Rajanna Sircilla District News
-
దయచూపని నిర్మలమ్మ!
● ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్టులపై వెలువడని ప్రకటన ● ప్రస్తావనకు రాని బసంత్నగర్ విమానాశ్రయం ● ప్రసాద్ స్కీంలో వేములవాడ, కొండగట్టులకు దక్కని హామీ ● రూ.12 లక్షల్లోపు ఆదాయమున్న ఉద్యోగులకు పన్ను ఉపశమనం ● ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు, సింగరేణి కార్మికుల హర్షం ● ఏటా రూ.450 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్న ఉమ్మడి జిల్లా ఉద్యోగులుసాక్షిప్రతినిధి, కరీంనగర్: కేంద్ర బడ్జెట్ 2025–26లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, పెండింగ్ పనుల విషయంలో ఈ ఏడా ది కేంద్రం మొండి చేయి చూపిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూ.12లక్షల్లోపు ఆదాయమున్న వ్యాపారులు, ఉద్యోగులకు పన్ను మినహాయింపు ప్రకటన మాత్రం మధ్య తరగతికి కాస్త ఊరటనిచ్చే అంశం. ఉమ్మడి జిల్లాలో సింగరేణి, ప్రభుత్వ టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కలుపుకుని దాదాపు 30వేల పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. వీరిలో రూ.లక్షలోపు వేతనం ఉన్న ఉద్యోగులు 95శాతం ఉంటారు. వీరందరికీ కేంద్ర తాజా నిర్ణయం భారీ ఉరట కలిగించింది. ఉమ్మడి జిల్లా నుంచి రూ.450 కోట్ల పన్ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, విద్యుత్తు ఇతర విభాగాల్లో ఉమ్మడి జిల్లా పరిధిదాదాపు 40వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపుగా ప్రతీ ఉద్యోగి ఆదాయ పన్ను ఏటా చెల్లిస్తున్నారు. వీరితోపాటు పెన్షనర్లు 25 నుంచి 30వేల మంది ఉంటారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి సుమారు రూ.60వేల నుంచి రూ.4లక్షల వరకు పన్నులు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే.. సగటున రూ.1.50 లక్షల వరకు పన్ను చెల్లింపులు ఉమ్మడి జిల్లా నుంచి జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే.. ఏటా ఉమ్మడి జిల్లా ఉద్యోగులు రూ.450కోట్ల వరకు ఆదాయ పన్నును కేంద్రానికి చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ జాబితాలో సుమారు 70శాతం వరకు పన్ను చెల్లించే ఉద్యోగులకు ఉపశమనం కలిగినట్లే. ఉమ్మడి జిల్లాకు దక్కని ఊరట.. ● దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయాన్ని చాలాకాలంగా ప్రసాద్ స్కీంలో చేర్చాలని డిమాండ్ ఉంది. ఇందుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, నాయకులు, పార్టీల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఆలయం ప్రసాద్ స్కీంలో చోటు దక్కించుకోలేకపోతుంది. కొండగట్టుకు కూడా కేంద్ర ప్రభు త్వం మొండిచేయి చూపించింది. ● సుదీర్ఘ డిమాండ్లలో ఒకటైన కరీంనగర్కు ట్రిపుల్ఐటీ, నవోదయా స్కూళ్ల కేటా యింపులో ఈసారి కూడా ఉమ్మడి జిల్లాకు మొండిచెయ్యే దిక్కయింది. ● బసంత్నగర్ విమానాశ్రయానికి ఈసారైనా ఉడాన్ స్కీములో చోటు దక్కుతుందని అనుకున్నా.. ఈ విషయంలో కూడా చివరికి నిరాశే మిగిలింది. రాష్ట్రం ఆవిర్భా వం తరువాత ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాశ్రయంగా మార్చే ఆలోచనతో పలుమా ర్లు సర్వే చేసి కేంద్రానికి నివేదిక పంపినా.. ఇంతవరకూ దీనిపై నిర్ణయం వెలువడకపోవడం దురదష్టకరం. పాత రైల్వే ప్రాజెక్టుల సంగతేంటి? పాత జిల్లాలో కొత్తపల్లి– మనోహరాబాద్ (148.9 కిమీ.), మణుగూరు –రామగుండం (200 కి.మీ): పెద్దపల్లి బైపాస్– కరీంనగర్ లైన్ (2.169 కి.మీ) పనులు సాగుతుండగా.. హసన్పర్తి– కరీంనగర్ (61.8 కి.మీ) రైల్వేలైన్ సర్వే పూర్తయింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇవన్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులే. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులకు ఎంత కేటాయించరన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘పింక్ బుక్’(బడ్జెట్ కేటాయింపులు) విడుదల చేస్తే తప్ప స్పష్టత రాదు. -
రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్రం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రాన్ని విస్మరించింది. ఎన్నికలు ఉన్న రాష్ట్రానికి పెద్దపీట వేసింది. గతంలో మాదిరిగానే నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయిచ్చారు. అన్ని వర్గాలను నిరాశపర్చిన బడ్జెట్. గత పదేళ్లతోపాటు ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా దేశ పురోగతిని అడ్డుకునేలా ఉంది. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్రాష్ట్రానికి మొండిచేయి రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజే పీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు సాధించలేదు. పక్క రాష్ట్రానికి కేటాయించిన నిధులను చూసి బీజేపీ ఎంపీలు సిగ్గుతెచ్చుకోవా లి. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని బడ్జెట్. కేంద్ర సర్కారు మరోసారి తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపింది. – తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రజల ఆకాంక్షకు అద్దం ఆర్థికమంత్రి ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టేలా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ, విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతతో 2027 వరకు భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకునేలా ఉంది. ఎంబీబీఎస్, ఐఐటీ సీట్ల పెంపు హర్షనీయం. – అల్లాడి రమేశ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి -
జాతీయస్థాయిలో రాష్ట్ర పోలీసులు భేష్
కరీంనగర్స్పోర్ట్స్: జాతీయస్థాయిలో జరిపిన సర్వేలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని, ఆలిండియా పోలీస్ డ్యూటీమీట్ పోటీల్లో తెలంగా ణ పోలీసులు మొదటిస్థానంలో నిలిచారని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ జితేందర్ ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవలే ఆధునికరించిన పోలీస్ పరేడ్గ్రౌండ్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జాతీయస్థాయిలో జరిగే క్రీడల్లో తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఏటా రాష్ట్ర పోలీసులకు క్రీడాపోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలు అద్భుతంగా నిర్వహించినందుకు స్పోర్ట్స్ ఐజీ రమేశ్రెడ్డి, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని అభినందించారు. స్పోర్ట్స్ ఐజీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో 2,380 మంది క్రీడాకారులు పాల్గొనగా, 296 మంది మహిళలు, 12 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారన్నారు. 28 క్రీడాంశాల్లో 236 బంగారు పతకాలు, 236 వెండి పతకాలు, 396 కాంస్య పతకాలను క్రీడాకారులు గెలుచుకున్నట్లు తెలిపారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేషన్ డీఐజీ గజరావు భూపాల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, శిక్షణ ఐపీఎస్ వసుంధర, కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చాంపియన్ హైదరాబాద్ 3వ రాష్ట్ర పోలీసు క్రీడాపోటీల చాంపియన్గా హైదరాబాద్ కమిషనరేట్ నిలిచింది. టీజీఎస్పీ రేంజ్– 1 ద్వితీయస్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్ విభాగంలో రాచకొండ కమిషనరేట్, స్విమ్మింగ్లో ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ, ఆర్చరీలో టీజీఎస్పీ రేంజ్–1, బాక్సింగ్లో హైదరాబాద్ కమిషనరేట్ విజేతలుగా నిలిచాయి. ఏటా క్రీడాపోటీలు జరిగేలా చర్యలు డీజీపీ డాక్టర్ జితేందర్ ముగిసిన 3వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలు ఓవరాల్ చాంపియన్గా హైదరాబాద్ కమిషనరేట్ -
మాతా, శిశు మరణాలు అరికట్టాలి
● జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్ల: జిల్లాలో మాతా, శిశుమరణాలను అరికట్టాలని, ఒక్క మరణం కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శనివారం మాతా, శిశుమరణాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారలోపం లేకుండా చూడాలని, ప్రసూతి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. వేములవాడ ప్రాంతీయ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ పి.పెంచలయ్య, ఐఎంఏ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా శిరీష పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి ప్రోగ్రాం ఆఫీసర్లతో జిల్లాలోని మలేరియా ఎల్టీలతో, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లతో సమీక్షించారు. -
ముదిరాజ్లు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● మిడ్మానేరులో ఉపాధి అవకాశాలు ● జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకారంసిరిసిల్లటౌన్: ముదిరాజ్లు ఇతర కులస్తులను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్లో శనివారం జరిగిన జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా నాయకులు పనిచేయాలన్నారు. కులమే ఒక బలగంలా పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రశ్నించే వారికి గుర్తింపు ఉంటుందని, తెలంగాణ, జిల్లా సాధన ఉద్యమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము పోరాటాన్ని కొనియాడారు. ముదిరాజ్ల చిరకాల కోరిక బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మిడ్మానేరు డ్యామ్లో చేపల పెంపకానికి కేజీకల్చర్ ద్వారా సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులపై ఇతర ప్రాంతాల్లో అధ్యయనం చేసి రావాలని సూచించారు. మహాత్మాజ్యోతిబాపూలే వంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ బీసీలందరం ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ జిల్లా సంఘ భవనానికి సహకరిస్తానన్నారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి ముదిరాజ్ కులస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా చొక్కాల రాము, ప్రధాన కార్యదర్శి సరుగు నరేశ్, ఉపాధ్యక్షులుగా గొడుగు నర్సయ్య, శివండ దేవరాజు, రేగుల రాజ్కుమార్, కోశాధికారిగా కనకాల శేఖర్బాబు, సెక్రటరీలు పెరిమెల్ల రమేశ్, తునికి నరేశ్, రేగుల పర్శరాములు, సంయుక్త కార్యదర్శిగా జనగపల్లి శంకర్బాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం, ముఖ్య నాయకులు కరుణాల భద్రాచలం, పర్శ హన్మాండ్లు, రెడ్డబోయిన గోపి, బొజ్జ కనకయ్య, రేగుల మల్లికార్జున్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో సేవలెలా ఉన్నాయి
● గర్భిణులకు ఫోన్ చేసి అడిగిన కలెక్టర్ సందీప్కుమార్ ఝాకోనరావుపేట(వేములవాడ): ‘హలో.. నేను జిల్లా కలెక్టర్ను మాట్లాడుతున్నా.. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు ఎలా ఉన్నాయి. సిబ్బంది అందిస్తున్న సేవలతో మీరు సంతృప్తి చెందుతున్నారా?’ అంటూ గర్భిణులకు జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఫోన్చేసి అడిగారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణ, ఇన్పేషంట్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న గర్భిణులతో ఫోన్లో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు 10 జీపీఏ సాధించాలి రానున్న పబ్లిక్ పరీక్షల్లో పదోతరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా తీర్చిదిద్దాలని టీచర్లకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కోనరావుపేటలోని కేజీబీవీని తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు గణితం, సైన్స్ పాఠ్యాంశాలు బోధించి, విద్యార్థినుల అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వేణుమాధవ్, కేజీబీవీ ఎస్వో ఇందిర, కళాశాల ప్రిన్సిపాల్ కేదారేశ్వర్ ఉన్నారు. -
క్యాన్సర్పై అవగాహన సదస్సు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): క్యాన్సర్ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. మండలంలోని గోపాలరావుపల్లెలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం క్యాన్సర్పై అవగా హన సదస్సు నిర్వహించారు. సీనియర్ సి విల్జడ్జి మాట్లాడుతూ మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చింతోజు భాస్కర్, వైద్యులు రమేశ్, లీలా శిరీష, ఆడెపు వేణు, మల్లేశ్యాద వ్, ఆంజనేయులు, అన్సార్ అలీ పాల్గొన్నారు. తెలంగాణ భవనాలు అవినీతి గుడారాలు ● కేకే మహేందర్రెడ్డిసిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన తెలంగాణ భవనాలన్నీ కేసీఆర్ కుటుంబం పదేళ్ల దోపిడీకి గుర్తుగా నిలిచిన అవినీతి గుడారాలని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి లేని ఆస్తులు తెలంగాణలో బీఆర్ఎస్కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించా రు. ఏడాదిగా ఫాంహౌస్లో కుంభకర్ణ నిద్రపోయి ఈరోజు లేచి తన తడాఖా చూపిస్తానంటూ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదన్నారు. కూతురు కవితపై కేరళలో లిక్కర్ కేసు వెలుగులోకి రావడంతోనే కేసీఆర్ నిద్రలేచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని ప్రకటించారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అక్రమాలు అంతా..ఇంతా కాదన్నారు. కనిమేని చక్రధర్రెడ్డి, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, గంభీరావుపేట ప్రశాంత్, కల్లూరి చందన, శరణ్య పాల్గొన్నారు. ఆర్థికమంత్రి తెలుగులో మాట్లాడడం అభినందనీయం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణవేములవాడ: దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలుగులో బడ్జె ట్ ప్రసంగాన్ని ప్రారంభించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రూ.12లక్షల వరకు ఆదాయపు పనున్న మినహాయింపు ఇ వ్వడం, 82 వస్తువులపై సెస్ తొలగించడం, 36 రకాల క్యాన్సర్ మందులు చౌకగా లభించనున్నాయని వివరించారు. మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు● చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్సిరిసిల్ల: సిరిసిల్లలోని మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు మిట్టకోల సాగర్ శనివారం తెలిపారు. ప్రభుత్వ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన షూటింగ్, షర్టింగ్, ఓనీ వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు టెస్కో అధికారులు 2025–2026 కోసం ఆదేశాలు జారీ చేశారని వివరించారు. జిల్లాలోని 128 మ్యాక్స్ సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్లోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్లో ఉత్పత్తి ప్రణాళికను అందించాలని కోరారు. మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తి సంబంధించి ఎంవోయూ ఆర్డర్ కాపీలను పొందాలని సాగర్ కోరారు. నీటి సరఫరా పరిశీలనకు స్పెషల్డ్రైవ్సిరిసిల్ల: వేసవిలో నీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. ఈమేరకు తాగునీటి సరఫరాలో లోపాలు గుర్తించేందుకు, నీటి సమస్య రాకుండా కార్యాచరణ సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనను ఖరారు చేశారు. ఈనెల 1 నుంచి 12 వరకు స్పెషల్డ్రైవ్లో భాగంగా అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి? నీటి సరఫరాపై ఆరా తీయనున్నారు. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో ఓ బృందాన్ని వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. -
బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
● ముగిసిన ఆపరేషన్ స్మైల్ ● 31 మంది బాలకార్మికుల పట్టివేత ● యజమానులపై 8 కేసులు ● ఎస్పీ అఖిల్ మహాజన్సిరిసిల్లక్రైం: బడీడు పిల్లలను పనిలో కాదు బడిలో ఉండాలనే దానిని పక్కాగా అమలు చేయడానికి ఏటా నిర్వహించే ఆపరేషన్ స్మైల్ ముగిసిందని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జిల్లాలో 31 మంది పనిలో ఉన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు అప్పగించడంతోపాటు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పనిచేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీధి బాలలను చూస్తే.. డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
గద్దర్ జీవితం పేదోళ్ల ఉన్నతికి అంకితం
సిరిసిల్లటౌన్: ప్రజాయుద్ధనౌక గద్దర్ జీవితం పేదల ఉన్నతి కోసం అంకితం చేశారని పలువురు కొనియాడారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలోని రుచి హోటల్లో గద్దర్ 77వ జయంతి నిర్వహించారు. ప్రజాపోరాటాలే పేదలను దోపిడీవర్గాల నుంచి విముక్తి కలుగుతుందనే ఉద్యమించారన్నారు. అప్పటి ప్రభుత్వాలు గద్దరు ఆటాపాటపై నిషేధం విధించినా ప్రజలు విని దోపిడీదారులపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. దోపిడీవర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిన సాంస్కృతిక సేనానిగా కొనియాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సోమ నాగరాజు, జక్కుల రామచందర్ పాల్గొన్నారు. డీసీసీ ఆఫీసులో... జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో టీపీసీసీ కో–ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కల్లూరి చందన, నీలి రవీందర్, శరణ్య, రమేశ్ పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
రుద్రంగి(వేములవాడ): వైద్యసిబ్బంది ఎల్లవేళలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ ఉచిత వైద్యం అందించాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. రుద్రంగి మండలం బడితండాలోని పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ కార్యక్రమాలపై ఆరోగ్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్కుమార్, డీడీఎం కార్తీక్, వైద్యులు రేఖ తదితరులు ఉన్నారు. చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో రజిత శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యసిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. పీ హెచ్సీ వైద్యాధికారి సంపత్, సిబ్బందిపాల్గొన్నారు. -
సికింద్రాబాద్
● కొత్తపల్లి–మనోహరాబాద్ (148.9 కి.మీ.): రూ.350 కోట్లు ● కాజీపేట– బల్లార్షా మూడోలైన్: రూ.300 కోట్లు ● బల్లార్షా–రామగుండం ఎలక్ట్రిక్ అప్గ్రెడేషన్: రూ.18.43 కోట్లు ● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) (200 కి.మీ): రూ.5 కోట్లు ● మందమర్రి–రాఘవాపురం: రూ.5 లక్షలు రక్షక్ సిస్టం ఏర్పాటు, నిర్వహణ ● రాఘవాపురం–రామగుండం (ఆర్వోబీ): రూ.10,000 ● పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ (177 కి.మీ): పనులకు రూ.1000 ● పెద్దపల్లి బైపాస్–కరీంనగర్ లైన్ (2.169 కి.మీ) కనెక్ట్ బల్లార్షా– కాజీపేట మెయిన్లైన్: రూ.1000 -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్రెడ్డి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప ట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నరేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే ఆమోదించినట్లు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికి, పార్టీ మద్దతుతో అభ్యర్థులు పోటీపడతారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నరేందర్రెడ్డితో పాటు, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్రావు పోటీపడ్డారు. చివరకు ఏఐసీసీ నరేందర్రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించినందున ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మంత్రులు దామోదర రా జనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్ర భాకర్, ఉత్తమ్కుమార్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తన చారిత్రాత్మక గెలుపుతో సోనియాగాంధీకి బహుమతి అందజేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలో నిర్మిస్తున్న హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి మూడు గుంటల స్థలాన్ని ఈదుల రవీందర్రెడ్డి అందించారు. అయ్యప్పమాలధారులు సేకరించిన విరాళాలతో ఆలయాన్ని నిర్మించారు. 3, 4, 5వ తేదీల్లో హోమాలు, 7న అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు. గురుస్వాములు రాజు, ఎర్రోజు గోపాలచారి, బిల్లవేణి రఘు, ఈదుల రవీందర్రెడ్డి, చక్రధర్రెడ్డి, ఎల్లారెడ్డి, భూపతి పాల్గొన్నారు. పౌరహక్కుల దినోత్సవం బహిష్కరణ కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాలలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన పౌరహక్కుల దినోత్సవాన్ని గ్రామస్తులు, ప్ర జాసంఘాల నాయకులు బహిష్కరించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ అధికారులే రాకపోతే.. ప్రజలు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకుంటారని ప్రశ్నించారు. నరేశ్, సామియేలు, ఎరవెల్లి విజయ్, నరేశ్, వంశీ, ప్రణీత్ ఉన్నారు. పంట మార్పిడితో లాభం బోయినపల్లి(చొప్పదండి): రైతులు పంటమార్పిడిలో భాగంగా చెరుకు సాగుచేస్తే లాభదాయకమని జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ కె.మదన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రైతులతో శాస్త్రవేత్తలు చర్చాగోష్టి నిర్వహించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనస్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు రాకేశ్, కృష్ణచైతన్య, సాయిచరణ్లు చెరుకులో మేలైన రకాలు, వాటి గుణగణాలు, చెరుకుపంట విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన నేలలు, ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, ఏడీఏ రామారావు, ఎంఏవో ప్రణిత, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి ఉన్నారు. మహాసభలు జయప్రదం చేయండి సిరిసిల్లటౌన్: ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉ పాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ హాజరయ్యా రు. ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగే జిల్లా నాలు గో మహాసభలు జయప్రదం చేయాలని కోరా రు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వి ద్యా వ్యతి రేక విధానాలపై ఎస్ఎఫ్ఐ ఎండగడుతోందన్నారు. మందా అనిల్, మల్లారపు ప్రశాంత్, జాలపల్లి మనోజ్, కుర్ర రాకేశ్ ఉన్నారు. -
అమ్మవారి సన్నిధిలో ప్రభుత్వ విప్
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం తిని పించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఎస్పీని కలిసిన కులబహిష్కరణ బాధితులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలకు చెందిన చెరుకూరి మంజుల–ఎల్లయ్యయాదవ్ అనే దంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిశారు. వారు మాట్లాడుతూ తమను అకారణంగా కులం నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేసి కులపెద్దలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు వారు వివరించారు. ఆర్టీసీ లక్కీ విజేతలకు బహుమతులుసిరిసిల్లటౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డీప్ను శుక్రవారం నిర్వహించారు. సిరిసిల్ల డిపోలో జరిగిన కార్యక్రమంలో విజేతలు ఓ.లత వేములవాడ, కృష్ణవేణి వేములవా డ, స్వాతి సిరిసిల్ల విజేతలుగా నిలిచారు. డిపో మేనేజర్ ప్రకాశ్రావు బహుమతులు అందించారు. -
ఆలయంలో టెండర్లు ఖరారు
వేములవాడ: రాజన్న ఆలయంలో పలు సేవలకు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్ల ద్వారా ఆలయానికి మరింత ఆదాయం సమకూరింది. కొబ్బరికాయల విక్రయ లైసెన్స్హక్కు గతంలో రూ.1,71,55,555 ఉండగా ఈసారి రూ.2,20,55,555.55 హెచ్చు పాటదారుడు శివరాత్రి చందుకు లభించింది. వెజిటేరియన్ ఫాస్ట్ఫుడ్ సెంటర్కు గతంలో రూ.41.20లక్షలు ఉండగా ఈసారి రూ.46.50 లక్షలకు కె.రమేశ్ దక్కించుకున్నారు. ఒడిబియ్యం, ఎండుకొబ్బరి, బెల్లం గతంలో రూ.1,22,55,555 ఉండగా ఈసారి రూ.1,95,55,999 విక్రమ్కు లభించింది. కరీంనగర్ షాప్ నంబర్ 26 గతంలో రూ.3,48లక్షలు ఉండగా ఈసారి రూ.3.60లక్షలకు కె.నవ్య దక్కించుకున్నారు. కాగా భీమేశ్వరసదన్లో క్యాంటీన్ నిర్వహణకు సరైన పాట రానందున టెండర్ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. -
● నేరెళ్ల ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ ● మధ్యాహ్న భోజనం పరిశీలన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిత్యం జిల్లా అభివృద్ధి పనుల్లో తలమునకలయ్యే కలెక్టర్ సందీప్కుమార్ ఝా శుక్రవారం ఉపాధ్యాయుడిగా మారారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయోలజీ పాఠాలు బోధించారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అంతకుముందు పాఠశాల ఆవరణ, తరగతిగదులు, వంటగదిని పరిశీలించారు. కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు సిద్ధం చేస్తుండగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. -
సింగిల్విండో సేవలు భేష్
● సతారా సొసైటీ చైర్మన్ వీకే మోతెముస్తాబాద్(సిరిసిల్ల): పోతుగల్ సింగిల్విండో సేవలు బాగున్నాయని మహారాష్ట్రలోని సతారా వికాస్ సొసైటీ చైర్మన్ మోతె అభినందించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ సొసైటీని శుక్రవారం సందర్శించారు. రైతులకు అందిస్తున్న పంటరుణాలు, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలతోపాటు బంగారం, ఇళ్లపై రుణాల వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్ బంకుల పనితీరు, గోదాంల ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీ, ఏటీఎంల ద్వారా నగదు అందజేత, డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ, రైతులకు అందిస్తున్న రుణాలపై సీఈవో కృష్ణ వివరించారు. -
దయచూపమ్మా..
● గతేడాది ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుకు రూ.647 కోట్లు ● కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ ఈ ఏడాది పూర్తి అయ్యేనా? ● రామగుండం–మణుగూరు లైన్ నిధులపై ఉత్కంఠ ● హసన్ పర్తి–కరీంనగర్ లైన్ కేటాయింపులు జరిగేనా? ● పుష్కరకాలంగా కొత్త రైలు లేదు, పెరగని రైళ్ల ఫ్రీక్వెన్సీ ● 2025–26 కేంద్ర బడ్జెట్పై పాతజిల్లా వాసుల కోటి ఆశలుకేంద్ర బడ్జెట్ 2025–26ను నేడు(శనివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రైల్వే కేటాయింపులు బాగానే ఉన్నా కేటాయించిన నిధులు ప్రాజెక్టు వేగం పెంచాయి తప్ప.. పూర్తి అయ్యేందుకు దోహదపడలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.647 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి అంతే మొత్తంలో ఇస్తుందా? లేదా హెచ్చు తగ్గులు చేస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నడుస్తున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్, రామగుండం–మణుగూరు రైల్వేలైన్, పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్– రైల్వేలైన్ పూర్తి, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ తదితర ప్రాజెక్టులు పూర్తి కావాలంటే.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులు కావాలి. అదే విధంగా వేములవాడ, కొండగట్టులను ప్రసాద్ స్కీంలో చేర్పించడం, జిల్లాకు ట్రిపుల్ ఐటీ, నవోదయ స్కూల్స్ కేటాయింపుపైనా పార్లమెంటులో ఏం ప్రకటన వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 12 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాకు కొత్త రైలు లేదు. కనీసం నడుస్తున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ (ట్రిప్పులు) పెంచలేదు. ఈసారి బడ్జెట్లోనైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దయచూపాలని ఉమ్మడి జిల్లా వాసులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్ -
జగిత్యాల
రామగుండంకొత్తపల్లివేములవాడపెద్దపల్లినిజామాబాద్సిరిసిల్లసిద్దిపేటఇవీ డిమాండ్లు.. ● దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ, కొండగట్టు, ఓదెల, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను ప్రసాద్ పథకంలో చేర్చాలన్న డిమాండ్ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ● బసంత్నగర్లో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన అంశం ప్రస్తుత బడ్జెట్లో ఉండాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. – వరంగల్ విమానాశ్రయం పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో బసంత్నగర్ అంశాన్ని తిరిగి పరిశీలించాలంటున్నారు. ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనిని సిరిసిల్ల, పెద్దపల్లిలకు ట్రిపుల్ ఐటీ, నవోదయ విద్యాలయాలపై ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ● కరీంనగర్ స్మార్ట్సిటీకి మరిన్ని నిధులు మంజూరు చేయడం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో అమృత్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయడం.కరీంనగర్గజ్వేల్పెద్దపల్లి బైపాస్కు రూ.1000 పెద్దపల్లి– కరీంనగర్ మార్గాన్ని కాజీపేట–బల్లార్షా మార్గంతో కలుపుతున్న పెద్దపల్లి బైపాస్ లైన్కు గతంలో కేవలం రూ.1000 కేటాయించారు. గతేడాది చాలా స్వల్ప మొత్తంలో ఇచ్చిన అధికారులు ఈసారి ఎలా కరుణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ● కరీంనగర్–హసన్పర్తి రైల్వేలైన్కు గతేడాది రూ.5 కోట్లతో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ ఎస్) పూర్తయ్యింది. ఈసారి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారో చూడాలి. ● పెద్దపల్లి–నిజామాబాద్ రూట్లో గూడ్స్ రైళ్లు బాగా తిరుగుతున్నాయి. ఈ లైన్ను డబుల్గా మార్చాలన్న డిమాండ్ ఏళ్లుగా పెండింగ్లో ఉంది. మనోహరాబాద్బొల్లారంవికారాబాద్గతేడాది ప్రాజెక్టుల కేటాయింపులు బీబీనగర్గతేడాది కేటాయింపులు ఉమ్మడి జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్ పనుల కోసం గతేడాది కేంద్రం రూ.350 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2016లో కేంద్రాన్ని ఒప్పించింది. రూ. 1,167 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తయి, రైలు సర్వీసులు కూడా మొదలయ్యాయి. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఇప్పటి వరకు 75 కి.మీ పూర్తయ్యింది. ప్రస్తుతం సిరిసిల్ల–సిద్దిపేట (37 కి.మీ) పాటు భూసేకరణ దాదాపు ముగిసింది. ట్రాక్ పనులు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరినాటికి అయినా ప్రాజెక్టు పూర్తి కావాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్కు రూ.300 కోట్లు: కాజీపేట– బల్లార్షా మూడోలైన్ రూ.300 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది రూ.450 కోట్లు కేటాయించింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో ఈ లైన్ పూర్తవడం గమనార్హం. రామగుండం–మణుగూరుకు రూ.5 కోట్లే..: అదే సమయంలో కోల్కారిడార్గా పిలుస్తున్న రామగుండం (రాఘవాపురం)–మణుగూరు రైల్వేలైన్కు ఈసారి నిధులు తగ్గాయి. రామగుండం–మణుగూరు మధ్య ప్రస్తుతం ఉన్న 290 కి.మీలను 200 కి.మీలకు తగ్గించేందుకు భూపాలపల్లి మీదుగా వేస్తున్న ఈలైన్ అంచనా విలువ రూ.3000 కోట్లు. 2022 డిసెంబ రులో ఈ మార్గానికి ప్రధాని మోదీ రామగుండంలో శంకుస్థాపన చేశారు. ఎంతో ఆర్థిక ప్రా ముఖ్యత ఉన్న ఈలైన్కు ఇంత తక్కువ కేటా యించడం ఉమ్మడి జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర పౌరులనూ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి బడ్జెట్లోనైనా నిధులు పెరుగుతా యా? లేదా అన్నది చూడాలి. బొగ్గు సరుకు రవాణాతోపాటు, పర్యాటక పరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న లైన్ ఇది.నిర్మలమ్మా..డిమాండ్ను బట్టి తిరుపతి రైలు కరీంనగర్– తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులర్ చేయాలన్న డిమాండ్ ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి చాలాకాలంగా ఉంది. దీనిపై డిమాండ్ను బట్టి చర్యలు తీసుకుంటాం. గతేడాది ఉమ్మడి జిల్లాకు రైల్వే బడ్జెట్లో మంచి ప్రాధాన్యం దక్కింది. ఈ సారి కూడా అదే ప్రాధాన్యం దక్కుతుందని ఆశిస్తున్నాం. – బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి -
టెక్ సెంటర్గా కరీంనగర్
కరీంనగర్కార్పొరేషన్: రానున్న రోజుల్లో సాంకేతిక కేంద్రంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కరీంనగర్తో పాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ, పరిశ్రమల విస్తరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో నూతన సాఫ్ట్వేర్ కంపెనీ టెక్జెనీని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ, కొత్త ఐటీ కంపెనీలు, పరిశ్రమలతో ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇంజనీరింగ్ చదివినవారు ఎంతోమంది జిల్లాలో ఉన్నారని, వారికి ఐటీ కంపెనీల వల్ల ఉపాధి లభిస్తుందన్నారు. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ, ఉపాధి అవకాశాల కోసం జిల్లాయువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, కంపెనీలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించేందుకు దావోస్ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మెండి చంద్రశేఖర్, ఆకారపు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలి సాంకేతిక విప్లవంలో తెలంగాణవాసులు భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో కృత్రిమ మేధస్సు(ఏఐ)ను రూపొందించొచ్చని డీప్సీక్ రుజువు చేసిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం, అందులో తెలంగాణలో మేధోసంపత్తి అధికమన్నారు. డీప్సీక్ తరహాలో ఏఐని రూపొందించేందుకు ముందుకురావాలని, వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. దావోస్ ఒప్పందాలపై విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. గతేడాది తాము కుదుర్చుకున్న 18 ఒప్పందాల్లో 17 వివిధ స్థాయిలో ఉన్నాయని, అందులో 10 సగం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వందశాతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పోటీచేయనని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఏఐసీసీకి చెప్పారని, రెండురోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ప్రమాదంలో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి 7వ బెటాలియన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ బుధవారం రాత్రి విధులు ముగించుకొని తన గదికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన అజ్మీరా కళ్యాణ్నాయక్(29) డిచ్పల్లి బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తి న్నాడు. విధులు ముగించుకొని బుధవారం రాత్రి తాను అద్దెకు ఉంటున్న గదికి వెళ్తుండగా డిచ్పల్లిలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కళ్యాణ్నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి కుమారుడు, కుమార్తె, భార్య సుష్మా ఉన్నారు . పోలీసుల అదుపులో బండపల్లి యువకుడు ? చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి రవాణాదారులతో సంబంధాలున్నాయన్న సమాచారం మేరకు ఇద్దరితోపాటు మరో నలుగురు పేర్లను గ్రామస్తులతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయోనని చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలలో రోడ్డు పనులను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. గ్రామంలోని రామిండ్ల వాడ నుంచి అక్కపల్లికి వెళ్లే దారిలో ఒక సైడ్కు రోడ్డును తీస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణ పనులపై విచారణ జరపాలని కాల నీ వాసులు కోరుతున్నారు. అప్పటివరకు నిర్మాణ పనులు జరుగకుండా అడ్డుకుంటామన్నారు. అప్రమత్తతతో సైబర్ నేరాలకు చెక్ సిరిసిల్లక్రైం: అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో గురువారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు, మహిళా చట్టాలు, షీటీమ్, నూతన చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఎవరైనా మోసపోతే 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. కోనరావుపేట: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మండలకేంద్రంలో గురువారం రాత్రి మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే చెప్పకూడదని, ఖాతానుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. యువకులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎసై ్స ప్రశాంత్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రూ.కోటి దాటిన కొండగట్టు అంజన్న ఆదాయం
ఇద్దరికి జైలువేములవాడ: పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్షతోపాటు తలా రూ.వెయ్యి జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నాగయ్యపల్లికి చెందిన రొండి శంకరయ్య, పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన గుర్రం అశోక్లు అక్టోబర్ 14, 2017న ఓ కేసు దర్యాప్తు చేస్తుండగా ఎస్సై చిట్టిబాబు విధులకు ఆటంకం కల్గించినట్లు పేర్కొన్నారు. విచారణ అధికారి శ్రీనివాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ విక్రాంత్ కేసు వాదించారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరస్తులకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు చెప్పారు. కొండగట్టు(చొప్పదండి) కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.కోటి దాటింది. ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కింపు చేపట్టారు.70రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా రూ.1,15,93,291 నగదు, 55 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 61 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు. -
ఐదు నెలల సీజన్
నాణ్యమైన దిగుబడి.. వారం రోజులుగా..వానాకాలంలో నాలుగెకరాల్లో పత్తి పంట వేసిన. ఇటీవల పత్తి మొత్తం ఏరి కట్టె కొట్టేసినం. వచ్చే వానాకాలం సీజన్లో పత్తి వేసేందుకు ఇప్పుడే చేనులో గొర్రెల మంద పెట్టిస్తున్న. వారం రోజులుగా మంద చేనులోనే ఉంటోంది. గొర్రెల ఎరువుతో భూమి సారవంతం అవుతుంది. – ఆర్.అంజయ్య, రైతు, గుండన్నపల్లి మాకు 500 గొర్రెలు ఉన్నాయి. ఏటా జనవరి నుంచి మే వరకు రైతుల చేలలో గొర్రెల మందలు పెడుతున్నం. సీజన్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. గొర్రెల సంఖ్యను బట్టి ధర ఉంటుంది. మంద వద్ద రాత్రి పూట కాపలా ఉంటాం. – గుంటి కొమురయ్య, గొర్రెల కాపరి, బోయినపల్లి చేలలో గొర్రెల మందలు పెట్టిస్తే నేలకు సహజ పోషకాలు లభిస్తాయి. పర్యావరణం బాగుంటుంది. సేంద్రియ పద్ధతుల వలె నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. గతంలో రైతులు గొర్రె ఎరువు, ఆవు పేడ తదితర సేంద్రియ ఎరువులే వాడారు. దీంతో రోగాలబారిన పడలేదు. – కె.ప్రణీత, వ్యవసాయ అధికారి, బోయినపల్లి -
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
● బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని బైపాస్రోడ్డులో గల ఓ బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ను అక్రమంగా నిర్మించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆరోపించారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసి మాట్లాడారు. సదరు బిల్డింగ్ నిర్మాణం అనుమతులపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. బుధవారం సదరు బార్ అండ్ రెస్టారెంట్కు ఇచ్చిన అనుమతి ప్రకారం లేని నిర్మాణాలను తొలగించిన తర్వాతే నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని కోరారు. భవన యజమానిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతినగర్ నుంచి డంప్యార్డు వరకు సిరిసిల్ల గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న రోడ్డును తిరిగి వినియోగంలోకి తేవాలని విన్నవించారు. ఈరోడ్డును ఆక్రమించి వెలసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని కోరారు. -
ఎరువుల ‘మంద’
● నేలకు సత్తువ.. నాణ్యమైన పంట ● రైతుల చేలలో గొర్రెల మందల సందడి ● నత్రజని, కర్బనం పుష్కలం ● ఒక రోజు వెయ్యి గొర్రెల మందకు రూ.2,200 బోయినపల్లి(చొప్పదండి): గ్రామీణ ప్రాంతాల రైతులు గొర్రెలు, మేకల ఎరువు వాడకంపై ఆసక్తి చూపుతున్నారు. తమ పంటచేలలో రోజుల తరబడి గొర్రెల మందలు పెట్టిస్తున్నారు. గొర్రెలు, మేకలు విసర్జించే మలమూత్రాలతో భూమి సారవంతం కావడంతో పాటు నాణ్యమైన దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వరిపంట కోసి.. పత్తి ఏరిన రైతులు ఆ చేలలో మందలు పెట్టిస్తున్నారు. గొర్రె ఎరువులో సహజంగా నత్రజని, కర్బనం ఉంటాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మందను బట్టి రేటు గొర్రెల కాపర్లు గొర్రెలు, మేకల విక్రయంతో పాటు వాటి ఎరువును విక్రయించి అదనపు ఆదాయం పొందుతున్నారు. జనవరి నుంచి మే వరకు పంటచేలలో మందలు పెడతారు. గొర్రెలు, మేకలను పంటచేలలో ఉంచడాన్ని మంద పెట్టడం అంటారు. మందను బట్టి ధర నిర్ణయిస్తారు. 500 మేర గొర్రెలు ఉన్న మందకు రోజుకు రూ.1,000.. దాదాపు వెయ్యి గొర్రెలు, మేకలు ఉండే మందకు రూ.2,000 తీసుకుంటారు. ఎకరం చేనులో 500 గొర్రెల మంద ఆరురోజుల పాటు ఉంచుతామని పేర్కొంటున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు గొర్రెలు, మేకలు మందలో ఉంటాయి. తర్వాత వాటిని మేతకు తీసుకెళ్తారు. గొర్రె ఎరువు ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు ధర రూ.2,500 ఉంటుంది. నాణ్యమైన పంట రైతులు పొలాల్లో విత్తనం నాటిన నుంచి పంట ఎదిగే వరకు పలుసార్లు వివిధ రకాల ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తారు. అయితే గొర్రెల మంద పెట్టిన చేలలో అడుగు మందు కూడా తక్కువగా వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వరికి దోమ పోటు రాదని, పత్తి దిగుబడి బాగా వస్తుందని, మంద పెట్టిన చేలలో సుమారు రెండేళ్ల పాటు సహజ ఎరువు ఉంటుందని పేర్కొంటున్నారు. -
వీర్నపల్లి పీహెచ్సీ భవనానికి భూమి పూజ
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి కలెక్టర్ సందీప్కుమార్ఝా గురువారం భూమిపూజ చేశారు. అనంతరం తాత్కాళికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను ఓ ప్రైవేట్ భవనంలో ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో వాజిద్, పీహెచ్సీ డాక్టర్ అంజుమ్ సారియా, డీడీఎం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ చేసిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా