Rajanna Sircilla District News
-
నిర్లక్ష్యం వీడాలి
● ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించండి ● వివిధ సమస్యలపై 108 దరఖాస్తులు ● స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లటౌన్: ప్రజావాణికి వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రజాసమస్యలపై స్పందిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజావాణికి అన్ని మండలాల నుంచి వచ్చిన ఽబాధితులు 108 అర్జీలు అందించారు. రెవెన్యూకు 45, సిరిసిల్ల మున్సిపల్ 14, జిల్లా సంక్షేమ, ఉపాధి కల్పన, ఎస్డీసీకి 6 చొప్పున, విద్యాశాఖకు 5, ఎస్పీ ఆఫీస్కు 4, నీటిపారుదల, వ్యవసాయ, ఎంపీడీవో తంగళ్లపల్లికి 3 చొప్పున, డీఆర్డీవో, రిజిస్టర్, సెస్కు 2 చొప్పున, సర్వే, ఆర్అండ్బీ, జిల్లా పౌరసరఫరాలు, సీపీవో డీపీవో, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎస్సీ కార్పొరేషన్కు ఒకటి చొప్పున వచ్చాయి. జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు పరికరాల అందజేత కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలతో ఇద్దరు దివ్యాంగులకు పరికరాలు అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి పవన్ పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. వీల్చైర్ ఇప్పించాలని పవన్, మ్యానువల్ ట్రై సైకిల్ ఇప్పించాలని వేములవాడలోని సాయినగర్కు చెందిన లేదేళ్ల రమేశ్లు విన్నవించారు. కలెక్టర్ ఆదేశాలతో దాసరి పవన్కు వీల్చైర్, లేదేళ్ల రమేశ్కు మ్యానువల్ ట్రై సైకిల్, సంక కర్ర జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అందజేశారు. -
8న లోక్ అదాలత్
సిరిసిల్ల: జిల్లా కోర్టులో ఈనెల 8న లోక్ అదా లత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తెలిపారు. కక్షిదారులు సివిల్, క్రిమినల్ కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకోవాలని కోరారు.కాల్వ పనులు పూర్తి చేయండి చందుర్తి(వేములవాడ): పంటలను కాపాడేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించి, అసంపూర్తిగా మిగిలిన డిస్ట్రీబ్యూటరీ కాలువ పనులు పూర్తిచేయాలని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి, చందుర్తి తహసీల్దార్, భూసేకరణ విభాగాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు సో మవారం వినతిపత్రాలు అందించారు. వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని 450 రిజ ర్వాయర్ ట్యాంకు అనుసంధానం డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు 132 సర్వేనంబర్లో నుంచి వెళ్తున్నాయని, ఆ రైతుకు పరిహారం చెల్లించాలని కోరారు. ఆ సంఘం అధ్యక్షుడు చిలుక పెంటయ్య, బత్తుల కమలాకర్, మర్రి రాజు, లక్కర్సు మహేశ్, తిరుపతి, గంగాధర్, లక్కర్సు రాజేశం, మల్లేశం పాల్గొన్నారు. రంగనాయకసాగర్ కాల్వను పరిశీలించిన అధికారులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): జక్కాపూర్ రంగనాయకసాగర్ కాలువను ఎస్ఈ రవీందర్, అధి కారులు రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. కాలువ ద్వారా నీరు రాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని అధికారులకు రైతులు వివరించారు. స్పందించిన అధికారులు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాట్ల మధు, విజయేందర్, సతీశ్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. మానేరు నీరు వదలండి ముస్తాబాద్(సిరిసిల్ల): ఎగువ మానేరు నీరు వదిలి పంటలను కాపాడాలని ముస్తాబాద్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. మానేరు కెనాల్ డిస్ట్రిబ్యూటరీ–20 వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. నాయకులు శీలం స్వామి, మనోహర్, బాలెల్లు, బాలరాజు, దేవయ్య, రాజు, శంకరయ్య, ఎల్లయ్య, పెద్దులు, శ్రీను, పర్శరాములు, చంద్రం, రాజయ్య పాల్గొన్నారు. ఇప్పటికైనా పంటలకు నీరందించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హక్కుదార్లను భిక్షకులు చేశారు● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిసిరిసిల్లటౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఆయకట్టు రైతులను హక్కుదార్లుగా కాకుండా మాజీ మంత్రి కేటీఆర్ భిక్షకులుగా మార్చారని కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేంందర్రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలోని తన నివాసంలో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతంలో రైతుల సమస్యలు విన్న పాపాన పోని కేటీఆర్.. ఇటీవల జిల్లాలో పర్యటించి వారిపై లేనిపోని ప్రేమను ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా రైతులకు ప్రయోజనం కలిగించే 9, 10, 11, 12వ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదో కేటీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.312కోట్లు కేటాయిస్తే 1.6లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేదన్నారు. ‘కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు’ అంటూ ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఇప్పుడు కూలేశ్వరంగా ఉందని విమర్శించారు. చెక్డ్యాంలు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం వారి అక్రమాలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, కాముని వనిత, కల్లూరి చందన, ఆడెపు చంద్రకళ, బైరినేని రాము, యెల్లె లక్ష్మీనారాయణ, వంతడ్పుల రాము పాల్గొన్నారు. -
పత్తాలేని వడ్డీ రాయితీ!
● అన్నదాతల ఎదురుచూపులు ● వడ్డీభారంతో ఆందోళన ● జిల్లాలో 61,740 మంది రైతులు ● రూ.808.46కోట్ల పంట రుణాలు ● రూ.24.24 కోట్ల రిబేట్ బకాయిముస్తాబాద్(సిరిసిల్ల): పంట రుణాలపై వచ్చే వడ్డీ రాయితీపై స్పష్టత కరువైంది. వానాకాలం సీజన్ ముగిసినా రుణాల రిబేట్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంటకాలం ముగుస్తున్న క్రమంలో వానాకాలం పంట రుణాల రిబేట్ బ్యాంక్ ఖాతాల్లోకి జమకావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. క్రమం తప్పకుండా పంట రుణాల వడ్డీ చెల్లిస్తున్న రైతులకు రావాల్సిన రిబేట్ను ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతుల పంట రుణాలపై 3 శాతం రిబేట్ను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 4శాతం రిబేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రిబేట్ను జమచేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లుగా రిబేట్ను ఇవ్వడం లేదు. కేంద్రంపైనే రైతుల ఆశలు రైతులు తీసుకున్న పంట రుణాలపై ఏటా కేంద్ర ప్రభుత్వం 3 శాతం రాయితీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం మొత్తంగా 7శాతం రాయితీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు 3 శాతం రాయితీని రైతుల ఖాతాల్లో జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా రిబేట్ను జమ చేయడం లేదు. రూ.24.24 కోట్ల రిబేట్ బకాయి జిల్లాలో 61,740 మంది రైతులకు రూ.808.46 కోట్ల పంట రుణాలు అందించారు. ఇందులో కేంద్రం 3 శాతం రిబేట్గా రూ.24.24 కోట్లు బకాయిపడింది. జిల్లాలో పంట రుణాలు పొందిన 61,740 మంది రైతుల్లో తొంభై శాతం మంది రెగ్యులర్గా వడ్డీ చెల్లించినవారే. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి, రుణాలు రెన్యూవల్ చేసుకున్న రైతులకై నా రిబేట్ వర్తింపచేయాలని కోరుతున్నారు. దీర్ఘకాలిక రుణాలపై కోత పదేళ్ల క్రితం వరకు సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు 6 శాతం రిబేట్ను వారి ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్వల్పకాలిక పంటరుణాలకే రిబేట్ను పదేళ్లుగా అందించలేదు. ఇక దీర్ఘకాలిక రుణాలపై రిబేట్ ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందని రైతులు భావిస్తున్నారు. స్వల్పకాలిక రుణాలపై డిసెంబర్ వరకు రైతులు వడ్డీని చెల్లించి ఉన్నారు. కేంద్రం కూడా ఆలోగానే రిబేట్ను జమ చేయాల్సి ఉంది. పంట రుణాలు ఇలా.. రుణాలు పొందిన రైతులు : 61,740 రుణాల మొత్తం : రూ.808.46 కోట్లు రావాల్సిన రిబేట్: రూ.24.24 కోట్లుఇది ముస్తాబాద్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ఈ సహకార సంఘంలో 755 మంది రైతులు రూ.8.80కోట్ల పంట రుణాలు పొందారు. రైతులు తీసుకున్న పంట రుణాలలో 3 శాతం చొప్పున రిబేట్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ రైతుకు రిబేట్ జమకాలేదు. ముస్తాబాద్ సింగిల్విండో పరిధిలోని రైతులకు దాదాపు రూ.24 లక్షల రిబేట్ రావాల్సి ఉంది. ఇది ఒక్క ముస్తాబాద్ సహకార సంఘంలోని సమస్యే కాదు. జిల్లాలోని 23 సహకార సంఘాలు, 50 వాణిజ్య బ్యాంకుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్య. -
దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: దివ్యాంగులకు యూడీఐడీ(యూనిక్ డిసేబులిటీ గుర్తింపు కార్డులు) జారీ చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో యూడీఐడీ కార్డుల జారీపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లకు బదులుగా యూనిక్ డిసేబులిటీ గుర్తింపుకార్డులను ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు వైద్యులు ధ్రువీకరించిన వైకల్యశాతంతో కూడిన సదరన్ సర్టిఫికెట్, పూర్తి వివరాలు జనరేట్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. దృష్టి, కుష్టి వ్యాధిగ్రస్తులు, వినికిడి, అంగవైకల్యం, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి(యూడీఐడీ) కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడీఐడీ జనరేట్ చేస్తారని వివరించారు. ఆస్పత్రిలో యూడీఐడీ నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులను, పరికరాలు ఉండేలా చూడాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పి.పెంచలయ్య పాల్గొన్నారు. -
టీచర్స్లో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యంలోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● ఆర్వో, సిబ్బంది పనితీరుపై ఈసీకి సర్దార్ ఫిర్యాదు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. ముందు నుంచి అనుకున్నట్లుగా మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. తొలిప్రాధాన్యం ఓట్లతోనే కొమురయ్య గెలవడం విశేషం. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. అయినా కేవలం కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చానీయాంశంగా మారింది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని, ఓట్లలో జంబ్లింగ్ విధానం పాటించలేదని, బూత్ల (పలిమెల బూత్) వివరాల్లో గోప్యత పాటించకుండా బయటికి వెల్లడించారని ఆరోపిస్తూ ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. వీరితోపాటు అభ్యర్థులు విక్రంరెడ్డి, సిలివేరు శ్రీకాంత్ తదితరులు ఆర్వో తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్లో పారదర్శకత లేదని, వెంటనే ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. బండి అభినందనలురాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని కేంద్ర సహాయ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. నాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీచార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమురయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారు’ అని అన్నారు. -
No Headline
గంభీరావుపేట(సిరిసిల్ల): ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య ఈసారైనా పరిష్కారమవుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రతీ వానాకాలంలో గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య చిన్నపాటి వర్షానికి రాకపోకలు నిలిచిపోయేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండేళ్ల క్రితం రూ.10కోట్లతో ప్రారంభించిన హైలెవల్ వంతెన పనులు ఇంకా పూర్తికాలేదు. వానాకాలం మొదలయ్యే నాటికి పనులు పూర్తికావడం అనుమానంగానే ఉంది. మళ్లీ వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచి ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ఇంకా పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. లోలెవల్ వంతెనతో ఏటా కష్టాలు గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య గల మానేరువాగుపై ఏళ్ల క్రితం లోలెవల్ వంతెన నిర్మించారు. వాగు ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా లింగన్నపేట, కొత్తపల్లి, ముస్తాబాద్ మండలం, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. వీరంతా సిరిసిల్ల మీదుగా ఇబ్బంది పడుతూ వెళ్లేవారు. లింగన్నపేట, ముచ్చర్ల, కొత్తపల్లి, కోళ్లమద్ది, శ్రీగాథ, రాజుపేట గ్రామాలతోపాటు పక్క మండలాల నుంచి ప్రజలు ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం గంభీరావుపేటకు వస్తుంటారు. ఏటా వానాకాలంలో వీరికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరయ్యాయి. పాత బ్రిడ్జి కూల్చివేసి, పక్కకు మట్టి రోడ్డు పోసి హైలెవల్ వంతెన పనులు ప్రారంభించారు. పనుల్లో తీవ్ర జాప్యంతో నత్తకే నవ్వొచ్చేలా ఉంది.పనులు జరుగుతున్నాయి గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ఫుట్టింగ్ స్థాయిలో ఉన్నాయి. పనుల్లో వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావడానికి కృషి చేస్తున్నాం. – నరేందర్, ఆర్అండ్బీ ఏఈ, గంభీరావుపేట -
గెలుపెవరిదో..
సబ్ పార్సిల్ ఓట్లు కీలకం● చెల్లుబాటు ఓట్లలో సగం మెజారిటీ సాధిస్తేనే విజయం ● లేకపోతే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు ● ప్రతిరౌండ్లోనూ ఎగ్జాస్టెడ్, సబ్ పార్సిల్ ఓట్లు కీలకం ● ఎలిమినేటెడ్ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లు తీసివేత ● మిగిలిన సబ్ పార్సిల్ ఓట్లు అభ్యర్థులకు బదిలీ ● విజయంపై స్పష్టత వచ్చేవరకూ కొనసాగనున్న కౌంటింగ్ ● సాయంత్రానికి ‘టీచర్’ ఫలితం.. పట్టభద్రుల ఫలితానికి రెండు రోజులు?సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫార్ములా ఆధారంగా కోటా నిర్ధారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలు కడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా వాడతారు. అదేంటంటే.. కోటా = మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు డివైడెడ్బై సీట్ల సంఖ్య ప్లస్ వన్ ఓల్ ప్లస్ వన్ అన్న సూత్రం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. (ఉదాహరణకు: మొత్తం రెండు వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటు ఐతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు.) తొలుత తొలి ప్రాధాన్యం ఓట్లను అభ్యర్థుల వారీగా పంచుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఆప్పుడు రెండో రౌండ్కు లెక్కింపు ప్రక్రియ వెళ్తుంది. ● రెండో రౌండ్ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రౌండ్లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని రెండో రౌండ్లో తప్పిస్తారు. ఇక్కడ ఓటింగ్ సరళిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో రెండు రకాలుగా ఓట్లను విభజిస్తారు. ఓటర్లు రెండు రకాలుగా ఓట్లు వేస్తారు. ఒకటి కేవలం తొలి ప్రాధాన్యం ఓట్లు మాత్రమే వేసేవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇచ్చేవారు. తొలిరౌండ్లో తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి తొలి ప్రాధాన్యం మాత్రమే వచ్చిన ఓట్లను ఎగ్జాస్టెడ్ ఓట్లుగా పరిగణించి వాటిని తప్పిస్తారు. మిగిలిన రెండో రౌండ్ ప్రాధాన్యం ఓట్లను (సబ్ పార్సిల్ ఓట్లు) అభ్యర్థులకు పంచుతారు. అలా ఫార్ములా ప్రకారం.. ఏ రౌండ్లో అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో ఒక అభ్యర్థికి సగం ఓట్లు వచ్చేంత వరకు రౌండ్లు (ఎలిమినేషన్) ప్రక్రియ సాగుతుంది. అప్పుడే విజేతను ప్రకటిస్తారు. లెక్కింపు గణాంకాలువేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పోలైన ఓట్లు : 2,50,106 టీచర్స్లో పోలైన ఓట్లు: 24,895 మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంఎలా లెక్కిస్తారంటే? కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా.. గతనెల 27న జరిగిన ఎన్నికల్లో 2,50,106 మంది (70.42 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓట్లు ఉండగా.. 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో టీచర్ స్థానం ఫలితం సాయంత్రానికి వెలువడనుంది. అధిక ఓటర్లున్న గ్రాడ్యుయేట్ స్థానం కనీసం రెండు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మూడో రోజుకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.400 మంది పోలీసుల బందోబస్తు కరీంనగర్క్రైం: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సోమవారం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ఈ ప్రక్రియలో ఒక అడిషనల్ డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంబేడ్కర్ స్టేడియంలోని గేట్ నంబర్– 1 నుంచి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. గేట్ నంబర్– 4 ద్వారా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి అనుమతించబడునని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్– 2 ద్వారా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. -
పశువులకు మేతగా పంట పొలాలు
వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి మండలంలోని పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వదిలేస్తున్నారు. సూరమ్మ ప్రాజెక్టులో నీటిని తొలగించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైనున్న నాగారం, అచ్చయ్య కుంట చెరువులను గోదావరి నీటితో నింపి ఉంటే భూగర్భ జలాలు అడుగంటేవి కాదని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గోదావరి నీటిని రుద్రంగి అచ్చయ్యకుంట, నాగారం చెరువుల్లో నింపాలని వేడుకుంటున్నారు. – రుద్రంగి(వేములవాడ) -
కాంగ్రెస్ తెచ్చిన కరువు
● కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనేశ్వరం ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. కేసీఆర్పై ద్వేషంతోనే కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకోకుండా కరువు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దేవునిగుట్టతండాలో ఎండిన పంట పొ లాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు తమ పంటపొలా లు ఎండిపోతున్నాయని, నీళ్లు విడుదల చేయించి కాపాడాలని వేడుకున్నారు. వారి ఆవేదనలు విన్న కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కేసీ ఆర్పై ద్వేషంతోనే మేడిగడ్డలో చిన్న పర్రె ఏర్పడితే అక్కడి నుంచి 15 నెలలుగా నీళ్లు తెచ్చుకో కుండా కాంగ్రెస్ ప్రభుత్వం కరువు సృష్టించింద ని విమర్శించారు. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ కాళేశ్వరం నీటితో మిడ్మానేర్, అప్పర్మానేర్ నింపిన విషయాన్ని గుర్తు చేశా రు. జిల్లాలోని వాగులు, చెరువులు నింపి రైతుల ను కాపాడుకున్న ప్రభుత్వం తమదని అన్నారు. మంత్రితో మాట్లాడిన.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఈఎన్సీ అనిల్కుమార్లతో ఈరోజు మాట్లాడినట్లు కేటీఆర్ తెలి పారు. రాబోయే 48 గంటల్లో నీరు విడిచిపెట్టాలని కోరామని అన్నారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే మంత్రి చాంబర్ ఎదుట భైఠాయిస్తామని తెలిపారు. కేసీఆర్ మీద కోసం ఉంటే మాతో కొట్లాడాలి కానీ రైతులను ఆగం చేయడం ఎంతమాత్రం మంచిది కాదన్నా రు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్రెడ్డి ప్రభుత్వం పొట్టనపెట్టుకుందన్నారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణహరి, నాయకులు అందె సుభా్శ్, కొండ రమేశ్, నరసింహారెడ్డి, కిషన్, నమిలికొండ శ్రీనివాస్, దేవరాజు తదితరులు ఉన్నారు. రైతు కుటుంబానికి అండగా ఉంటాం ముస్తాబాద్: రైతులు ఎవరూ ఆత్మస్థైర్యం కొల్పోవద్దని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన జెల్ల దేవ య్య రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, బాధిత రైతు కుటుంబాన్ని ఆదివా రం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2లక్షలు అందజేశారు. ప్రభుత్వ పరంగా దేవయ్య కుటుంబానికి వచ్చే పథకాలు వర్తింపజేసేలా అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
● ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: విధి నిర్వహణలో వైద్యులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సందీప్కుమార్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, జనరల్, ప్రసూతి, ఆర్థో, పీడియాట్రిక్, సర్జి కల్ వార్డులు, ఇతర విభాగాలను పరిశీలించారు. రోస్టర్ విధానంలో ఎంతమంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు? ఇబ్బందులున్నాయా? అ ని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు? వారికి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారు అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో రోగులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, వారికి అన్ని రకాలుగా భరోసా కల్పించి మెరుగైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది కర్తవ్యమని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని అన్నారు. లివర్ సమస్యతో బాధపడుతున్న ఒక రోగికి వైద్యం అందించినా మెరుగుపడలేదని కుటుంబసభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. స్పందించిన కలెక్టర్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబా ద్ పంపించి మెరుగైన వైద్యం అందించేలా చూ డాలన్నారు. నిత్యం పర్యవేక్షించాలని ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణను కలెక్టర్ ఫోన్లో కోరారు. శ్రీపాదరావు సేవలు మరువలేనివి మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా క్రీడల అధికారి ఆజ్మీరా రాందాస్, ఎల్డీఎం మల్లికార్జున్, బీసీ వెల్ఫేర్ అధికారి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే ఉన్నత శిఖరాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువే ఆయుధమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. నిత్య సాధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల ఏకలవ్య విద్యాలయాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్రూమ్, వంటసామగ్రి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠం చెప్పారు. విద్యార్థులకు కల్పిస్తున్న డైనింగ్హాల్, టాయిలెట్స్, గ్రౌండ్, ఇతర వసతులను పరిశీలించారు. -
టీకా వేసి రెండు గంటలు పరిశీలించాలి
● అబ్జర్వేషన్ తర్వాతే ఇంటికి పంపించాలి ● జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్ల: ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన తర్వాత రెండు గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. సిరిసిల్లలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, బీవైనగర్, శివనగర్, ప్రగతినగర్లో వ్యాధి నిరోధక టీకాల కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. పిల్లలకు వేస్తున్న వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ పిల్లలకు టీకాలు వేసిన తర్వాత కనీసం రెండు గంటలపాటు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలన్నారు. ఆస్పత్రి రికార్డులను, వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. డాక్టర్ సాహితి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కొలనులో చేపలమవుదాం
● ఈతతో ఆరోగ్యానికి ఊతం ● పలు వ్యాధులకు ఔషధం ● చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి ● సమ్మర్కు ముందే కొలనుల్లో సందడి ● ఎండలు ముదిరితే.. మరింత రద్దీకరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్ టౌన్: ఈత.. ఆరోగ్యానికి ఊతం. శరీరానికి చక్కటి వ్యాయామం. ఈత నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. దీంతో చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ వచ్చిందే చాలు తమ పిల్లలను సమీపంలోని కొలనులు, చెరువులు, బావు ల వద్దకు తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నారు. ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఈత కొలనులు అందుబాటులో ఉంచి శిక్షణ ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ మైదానాల్లోని స్విమ్మింగ్పూల్స్లోనూ ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్ సమీపిస్తోంది. ఎండలు ముదురుతుండడంతో ఉపశమనం కోసం ఈతకు వెళ్తున్నారు. పలు స్విమ్మిగ్పూల్స్లో ఇప్పుడే సందడి కనిపిస్తుండగా.. మరో పక్షం రోజుల తరువాత అన్ని ప్రాంతాల్లోని కొలనులు ఈత నేర్చుకునేందుకు వచ్చేవారితో నిండిపోనున్నాయి. ఈ సందర్భంగా ఈత.. రకాలు.. ఉపయోగాలు.. జాగ్రత్తతో ప్రత్యేక కథనం.ఉమ్మడి జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్జిల్లా ప్రభుత్వ ప్రైవేటు కరీంనగర్ 02 05 జగిత్యాల 01 01 పెద్దపల్లి 02 06 సిరిసిల్ల 01 05 -
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదివారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన వివరాలు వ్యక్తిగత సహాయకుడు మహేందర్రెడ్డి శనివారం వెల్లడించారు. ఇటీవల జైలుకు వెళ్లివచ్చిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని, సిరిసిల్లలో టీస్టాల్ను కోల్పోయిన బత్తుల శ్రీనివాస్ను పరామర్శిస్తారు. మరణించిన బీఆర్ఎస్ నాయకులు కాసర్ల మల్లేశం, బుర్ర శంకరయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించనున్నారు. రైతులతో మాట్లాడుతారు. ముస్తాబాద్ మండలం పోత్గల్లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు జెల్ల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నీటి మళ్లింపును అడ్డుకున్న అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్–రాచర్లగొల్లపల్లి శివారులోని జక్కుల చెరువు నుంచి ఓ రైతు అక్రమంగా నీటి మళ్లించగా రైతుల ఫిర్యాదుతో శనివారం అధికారులు అడ్డుకున్నారు. రాచర్లబొప్పాపూర్కు చెందిన రైతు వరుస బాలయ్య జక్కుల చెరువు కాల్వలకు రెండు మోటార్లు పెట్టి తన బావిలోకి నీటిని మళ్లించాడు. గమనించిన ఆయకట్టు రైతులు బాలయ్యను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని నీటి సంఘం చైర్మన్ గోగూరి శ్రీనివాస్రెడ్డి, మర్రి శ్రీనివాస్రెడ్డి, దాసరి గణేష్ ఏఈ భాస్కర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఏఈ క్షేత్రస్థాయిలో పరిశీలించి జక్కుల చెరువు కాలువల నుంచి నీటి మళ్లింపును నిలిపివేశారు. -
శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సిరిసిల్ల: జిల్లా రైతులు పండించిన శనగల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో శనగల కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో 175 ఎకరాల్లో శనగపంట సాగైందని, 1,347 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కలెక్టర్ వివరించారు. బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లోని సింగిల్విండోలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా శనగలు కొనుగోలు చేయాలని కోరారు. క్వింటాలు శనగలకు రూ.5,650 మద్దతు ధర చెల్లించాలని సూచించారు. తేమకొలిచే యంత్రాలు, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ మిషన్లు, గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. శనగల నిల్వకు గోదాములు గుర్తించాలన్నారు. జిల్లా మార్క్ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, జిల్లా వ్యవసాయాధికారి అబ్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, డీఎస్వో వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్లకు స్థలాలు గుర్తించండి ప్రధానమంత్రి కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని పంచాయతీరాజ్ కార్యదర్శి దివ్య దేవరాజన్ కోరారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఆస్పత్రి పర్యవేక్షకులు లక్ష్మీరాజం, పి.పెంచలయ్య పాల్గొన్నారు. క్వింటాలు మద్దతు ధర రూ.5,650 కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ప్రజా సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక పార్టీ ఆఫీసులో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదలకు కొత్త రేషన్కార్డులను ఇచ్చిన పాపాన పోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. -
భూగర్భ జలాల తీరు (మీటర్ల లోతులో..)
మండలం 2024 ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి బోయినపల్లి 6.57 7.21 చందుర్తి 5.48 5.23 గంభీరావుపేట 9.65 11.59 ఇల్లంతకుంట 8.58 5.90 కోనరావుపేట 9.87 9.72 ముస్తాబాద్ 14.23 9.79 రుద్రంగి 6.09 5.31 సిరిసిల్ల 12.71 11.65 తంగళ్లపల్లి 10.92 7.87 వీర్నపల్లి 14.57 13.45 వేములవాడరూరల్ 5.85 4.77 వేములవాడఅర్బన్ 13.58 13.18 ఎల్లారెడ్డిపేట 12.42 15.62 జిల్లా సగటు 10.61 9.28 -
ముస్తాబాద్కు సాగునీటిని అందించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రంలోని పొలాలకు ఈ యాసంగికి సాగునీటిని అందించాలని తహసీల్దార్ సురేశ్కు రైతులు శనివారం విన్నవించారు. ఎగువ మానేరు నీటిని కెనాల్ డిస్ట్రిబ్యూటరీ–18 వరకు మాత్రమే అందిస్తున్నారని, దీంతో 19, 20 డిస్ట్రిబ్యూటరీల కింద ఉన్న వెయ్యి ఎకరాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెర్లుమద్ది, సేవాలాల్తండాకు మానేరు కెనాల్ ద్వారా వారానికి రెండుసార్లు విడుదల చేస్తున్న అధికారులు.. ముస్తాబాద్ను ఎందుకు విస్మరిస్తున్నారో చెప్పాలని కోరారు. రైతులు బాలెల్లు, శీలం స్వామి, శ్రీనివాస్, బాలయ్య, పర్శరాములు, ఎల్లం, రాములు పాల్గొన్నారు. సింగసముద్రానికి నీరందించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలు ఎండకముందే సింగసముద్రానికి మల్కపేట రిజర్వాయర్ నుంచి నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆయకట్టు భూములకు సాగునీరు ఇబ్బందులు రానీయద్దంటూ శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్పూర్, కిష్టనాయక్తండా, రాజన్నపేట, బాకుర్పల్లితండాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిడ్మానేరు నుంచి మల్కపేటకు నీటిని పంపింగ్ చేసి సింగసముద్రానికి నీరు వచ్చేలా చూడాలని కోరారు. ఇల్లంతకుంట మండలం రైతుల కోసం రంగనాయకసాగర్ నుంచి బోడుమీదపల్లి, నర్సింహులపల్లి వరకు వదరకాల్వ పనులు పూర్తిచేయాలని కోరారు. ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయండి ● ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్కుమార్గంభీరావుపేట(సిరిసిల్ల): పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం గంభీరావుపేటలో నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నారని, విద్యకు మాత్రం మంత్రి లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరుణ్, ఈశ్వర్, మనిస్వాంత్, అజయ్, నిఖిల్ పాల్గొన్నారు. బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం అంగన్వాడీ సెక్టార్ సమావేశంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో కార్యక్రమం శనివారం నిర్వహించారు. జెండర్ స్పెషలిస్ట్ దేవిక మాట్లాడుతూ బాలికలను వివక్ష, దాడుల నుంచి రక్షించుకోవాలని కోరారు. సీడీపీవో ఉమారాణి, సూపర్వైజర్ సూర్యకళ పాల్గొన్నారు. -
