పకపోగా నీ ఇష్టమొచ్చింది చేసుకో...నయా పైసా ఇవ్వను అంటూ కాలేషా బెదిరిస్తున్నాడు. 4 నెలలుగా బండి ఆగిపోయింది. కుటుంబం నడవడం కష్టంగా ఉంది. -
ఎస్సీఈఆర్టీ సభ్యుడిగా నబీ
తర్లుపాడు: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అసెస్మెంట్ సెల్కు తర్లుపాడు మండలం కారుమానిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దూదేకుల నబీని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ డి.సుజాత తెలిపారు. ఎస్సీఈఆర్టీకి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటుకు ఈ నెల 6న విజయవాడలో నిర్వహించిన రాత పరీక్షలో టాప్ 5లో నిలిచిన ఉపాధ్యాయులకు విడివిడిగా ఇంటర్ూయ్వలు నిర్వహించి ఎంపిక చేశారని వివరించారు. ఏడాదిపాటు అమరావతిలోని ఎస్సీఈఆర్టీలో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని నబీ తెలిపారు. ఈ సందర్భంగా నబీని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్యాజువాలిటీ వద్దకు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక మహిళ దిగి క్యాజువాలిటీలోకి వెళ్లారు. ముఖానికి మాస్క్ కట్టుకొని ఉండడంతో వైద్య సిబ్బంది ఆమెను గుర్తించలేకపోయారు. చికిత్స కోసం వచ్చి ఉంటారులే అని నిర్లక్ష్యంగా ఎవరి మాటల్లో వారు పడిపోయారు. హెడ్ నర్సు మాంచి నిద్రలో గుర్రు పెడుతున్నారు. కొంత మంది మెడికోలు మాత్రం పనిచేస్తూ కనిపించారు. వారు సదరు మహిళను ఏం కావాలని అడిగారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ఎక్కడకు పోయారని ప్రశ్నించడంతో సిబ్బందిలో అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఆమె ఎవరో కాదు. సాక్షాత్తు కలెక్టర్ తమీమ్ అన్సారియా. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఓపిక నశిస్తూ... పీజీలే దిక్కనిపిస్తూ’ శీర్షికతో ప్రచురించిన కథనాన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం రాత్రి జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీకి వచ్చారని తెలుసుకుని క్యాజువాలిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. డ్యూటీ వైద్యులకు వెంటనే సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యులకు బదులుగా హౌస్ సర్జన్లు విధులు నిర్వహించడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన అత్యవసర సేవలను అందించాల్సిన వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు. అక్కడ చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి చికిత్స ఎలా చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉంటున్నారా.. సకాలంలో స్పందిస్తున్నారా.. అని వాకబు చేశారు. వైద్యుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ నుంచి గైనకాలజీ విభాగానికి వెళ్లారు. అక్కడ ఒక వైద్యురాలు మాత్రం ఉన్నట్లు సమాచారం. అక్కడ నుంచి ఎన్ఎన్సీయూలోకి వెళ్లి చూడగా అక్కడ కూడా కనీసం ఒక్కటంటే ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు ఏదైనా అత్యవసర సమస్య వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆ తరువాత రేడియాలజీ విభాగానికి వెళ్లారు. నిజానికి రేడియాలజిస్టు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే కలెక్టర్ తనిఖీ చేసే సమయానికి మాత్రం రేడియాలజిస్టు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్రే, సీటీ స్కానింగులు, ఎమ్మారై స్కానింగుల కోసం వచ్చిన వారికి ఎప్పుడు స్కానింగ్ చేస్తున్నారు, రిపోర్టులు ఎప్పుడు ఇస్తున్నారంటూ రేడియాలజిస్టును ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించారు. వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి ఎక్కువగా పేదలు వస్తుంటారని , స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన ఆమె 12 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు సరిగా ఉండడం లేదని, అత్యవసర చికిత్సల విషయంలో కూడా ఆలస్యంగా స్పందిస్తున్నారని పలువురు రోగులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నర్సింగ్ సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఒకరు చెప్పారు. పారిశుధ్యం బాగాలేదని, జనరల్ వార్డుల్లో దుర్వాసన వేస్తుండడంతో రోగులు ఉండలేకపోతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ఆస్పత్రి పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ ల మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ పర్యటన తరువాత ఐదుగురు నర్సింగ్ స్టాఫ్కు మెమో జారీ చేశారు. అయితే విధులు నిర్వహించకుండా పీజీలు, హౌస్ సర్జన్లతో మొబైల్ ఫోన్ల ద్వారా చికిత్స అందిస్తున్న వైద్యులను వదిలి కేవలం నర్సింగ్ స్టాఫ్ కు మాత్రమే మెమోలు ఇవ్వడమేంటని పలువురు నర్సులు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ ఐసీయూలో పనిచేయని ఏసీలు... ఇదిలా ఉండగా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించిన తరువాత కూడా జీజీహెచ్ అధికారుల తీరు మారలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆస్పత్రిలోని ఐసీయూ కాంప్లెక్స్లోని మెడికల్ కాంప్లెక్స్లో మొత్తం 35 పడకలు ఉండగా 12 ఏసీలు ఉన్నాయి. కనీసం ఒక్క ఏసీ కూడా పనిచేయడం లేదు. గోడలకు బిగించిన ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. అసలే ఎండాకాలం కావడంతో, ఉక్కపోతతో రోగులు విసుగెత్తి పోతున్నారు. సరిపడా గాలి ఆడక రోగులు అల్లాడుతున్నారు. పలువురు రోగులు విసనకర్రలు, పేపర్లతో విసురుకుంటున్నారు. అసలే అనారోగ్యంతో బాధ పడుతూ వచ్చిన రోగులు గాలి ఆడకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పై అంతస్తులకు వెళ్లడానికి ఓపీ వెనక ఉన్న లిఫ్ట్ కొన్ని రోజులుగా పని చేయడం లేదు. తరచుగా మొరాయిస్తోంది. దాంతో రోగులను పై అంతస్తులకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ మరింత దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప జీజీహెచ్లో వైద్య సేవలు గాడిలో పడే పరిస్థితి లేదు. జీజీహెచ్లో శనివారం అర్ధరాత్రి వరకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు క్యాజువాలిటీ విధుల్లో వైద్యులు కనిపించకపోవడంతో ఆగ్రహం ఎన్ఎన్ఐసీలోనూ వైద్యులకు బదులుగా నర్సులు విధులు నిర్వహిస్తుండడంతో మండిపడిన కలెక్టర్ రేడియాలజీ విభాగంలోకి వెళ్లి రిపోర్టులు ఎప్పుడిస్తున్నారంటూ ప్రశ్నలు వైద్యుల పనితీరుపై ఆరా ఐదుగురు సిబ్బందికి మెమో ఇచ్చిన అధికారులు -
దమ్ముంటే జెడ్పీ పీఠాన్ని టచ్ చేయి..
ఒంగోలు సిటీ: ‘‘నా జెడ్పీ పీఠాన్ని బాలినేని లాగేస్తాడట.. దమ్ముంటే నా కుర్చీ లాగేయి. నీవు లాగేస్తాననగానే వచ్చేవారు ఎవరూ లేరు. జెడ్పీ చైర్పర్సన్ పదవిని నాకు జగన్ ఇచ్చారు. కుర్చీని టచ్ చేసే అర్హత వాసుకు లేదు’’ అని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆమె జెడ్పీటీసీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ‘‘వైవీ సుబ్బారెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మా నాయకుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతోనే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు అనుభవించావు. అసలు నువ్వు ఏరకం నాయకుడివి..పార్టీ వదిలి వెళ్లనని ప్రతి సమావేశంలో చెప్పి..పార్టీ వదిలి వెళ్లిపోతూ వైఎస్ జగన్ను విమర్శించడం అన్యాయంగా ఉంది. అంతకు ముందు రాజకీయాల్లో నీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ఎన్నికల్లో బూచేపల్లి కుటుంబం గెలవకూడదని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశావు. బాలినేనీ..నీవు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో బూచేపల్లి కుటుంబం సంపాదించుకున్న మంచి పేరుతోనే అన్నింటినీ ఛేదించుకుని ప్రజాక్షేత్రంలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విజయం సాధించారు. మా కుటుంబంపై నీకు ఎందుకు అంత కక్ష..మేము నీకు ఏం ద్రాహం చేశామని మాపై విషం చిమ్ముతున్నావు. బూచేపల్లి కుటుంబం అంటే నీలాగా ఇన్చార్జ్ పదవులు, సీట్లు ఇప్పిస్తానని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసే కుటుంబం కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకునే కుటుంబం కాదు. నా భర్త సుబ్బారెడ్డి హయాం నుంచి నేటి వరకు ఎవరికై నా ఒక రూపాయి ఇచ్చామే కానీ..లాక్కునే కుటుంబం కాదు. ఎన్నికల ముందు నువ్వు సంపాదించిన డబ్బులు జగన్ లాగేసుకున్నాడని ఆరోపిస్తున్నావు..ముందు నీవు డబ్బులు ఎక్కడ నుంచి సంపాదించావో చెప్పు. అధికారంలో ఉన్నప్పుడు పేచీల మీద పేచీలు పెట్టి జగన్ను ఇబ్బందులు పెట్టింది నీవు కాదా.. జగన్ డబ్బులు నువ్వు లాక్కున్నావు తప్ప జగన్ లాక్కోలేదు. ఆ అవసరం మా నాయకుడికి లేదు. 2029లో కచ్చితంగా జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అవుతారు. మాకు పదవులు ఉన్నా, లేకపోయినా జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం. బూచేపల్లి కుటుంబం పైన జగన్మోహన్రెడ్డి అభిమానంతో జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. జెడ్పీటీసీలందరూ మావైపే ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా బాలినేని ఇబ్బందులు పెట్టారు. నీ సీటు ఇంకొకరికి ఇస్తామని చెబుతాడు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. బూచేపల్లి కుటుంబాన్ని కానీ, జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని కానీ విమర్శించే హక్కు బాలినేనికి లేదు’’ అని వెంకాయమ్మ ధ్వజమెత్తారు. జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, మాసం జాన్పాల్, తాతపూడి మోజెస్ రత్నరాజు, మడతల కస్తూరిరెడ్డి, నూసం వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలు అందరూ బూచేపల్లి వెంకాయమ్మకు అండగా ఉంటారన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారగానే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏకవచనంతో మాట్లాడటం బాధాకరమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ను మీరు తీసేస్తామని చెప్తే మేము గాజులు తొడుక్కుని లేముగా అని అన్నారు. ఆమె పదవీ కాలం ఐదు సంవత్సరాల్లో ఆఖరి గంట కూడా వదిలిపెట్టమన్నారు. బూచేపల్లి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు, అవినీతి రహిత చరిత్ర ఎవరికై నా ఉందా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు అంతా మీరు సీట్లు ఇచ్చిన వ్యక్తులు కాదన్న విషయాన్ని బాలినేని గుర్తుంచుకోవాలన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయిన ఆదిమూలపు సురేష్కు మంత్రి పదవి ఇస్తే అలిగి పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తి బాలినేని అని విమర్శించారు. బాలినేని దళిత వ్యతిరేకి అన్నారు. అన్నం పెట్టిన పార్టీనీ, అన్నం పెట్టిన రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని నిందిస్తున్న నువ్వు కుక్క కంటే హీనమని మండిపడ్డారు. పార్టీ నుంచి బయటకు వచ్చి నిలకడ లేని పవన్కళ్యాణ్ తో చేరి మా అధినేతను విమర్శిస్తున్నావన్నారు. ఏమి తెలుసని పవన్కళ్యాణ్తో నీ ప్రయాణం కొనసాగిస్తావని ప్రశ్నించారు. ఏ ఒక్క మాటైన నిక్కచ్చిగా మాట్లాడిన, నిలబడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్కళ్యాణ్ ఎన్ని పార్టీలు మారారు.. ఎంత మందిని మార్చారన్నారు. మోడీ ని తిట్టాడు మోడీతో జతకట్టాడనీ, చంద్రబాబును తిట్టాడు చంద్రబాబుతో జతకట్టాడనీ ఇలా తన రాజకీయ వ్యభిచారం చేస్తున్న పవన్ చెంతకు చేరిన నువ్వు అంత కంటే హీనంగా రాబోయే రోజుల్లో రాజకీయాలకు దూరమవుతావని హెచ్చరించారు. పార్టీని కానీ, జగన్మోహన్రెడ్డిని కానీ మరోసారి తిట్టినా నిన్ను ముట్టడిస్తామని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జెడ్పీటీసీలలో ఏ ఒక్కరికి కూడా చైర్మన్ ను దించాలని గానీ, పార్టీ మారే ఆలోచనగానీ లేనే లేదన్నారు. జనసేన పార్టీ బలమెంత.. దానికున్న అభిమానులు ఎంత అని ఎద్దేవా చేశారు. తామంతా వైఎస్సార్ సీపీకి విధేయులమని, డబ్బులకు లొంగేవారం కాదన్నారు. సమావేశంలో కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ, ఒంగోలు జెడ్పీటీసీ సభ్యురాలు చుండూరు కోమలేశ్వరి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ భూమిరెడ్డి రమణమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, మహిళా నాయకులు సాధం విజయలక్ష్మి, అప్సర్ బేగమ్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ను, బూచేపల్లి కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకు లేదు మా కుటుంబం గెలవకూడదని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశావు మేమంటే ఎందుకంత కక్ష, ఏం ద్రోహం చేశాం మాజీ మంత్రి బాలినేనిపై భగ్గుమన్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు
పదో తరగతి విద్యా ర్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా రాయాలి. ఎక్కడైనా మాస్కాపీయింగ్కు పాల్పడితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. – అత్తోట కిరణ్కుమార్, డీఈఓ, ఒంగోలు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్నీ రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదన్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, వారిని ప్రోత్సహించినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తీసుకొని వెళ్లే సమయంలో, జవాబు పత్రాలను తీసుకొని వచ్చే సమయంలో పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసి వేయిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సహాయం చేయడానికి పోలీసు శాఖ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ పెట్రోలింగ్ను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల ఎదురైతే పోలీసు సహాయం కోసం వెంటనే 100, 112, 9121102266కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
పదో తరగతి పరీక్షలు జరిగే సమయంలో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరిగే కేంద్రాల సమీప ప్రాంతాల్లో జెరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసేయాలి. అలాగే కేంద్రంలోకి స్మార్ట్వాచ్లు, కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లను నిషేధించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1900 మంది ఇన్విజిలేటర్లను, 183 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 183 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్కాపీయింగ్కు పాల్పడకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్, 20 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షల షెడ్యూల్ ఇలా ఈనెల 17వ తేదీ తెలుగు, 19న హిందీ, 21న ఇంగ్లిషు, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజి, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖాధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వసతుల విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబరు 78427 77439 కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఎస్ఎస్సీ) షెడ్యూల్ ఇలా.. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఎస్ఎస్సీ) పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్ తెలిపారు. ఈ పరీక్షల కోసం 23 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు సమయం ఉంటుంది. 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. కంభంలోని పరీక్ష కేంద్రం -
నీకన్నా పెద్ద యాక్టర్ లేరు బాలినేనీ..
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒంగోలు సిటీ: బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరూ లేరు. ఆయన పెద్ద కమల్ హాసన్..ముందు ఆయనతోనే సినిమా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై బూచేపల్లి మండిపడ్డారు. ఆమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యా .. బాలినే ని నిన్ను టీడీపీలో చేర్చుకోకుండా తిరస్కరించేసరికి నీ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం జనసేనపార్టీలో చేరావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయం లేదని, సీఎం కాలేడ ని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో చనిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2011లో... ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెక్కల కష్టంతో ప్రజలు, కార్యకర్తల మద్దతుతో వైఎస్సార్ ఆశీస్సులు, ఆశయాలతో 2019 లో సీఎం అయ్యారు. మళ్లీ జగన్ సీఎం కాలేడని చెబుతున్నావు.. మీతాతలు, ముత్తాతలు దిగి వచ్చినా 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. వైఎస్ జగన్ మీకు డబ్బులు ఇవ్వాలి, మీ కుటుంబ డబ్బులు కొట్టేశారని చెబుతున్నారు.. బాలినేనీ..ప్రకాశంలో జిల్లాలో కార్యకర్తలు, నాయకులు, పాత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ల నుంచి నువ్వు దోచినట్లు ఎవ్వరూ దోచుకోలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి జిల్లాలో పార్టీ చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. మాకు పీడ విరిగిపోయిందని అనుకుంటున్నారు. అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ను దించేస్తామని అంటున్నావు..నీలాగా జెడ్పీటీసీలు అవకాశవాదం కోసం రాజకీయాలు చేసేవారు కాదు. పార్టీ మారేవారు ఎవరూ లేరు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ను ఎవరూ ఏమీ చేయలేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతని రాజకీయాల కోసం ఎమ్మెల్సీ అవుతాను, మినిస్టర్ అవుతానని కల్లబొల్లిమాటలు చెబుతున్నారు. అయ్యా పవన్కళ్యాణ్ ఒకటే గుర్తుపెట్టుకోండి బాలినేనికన్నా అవకాశవాది ఎవరూ లేరు, అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుతో జిల్లాలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాను’’ అని బూచేపల్లి అన్నారు. -
కనులపండువగా బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
కొనకనమిట్ల: ప్రముఖ పుణ్యక్షేత్రం వెలుగొండలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి పరవశంతో జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీలక్ష్మీ అలివేలుమంగ వెంకటేశ్వరస్వామి వార్లను వ్యాలీ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివార్లను వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి, సానికొమ్ము కొండారెడ్డి కుటుంబసభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, సింహాద్రీచార్యులు స్వామికి అర్చనలు, అభిషేకాలు చేశారు. కొండపై ఉన్న అమ్మవారిని, గంగమ్మతల్లి ఆలయంలో భక్తులు పూజలు చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారు సింహ వాహనంపై ఊరేగుతారని ఈఓ తెలిపారు. కోర్టు పనులను పరిశీలించిన హైకోర్టు జడ్జి సింగరాయకొండ: మండల కాంప్లెక్స్లో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పనులను ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు పరిశీలించారు. 25వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. కోర్టుకు వచ్చేందుకు అవకాశం ఉండేలా రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కందుకూరు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ నిఖిల్రెడ్డి, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొమరోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముత్రాసుపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాటిచెర్ల గ్రామానికి చెందిన గంగిపోగు ఫ్రాన్సిస్ (34) కూలీ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బేస్తవారిపేట సమీపంలోని పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ముత్రాసుపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వ్యాలీ వాహనంపై ఊరేగిన వెంకటేశ్వరుడు -
మా వాళ్లే మట్టి దొంగలు..!
దర్శి(ముండ్లమూరు): ‘ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు సాగిస్తున్న తవ్వకాలతో ఇప్పటి వరకు కోట్లాది రూపాయల మట్టిని దోచుకెళ్లారు.’ ఇదంతా అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు టీడీపీ యువకులే. సొంత పార్టీ నేతల దోపీడికి తామే బలవుతున్నామంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అండగా టీడీపీ నేతలు సాగిస్తున్న మట్టి దోపిడీకి పక్క పొలాల వారు నీటి పారుదల లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏం తెలియనట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు. రేయింబవళ్లు దోచేస్తున్నారు.. ముండ్లమూరు మండలం పోలవరంలో 90 ఎకరాల చెరువు ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చెరువుపై ఆ పార్టీ నేతల కన్ను పడింది. రేయింబవళ్లు పొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. అయితే ఈ మట్టి తవ్వకాలతో సొంత పార్టీలోని వారికే ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మట్టి తోలేందుకు వచ్చిన టిప్పర్లను, మట్టి ఎత్తుతున్న పొక్లెయిన్లను టీడీపీలోని మరో వర్గం యువకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేయగా..పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అయితే పై నుంచి ఫోన్లు రావడంతో వాళ్లు ఏం చేయకుండా వెనుదిరిగారు. దీనిపై యువకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే మీరేం చేస్తున్నారని, ఎందుకు అడ్డుకోవడం లేదని మట్టిని తరలించే నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంంగా గ్రామానికి చెందిన టీడీపీ యువకులు కిలారి సుమన్, కొర్రపాటి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుమారుడు మాలెంపాటి జితేంద్ర, పరుచూరి గోవర్ధన్, కొర్రపాటి అనీల్ , మాలెం పాటి భార్గవ్ , మాలెంపాటి హేమంత్ తదితరులు మాట్లాడుతూ తామంతా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నామని, ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వకాలతో పొలాలన్నీ బీడులుగా మారుతున్నాయని, దీంతో గ్రామానికి వచ్చి తవ్వడకాలను అడ్డుకున్నామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు తవ్వకాలతో పొలాలకు నీటిపారుదల ఆగింది 10 రోజుల్లోనే 10 అడుగుల మేర తవ్వకాలు రేయింబవళ్లు తవ్వకాలతో వేలాది టిప్పర మట్టి తరలింపు గ్రామాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ యువకుల ఆవేదన ఈ తతంగం అంతా మాజీ ఎంపీపీ కనుసన్నల్లోనే ఫిర్యాదు చేసినా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల గగ్గోలు అధికారంలోకి ఉంటే అంతే.. 2014 టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలోనూ ముండ్లమూరు మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఇక్కడ వాగులు, పొలాల్లో ఇసుకను అక్రమంగా తరలించి బోర్లలో నీరు లేకుండా చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి లేదన్నారు. కానీ మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. చెరువులో మట్టిని తరలించి నీటి పారుదల లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది అడుగుల లోతున మట్టి తీసి వేలాది టిప్పర్లు తరలిస్తుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. ఈ ఏడాది పంటలు పండటం అంతంత మాత్రమేనని, ఇప్పుడు చెరువులో మట్టి తీసి నీరులేకుండా చేస్తే పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నీరు పారే పరిస్థితులు లేక చెరువు పక్కపొలాలు మోటార్లు, ఇంజన్లు ద్వారా నీటి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. తామంతా హైదరాబాద్ నుంచి వచ్చి తవ్వకాలు అడ్డుకున్నామని, మేం ఉద్యోగాలకు వెళితే మళ్లీ తవ్వకాలు చేసి మా పొలాలను గుల్ల చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ లక్ష్మీ నారాయణను వివరణ కోరగా..ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. చెరువులో మట్టి తీసేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. మట్టితీసిన పొక్లెయిన్లు, టిప్పర్ల ఫొటోలు ఇచ్చినా వాటిని సీజ్ చేస్తామని వివరణ ఇచ్చారు. -
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్జేడీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను గుంటూరు ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని సెయింట్పాల్స్ బీఈడీ కళాశాల ఏ, బీ సెంటర్లు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, పీవీఆర్ బిఈడీ కళాశాల, సూర్య స్కూల్, ఆర్.ఆర్ స్కూల్, ఎస్వీ జూనియర్ కళాశాల, ముండ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1164 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులకు కల్పించే వసతుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్జేడీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు, పరీక్షా సెంటర్ల డీఓలు తదితరులు ఉన్నారు. పూరిగుడిసె దగ్ధం గిద్దలూరు రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితురాలు దుగ్గెపోగు రాములమ్మ తన కుమార్తె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఇంట్లో ఉన్న రాములమ్మ ఆమె కుమార్తె ప్రాణభయంలో ఇంటి నుంచి బయటకు వచ్చారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, మంచాలు, వంట సామాన్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంతో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడే పరిస్థితి ఏర్పడిందని రాములమ్మ వాపోయింది. 6 నెలల క్రితం రాములమ్మకు చెందిన గడ్డివామును సైతం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఎంపీపీ కడప లక్ష్మీ, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి రూ.12,500 ఆర్థికసాయం చేశారు. గ్రామ సర్పంచ్ బి.భూదేవి, ఉప సర్పంచ్ పల్లా భారతి, వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రాక్రిష్ణారెడ్డి, సుబ్బారెడ్డి వంట సామాన్లు, ఇతర వస్తువులు సమకూర్చారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని.. ● పురుగుమందు తాగి తల్లి ఆత్మహత్య జరుగుమల్లి(సింగరాయకొండ): కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన మూగ అలివేలమ్మ(44) కూతురితో కలిసి జనవరిలో సంక్రాంతి పండుగ నిమిత్తం అమ్మగారిల్లు కె.బిట్రగుంట వచ్చింది. ఆ సమయంలో కూతురు కోమలి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలమ్మ తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. -
మోసం చేయడం చంద్రబాబు నైజం
పుల్లలచెరువు: ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని రాచకొండలో శనివారం రాత్రి జరిగిన బంగారమ్మ తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా బంగారమ్మ తల్లిని దర్శించుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన సాగించారన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. డీఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకొని కోచింగ్లు తీసుకుంటున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు అన్ని ఇన్నీ కావన్నారు. నియోజకవర్గంలో ప్రతి వీధిలో బెల్టుషాపు దర్జాగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దందాపై కూటమి నాయకులే ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజలు మంచి పాలన చేయమని అధికారం ఇస్తే..కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని కూటమి నాయకులు మర్చిపోయారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, త్రిపురాంతకం దేవస్థానం కమిటీ చైర్మన్ సుబ్బారావు, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ. కోటిరెడ్డి, ఏ రమణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, జిల్లా కార్యాచరణ కార్యదర్శి డి.వెంకటేశ్వర్లు, వలంటీర్ విభాగం అధ్యక్షుడు ఎం వాసు, సీనియర్ నాయకులు బి.సుబ్బారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, గడ్డం సుబ్బయ్య, గాలిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయలేదు మాయమాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం బంగారమ్మ తిరునాళ్లలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మా వాళ్లే మట్టి దొంగలు..!
దర్శి(ముండ్లమూరు): ‘ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు సాగిస్తున్న తవ్వకాలతో ఇప్పటి వరకు కోట్లాది రూపాయల మట్టిని దోచుకెళ్లారు.’ ఇదంతా అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు టీడీపీ యువకులే. సొంత పార్టీ నేతల దోపీడికి తామే బలవుతున్నామంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అండగా టీడీపీ నేతలు సాగిస్తున్న మట్టి దోపిడీకి పక్క పొలాల వారు నీటి పారుదల లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏం తెలియనట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు. రేయింబవళ్లు దోచేస్తున్నారు.. ముండ్లమూరు మండలం పోలవరంలో 90 ఎకరాల చెరువు ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చెరువుపై ఆ పార్టీ నేతల కన్ను పడింది. రేయింబవళ్లు పొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. అయితే ఈ మట్టి తవ్వకాలతో సొంత పార్టీలోని వారికే ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మట్టి తోలేందుకు వచ్చిన టిప్పర్లను, మట్టి ఎత్తుతున్న పొక్లెయిన్లను టీడీపీలోని మరో వర్గం యువకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేయగా..పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అయితే పై నుంచి ఫోన్లు రావడంతో వాళ్లు ఏం చేయకుండా వెనుదిరిగారు. దీనిపై యువకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే మీరేం చేస్తున్నారని, ఎందుకు అడ్డుకోవడం లేదని మట్టిని తరలించే నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంంగా గ్రామానికి చెందిన టీడీపీ యువకులు కిలారి సుమన్, కొర్రపాటి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుమారుడు మాలెంపాటి జితేంద్ర, పరుచూరి గోవర్ధన్, కొర్రపాటి అనీల్ , మాలెం పాటి భార్గవ్ , మాలెంపాటి హేమంత్ తదితరులు మాట్లాడుతూ తామంతా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నామని, ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వకాలతో పొలాలన్నీ బీడులుగా మారుతున్నాయని, దీంతో గ్రామానికి వచ్చి తవ్వడకాలను అడ్డుకున్నామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు తవ్వకాలతో పొలాలకు నీటిపారుదల ఆగింది 10 రోజుల్లోనే 10 అడుగుల మేర తవ్వకాలు రేయింబవళ్లు తవ్వకాలతో వేలాది టిప్పర మట్టి తరలింపు గ్రామాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ యువకుల ఆవేదన ఈ తతంగం అంతా మాజీ ఎంపీపీ కనుసన్నల్లోనే ఫిర్యాదు చేసినా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల గగ్గోలు అధికారంలోకి ఉంటే అంతే.. 2014 టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలోనూ ముండ్లమూరు మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఇక్కడ వాగులు, పొలాల్లో ఇసుకను అక్రమంగా తరలించి బోర్లలో నీరు లేకుండా చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి లేదన్నారు. కానీ మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. చెరువులో మట్టిని తరలించి నీటి పారుదల లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది అడుగుల లోతున మట్టి తీసి వేలాది టిప్పర్లు తరలిస్తుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. ఈ ఏడాది పంటలు పండటం అంతంత మాత్రమేనని, ఇప్పుడు చెరువులో మట్టి తీసి నీరులేకుండా చేస్తే పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నీరు పారే పరిస్థితులు లేక చెరువు పక్కపొలాలు మోటార్లు, ఇంజన్లు ద్వారా నీటి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. తామంతా హైదరాబాద్ నుంచి వచ్చి తవ్వకాలు అడ్డుకున్నామని, మేం ఉద్యోగాలకు వెళితే మళ్లీ తవ్వకాలు చేసి మా పొలాలను గుల్ల చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ లక్ష్మీ నారాయణను వివరణ కోరగా..ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. చెరువులో మట్టి తీసేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. మట్టితీసిన పొక్లెయిన్లు, టిప్పర్ల ఫొటోలు ఇచ్చినా వాటిని సీజ్ చేస్తామని వివరణ ఇచ్చారు. -
కారు, మోటార్సైకిల్ ఢీ
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న కారు, మోటార్సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని హసానాబాద్ బస్టాఫ్ వద్ద అదివారం జరిగింది. ప్రమాదంలో మండల పరిధిలోని చాట్లమడ అగ్రహారానికి చెందిన జడ్డా మార్కు, జడ్డా అఖిల్, జడ్డా దేవరాజ్, జడ్డా దిలీప్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. స్థానికుల కథనం మేరకు..చాట్లమడ అగ్రహారం నుంచి మండల కేంద్రానికి వస్తున్న మోటార్సైకిల్ మండల కేంద్రం నుంచి రామాయపాలెం వెళ్తున్న కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్యం నిమిత్తం క్షతగాత్రులను నర్సారావుపేటకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చిన్నారులతో సహా నలుగురికి గాయాలు -
మహోన్నత వ్యక్తి పొట్టిశ్రీరాములు
ఒంగోలు వన్టౌన్: తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నగరంలోని సీవీన్ రీడింగ్ రూం సెంటర్లోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకోసం, దేశం కోసం చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే నాంది పలికిందన్నారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ పోరాట పటిమకు, కార్యదీక్షకు ప్రతిబింబంగా నిలి చిన పొట్టి శ్రీరాములును యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రంతో పాటూ దళితులకు ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ వాసు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి ప్రాణత్యాగాన్ని విస్మరించకూడదు ఒంగోలు టౌన్: పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పాటైందన్న విషయం విస్మరించరాదని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మహాత్మా గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలాంటి హింసకు తావులేని ఉద్యమాన్ని చేపట్టారని, ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వన్టౌన్ సీఐ నాగరాజు, తాలుకా సీఐ అజయ్కుమార్, ఆర్ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలినేని ఇంతలా దిగజారి మాట్లాడాలా?
● ఎక్స్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ట్వీట్ టంగుటూరు: బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల కోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా అని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ శనివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల రాజకీయాల్లో పదవులు అనుభవించి ఇప్పుడు ఆయన కుమారుడు జగనన్న అస్తిత్వాన్ని ప్రశ్నిస్తావా..నీ అస్తిత్వం ఎక్కడో ఒక్కసారి ప్రశ్నించుకో.. వైవీ సుబ్బారెడ్డి బామ్మర్దిగా రాజశేఖరరెడ్డి కుటుంబానికి దగ్గరయ్యావు తప్ప లేకుంటే నీ అస్తిత్వం ఏంటో నీకు తెలీదా... నీ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ తోనే అన్నావు... గతంలో రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ సీపీలోనే ఉంటానన్నావు.. ఊసరవిల్లి కంటే వేగంగా మాటలు మారుస్తున్నావు. నువ్వేమో పవన్ తోనే ఉంటానని అంటున్నావు... పవన్ మాత్రం చంద్రబాబు తోనే ఉంటానంటాడు. నువ్వేమో గతంలో ఒంగోలులో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని అన్నావు. ఇంతకీ ఏం చేయబోతున్నావు. రాజకీయాలు చేస్తావా లేక పిఠాపురం సభలో చెప్పినట్టు పవన్ తో సినిమా తీసుకుంటావా’’ అని ప్రశ్నించారు. -
‘కంది’గింజంత లాభంలేదు
కందిగింజంత లాభం కూడా ఈఏడాది లేదు. పెట్టిన పెట్టుబడి ఎక్కువైంది. కౌలు ధరలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటాయి. వాతావరణం సరిగాలేక ఈఏడాది దిగుబడి ఎకరాకు కేవలం 2–3 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి ఎకరాకు రూ.20 వేలకు పైగా అయింది. గిట్టుబాటు ధర కూడా లేకపోవటంతో నష్టాలు వచ్చాయి. ప్రైవేటు వ్యక్తులు క్వింటాలు రూ.6700 కు మించి కొనటంలేదు. కొనుగోలు కేంద్రం క్వింటాలు రూ.7550 ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోగా గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదు. – కోటేశ్వరరావు, రైతు, ఎన్ఎస్పీ అగ్రహారం -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దు
● జీరో వేస్ట్ మార్కెట్లను ఆవిష్కరించాలి ● స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా ప్రజలందరూ తమ వంతు బాధ్యత వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు జీరో వేస్ట్ మార్కెట్ల ఆవిష్కరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. శ్రీస్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రశ్రీ కార్యక్రమంలో ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛత దివస్ లో భాగంగా ఒంగోలు నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత లతో కలిసి ఆమె పాల్గొన్నారు. తొలుత దక్షిణ బైపాస్ రోడ్డులోని జిల్లా ట్రెజరీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి వెంట మొక్కలు నాటారు. అనంతరం పీటీసీ రోడ్డులోని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏబీసీ సెంటర్ ప్రాంగణంలో వ్యర్థాలతో రూపొందించిన పార్కును కలెక్టర్ ప్రారంభించారు. ఆ ప్రాంగణం మొత్తాన్ని కలియతిరిగి ఆసక్తిగా పరిశీలించారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తున్న విధానాన్ని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. చివరగా కొత్త కూరగాయల మార్కెట్లో మెప్మా మహిళలకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్రంతో, జూట్ తో చేసిన సంచుల వినియోగాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జీరో వేస్ట్ మార్కెట్లుగా వాటిని తీర్చి దిద్దడంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. అనంతరం మెప్మా మహిళలకు, మార్కెట్లో సరుకులు కొనుగోలు కోసం వచ్చిన ప్రజలకు జూట్, వస్త్రంతో చేసిన బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
శనగ సాగు అంటేనే భయంగా ఉంది
ఈ ఏడాది శనగ పంట అదును సమయంలో తీవ్రమైన వర్షాలతో పంట కాలం కొంత లేటైనప్పటికీ గతేడాది ఉన్న మార్కెట్ ఆశతో ఈ ఏడాది కూడా 10 ఎకరాల వరకు శనగ పంట సాగు చేశా. అయితే, గతేడాది పంట చేతికొచ్చే సమయానికి కాక్–2 రకం శనగలకు సుమారు 10 వేల రూపాయల వరకు రేటు ఉంటే.. ఈ ఏడాది ఇదే రకం శనగకు కేవలం కేవలం రూ.6,800 మాత్రమే ఉంది. జేజే శనగలకు ప్రస్తుతం రూ.5 వేల కంటే ఎక్కువ అడిగే పరిస్థితి కనిపించడం లేదు. పోయిన ఏడాది ఇదే సమయంలో జేజేలను రూ.6,700కు అమ్ముకున్నాము. పంట దిగుబడి కూడా అంత ఆశాజనకంగా లేదు. శనగ సాగు అంటేనే భయంగా ఉంది. – వెంకటేశ్వర్లు, శనగ రైతు, ఈదుమూడి -
లారీ ఢీకొని ఒక వ్యక్తి, ఐదు గొర్రెలు మృతి
● మరొకరికి తీవ్రగాయాలు పుల్లలచెరువు: జీవాలను మేపుకుంటున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతనితో పాటు ఐదు గొర్రెలు మృతి చెందాయి. పుల్లలచెరువు మండలంలోని నరజాములతండాకు చెందిన పి.రాములునాయక్ (45) తనకున్న జీవాలను మేపుకుంటూ శనివారం తెల్లవారుజామున 565వ నంబర్ జాతీయ రహదారిపై మల్లాపాలెం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వస్తున్న లారీ గొర్రెల మందపైగా దూసుకుపోవడంతో ఐదు గొర్రెలతో పాటు రాములునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాములునాయక్కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. పిల్లలిద్దరూ దివ్యాంగులు కాగా, బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. మృతిచెందిన గొర్రెల విలువ దాదాపు రూ.1.50 లక్షలు విలువ ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంపత్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భక్తిరస రమ్యం
నయనానందం..కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం తెల్లవారు జామున వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డిల పర్యవేక్షణలో ఉభయదాతలు శ్రీవారికి పసిడి, రజిత ఆభరణాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు భార్గవాచార్యులు, ప్రసాదాచార్యులు, పవన్కుమార్శర్మ, తిరుమలాచార్యులు కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. కల్యాణ వ్యాఖ్యాతగా తాల్లూరి దుర్గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, తెనాలి, చీరాల, వినుకొండ, నంద్యాల, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణ ఉభయదాతలుగా వాగిచెర్ల, జూటూరి, మూర్తి, తాడి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, కమిటీ సభ్యులు కుందురు కాశిరెడ్డి దంపతులు వ్యవహరించి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు: భక్తులు సమర్పించిన ముత్యాలతో స్వామివార్లకు వేదపండితులు, ఉభయదాతలు స్వామివారికి ముత్యాలతో తలంబ్రాలు పోశారు. తొలుత తాడివారిపల్లికి చెందిన తాడివారు కత్తులు కటార్లతో ఆచారం ప్రకారం గుర్రాల మీద ఉత్సవంగా ఆలయం వద్దకు వచ్చారు. కల్యాణానికి ముందు స్వామి వార్లకు రాయబార మండపం వద్ద నిశ్చితార్ధ రాయబార ఘట్టం నిర్వహించారు. రాయబార ఘట్టాలు ఛలోక్తిగా జరిగాయి. కల్యాణం అనంతరం మహిళలకు ముత్యాల తలంబ్రాలను, తీర్థ ప్రసాదాలు, లాటరీ ద్వారా 10 మంది మహిళా భక్తులకు చీరలు అందజేశారు. ఉదయం అల్పాహారాన్ని బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. వైభవంగా వెలుగొండ వెంకటేశ్వరస్వామి కల్యాణం -
ధర పండక
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతకు కష్టకాలం దాపురించింది. ఒక పక్క వర్షాభావం, మరో పక్క అకాల వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులూ తగ్గాయి. ఉత్పత్తులు తగ్గినప్పుడు సాధారణంగా మార్కెట్లో అనుకున్న ధరలు రావాలి. అందుకు భిన్నంగా ధరలు పతనమయ్యాయి. మిర్చి, పత్తి, శనగ, ధాన్యం ఇలా అన్ని పంటల ధరలు నేలచూపు చూస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పుష్కలంగా పంటలు పండటంతో పాటు రైతు భరోసా డబ్బు రైతుకు కొండంత అండగా నిలిచింది. ఒకరకంగా రైతులకు స్వర్ణయుగం అని చెప్పాలి. తర్వాత ప్రభుత్వం మారింది. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల సమయంలో రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే మొండిచేయి చూపించారు. ● తగ్గిన పంటల దిగుబడులు ● మార్కెట్లో ధరలు లేక అల్లాడుతున్న రైతులు ● ధాన్యం, మినుము, కంది, మిర్చి, శనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ● దయనీయంగా మారిన మిర్చి రైతు పరిస్థితి ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మిర్చి క్వింటా రూ.18 వేల నుంచి రూ.25 వేలు ● కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6 వేలు కూడా రాని వైనం ● రైతు కష్టాలు పట్టని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 40 వేల హెక్టార్లలో ధాన్యం సాగుచేయాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 23 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు 3.4 నుంచి 4 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కన సుమారు 90 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నట్లు అంచనా. రైతుల సొంత అవసరాలు.. స్థానిక అవసరాలకు కలుపుకుని సగానికి అవసరం అనుకున్నా 50 వేల మెట్రిక్ టన్నులుపోను మిగతా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్లో కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించి కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఏర్పాటు చేయటంతో దళారులు బాహాటంగానే దోపిడీకి పాల్పడుతున్నారు. మద్దతు ధరపై బస్తాకు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువ ధర ఇస్తున్నారు. వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదు. రోజులు గడిచేకొద్దీ ధాన్యాన్ని అడిగేవారు ఉండరని దళారులు రైతులను బెదిరిస్తున్నారు. వీరి మాటలు నమ్మి విక్రయించేందుకు వెళితే ‘మట్టి తేమశాతం ఎక్కువగా ఉందని.. బియ్యం విరుగుతూ ఉన్నాయి’ అంటూ సాకులు చూపించి భయపెడుతున్నారు. ఐదు నుంచి ఆరు కిలోల వరకు తరుగు రూపంలో అదనంగా లాగేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ దందా విచ్చలవిడిగా జరుగుతున్నా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. బాహాటంగానే దోపిడీ... గ్రేడ్–ఏ రకానికి రూ.2,320 ఇవ్వనుండగా కామన్ ధాన్యం రకానికి రూ.2,300 ఇస్తోంది. ఈ ధరకు రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తే రైతులు అప్పుల నుంచి కనీసం బయటపడతారు. అలాంటిది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవటంతో దళారులు కళ్లాల్లోనే అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుపోతున్నారు. రైతులు చేసేది లేక క్వింటా ధాన్యం రూ.1500 నుంచి రూ.1800 తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోంది. అంటే రైతు ప్రతి క్వింటాకు రూ.500 మేర తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో గత ఆరేళ్లలో ప్రధాన పంటల సాగు వివరాలు (హెక్టార్లలో) ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకుని... సంవత్సరం వరి శనగ మినుము కంది మిర్చి 2019–20 65,130 86,180 12,368 94,791 39,564 2020–21 88,346 92,410 62,707 81,903 36,885 2021–22 69,061 1,00,935 46,398 80,712 41,250 2022–23 26,523 40,448 27,109 59,087 39,600 2023–24 15,652 35,302 15,426 67,569 29,650 2024–25 23,000 24,588 12,32 71,665 26,163 సంవత్సరాల వారీగా పంటల దిగుబడులు (మెట్రిక్ టన్నుల్లో) సంవత్సరం వరి శనగ మినుము కంది మిర్చి 2019–20 4,31,495 1,11,170 11,340 48,874 2,76,948 2020–21 4,75,788 1,22,834 21,141 35,115 2,39,752 2021–22 5,53,345 1,76,000 61,075 99,750 2,88,750 2022–23 1,49,541 65,233 17,628 11,094 2,77,200 2023–24 61,324 48,117 10,826 26,676 1,77,900 2024–25 90,000 60,826 14,500 72,400 15,7692 -
అక్రమాలకు పాల్పడితే ఎవరినీ క్షమించం
పెద్దదోర్నాల: తాను సర్వసభ్య సమావేశానికి హాజరైతే ఎక్కడ అతను చేసిన అవినీతి బయటకు వస్తుందోనన్న భయంతోనే మండల సర్వ సభ్య సమావేశాన్ని వాయిదాలు వేస్తున్నారని పెద్దదోర్నాల ఇన్చార్జి ఎంపీడీఓ నాసర్రెడ్డి తీరుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరగాల్సిన సర్వ సభ్య సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదన్న కారణంతో వాయిదా వేసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఇన్చార్జి ఎంపీడీఓపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు సమావేశాలను ఏ అధికారులు పాల్గొనకుండా, శాసన సభ్యుడైన తనకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని విమర్శించారు. ఒక వేళ సమాచారం తెలుసుకొని సమావేశానికి వచ్చేందుకు సిద్ధపడితే మళ్లీ ఆ సమావేశాన్ని రద్దు చేస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు 13వ తేదీ సమావేశం ఉందని సమాచారం ఇచ్చారని, అయితే తాను వస్తున్నానన్న నెపంతో దాన్ని 15 తేదీకి వాయిదా వేశారన్నారు. అయితే 15 తేదీ రాగానే మళ్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చి మండల సమావేశాన్ని ఏఓ నిర్వహించాలని బాధ్యతలు అప్పజెప్పారన్నారు. ఏ అధికారం లేని తెలుగుదేశం ఇన్చార్జి చుట్టూ తిరుగుతున్న ఎంపీడీఓ 11 గంటలకు సమావేశం అని ప్రకటించి, అందరూ ఎంపీడీఓ వస్తే సమావేశానికి వెళ్లాలని వేచి చూస్తున్న తరుణంలో మీటింగ్ హాల్ లోకి రాకుండా కోరం లేదంటూ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అసలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదన్నారు. అలాంటప్పడు ఇన్చార్జి ఎంపీడీఓకు స్వచ్ఛ భారత్తో పనేంటని ప్రశ్నించారు. ఒక వేళ స్వచ్చ భారత్లో తాను పాల్గొనదల్చినప్పుడు మండల సర్వ సభ్య సమావేశం ఉందని ఎందుకు ప్రకటించారని అన్నారు. ఈఓపీఆర్డీగా ఉన్న ఈ ఇన్చార్జి ఎంపీడీఓ రూ.25 లక్షలు ఎలా డ్రా చేయగలుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో లాలూచీ పడి నిధులను వారికి దోచి పెడ్తున్నారన్నారు. ఈ సమావేశానికి వస్తే దోచుకున్న నిధులకు ఎక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనన్న భయంతోనే సమావేశాలు వాయిదా వేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇటువంటి అధికారుల చర్యలను కలెక్టర్, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ ఎంపీడీఓ సభను నిర్వహించడు...శాసన సభ్యులంటే గౌరవం లేదు... స్థానిక సమస్యలపై అవగాహన అసలే లేదన్నారు. మండలంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో సిద్దహస్తుడీ ఎంపీడీఓ అని విమర్శించారు. అధికారంలేని వ్యక్తులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించటం ఒక్కటే ఇతనికి తెలిసిన విద్య అన్నారు. ఎండీడీఓ నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జెడ్పీ సీఈఓ, కలెక్టర్లపై ఉందన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను అవమానపర్చటం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి పని చేయకపోవటం ఇదేనా వీరి విధానం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీఓ నాసర్రెడ్డి తీరును విమర్శిస్తూ కార్యాలయం బయట ఎంపీపీ, ఎంపీటీసీ, కోఆప్షన్సభ్యులు, పంచాయతీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎంపీడీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి ఎంపీపీ గుమ్మా పద్మజ యల్లేష్, జడ్సీటీసీ సభ్యురాలు లతా చంద్రకాంత్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ చేసిన అవినీతిపై ప్రశ్నిస్తామన్న భయం ఉంది ఆ భయంతోనే సమావేశాలకు రాకుండా పారిపోతున్నారు కొందరు నాయకులకు తొత్తులా పని చేస్తున్నారు ఇన్చార్జి ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే తాటిపర్తి మండిపాటు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన వెలిగొండ నిర్వాసితులకు ప్యాకేజీ అందజేయండి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందచేశారు. గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న జాబితా ప్రకారం వరుస క్రమంలో పరిహారం ఇవ్వాలని, గెజిట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ మంజూరు చేయాలని, ముంపు గ్రామాల పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు, అర్హత ఉండి సర్వేలో మిస్సింగ్ అయిన కుటుంబాలకు గెజిట్లో చేర్చాలని ఆయన కోరారు. 2,996 కుటుంబాలకు గాను 2,148 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరయ్యాయని, మిగిలిన 848 కుటుంబాలకు పీడీఎఫ్ పెండింగ్ అవార్డులు పూర్తిచేయాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాధాన్యత వరుస క్రమంలో ఇవ్వాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో కొత్త రోడ్లు మంజూరు చేయాలని మరో వినతి పత్రంలో ఆయన కోరారు. యర్రగొండపాలెం నుంచి దుర్గి వెళ్లేందుకు 10 కిలో మీటర్ల రోడ్డు, యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వెళ్లేందుకు 10.5 కిలోమీటర్ల పొడవున్న రోడ్లను మంజూరు చేయాలన్నారు. యర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ రోడ్డు గత ప్రభుత్వ కాలంలో మంజూరైందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పనులు చేపట్టకుండా కాలయాన చేస్తున్నాడని, పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్కు వివరించారు. -
జిల్లాలో వైఎస్సార్ సీపీని నాశనం చేసిన ఘనత బాలినేనిది
● పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్యఒంగోలు టౌన్: జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య చిచ్చుపెట్టి గ్రూపులు కట్టించి వైఎస్సార్ సీపీ ఓటమి చెందడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన కారణమని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగనన్నను కలవకుండా అడ్డుకున్నారన్నారు. బాలినేని పార్టీకి దూరమైన తర్వాత ఈ 9 నెలల కాలంలో తాను పదిసార్లు జగనన్నను కలిసి మాట్లాడానని చెప్పారు. వైఎస్సార్ సీపీలో బాలినేనికి ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు జనసేనలో 250 మందిలో ఎక్కడో వెనక కూర్చోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యాకనే ఒంగోలు వస్తానని బాలినేని చెబుతున్నాడని, ఈ లెక్కన ఆయన ఎప్పటికీ ఒంగోలు రాలేడని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్రావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రవణమ్మ, మహిళా నాయకురాలు షేక్ అఫ్సర్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మలిశెట్టి దేవ, మైనార్టీ నాయకులు షేక్ మీరావలి, షేక్ నాగూర్, తాతా నరసింహగౌడ్, బత్తుల ప్రమీల, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.21 నుంచి జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు కొనకనమిట్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వెలుగొండలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, సభ్యులు జవ్వాజి బాషాపతినాయుడు, మేకలవారిపల్లి రెడ్ల సంఘ సభ్యులు తెలిపారు. 21వ తేదీ ఆరు పండ్ల సైజు విభాగంలో ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 22, 23 తేదీల్లో న్యూ కేటగిరి, సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆరు పళ్ల సైజు విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు అందజేస్తామన్నారు. న్యూ కేటగిరీలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తామన్నారు. సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా వరుసగా రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్టు తరఫున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8008716521, 9505345703, 9963429928, 9581137317 సెల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. 400 ఏళ్లనాటి చింతచెట్టుకు నిప్పురాచర్ల: శతాబ్దాల నాటి చింతచెట్టుకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయి కూలిపోయింది. రాచర్ల మండలంలోని అనుమలవీడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. అనుమలవీడు గ్రామానికి చెందిన షేక్ పల్నాటి గౌస్ అహమ్మద్ నల్లరేగడి పొలంలో ఉన్న 400 సంవత్సరాల కాలంనాటి చింతచెట్టుకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ చెట్టు పూర్తిగా కాలిపోయి కూలిపోయింది. 50 ఎకరాల గల నల్లరేగడి పొలాల రైతులు వచ్చి ఈ చెట్టుకింద కూర్చుని కొంత సమయం సేదతీరేవారు. ప్రస్తుతం వేసవి ప్రారంభమై ఎండలు పెరుగుతున్న సమయంలో చెట్టుకు నిప్పుపెట్టి కూల్చడంపై రైతులు, పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సత్తా చాటిన రాచర్ల మండలం ఎడ్లు
గిద్దలూరు రూరల్: మండలంలోని నరవ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి రెండు పండ్ల ఎడ్ల పోటీల్లో గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలానికి చెందిన ఎడ్లు సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచాయి. రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మీ నాయుడు ఎడ్లు 4104 అడుగులు లాగి మొదటి బహుమతి కింద రూ.25 వేలు, గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కంచర్ల తనిష్కుమార్ ఎడ్లు 3779 అడుగులు లాగి రెండో బహుమతి రూ.20 వేలను దక్కించుకున్నాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం వెంకట చైతన్యకుమార్ ఎడ్లు 3739 అడుగులు లాగి మూడో బహుమతి రూ.15 వేలు, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మీనాయుడు ఎడ్లు 3721 అడుగులు లాగి నాల్గవ బహుమతి రూ.10 వేలు, గిద్దలూరు మండలం బురుజుపల్లెకు చెందిన బాలవెంకటరెడ్డి ఎడ్లు 3660 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.7 వేలు, నంద్యాల జిల్లా సింగవరం గ్రామానికి చెందిన జమాల్బాష ఎడ్లు 3642 అడుగులు దూరం లాగి ఆరో బహుమతి రూ.5 వేలను, నంద్యాలకు చెందిన జయమ్మ ఎడ్లు 3375 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి రూ.3 వేలను దక్కించుకున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 26 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 16 వ తేదిన సీనియర్ విభాగం ఎడ్లకు పోటీలు నిర్వహించననున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి బండి శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాండురంగారెడ్డి, వెంకటస్వామి, నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
కమనీయంగా లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
మర్రిపూడి: పృథులగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారి కల్యాణం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా సాగింది. అర్చకులు నారాయణం ఆదిశేషాచార్యులు, నారాయణం మారుతీచార్యులు, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం తిరుమలాచార్యులు, వేంకటసాయిచార్యులు కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోకంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించి, మొక్కులు చెల్లించారు. ముందుగా స్వామివారి గజోత్సవం మాఢ వీధుల్లో వేడుకగా సాగింది. బరూరి లక్ష్మీనృసింహశాస్త్రి, బరూరి మాణిక్యశాస్త్రి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యహరించారు. కాగా లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.7,13,568 వచ్చినట్లు ఈఓ నర్రా నారాయణరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కుప్పం కొల్లారావు పేర్కొన్నారు. -
భక్తి పరవశం.. శ్రీవారి బ్రహ్మోత్సవం
కొనకనమిట్ల: జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం స్వామి, అమ్మవార్ల మూలవిగ్రహమూర్తులను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వేదపండితులు ప్రసాదాచార్యులు, వెంకట రమణాచార్యలు, దేవులపల్లి రామపవన్కుమార్శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయదాతలు పోలంరాజు కొండలరావు సన్స్, ఆలయ కమిటీ ఈఓ చెన్నకేశవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు కాశిరెడ్డి పర్యవేక్షణలో ధ్వజారోహణ కార్యక్రమం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ.. శనివారం తెల్లవారు జామున శ్రీవారి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. -
ఎమ్మెల్యే విజయకుమార్కు అవమానం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ సభలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్కు అవమానం జరిగింది. విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన మనస్తాపంతో సభలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దాంతో సంతనూతలపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మా ఎమ్మెల్యేను అవమానపరిచారంటూ సభాప్రాంగణంలో నిర్వాహకులతో వాదనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం డాక్టర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్లను నిర్వాహకులు ఆహ్వానించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమంలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ సరిగ్గా 10.30 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అర్ధగంట వేచి ఉన్న తరువాత మంత్రి స్వామి వచ్చారు. అప్పటికే అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. అయినా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. చేసేదేమీ లేక మంత్రి స్వామి, ఎమ్మెల్యే విజయకుమార్ సభా ప్రాంగణంలోనే పడిగాపులు కాశారు. సుమారు గంటకు పైగా ఆలస్యంగా ఎమ్మెల్యే దామచర్ల సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వచ్చీ రాగానే అధికారులు, నిర్వాహకులు హడావుడి చేశారు. ముగ్గురు అతిథుల చేత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి వరకు విగ్రహానికి వేసి ఉన్న కర్టెన్ తొలగిపోవడంతో శిలాఫలకం బయటపడింది. అందులో ప్రొటోకాల్ ప్రకారం సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయయ్కుమార్ పేరు లేదు. విగ్రహావిష్కరణకు సంబంధించి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫొటో లేదు. దాంతో ఎమ్మెల్యే బీఎన్ అవమానంగా భావించారు. అనంతరం సభ ప్రారంభమైంది. ఇక్కడ కూడా నిర్వాహకులు ప్రొటోకాల్ పాటించలేదు. మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల, నగర మేయర్ తదితరులను వేదిక మీదకు పిలిచిన తరువాత చివరిగా ఎమ్మెల్యే విజయకుమార్ను వేదిక మీదకు పిలిచారు. దాంతో ఆయన మరింత అవమానంగా భావించారు. వేదిక మీదకు ఎక్కకుండా వెళ్లిపోయారు. ఇది గమనించిన సంతనూతలపాడు టీడీపీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే మా ఎమ్మెల్యేను అవమానించారంటూ గొడవకు దిగారు. సభకు హాజరుకాని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీల పేర్లను శిలాఫలం మీద వేసి మా ఎమ్మెల్యే పేరు ఎందుకు వేయలేదని నిలదీశారు. రాత్రికి రాత్రి శిలాఫలకం తొలగించి కొత్త శిలాఫలకం వేయించాలని, అప్పటి వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక దళిత ఎమ్మెల్యేను దళిత ఉద్యోగ సంఘాలే అవమానించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ వాదనకు దిగడంలో కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఈ లోపు నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దామచర్ల పాత్రపై అనుమానాలు: అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పేరు ముద్రించకపోవడంతో జిల్లా అధికార పార్టీలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టయింది. ఉప్పుగుండూరు రేషన్ బియ్యం పట్టివేత వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు, బీఎన్ విజయకుమార్కు మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచి దామచర్ల వర్గం లోలోపల ఉడికిపోతున్నారని సంతనూతలపాడు దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే విజయకుమార్ పేరు శిలాఫలకం మీద ముద్రించకుండా చేసి ప్రతీకారం తీర్చుకున్నారని చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందని చెప్పడానికి వీలులేకుండా ఫ్లెక్సీల మీద కూడా ఆయన ఫొటోలు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దామచర్ల ఒత్తిడితోనే డీఆర్ఓ చినఓబులేశు ఈ కుట్రకు తెరతీశారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీలో బయటపడిన విభేదాలు కలెక్టరేట్లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై ఎమ్మెల్యే బీఎన్ పేరు వేయకుండా ప్రొటోకాల్ ఉల్లంఘన బీఎన్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు సభలో పాల్గొనకుండా వెళ్లిపోయిన బీఎన్ విజయకుమార్ -
విజయసాయిరెడ్డివి నీచ రాజకీయాలు
ఒంగోలు సిటీ: విజయసాయిరెడ్డివి హీన రాజకీయాలని, ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పథకం ప్రకారమే వైఎస్సార్ సీపీపై, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేతగా కులాలకు అతీతంగా వైఎస్ జగన్ పనిచేస్తుంటే.. పార్టీలో ఉన్న సమయంలో కుల రాజకీయాలు చేసిందే విజయసాయిరెడ్డి అని ధ్వజమెత్తారు. పార్టీని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి అడ్డగోలు ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఎంతో నమ్మకంగా పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే అక్కడ ఆయన చేసిన నిర్వాకం వల్ల పార్టీ భారీగా దెబ్బతిందని విమర్శించారు. విజయసాయిరెడ్డి చేస్తున్న తప్పులను గుర్తించి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన తర్వాతే ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారన్నారు. ఢిల్లీలో లాబీయింగ్కు అలవాటుపడిన విజయసాయిరెడ్డి అధికారం లేని వైఎస్సార్ సీపీలో ఉండలేక వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి బీజేపీతో అంటకాగాలనో, చంద్రబాబు భయం వలనో అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. అనవసరంగా వారిని వివాదాల్లోకి లాగి అక్కసు తీర్చుకుంటున్నారన్నారు. ఢిల్లీలో తన లాబీయింగ్కు అడ్డువస్తారనే ఉద్దేశంతో వై.వి.సుబ్బారెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేశారన్నారు. వై.వి.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం, అండర్పాస్లు, స్టాపింగ్ లేని స్టేషన్లలో పలు రైళ్లకు స్టాపింగ్ ఏర్పాటు వంటి పనులను ప్రతిపక్షంలో ఉండి కూడా చేశారన్నారు. గతంలో ఎవరూ చేయలేనన్ని పనులు వై.వీ.సుబ్బారెడ్డి చేశారని గుర్తు చేశారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన ఎంపీగా ఉండి ఉంటే ప్రకాశం జిల్లా దశ మారిపోయేదని, ఈ పాటికి పారిశ్రామికవాడ, ఎయిర్పోర్టు, వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేవని అన్నారు. విజయసాయిరెడ్డి కుట్రలు చేసి వై.వి.సుబ్బారెడ్డిని పక్కన పెట్టించారన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వదిలిపెట్టి వెళ్లడం శుభపరిణామన్నారు. విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడిచారు : కె.వి.రమణారెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచిన నీచమైన సంస్కృతి విజయసాయిరెడ్డిదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి మండిపడ్డారు. విజయసాయి చెప్పినట్టు వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్కు కోటరీ లేదని, కానీ కోటరీ పేరుతో విజయసాయిరెడ్డి పెత్తనం చలాయించారని దుయ్యబట్టారు. వ్యక్తిగత స్వార్థంతో వైఎస్సార్ సీపీని వీడిన ఆయన కూటమి నేతలను మెప్పించడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వైఎస్ జగన్మోహన్రెడ్డికి నష్టం కలిగించే చర్యలు విజయసాయిరెడ్డి మానుకోవాలన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిచి రెండోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయిరెడ్డి పార్టీని వదిలివెళ్లిపోయేవారా, ఇటువంటి విమర్శలు చేసేవారా అని ప్రశ్నించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలు చేయకుండా శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కె.వి.రమణారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి.. అధికారంలో లేనప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకట ప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, నాయకులు వై.వెంకటేశ్వరరావు, పట్రా ఐజాక్, షేక్ మీరావలి, జి.రజిని, దేవా, శ్రీకాంత్, పిగిలి శ్రీనివాసులు, ఏడుకొండలు, పి.వెంకయ్యనాయుడు, కయూమ్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు -
చైన్స్నాచర్ అరెస్టు
● 30 గ్రాముల బంగారు సరుడు రికవరీ ● పలువురు సిబ్బందికి రివార్డులు అందజేసిన సీఐ కంభం: మహిళ మెడలో గొలుసు అపహరించిన నిందితుడిని కంభం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను కంభం సీఐ కె.మల్లికార్జున శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మందా హుస్సేనమ్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా నెహ్రూనగర్ 6వ లైను సమీపంలో ఆమె మెడలోని బంగారు సరుడును ఓ యువకుడు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముండ్లపాడుకు చెందిన షేక్ సలీంను నిందితుడిగా గుర్తించారు. గురువారం సాయంత్రం రావిపాడు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్లు, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన సలీం డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారు సరుడు, తాళిబొట్టు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.2,40,000 ఉంటుందని సీఐ వివరించారు. కాగా దొంగను అరెస్టు చేసేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లు బషీర్, రమేష్, మహబూబ్ సుభాని, పీరయ్య, శివ, హోంగార్డ్ ఖాదర్ను ఎస్పీ అభినందించారు. ఆయన సూచన మేరకు సీఐ రివార్డులు అందజేశారు. విచారణకు హాజరుకాని నాయక్ ఒంగోలు టౌన్: మాజీ పార్లమెంట్ సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కస్టోడియల్ విచారణపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ను విచారణాధికారిగా నియమించిన తర్వాత ఏసీబీ ఏఎస్పీ విజయపాల్, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బంధువు తులసిబాబును అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునిల్ నాయక్ను విచారణకు హాజరు కావాలని జనవరి 3న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 14 నుంచి 22వ తేదీలోగా విచారణకు హాజరుకావాలని రెండోసారి నోటీసులు పంపారు. శుక్రవారం ఆయన విచారణకు వస్తారేమోనని పోలీసులు ఎదురుచూశారు. 22వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
దేవాలయాల్లో రెచ్చిపోయిన దొంగలు
దర్శి (ముండ్లమూరు): దేవాలయాలపై దొంగలు విరుచుకుపడ్డారు. ఏకంగా ఒకేరోజు రెండు గ్రామాల్లోని నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలను సైతం పాడుచేసి పోలీసులకు సవాల్ విసిరారు. ముండ్లమూరు మండలంలో జరిగిన ఈ సంఘటనల వివరాల్లోకెళ్తే.. మండలంలోని జమ్మలమడక గ్రామంలో ఉన్న శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో, బొప్పూడివారిపాలెం గ్రామంలోని భక్తాంజనేయస్వామి, పోలేరమ్మతల్లి ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. జమ్మలమడకలో అమ్మవారి పది తులాల బంగారు మంగళసూత్రం, అర కిలో వెండి ఉత్సవమూర్తి, కిరీటం, తొడుగులు, ఇతర ఇత్తడి వస్తువులు, ఉత్సవమూర్తికి చెందిన రెండు తులాల బంగారు తాళిబొట్టు, రెండు తులాల బంగారు ముక్కుపుడక, శివాలయం హుండీ పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.40 వేల నగదు, ఆంజనేయస్వామి గుడిలో హుండీ పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బొప్పూడివారిపాలెంలో భక్తాంజనేయస్వామి, పోలేరమ్మ తల్లి ఆలయాల్లో రెండు హుండీలు పగులగొట్టి రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. సంవత్సరం క్రితం రెండు కోట్ల రూపాయలతో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని భారీగా నిర్మించినట్లు గ్రామస్తులు, పూజారి కే కృష్ణప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గ్రామంలో కరెంటు ఫీజులు తీసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎక్కడో లైన్ కట్ అయి ఉంటుందనుకుని స్థానికులు లైన్మేన్కు ఫోన్ చేయడంతో గంట తర్వాత వచ్చి ఫీజులు వేయడంతో కరెంటు వచ్చింది. ఈలోపే ఆలయాల్లో దొంగలు పడి అందినకాడికి దోచికెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ముందుగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి వాటికి సంబంధించిన హార్డ్డిస్క్లు కూడా ఎత్తుకెళ్లారు. గ్రామంలో పోలీసులు పెట్టిన సీసీ కెమెరా కూడా ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. ఆ తర్వాత గుడిలోకి వెళ్లి గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలున్న తాళిబొట్టు, ఉత్సవ విగ్రహాలతో పాటు హుండీ పగులగొట్టి అందులోని నగదు, ఇతర విలువైన సామగ్రి దోచుకెళ్లారు. బొప్పూడివారిపాలెం గ్రామంలోని సరిహద్దుల్లో గల భక్తాంజనేయస్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయాల్లో కూడా తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి హుండీలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. గ్రామంలో పోలీసులు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఘటన స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ముండ్లమూరులోని హోటల్లో రూ.10 వేల విలువైన అట్లపెండం, జేసీబీ తొండెంను దొంగలు ఎత్తుకెళ్లారు. గత బుధవారం రాత్రి గ్రామంలోని సెంటర్లో మోటారు సైకిల్ ఎత్తుకెళ్లారు. గతంలోనూ అధిక సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లను కూడా దొంగతనం చేశారు. వరుస దొంగతనాలతో ముండ్లమూరు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఒకేరోజు రెండు గ్రామాల్లోని నాలుగు ఆలయాల్లో చోరీ రూ.లక్ష నగదు, 14 తులాల బంగారం, అరకిలోకిపైగా వెండి ఆభరణాల అపహరణ అర్ధరాత్రి కరెంటు కట్ చేసి మరీ దొంగతనం సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి హార్డ్ డిస్క్లు తొలగించిన వైనం -
చింతిస్తున్నాం.. మన్నించండి!
పొన్నలూరు: పొన్నలూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పిల్లి మంగమ్మ 12 ఏళ్లుగా వితంతు పింఛన్ తీసుకుంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఇంటికి పింఛను నగదు అందించేవారు. అయితే ఈ నెలలో మంగమ్మకు వేలిముద్రలు, ఐరిస్ పడలేదంటూ స్థానిక సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పింఛను నగదు ఇవ్వలేదు. ఆర్బీఐఎస్ పద్ధతిలో వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మనోవేదనకు గురైన మంగమ్మ గురువారం ప్రాణాలు విడిచింది. ఈ విషయమై శుక్రవారం ‘పింఛన్ రాలేదన్న ఆందోళనతో ప్రాణాలు విడిచింది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. మంగమ్మ గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని వెటర్నరీ అసిస్టెంట్ నారాయణ, వెల్ఫేర్ అసిస్టెంట్ హరిని ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శుక్రవారం కొత్తపాలెంలోని మంగమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, తమను మన్నించాలని కోరారు. కాగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘ నూతన కమిటీ ఎంపిక ఒంగోలు టౌన్: జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షునిగా కె.శ్రీధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.సంజయ్బాబు, ఉపాధ్యక్షునిగా బి.శేఖర్, సహాయ కార్యదర్శిగా సీహెచ్ అజయ్బాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, సభ్యులుగా డి.సందీప్, జి.రామాంజి నాయక్, రోహిణి, అనిల్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జుల్ఫీకర్ అలీ పరిశీలించగా, ఎన్నికల నిర్వహణాధికారిగా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడు పామర్తి రంగారావు వ్యవహరించారు. మృతి చెందిన పింఛనుదారు కుటుంబానికి ఉద్యోగుల పరామర్శ -
ప్రియురాలితో పెళ్లి కోసం..
కనిగిరి రూరల్: ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో చేయి కోసుకుని యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కనిగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రవితేజకు కనిగిరికి ఇందిరాకాలనీకి చెందిన పుట్టా లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది. లక్ష్మీ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కొద్ది రోజులుగా లక్ష్మీని పెళ్లి చేసుకుంటానని రవితేజ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రవితేజ మద్యం సేవించి ప్రభుత్వాసుపత్రి సమీపంలో కత్తితో చేయి కోసుకున్నాడు. అధిక రక్తస్రావంతో రవితేజ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం పేర్కొన్నారు. -
భూ అక్రమాల కేసుల విచారణ వేగవంతం చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేసులకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సత్వరమే విచారణాధికారులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ ఏ బాలంజనేయులు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, తహసీల్దార్ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17లోగా ఉన్నతాధికారులు సమాచారం అందించాలి ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 21, 25 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్కు శాఖల వారీగా ఉన్నతాధికారులు ఈ నెల 17వ తేదీలోగా సమాచారం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కాన్ఫరెన్స్లో పీపీటీ ద్వారా వివిధ అంశాలను, ముఖ్యంగా జిల్లాలోని పరిస్థితులను బట్టి టాప్–5 శాఖలకు సంబంధించిన వివరాలను, ప్రస్తుత సమస్యలు, మూడు నెలల్లోగా వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను వెల్లడించాల్సి ఉందన్నారు. అందుకోసం సమగ్ర సమాచారాన్ని తనకు అందించాలని అధికారులకు సూచించారు. మూడో శనివారం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం కోసం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో సీపీఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మెకాట్రానిక్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మన్ లాంగ్వేజ్లో శిక్షణ, ప్లేస్మెంట్కు మెకాట్రానిక్స్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ జిల్లా అధికారి రవికృష్ణయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. డిగ్రీ/డిప్లమో ఇన్ మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య గల వారు అర్హులన్నారు. ఈ విభాగాలలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. శిక్షణ ఆరు నెలల పాటు ఉంటుందన్నారు. ఏ1, ఏ2, బీ1 లెవల్ శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం వీసా ప్రాసెసింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఆఫ్లైన్లో విజయవాడ/విశాఖపట్నంలో శిక్షణ ఉంటుందన్నారు. బీ1 లెవల్ శిక్షణ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో కూడా ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి జర్మనీలో నెలకు రూ.2,800 యూరోల నుంచి రూ.3,600 యూరోల వరకూ వేతనం లభిస్తుందన్నారు. వీసా, ఫ్లైట్ ఖర్చులను ఉద్యోగం కల్పించే కంపెనీనే భరిస్తుందన్నారు. కంపెనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కల్పించనున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్ ఖర్చులకు సుమారు రూ.30,000 వరకూ అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు రెండు విడతలుగా రూ.40,000 రీఫండ్బుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు జర్మనీ వెళ్లిన తర్వాత ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. పాస్పోర్టు, పాస్పోర్టు సైజు ఫొటోలు రెండు, 10వ తరగతి మార్కుల మెమో, డిగ్రీ/డిప్లమో ధ్రువీకరణ పత్రం, అనుభవ ధ్రువీకరణ పత్రం, లైటు, లేదా హెవీ వెహికల్ లైసెన్సులను అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు జతపరచాలన్నారు. శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 25 అని తెలిపారు. ఇతర వివరాలకు 99888 53335, 87901 18349 నంబర్లను సంప్రదించాలని రవికృష్ణయాదవ్ సూచించారు. -
అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర తరలింపు
సీఎస్ పురం (పామూరు): సీఎస్ పురం మండలంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. పగలూరాత్రీ తేడాలేకుండా కూలీలను ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా జామాయిల్ కర్ర కొట్టించి పలు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించి అమ్ముకుంటూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. సీఎస్ పురం మండలంలోని కంభంపాడు గ్రామం నుంచి పెదరాజుపాలెం వెళ్లే మార్గంలో నలజనంపాడు రెవెన్యూ పరిధిలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నారు. ప్రస్తుతం సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను గతేడాది డిసెంబర్లో కొందరు అక్రమార్కులు కొట్టి తరలించారు. కానీ, స్థానిక అధికారులుగానీ, సీఐడీ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రస్తుతం 202/1, 204/2, 3, 205/2, 3 సర్వే నంబర్లలో జామాయిల్ కర్రను అక్రమంగా నరికి తరలిస్తున్నారు. ఈ భూమిని గతంలో లింగసముద్రం మండలానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసి అగ్రిగోల్డ్ వారికి అమ్మారని, ప్రస్తుతం ఆ భూమిలోనే జామాయిల్ కర్ర కొడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ వారికి అమ్మినప్పటికీ.. ఆ భూములు అమ్మిన వ్యక్తి పేరుతోనే ఆన్లైన్లో ఉన్నాయని, దానిని అడ్డం పెట్టుకుని ఆ వ్యక్తి జామాయిల్ కర్రను అక్రమంగా కొట్టి తరలిస్తున్నాడని అంటున్నారు. అయితే, దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉండగా, ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని బూచిగా చూపి పలు సర్వే నంబర్లలో కూడా జామాయిల్ కొట్టి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. జామాయిల్ కర్రను ఫైర్ ఉడ్, ఫ్లయ్ ఉడ్, కాగితపు తయారీ, భవన నిర్మాణంలో పోటీ కర్రలకు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మేలు రకం కర్ర టన్ను రూ.7 వేలు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతూ లక్షలు కాజేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అగ్రిగోల్డ్ భూముల్లో ఎవరైనా జామాయిల్ కర్ర కొట్టి తరలిస్తే ఉపేక్షించం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వీఆర్ఓను ఘటన స్థలానికి పంపి వివరాలు సేకరిస్తున్నాం. జామాయిల్ కర్ర కొట్టే సమయంలో సమీపంలోని గ్రామస్తులు సైతం బాధ్యతగా వ్యవహరించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – డి.మంజునాథరెడ్డి, తహసీల్దార్, సీఎస్ పురం విచ్చలవిడిగా నరికి లక్షలు దండుకుంటున్న టీడీపీ నాయకులు -
మంచాన పడ్డా..నా కుమారులు పట్టించుకోవడం లేదు..!
● పోలీసులను ఆశ్రయించిన ఓ తండ్రి గిద్దలూరు రూరల్: ఆరోగ్యం బాగోలేదు.. ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నా నా కుమారులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. గిద్దలూరు మండలం కె.ఎస్.పల్లెకు చెందిన శివాపురం రామకృష్ణ.. భార్య విజయతో కలిసి దుస్తుల వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులైన లక్ష్మీనారాయణ, గణేష్లను చదివించాడు. పిల్లలపై ప్రేమతో లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్య అందించాడు. ఇందుకోసం సుమారు రూ.30 లక్షల మేరకు అప్పులు కూడా చేశాడు. చివరికి రూ.50 లక్షల విలువ చేసే ఇంటిని కూడా కుమారుల పేరుతో రిజిస్టర్ చేశాడు. ప్రస్తుతం కుమారులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా, రామకృష్ణ రెండేళ్లుగా కిడ్నీ, లివర్ వ్యాధి బారినపడి మంచం పట్టాడు. దగ్గరుండి చూసుకోవాల్సిన ఇద్దరు కుమారులు మొహం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనకు న్యాయం చేయాలంటూ భార్యతో కలిసి గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తన ఇద్దరు కుమారులూ పట్టించుకోకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పులకించిన పృధులాద్రి
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్దిచెందిన పృధులగిరి లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి గరుడసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో పృధులాద్రి కిటకిటలాడింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆగమజ్ఙ్నులు నారాయణం ఆదిశేషాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం ఆదిశేషాచార్యులు, వెంకటసాయి స్వామివారిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. గరుడసేవ సందర్భంగా స్వామివారిని పల్లకిపై ఉంచి బోయిలు మెట్లమార్గాన తీసుకెళ్లి అన్ని సత్రాల సమీపంలోని భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తూ ఊరేగించారు. గరుడోత్సవానికి అలవల వెంకయ్య, సుందరరావు, వలేటి నర్శింహారావు ఉభయదాతలుగా వ్యవహరించారు. స్థానికులతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వామివారికి నైవేథ్యంగా సమర్పించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో వేచి ఉండి స్వామివారి మూటవిరాట్ను భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... భక్తుల కోసం దేవదాయశాఖ ఈఓ నర్రా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన సత్రాలలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి కోనేటి స్నానాలు ఆచరించారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్వామివారి సన్నిధిలో ఊయల కట్టడం ఆనవాయితీ కావడంతో పలువురు అనుసరించారు. మరికొందరు మెట్లదారిన నడిచిరాగా, సీతమ్మవారి పాదాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మెట్లను పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్యశ్వంత్, కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మర్రిపూడి, కొండపి, కనిగిరి మండలాల ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వైభవంగా లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో స్వామివారికి గరుడోత్సవం పోటెత్తిన భక్తులు -
కుంచేపల్లి ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు
పొదిలిరూరల్: పొదిలి మండలంలోని కుంచేపల్లి ఎస్సీ కాలనీలో వారం రోజులపాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం.సుగుణకుమార్ తెలిపారు. కాలనీ మొత్తం జ్వరాలతో ఇబ్బందులు పడుతుండటం, పారిశుధ్య లోపంపై ‘మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డాక్టర్ సుగుణకుమార్ మాట్లాడుతూ.. కాలనీ వాసులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర పీడుతులను గుర్తించారని చెప్పారు. కాలనీలో మురుగు నిల్వ ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు ఎబేట్ ద్రావణం పిచికారీ చేయించామని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించామని వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్, ఎబేట్ పిచికారీ వారం రోజులపాటు వైద్య శిబిరం నిర్వహణకు చర్యలు -
ఇతరుల పేరుపై భూమి ఆన్లైన్
పొదిలి: తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని ఇతరుల పేరుపై ఆన్లైన్ చేశారని నందిపాలెం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వెంకట సుబ్బయ్య, అంజిరెడ్డి గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని కార్యాలయంలోనే భైఠాయించి నిరసన తెలిపారు. ఆరేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పెద్ద పెట్టున కేకలు వేశారు. తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి ఆదేశాలతో కార్యాలయానికి చేరుకున్న పోలీసులు తండ్రీ కొడుకులను బయటకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో సుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అంజిరెడ్డిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి తమ జీప్లో పడేశారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా.. ఆరేళ్ల క్రితం నాటి సమస్యపై ఇప్పుడు మరోమారు ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే ఇవ్వాలని కోరగా వినిపించుకోలేదు. మద్యం సేవించిన అంజిరెడ్డి దుర్భాషలాడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చా. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు అందచేస్తే పరిశీలించి న్యాయం చేస్తా’ అని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తండ్రీకొడుకుల నిరసన ఈడ్చిపడేసిన పోలీసులు -
గృహ నిర్మాణాలపై దృష్టి సారించండి
ఒంగోలు సిటీ: గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరితగతిన ఇళ్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓతో కలెక్టర్ గురువారం వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి ‘అందరికీ గృహనిర్మాణం‘ అనే లక్ష్యాన్ని సాధించేందుకు, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు, బీసీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, పీవీటీజీ లబ్ధిదారులకు రూ.లక్ష అదనపు ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమెనిటీస్ సెక్రటరీలు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుని ఇంటిని తనిఖీ చేసి అవగాహన కల్పించి ఫొటో తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ, వార్డు ఎమెనిటిస్ సహాయకులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లనిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి జిల్లాలో లక్ష్యం మేరకు 8,839 గృహలు పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంస్థాగత నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణలు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐజీఓటీ కర్మయోగి వెబ్ పోర్టల్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమైందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగికి శిక్షణ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియ ద్వారా విధిగా శిక్షణ పొందాల్సి ఉందన్నారు. హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ అనే మూడు డిజిటల్ శిక్షణలనే ఉద్యోగి పనితీరును ప్రామాణికంగా చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించినంతకాలం ఈ మూడు శిక్షణల ఆధారంగానే సంస్థాగత నిర్మాణం జరుగుతుందన్నారు. ఒక్కో శిక్షణ కేవలం 18 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. శిక్షణ తదుపరి ఆన్లైన్లో వచ్చే ప్రశ్నావళికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఉద్యోగుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడానికే 856 శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణలు ఇవ్వాల్సి ఉందన్నారు. సమీకృత ఆన్ లైన్ డిజిటల్ శిక్షణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి శ్రీనివాసరావు, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సీపీఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఏపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా -
రచ్చ చేస్తే రంగుపడుద్ది
● హోలీ ప్రశాంతంగా చేసుకోవాలి● ఎస్పీ దామోదర్ హెచ్చరిక ఒంగోలు టౌన్: ఎవరినీ రెచ్చగొట్టకుండా సంతోషకర వాతావరణంలో హోలీ పండుగను చేసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగ చేసుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించవద్దని, మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యలను సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దన్నారు. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలతో పాటుగా డ్రోన్ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడపరాదని, వాహనాలను తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్ధాలు చేయడం, చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మహిళలను వేధింపులకు గురిచేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తలిదండ్రులు పిల్లల పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. గోశాలకు మంటలు ● రూ.50 వేలు ఆస్తి నష్టం మార్కాపురం: పట్టణ శివారులోని బీడుభూమిలో గురువారం చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గోశాలకు వ్యాపించడంతో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం సంభవించింది. ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ కథనం ప్రకారం.. తర్లుపాడు రోడ్డులోని బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి ముళ్లపొదల్లో పడేశాడు. వేసవి కాలం కావడంతో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న పొదలకు వ్యాపించాయి. బీడు భూమి సమీపంలోనే ఉన్న గోశాలకు కూడా నిప్పు అంటుకుంది. ఆ సమయంలో గోవులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గోశాలలోని పశుగ్రాసం, ఇతర సామగ్రి కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలు అదుపు చేశారు. రుణాల రికవరీ వేగవంతం చేయాలిఒంగోలు వన్టౌన్: రుణాల రికవరీని వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టి.నారాయణ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీ సెంటర్లో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, ఏరియా కో ఆర్డినేటర్లు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రుణాల రికవరీ వేగంగా చేస్తేనే నూతన రుణాలు మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి రుణాల రివకరీపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సీ్త్రనిధి, ఉన్నతి, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్, జీవనోపాధులు తదితర రుణాల రికవరీని వేగంగా చేయాలన్నారు. నూతన రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. 700 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత నాగులుప్పలపాడు: రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గురువారం ఎన్ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. చీరాల నుంచి ఒంగోలు వైపు రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్ఫోర్సుమెంట్ డీటీ రాజ్యలక్ష్మి సిబ్బందితో దాడులు చేశారు. చదలవాడ నుంచి త్రోవగుంట వరకు లారీని వెంబడించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో 700 బస్తాల రేషన్ బియ్యం గుర్తించి వాటిని సీజ్ చేసి ఎంఎల్ఎస్ గోడౌన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మోటార్ సైకిల్లో పాము దర్శి(ముండ్లమూరు): స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనంలోకి ఐదు అడుగుల పాము దూరింది. మోటారు సైకిల్లో శబ్ధం రావడంతో పామును గుర్తించిన మోటారు సైకిల్ యజమాని స్థానికుల సాయంతో పామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత సేపటికీ పాము మాత్రం బయటకు రాలేదు. కర్ర సాయంతో చివరకు అతి కష్టం మీద బయటకు తీయగా ఆ పాము జర్రిపోతని స్థానికులు తెలిపారు. దీంతో వాహన యజమాని ఊపిరి పీల్చుకున్నారు. -
పోగొట్టుకున్న బంగారం బాధితులకు అప్పగింత
మార్కాపురం టౌన్: మార్కాపురం మండలంలోని రామచంద్రకోటకు చెందిన వెన్నా కాశిరెడ్డి దంపతులు తమ నగదు, బంగారంను పోగొట్టుకోగా.. పోలీసులు గుర్తించి గురువారం అప్పగించారు. టౌన్ ఎస్సై సైదుబాబు కథనం ప్రకారం.. కాశిరెడ్డి దంపతులు పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల సమీపంలోని తన అక్క ఇంటికి బుధవారం వచ్చారు. అదే రోజు సాయంత్రం తూర్పువీధి మీదుగా స్వగ్రామానికి వెళ్లే సమయంలో బ్యాగును దారిలో పోగొట్టుకున్నారు. బ్యాగ్లో 4 తులాల బంగారు నల్లపూసల దండ, బంగారు చైను, 1,61,500 నగదు ఉండటంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తూర్పువీధిలోని వాగ్దేవి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. తూర్పువీధికి చెందిన ఓ మహిళ వద్ద బ్యాగ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు. పోగొట్టుకున్న నగదును సీసీ కెమెరాల ద్వారా ఒక్కరోజులోనే గుర్తించి అప్పగించిన ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్రావును సీఐ సుబ్బారావు అభినందించారు. బాధితుడు కాశిరెడ్డి పట్టణంలో 4 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని సీఐ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు 4 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామన్న బాధితులు -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకష్ణతో కలిసి తన క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సమీక్ష అనంతరం అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా చర్చించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని సమర్ధంగా నిషేధించాలనే ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ దిశగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంతోపాటు వాటికి ప్రత్యామ్నాయంగా క్లాత్, జ్యూట్ సంచులపై ప్రచారం చేయాలన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నందున శాఖల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలు–పురోగతి, జిల్లాల వారీగా ప్రత్యేక అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లు తయారు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఆయా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పెన్షన్ల పంపిణీ, రెవెన్యూ మ్యుటేషన్లు కరెక్షన్లు, పారిశుధ్ధ్యం, ప్రతి రోజు చెత్త సేకరణ, ఆస్పత్రులు, దేవాలయాల్లో ప్రజలకు అందించే సేవల విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, సీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఎంఅండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, సూరిబాబు, డీపీవో వెంకట నాయుడు, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఏపీడీ వండర్ మాన్, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాష, విద్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
నిలదీసి..
నినదించి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు. ప్రతి మూడు నెలలకొకసారి రూ.700 కోట్ల ప్రకారం ఏడాదికి రూ.2100 కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. వసతి దీవెనకు రూ.1100 కోట్లు ఇవ్వాలని, అయితే బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి ఒట్టి చేతులు చూపారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున విద్యార్థులకు అండగా పోరాటం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు పాలనలో యువత అనేక ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మార్కాపురంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను నిలిపేసి నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసిందని ధ్వజమెత్తారు. ఒంగోలు సిటీ/ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించిందని, వారి భవిష్యత్ను కాలరాస్తోందని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో బుధవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తొలుత డీఆర్ఆర్ మున్సిపల్ స్కూల్ నుంచి భారీ ర్యాలీగా బయలు దేరారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణయాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ సీనియర్ నాయకులు మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లోకి వీరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానగేట్లన్నీ మూసివేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలకులు విద్యార్థులకు, యువతకు చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖాన్ని పూరించిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల కోసం గోరుముద్ద, వసతిదీవెన, విద్యాదీవెన, అమ్మ ఒడి వంటి పథకాలు అందించి అండగా నిలిచారన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్, తల్లికి వందనం, వసతి దీవెన పథకాలు అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేయలేని, దద్దమ్మ పాలకులుగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. విద్యాశాఖను గాలికి వదిలేసి సంబంధిత శాఖ మంత్రి విదేశాల్లో జల్సాగా తిరుగుతున్నాడని విమర్శించారు. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రానికి వచ్చే కంపెనీలు పారిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.4600 కోట్ల బకాయిలు ఇచ్చేందుకు ముగ్గురు పెద్ద మనుషులకు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏదో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకుల చేతకాని తనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మార్కాపురంను జిల్లా చేస్తామని హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా చంద్రబాబు నిస్సిగ్గుగా జిల్లాకు వచ్చి వెళ్లారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన మహిళను నీకు ఓటు ఉందా అని ప్రశ్నించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం యువతను మోసగించడమేనని, ప్రతి ఒక్కరూ దీనిని గమనించి కూటమి నేతలను నిలదీయాలని, గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడని ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో మాట మార్చిన నాయకులపై 420 కేసు నమోదు చేయాలన్నారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డీఎస్సీ ఫైలుపై చేసిన తొలిసంతకం ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం సిగ్గు చేటన్నారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతలో ఆశలు రేపి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించారన్నారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలతో 2500 మెడికల్ సీట్లను రాష్ట్రం కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటి వరకు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఒంగోలు మండల అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, యూత్ వింగ్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మల్లిశెట్టి దేవా, నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కె.వెంకటప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఫ్లోర్లీడర్ ఇమ్రాన్ఖాన్, కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, పేరం ప్రసన్న, బడుగు ఇందిర, సీనియర్ నాయకులు బొట్ల రామారావు, దుంపా చెంచిరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ సాగరు, నాగూరు, రషీదా పాల్గొన్నారు. కూటమి నిర్లక్ష్యంపై యువత గర్జన.. అభ్యర్థుల భవితను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి ‘యువత పోరు’కు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులుసంక్షేమ పథకాలను అటకెక్కించడమే కాకుండా తమ భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ విద్యార్థులు, యువత తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై గర్జించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘‘యువత పోరు’’ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.ర్యాలీలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, తాటిపర్తి చంద్రశేఖర్, ఆదిమూలపు సురేష్, నాగార్జునరెడ్డి, చుండూరి, జంకె -
15న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
గిద్దలూరు రూరల్: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీ జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకుడు ఈదుల పాండురంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో గెలుపొందిన రెండు పండ్ల విభాగం ఎడ్లకు మొదటి నుంచి నాలుగు బహుమతులు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందిస్తారన్నారు. 16వ తేదీ సీనియర్స్ విభాగం ఎడ్ల పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి నుంచి ఆరు బహుమతులు వరుసగా రూ.1,11,111, రూ.77.777, రూ.55,555, రూ.33,333, రూ.22,222, రూ.11,111లను అందిస్తారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 9866432566 సెల్ నంబరును సంప్రదించాల్సిందిగా వారు కోరారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు ఒంగోలు టౌన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. బుధవారం నగరంలోని ఎల్బీజీ భవనంలో ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకురాలు వై. అంజనీ దేవి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రభుత్వాలే మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. మహిళలు మరింతగా ఐక్య ఉద్యమాలు చేయాలని కోరారు. దేశంలోని మహిళల హక్కుల కోసం ఐద్వా అనేక పోరాటాలు చేసిందని, ఐద్వా పోరాటాల ఫలితంగా నేక చట్టాలు, హక్కులను సాధించుకుందని చెప్పారు. రాజ్యాంగం సీ్త్ర, పురుషులకు సమాన హక్కులు ఇచ్చిందని, బీజేపీ పాలనలో మహిళల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ నాగూర్ బి, రాజ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి, పెద్ద గోవిందమ్మ, ఇంద్రజ్యోతి పాల్గొన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునః పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణతో కలసి బుధవారం ఉదయం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియ, పురోగతిపై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పునః పరిశీలన జరగాలన్నారు. ఈ ప్రక్రియపై సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ద సారించాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, సత్యనారాయణ, తహశీల్దార్లు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా చెట్ల నరికివేత!
హైవే అధికారుల తీరుపై విమర్శలుబేస్తవారిపేట: స్థానిక జంక్షన్లో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డు పక్కన ఉన్న భారీ చింత చెట్టును నరికివేశారు. ప్లాట్లకు అడ్డుగా ఉందని జేసీబీ సహాయంతో పెకిలించి, రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి ముక్కలుగా చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైవే అధికారులతో మాట్లాడి చెట్టును తొలగించినట్లు ప్లాట్ను లీజుకు తీసుకున్న వ్యక్తులు చెప్పడం గమనార్హం. హైవే అధికారులతో మాట్లాడేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా ఫోన్ పెట్టేశారు. అడ్డగోలుగా వ్యవసాయ పొలాలను ప్లాట్లుగా మార్చేచోట భారీ చెట్లను తొలగించేందుకు హైవే అధికారులు ఎలా అనుమతిస్తారని స్థానికులు ప్రశ్నించారు. -
వైఎస్సార్ సీపీ జెండా దిమ్మె కూల్చివేత
కంభం: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. బుధవారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంభంలోని కందులాపురం సెంటర్లో ఆ పార్టీ నేతలు ఉదయం ఆవిష్కరించిన జెండాను మధ్యాహ్నానికి తొలగించి, సిమెంట్ దిమ్మెను ధ్వంసం చేయించారు. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యల్లో హైవే అధికారులు, పోలీసులు భాగస్వాములు కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికీ ఆటంకం కలిగించని చోట, ఏళ్ల తరబడి అక్కడే ఉన్న జెండా దిమ్మెను పోలీసులను వెంటబెట్టుకొచ్చి మరీ హైవే అధికారులు ధ్వంసం చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆవిర్భావ వేడుక ముగియగానే యువత పోరు ధర్నాలో పాల్గొనేందుకు నాయకులంతా ఒంగోలు తరలి వెళ్లగా.. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులు, హైవే అధికారులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ జెండా, పక్కనే ఉన్న సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్ జెండాలను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఈ తతంగాన్ని పోలీస్ సిబ్బంది డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం. జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని స్థానికులు ప్రశ్నించగా శ్రీఇది హైవే స్థలం. మా పైఅధికారులు చెప్పారుశ్రీ అని బదులిచ్చారు. వైఎస్సార్ సీపీ జెండా ఉన్న ప్రాంతంలో మొత్తం 7 జెండాలు, టీడీపీ భారీ కటౌట్ ఉండగా వైఎస్సార్ సీపీ జెండాను, మరో నాలుగింటిని మాత్రమే తొలగించడం కక్ష సాధింపులో భాగమేనని విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ కటౌట్, మిగిలిన జెండాలను తొలగించకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటో హైవే అధికారులు స్పష్టం చేయాలని కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక సంఘాల మనోభావాలు దెబ్బతీశారు సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన జెండాలను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించి తమ మనోభావాలు దెబ్బతీశారని ఆయా సంఘాల నాయకులు మండిపడ్డారు. శ్రీతొలగించిన జెండాలను గురువారం ఉదయం అక్కడే మళ్లీ ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తామశ్రీని స్పష్టం చేశారు. ఎవరైనా అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని కార్మిక సంఘాల నాయకులు అన్వర్, రోశయ్య, సిద్దారెడ్డి, గుర్రప్ప, ఖాజావళి, కొత్తూరు తదితరులు హెచ్చరించారు. ఆవిష్కరించిన కొద్దిసేపటికే హైవే అధికారుల అత్యుత్సాహం పక్కనే 20 ఏళ్ల నుంచి ఉన్న కార్మిక సంఘాల నాలుగు జెండాల తొలగింపు టీడీపీ కటౌట్, మరికొన్ని జెండాల జోలికి వెళ్లని వైనం అక్కడే జెండాలు ఏర్పాటు చేస్తామన్న కార్మిక సంఘాల నాయకులు దుర్మార్గమైన చర్య వైఎస్సార్ సీపీ జెండాను తొలగించడం దుర్మార్గమైన చర్య. ఎవరి మెప్పో పొందడం కోసం హైవే అధికారులు ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినట్టుగా ఉంది. మంగళవారం రాత్రి జెండా ఏర్పాటు చేస్తున్న సమయంలో ఓ దళిత ఎంపీటీసీని దుర్భాషలాడారు. ఆ విషయంపై పోలీసుల ఫిర్యాదు చేశాం. హైవే మొత్తం ఇరువైపులా ఆక్రమణలకు గురువుతున్నా పట్టించుకోని అధికారులకు వైఎస్సార్ సీపీ జెండా కనిపించే సరికి ఎక్కడా లేని రూల్స్, ఉద్యోగ బాధ్యతలు గుర్తుకొచ్చాయా. టీడీపీ కటౌట్ ఎందుకు తొలగించలేదు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకుంటే మంచిది. – నెమలిదిన్నె చెన్నారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్, కంభం -
మంచం పట్టిన కుంచేపల్లి ఎస్సీ కాలనీ
పొదిలి రూరల్: పారిశుధ్యం లోపించడం, దోమలు విజృంభిస్తుండటంతో పొదిలి మండలంలోని కుంచేపల్లి ఎస్సీ కాలనీని వ్యాధులు చుట్టుముట్టాయి. గత వారం రోజుల నుంచి కాలనీ వాసులు టైఫాయిడ్, చికున్గున్యా, మలేరియా జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. కాలనీలో ఎవరిని పలకరించినా శ్రీఒళ్లు నొప్పులు.. జ్వరంశ్రీ అంటూ దీనంగా చెబుతున్న పరిస్థితి. విష జ్వరాలు సోకిన బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటుండగా.. గొంతు నొప్పి, జలుబు, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు మంచం పట్టారు. పౌల్ అనే రేషన్ డీలర్ కుటుంబ సభ్యులందరికీ విష జ్వరాలు సోకడంతో దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు వాపోయారు. కాలనీలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఉండగా 25 మందికి విష జ్వరాలు సోకి బడికి రావడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. నేను రాను.. మీకు చేతనైంది చేసుకో.. ఎస్సీ కాలనీలో జ్వర పీడితులు కొందరు అతి కష్టం మీద ఆస్పత్రికి వెళ్తున్నారు. వయసు పైబడిన వారు, నడవలేని స్థితిలో ఉన్న కొందరు బుధవారం ఉదయం 108 వాహనానికి ఫోన్ చేయగా కాలనీ మెయిన్ రోడ్డు వరకు వచ్చారు. గురవమ్మ అనే మహిళ నడవలేక ఇబ్బంది పడుతుండగా ఇంటి దగ్గరకు రమ్మని పిలిచారు. రావడం కుదరదని 108 సిబ్బంది చెప్పడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీమీకు చేతనైంది చేసుకోండి.. సంతకం పెడితే వెళ్లిపోతామశ్రీ తెగేసి చెప్పడంతో చేసేది లేక గురవమ్మను ఎత్తుకుని 108 వాహనం దగ్గరకు తీసుకువెళ్లారు. 108 సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా వారం రోజుల నుంచి కాలనీ వైపు రాని వైద్య సిబ్బంది బుధవారం హడవుడిగా వచ్చి మొక్కుబడిగా వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుధ్యంపై ముందస్తు చర్యలేవి? కాలనీలో పారిశుధ్యాన్ని గాలికొదిలేయడం వల్లే దోమలు విజృంభించి జ్వరాల బారిన పడినట్లు స్థానిక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు దోమ విజృంభణకు కారణమవుతోంది. వీధుల్లో చెత్తా చెదారం, పరిసరాలు అధ్వానంగా ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. కాలనీ మొత్తం జ్వరాల బారిన పడి అల్లాడుతుంటే కనీసం బ్లీచింగ్ చల్లించకుండా, ఫాగింగ్ చేయించకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి చోద్యం చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న రేషన్ డీలర్ పౌలు ఒక్క ఆదర్శ పాఠశాలలోనే 25 మంది విద్యార్థులకు జ్వరం కాలనీలోనూ మరింత మంది జ్వర పీడితులు దారుణంగా పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు నడవలేని స్థితిలో ఉన్నవారి ఇంటి వద్దకు రాని 108 వాహనం -
శక్తి యాప్ కాల్స్కు తక్షణమే స్పందించాలి
ఒంగోలు టౌన్: మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే వివిధ సమస్యల నుంచి బయట పడేందుకు పోలీసుల సాయం కోసం శక్తి యాప్కు ఫోన్లు చేస్తుంటారని, వాటికి సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంను బుధవారం తనిఖీ చేశారు. కంట్రోల్ రూంలో అత్యవసర సేవలను అందిస్తున్న శక్తి యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్వయంగా తన ఫోన్ నుంచి వీడియా ఎస్ఓఎస్కు కాల్ చేసి సిబ్బంది పనితీరును, తక్షణ స్పందన పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శక్తి సిబ్బంది తక్షణమే వచ్చి కాల్ వివరాలను సమీపంలోని పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సంబంధిత పోలీస్స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందజేస్తారని తెలిపారు. సమాచారం చేరవేయడంలో ఎలాంటి జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి చురుగ్గా, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు ధర్నాను వీడియో వాల్ ద్వారా పర్యవేక్షించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఐసీసీఆర్ ఎస్సై ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
ప్రజల కోసం నిలబడతాం.. కలబడతాం
ఒంగోలు సిటీ: ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ప్రజల కోసం చివరిదాకా నిలబడతామని, ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా కలబడతామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్చార్జ్ దద్దాల నారాయణయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్తో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలోని దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి జెండా ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని, పోరాటాలు, ఉద్యమాలు పార్టీకి కొత్త కాదని పేర్కొన్నారు. ఆది నుంచి అన్ని రకాల ఆటుపోట్లును ధీటుగా ఎదుర్కొని ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పారు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ తొలి నుంచీ పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిరుపేద యువకులకు న్యాయం చేసేందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పోరాటం చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గత ఐదేళ్ల జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఎదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద బిడ్డల చదువుల కోసం ఏటా రూ.15 వేల రూపాయలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ను తీసుకువచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చీరాగానే సచివాయాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరూపాన్నే మార్చివేశారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, సంతనూతలపాడు ఎంపీపీ గాయం సావిత్రి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, పార్టీ రాష్ట్ర సెక్రటరీ భూమిరెడ్డి రమణమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు వాణి, సాధం విజయలక్ష్మి, బత్తుల ప్రమీల, వి.మాధవి, బి.మేరీకుమారి, రమణమ్మ, షేక్ అఫ్సార్, గోనుకుంట రజిని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా 15వ ఆవిర్భావ దినోత్సవం హాజరైన ఎమ్మెల్యే తాటిపర్తి, నియోజకవర్గ ఇన్చార్జులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు -
గుర్తుతెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి
దర్శి: గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలోని ఎంవీఐ కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున దుప్పి రోడ్డుపై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దుప్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్బీఓ అమర తెలిపారు. విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ● 115 కేసులకు సంబంధించి రూ.5.92 లక్షల జరిమానా నాగులుప్పలపాడు: ఒంగోలు డివిజన్ పరిధిలోని నాగులుప్పలపాడు మండలంలోని విద్యుత్ విజిలెన్స్ అఽధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఈ విజయకృష్ణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా విద్యుత్ అధికారులు 34 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టగా అదనపు లోడు వినియోగిస్తున్న 106 సర్వీసులకు గాను రూ.5,31,600, విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఒక సర్వీసుకు రూ.10 వేలు, గృహాల కింద విద్యుత్ కనెక్షన్ తీసుకొని వ్యాపారాలకు వినియోగిస్తున్న 8 సర్వీసులకు రూ.51 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో డీపీఈ హైమావతి, ఈఈ హరిబాబు, డీఈ శ్రీకాంత్, రంగారావు, ఏఈ రమేష్బాబు సిబ్బంది పాల్గొన్నారు. దైవచింతన పేరుతో రూ.కోటికి టోకరా మద్దిపాడు: దైవచింతన పేరుతో రూ.కోటికి పైగా ఒక మహిళ టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడుకు చెందిన పురాలశెట్టి ఆంజనేయులు సిటీ కేబుల్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో సుద్ధపల్లి రాజేశ్వరి అనే మహిళ రెండేళ్లుగా బాడుగకు ఉంటుంది. ఈ క్రమంలో ఆంజనేయులు భార్య లక్ష్మితో సన్నిహితంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన పేరుతో పూజలు, దైవ సంబంధిత మాటలు చెప్పేది. ఈ క్రమంలో తనకు సుమిత్ర అను దైవంశ సంభూతురాలితో పరిచయం ఉన్నట్లు మాయమాటలు చెప్పింది. అనంతరం బంగారం ఇంట్లో ఉంటే అశుభం కలుగుతుందని చెప్పి లక్ష్మీ వద్ద ఉన్న 110 సవర్ల బంగారు ఆభరణాలను మాయమాటలతో తీసుకొని పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో రూ.35 లక్షలకు తాకట్టు పెట్టింది. దీంతో పాటు ఆమె వద్ద రూ.11.50 లక్షల నగదును తీసుకుంది. దీనిపై ఆంజనేయులు పలుమార్లు రాజేశ్వరిని నగదు ఇవ్వమలని కోరగా..ఆమె చేతులెత్తేయడంతో ఆంజనేయులు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై శివరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా
ఒంగోలు టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మిస్సింగ్, పెండింగ్ కేసులు, హత్య కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణాలు, అనుమానాస్పద మృతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి అన్నీ కోణాల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీంలను ఏర్పాటు చేయాలని, శక్తి యాప్ను రిజిస్టర్ చేయించాలని చెప్పారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సేవలను అందించాలని చెప్పారు. గంజాయి, ట్రాన్స్ఫారాల చోరీ కేసుల్లో ప్రతిభ చూపిన దర్శి సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు మహేష్, మరియబాబు, కిరణ్ మహేష్, హోంగార్డులు ఖాళీం, ఖాసి రాజులను అభినందించి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈఽశ్వర్, నాగరాజు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ -
దారి చూపిస్తారా..ఽ ధర్నా చేయమంటారా..?
పొదిలిరూరల్: ‘ మా పొలాలకు వెళ్లేందుకు దారి చూపిస్తారా..లేకా ధర్నా చేయమంటారా అంటూ మండలంలోని గోగినేనివారిపాలేనికి చెందిన రైతులు బుధవారం రహదారి పనులు అడ్డుకున్నారు. రైతుల పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారని పనులను అడ్డుకున్నారు. మండలంలోని ఉప్పలపాడు, గోగినేనివారిపాలేనికి చెందిన దాదాపు 50 మంది రైతులకు చెందిన భూములు కొనుగోలు చేసిన కేఎస్ఆర్ అనే సంస్థ రహదారి పనులను చేపట్టింది. దాదాపు 53 ఎకరాల భూమిని 227 మంది రైతులు రోడ్డు నిర్మాణానికి ఇస్తే మొత్తం రూ.19 కోట్లు రైతులకు రావాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు రూ.9.50 కోట్లు చెలించారు. ఇంకా 50 మంది రైతులకు రూ.10 కోట్లు అందాల్సి ఉంది. అందులో గ్రానైట్ కంపెనీకు సంబంధించి రూ.6.50 కోట్లు, ఎండోమెంట్ రూ.1.50 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు కూలీలు చేసే రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని నిరసన తెలియజేశారు. దీంతో నిర్వాహకులు రైతులకు సర్దిచెప్పి ఉన్నతాధికారులకు నివేదించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
జాతీయ అథ్లెటిక్స్లో సత్తా చాటిన జిల్లా పోలీసులు
ఒంగోలు టౌన్: జాతీయ స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు బెంగళూరులో 45వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ఫిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా పోలీసు శాఖ నుంచి 30 ప్లస్ ఏజ్ గ్రాప్ విభాగంలో పోలీసులు సత్తా చాటారు. ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సురేష్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో రెండు సిల్వర్, 4‘100 మీ, 4్ఙశ్రీ400 మీటర్ల రిలే పోటీల్లో రెండు బ్రాంజ్ పతాకాలను సాధించారు. పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావు 4్ఙశ్రీ 100, 4్ఙశ్రీ400 మీటర్ల పోటీల్లో రెండు బ్రాంజ్ పతకాలను సాధించారు. పోటీల్లో ప్రతిభ చాటిన ఆర్ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ శ్రీనివాసరావులను మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువత పోరును జయప్రదం చేయాలి
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అమలు చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చి యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ ఉన్నతాశయంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో చేపట్టే యువత పోరు కార్యక్రమానికి యువత, వారి తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తల్లికి వందనానికి అరకొర నిధులా? తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్రంలో 1.20 కోట్ల మంది తల్లులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల ప్రకారం సుమారు 15 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం 9 వేల కోట్లు మాత్రమే ప్రకటించారని మండిపడ్డారు. ప్రస్తుతం నూతన విధానం ప్రకారం 10 రోజుల పాటు విద్యార్థి ఎటువంటి కారణం లేకుండా పాఠశాలకు రాకపోతే అతని పేరు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని ఆ ప్రకారం జిల్లాలో 45 వేల మంది విద్యార్థుల పేర్లు తొలగించారని ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా కేటాయింలేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై నిర్లక్ష్యం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డాక్టర్ కావాలన్న పేద పిల్లల కలలను నిజం చేసేందుకు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 11 మెడికల్ కాలేజీలు మామే నిర్మించారని గుర్తు చేశారు. ఈ కాలేజీల ద్వారా 2,500 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మార్కాపురం, ఆదోని, పులివెందులలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఇంకా పనులు ఉన్నాయని వాటిని గాలికి వదిలేసి పేద విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పనిచేయవద్దని, వారికి పనిచేస్తే పాముకు పాలు పోసినట్లేనని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో ఆరాచక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఎప్పుడో ఏదో అన్నారని పార్టీ కార్యకర్తలతో కేసులు పెట్టించి కోర్టు ముందు హాజరుపరచకుండా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆక్షేపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను హోం మంత్రి అనిత చెత్త యాప్ అంటున్నారంటే మహిళలపై ఆమెకు ఉన్న గౌరవం అర్థమవుతోందన్నారు. అనంతరం యువత పోరుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, బీసీ సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ బొట్లా రామారావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు పుట్టా వెంకట్రావు, జిల్లా ఆర్గనైజేషన్ మెంబరు కట్టా ఆనంద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పరిటాల సునీల్కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు యనమల మాధవి, ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, పంచాయతీరాజ్ విభాగం షేక్ వన్నూరు, సోషల్ విభాగం అధ్యక్షుడు వేమిరెడ్డి పెద్దిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్కుమార్, ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సలీం, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కొమ్ము ప్రభుదాస్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాదంశెట్టి గుప్తా, జిల్లా ప్రచార విభాగం మాజీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి సురేష్ పిలుపు -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
కనిగిరిరూరల్: పట్టణంలోని ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో మేము సైతం అంటూ కార్మికులు భాగస్వాములయ్యారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దువా, విందులో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసీన్న్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మతసామరస్యతకు ప్రతీకగా.. సోదర, స్నేహ భావాన్ని పెంపొందిచే విధంగా ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొనియాడారు. సీపీఐ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ లౌకిక విలువలు కాపాడుతూ.. ప్రజల్లో ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించే విధంగా కర్షక వర్గాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమంగా కొనియాడారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాది సుమైర్, నజీర్బాష, ఎస్కే సందాని, ఫయాజ్, గండికోట రవి, ఎస్కే వలి, బాషా, నాయబా, అసోసియేషన్ నాయకులు, మదర్ థెరిసా సేవా సమితి అధ్యక్షుడు ఎస్ ఎన్ రసూల్, మండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లేక జనం విలవిల.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల!
అమ్మా రేషన్ కార్డు.. అయ్యా పింఛనెప్పుడు? ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ సమయంలో ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సచివాలయ ఉద్యోగుల వద్ద సమాధానం ఉండటం లేదు. ‘కొత్త పింఛన్లు రాస్తున్నారా అయ్యా.. రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారా అమ్మా..’ అంటూ ఆశగా అడుగుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ‘లేదు.. లేదు.. గవర్నమెంట్ ఇంకా సైటు వదల్లేదు’ అని చెప్పి ముందుకు కదులుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆధారమైన రేషన్కార్డుల మంజూరులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుని నెలలు గడుస్తున్నా కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్కార్డులు, కొత్త పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం ప్రభుత్వ పాలన తీరును తేటతెల్లం చేస్తోంది. బేస్తవారిపేట: గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సుమారు 554 రకాల సేవలు అందిస్తున్న గ్రామ/వార్డు సచివాలయాలను కూటమి ప్రభుత్వం క్రమంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న తీరు అటు ప్రజల్లోనే కాకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందజేయయుడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1058 గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు కాగా జిల్లాల విభజన అనంతరం ప్రకాశంలో ప్రస్తుతం 716 సచివాయాలున్నాయి. మొత్తం 5 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీటిలో మూడొంతులకు పైగా భవనాలను ప్రభుత్వం సొంత నిధులు వెచ్చించి నిర్మించింది. ఒక్కో సచివాలయాన్ని రూ.45 లక్షలతో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్ల ద్వారా అందరికీ తెలియజేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. నాడు కళకళ.. నేడు వెలవెల తొమ్మిది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సచివాలయాల్లో సేవలకు గ్రహణం పట్టింది. సేవలను పూర్తిగా నీరుగార్చడంతో ప్రజలు తమ సమస్యలపై పొలోమంటూ మండల కేంద్రాల్లో అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడా పరిష్కారం కాకుంటే వ్యయ ప్రయాసలకోర్చి ఆర్డీఓలు, జిల్లా కేంద్రానికి వెళ్లి తమ బాధలు చెప్పుకొని వినతి పత్రాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య నిర్వహించే స్పందన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకడమే ఈ దుస్థితికి కారణం. ప్రస్తుతానికి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయకపోయినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అనధికారికంగా కూటమి నాయకులే చూస్తుండటంతో సచివాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో టీడీపీ, జనసేన నాయకుల మితిమీరిన జోక్యం కారణంగా అర్హులైన వారు అన్యాయానికి గురవుతుండగా.. కూటమి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. ఉపాధి హామీ నిధులతో సబ్సిడీపై అందించే పశుగ్రాసం యూనిట్లు, గోకులం షెడ్ల నిర్మాణం, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ రుణాల మంజూరు.. ఇలా ప్రతి పథకంలో నేరుగా కూటమి సానుభూతిపరునే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ సచివాలయాల ద్వారా పారదర్శకంగా జరిగేవని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్, బర్త్, డెత్ తదితర ధ్రువీకరణ పత్రాలకు సచివాయాల్లో దరఖాస్తు చేసుకున్నా మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని, లేదంటే ఆలస్యంగా ధ్రువీకరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల సేవలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుపై ఉద్యోగులను ప్రశ్నిస్తున్న జనం కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా తెరుచుకోని వెబ్సైట్లు సర్వేల పేరుతో ఉద్యోగులను ఇంటింటికీ తరుముతున్న ప్రభుత్వం గతంలో వలంటీర్లతో సర్వే చేయించడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు అండ్ కో ‘సర్వే’శ్వరా.. గత ప్రభుత్వంలో వలంటీర్లతో సర్వేలు చేయించడాన్ని తప్పుబట్టిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఏకంగా సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో నిరంతరం తరుముతున్నారు. మొత్తం 15 రకాల ఇంటింటి సర్వేలతో సచివాలయాల ఉద్యోగులు కుస్తీలు పడుతున్నారు. ‘సర్వే చేస్తున్నాం.. ఓటీపీ చెప్పండి’ అని అడిగితే జనం చీదరించుకుంటున్నారని, తమకు కనీస గౌరవం లేకుండా పోతోందని ఉద్యోగులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సెలవు రోజులతో సంబంధం లేకుండా సర్వేలు చేయాలని చెప్పడం, సర్వే పేరుతో టార్గెట్లు పెట్టడం, మరో వైపు మాతృశాఖల పనులు, బీఎల్ఓ విధులు ఇలా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి వరుసగా వస్తున్న ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. సర్వేల పేరుతో ఇతర శాఖల అధికారులు వేధిస్తున్నారని, పరిస్థితి మారకుంటే ధర్నా చేస్తామంటూ ఏఎన్ఎంలు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నోటీసులివ్వగా మిగిలిన శాఖల ఉద్యోగులు సైతం ఇదే బాటను అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
వలసబాట
డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు: 47,423 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.218 కోట్లు యువత సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టౌన్: జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 47,423 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. దాంతో గత ఏడాదికి సంబంధించి రూ.110 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజు రీయింబర్స్మెంటుతో మాకు సంబంధం లేదంటూ ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేశారు. దాంతో వేలాది మంది విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమందైతే చదువులు మానేసి పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇక రెండో ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారేమో అని ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ రెండో ఏడాది కూడా చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పి మొండిచేయి చూపింది. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి. నగరంలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు చెల్లించలేదని ఒక విద్యార్థిని కాలేజీ బయట నిలబెట్టారు. బైపాస్ లో ఉన్న మరో డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తాం, లేకుంటే లేదని బెదిరింపులకు దిగింది. హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను నానా తిప్పలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 సంవత్సరానికి ఒక త్రైమాసికంలో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు. మిగతా మూడు త్రైమాసికాలకు ఫీజులు చెల్లించలేదు. అలాగే 2024–25 విద్యాసంవత్సరానికి గాను మూడో సెమిస్టర్ గడుస్తున్నా నేటికీ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఇప్పటి వరకూ జిల్లాకు సంబంధించి రూ.218 కోట్లు పెండింగులో ఉన్నాయి. రీయింబర్స్మెంట్ ఇస్తారో లేదో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. నిరుద్యోగ భృతికి ఎగనామం: లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. జిల్లాలో సుమారు 7.86 లక్షల యువకులు, 7.65 లక్షల మంది యువతులు ఉన్నారు. వీరిలో సుమారు 11 లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాలు వచ్చే వరకు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ.330 కోట్ల మేర నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,960 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. అటు ఉద్యోగాలు ఇవ్వకుండా, చేయడానికి ఎలాంటి పనులు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఫైలు మీద తొలి సంతకం చేస్తామని చంద్రబాబు చెప్పిన మాట కూడా నీటి మూటలా మిగిలి పోయింది. జిల్లాలో బీఈడీ చేసిన సుమారు 8 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కానిస్టేబుల్ పరీక్షలు రాసిన వారు 5 వేల మంది ఉన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్కాపురం, ఒంగోలు మెడికల్ కాలేజీలు, జీజీహెచ్ ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు సంబంధించి 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఆ ఉద్యోగాల కోసం అప్పట్లో 15 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి వద్ద నుంచి వసూలు చేసిన దరఖాస్తు ఫీజును వెనక్కి తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్స్రా్ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా సుమారు ఆరు వేల మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించింది. వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 12 వేల మందికి ఉపాధి కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీరు శాఖకు మంత్రిని నియమించింది కానీ ఆ వ్యవస్థకు మంగళం పాడడం గమనార్హం.ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నవారు: 23,448 మంది ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు: 52,000 మంది 11 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి నెలకు: రూ.330 కోట్లు సంవత్సరానికి: రూ.3,960 కోట్లు బీఈడీ అభ్యర్థులు: 8000 మంది కానిస్టేబుల్ పరీక్షరాసిన వారు: 5000 మంది ఉద్యోగం రాక కూలి పనులకు వెళ్తున్నాను నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు రాక పొలం పనులకు వెళ్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనబడటం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలి. – సుధా, అర్థవీడు మండలం జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లు గడవడం కష్టమైపోవడంతో ఏ పని దొరికితే ఆ పనికి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి పనులు కూడా లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలుగా పనులకు వెళుతున్నారు. అక్కడ కూడా రాజకీయాలు ప్రవేశించడంతో చేసేదేమీ లేక భవన నిర్మాణ కార్మికులుగా బెంగళూరు, హైదరాబాద్, చైన్నె నగరాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ పనులకు వెళుతున్న వారి సంఖ్య ఇలా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా, నాన్ టీచింగ్ పనులు చేస్తున్నవారు 7 వేలు, ప్రైవేటు కాలేజీలలో పనులు చేస్తున్న వారు 5 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాంపౌండర్లుగా, నర్సులుగా పనులు చేస్తున్న వారు 10 వేలమంది, జుమాటో, స్విగ్గిలలో 3 వేల మంది, ఆటో డ్రైవర్లుగా 8 వేల మంది, పెట్రోలు బంకుల్లో బాయ్స్గా , అకౌంటెంట్లుగా 1500 మంది, షాపింగ్ మాల్స్లో సేల్స్ మెన్లు, సేల్స్ ఉమెన్లుగా 7 వేల మంది, చిన్న షాపింగ్ మాల్స్లో 5 వేల మంది, మెడికల్ రిప్రజెంటివ్స్ 500 మంది, కేటరింగ్ 3 వేల మంది, టెలీ కాలర్స్ 2 వేల మంది అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. సుమారు 52 వేల మంది వచ్చే అరకొర వేతనాలతో బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులకు సైతం మొండిచేయి... జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు చదువుకొని ఉద్యోగం కోసం వస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరిలో కంటి చూపు లేని వారు 626 మంది, చెవిటి మూగ వారు 640 మంది, కాళ్లు చేతులు లేని వికలాంగులు 4,172 మంది ఉన్నారు. మొత్తం 5438 మంది దివ్యాంగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరే కాకుండా 6,348 మంది మహిళలు, 7,184 మంది ఎస్సీలు, 1,511 మంది ఎస్టీలు, 6,620 మంది బీసీలు ఉన్నారు. నేటికి 23,448 మంది ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్లో రిజిస్టర్ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తలా ఏపీఎం!
● కోర్టు ఆదేశాలు బేఖాతరు ● వీఓఏలపై వైఎస్సార్ సీపీ ముద్రవేసి తొలగింపు ● కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు ముండ్లమూరు(కురిచేడు): కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత చిరుద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. ఎలాంటి తప్పులు లేకపోయినా కూటమి నాయకులు కక్షగట్టి మరీ తప్పిస్తున్నారు. మండలంలో వీఓఏల పై ఏపీఎం హనుమంతరావు ఒక టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని చిరుద్యోగులు వాపోతున్నారు. టీడీపీ ముఖ్యనేతల నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఉద్యోగాల నుంచి వైదొలగాలని వీఓఏలను బలవంతం చేయటంతో కొందరు తప్పుకున్నారు. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా మండలంలోని చిన్న ఉల్లగల్లు గ్రామ సంఘం వీఓఏగా పనిచేస్తున్న తప్పెట కృపమ్మను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి విధులు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వారిపై కృపమ్మ హైకోర్టులో కేసు వేశారు. ఆమె విధులకు ఆటంకం కలిగించకూడదని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆన్లైన్ నుంచి తన పేరును తొలగించినట్లు కృపమ్మ తెలిపింది. ఆమేరకు మంగళవారం వెలుగు కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ప్రభుత్వం మారిందని నన్ను తొలగించారు ప్రభుత్వం మారిందని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లు తనపై ఉన్నాయని నన్ను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి మానుకోవాలని నిత్యం ఒత్తిడి చేస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టులో వారిపై కేసు వేసి ఇంజక్షను ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా కూడా రూ.20 వేలు ఇవ్వాలని, ఇస్తే ఉంచుతానని ఏపీఎం డిమాండ్ చేశారు. అవి ఇచ్చేందుకు నావద్ద లేవని చెప్పటంతో నాపేరు ఆన్లైన్ నుంచి తొలగించారు. కోర్టు ఆర్డరు తెచ్చుకున్నా మీరు ఉద్యోగం ఎలాచేస్తారో చూస్తానంటూ బెదిరిస్తున్నారు. కోర్టు ధిక్కారం కింద ఏపీఎం, సీసీపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయండి. – తప్పెట కృపమ్మ, వీఓఏ మేము తొలగించలేదు కృపమ్మను ఉద్యోగం నుంచి తొలగించలేదు. 10వ తేదీ వరకు విధులు నిర్వహించింది. కోర్టు ఇంజక్షను ఆర్డర్ తెచ్చినా మేము ఏమీ అనలేదు. ఆ తరువాత కోర్టు ధిక్కరణ కింద మాపై మళ్లీ కోర్టుకి వెళ్లింది. అందువలన ఆమె లాగిన్ ఆన్లైన్లో ఇన్ యాక్టివ్ చేశాం. – ఏపీఎం హనుమంతరావు -
‘యువత పోరు’ను జయప్రదం చేయండి
దర్శి (కురిచేడు): ఒంగోలులో బుధవారం జరిగే యువతపోరును జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నగదు ప్రభుత్వం ఇవ్వకపోవటంతో అనేక మంది కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏటా స్కాలర్ షిప్ లు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత వరకు ఎటువంటి ఫీజులు చెల్లించలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, ఇత్తడిదేవదానం, జెడ్పీటీసీలు రత్నరాజు, నుసుం వెంకట నాగిరెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా యూత్ అధ్యక్షుడు జీ శ్రీకాంత్రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యం దేవప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీ సూదిదేవర అంజయ్య, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, దర్శి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి -
తొలగించిన భూముల పునఃపరిశీలన చేపట్టాలి
● సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఒంగోలు సిటీ: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. అమరావతి నుంచి సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫెరెన్స్లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డలకు మేలు చేసే కంగారు కేర్ సెంటర్లు ఒంగోలు టౌన్: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి కంగారు మదర్ కేర్ సెంటర్లు ఎంతో మేలు చేస్తాయని కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చీఫ్ ఆఫీసర్ ట్రాయ్ చున్నిగం అన్నారు. మంగళవారం ఆయన సీఈబీ టీం సభ్యులతో కలిసి జీజీహెచ్లోని గైనికాలజీ, పీడియాట్రిక్, ఎస్ఎన్సీయూ, ప్రతిపాదిత కంగారు మదర్ కేర్ సెంటర్లను పరిశీలించారు. తొలుత సీఈబీ టీం సభ్యులు రీసెర్చ్ డైరక్టర్ వివేక్ సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రావ్యలు సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వివిధ విభాగాలకు చెందిన వైద్యులతో చర్చించారు. సీఈబీ పూర్తి స్థాయిలో సాంకేతిక సాయాన్ని అందజేస్తుందని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్లో అన్నీ రకాల సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ జమున టీం సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కిరణ్, డీసీహెచ్ఎస్ డా.సూరిబాబు, మదర్ కేర్ నోడల్ అధికారి డా.వేణుగోపాల్ రెడ్డి, హెచ్ఓడీలు సంధ్యారాణి, శివరామకృష్ణ, డా.తిరుమలరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శనగలు, మినుములు కొనుగోలుకు అనుమతులు ● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సిటీ: శనగలు, మినుముల పంట ఉత్పత్తులను నాఫెడ్ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుంచి శనగలు కనీస మద్దతు ధర రూ.5650, మినుములు కనీస మద్దతు ధర రూ.7400 లకు కొనుగోలు చేసేందుకు అనుమతులు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 23,023 మంది రైతులు 24,600 హెక్టార్లలో శనగల పంట సాగు చేసుకున్నట్లు ఈ క్రాప్లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 60,826 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేశారు. మినుములు 11,200 హెక్టార్లలో 12,540 మంది రైతులు ఈ–క్రాప్లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 14,489 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. రబీ 2024–25 లో శనగ, మినుముల పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకున్న రైతుల వద్దనుంచి పంట కొనుగోలు చేస్తారన్నారు. రైతులు ఈనెల 13వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంట వివరాలు, పంట నూర్పిడి తేదీని నమోదు చేయించుకోవాలని చెప్పారు. రైతు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ద్వారా అమ్ముకోవాలని సూచించారు. తమ సరుకును అమ్ముకొనే తేదీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుందని, రైతులకు తమ డబ్బులు ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారన్నారు. రైతులు తమ సరుకును అమ్మే సమయంలో తమ మొబైల్ నంబరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ కు లింక్ అందో లేదో సరి చూసుకోవాలని తెలిపారు. రైతులు తమ పంటను శుభ్రపరుచుకొని, ఆరబెట్టుకొని శనగలు తేమ శాతం 14 శాతంలోపు, మినుములు తేమ 12 శాతం లోపు ఉండి ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. -
యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, యువతకు ఉద్యోగ కల్పన లేకుండా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 12న చేపట్టిన శ్రీయువత పోరుశ్రీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత పోరు పోస్టర్ను జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ నెల్లూరు బస్టాండ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా 99 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు స్కాలర్షిప్ల కింద గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత సంవత్సరానికి కలిపి రూ.7800 కోట్లు బకాయిలు ఉంటే కేవలం రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో కూడా సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఫీజులు కట్టడం లేదని కొంత మంది యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు డ్రాప్అవుట్గా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక, ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగభృతి ఒక్కొక్కరికీ రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు కానీ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెప్పారు. 12 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా, చంద్రబాబు ఈ రాష్ట్రానికి మెడికల్ సీట్లు అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ కు లిఖిత పూర్వకంగా ఇచ్చారన్నారు. మార్కాపురం మెడికల్ కాలేజీ 75 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన నిధులు విడుదల చేసి పూర్తిచేయాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రూ.లక్ష కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులను ఎన్నికల ముందు సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్ష కోట్లు అప్పులు చేసి కూడా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదన్నారు. వెలుగొండపై చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలే.. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ అసత్యాలేనని బూచేపల్లి ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోని రెండు టన్నెల్స్ పూర్తి చేశారన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి వెలిగొండ ద్వారా నీళ్లిచ్చే వాళ్లమన్నారు. కానీ మార్కాపురం సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం అంతా అబద్ధాల పుట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రూ.600 కోట్లు అని పెట్టారు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, వెలుగొండను నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు కేవలం ప్రాజెక్టుకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించి శరవేగంగా చేశారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో వెలుగొండకు నిధులు కేటాయించి రెండు టెన్నెల్స్ పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు తొమ్మిది నెలల కాలంలో ఒక్క సెంటీమీటరు అన్నా పనులు చేశారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడేందుకే తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని, కానీ కూటమి ప్రభుత్వం జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తాడేమోనని భయంతో ఉన్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కర్నేటి ప్రసాద్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలులో ‘యువత పోరు’ ర్యాలీ రేపు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతిపై మోసగించిన చంద్రబాబు వెలుగొండపై బాబు చెప్పేవన్నీ అసత్యాలే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
షిఫ్ట్ ఆపరేటర్పై లైన్మన్ దౌర్జన్యం
కొమరోలు: విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్పై లైన్మన్ తన అసిస్టెంట్తో కలిసి దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం కొమరోలు మండలం తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్స్టేషన్లో చోటుచేసుకుంది. షిఫ్ట్ ఆపరేటర్ గుర్రాల చంద్రశేఖర్ కథనం మేరకు.. తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్స్టేషన్లో గత రెండేళ్ల నుంచి చంద్రశేఖర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ గురువారం రాత్రి లైన్మెన్ డికోజీ నాయక్ అసిస్టెంట్గా ఉన్న నాగూర్ అనే వ్యక్తి పూటుగా మద్యం తాగి విద్యుత్ సబ్స్టేషన్లో పడుకునేందుకు వెళ్లాడు. దీంతో శ్రీమద్యం తాగి ఉన్నావు.. ఇక్కడ పడుకోవద్దుశ్రీ అని షిఫ్ట్ ఆపరేటర్ నిరాకరించాడు. ఆ సమయంలో ఆపరేటర్ను తిడుతూ నాగూర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో లైన్మన్ డికోజీ నాయక్, అసిస్టెంట్ నాగూర్ విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకున్నారు. చంద్రశేఖర్పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడటమే కాకుండా చేతులతో నెట్టి కొట్టారు. సబ్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై విద్యుత్ శాఖ ఏఈకి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. దీంతో విద్యుత్ లైన్మన్ డికోజీనాయక్, అసిస్టెంట్ నాగూర్ మళ్లీ సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ‘మాపైనే ఫిర్యాదు చేస్తావా, నీ సంగతి తేలుస్తాం, అంతు చూస్తాం’ అని బెదిరించారు. తనకు ప్రాణహాని ఉందని, రాత్రి వేళల్లో విద్యుత్ సబ్స్టేషన్లో ఒక్కడినే ఉంటానని, తనకు రక్షణ కల్పించాలంటూ సంబంధిత అధికారులను షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్ వేడుకుంటున్నాడు. సహాయకుడికి మద్దతుగా వచ్చి దాడి చేసిన వైనం తనకు రక్షణ కల్పించాలంటున్న షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్ -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 237 అర్జీలు రాగా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదే శం -
కన్నీళ్లు పెట్టిస్తూ..!
కోతలు కోస్తూ.. గతం.. ఘనం వ్యవసాయానికి పగటి పూటే నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అభివృద్ధి పనులకు నాంది పలికింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. అప్పటికి ఉన్న ఫీడర్ల సామర్థ్యం సరిపోదని భావించి, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.850 కోట్ల వ్యయంతో 35 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నాంది పలికింది. సబ్ స్టేషన్లు, ట్రానన్స్ ఫార్మర్లు, వ్యవసాయ ఫీడర్లను సిద్ధం చేసింది. నూతనంగా 1750 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసింది. నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా వ్యవసాయానికి అందజేసింది. విద్యుత్ ఉపకేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్మాణాలు పూర్తయి, సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. కళ్ల ఎదుటే రెక్కల కష్టం చెదిరిపోతుంటే .. కరెంటు రూపంలో పంటలు ఎండుతుంటే..అన్నదాత గుండె మండుతోంది. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై మాట తప్పిన కూటమి సర్కార్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కోతలు విధిస్తూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఏడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా వేళాపాళా లేకుండా ఇష్టారాజ్యంగా కరెంటు ఇస్తుండడంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఒకవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. మరో వైపు విద్యుత్ కోతలు వారిపాలిట శాపంగా మారాయి. -
సబ్రిజిస్ట్రార్పై ఆగంతకుల దాడి
గిద్దలూరు రూరల్: గిద్దలూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.కృష్ణమోహన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి గిద్దలూరు పట్టణంలోని జువ్విళ్లబావి సమీపంలో సబ్ రిజిస్ట్రార్ ఇంటి వద్ద చోటుచేసుకుంది. ఇటీవల బదిలీపై గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్గా నియమితులైన కృష్ణమోహన్ తన సమీప బంధువుతో కలిసి జువ్విళ్ల బావి వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కుటుంబ సభ్యులు మాత్రం చీరాలలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ముఖానికి మాస్క్లు ధరించిన నలుగురు వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్పై దాడికి తెగబడినట్లు సమాచారం. పిడిగుద్దులు కురిపించిన వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం తేరుకున్న సబ్రిజిస్ట్రార్ స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు భూముల రిజిస్ట్రేషన్లు సాగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. డివైడర్ను ఢీకొట్టిన బైక్ ● ఒకరికి తీవ్ర గాయాలు కంభం: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకిరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వ్యక్తిగత పని నిమిత్తం నంద్యాల జిల్లా పాణ్యం వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం పట్టణంలోని హైవే రోడ్డుపై ఉన్న యూటర్న్ అర్థంగాక ఓ బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైక్పై నుంచి రోడ్డు మీద పడిపోయిన బి.వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బైకును ఢీకొట్టిన లారీ ● చర్చి పాస్టర్ మృతి అద్దంకి: బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ చర్చి పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని బస్టాండు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన పాస్టర్ అత్తోటి బాలసుందరం(66) బైకుపై వ్యక్తిగత పని నిమిత్తం అద్దంకి వచ్చారు. బైకు బస్టాండ్ సమీపంలోకి రాగానే.. అద్దంకి నుంచి మేదరమెట్ల వైపుకు వెళ్తున్న లోడ్ లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలసుందరం అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై రవితేజ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అర్ధరాత్రి కరెంటు.. అన్నీ కష్టాలే..
కురిచేడు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన నుసుం నాగిరెడ్డి 5 ఎకరాల్లో మిరపపంట సాగు చేశాడు. ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. 9 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి 7 గంటలు ఇస్తున్నారు. మిగతా 2 గంటలు రాత్రి 10–12 వరకు ఇస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆపిన కరెంటు రాత్రి 10 గంటలకు ఇచ్చే సరికి ఎండకు ఉదయం పెట్టిన నీరు ఇంకిపోతున్నాయి. సరిపడా నీళ్లు అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నట్టుగా తయారవుతున్నాయి. పైగా తెల్లవారు జామున 4 గంటలకు కరెంటు ఇస్తుండడంతో మూడు గంటలకు లేచి పొలం వెళ్లాల్సి వస్తోంది. అర్ధరాత్రి పొలంలో విషసర్పాలు తిరుగుతుంటాయి. ఏ టైంలో ఏం జరుగుతుందోననే భయంగా..భయంగా పొలానికి వెళ్లాల్సి వస్తోంది. రాత్రి పూట అనేసరికి కూలీలకు రెట్టింపు రేట్లు చెల్లించాల్సి వస్తోంది. 11 గంటలకు కరెంటు ఆగిపోతే పగలంతా పనులు చేసుకుని, మళ్లీ రాత్రిపూట రోజూ నిద్రకాయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని నాగిరెడ్డి వాపోతున్నాడు. ప్రభుత్వ చర్యలతో అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వేళాపాళాలేని కోతలతో ఇబ్బంది పడుతున్నాం.. నేను 27 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశాను. పొగాకు 7 ఎకరాలు, నిమ్మ 4 ఎకరాలు, బొబ్బర్లు 6 ఎకరాలు, మినుము 4 ఎకరాలు, కంది 6 ఎకరాల్లో సాగు చేశాను. వ్యవసాయానికి ఉదయం 8:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పగటిపూట తొమ్మిది గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి. అప్పుడే రైతులు తమ పొలాల్లో నీరు పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట సరఫరా చేయటం వల్ల నీరు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది. కరెంట్ కోతలతో సరఫరా ఇలా కొనసాగితే పొగాకు, నిమ్మ పంటలు దెబ్బతింటాయి. – రామాంజనేయ రెడ్డి, రైతు, పొదిలి మండలం బట్టువారిపల్లి రాత్రి పూట జాగారం.. గత ఏడాది మిర్చి 5 ఎకరాలు సాగు చేశాను. మాది వర్షాధారం. బోర్ ద్వారా పైరుకు నీటి తడి ఇస్తాను. అయితే పగటి పూట విద్యుత్ ఒక్కొక్క సారి నిరంతరం 9 గంటలు ఇవ్వడం లేదు. ఇలా ఇవ్వని రోజు రాత్రి పూట ఇస్తారు. దీంతో రాత్రి పూట పొలాలకు వెళ్లి నీటి తడులు పెట్టుకుంటూ జాగారం చేస్తాను. మేము కోరేది ఒకటే..రోజూ ఎటువంటి అంతరాయం లేకుండా పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, రైతు, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా 2,36,866 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) ఎలాంటి ప్రకటనలు చేయకుండానే అనధికారిక కోతలకు శ్రీకారం చుట్టాయి. జిల్లాలో 680 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏ, బీ గ్రేడులుగా విభజించించారు. ఏ గ్రేడులో ఉదయం గం.8.45 నుంచి సాయంత్రం గం.5.45 వరకు నిరంతరాయంగా ఇస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. బీ గ్రేడ్లో ఉదయం గం.9 నుంచి సాయంత్రం గం.6 వరకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు. వాస్తవానికి విరుద్ధంగా.... జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో అన్నిరకాల పంటలకు బోర్లే ఆధారం. అందుకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటేనే పంటలు పండుతాయి. పగటిపూట వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మరో వైపు భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న నీటినైనా ఉపయోగించుకొని సాగు చేసిన పంటలను పండించుకుందామంటే విద్యుత్ అంతరాయం పెద్ద సమస్యగా మారింది. పగటి పూట నిరంతరాయం అని చెప్పి విడతల వారీగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు అన్న తేడాలేకుండా సరఫరా ఇవ్వటంతో రాత్రి వేళల్లో కూడా రైతులు పొలాల్లో పంటలు తడుపుకోవటానికి పడిగాపులు కాయాల్సి వస్తోంది. పశ్చిమ ప్రకాశంలోని మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోజులో రెండు మూడు దఫాలుగా కరెంటు ఇస్తుండడంతో పంటలు సక్రమంగా తడవక రైతులు విలవిల్లాడుతున్నారు. మెట్టకు బోర్లే ఆధారం.. పశ్చిమ ప్రకాశంలోని మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ప్రధానంగా మిర్చి, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కందులు, మినుము, పెసర, నువ్వు, ఆవాలు, మామిడి, నిమ్మ, సపోట, బత్తాయి, సన్ఫ్లవర్, వేరుశనగ, పొగాకు, పత్తితో పాటు అనేక రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని రకాల పంటలకు వ్యవసాయ విద్యుత్ మోటార్ల ద్వారా అందించే బోరు నీరే ఆధారం. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే కీలక దశలో నీటి ఎద్దడి ఏర్పడి ఆయా పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా .. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే లోడ్ రిలీఫ్ (ఎల్ ఆర్) ఇచ్చామంటూ విద్యుత్ అధికారులు, సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మెయిన్ సప్లై పోయిందని, ఎప్పుడొస్తుందో చెప్పలేమనే సమాధానం ఇస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి నెల దాటితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం 5 గంటల సరఫరా కూడా సక్రమంగా అందుతుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కోతలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అనధికారికంగా రెండు గంటలు కోత బోర్ల ద్వారా పంటలకు నీరు అందక మాడిపోతున్న వైనం ప్రస్తుతం రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇవ్వడంతో అవస్థలు రాత్రి వేళల్లో పొలాల్లో కాపలా కాస్తున్న రైతన్నలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా -
సబ్సిడీ పనిముట్ల పేరుతో రైతులకు మోసం
ఒంగోలు టౌన్: సబ్సిడీ పనిముట్లు ఇప్పిస్తానంటూ దర్శికి చెందిన ఒక మోసగాడు రైతులను నిండా ముంచాడు. దర్శి ప్రాంతానికి చెందిన పలువురు రైతులకు మాయమాటలు చెప్పి 16.82 లక్షల రూపాయలు వసూలు చేశాడు. రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనిముట్లు ఇప్పించకపోవడంతో రైతులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ అతడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడంతో మోసపోయినట్లు గమనించిన రైతులు సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసు అధికారులు చట్టపరంగా విచారించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరో ఘటనకు సంబంధించి.. ఒంగోలుకు చెందిన ఒక యువకుడికి కరెంటు ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన వ్యక్తి మోసానికి పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదు చేశారు. కరెంటు ఆఫీసులో ఉద్యోగం పేరుతో 6 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 77 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు -
మాదిగలను మరోసారి వంచనకు గురిచేయొద్దు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ఒంగోలు టౌన్: జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్లు చెప్పడమంటే మరోసారి మాదిగలను వంచనకు గురి చేయడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు కట్టుబడిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్లో నేడు జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్పడం అన్యాయం అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మెప్పు కోసం నేడు జిల్లా యూనిట్ గురించి మాట్లాడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో వేసిన కమిషన్లన్నీ జనాభా దామాషా ప్రకారమే చేయాలని నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా 84,45,400 మంది ఉన్నారని, వారిలో మాలలు 40,43,101 మంది ఉండగా, మాదిగలు 34,68,967 మంది ఉన్నారని, ఉప కులాలు 9,33,332 మంది ఉన్నారని వివరించారు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాలలకు 7 శాతం, మాదిగలకు 6 శాతం, ఉప కులాలకు 2 శాతం వర్తిస్తుందన్నారు. విభజిత ఏపీలో మాదిగల కంటే మాలలు ఎక్కువగా ఉన్నందున వారికి దక్కాల్సిన వాటా దక్కడం ధర్మమేనని చెప్పారు. అలాగే మాదిగలకు కూడా న్యాయబద్ధంగా వాటా అందించాలని డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేస్తే మాల మాదిగలతో పాటుగా సంచార జాతులకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు ఆలూరి చిరంజీవి, రేణమాల మాధవ, గౌడిపేరు కృష్ణ, జి.మహేష్, ముట్లూరి మోజేష్, ఏ.ప్రకాశం పాల్గొన్నారు. -
కులం పేరుతో దూషిస్తూ అత్తింటివారి వేధింపులు
ఒంగోలు టౌన్: కులాంతర వివాహం చేసుకున్న ఒక దళిత మహిళను అత్తింటి వారు కులం పేరుతో దూషించడమే కాకుండా ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై ఒంగోలు వన్టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన ఎస్సీ మహిళ సురేఖ బ్రాహ్మణ కులానికి చెందిన చంద్రశేఖర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. అనారోగ్యంతో చంద్రశేఖర్ 2023లో మరణించారు. అనంతరం ఆస్తి పంపకాల విషయమై అడిగితే అత్తింటివారు కులం పేరుతో దూషిస్తూ ఆస్తిలేదు.. పాస్తిలేదని తెగేసి చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నెల 26వ తేదీ సురేఖ చిన్న కూతురికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స చేయించేందుకు వైద్యశాల ఖర్చులు అడగటానికి అత్తవారింటికి వెళ్లగా, బయటకు నెట్టి వేసి కులం పేరుతో దూషించారు. దీనిపై వన్టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గత ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం రాచర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం మధ్య రైల్వే ట్రాక్పై సోమవారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు.. కంభం పట్టణానికి చెందిన కొప్పుల రమేష్కు రెండేళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్పైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తన సన్నిహితులకు తెలియజేశాడు. రమేష్ ఆత్మాహత్య చేసుకోబోతున్నాడని కంభం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. రాచర్ల పరిధిలో లొకేషన్ చూపించడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం రైల్వే ట్రాక్పైకి చేరుకుని యువకుడిని రక్షించారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. పట్టపగలే ఆటో చోరీ రాచర్ల: జనం సంచారం మెండుగా ఉన్న సమయంలో ఆటో చోరీకి గురైంది. ఈ సంఘటన మండల కేంద్రమైన రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కంభం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ శివశేఖర్ కుమార్తె రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. సోమవారం కుమార్తెను చూసేందుకు వచ్చిన శివశేఖర్ తన ఆటోను స్కూల్ బయట ఉంచి లోపలికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోను అపహరించారు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆటో కనపడకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాచర్ల, అనుములపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను ఎస్సై పి.కోటేశ్వరరావు పరిశీలించారు. ఆటోను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు ప్రాణాలు కాపాడిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి పట్టివేత -
పొగాకు వేలం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి పొగాకు వేలం ప్రారంభమైంది. ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు–1 వేలం కేంద్రంతో పాటు కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు వేలం కేంద్రంలో కూడా ప్రారంభమైంది. మిగతా ప్రకాశం జిల్లాలోని 5 వేలం కేంద్రాలు, నెల్లూరు జిల్లాలోని 2 వేలం కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అయితే మొదటి రోజు నాలుగు వేలం కేంద్రాల్లో కలిపి 81 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. వేలంలో 15 పొగాకు కంపెనీలు పాల్గొన్నాయి. అన్ని వేలం కేంద్రాల్లో అత్యధికంగా కిలో పొగాకు ధర రూ.280, అత్యల్ప ధర రూ.278 పలికింది. పొగాకు వేలం కేంద్రాన్ని ప్రారంభించిన బోర్డు ఈడీ శ్రీధర్ బాబు సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్బాబు ప్రారంభించారు. తొలిరోజు కిలో గరిష్ట ధర రూ.280 పలికింది. మొదట వేలం కేంద్రంలో జరిగిన ప్రారంభ పూజల్లో ఆయన పాల్గొని చిలంకూరుకు చెందిన 18 పొగాకు బేళ్లను మొదటి రోజు వేలానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పొగాకుకు డిమాండ్ను బట్టి ధరలు వస్తాయన్నారు. కరోనా కాలంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి లేక గత ఏడాది మంచి ధరలు లభించాయన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. ఈ ఏడాది పొగాకుకు ఖర్చులు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు బయ్యర్స్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ ఏడాది కూడా పొగాకుకు తగు మేరకు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. పొగాకు వేలాన్ని ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం.రవికాంత్ పర్యవేక్షించారు. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు సంక్షేమ భవన్, పొగాకు బోర్డు కార్యాలయాలకు ఈడీ శంకుస్థాపన చేశారు. రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈడీ అద్దంకి శ్రీధర్ బాబును రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు సూరం గురువారెడ్డి, తదితరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు, పొగాకు బోర్డు డైరెక్టర్ పొద వరప్రసాదరావు, మాజీ డైరెక్టర్ పి.బద్రిరెడ్డి, ఐటీసీ లీఫ్ మేనేజర్ శివకుమార్, జీపీఐ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు 1, 2 వేలం కేంద్రాల రైతు కమిటీ అధ్యక్షులు ఎస్ గురువారెడ్డి, వి ప్రసాద్, రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, వడ్డం పూడి వెంకటేశ్వరరావు, జి సుబ్రమణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్లు, మేకల కృష్ణారెడ్డి, ఎం వెంకటనారాయణ, కరిచేటి సుబ్బారావు, ఎన్ మస్తాన్ రెడ్డి, ఆళ్ల రవి, వరహాల చౌదరి, బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 వేలం కేంద్రాల్లో మొదలు మిగతా ఏడు కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి ప్రారంభం కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్పం రూ.278 -
కోర్టు క్యాలెండరు ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబులు కోర్టు క్యాలెండరును సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు నియోజకవర్గ సమాచారహక్కు వింగ్ అధ్యక్షుడు కె.శేషాద్రిరెడ్డి, ఇతర లీగల్ సెల్ సభ్యులు కాటుకూరి బాబురావు, కాటుకూరి సంపత్, ఎస్.పి.జయచంద్రనాయక్, గాయం సావిత్రి, నీలం పద్మలత, తోట రాగసుధారాణి, నాగమల్లేశ్వరరెడ్డి, గంగవరపు ప్రవీణ్కుమార్, కె.స్వామిరెడ్డి, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో అడుగడుగునా వంచనే..
మద్దిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో మోసం, వంచనలే ఉంటాయని మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగం లేని యువకులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేశారని, పదవి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి వసతి దీవెనకు సంబంధించి రూ.4600 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమైన దశలో మొత్తం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను రద్దు చేయొద్దని, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలను పూర్తిగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు రైతులు మద్దతు ధర లేక విలవిలాడిపోతున్నారన్నారు. మిర్చి పంట వేసిన రైతులకు గతంలో క్వింటా రూ.28 వేల వరకు ధర వస్తే ప్రస్తుతం చంద్రబాబు ధర విషయంలో కేంద్రం రూ.11 వేలు ఇస్తుంది అని చెప్పి తప్పుకున్నారన్నారు. పత్తి, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు, విద్యార్థులు, యువకులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 12న శ్రీయువత పోరు’ కార్యక్రమం చేపట్టామని, యువతకు సంబంధించిన పలు విషయాలపై కలెక్టర్కు మెమొరాండం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలిరావాలని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లేలా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరారు. ముందుగా ఆయన ‘యువత పోరు’ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి వాక కోటిరెడ్డి, పైనం ప్రభాకర్, పైడిపాటి వెంకట్రావు, నాదెండ్ల నాదెండ్ల మహేష్, రామాంజనేయులు, పల్లపాటి అన్వేష్ ,దుడ్డు వినోద్, సురేష్, సుబ్బారావు, అనిల్ శ్రీనివాసరావు, పాల్గొన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
ఆత్మస్తుతి..పరనింద
32/18ప్రకాశం7గరిష్టం/కనిష్టందొడ్డుబియ్యం తినలేకపోతున్నాం.. రోజూ దొడ్డుబియ్యం అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నామని కనిగిరి బీసీ గురుకుల విద్యార్థులు మంత్రులు సవిత, ఆనం ఎదుట మొరపెట్టుకున్నారు. జగనన్న పాలనలో మహిళలకు సమాన అవకాశాలు వైఎస్ జగన్ పాలనలో మహిళలకు సంక్షేమ పథకాలు అందాయని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. – 8లో.. ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025 -
జగన్ హయాంలో మహిళలకు స్వర్ణయుగం
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన రాష్ట్రంలోని మహిళలకు ఒక స్వర్ణయుగంగా మిగిలిపోతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మహిళల సంక్షేమం కొనసాగిందన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ చేయూత, తదితర పథకాల పేరుతో మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేశారని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నింటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించారని, పరిపాలనలో పెద్దపీట వేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఓ దళిత మహిళలకు హోంశాఖ మంత్రిగా నియమించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ను తీసుకురావడమే కాకుండా దిశ చట్టాన్ని అమలు చేశారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను విస్మరిస్తోందని, అనేక రకాల వాగ్దానాలు చేసి అమలు చేయకుండా మహిళలను నిట్టనిలువునా మోసం చేశారని విమర్శించారు. జగనన్న పాలనలో కడుపులోని బిడ్డ నుంచి వందేళ్ల వృద్దుల వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఆనాడు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత విధానాలను మహిళలు నిలదీయాలన్నారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయంగా, పరిపాలన పరంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో ఏకంగా ఆరుగురు మహిళలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించారన్నారు. మహిళలు ముందడుగు వేస్తేనే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని భావించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మ్యానిఫెస్టోను అటకెక్కించి చేసిన హామీల్లో ఒక్కదానిని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఒట్టి చేతులు చూపుతున్నారని విమర్శించారు. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మీ పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. సీ్త్రనిధి నిధులను పక్కదారి పట్టిస్తూ దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలను మహిళలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న 2.0 లో కార్యకర్తలకే పెద్దపీట వేయనున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాడాలన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళల సాధికారిత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రశ్నించాలని సూచించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకుడు నూకతోటి శరత్కుమార్ ఆలపించిన జయహో మహిళ పాట ఆకట్టుకుంది. జిల్లాలోని మహిళా నాయకులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండెపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడికొండ జయంతి, మహిళా నాయకురాలు భూమిరెడ్డి రమణమ్మ, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పి.ప్రసన్న, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, అంగన్వాడీ అధ్యక్షురాలు గోవిందమ్మ, మద్దిపాడు ఎంపీపీ అరుణ, తమ్మినేని సుజాతారెడ్డి, నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, మేరికుమారి, సయ్యద్ అప్సర్, ఎస్.రమణమ్మ, జ్యోతి, మాధవి, బి.రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ -
జగనన్న పాలనలో మహిళలకు సమాన అవకాశాలు
చీమకుర్తి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో సంక్షేమ పథకాలు, పార్టీ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ మహిళా లెక్చరర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో బూచేపల్లి వెంకాయమ్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ యాప్ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థినులతో కలిసి ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