breaking news
Ramu Rathod
-
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). హౌస్మేట్స్తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్లా సంజనా
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. సుమన్ స్టాండ్ తీసుకోడుఅందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఏం బిడ్డా? తక్కువ చూశానా?ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.రికార్డింగ్ ఉంది, ఊరుకో..అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్ -
పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్
బిగ్బాస్ హౌస్లో బండచాకిరీ చేస్తున్న టెనెంట్స్లో ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్బాస్. ఇందుకోసం ఓ గేమ్ పెట్టాడు. ఓనర్లు విసిరే బంతులు, బొమ్మలను టెనెంట్లు క్యాచ్ చేసి వారి బాస్కెట్లో వేసుకోవాలి. ఎండ్ బజర్ వచ్చేవరకు ఆ బాస్కెట్లోని వస్తువులను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా దాచుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ వస్తువులుంటే వారు ఎలిమినేట్ అవుతూ వస్తారు.గివప్ ఇచ్చేసిన సంజనామొదటి రౌండ్లో ఫ్లోరా, సంజనా బాగానే ఆడారు. కానీ ఫ్లోరా ఓడిపోయింది. అటు సంజన కూడా.. ఆల్రెడీ ఓ వారం కెప్టెన్గా ఇంట్లో ఉన్నాను కాబట్టి వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ గేమ్ నుంచి నిష్క్రమించింది. అయితే వీరిద్దరూ టెనెంట్స్లో ఎవరిని ఓనర్స్గా చూడాలనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9).ఈడ్చిపడేసిన సుమన్దీంతో ఇద్దరూ కలిసి రెండో రౌండ్లో సుమన్ దగ్గరున్న బొమ్మలు తీయబోయారు. వారిని వదిలించుకునే క్రమంలో సుమన్ (Suman Shetty) మోచేయి ఫ్లోరాకి తగిలింది. డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారికి దెబ్బలు తగిలినా సరే సంచాలక్ ప్రియ.. అతడిని ఎలిమినేట్ చేసింది. కానీ తర్వాతి రౌండ్లో రీతూ డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలివారిని కొట్టినా ప్రియ ఆమెను ఎలిమినేట్ చేయకపోవడం గమనార్హం.రీతూ రిక్వెస్ట్ పట్టించుకోని సుమన్రీతూ నన్ను కొట్టినప్పుడు ఎందుకు ఔట్ చేయలేదు? మీ ఫ్రెండ్ అని వదిలేశారా? అని సంజనా నిలదీసినా సరే ప్రియ పట్టించుకోలేదు. ఇక ఫ్లోరా, సంజన, సుమన్.. ముగ్గురూ రీతూ (Rithu Chowdary)నే అటాక్ చేశారు. అన్నా ప్లీజ్ అన్నా, వాళ్లను ఆపు అన్నా.. అని రీతూ.. సుమన్ను బతిమాలుకున్నా అతడు పట్టించుకోలేదు. రీతూ బాస్కెట్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి వస్తువులు పంచేశారు. అది జీర్ణించుకోలేని రీతూ పిచ్చిపట్టినట్లుగా ఆడింది. రాము బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది.మాట మార్చేసిన రీతూఇక్కడ మరో ముఖ్య విషయమేంటంటే.. చివరి వరకు మనిద్దరమే ఉండాలని రామూతో డీల్ మాట్లాడుకున్న రీతూ.. దాన్ని మర్చిపోయింది. ఆమె మాట తప్పడం చూసి షాకైన రాము.. ఆటాడకుండా శిలలా నిల్చుండిపోయాడు. అది చూసి ఇమ్మూకి పాపం అనిపించడంతో తన బొమ్మలు రాముకిచ్చాడు. అలాగే రీతూ చేసిన పనిని తప్పుపట్టాడు. దీంతో ఆమె.. ముగ్గురు కలిసి నామీద పడితే ఫెయిర్గేమా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ మాటతో తనూజ కూడా రియాక్ట్ అయింది. నోరు మూయ్నువ్వు నా దాంట్లో బొమ్మలు తీద్దామని రాముతో చెప్పలేదా? అంటే నీకు గ్రూప్ గేమ్ కావాలి.. వాడికి వద్దా? అని నిలదీసింది. దాంతో రీతూ.. నేను, నీ పేరే చెప్పలేదని బుకాయించింది. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వు నోరు మూయ్ అంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. సంజనా, ఫ్లోరా, సుమన్ సపోర్ట్ చేస్తామంటే తనూజ, ఇమ్మాన్యుయేల్ మాకు వద్దంటే వద్దని వేడుకున్నారు. సింగిల్గానే ఆడతామన్నారు. అలా రీతూ, తనూజ అవుట్ అయ్యాక ఇమ్ము, రాము మిగిలారు.ఓనర్గా రామువీరిలో ఒకరిని ఓనర్గా ప్రకటించమని టెనెంట్స్కు బాధ్యత అప్పగించాడు బిగ్బాస్. రీతూ తప్ప అందరూ ఇమ్మాన్యుయేల్కే ఓటేశారు. కానీ, రీతూ అస్సలు వినిపించుకోలేదు, రాము ఓనర్ అవ్వాల్సిందేనని బలంగా వాదించింది. దీంతో రామునే ఓనర్గా ప్రకటించారు. ఇదంతా అయ్యాక ఇమ్మూ ఎమోషనలయ్యాడు. నేను ఆడలేదా? గ్రూప్ సపోర్ట్ అడిగానా? అంటూ రీతూ మాటల్ని తలుచుకుని బాధపడ్డాడు. -
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్బాస్ సీజన్-9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాము రాథోడ్ బిగ్బాస్కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.లాక్ డౌన్లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్ సొమ్మసిల్లి అనే సాంగ్ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు. కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు. -
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్తో వైరలైన రాము రాథోడ్ బిగ్బాస్లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రాము రాథోడ్ను బిగ్బాస్ హౌస్లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్నగర్లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
‘బిగ్బాస్’లోకి ‘రాను బొంబాయికి రాను’ రాము.. ప్రభాస్ హీరోయిన్.. లిస్ట్ ఇదే?
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిసిందే. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో అయితే బిగ్బాస్ షో కోసం ఎదురు చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలోనే సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. ఈ సారి ఈ గేమ్ షోని సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్కి కంటెస్టెంట్లను డైరెక్ట్గా హౌస్లోకి పంపేవారు. ఈ సారి మాత్రం షో ప్రారంభానికి ముందే కొంతమందికి ‘అగ్ని పరీక్ష’ పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపుతారు. వీరితో పాటు మరికొంతమంది డైరెక్ట్గా బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు.సరికొత్తగాబిగ్బాస్ సీజన్ 9ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు బిగ్బాస్ కంటెస్టెంట్స్ అంతా ఒకే హౌస్లో ఉండేవాళ్లు. కానీ సీజన్ 9లో మాత్రం కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి..వేరు వేరు హౌస్లో ఉండబోతున్నారు. ఈ సీజన్లో 15 మంది కంటే ఎక్కువే హౌస్లోకి వెళ్లబోతున్నారు. వారిలో సగం ఒక హౌస్లో ఉంటే..మరో సగం మంది వేరే హౌస్లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ సారి మైండ్ గేమ్తో పాటు ఫిజికల్ టాస్క్లు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కంటెస్టెంట్స్ వీరే?ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. సీజన్ 9లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. వారిలో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో నిజంగానే ఎంతమంది బిగ్బాస్ షోలోకి వెళ్తున్నారనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే. -
‘రానూ బొంబాయికి రాను’.. బడ్జెట్ 5 లక్షలు.. కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. పెళ్లి బరాత్ మొదలు ఏ ఈవెంట్కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్ సాంగ్స్లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది.రెండు రోజుల షూటింగ్.. ఖర్చు ఎంతంటే..రాము రాథోడ్ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్కి ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.రూ.కోటి వచ్చింది నిజమే కానీ.. ఈ పాటను రామ్ రాథోడ్ తన యూట్యూబ్ నుంచే రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్ రాథోడ్ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది. కాగా, ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు.