Queen Tamil remake
-
రెండు కోట్ల నలభై లక్షలురెండు కోట్ల నలభై లక్షలు
రెండు కోట్ల నలభై లక్షలంటే కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషికం గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అదేం కాదు. ఆ మాటకొస్తే.. దక్షిణాది హీరోయిన్లు 2 కోట్లు టచ్ చేయడం కష్టమే. మరి.. ఏ విషయంలో కాజల్ అగర్వాల్ ఈ రికార్డ్ సాధించారు అంటే.. ‘ముఖ పుస్తకం’ ద్వారా అన్నమాట. అంటే.. ఫేస్బుక్ అండీ. ‘‘ నా ఫాలోయర్ల సంఖ్య 24 మిలియన్స్కు చేరుకుంది. చాలా ఆనందంగా ఉంది’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. 24 మిలియన్స్ అంటే అక్షరాల 2 కోట్ల 40 లక్షల మంది. ఈ లెవల్లో కాజల్ ఫాలోయర్స్ని సంపాదించుకున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ బ్యూటీ ఎక్కువగా ఫేస్బుక్ లైవ్ చాట్స్ను ప్రిఫర్ చేస్తుంటారు. ఫాలోయర్స్ సంఖ్య పెరగడానికి ఇదో కారణం అని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. బుధవారం తన తల్లి సుమన్ అగర్వాల్ బర్త్డే సెలబ్రేట్ చేశారు కాజల్. ‘‘నాకు తెలిసిన అందమైన మహిళ మా అమ్మనే. ఆమెను అమ్మా అని పిలుస్తున్నందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నా రోల్ మోడల్, గైడ్, స్ట్రెంత్ అన్నీ మా అమ్మగారే’’అని పేర్కొన్నారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే... ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ, బాలీవుడ్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్..ప్యారిస్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. -
క్వీన్ త్రిషేనా?
క్వీన్గా మారే అవకాశం సంచలన నటి త్రిషనే వరించనుందా? అన్న ప్రశ్నకు చిత్ర వర్గాల నుంచి సానుకూల సమాచారమే వస్తోంది. క్వీన్ చిత్రం 2014లో బాలీవుడ్లో ఒక సంచలనం. నటి కంగనా రనౌత్ను స్టార్ను చేసిన చిత్రం. ఆమె పాత్రలో నటించాలని చాలా మంది దక్షిణాది టాప్ హీరోయిన్లు ఆశించిన చిత్రం. అలాంటి చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కులను సీనియర్ నటుడు,దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ సంచలన చిత్రానికి ఇద్దరు ప్రముఖ నటీమణులు తెరవెనుక పనిచేయనుండడం. అందులో ఒకరు సుహాసిని మణిరత్నం. తను ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఇక మరో సీనియర్ నటీమణి రేవతి మెగాఫోన్ పట్టనున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ప్రతిభావంతులేనన్నది గమనార్హం. ఈ చిత్రంలో క్వీన్ అయ్యేది ఎవరన్న విషయం చాలా కాలంగా జరుగుతున్న చర్చ. చాలా మంది అగ్రనాయికలతో చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా నటి త్రిష పేరు తెరపైకి వచ్చింది. క్వీన్ చిత్ర రీమేక్లో నాయకిగా నటించే విషయమై అందాల భామ త్రిషలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్రిష ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ కథానాయకి ప్రధాన చిత్రాలే. తాజాగా క్వీన్ చిత్రం కూడా ఈ బ్యూటీ ఖాతాలోకి చేరే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల బోగట్టా.