ఉపయోగాలు.. జాగ్రత్తలు
● ఈత కొట్టడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆకలి వేస్తుంది. రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ● ఆస్తమా ఉన్నవారు, సర్జరీ అయినవారు, చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు, అవయవ మార్పిడి చేసుకున్న వారు ఈతకు దూరంగా ఉండాలి. ● కొత్తగా ఈత నేర్చుకునేవారు లోతైన ప్రదేశాలకు వెళ్లకూడదు. ట్యూబ్, బుర్రకాయ, వాటర్ ప్లాస్టిక్క్యాన్లతో పెద్దవారి పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. ● ప్రత్యేక శిక్షణ పొందిన స్విమ్మర్ల వద్ద ఈత నేర్చుకోవాలి. బావులు, చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఒంటరిగా పంపొద్దు. 3ఫీట్లలోతు నీటిలో ఈత నేర్పడం ఉత్తమం. పూర్తిగా నేర్చుకున్నాక 8ఫీట్ల లోతులో ఈదొచ్చు. -
చివరికి బీటలు
● పొట్టకొచ్చిన పొలం నీళ్లకేడ్చింది ● 35వేల ఎకరాల్లో ఎండిన పొలాలు ● జిల్లాలో అడుగంటిన ఊటలు ● ఎల్లారెడ్డిపేటలో 15.62మీటర్లకు పడిపోయిన నీటిమట్టం ● నేడు పొలాలను పరిశీలించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్వ్యవసాయ స్వరూపం వ్యవసాయ కనెక్షన్లు : 74,754 వరి సాగు : 1,77,042.28 ఎకరాలు బోర్లు : 41,104 (చాలా బోర్లు ఎండిపోయాయి) బావులు : 28,124 (ఎక్కువ బావులు వట్టిపోయాయి) రైతులు : 84,109ఇది ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ శివారులోని వరి పొలం. బోరు ఎత్తిపోవడంతో నీరు అందక మొత్తం ఎండిపోయింది. దీంతో ఆ పొలంలో స్థానిక గొర్రెలకాపరులు ఇలా జీవాలను మేపుతున్నారు. పొలం పశువులకు మేతగా మారడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 20 శాతం మేరకు వరి పొలాలు ఎండిపోయాయి. దాదాపు 35వేల ఎకరాల్లో పంట పూర్తిగా చేతికందకుండా పోయింది. మరో పక్షం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అడుగంటిన భూగర్భ జలాలు
సిరిసిల్ల: యాసంగి సీజన్ అన్నదాతలను కన్నీరు పెట్టిస్తోంది. అడుగంటిన భూగర్భ జలాలతో పొలాలు పారడం లేదు. వ్యవసాయబావులు, బోరుబావులు ఎత్తిపోవడంతో పంటపొలాలు ఎండిపోతున్నాయి. సాధారణ వర్షాల కంటే ఎక్కువే కురవడంతో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉన్నాయన్న ఆశతో రైతులు యాసంగిలో వరిపంటను ఎక్కువగా సాగు చేశారు. అయితే పంట పొట్టకొచ్చేదశలో నీరందక పూర్తిగా ఎండిపోతుండడంతో కర్షకులు కన్నీరుపెట్టుకుంటున్నారు. జిల్లాలో అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్టు.పడిపోతున్న భూగర్భజలాలుజిల్లాలో 1,77,042 ఎకరాల్లో వరిపంటను సాగైంది. వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోయి పొలాలు ఎండిపోతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యధిక లోతుకు 15.62 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఈ ఏడాది ఎత్తిపోతల ఊసే లేకపోవడంతో జిల్లాకు గోదావరి జలాలు కరువయ్యాయి. బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలో 16.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో పెద్దగా నీరు నిల్వ లేదు. గంభీరావుపేట ఎగువమానేరులోకి గోదావరి జలాలు పూర్తిస్థాయిలో రాలేదు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోనూ నీటి మట్టం తగ్గింది. మల్కపేట రిజర్వాయర్లో ఒక్క టీఎంసీ నీరు ఉంది. జిల్లాలో బావులు, బోర్ల ద్వారా నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు పడిపోయాయి. మండుతున్న ఎండలకు బోర్లు ఎత్తిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు మళ్లీ బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. -
16 నుంచి శివకల్యాణోత్సవం
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహాశివరాత్రి మహోత్సవాలు ముగిసిన తర్వాత శివకల్యాణోత్సవం వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈనెల 12న కామదహనం, మూడు రోజులపాటు డోలోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 17న ఉదయం పార్వతీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 19న రథోత్సవం, 20న త్రిశూలయాత్ర, పూర్ణాహుతి, ఏకాదశవరణములతో ఉత్సవాలు సమాప్తమవుతాయని వివరించారు. వేములవాడలో స్మార్థవైదిక పద్ధతిలో.. రాష్ట్రంలోని అన్ని శైవక్షేత్రాల్లో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మన్మథుడు బాణం సంధించి ఈశ్వరుడిని తపస్సును భంగం చేయడంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రినేత్రంతో దహనం చేశాడని శాస్త్రాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కామదహనం మరుసటి రోజు కల్యాణం నిర్వహించుకుంటున్నట్లు అర్చకులు తెలిపారు. -
ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి
● లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్రావు ● అపెరల్పార్క్లో ఆర్థిక అవగాహన సదస్సు సిరిసిల్ల: ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్రావు పేర్కొన్నారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గార్మెంట్ యూనిట్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా వచ్చే వేతనాలను సరైన విధంగా ఖర్చు చేయాలన్నారు. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఖర్చులు పోను మిగిలే డబ్బులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాలని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు. సోషల్, ఇతర మీడియాల్లో వచ్చే ఆర్థిక ప్రకటనలు నమ్మి పెట్టుబడి పెట్టవద్దని కోరారు. లీడ్ బ్యాంక్ కౌన్సిలర్ వెంకటరమణ, గ్రీన్ నీడిల్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ఫణికుమార్, హెచ్ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించని సెంటర్లపై చర్యలు
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత హెచ్చరించారు. జిల్లా పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శుక్రవారం నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ గర్భస్థ లింగనిర్ధారణ నేరమన్నారు. ప్రతీ స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్ట్ పేరు నమోదు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్లు చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, పీవోఎంఎస్ఎన్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డీజీవో శోభారాణి, మా నేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చింతోజ్ భాస్కర్, లీగల్ అడ్వయిజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మి, హెచ్ఈ బాలయ్య పాల్గొన్నారు. -
వస్త్రోత్పత్తి లక్ష్యం సాధించాలి
సిరిసిల్ల: ప్రభుత్వం ఇచ్చిన వస్త్రోత్పత్తి ఆర్డర్ల లక్ష్యాన్ని సకాలంలో సాధించి, బట్టను అప్పగించాలని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి వస్త్రపరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమల యజమానులతో సమీక్షించారు. శైలజా రామయ్యర్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆరు నెలలపాటు ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందాలని, వస్త్రమార్కెట్కు అనుగుణంగా వస్త్రాలను తయారు చేయాలని సూచించారు. తొలి విడతగా మహిళాశక్తి చీరలకు 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించిందని, ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. వస్త్రోత్పత్తి ఆర్డర్లలో 50 శాతం మార్చి 15లోగా బట్టను అందించాలని శైలజా రామయ్యార్ ఆదేశించారు. అర్హులకు బ్యాంకు రుణాలు యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. ‘సెస్’ విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. వస్త్రపరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని గుర్తు చేశారు. వస్త్రపరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్డర్లు సకాలంలో పూర్తిచేస్తే మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు. యార్న్ బ్యాంక్ నుంచి ముడిసరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపా రు. టెస్కో ఇన్చార్జి జీఎం రఘునందన్, టెస్కో ఏడీ సందీప్జోషి గౌతమ్, సిరిసిల్ల జౌళిశాఖ ఏడీ సాగర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, వస్త్రోత్పత్తిదారులు జేఏసీ అధ్యక్షుడు తాటిపాముల దామోదర్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలోని నేతకార్మికుల ఉపాధి, సబ్సిడీ తదితర సమస్యలు పరిష్కరించాలని పవర్లూమ్స్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. ఈమేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్కులో మూతబడ్డ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. కార్మికుల ఉపాధి, సబ్సిడీ, వర్కర్ టు ఓనర్, త్రిప్టు సమస్యలపై వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్క దేవదాస్, బెజుగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్ పాల్గొన్నారు. 15లోగా 50 శాతం వస్త్రాలు అందించాలి ఆరు నెలలపాటు నేతన్నలకు ఉపాధి అర్హులకు బ్యాంకు రుణాలు చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
అన్నదాతలకు అండగా ఉంటాం
● రైతుల పక్షాన పోరాడుతాం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ● ఎండిన పొలాలు, కాలువల పరిశీలనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతుగా ఉంటామని, రైతుల పక్షాన ఎలాంటి ఉద్యమాలకై నా సిద్ధమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా, రాజన్నపేటలో ఎండిన పంట పొలాలు, కాల్వలను శుక్రవారం పరిశీలించారు. ఆగయ్య మాట్లాడుతూ గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోర్ బావుల్లో నీరు లేక అరిగోస పడుతున్నారన్నారు. ఎండుతున్న పొలాన్ని చూడలేక పశువులకు మేతగా వదులుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మిడ్మానేరు నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అందె సుభాష్, కొండ రమేశ్గౌడ్, నమిలికొండ శ్రీనివాస్, గుగులోతు పెంటయ్య, అజ్మీరా రాజునాయక్, అజ్మీరా తిరుపతినాయక్, భూక్య ప్రభునాయక్, ధరావత్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాలుతున్నాయ్..
● ఫైరింజిన్లు చేరేలోపే ఆస్తి బుగ్గి ● జిల్లాలో రెండే ఫైర్స్టేషన్లు ● మూడో స్టేషన్ కోసం డిమాండ్ మానవ తప్పిదాలతో ప్రమాదాలు సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు చాలా తక్కువ. మానవ తప్పిదాలతో జరుగుతున్న ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. ఇందులో సిగరెట్స్ తాగి అజాగ్రత్తగా పడేయడంతోనే అడవులు, ఇళ్లకు నిప్పు అంటుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి చిన్నపొరపాట్లు ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది. – సీహెచ్ నరేందర్, ఎస్ఎఫ్వో, సిరిసిల్లజాగ్రత్తలు పాటించాలి వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పూజ నుంచి వంటగదిలోని ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి నిర్మాణ సమయంలో కాలనీల్లోకి అగ్నిమాపక వాహనాలు వచ్చేలా రోడ్లు ఉండేలా చూసుకోవాలి. సిగరెట్లు తాగి రోడ్డుపైన, గడ్డివాములు ఉన్న ప్రాంతంలో నిర్లక్ష్యంగా పారేయొద్దు. వీటి ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – అనిల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, వేములవాడసిరిసిల్లక్రైం: జిల్లాలో చిన్నపాటి అగ్నిప్రమాదాలకే ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి.ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 13 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు కలిపి రెండు ఫైర్స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలోని శివారు మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనాలు అక్కడికి వెళ్లేలోపే ఆస్తులు కాలిపోతున్నాయి. ఈనేపథ్యంలో మూడో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. 90 ప్రమాదాలు..రూ.4కోట్ల నష్టం ఏడాదికాలంలో సిరిసిల్ల స్టేషన్ పరిధిలో 51 అగ్ని ప్రమాదాల్లో రూ.3.50 కోట్ల ధన నష్టం జరిగింది. రూ.3 కోట్ల వరకు ఆస్తిని కాపాడారు. వేములవాడ పరిధిలో 39 ప్రమాదాల్లో రూ.27.26లక్షల ఆస్తి నష్టం జరిగింది. రూ.1.62 కోట్ల ఆస్తిని కాపాడారు. మూడో స్టేషన్ కోసం డిమాండ్ జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రెండు ఫైర్స్టేషన్లు ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలోని ఏ మండలంలో అగ్ని ప్రమాదం జరిగినా వేములవాడలోని ఫైర్స్టేషన్కు సమాచారం వస్తుంటుంది. ఇక్కడి నుంచి వాహనం చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చివరి గ్రామాలకు చేరుకునేలోపు ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. ఇదే పరిస్థితి సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, గంభీ రావుపేట, వీర్నపల్లి మండలాల్లోనూ ఉంది. ఈక్రమంలోనే జిల్లాలో మూడో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ జిల్లా ప్రజల నుంచి ఉంది. ఏళ్లుగా ఈ డిమాండ్ నెరవేరడం లేదు. ఇప్పటికైనా ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అత్యవసర నంబర్లు తక్షణ సహాయం : 101 సిరిసిల్ల ఫైర్స్టేషన్ : 87126 99259 వేములవాడ ఫైర్స్టేషన్ : 87126 99260ఇది జిల్లా కేంద్రంలోని అంబికానగర్లో గత వారం జరిగిన అగ్నిప్రమాదం. ఇళ్ల మధ్యలో ఉన్న ముళ్లపొదల్లో ఒక్కసారిగా మంటలు లేచాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రం కావడంతో నిమిషాల్లో ఫైర్ సిబ్బంది చేరుకోగలిగారు. అదే జిల్లా శివారు మండలాలు గంభీరావుపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే ఆస్తులు కాలిపోతున్నాయి. -
నాగరికతకు మూలం శాసీ్త్రయజ్ఞానమే
● జేవీవీ బాధ్యుడు రామరాజు సిరిసిల్లకల్చరల్: మానవ నాగరికతకు మూ లం శాసీ్త్రయ జ్ఞానమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్, వర్క్షాప్కు జనవిజ్ఞాన వేదిక బాధ్యుడు సి.రామరాజు, సంపత్కుమార్, పాఠశాల హెచ్ఎం చకినాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ శాసీ్త్రయ దృక్పథం పెంచుకోవడం ద్వారా నూతన ఆలోచన ధోరణితోపాటు ప్రశ్నించే స్వభావం అలవడుతుందన్నారు. అగస్త్య ఇంటర్నేషనల్ సహకారంతో రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు తూముల తిరుపతి, రాజ గోపాల్రెడ్డి, బైరి రవీందర్, వడాల రవీందర్, రమాదేవి, శకుంతల, డేవిడ్సన్, రాజేశం, దేవేందర్, ఉపేందర్, అనిల్, రాజు పాల్గొన్నారు. దేశనేతలను గౌరవించుకోవాలి సిరిసిల్లటౌన్: దేశ నాయకులను పౌర సమాజం గౌరవించుకోవాలని మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు కోరారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, భగత్సింగ్ల చిత్రపటాలను తీసివేయడాన్ని ఖండించారు. వెంటనే వారి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సంజీవయ్య యువజన సంఘం అధ్యక్షుడు కొంపల్లి విజయకుమార్, నాయకులు పండుగ రవి, శేఖర్, బాబు, బాలు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి ● సీడీపీవో ఉమారాణి ఇల్లంతకుంట(మానకొండూర్): అంగన్వాడీ టీచర్లు సమాచానికి విధులకు హాజరుకావాలని సీడీపీవో ఉమారాణి సూచించారు. ఇల్లంతకుంట, కందికట్కూర్ సెక్టార్ల్ల పరిధిలోని అంగన్వాడీ టీచర్ల సమావేశాన్ని శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు చేయాల్సిన పనులు సకాలంలో ఆన్లైన్లో పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారిత జెండర్ స్పెషలిస్ట్ దేవిక మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, విద్యార్థులకు గుడ్టచ్, బ్యాడ్టచ్ల గురించి వివరించారు. బీసీ రాజు, సూపర్వైజర్లు సూర్యకళ, చంద్రకళ, అంగన్వాడీలు అరుణ, విజయలక్ష్మి, బాబాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈనెల 5 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షల సిబ్బంది శిక్షణ పూర్తయిందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ఫస్టియర్లో 5,065, సెకండియర్లో 4,245 మంది విద్యార్తుల కోసం 16 సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎల్ఆర్ఎల్ 25 శాతం రాయితీ జిల్లాలో ఎల్ఆర్ఎస్కు 42,942 దరఖాస్తులు వచ్చాయని, అందులో 27,170 ప్రాసెస్ కాగా, 15,772 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వివరించారు. గడువులోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే.. 25 శాతం రుసుంలో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు రాజేశ్వర్, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసర పరిస్థితిలో రక్తదానం
సిరిసిల్లటౌన్: అత్యవసర పరిస్థితుల్లో వాత్సల్య ఫౌండేషన్ యువకులు రక్తదానం చేశారు. స్థానిక లీలశిరీష హాస్పిటల్లో వేములవాడ సమీపంలోని నూకలమర్రికి చెందిన గర్భిణీ సుంకపాక అనిత ‘బీ పాజిటివ్’ బ్లడ్ అవసరం ఏర్పడింది. అనిత కుటుంబ సభ్యులు వాత్సల్య ఫౌండేషన్ను సంప్రదించగా మాట్ల బాలరాజ్ జిల్లెల్ల నుంచి వచ్చి రక్తదానం చేశారు. వాత్సల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆకా రపు సుధాకర్, లింగంపల్లి కిరణ్కుమార్, మధు, ప్రేమ్, బ్లడ్బ్యాంక్ ఇన్చార్జి రవీందర్ పాల్గొన్నారు. ఘనంగా బద్దిపోచమ్మ బోనాలు రుద్రంగి(వేములవాడ): మానాలలో శుక్రవారం బద్దిపోచమ్మ బోనాలు కనులపండువగా నిర్వహించారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. -
అడవికి ఆపద
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆకురాలే కాలంలో అడవులకు ఆపద పొంచి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే పచ్చని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఫైర్లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కూలీలను నియమించుకొని పనులు చేపట్టేవారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఫైర్లైన్ల పనులు మొదలుకాలేవు. ఇప్పటికే జిల్లాలోని అటవీ లో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ఫైర్లైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పనులు ముందుకుసాగలేవు. నిధుల లేమితో ఈ వేసవిలో ఫైర్లైన్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అడవికి గడ్డుకాలమే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 27 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం జిల్లాలోని 27 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికంగా అడవి విస్తరించి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో వన్యప్రాణులు ఆవాసాలుగా చేసుకుని జీవనం సాగిస్తుంటాయి. ముఖ్యంగా దుప్పులు, చిరుతపులులు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, మనుబోతులు, ముళ్లపందులతోపాటు నెమళ్లు వంటి అరుదైన జీవజాతులు సంచరిస్తుంటాయి. ఈక్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే రోడ్ల వెంట ప్రయాణించే ఆకతాయిలతోపాటు అడవిలో పశువులు, గొర్రెలకాపరులు చుట్ట తాగుతున్న క్రమంలో దాని నుంచి నిప్పు రవ్వలు పడి అడవులు దహించుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆకతాయిలైతే ఏకంగా అటవీకి నిప్పు పెట్టగా, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి విలువైన వృక్ష సంపదకు ఆపరా నష్టం కలుగుతోంది. ఈక్రమంలో అడవిలో ఊహించని నష్టం జరుగకుండా అధికారులు ముందుగానే ఫైర్లైన్లను ఏర్పాటు చేస్తే మంటలను విస్తరించకుండా కట్టడి చేసే అవకాశాలున్నాయి. లక్ష్యం ఇదే.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రేంజ్ల పరిధిలో 12 సెక్షన్లు, 44 బీట్లలో కలిపి 27 హెక్టార్ల అటవీ ఉంది. జిల్లా అడవి జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని అడవులతో కలసి ఉంటాయి. ఇవన్నీ ప్రధానంగా ఆకురాల్చే అడవులు కావడంతో వేసవిలో మంటలు చెలరేగకుండా ఏటా వేసవిలో ఫైర్లైన్లను ఏర్పాటు చేస్తుంటారు. డబ్బా ఆకారంలో 100 మీటర్ల చొప్పున ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మంటలు అంటుకున్న అక్కడికే పరిమితమై అడవికి వ్యాప్తి చెందకుండా ఫైర్లైన్లు నిరోధిస్తాయి. ఈచిత్రంలో వీర్నపల్లి మండలం కంచర్ల శివారులో అడవికి మంటలు వ్యాపించి విలువైన చెట్లు కాలిపోతున్నాయి. ముందస్తుగా అధికారులు ఫైర్లైన్లను ఏర్పాటు చేయకపోవడంతోనే ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో అడవిలో ఏర్పాటు చేసే ఫైర్లైన్లతో రక్షణ ఉండేది. వేసవి ప్రారంభమైనప్పటికీ నిధుల లేమితో ఈసారి అధికారులు ఫైర్లైన్లను ఏర్పాటు చేయలేకపోయారు. నిధులు ఉంటే కూలీలను నియమించుకొని ఫైర్లైన్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించి చేతులు దులుపుకుంటున్నారు. నిధులు కేటాయించలేదు జిల్లాలో రెండు రేంజ్ల పరిధిలో 27 హెక్టార్లకు పైగా అడవి విస్తరించి ఉంది. అడవులకు నష్టం జరగకుండా ఫైర్లైన్లను ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో పనులు మొదలుపెట్టలేదు. ఇప్పటి వరకు నిధులు రాని కారణంగా గ్రామీణులకు అడవుల రక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. మంటలు వ్యాపిస్తే తమకు సమాచారం అందించాలి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తాం. – శ్రీహరి ప్రసాద్, ఎఫ్ఆర్వో, సిరిసిల్ల -
‘ఇన్స్పైర్’ చేస్తున్నారు
సైన్స్.. జీవితంలో ఒకభాగం.. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి వేసే ప్రతీ అడుగులో.. చేసే ప్రతి పనిలో సైన్స్ దాగి ఉంటుంది. సైన్స్ అంటేనే అద్భుతం.. సంచలనాత్మక ఆవిష్కరణలకు నిలయం. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో స్కూళ్లలో చదివే పిల్లల నుంచి శాస్త్రవేత్తల వరకు నిత్యం ఏదో ఒక అంశంలో ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బాల మేథావులు పుట్టుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్ఫేర్, ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్.. రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నేడు సైన్స్డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలమేథావుల ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. -
వైభవంగా శివకల్యాణం
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మామిడిపల్లి మహాదేవ ఆలయం, మల్కపేట శివాలయాల్లో గురువారం శివకల్యాణం కనులపండువగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపై ఆశీనులు చేసి అర్చకులు వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. వేదపండితులు తిరునహరి కృష్ణస్వామి, కోచకంటి హరిశర్మ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు కమనీయంగా కొనసాగాయి. ఈ వేడుకలకు డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పన్నాల విజయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. -
కాంగ్రెస్ వైపే పట్టభద్రులు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి/వేములవాడఅర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, వేములవాడఅర్బన్ మండలాల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ 14 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ చందుర్తి మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, వేములవాడ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు బొజ్జ మల్లేశం, నాగం కుమార్, పుల్కం రాజు, కనికరపు రాకేశ్, పిల్లి కనకయ్య, సాగరం వెంకటస్వామి, అజయ్ పాల్గొన్నారు. ముమ్మర పారిశుధ్య పనులు వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో గురువారం మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో పారిశుధ్య సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మహాశివరాత్రి ఉత్సవాలు మొదలైన 25వ తేదీ నుంచే మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు కేటాయించారు. ఉత్సవాల సమయంలో పట్టణంలో పరిశుభ్రతను కాపాడిన సిబ్బంది.. అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు తరలిరావడంతో పట్టణంలో చాలా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గుడి చెరువు ప్రాంతం, జాతరగ్రౌండ్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. బద్దిపోచమ్మగుడి, భీమన్నగుడి, మెయిన్రోడ్డు తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఎత్తి ట్రాక్టర్ల ద్వారా డంప్యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది పనితీరుని మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ గురువారం పరిశీలించారు. రాజన్న సేవలో డీఈవోవేములవాడ: జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్రావు గురువారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. స్వామి వారి దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో బ్రాహ్మణులు ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందజేశారు. డీఈవో వెంట మధు మహేశ్, మందిరం రఘు, పోగుల ధనుంజయ్ పాల్గొన్నారు. కుక్కల హల్చల్● 22 మందిపై దాడి వేములవాడ: వేములవాడ పట్టణంలోని సాయినగర్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దారిన వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలకు వెళ్తున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులపై దాడులు చేశాయి. బుధవారం ఒకే రోజు 22 మందిని కరిచినట్లు కాలనీవాసి హన్మండ్లు తెలిపారు. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. కుక్కల బారి నుంచి రక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
షూతో విత్తన సీడింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/గంగాధర(చొప్పదండి): పొలంలో విత్తనాలు విత్తడం అంటే అన్నదాతలకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విత్తడం ఆర్థికభారంతో కూడుకుంది. దీంతో రైతులకు ఇరువిధాలుగా ఇబ్బందులు ఎదురవుతోందని గ్రహించి, తన మేథస్సుతో సీడ్ విత్తే షూ తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జెడ్పీస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం.రితిక సైన్స్ ఉపాధ్యాయుడు జగదీశ్వర్రెడ్డి సహకారంతో రైతుల కోసం సీడ్ విత్తే షూ తయారు చేసింది. 2023–24 సంవత్సరానికి గానూ మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్లో ప్రదర్శించి, జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్కు ఎంపికై ంది. ‘విత్తన షూ వేసుకుని అడుగు పెట్టినపుడు ఒత్తిడి మెషిన్ లివర్పై పడుతుంది. లివర్ షూ విత్తనాల చాంబర్ నుంచి విత్తన విడుదలకు స్థలాన్ని ఇస్తుంది. ఇది నాజిల్తో జత చేయబడుతుంది. నాజిల్ మట్టిలోకి డ్రిల్ చేస్తుంది. స్ప్రింగ్ల శక్తితో విత్తనాన్ని వదులుతుంది. మరో అటాచ్మెంట్ రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంధ్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. మొక్కజొన్న, సోయాబిన్, ఆవాలు, పప్పులు, వేరుశనగ పంటలు విత్తడానికి ఇది అనుకూలం. చిన్న, సన్నకారు రైతులకు ఇది సహాయకారిగా ఉంటుంది’ అని రితిక వివరించింది. ●– వివరాలు 8లోu -
మళ్లొస్తాం రాజన్నా..
వేములవాడ: మహాశివరాత్రి జాతర ముగిసింది. ముల్లెమూటలు.. పిల్లపాపలతో భక్తులు ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మూడు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. కోడెమొక్కులు, తలనీలాల సమర్పణ, నిలువెత్తు బెల్లం పంపిణీ, గండదీపంలో నూనెమొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు జాగరణ ముగియడంతో గురువారం బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. కల్లుసాక పోసి... పట్నాల మొక్కులు చెల్లించుకున్నారు. గుడి చెరువు ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన శివార్చన వద్ద దాదాపు 40వేల మంది భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ జాగరణ పూర్తి చేశారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఈవో కొప్పుల వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మహాజాతర సందర్భంగా బుధ, గురువారాల్లో దాదాపు 4 లక్షలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. ఫ్రీ పాస్లు రద్దు చేశారు. రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అకౌంట్స్ అధికారులు తెలిపారు. మహాజాతర ఉత్సవాలకు హాజరైన లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూ ప్రసాదాలు, పులిహోర తయారుచేసిన సిబ్బందికి ఆలయ ఈవో వినోద్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందిని కలిసి సేవలను కొనియాడారు. ఏఈవో శ్రవణ్, ప్రొటోకాల్ ఏఈవో అశోక్కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్చారి, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశమోహనశర్మ, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి తదితరులు ఉన్నారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు మూడు రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రి జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బందికి ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవో, ఏఈవో అశోక్లను శాలువాతో సత్కరించారు. ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ బద్దిపోచమ్మకు బోనం మొక్కులు రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం -
ఎండలోనూ బారులుతీరారు
సిరిసిల్ల: ఎండలు మండుతుండడంతో పట్టభద్రులు ఎండలో నిల్చొని ఓట్లు వేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రా రంభమైంది. మధ్యాహ్నం తరువాత ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్ కేంద్రాల్లో నిరీక్షించాల్సి వచ్చింది. కోనరావుపేటలోని పోలింగ్ కేంద్రంలో ఎండలోనే ఓటర్లు నిరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా చాలా కేంద్రాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కేంద్రానికి వచ్చిన వారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సొంత మండలం బోయినపల్లిలో ఓటుహక్కు వినియోగించుకోగా.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేటలో, ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్రెడ్డి ఓట్లు వేశారు. పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ఎస్పీ అఖిల్మహాజన్లు పరిశీలించారు. సిరిసిల్ల పట్టణం కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్, గీతానగర్ జెడ్పీ హైస్కూల్, కోనరావుపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏజెంట్లు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థులకు ఏజెంట్లు ఎవరూ లేరు. -
ఓటెత్తిన చైతన్యం
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం ● 2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్ ● 11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు ● మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం ● విజయావకాశాలపై మొదలైన ఆన్లైన్ సర్వేలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యా య ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్లైన్ సర్వేలు జోరందుకున్నాయి. ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్.. వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు. ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్లైన్లో ఎగ్జిట్పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్మీడియా లేదా ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు. గ్రాడ్యుయేట్ స్థానంలో పోలింగ్ ఇలా.. ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం 2019 1,95,581 59.03శాతం 2025 3,55,159 70.42శాతంటీచర్ స్థానంలో ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం 2019 23,160 83.54 శాతం 2025 27,088 91.90 శాతంపట్టుభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు జిల్లా మొత్తం పోలైన శాతం ఓట్లు ఓట్లు జగిత్యాల 35,281 24,862 70.47 పెద్దపల్లి 31,037 21,259 68.50 కరీంనగర్ 71,545 46,247 64.64 రాజన్న సిరిసిల్ల 22,397 15,394 68.73ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు జిల్లా మొత్తం పోలైన శాతం ఓట్లు ఓట్లు జగిత్యాల 1,769 1,635 92.43 పెద్దపల్లి 1,111 1,049 94.42 కరీంనగర్ 4,305 3,871 89.92 రాజన్న సిరిసిల్ల 950 899 94.63 -
గమ్మత్తు.. చిత్తు
● గిరిజన గ్రామాల్లో బాధితులు ● నమోదవుతున్న కేసులు ● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులువీర్నపల్లి(సిరిసిల్ల): గిరిజన గ్రామాల్లోనూ గంజా యి బాధితులు ఉన్నారు. సాధారణంగా అటవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గంజాయి సాగు చేసి మైదాన ప్రాంతంలో వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు రివర్స్ అయ్యాయి. కొన్నేళ్లుగా పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పల్లెల్లో గంజాయి సాగు నిలిచింది. అయితే గిరిజన గ్రామాల్లోని యువత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయికి బానిసలుగా మారారు. మత్తు కోసం రవాణా చేస్తూ పట్టుబడి జైలుపాలవుతున్నారు. ఈ సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామశివారులే అడ్డాలు వీర్నపల్లి మండలంలోని శివారు ప్రాంతాలే గంజాయి అడ్డాలుగా మారాయి. చీకటి పడితే శివారు ప్రాంతాలకు చేరుకొని మత్తులో చిత్తవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేసినా వీరి ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది. స్నేహితులకు అలవాటు చేస్తూ ● లాల్సింగ్తండాకు చెందిన యువకుడు హైదరాబాద్లో పనిచేస్తూ గంజాయికి అలవాటుపడ్డాడు. గ్రామానికి వచ్చినప్పుడు తన స్నేహితులకు సైతం ఆ మత్తును అలవాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఈనెల 16న ఆ ముగ్గురిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ● లాల్సింగ్తండావాగు శివారు, గర్జనపల్లి లోని పల్లెప్రకృతివనాలే గంజాయి స్థావరాలు. ● మండలంలోని కంచర్ల శివారులో 2023, అక్టోబర్లో వాహన తనిఖీలు చేస్తుండగా బైక్పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద 500 గ్రాముల గంజాయి లభించింది. పట్టుపడితే కటకటాలే.. నిషేధిత మత్తుపదార్థాలు గంజాయితో పట్టుపడితే కచ్చితంగా కటకటాలకు వెళ్లాల్సిందేనని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలువురు యువకులు పట్టుబడి చేయాలి జైలు జీవితం గడుపుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయాలను గమనించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే గంజాయికి అలవాటు పడి ఉంటే జిల్లా కేంద్రంలోని డీ–ఆడిక్షన్ సెంటర్కు పంపించాలని తెలుపుతున్నారు.యువతపై నిఘా మండలంలోని అనుమానితులపై నిఘా పెట్టాం. కొందరు యువత చదువుకొని ఉద్యోగ వేటలో ఉంటే.. మరికొందరు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే బాధ్యతలు మర్చిపోతున్నారు. గ్రామాల్లో ఆకతాయిలు అల్లర్లు చేస్తే డయల్ 100కు ఫోన్ చేసి తెలపాలి. – ఎల్లయ్యగౌడ్, ఎస్సై, వీర్నపల్లి -
సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
ఓదెల(పెద్దపల్లి): హఠాత్తుగా గుండెపోటుకు గురైన భక్తుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఎస్సై రమేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన భక్తుడు ఒరుసు శ్రీనివాస్ మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దర్శనం కోసం తరలివచ్చాడు. స్వామివారి దర్శనం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పొత్కపల్లి ఎస్సై దికొండ రమేశ్ వెంటనే సీపీఆర్ చేశారు. దీతో భక్తుడు స్పృహలోకి రావడంతో ఓ వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పండుగపూట తమ కుమారుడు ఆపదకు గురైతే.. ఎస్సై దేవుడిలా ప్రాణాలు కాపాడారని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైని పలువురు భక్తులు, స్థానికులు అభినందించారు. -
పోలింగ్కు వేళాయె
● పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు ● గ్రాడ్యుయేట్స్ 499, టీచర్స్ 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ● పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ● అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లాలో 103 పోలింగ్ కేంద్రాలు ● 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు అనుమతి – వచ్చే నెల 3న కౌంటింగ్సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజవర్గాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 15 జిల్లాలు 42 నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది, పోలీసులు వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరారు. నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి హోరాహోరీ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు బుధవారం పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లా 103 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు. కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఇతర సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతీ పోలింగ్ స్టేషన్కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్, మరో ఉద్యోగితోపాటు భద్రతకు పోలీసులను కేటాయించారు. వీరంతా గురువారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతీ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్తోపాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటున్నందున కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని పోలీసులు సూచించారు. పోలింగ్ అనంతరం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలిస్తారు. మొత్తం 15 జిల్లాల్లోని 271 మండలాల నుంచి బ్యాలెట్ బాక్సులు శుక్రవారం ఉదయంలోపు ఇక్కడికి చేరనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56 మంది.. 3,55,159 ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణతో కలిపి మొత్తం 56మంది పోటీ పడుతున్నారు. 3,55,159 మంది ఓటర్లు 499 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా 1,60,260 మంది పట్టభద్రులు, 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటేయనున్నారు. టీచర్స్ బరిలో 15 మంది.. 27,088 ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.అశోక్కుమార్, ఎస్టీయూ, సీపీఎస్ల నుంచి కూర రఘోత్తంరెడ్డిలతో కలిపి 15 మంది ఉన్నారు. 274 పోలింగ్ కేంద్రాల్లో 27,088 మంది ఓటు వేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్లో 8,135 మంది 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
ప్రలోభాలకు గురికావద్దు
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. పర్యవేక్షించిన కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 181 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది జిల్లాలో ఐదు రూట్లు, ఐదు జోన్లను ఏర్పాటు చేశారు. జంబో పోలింగ్ బాక్స్లను పోలింగ్కేంద్రాలకు తరలించారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాభాయి ఆధ్వర్యంలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జంబో పోలింగ్ బాక్స్లు, టీచర్ల ఎన్నిక కోసం రెగ్యులర్ పోలింగ్ బాక్స్లు వినియోగిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పదండి.. ఓటేద్దాం
● సరైన నాయకుడిని ఎన్నుకుందాం ● సిద్ధమంటున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు ● నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంసప్తగిరికాలనీ(కరీంనగర్): సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా యువతకే ఉంటుంది. యువతను సన్మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది. యువత, ఉపాధ్యాయులు కలిసి ఓటుహక్కు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే.. ఒక నికార్సయిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తే గొంతును కూర్చోబెట్టే సమయం వచ్చింది. ఈ నెల 27న(నేడు) కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి 3.5లక్షలకు పైగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సుమారు 27వేల మందికి పైగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు.. నేడు జరిగే ఓటింగ్లో పాల్గొని.. ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు సమాయత్తం కావాలి. ఈ క్రమంలో పదండి ఓటేద్దాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటుదాం అంటున్నారు.. పలువురు పట్టభద్రులు.. ప్రయివేటు ఉపాధ్యాయులు.!! -
ప్రయాగ్రాజ్ వెళ్లివస్తూ.. అనంత లోకాలకు
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నల్లగోని వీరయ్యగౌడ్ ప్రయాగ్రాజ్ వెళ్లివస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్ల గోని వీరయ్యగౌడ్ ఐదు రోజుల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ కుంభమేళా పుణ్యస్నానాలకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న క్రమంలో వీరయ్య గౌడ్కు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వీరయ్య గౌడ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ బుధవారం పరామర్శించారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వీరయ్య గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. గుండెపోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి -
రాజన్న గుడిని అభివృద్ధి చేశామనడం హాస్యాస్పదం
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాజ న్న గుడికి చేసిందేమి లేదని, పైపెచ్చు తమ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం హాస్యాస్పదమని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను బుధవారం దర్శించుకున్న కవిత మాట్లాడిన తీరుపై ఆయన ఇలా స్పందించారు. కేసీఆర్ తన లగ్గం ఇక్కడే అయ్యిందని ప్రగల్భాలు పలికి, రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని రాజన్న భక్తులను మోసం చేశారన్నారు. ఒక్క బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించలేదన్నా రు. మేం ఎక్కడ కూడా బడ్జెట్లో నిధులు కేట యిస్తామని చెప్పకుండా బడ్జెట్లో రూ. 50కోట్లు కేటాయించామన్నారు. కవిత ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదివి వెళ్లారన్నారు. మహాశివరాత్రి వచ్చిందంటే రంగు రంగు బ్రోచర్లతో రాజన్న భక్తులను మోసం చేశారే తప్ప చేసిందేమీ లేదన్నారు. తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి నిర్మాణనికి భూసేకరణ చేయలేదన్నారు. రాజన్న భక్తుడిగా తాము ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాన ని, ప్రజా ప్రభుత్వంలో రేవంత్రెడ్డి చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధి రూ.75కోట్లు కేటా యించామన్నారు. రూ.47 కోట్లతో వేములవా డలో రోడ్లు విస్తరణ చేపడుతున్నామన్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ● ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్లక్రైం: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్మహాజన్ బుధవారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికా రులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 41 పోలింగ్ కేంద్రాల్లో 23,347 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మనదే
● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కరీంనగర్ కార్పొరేషన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ల్లోని పార్టీ మండల అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి మండల అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. రోజంతా అభ్యర్థుల ఫోన్ కాల్స్ ● వాట్సాప్ గ్రూపుల్లో మేస్సేజ్లు కోరుట్ల: ఎమ్మెల్సీ అభ్యర్థులు బుధవారం రోజంతా తమకే ఓటు వేయాలంటూ ఓటర్లకు ఫోన్ చేశారు. ఒక అభ్యర్థి కాల్ ముగియగానే మరొకరు ఫోన్ చేయడంతో వారు విసిగిపోయారు. ఒకరిద్దరు అభ్యర్థులైతే తాము గెలిస్తే ఏం చేస్తామో ఏకంగా 5 నిమిషాలపాటు చెప్పడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశారు. వాట్సాప్ గ్రూపుల్లో లెక్కలేనన్ని మెస్సేజ్లు వచ్చాయి. జాతీయ పోటీలకు రణధీర్కరీంనగర్స్పోర్ట్స్: బిహార్ రాష్ట్రంలోని పాట్నలో మార్చి 10నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 20వ జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్లోని ప్రభుత్వ సవరన్ పాఠశాలకు చెందిన విద్యార్థి రణధీర్చరణ్ ఎంపికయ్యాడు. ఈ నెల 18,19వ తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఐదు కిలో మీటర్ల రేస్వాక్లో డి.రణధీర్ చరణ్ బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా నుంచి రణధీర్ ఒక్కడే జాతీయ పోటీల్లో పాల్గొనడం విశేషం. -
హరహర మహాదేవ
● వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ● రాజన్నను దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు ● మారుమోగిన శివనామస్మరణ ● 48 గంటలు నిరంతరం దర్శనాలు ● అలరించిన శివార్చన వేములవాడ: ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవ.. నామస్మరణలతో వేములవాడ మారుమోగింది. ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణ కాశీ వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాడు రాజరాజేశ్వరస్వామిని దాదాపు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణం గంధవర్ణశోభితమైంది. మహాలింగార్చ న వైభవోపేతంగా సాగింది. నిరంతరం లఘు దర్శనాలు కొనసాగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఈవో వినోద్రెడ్డి తెలిపారు. క్యూలైన్లలో సొమ్మసిల్లి పడిపోయిన భక్తులను ఆలయ ఆవరణలోని ప్రథమ చికిత్స కేంద్రాలకు తరలించారు. లింగోద్భవ సమయంలో శ్రీస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ వసతి గదులు విధులకు హాజరైన ఉద్యోగులకు కేటాయించడంతో భక్తులు చలవపందిళ్ల కిందే సేదతీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్లు రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో వినోద్రెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దారు మహేశ్ పరిశీలించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎస్బీఐ బ్యాంకు 15 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు స్థానిక బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సంపత్ తెలిపారు. వైభవంగా సామూహిక మహాలింగార్చన సామూహిక మహాలింగార్చన వైభవంగా జరిగింది. కల్యాణ మండపంలో అర్చక బృందం మహాలింగార్చన రెండు గంటలపాటు సాగింది. మట్టితో చేసిన 366 మృత్తికలు, పిండితో చేసిన 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి, అభిషేకం చేశారు. అలరించిన ప్రత్యేక కార్యక్రమాలు ● సాయంత్రం 4 గంటలకు శివస్వాముల రాజన్నను దర్శించుకున్నారు. ● సాయంత్రం 6 గంటలకు అనువంశిక అర్చకులు మహాలింగార్చన నిర్వహించారు. ● సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరాయంగా శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. -
పరీక్షల్లో మళ్లీ ఫెయిలవుతానేమోనని..
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం–లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య శివరాత్రి రోజు చిన్నమెట్పల్లిలో విషాదం -
నిస్వార్థపరులకే
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే నిస్వార్థపరులను ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలి. స్వార్థం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వారిని గెలిపించండి. గెలిచిన అభ్యర్థులు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే నాయకులను ఎన్నుకోండి. – ఆమని మాట తప్పనివారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని అమలు చేసే విషయంలో మాట తప్పని వారికి ఓటు వేయాలి. ఓట్ల కోసం అమలు చేయలేని హామీలను గుప్పిస్తున్న వారికి ఓటువేసే ముందు నేటి యువత ఆలోచించాలి. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని ఎన్నుకోవాలి. – టి.కార్తీక్ -
నోటుకు ఆశపడొద్దు
పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేవారికే ఓటేయండి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తారో వారిని ఎన్నుకోండి. ఓటును నోటుతో కొనాలన్నది నేటి రాజకీయం. ఓటు వజ్రాయుధం, నోటుకు ఆశపడకుండా ఓటేయాలి. – పి.మాధురి ఓటుతో బుద్ధి చెప్పాలి నిస్వార్థంతో పనిచేసే వ్యక్తికే ఓటేయ్యాలి. తన కుటుంబం, బంధుప్రీతి అనే భావన ఉండకూడదు. పట్టభద్రులంతా తన కుటుంబంగానే భావించాలి. పదవులు పొందే అవకాశం వచ్చిందని, పట్టభద్రుల బాగోగులు పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా స్వార్థంతో పనిచేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. – బత్తిని వేణు -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు తల్లీకూతుళ్ల ఎంపిక
కరీంనగర్స్పోర్ట్స్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళళ్లు ప్రతిభ కనబరిచారు. తల్లి మేరీ స్టెల్లా 50 ఏళ్ల పైన వయసు విభాగంలో జావెలీన్ త్రో, షాట్పుట్ పోటీల్లో బంగారు, 100 మీటర్ల రన్నింగ్లో రజత పతకం సాధించింది. కూతురు షీలా స్మృతి 30 ఏళ్ల పైన వయసు విభాగంలో 100 మీటర్ల రన్నింగ్లో రజత, 200 మీటర్ల రన్నింగ్లో కాంస్య పతకాలు గెలిచింది. తల్లీకూతురు ఏప్రిల్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని సంఘం రాష్ట్ర కార్యదర్శి రామారావు, రుబేన్ మార్క్, సుధీర్, దేవదానం, డేనియల్, సుదర్శన్, జాన్సన్ తదితరులు అభినందించారు. -
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి
● పల్లెల్లో కిష్కిందకాండ ● గూనపెంకలను పీకి పడేస్తున్న కోతులు ● వానరమంద దాడులతో పలువురికి గాయాలు ● మంకీఫుడ్ కోర్టు నిర్వహణపై నిర్లక్ష్యంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గూనపెంకులు పగులుతున్నాయి. జామచెట్లు, కొబ్బరిచెట్లు విరిగిపోతున్నాయి. అడ్డుగా పోతే మీదికొచ్చి దాడులు చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇల్లు గుల్లచేస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో నిత్యం కోతుల దాడులతో పల్లెజనం భీతిల్లుతున్నారు. వానరసైన్యాన్ని కట్టడి చేయడం తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కోతులు సృష్టిస్తున్న కిష్కిందకాండపై స్పెషల్ ఫోకస్.. సూర్యోదయంతోనే దాడి కోతుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. సూర్యోదయంతోనే ఇళ్లపై దాడిచేస్తున్న కోతులను వెల్లగొట్టేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పక్కన పెంచుకున్న కూరగాయల చెట్లను పీకేయడం, జామకాయలు కొరికేయడం, పెంకుటిళ్లపైన గూనపెంకులు తొలగిస్తున్నాయి. పెంకుటిళ్లలో నివసించే వారు రానున్న వర్షాకాలంలో తమ ఇళ్లు ఉంటాయా? వర్షాలకు కూలుతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు తమ పాత ఇళ్లను కూలగొట్టి భవంతులు కట్టుకునేందుకు ముగ్గు పోసుకుంటున్నారు. భయాందోళనలో గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో కోతులు దాడి చేస్తున్నాయనే భయంతో ఓ వృద్ధురాలు పరుగెత్తి ఇంటి ముందు ఉన్న తాగునీటి బావిలో పడే త్రుటిలో ప్రాణాపాయంతో బయటపడింది. మండలంలోని నారాయణపూర్, బండలింగంపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో కోతుల దాడుల్లో పలువురు గాయపడ్డారు. స్వచ్ఛందంగా ముందుకొస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు రాచర్లబొప్పాపూర్ మాజీ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి తన సొంత ఖర్చులు రూ.4లక్షలు వెచ్చించి ఈనెలలోనే కోతులను పట్టే వారిని ఏడాదిపాటు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. గ్రామంలో కోతులు కనిపించకుండా చూసే బాధ్యత వారిదే. వీరు ఏడాదిపాటు గ్రామంలో కోతులు కనిపిస్తే పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేస్తుంటారు. దీంతో రాచర్లబొప్పాపూర్లో ప్రస్తుతం కోతుల బెడద లేదు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో దాతలు డబ్బులు పోగుచేసి కోతులను పట్టించే వారిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కోతుల చేష్టలతో వేగలేక పల్లెజనం కోతులను వెల్లగొట్టేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కోతుల బెడద నివారణకు కొండెంగలను తీసుకొచ్చి గ్రామంలో తింపుతున్నారు. దీంతో పాక్షికంగా వీటి సమస్య పరిష్కారమైనా మళ్లీ మరుసటి రోజే ఇళ్లపై చేరి కిష్కిందకాండ సృష్టిస్తున్నాయి.ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లోని ఇళ్లపై కోతుల మంద. సూర్యోదయానికి ముందే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. హఠాత్తుగా పది నుంచి ఇరువై వరకు కోతుల మంద ఇళ్లపై దాడి చేస్తున్నాయి. గూనపెంకులు పగులగొడుతూ.. ఇళ్లలోకి దూరి నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఇంటిని చిందరవందర చేస్తున్నాయి. కోతులను ఎల్లగొట్టేందుకే ఇంటిలో ఒకరు ఉదయం కనీసం రెండు గంటలు వెచ్చించాల్సి వస్తోంది. ఎండిపోయిన చెట్లు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ పరిధిలోని బాకూర్పల్లి తండాలోని మంకీ ఫుడ్కోర్టు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోతులను ఊళ్లలో నుంచి తరిమేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ సరిగ్గా లేక చెట్లు ఎండిపోయాయి. ఫలితంగా కోతులకు అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్కపోవడంతో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. జిల్లాలోని గతంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్కోర్టుల్లో చెట్లు ఎండిపోయి, కనీసం పచ్చదనం కూడా కరువైంది. తంగళ్లపల్లి మండలంలోని కస్బెకట్కూర్లోని మంకీ ఫుడ్కోర్టు వర్షానికి వచ్చిన వరదలకు కొట్టుకుపోయి ఆనవాళ్లు కూడా లేవు. ఇబ్బంది చూడలేక.. గ్రామంలో కోతులు సృష్టిస్తున్న ఇబ్బందులు అనేకం ఉన్నాయి. గ్రామస్తులు నిత్యం పడుతున్న కష్టాలను చూడలేక నేనే సొంతంగా రూ.4లక్షలు ఖర్చు చేసి కోతులను పట్టేవారిని మాట్లాడిన. ఏడాదిపాటు గ్రామంలో కోతులు పట్టే బాధ్యత వారికి అప్పగించిన. అప్పటి నుంచి మా ఊరిలో కోతుల బెడద తగ్గింది. – కొండాపురం బాల్రెడ్డి, రాచర్లబొప్పాపూర్ మాజీ సర్పంచ్ప్రభుత్వ ఆదేశాలు ఏమి లేవు కోతుల నివారణ చర్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. మండలంలోని చాలా గ్రామాల్లో గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోతులను పట్టే వారిని మాట్లాడుకుంటున్నారు. పల్లెల్లో కోతుల సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కొన్ని గ్రామాల్లో కొండెంగలను కొనుగోలు చేసి కోతులను తరుముతున్నారు. – సత్తయ్య, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట -
తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
గన్నేరువరం: మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన ముత్యం ధర్మయ్యగౌడ్(59) ప్రమాదవశాత్తు తాడిచెట్టు నుంచి పడి మృతి చెందాడు. ఎస్సై తాండ్ర నరేశ్ వివరాల ప్రకారం.. ధర్మయ్యగౌడ్ కొత్త తాటిచెట్లను కల్లు కోసం సిద్ధం చేసేందుకు జంగపల్లి– పీచుపల్లి గ్రామాల మధ్య ఉన్న తాటివనానికి వెళ్లాడు. తాటిచెట్టు సగం వరకు ఎక్కగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..కమాన్పూర్(మంథని): జూలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రాజమల్లు(51) మృతి చెందాడు. రాజమల్లు సైకిల్పై ఇసీ్త్ర చేసిన దుస్తువులను యజమానికి ఇవ్వడానికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన టాటాఏస్ ట్రాలీ ఢీకొంది. ఈప్రమాదంలో రాజమల్లుకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బొడ్డుపల్లి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని విజయలక్ష్మి పారాబాయిల్డ్ రైస్మిల్లు వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి(36) మృతిచెంది ఉన్నాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. రైస్మిల్లు వెనుకభాగంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో పరిశీలించగా హత్య చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తలపై బలంగా బాధడంతోనే మృతిచెందినట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియలేదన్నారు. మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీవేములవాడఅర్బన్: రాజన్న దర్శనానికి కాలినడకన వస్తున్న భక్తురాలి మెడలోంచి పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. వివరాలు వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. సిరిసిల్ల శివారులోని చంద్రపేటకు చెందిన మంజుల రాజన్న దర్శనానికి మంగళవారం రాత్రి కాలినడకన నడుచుకుంటూ వస్తోంది. వేములవాడ–సిరిసిల్ల ప్రధాన రహదారిలోని గుర్రవానిపల్లి, నందికమాన్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని బుడిగజంగాలకాలనీలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ట్రాలీ ఆటోలో వచ్చి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
తొలిసారి వేస్తున్నా
నేను ప్రైవేటు ఉపాధ్యాయుడిని. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఓటేయబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. రోజు చాలా వాయిస్కాల్స్ వచ్చాయి. అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కరించే వారికే నా ఓటు. ప్రతీ ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. – నవక్రాంత్రెడ్డి గోడు విన్న వారికే తొలిసారి ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఓటుహక్కు కల్పించింది. మా గోడు చెప్పుకునే అవకాశం దక్కింది. ఇన్ని సంవత్సరాలు మమ్ముల్ని ఎవరూ పట్టించుకోలేదు. చాలీచాలనీ జీతాలతో నానా తంటాలు పడుతున్న మాకు దారి చూపించే వారికే నా ఓటు. – వి.తిరుపతిరావు అవగాహన ఉన్నవారికి ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వారికి ఓటేయ్యాలి. నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యలు పరిష్కరించేవారిని ఎన్నుకోవాలి. ప్రజలతో మమేకమైనవారికే నా ఓటు. – డి. శ్రీనివాస్ సమస్యలపై స్పందించే వారికే సమస్యలపై స్పందించి, పరిష్కరించే వారికే నా ఓటు. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. ఓటును నోటుతో కొనాలన్నది నేటి రాజకీయం. మన ఓటు వజ్రాయుధం లాంటిది. నోటుకు ఆశపడకుండా ఓటు వేసే విధంగా సిద్ధం కండి. – అనూప్ కుమార్ -
గ్రామాల్లో మళ్లీ స్వచ్ఛబాట
కరీంనగర్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం, పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ.. ఇంటింటికి మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. మూడేళ్ల క్రితం ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్)గ్రామాలుగా ప్రకటించింది. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు నిలిచిపోయింది. గ్రామాల్లో కుటుంబాలతోపాటు గృహ నిర్మాణాల సంఖ్య పెరిగిపోయాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో సమస్య మళ్లీ రావడంతో అధికారులు స్వచ్ఛభారత్ మిషన్లో తిరిగి గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. జిల్లాకు మొదటి విడతలో 100 మంజూరు స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లోని గ్రామాలకు మొదటి విడతగా 100 మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో సగానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మరుగుదొడ్డి నిర్మించినట్లయితే రెండు విడతలో లబ్ధిదారులకు రూ.12వేలు మంజూరు చేస్తారు. ప్రస్తుతం పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో రెండో విడత మరుగుదొడ్లు మంజూరు కాలేదు. కోడ్ ముగిసిన అనంతరం మరుగుదొడ్లు మంజూరవుతాయని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు పేర్కొంటున్నారు. మరుగుదొడ్లు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంజూరు ఇలా కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వాళ్లు వ్యక్తిగత మరుగుదొడ్డి కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను గ్రామసభల్లో చదివిన అనంతరం అర్హులను ఎంపిక చేసి తీర్మాణం చేసి మండల పరిషత్తు కార్యాలయంలో అందిస్తారు. ఎంపీడీవో ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధకు చేరిన అనంతరం ఆన్లైన్ నమోదు చేస్తారు. పరిశీలన అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు జిల్లాకు మొదటి విడతలో 100 యూనిట్లు -
పదండి.. ఓటేద్దాం
● సరైన నాయకుడిని ఎన్నుకుందాం ● సిద్ధమంటున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు ● నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంసప్తగిరికాలనీ(కరీంనగర్): సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా యువతకే ఉంటుంది. యువతను సన్మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది. యువత, ఉపాధ్యాయులు కలిసి ఓటుహక్కు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే.. ఒక నికార్సయిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తే గొంతును కూర్చోబెట్టే సమయం వచ్చింది. ఈ నెల 27న(నేడు) కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి 3.5లక్షలకు పైగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సుమారు 27వేల మందికి పైగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు.. నేడు జరిగే ఓటింగ్లో పాల్గొని.. ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు సమాయత్తం కావాలి. ఈ క్రమంలో పదండి ఓటేద్దాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటుదాం అంటున్నారు.. పలువురు పట్టభద్రులు.. ప్రయివేటు ఉపాధ్యాయులు.!! -
పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంతోపాటు తిమ్మాపూర్కు చెందిన ఐదుగురిపై బుధవారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. తిమ్మాపూర్కు చెందిన ఎడ్ల సత్తయ్య(52), చందుర్తికి చెందిన పవన్సాయి(11), రోషణ్(7), దీక్షిత(5), దాసరి అమృత(65)లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. వీరికి చందుర్తి పీహెచ్సీలో చికిత్స చేసి వేములవాడ ఆస్పత్రికి తరలించారు. సీతారాంపూర్ గ్రామంలో నలుగురికి.. చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సీతారాంపూర్ గ్రామంలో పిచ్చికుక్కదాడిలో నలుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి రోడ్డు వెంట వెళ్తున్న హన్మాండ్ల జయ్పాల్రెడ్డి, నారాయణపురం భాగ్య, ముసాపురి శ్రీనివాస్, బొట్ల శిరీష, బొట్ల చంద్రయ్యలపై పిచ్చికుక్క దాడిచేసింది. నారాయణపురం సమ్మయ్య, చామకూర ప్రకాశ్రెడ్డికి చెందిన పశువులపై దాడి చేసింది. బాధితులు బుధవారం చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. -
నేనొస్తా... వేములవాడ జాతరకు
● తరలివస్తున్న పల్లె భక్తులు ● రాజన్న సన్నిధిలోనే జాగారం ● నేటికీ నాటి సంప్రదాయమే..వేములవాడరూరల్: ఏమి లేని వేములవాడలో రాజన్న ఏమి చూసి నిలిచితివయ్యా రాజన్న అంటూ.. పల్లె భక్తులు నెత్తిన ముల్లె, సంకన పిల్లతో గ్రామీణ ప్రాంతాల నుంచి రాజన్న జాతరకు తరలివస్తున్నారు. పేదల పెన్నిధిగా నిరుపేదలకు అండగా పేరున్న బోళాశంకరుని సన్నిధానంలో శివరాత్రి రోజు జాగారం జరుపుకోవడం పల్లె, పట్టణ భక్తులకు ఆనవాయితీ. ఏటా ఎన్ని కష్టాలైనా భరించి రోడ్లపైన స్థలాల మీదనే జాగారం జరుపుకుని మూ డు రోజులు ఉండి తిరుగు ప్రయాణమవుతారు. నిరుపేదలకు ఆరు బయటనే విడిది రాజన్న సన్నిధికి వచ్చే భక్తులలో అత్యధిక శాతం శివరాత్రి రోజు గ్రామీణ ప్రాంత భక్తులు తరలివస్తారు. వీరికి ఎక్కడా ఆలయ వసతిగదులు దొరకవు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడే విడిది చేసి జాగారాలు చేసుకుంటారు. ఉదయాన్నే స్వామివారికి నైవేద్యం వండుకుని భోజనం చేసి తిరుగు ప్రయాణం అవుతారు. నేటికీ నాటి సాంప్రదాయమే.. కోరుట్ల, నిజామాబాద్, ఆర్మూర్, ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రూరల్ మండలంలోని పోచెట్టిపల్లి వద్ద ఉన్న ధర్మగుండంలో స్నానాలు చేసి రాజన్న సన్నిధానానికి వస్తారు. కొన్నేళ్లుగా ఆ ప్రాంతం నుంచి ఎడ్ల బండ్లపై వచ్చే భక్తులు అక్కడ స్నానాల అనంతరం రాజన్న దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పటికీ కొంత మంది భక్తులు అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. -
ప్రేమిస్తున్నానని బాలికను వేధించిన వ్యక్తికి జైలు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ప్రేమిస్తున్నాని ఓ బాలికను వేధిస్తున్న మియ్యాపూర్ గ్రామానికి చెందిన గోషిక కుమార్(23)కు ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి, సెషన్స్ జడ్జి శ్రీనివాస్రావు మంగళవారం 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2019 నవంబర్ 20న ఓ బాలికలను ప్రేమిస్తున్నా, తననూ ప్రేమించాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాని వేధించాడు. తనను ప్రేమించకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. వాదనలు విన్నంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించారు. మంథనిలో బోర్డు తిప్పేసిన నగల వ్యాపారి?మంథని: పట్టణంలోని ఓ నగల దుకాణదారు బోర్డు తిప్పేసి పరారైనట్లు చర్చ జోరుగా సాగుతోంది. దుకాణానికి తాళం వేసి కుటుంబం మొత్తం నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిందని సమాచారం. వారి మొబైల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దుకాణం తెరవకపపోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తమకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారా? లేదా ఏదేవి అవసరం నిమిత్తం వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది. వివాహాలకు సంబంధించి ఆవభరణాల కోసం చాలా మంది దుకాణాదారుకు బంగారం ఇచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా స్థానికుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. దుకాణాదారు పరారు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణంకోరుట్లరూరల్: మాదాపూర్కు చెందిన ముక్కెరాల చంద్రయ్య (70) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చంద్ర య్య సైకిల్పై వెంకటాపూ ర్ వెళ్లి తిరిగి మాదాపూర్ వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అంజూ ట్రాక్టర్ నడుపుతూ వెంకటాపూర్ వైపు వెళ్తున్నాడు. కాకతీయ కాలువ డీ–40 మూలమలుపు వద్ద చంద్రయ్య ట్రాక్టర్ను ఢీకొట్టి రోడ్డు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు డ్రైవర్ అంజి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. స్థానిక నాయకులు సముదాయించి ధర్నాను విరమింప చేశారు. తండ్రి హత్య కేసులో యావజ్జీవం సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): పూసాల గ్రా మానికి చెందిన తీగల రాజేశం(40) తన తండ్రి తీగల నర్సయ్యను హత్య చేశాడనే నేరం రుజు వు కావడంతో యావజ్జీవ శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా, సెస న్స్ జడ్జి శ్రీనివాస్రావు మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబం పూసాలలో నివాసం ఉంటోంది. రాజేశం 20ఏళ్ల క్రితం హ త్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అ ప్పట్నుంచి తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నా డు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 8న ఉద యం కొనుగోలు సెంటర్లో ధాన్యం అరబెట్టేందుకు పెద్దకొడుకు రాజేశం, చిన్నకోడలును రా వాలని తండ్రి నర్సయ్య పిలిచారు. రాజేశం సైకిల్పై అక్కడకు వెళ్లగా.. తాను పనిచేయనని సైకిల్పై వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో తండ్రి సైకిల్ తాళం చెవి తీసకున్నాడు. ఆగ్రహించిన రాజేశం బలంగా నెట్టి వేయడంతో తండ్రికింద పడిపోయాడు. ఆ వెంటనే బండరాయితో తల పై మోదాడు. దీంతో నర్సయ్య మృతి చెందా డు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేసిన పోలీసులు.. కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. వేటగాళ్లపై అడవిపందుల దాడిచందుర్తి: అడవిపందుల దాడిలో వేటగాళ్లకు తీవ్రగాయాలయిన ఘటన చందుర్తి శివారులోని బోడగుట్ట ప్రాంతంలో మంగళవారం చో టు చేసుకుంది. జోగాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవనం సాగించేవారితో అడవిపందు ల వేటకు వెళ్లారు. అప్పటికే వారికి పంది చిక్కగా, మరో దానికోసం వేటాడుతుండగా దాడిచేసింది. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
స్వగ్రామానికి చేరిన యువకుడు
జగిత్యాలక్రైం: మోసపూరిత విదేశీ నియామక సంస్థ చేతుల్లో మోసపోయిన కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన వలస కార్మికుడు కడకుంట్ల శ్రీకాంత్ పలువురి సహాయంతో మంగళవారం స్వగ్రామం చేరాడు. శ్రీకాంత్ను 40 రోజల క్రితం జగిత్యాలకు చెందిన మ్యాన్పవర్ కన్సల్టెన్సీ ఎలక్ట్రిషీయన్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి దుబాయ్ పంపించింది. అక్కడికి చేరిన అనంతరం లేబర్ ఉద్యోగంలో చేర్పించారు. ఆ పని చేయబోనని శ్రీకాంత్ అనడంతో పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని 7300 దిరమ్స్ (ఇండియా రూ.2లక్షలు) చెల్లించాలని కంపెనీ యాజమాన్యంతోపాటు, కేరళకు చెందిన ఓ ఏజెంట్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్ షేక్ చాంద్పాషాను ఆశ్రయించారు. ఆయన దుబాయ్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. స్పందించిన ఎంబసీ వారు కంపెనీ యాజమాన్యాన్ని మందలించడంతో శ్రీకాంత్ను స్వగ్రామానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఇండియన్ ఎంబసీ దుబాయ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. లేబర్ కోర్టు విచారణ జరపగా శ్రీకాంత్ కోర్టులో నెగ్గాడు. దీంతో కంపెనీ యాజమాన్యం ఫిర్యాదును కొట్టివేసి అతని పాస్పోర్టును శ్రీకాంత్కు అప్పగించడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. -
ఉదయ సాహితీ రాష్ట్ర కార్యవర్గం
డీఈవోగా జనార్దన్ రావుసిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల డీఈవోగా జిల్లాకు వచ్చిన డైట్ లెక్చరర్ జగన్మోహన్రెడ్డి సెలవుపై వెళ్లడంతో జిల్లా విద్యాధికారి మార్పు జరిగినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంజాన్ పండుగ ఏర్పాట్లు చేయాలిసిరిసిల్లకల్చరల్: ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో పండుగ ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి ఎంఏ భారతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మసీద్లు, ఈద్గాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్, నీటి సౌకర్యానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహర్, ఇఫ్తార్ సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దన్నారు. సమావేశంలో ఆర్డీవో రాధాబాయి, డీపీవో శేషాద్రి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ కమిషనర్ అన్వేష్, పౌరసరఫరాల అధికారి పి.వసంతలక్ష్మి, డీఎస్పీ మురళీకృష్ణ, సెస్ అధికారి డి.అరవింద్చారి, తహసీల్దార్ ఉమారాణి, ముస్లిం మత పెద్దలు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతినగర్(రామగుండం): ఉదయ సాహితీ తె లంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీదాస్యం లక్ష్మయ్య ప్రకటించారు. సంస్థ గౌరవ అధ్యక్షుడిగా దాస్యం సేనాధిపతి(కరీంనగర్), అ ధ్యక్షుడిగా శ్రీదాస్యం లక్ష్మయ్య(పెద్దపల్లి), ఉపాధ్యక్షులుగా ఎన్వీ రఘువీర్ ప్రతాప్(నల్గొండ), పోరెడ్డి రంగయ్య(ఆలేరు), పల్లేరు వీరాస్వామి(వరంగల్), ఎర్రం రాజారెడ్డి(కరీంనగర్), శ్రీపెరంబుదూరి లింబగిరి స్వామి(మెట్పల్లి), మహి ళా ఉపాధ్యక్షులుగా చీదేళ్ల సీతాలక్ష్మీ(హైదరాబాద్), రమాదేవి కులకర్ణి(హైదరాబాద్), మద్దెల సరోజన(జగిత్యాల), చిందం సునీత(కరీంనగర్), కటుకం కవిత(కోరుట్ల), ప్రధాన కార్యదర్శిగా వురిమళ్ల సునంద, సహాయ కా ర్యదర్శులుగా ఏడెల్లి రాములు(పెద్దపల్లి), గుడ్ల దొన సాయిచంద్రశేఖర్(హైదరాబాద్), మేరుగు అనురాధ(వరంగల్), రాజన్న(కరీంనగర్), కోశాధికారిగా వెంకటరమణాచార్యులు(హైదరాబాద్)ను నియమించారు. -
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరం
సిరిసిల్లటౌన్: ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలుపలేదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని అంటున్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 27న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన నరేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, వెలుము ల స్వరూప, గోనె ఎల్లప్ప, కోడం అమర్నాథ్, గుండ్లపల్లి గౌతం, నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొర్లపల్లి గ్రామ శివారులోని రాచర్ల జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న పరీక్షలకు ఇప్పటి నుంచే సంసిద్ధులు కావాలన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో రాణించేందుకు మంచి మార్కులు సాధించాలని సూచించారు. గతేడాది కళాశాల నుంచి రాష్ట్ర, జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, చైర్మన్ ఐత వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఏలూరి రాజయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రణాళికతో ఉత్తీర్ణత సాధించాలి కోనరావుపేట: విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. వార్షిక ఫలితాల్లో ప్రతిభ కనబర్చి కళాశాలకు గుర్తింపు తీసుకరావాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రిన్సిపాల్ కేదారేశ్వర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శరత్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువ పనులు ప్రారంభించకుంటే దీక్ష
ఇల్లంతకుంట: రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ అనుబంధ ఎల్ఎం –6(లెఫ్ట్ మైనర్) అసంపూర్తి కాలువ పనులు ప్రారంభించకుంటే మార్చి 3వ తేదీన నిరాహార దీక్ష చేస్తామని ప్రభావిత రైతులు హెచ్చరించారు. ఈమేరకు రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాం.. దాచారం శివారు నుంచి చిన్న లింగాపురం శివారు మధ్య ఒక కిలోమీటర్ మేర నిలిచిపోయిన ఎల్ఎం – 6 కాలువ పనుల స్థల పరిశీలన కోసం మంగళవారం వచ్చారు. సమాచారం అందుకున్న పెద్ద లింగాపురం, రామాజీపేట, చెక్కుడువానిపల్లి గ్రామాల రైతులు డీఈ వద్దకు వెళ్లారు. కాలువ పనులు ఎందుకు సాగడం లేదని నిలదీశారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. దీంతో ఆర్ఐ షఫీయుద్దీన్ను వెంటనే కాలువల వద్దకు రావాలని డీఈ ఆదేశించడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసంపూర్తి పనులు, భూముల గురించి వివరణ అడిగారు. అయితే, అవి తమ పరిధిలో లేదని ఆర్ఐ వివరించారు. అసంపూర్తి పనులతో ఏడుగురు రైతులకు రూ.1.30 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయని పెద్దలింగాపురం రైతులు అంటున్నారు. కార్యక్రమంలో రైతులు అమ్ముల అశోక్, ఎలవేణి రమేశ్, కరికే నవీన్, కమటం రవి, జి.మల్లేశం, వీఆర్వో సింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎల్ఎం– 6 కెనాల్ రైతుల హెచ్చరిక -
చికిత్స పొందుతూ మహిళ మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గాంధీనగర్కు చెందిన బాలె తేజస్విని (32) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసుల వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మీసాల కాంతయ్య కూతురు తేజస్వినిని 2020లో గాంధీనగర్కు చెందిన బాలె సాయిరాజ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కూతురు (3) సంతానం. కొద్దికాలంగా తేజస్విని కడుపునొప్పితో బాధపడుతోంది. జనవరి 31న పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల క్రితం కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రయత్నించినా లాభంలేకపోయింది. మృతురాలి తండ్రి మీసాల కాంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మథరావు తెలిపారు. -
80 ఏళ్ల వేడుకను జయప్రదం చేయండి
సిరిసిల్లకల్చరల్: టీఎన్జీవోల సంఘం 80 వసంతాల వేడుకను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 317 జీవో బాధితులు, కారుణ్య నియామకాలు, పీఆర్సీ పెండింగ్ డీఏలను కూడా అదే వేగంతో క్లియర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎలుసాని ప్రవీణ్కుమార్, గాజుల సుదర్శనం, సమర్సేన్ జయంత్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కుమార్స్వామి, జీవన్, ఎం శ్రీకాంత్, రియాజ్పాషా, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్శాఖ పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, చందుర్తి పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేసి కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 41 పోలింగ్ కేంద్రాల్లో 23,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పర్యవేక్షణలో టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, రూరల్ సీఐ మొగిలి, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. ● ఎస్పీ అఖిల్ మహాజన్ -
పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లకల్చరల్/కోనరావుపేట/చందుర్తి: శాసనమండలి ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతీ ఓటర్కు ఓటరు స్లిప్ అందేలా జాగ్రత్త వహించాలని సూచించారు. ఓటర్లకు క్యూలైన్లు, ఏర్పాటు చేయాలని, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చివరి ఓటు వినియోగించుకున్నాక బ్యాలెట్ బాక్సులను నిబంధనల మేరకు సీల్ చేయాలని తెలిపారు. విధుల నిర్వహణలో అలసత్వం లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్రావు, తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్రావు, మహేశ్, సుజాత, ఇతర అధికారులు ఉన్నారు. సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందీప్కుమార్ సందర్శించారు. కేంద్రాల వారీగా సామగ్రిని పంపిణీ చేసేందుకు కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవోలు రాధాబాయి, రాజేశ్వర్, తహసీల్దార్లు ఉమారాణి,మహేశ్, కమిషనర్ సమ్మయ్య ఉన్నారు. రైతు కుటుంబానికి రూ.లక్ష తక్షణ సాయం ముస్తాబాద్ మండలం పోతుగల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దేవయ్య కుటుంబానికి తక్షన సాయంగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్ష మంగళవారం అందజేశారు. ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ ఆవిష్కరణ ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన పోస్టర్ను మంగళవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆవిష్కరించారు. 28వరకు జరుగనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల నేపథ్యంలో కుటుంబ, దేశ ఆర్థికాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమైందన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ టీఎన్ మల్లికార్జున్రావు, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి పీబీ శ్రీనివాస్, పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్లో అంది. పోలీసులు ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
ముగిసిన అంతర్రాష్ట్ర క్రీడలు
● క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్, ఉత్తర తెలంగాణ జట్టు ● విజేతలకు బహుమతులు ప్రదానంజగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలకు వ్యవసాయ వర్సిటీ డీన్ ఆప్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీరాణి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి వర్సిటీ క్రీడలకు పొలాస కళాశాల వేదిక కావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ పోటీల్లో పాల్గొడడం వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ క్రీడా పరిశీలకులు డాక్టర్ సురేశ్, వర్సిటీ నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జయరామ్, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ డాక్టర్ మహేశ్ రెడ్డి, క్రీడా ఇన్చార్జి డాక్టర్ రత్నాకర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నాన్ సిబ్బంది పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్ జట్టు రాష్టస్థాయి క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్ జట్టు కై వసం చేసుకోగా, సాంస్కృతిక విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను ఉ త్తర తెలంగాణ జట్టు కై వసం చేసుకుంది. క్రికెట్లో దక్షిణ తెలంగాణ, వాలీబాల్లో మధ్య తెలంగాణ, బాల్ బ్యాడ్మింటన్లో ఉత్తర తెలంగాణ, షటిల్ బ్యాడ్మింటన్లో రాజేంద్రనగర్, టేబుల్ టెన్నీస్లో రాజేంద్రనగర్, చెస్లో మధ్య తెలంగాణ, కార్యమ్లో మధ్య తెలంగాణ జట్లు విజయం సాధించాయి. వివిధ జోన్లకు చెందిన క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు. -
ముగిసిన ప్రచారం
● ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పోటాపోటీ సభలు ● సభలతో పార్టీ క్యాడర్లలో జోష్ ● గెలుపుపై ఎవరి ధీమా వారిదేసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. నిబంధనల మేరకు పోలింగ్కు 48 గంటల ముందు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి సైలెంట్ మోడ్ అమలులోకి వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు, సంఘాలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఎస్పీ తరఫున బీసీ నేతలు నిర్వహించిన సభల సక్సెస్తో ఆయా క్యాడర్ జోష్లో ఉంది. ఉమ్మడి కరీంనగర్ కీలకం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. ఉమ్మడి జిల్లా ఓటర్లు ఎటు మొగ్గుతే వాళ్లు విజయం సాధించే అవకాశాలున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 1 లక్షా 60 వేల 260 ఓట్లున్నాయి. అంటే ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు సగం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉంది. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబఽంధించి మొత్తం 27,088 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8,135 ఓట్లున్నాయి. ఇక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపోటములను నిర్ణయించనుంది. గెలుపుపై ధీమా పట్టభద్రులకు సంబంధించి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. అంజిరెడ్డి, నరేందర్రెడ్డి పార్టీల బలంపై, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంపై ఆశలు పెట్టుకున్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది పోటీలో ఉండగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.అశోక్కుమార్, ఎస్టీయూ, సీపీఎస్ల నుంచి పోటీలో ఉన్న కూర రఘోత్తంరెడ్డి నడుమ పోటీ నెలకొంది. ప్రచారసభలతో జోష్ గతంలో లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభలు నిర్వహించి తమకు ఓటెందుకు వేయాలో వివరించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపు బాధ్యతలను పూర్తిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భుజానికెత్తుకొన్నారు. కామారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ పాల్గొన్నారు. బీసీ వాదంతో బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా బీసీ జేఏసీ రాష్ట్ర నేతలు, బీసీ సంఘాల నేతలు, ఓయూ జేఏసీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. సభల విజయవంతంతో క్యాడర్లో జోష్ నెలకొనడంతో పాటు, గెలుపుపై ధీమా పెరిగింది. -
ఎములాడ దారిలో..
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు వరంగల్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్జత సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనలకు మాత్రమే అనుమతించారు. రూ.2.39 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. గుడి చెరువు ఖాళీ స్థలంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి పేయిడ్ పాస్లను అధికారులు జారీ చేశారు. పట్టణమంతా పోలీసుమయం కావడంతో భక్తులు, స్థానికులు పట్టణంలోకి వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. జాతరకు ఈసారి 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాజన్నకు పట్టువస్త్రాల సమర్పణ స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు., టీటీడీ దేవస్థానం అర్చకులు సైతం పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథ్ ఆధ్వర్యంలో అర్చకులు, ట్రస్టు సభ్యులు మంగళవారం రాత్రి రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు స్వస్థితో స్వాగతం పలుకగా, ఈవో కొప్పుల వినోద్రెడ్డి స్వాగతం పలికారు. శృంగేరి శారదాపీఠం పక్షాన రాధాకృష్ణశర్మ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రాక్షమాలను సమర్పించారు. జాతర ఏర్పాట్లు పరిశీలన జాతరలో ఏర్పాట్లను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్లు మంగళవారం పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వారి వెంట ఆర్డీవో రాజేశ్వర్, ఈవో వినోద్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. నిరంతరం అన్నదానం జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారాలు మధ్యాహ్నం వరకు నిరంతరం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్లు తెలిపారు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఏడు అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యాధికారి రజిత మంగళవారం పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బంది స్పందించి వైద్య సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర వేళల్లో 108ను ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఉచిత బస్సు సదుపాయం వేములవాడ అర్బన్: భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజన్న గుడి చెరువు వరకు ప్రతీ 15 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో వినోద్రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి వేములవాడరూరల్: జాతరలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వేములవాడ ఫైర్స్టేషన్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి విధులకు వచ్చిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆలయంలో నేడు జరిగే ఉత్సవాలు వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు ఉదయం 4 నుంచి 4.25 వరకు సుప్రభాత సేవ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన రాత్రి 11.35 నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా రాజన్న జాతర షురూ తరలివస్తున్న భక్తులు నేడు మహాశివరాత్రి వేడుకలు రూ.2.39 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు గుడి చెరువులో శివార్చన పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది, టీటీడీ అర్చకులు -
‘మల్కపేట’ నీటిని విడుదల చేయండి
● ఉత్తమ్కుమార్ రెడ్డికి కేటీఆర్ లేఖ సిరిసిల్లటౌన్: మల్కపేట రిజర్వాయర్ ద్వారా మిడ్మానేర్ నీటిని ఎత్తిపోసి సింగసముద్రాన్ని నింపాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే మ ల్కపేట రిజర్వాయర్ ఎత్తిపోతల ట్రయల్రన్ కూడా పూర్తయిందని, ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రారంభోత్సవం చేయలేకపోయామని పేర్కొన్నారు. ఇప్పుడు మిడ్ మానేరులో 17 టీఎంసీల నీరు ఉన్నందున నీటిని ఎత్తి పోసి సింగసముద్రం పరిధిలోని 2వేల ఎకరాలకు సాగునీరందించాలని కోరారు. నీటి ద్వారా రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, దేవునిగుట్ట తండా, రాచర్ల తిమ్మాపూర్, బాకూర్పల్లి తండా, రాజన్నపేట, కిష్టునాయక్ తండా, అక్కపల్లి, బుగ్గ రాజేశ్వర తండా, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్లపేట, సముద్ర లింగాపూర్ రైతుల పంటలను కాపాడుకున్న వారమవుతామని విజ్ఞప్తి చేశారు. -
కేటీఆర్ వర్సెస్ కలెక్టర్!
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025● గతంలో కలెక్టర్ను సన్నాసి అన్న కేటీ రామారావు ● అప్పటి నుంచి తమను కలెక్టర్ టార్గెట్ చేశారంటున్న అనుచరులు ● కేటీఆర్ ఫ్లెక్సీతో ఉన్న టీస్టాల్ తరలింపు, యజమానిపై కేసు ● కలెక్టర్పై పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్త అనిల్పై కేసు ● అనిల్ దొరక్కపోవడంతో ఆయన బాబాయ్పై చర్యలు ● అగ్రహారం పాలకేంద్రం సీజ్తో రోడ్డెక్కిన రైతులు ● సీఎస్ శాంతకుమారి వరకు వెళ్లిన వ్యవహారం ● నిజాయతీగా పనిచేస్తే నిందలేస్తున్నారంటున్న కలెక్టర్సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యహరించే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. భూకబ్జాలు, అనుమతిలేని వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో వింతేమీలేదు. అయి తే.. బాధితులంతా తాము కేటీఆర్ అనుచరులం, బీఆర్ఎస్ నాయకులం కాబట్టే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ను సన్నాసి.. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి తమపై కలెక్టర్ దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్ అనుచరులు ఆరోపిస్తుండగా..తనపని తానుచేసుకుంటున్నానే తప్ప.. ఎలాంటి ప్రతీకారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఇప్పుడు రాజకీయరంగు పులుముకుంటోంది. కలెక్టర్ సందీప్కుమార్ఝాపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా బీఆర్ఎస్ నాయకులు సీఎస్ శాంతికుమారిని కలవడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. కేటీఆర్ అనుచరులు ఏమంటున్నారు? ● టీస్టాల్ వద్ద కేటీఆర్ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్ యజమానికి బత్తుల శ్రీనివాస్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ● కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్ఎస్, కేటీఆర్కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్చేశారని ఆరోపించారు. ● కలెక్టర్ తీరుపై తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్రెడ్డి (గతంలో కేఏపాల్ మీద దాడిచేసిన వ్యక్తి) సందీప్కుమార్ ఝా మీద కేసులున్నాయని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అతను పోలీసులకు చిక్కకపోవడంతో అతని చిన్నాన్న అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల స్థలం కబ్జాచేశాడని పోలీసులు అరెస్టు చేశారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం లేకుండా పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ● 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌన్సెలింగ్ లేకుండానే కలెక్టర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నిబంధలనకు విరుద్ధమని చెప్పిన డీఈవోను కలెక్టర్ బెదిరించారు. ఉంటే ఉండు లేకుంటే లీవులో వెళ్లంటూ హెచ్చరించారు. ఆరోపణలపై కలెక్టర్ ఏమన్నారంటే.. ● సిరిసిల్లలో పబ్లిక్ ప్రాంతాన్ని టీస్టాల్ యజమాని ఆక్రమించి నడుపుతున్నాడు. పైగాఅతనికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు. అతను ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ● కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న అగ్రహారం డెయిరీ లైసెన్స్ లేకుండా నడుస్తోంది. దానికి ఫైర్ సేఫ్టీ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్, బిల్డి ంగ్ పర్మిషన్, పర్యావరణ అనుమతులు లేవు. ● తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సర్వే నెంబరు 1,183లోని స్థలాన్ని రాజిరెడ్డికి ప్రభుత్వం అసైన్ చేయలేదు. 2018లో ప్రభుత్వ రికార్డులను టాంపరింగ్ చేసి తనపేరిట మార్చుకున్నాడు. ఇది అవినీతి వ్యవహారం ● వాస్తవానికి జగన్మోహన్రెడ్డి విధులపై అంకితభావం లేదు. నాకు తెలియకుండా డీఈవో ఆర్డర్స్ ఇచ్చారు. అదేంటని అడిగితే.. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని సమాధానమిచ్చాడు. జిల్లా సర్వశిక్షాభియాన్ చైర్మన్గా నేను ఉండగా.. వ్యక్తిగత అజెండాలతో పనిచేయడం, పైగా ఆ ఆదేశాలు నేను ఇచ్చానని ప్రచారం చేయడం ఎంతమేరకు సమంజసం? -
రోడ్ ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్డ్రైవ్
● జిల్లాలో పన్నులు చెల్లించని వాహనాలు 6వేలు ● ఇప్పటికే 74 కేసులు నమోదు చేశాం ● రూ.14.18లక్షలు వసూలయ్యాయి ● జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్సిరిసిల్ల: రోడ్ ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లాలో 6వేలకు పైగా వాహనాలు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నాయని, వాటిని పట్టుకునేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పన్నుల వసూళ్లకు, ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను కట్టడి చేసేందుకు రవాణాశాఖ తీసుకుంటున్న చర్యలను ‘సాక్షి’కి వివరించారు. 15 ఏళ్లు దాటితే రెన్యూవల్ చేసుకోవాలి జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోవాలి. లేదంటే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తాం. జిల్లాలో అన్ని వాహనాలు 1,48,382 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 1,02,879 బైకులు ఉన్నాయి. రెండో స్థానంలో కార్లు 13,545 ఉన్నాయి. ఏ వాహనమైన 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోవాలి. రోడ్ ట్యాక్స్ చెల్లించని వాహనాలకు జరిమానాలు జిల్లాలో మూడు నెలలకోసారి చెల్లించాల్సిన రోడ్ ట్యాక్స్ను చెల్లించకుండా 6వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. అత్యధికంగా కమర్షియల్ ట్రాక్టర్లు, వాటి ట్రాలీలు ఉన్నాయి. ఇప్పటికే 74 కేసులు నమోదు చేసి రూ.14.18లక్షలు ఫిబ్రవరిలోనే వసూలు చేశాం. వాహనదారులు గడువు దాటిన తర్వాత రోడ్ ట్యాక్స్ చెల్లిస్తే అదనంగా 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. అదే మేం పట్టుకుని కేసు నమోదు చేస్తే.. 200 శాతం అదనంగా జరిమానా విధిస్తాం. వాహనదారులు సకాలంలో రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. గడువు దాటితే అదనపు ఆర్థికభారం తప్పదు. ఓవర్లోడ్తో వెళ్తే కేసులు నమోదు జిల్లాలో సామర్థ్యానికి మించి ఓవర్లోడుతో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేస్తాం. సామర్థ్యం మేరకు లోడును నింపుకుని వెళ్లాలి. జిల్లాలో ఫిట్నెస్ లేని వాహనాలు 12,700 ఉన్నాయి. వాటిని పట్టుకుని సీజ్ చేస్తాం. సకాలంలో ఫిట్నెస్ చేయించుకోవాలి. ప్రచారం చేస్తున్నాం జిల్లాలో రోడ్ ట్యాక్స్ వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ముందే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లాలో ప్రచారం చేశాం. మంచి పాటలను రాయించి వాహనదారులకు అవగాహన కల్పించాం. మార్చి నెలాఖరులోగా పూర్తిస్థాయిలో రోడ్ ట్యాక్స్ వసూళ్లకు ప్రణాళికను రూపొందించాం. వాహనదారులు స్పందించి పన్నులు చెల్లించాలి. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● ఓటేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి ● 27న సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ● నోడల్ అధికారి శ్రీనివాసాచారిసిరిసిల్లకల్చరల్: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నోడల్ అధికారి, సీపీవో పీబీ శ్రీనివాసాచారి సూచించారు. కలెక్టరేట్లో ఎన్నికల విధులు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల ప్రక్రియపై సోమవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 28 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 27న ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఒక రోజుముందుగానే పోలింగ్ డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలన్నారు. కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపుకార్డుతో వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలు ప్రకటించేలా సెక్టార్ అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. శిక్షణలో 40 మంది ప్రిసైడింగ్ అధికారులు, 40 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 88 మంది ఓపీవోలు, 15 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మాస్టర్ ట్రెయినర్లు మహేందర్రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. -
● కార్యకర్తలో ఉత్సాహం ● తరలివచ్చిన పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలు ● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం ● సభ ఎమ్మెల్సీ ఎన్నికకు మలుపు అని ‘హస్తం’ నేతల ధీమా
కరీంనగర్ కార్పొరేషన్: మెదక్– నిజామాబాద్– కరీంనగర్– ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు సోమవారం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. వేలాది మందిగా పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరాగా... నిరుద్యోగులు, ఉద్యోగులకు తాము చేసింది చెబుతూ, సీఎం రేవంత్రెడ్డి చేసిన ఆవేశపూరిత ప్రసంగం ఓటర్లపై ప్రభావం చూపుతుందనే ధీమాను హస్తం నేతలు వ్యక్తం చేశారు. సభకు పీసీసీ అధ్యక్షుడితో పాటు, జిల్లా మంత్రులు, ఇద్దరు ఇన్చార్జీ మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు తరలివచ్చారు. ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్సే శరణ్యం రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యోగాలతో పాటు, అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్కు మద్దతివ్వాలన్నారు. 2004లో కరీంనగర్ గడ్డపై సోనియాగాంధీ చెప్పిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఇంటికి ఉద్యోగాలొచ్చాయి కానీ, ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలిచ్చామని, ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ఇన్ని పనులు చేస్తున్నా ఫామ్హౌస్లో పడుకొని ఆరు నెలలకోసారి లేచే వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము 56 శాతం ఉన్నామని బీసీలు చెప్పుకొనేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీసీ అయిన బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఆ పార్టీలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. ● జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల తరువాత ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసామని తెలిపారు. ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రైవేట్ రగంలో ఉద్యోగాలిచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి, ఉద్యోగాలకు ఈ కేంద్రాలు దోహదం చేస్తాయని తెలిపారు. పట్టభద్రుల బంగారు భవిష్యత్ కోసం తాము బాటలు వేస్తున్నామన్నారు. విద్యారంగానికి సేవలందించిన నరేందర్రెడ్డిని గెలిపించాలన్నారు. ● బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకగా జీవన్రెడ్డిని గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు సంధానకర్త అవసరమని, అందుకే నరేందర్రెడ్డికి ఓటు వేయాలన్నారు. 15 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు. ● మంత్రి సీతక్క మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రాష్ట్రంలో 40 శాతానికి విస్తరించి ఉందన్నారు. అందుకే ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక అన్నారు. ● ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోన్ట్యాపింగ్, నిఘాలు లేవని మొదటిసారి ప్రజాస్వామిక వాతావరణం కనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ తరువాత ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఇప్పుడే జరిగిందన్నారు. ● ఎమ్మెల్సీ అభ్యర్థి వూటుకూరి నరేందర్రెడ్డి మా ట్లాడుతూ సీఎం రేవంత్ పాలన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ను తలపిస్తోందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని, రూ.3 లక్షల భీమా వర్తింపచేస్తానన్నారు. ● కాగా దర్మపురికి కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని ధర్మపురిలోనే ఏర్పాటు చేయాలని పలువురు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయరమణారావు, మేడిపల్లి సత్యం, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, సంజయ్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, వి.రాజేందర్రావు, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సత్తు మల్లేశం, మెనేని రోహిత్రావు, బొమ్మ శ్రీరాం, వొడితెల ప్రణవ్, కేకే మహేందర్రెడ్డి, సీపీఐ నాయకులు చాడవెంకటరెడ్డి, మర్రి వెంకటస్వామి పాల్గొన్నారు.‘కవ్వంపల్లి’ క్యాంపు ఆఫీసుకు సీఎం రేవంత్తిమ్మాపూర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం కరీనంగర్కు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సభ అనంతరం హైదరాబాద్కు రోడ్డు మార్గంలో బయల్దేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్లోని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంకు ఎమ్మెల్యేతో పాటు, పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి స్వాగతం పలికారు. టీ తాగిన అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు ఉత్తం కుమార్డ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఉన్నారు. -
దర్శిద్దాం.. తరిద్దాం
● నేటి నుంచి వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు ● నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం పట్టువస్త్రాల సమర్పణ ● మూడు రోజులు ముక్కోటి పండుగ ● 1500 మందితో బందోబస్తు వేములవాడ: హరహర మహాదేవ.. శంభో శంకర.. జై మహాదేవ్.. నామస్మరణతో వేములవాడ పురవీధులు మారుమోగనున్నాయి. పేదల దేవుడిగా పేరొందిన దక్షిణకాశీ వేములవాడలో నేటి నుంచి మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచన. రూ.2.39కోట్లతో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల కోసం శివార్చన వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు స్వాగతం పలికేందుకు తోరణాలు, సీసీ కెమెరాల మధ్య భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులు ప్రత్యేకం భక్తుల కోరిన కోర్కెలు నెరవేరితే రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. పాడిపంటలు బా గుండాలని మొక్కుకున్న రైతులు ఆలయానికి ని జకోడెలు సమర్పిస్తుంటారు. కల్యాణకట్టలో తలనీలాలు, బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో, భీమేశ్వరాలయం వద్ద ప్రసాదాల కౌంటర్ ఏ ర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోరా ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. జాతర ప్రత్యేక పూజలు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈనెల 25 నుంచి నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మదర్శనంతోపాటు రూ.300 వీఐపీ, రూ.50 స్పెషల్ దర్శనాలు, రూ.100 కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడెమొక్కు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 25వ తేదీ రాత్రి 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంతరం సర్వదర్శనం కొనసాగుతోంది. 26న ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వా మి వారికి పట్టువస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు, 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. ఉచిత భోజనం..టిఫిన్..తాగునీరు మూడురోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజ నం, పార్వతీపురంలో అన్నదానసత్రంలో ఉచిత భోజనం, టిఫిన్ వసతి ఉంది. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లను ఏర్పాటు చేశారు. వంద వసతి గదులు, 3.90 లక్షల చదరపు మీటర్లలో చలువపందిళ్లు వేశారు. స్నానానికి 157 షవర్లు ఏర్పాటు చేశారు. ధర్మగుండంలోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో పెట్టారు. భక్తుల కోసం 4 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అతిథుల రాక.. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్లు మహాశివరాత్రి వేడుకలకు రానున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రానున్నట్లు సమాచారం. నేడు పట్టువస్త్రాల సమర్పణశ్రీరాజరాజేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం సాయంత్రం 7 గంటలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు సాంస్కృతిక, దేవాదాయశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శివార్చన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇలా చేరుకోవాలి రోడ్డు మార్గంలోనే వేములవాడకు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 32 కిలోమీటర్లు దూరం రోడ్డుమార్గంలో చేరుకోవాలి. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతీ ముప్పై నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. స్థానికంగా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు 14 ఉచిత బస్సులు నడిపిస్తున్నారు.దర్శనీయ స్థలాలు వేములవాడ పరిసరాల్లో అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.అత్యవసర సేవల ఫోన్ నంబర్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి : 87126 56412 ఈవో వినోద్రెడ్డి : 94910 00743 వైద్యాధికారి రజిత : 70975 57119 ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926 టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413అత్యవసర సేవలు ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేశారు. నిరంతరం పోలీసు గస్తీ బృందాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్లో తాత్కాలిక వైద్యశాల, పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్, 13 మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా నియమించారు. వీటితోపాటుగా మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 1600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రశాంత వాతావరణంలో జాతర
వేములవాడ: ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి జాతర నిర్వహించుకుందామని ఎస్పీ అఖిల్మహాజన్ కోరారు. నిబంధనల ప్రకా రం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిద్దామన్నారు. స్థానిక పట్టణ ఠాణాలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్కు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరకు పటిష్ట భద్రత మహాశివరాత్రి జాతరకు 1500 మంది పోలీ సులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శనమయ్యేలా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
భక్తులకు అన్ని సౌకర్యాలు
వేములవాడ: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడలోని అన్నదానసత్రం, బద్దిపోచమ్మ ఆలయ ప నులు, తాగునీటి సౌకర్యం, జాతర పనులను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం పరి శీలించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు చెల్లించుకుని తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగే అవకాశాలున్నాయని, ఆమేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జలప్రసాదం వద్ద ఓపెన్ డ్రైన్ను పూడ్చాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో శానిటేషన్ ఎప్పటికప్పటికప్పుడు సరిచేయాలన్నారు. -
వెంకట్రావుపల్లిలో సమగ్ర సర్వే
● ఎట్టకేలకు వివరాలు ఇచ్చిన గ్రామస్తులుఇల్లంతకుంట(మానకొండూర్): ఎట్టకేలకు మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామస్తులు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. తమ గ్రామ సరిహద్దు వివాదం నేపథ్యంలో నవంబర్లో నిర్వహించిన సర్వేలో వివరాలు ఇవ్వలేదు. ఇటీవల ఎమ్మెల్యే గ్రామస్తులతో సమావేశమై సరిహద్దుల విషయంలో సుస్పష్టమైన హామీ ఇవ్వడంతో సోమవారం నుంచి గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో 19 మంది సెక్రటరీలు పాల్గొన్నారు. గ్రామంలో 285 కుటుంబాలలో 1,038 మంది ఉన్నారని ఎంపీడీవో శశికళ తెలిపారు. సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 28 వరకు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు.