Ranga Reddy District Latest News
-
మత్తులో వాహనాలు నడిపితే చర్యలు
చేవెళ్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ బాలాజీ హెచ్చరించారు. చేవెళ్ల మండల పరిధి పామెన బస్స్టేజీ సమీపంలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీసీ వాహనదారులకు అవగాహన కల్పించారు. మత్తులో వాహనాలు నడిపితే.. వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో నమ్ముకున్న వారి గురించి ఆలోచించుకోవాలని సూచించారు. క్షేమంగా ఇంటికి తిరగి వస్తారని ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్య పిల్లలు, కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తుంటారని, వారి ఆశలను మీ నిర్లక్ష్యం వలన అడియాశలు చేయరాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమకు తాముగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఆలోచన రావాలని, అలా చేస్తే.. ప్రమాదాలను అరికట్టవచ్చిన స్పష్టంచేశారు. స్పెషల్ డ్రైవ్లో అన్ని వాహనాలను తనిఖీ చేశామని, ఆర్టీసీ బస్ డ్రైవర్లను పరీక్షించామని తెలిపారు. ఈ డ్రైవ్లో మొత్తం 24 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, 12 ద్విచక్ర వాహనాలు, 12 కార్లు సీజ్ చేశామనివెల్లడించారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ బాలాజీ చేవెళ్లలో డ్రంకెన్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ -
దృష్టిని ఏమార్చి!
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చిప్ మార్చి.. 8లోuరీచ్ల నుంచి నిర్మాణ ప్రాజెక్టులకు చేరని వైనం జీపీఎస్ ట్రాకింగ్కు చిక్కని అక్రమార్కులుప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో భారీగా ఇసుక రవాణా సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డంపులపై కొరడాసాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ప్రాజెక్టుల పేరుతో జిల్లాలో ఇసుక దోపిడి యథేచ్ఛగా కొనసాగుతోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో.. మాఫియా తనచేతి వాటం జోరు పెంచింది. లారీల కొద్ది ఇసుకను దోచి, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని గుట్టలుగా డంప్ చేస్తోంది. ఎల్బీనగర్, మహేశ్వరం, తుక్కుగూడ, అత్తాపూర్, శంషాబాద్, కుంట్లూరు, పసుమాముల, మందమల్లమ్మ, కందుకూరు, వనస్థలిపురం, ఆటోనగర్, హస్తినాపురం జెడ్పీరోడ్డు, బీఎన్రెడ్డి నుంచి సాగర్రోడ్డు వెళ్లే మార్గంలో డంపు చేసిన ఇసుక గుట్టలు దండీగా దర్శనమిస్తున్నాయి. చిరు వ్యాపారులపై కొరడా.. ఇలా దోచి దాచిన ఇసుకను.. మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దొడ్డు ఇసుక టన్ను ధర రూ.1400, సన్న ఇసుక టన్ను ధర రూ.1600లకు పైగా ధర పలుకుతోంది. అయితే అధికారులు పెద్దపెద్ద డంపులను వదిలేసి.. చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నారన్న ఆరో పణలు ఉన్నాయి. డంపులు సీజ్ చేసి, కేసులు నమో దు చేస్తుండటంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇసుక అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు, ఆటోవాలాలు రోడ్డున పడాల్సి వస్తోంది. అడ్డదారుల్లో అడ్డాలకు.. ప్రభుత్వ భవనాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. ఎంపిక చేసిన రీచ్ల నుంచి ప్రైవేటు లారీల్లో నిర్దేశిత ప్రదేశానికి తరలిస్తోంది. లోడింగ్ తర్వాత ఇసుక పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఆయా వాహనాలకు జీపీఎస్ టెక్నాలజీని అమర్చుతున్నారు. మూసీవాగుపై ఉన్న(వంగమర్తి, జాజిరెడ్డిగూడెం) రీచ్ల నుంచి శివన్నగూడెం చర్ల ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిర్మాణాలకు.. రోజుకు వంద నుంచి 150 లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక డంప్ల వద్ద కాపలాగా ఉన్న పోలీసులున్యూస్రీల్జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాహనాల జీపీఎస్ చిప్ను మార్చి.. దోపిడీకి పాల్పడుతున్న ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ప్రాజెక్టులు, నిర్మాణాలకు చేరాల్సిన ఉచిత ఇసుక.. ప్రైవేటు వ్యక్తుల పరమవుతోంది.సైట్ ఇన్చార్జిలతో కుమ్మక్కు సర్కారు పనుల పేరిట తరలిన ఉచిత ఇసుకను.. రాజకీయ పలుకుబడితో కొంత మంది లారీల యజమానులు, ఆయా సైట్ ఇన్చార్జిలతో కుమ్మకై ్క గుట్టుగా ప్రైవేటు డంపింగ్ యార్డులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ తదితర నిఘావర్గాలకు చిక్కకుండా లారీలకు అమర్చిన జీపీఎస్ చిప్ను మధ్యలోనే మరో ఖాళీ వాహనానికి అమర్చుతున్నారు. టెక్నికల్గా లారీ అనుకున్న ప్రదేశానికి చేరుకుని ఇసుకను అన్లోడ్ చేసినట్లుగా చూపిస్తున్నారు. పది లారీలకు మూడే.. సైట్ ఇన్చార్జిలు లారీ యజమానులకు సహకరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాగు పక్కన ఉన్న ఇసుక రీచ్ నుంచి పది లారీలు బయలుదేరితే.. ఎంపిక చేసిన ప్రాంతానికి మూడు లారీల ఇసుక మాత్రమే చేరుతున్నట్లు సమాచారం. తతంగాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇసుక అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అధికారులు మాత్రం బడా వ్యాపారులను వదిలి, చిరు వ్యాపారులపై కొరడా ఝళిపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. -
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
సీఐ రాఘవేందర్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి అన్నారు. ఇటీవల ఆదిబట్ల పోలిస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 29 సెల్ఫోన్లు రికవరీ చేశారు. సంబంధిత వ్యక్తులకు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీసు శాఖ నిరంతరం ప్రజలు, వారి ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్, రాజు, హెడ్కానిస్టేబుల్ గిరి, కృష్ణ, సంతోష్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీఎన్బీ ఎండీని కలిసిన మల్లురవి ఆమనగల్లు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అశోక్చంద్రను నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఎంపీ కలిసి, నాగర్కర్నూల్ పార్లమెంటుపరిధిలోని అన్ని మండలాల యువతకు ఉపాధి కల్పించడానికి విరివిగా రుణాలుఅందించాలని కోరారు. డిస్కస్ త్రో, షాట్ పుట్లో వెండి పతకాలు శంకర్పల్లి: ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిస్కస్ త్రో, షాట్ పుట్ పోటీల్లో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన వరుణ్ గౌడ్ ప్రతిభ చాటాడు. రెండు విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలు సాధించాడు. ప్రస్తుతం వరుణ్గౌడ్ బాసర ఐఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడంతో మార్చి 20న పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తమ కుమారుడి ప్రతిభపై తల్లిదండ్రులు కల్పన, లక్ష్మణ్ హర్షం వ్యక్తంచేశారు. స్పీకర్కు అవార్డు ప్రదానం అనంతగిరి: ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్స్ సంస్థ స్పీకర్ ప్రసాద్కుమార్ను మ్యాన్ ఆఫ్ అన్పారాలెల్డ్ మస్టరే అవార్డుతో సత్కరిచింది. గురువారం రాత్రి నగరంలోని రవీంద్రభారతిలో శృతిలయ సీలెవెల్ కార్పొరేషన్ –కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సినీనటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్–2025 అవార్డు,జంధ్యాల 75 వసంతాల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరించారు. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు లక్డీకాపూల్: వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)వెంకటాచారి అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ సమావేశంలో ఆయన మాట్టాడారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలను 244 కేంద్రాలలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాల తరలింపులో పోలీసులు అత్యంత బాధ్యత, భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని.. క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాల లొకేషన్లను పరిశీలించుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 040 29700934ను సంప్రదించవచ్చని సూచించారు. -
‘ఎస్’
ఎల్ఆర్భూముల క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రక్రియ మళ్లీ కదలిక మొదలైంది. మార్చి 31లోగా స్థలాను క్రమబద్ధీకరించుకున్న వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తు దారుల్లో ఆశలు చిగురించాయి. క్రమబద్ధీకరణకు ఆయా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాలకు క్యూ కడుతున్నారు. తమ దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మెజార్టీ పురపాలికల్లో దరఖాస్తుల నిష్పత్తి మేరకు సిబ్బంది లేక పోవడం ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా.. జిల్లా వ్యాప్తంగా అందిన మొత్తం దరఖాస్తుల్లో 35,837 దరఖాస్తులు నిషేధిత జాబితా భూములకు సంబంధించినవి కావడం గమనార్హం. 111 జీఓ కారణంగా ఒక్క శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే 9,860 దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం విశేషం. వీటి ఆమోదం కోసం అధికారులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. పెండింగ్లో మెజార్టీ దరఖాస్తులు ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధి నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల నుంచి 2,38,263 దరఖాస్తులు అందాయి. వీటి క్లియరెన్స్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో.. ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మున్సిపాలిటీకి రెండు మూడు బృందాలను నియమించారు. నిజానికి మూ డు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కులగణన, ఇతర కారణాలతో పరిశీలన ప్రక్రియ కొంత నెమ్మదించింది. ప్రభుత్వ తాజా రాయితీ ప్రకటనతో దస్త్రాల క్లియరెన్స్లో కదలిక మొదలైంది. మండల కేంద్రాల్లో దరఖాస్తులు ఇలా మండలం దరఖాస్తులు ఫరూఖ్నగర్ 22,051 కేశంపేట్ 10,200 తలకొండపల్లి 2,323 యాచారం 4,464 కడ్తాల్ 3513 కొందుర్గు 1505 ఆమనగల్లు 929 మాడ్గుల 708 జిల్లెడు చౌదరిగూడెం 683 మంచాల 54 -
ఈక్వెస్ట్రియన్ జాతీయ అర్హత పోటీలు
శంకర్పల్లి: ఈక్వెస్ట్రియన్ జాతీయ అర్హత పోటీలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. టోర్నీకి శంకర్పల్లి మండలం జన్వాడలోని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ వేదిక కానుంది. పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హత పోటీల్లో అండర్–11,14,18 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననుండగా.. మూడు రకాల పోటీలు పోలో, షో జంపింగ్, డ్రెసాజ్లు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో అర్హత సాధించిన వారికి, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జాతీయ జూనియర్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ షిప్ పోటీలకుఎంపిక కానున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఏర్పాట్లు పూర్తి నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ జాతీయ అర్హత పోటీలకు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందని క్లబ్ సీఈఓ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నేటి నుంచి జన్వాడ పోలో క్లబ్లో టోర్నీ -
స్నేహితురాలు మాట్లాడటం లేదని..
షాబాద్: స్నేహితురాలు మాట్లాడటం లేదని ఓ విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆమనగల్లు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీజ.. స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయురాలు.. బాలికను చికిత్స నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియాకు తరలించారు. ప్రస్తుతంవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్లు పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
పట్టుకుంటారా.. తప్పిస్తారా?
మొయినాబాద్: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన కోడి పందేల కేసులో అసలు సూత్రధారులు తప్పించుకు తిరుగుతున్నారు. పారిపోయి పది రోజులు దాటినా ఇంత వరకూ దొరకలేదు. వారిని అటునుంచి అటే తప్పించే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టలో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 11న పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వస్తుండగా ఎస్ఓటీ, స్థానిక పోలీసులు దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోడి పందేల నిర్వాహకుడు శివకుమార్ వర్మ(గబ్బర్సింగ్)తోపాటు 64 మందిని పోలీసులు పట్టుకోగా మరికొంత మంది ప్రహరీ దూకి పారిపోయిన విషయం విదితమే. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో కోడి పందేల నిర్వహణకు అసలు సూత్రధారి అయిన వ్యక్తి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే అతను పారిపోయి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు తెలిసినా అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పందెం రాయుళ్ల వద్ద రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చూపిన పోలీసులు.. ఆ రోజు రూ.కోట్లలో డబ్బులను మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికై నా కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకుంటారా..? వదిలేస్తారా వేచి చూడాల్సిందే. దొరకని కోడి పందేల సూత్రధారులు పది రోజులు దాటినా అదే పరిస్థితి పోలీసుల వ్యవహారంపై సర్వత్రా ఆరోపణలు -
భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్రమ ప్లాట్ల రెగ్యులరైజేషన్కు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నిర్దేశించిన గడువులోగా క్రమబద్ధీకరించుకున్న వారికి రాయితీని ప్రకటించింది. దీంతో దరఖాస్తు దారులు టౌన్ ప్లానింగ్ విభాగాలకు పరుగులు తీస్తున్
● దరఖాస్తు దారుల్లో చిగురిస్తున్న ఆశలు ● మార్చి 31లోగా రెగ్యులరైజేషన్ చేయించుకున్న వారికి ఫీజులో రాయితీ ● ప్రభుత్వ ప్రకటనతో మళ్లీ కదలిక ● నిషేధిత జాబితా భూముల్లోని దరఖాస్తులే 35,837 మున్సిపాలిటీ అందిన ఆమోదించినవి పెండింగ్/ దరఖాస్తులు తిరస్కరణబండ్లగూడజాగీర్ 7,892 970 6,922 శంషాబాద్ 10,013 153 9,860 ఇబ్రహీంపట్నం 6,197 527 5,670 కొత్తూరు 3,596 346 3,250 శంకర్పలి 4,780 580 4,200 ఆమనగల్లు 3,562 1,443 1,696 పెద్ద అంబర్పేట్ 49,260 8,556 40,704 బడంగ్పేట్ 45,582 5,665 31,917 తుక్కుగూడ 2,440 1,322 1,118 ఆదిబట్ల 17,619 5,399 12,220 జల్పల్లి 10,914 4,655 6,259 షాద్నగర్ 14,996 4,565 10,431 తుర్కయాంజాల్ 49,800 8,795 41,005 మణికొండ 2,591 – 107 నార్సింగి 3,354 – 22 మీర్పేట్ 3,412 – 1,225 -
సాగుపై అవగాహన అవసరం
ధారూరు: రైతులు తమ పొలాల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనేది తెలుసుకోవాలని తాండూరు వ్యవసాయ క్షేత్రం ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని కేరెళ్లిలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ కృషి అనుభవ్, గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాలతో తెలుసుకోవచ్చన్నారు సాగుచేసిన పంటల్లో సస్యరక్షణ పద్దతులు, సాగులో అనుసరించాల్సిన మెళకువలు, సూచనలు, కాలానుగుణంగా తీసుకోవల్సిన పనులపై రైతులకు వివరించారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు వెన్డయాగ్రాం, ట్రాంసెక్ట్ వాక్, చపాతిపటం, సమస్య చెట్టు, సామాజిక పటం తదితర చిత్రపటాలను గీచి వాటి గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమలో శాస్త్రవేత్త యమునారెడ్డి, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. తాండూరు వ్యవసాయ క్షేత్రం ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ -
మతిస్థిమితం లేని వృద్ధురాలిపై లైంగిక దాడి
యాచారం: మతిస్థిమితం లేని, వృద్ధ యాచకురాలిపై గుర్తు తెలియని కామాంధుడు లైంగిక దాడిక పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారంలోని మాల్ మార్కెట్ ఎస్బీఐ వద్ద గతేడాది డిసెంబర్ 9న అర్ధరాత్రి ఓ వృద్ధురాలు(70) సేద తీరుతుంది. జనసంచారం లేకపోవడంతో ఓ వ్యక్తి ఆమైపె బలత్కారానికి పాల్పడి, తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయమై అదే రోజు రాత్రి యాచారం పెట్రో మొబైల్ పోలీసులకు సమాచారం అందడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. కానీ దుండగుడిని పట్టుకుని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహించారు. ఎస్బీఐ సమీపంలోని ఓ దుకాణా వ్యాపారి రెండు రోజుల క్రితం సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ కామాంధుడు ఆమైపె బలత్కారానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వేటుకు రంగం సిద్ధం ఘటన జరిగి రెండు నెలలు గడవడం, సమాచారం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం కేసు నమోదు చేయడంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంటలిజెన్స్, ఎస్బీ పోలీసుల ద్వారా విచారణ చేపట్టి పూర్తి సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఘటనలో నిర్లక్ష్యంగా వ్యహరించిన పోలీసు ఉన్నతాధికారులు, పెట్రో మొబైల్ సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయమై యాచారం సీఐ నర్సింహరావును సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన అన్నీ తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఉన్నతాధికారుల సీరియస్.. చర్యలకు సిద్ధం -
అనారోగ్యంతో డ్రైవర్ మృతి
కొత్తూరు: అనారోగ్యంతో ఓ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహ్మరావు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం(55) తిమ్మాపూర్లోని హెచ్ఐఎల్ పరిశ్రమకు సిమెంట్ పైపుల లోడ్ నిమిత్తం వచ్చాడు. ఈ క్రమంలో పరిశ్రమ వెనకాలకు బహిర్భూమికి వెళ్లిన డ్రైవర్.. ప్రహరి పక్కన చలనం లేకుండా పడి ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత అతడితో పాటు వచ్చిన తోటి డ్రైవర్ దురాయిరాజ్.. విషయాన్ని పరిశ్రమ నిర్వాహకులకు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడుకొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సహ డ్రైవర్ తెలపగా.. ఈ కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చోరీ కేసులో దొంగ అరెస్టు
ఆమనగల్లు: చోరీ కేసులో నేనావత్ చంద్రమోహన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ ప్రమోద్కుమార్ తెలిపారు. శుక్రవారం ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎస్ఐ వెంకటేశ్తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆమనగల్లు పట్టణంలోని గాంధీనగర్ సమీపంలో గత నెల 30న తాళం వేసి ఉన్న రొయ్యల లక్ష్మమ్మ ఇంట్లో దుండగుడు చొరబడి బీరువాను పగల గొట్టాడు. అందులోని 9 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని బస్టాంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన చంద్రమోహన్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీ చేసినట్లు అంగీకరించాడు. అనంతరం అతడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. చోరీ కేసులో దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు రఘునాయక్, శివలను ఈ సందర్భంగా సీఐ ప్రమోద్కుమార్ అభినందించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి కేశంపేట: విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్(28) జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్లో ఉద్యోగి. విధుల్లో భాగంగా ఈ నెల 13న మండల పరిధిలోని పాటిగడ్డ శివారులో కమాన్ వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రవీణ్ ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి అదృశ్యం కడ్తాల్: ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధి మద్దెలకుంటతండాకు చెందిన నున్సావత్ సరళ(30).. ఆరోగ్యం బాగలేదని, కడ్తాల్కు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుని వస్తానని ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఆమె కోసం ఐదు రోజులుగా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. సరళ తల్లి నీలా శుక్రవారం కడ్తాల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఘనంగా సందల్ ఊరేగింపు
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ షర్ఫూద్దీన్ బాబా దర్గా 759వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ తరఫున సందల్(గంధం) ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీలో భాగంగా ఇన్స్పెక్టర్ పి.గురువారెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డిలు మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డిలు తలపై పూలు, ఛాదర్ పెట్టుకొని ఊరేగింపుగా దర్గాపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లీలు ఫరీదుద్దీన్, ఇర్ఫాన్లు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఊరేగింపులో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీను, లక్ష్మణ్, దయాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆచూకీ లభ్యం
కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు ఇబ్రహీంపట్నం రూరల్: ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. కనిపించకుండా పోయిన నాలుగు రోజులకు బాలిక ఆచూకీ లభ్యం కాగా.. పోలీసులు శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించిచారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొంగ్లూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న ఏ.మంజు(16) ఈ నెల 16న కళాశాల నుంచి అదృశ్యమైంది. తల్లిదండ్రులకు పోన్ చేసినా.. అమ్మాయి వివరాలు తెలియరాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక కోసం గాలించగా.. ఆచూకీ లభ్యమైంది. అప్పటికే మిస్సింగ్ కేసుతో పాటు మరి కొన్ని కేసులు నమోదు చేసి, విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు, కళాశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఆస్తి పన్ను కట్టండహో! బంజారాహిల్స్: ఆస్తి పన్ను బకాయిలున్న బడా బాబులకు, స్టార్ హోటళ్లకు సీజ్లతో షాక్ ఇస్తున్న అధికారులు తమ పంథా మార్చారు. ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆస్తి పన్నుతో పాటు మొండి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్ బస్తీలో శుక్రవారం జీహెచ్ఎంసీ పారి శుద్ధ్య సిబ్బంది మైక్సెట్లో ఆస్తి పన్ను చెల్లించాలంటూ ప్రచారం చేశారు. ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల నివాసాలతో పాటు వాణిజ్య సముదాయాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనకాడబోమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
అబ్దుల్లాపూర్మెట్: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ భగత్సింగ్ నగర్ కాలనీకి చెందిన వేముల భిక్షపతి కుమారుడు గుణశేఖర్(27) శుక్రవారం సాయంత్రం సంఘీనగర్కు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను నడిపిస్తున్న బైక్ కిడ్ కావడంతో.. గుణశేఖర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో గుణశేఖర్ దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. -
మాదకద్రవ్యాలతో అనర్థాలు
పహాడీషరీఫ్: నేరాల పట్ల అవగాహన పొంది వాటికి దూరంగా ఉండాలని మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి సూచించారు. బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో బుధవారం రాత్రి ఇన్స్పెక్టర్ సుధాకర్తో ఆయన కలిసి విజిబుల్ పోలీసింగ్లో భాగంగా స్థానికులకు నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశానుసారం నిత్యం ఏదో ఒక బస్తీలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. వాటితో కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన లింక్లను ఓపెన్ చేయరాదని సూచించారు. రహదారి నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లు విరివిగా వాడుతూ దుష్ప్రభావాలకు లోనుకారాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మి శాంతి భద్రతల భంగం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు యూసుఫ్ జానీ, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి -
ఉపాధిహామీ పనులు ప్రారంభించండి
షాద్నగర్రూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా వ్యాప్తంగా వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య కోరారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఖాళీగా ఉంటున్నారన్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పనులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.86 వేల కోట్లను మాత్రమే కేటాయిందన్నారు. ఈ పరిమితిని పెంచాలన్నారు. ఉపాధి కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజూ రూ.700 ఇవ్వాలని, రెండు వందల రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. టెంట్లు, మంచినీళ్లు, గడ్డపార, పార, రవాణా సౌకర్యం తదితర ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, నాయకుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య -
బెల్టు షాపులపై పోలీసు పంజా
కొందుర్గు: నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్నగర్ రూరల్ సీఐ నర్సయ్య హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన ఆధ్వర్యంలో మండల కేంద్రంలో 50 మంది పోలీసులు ఏక కాలంలో వివిధ దుకాణాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా కిరాణ షాపుల్లో నిషేధిత గుట్కాలు, బెల్ట్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఆరు బెల్ట్ షాపుల్లో సోదాలు చేసి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. నాలుగు దుకాణాలపై రైడింగ్ చేసి నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ధ్రువపత్రలు లేకుండా నడుపుతున్న 10 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఇసుక రవాణా, మట్టి తవ్వకాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు రవీందర్ నాయక్, బాలస్వామి, విజయ్ పాల్గొన్నారు. మద్యం, నిషేధిత గుట్కాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన షాద్నగర్ రూరల్ సీఐ నర్సయ్య -
డిమాండ్ల సాధనకు సమష్టి కృషి
షాద్నగర్: డిమాండ్ల సాధనకు బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ సూచించారు. గురువారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సేన జిల్లా అధ్యక్షుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన బర్క కృష్ణ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఐక్యత, సామాజిక న్యాయ సాధనకు తమ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. హక్కుల పరిరక్షణకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా బీసీ యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సేన నియోజకవర్గ అధ్యక్షుడిగా చంద్రశేఖరప్పను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు బాబయ్య, సత్యం, లక్ష్మణ్, రాజు, చందులాల్, శంకరయ్య, జగదీష్ గౌడ్, మల్లేశ్గౌడ్, శివకుమార్, రవి, రాఘవేందర్, రమేశ్, వరప్రసాద్, చందు, సత్యం, హరీశ్కుమార్, నరేశ్, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
పరికి చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు
ఆల్విన్కాలనీ: కూకట్పల్లి మండల పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ పరికి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రాలో జేసీబీని నడిపే ఓ ఉద్యోగి నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చివేసుకోవడం గమనార్హం. తనకు చెందిన ఇంటి స్లాబ్ నిర్మాణాన్ని వదిలివేయాలని అతడు అధికారులను బతిమిలాడినా వారు ససేమిరా అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల వెంట కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుగోలు చేసుకోవాలని, కష్టపడిన సొమ్మును వృథా చేసుకోరాదని అతడికి వారు సూచించారు. హైడ్రా సిబ్బంది అయినా, రాజకీయ నాయకులైనా, కబ్జాదారులైనా, ప్రభుత్వ భూములు, చెరువు స్ధలాలు, నాలా పరిసర ప్రాంత స్థలాలను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కాగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారనే విషయం తెలియడంతో స్థానికులు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, ఇల్లు కట్టుకుంటున్న తరుణంలో కూల్చివేయటమేంటని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. -
అద్దెకు తీసుకుని అమ్మేశాడు..
జీడిమెట్ల: కార్లను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ సురేష్కుమార్, ఏసీపీ హన్మంతరావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ పణీంద్ర గాజులరామారం దేవేందర్నగర్లో ఉంటూ చివకల రమణ, రెడ్డి వెంకటేశ్లతో కలిసి వీవీఅర్ ట్రావెల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశాడు. అతను జగద్గిరిగుట్టకు చెందిన శశిధర్ వద్ద 2024 అక్టోబర్లో నెలకు రూ. 23 వేలు చెల్లించేలా లీజు ప్రాతిపదికన కారును అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించిన తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన శశిధర్ అతడి కార్యాలయం వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో పరిసర ప్రాంతాల్లో విచారించగా అతను ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు తెలిసింది. శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు విశ్వపణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. 32 కార్లు అమ్మేశాడు.. విశ్వపణీంద్ర ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 32 కార్లను అద్దెకు తీసుకుని విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. 28 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి సహకరించిన రమణ, సత్యనారాయణ, వెంకటేష్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు విశ్వపణీంద్రను గురువారం రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ నర్సింహ, డీఐ ఎం.అంజయ్య, ఎస్సై శంకర్, ఎఎస్సై రమణ, హెడ్కానిస్టేబుళ్లు అంజిబాబు, పురందాస్, కానిస్టేబుళ్లు నరేష్కుమార్, చిరంజీవి, నరేష్లను డీసీపీ అభినందించి రివార్డులను అందజేశారు. ఘరానా మోసగాడి అరెస్ట్ రూ.2.5 కోట్ల విలువైన 28 కార్లు స్వాధీనం -
డ్రగ్స్ దందా
స్టూడెంట్ వీసాపై వచ్చి గచ్చిబౌలి: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీన్యాబ్), మియాపూర్ పోలీసులు ఆమె నుంచి 60 గ్రాముల సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శతాబ్ది మన్నా(24) అరెస్ట్ చేశామని, మరో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడు. గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ శతాబ్ధి మన్నా బుధవారం సాయంత్రం మియాపూర్ బస్స్టాప్లో ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రూ.6 లక్షల విలువైన సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. జార్కండ్ రాష్ట్రం, జంషెడ్పూర్కు చెందిన మన్నా బెంగళూర్లో బీబీఏ పూర్తి చేసింది. అక్కడే ఆమెకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడింది. బెంగళూరులోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న శతాబ్ధి మన్నా తన గదిలోనే డ్రగ్స్ నిల్వ ఉంచి డ్రగ్ పెడ్లర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో డ్రగ్స్ అందజేసేందుకు వచ్చిన మన్నాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు., ఏదైనా పార్టీ లేదా పెడ్లర్లకు విక్రయించేందుకు ఆమె హైదరాబాద్కు వచ్చి ఉండవచ్చునన్నారు. మన్నా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే సబ్ పెడ్లర్ను గుర్తించామని, మరి కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. వీరు గోవా, బెంగళూర్, రాజస్తాన్, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ఉందని ఈ డ్రగ్ చైన్ను త్వరలోనే చేధిస్తామన్నారు. మరో నిందితుడు వారెన్ కొకరంగోకు అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్లో ఉన్నాడని, పరారీలో ఉన్న అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. డ్రగ్ పెడ్లర్లు జార్కండ్లో పేదరికంలో ఉన్న విద్యార్థులకు డబ్బు ఆశ చూపి ఈ దందాలోకి దించుతున్నట్లు తాము గుర్తించామన్నారు. టీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ తెలంగాణకు ప్రజలు సహకరించాలన్నారు. గత అక్టోబర్లో అబిడ్స్, అఫ్జల్గంజ్, చౌటుప్పల్ పీఎస్ల పరిధిలో రాజస్తాన్ గ్యాంగ్ నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ, డిసెంబర్ 25న ఫిల్మ్నగర్ పీఎస్ పరిధిలో 17.38 గ్రాముల ఎండీఎంఏ, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఫిబ్రవరి 11న ఇద్దరు రాజస్తాన్ పెడ్లర్ల నుంచి 40 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, టి న్యాబ్ డీఎస్పీ హరిచంద్రారెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మియాపూర్లో 60 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం బెంగళూర్కు చెందిన కార్పొరేట్ ఉద్యోగిని శతాబ్ది మన్నా అరెస్ట్ అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీ -
స్క్రాప్ మాటున గంజాయి రవాణా
అబ్దుల్లాపూర్మెట్/నాగోలు: ఎవరికీ అనుమానం రాకుండా కంటైనర్లో స్క్రాప్ మెటీరియల్ మధ్య గంజాయి దాచి అరకు నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్న డీసీఎం డ్రైవర్ను అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన అతడి నుంచి 300 కిలోల గంజాయి, కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, పూణే, రూపినగర్కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డీసీఎం డ్రైవర్గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి అదే ప్రాంతానికి చెందిన వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది. మాదకద్రవ్యాల దందా నిర్వహించే వారు తమ వద్ద డ్రైవర్గా పని చేయాలని అహ్మద్ గులాబ్ షేక్కు సూచించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణే, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తే ఒక్కో లోడ్కు రూ.3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన అతను గతంలో విశాఖపట్నం నుంచి పూణేకు రెండు లోడ్ల గంజాయిని విజయవంతంగా డెలివరీ చేసి వైభవ్కు అప్పగించాడు. దానిని వైభవ్, దేవా పూణేలోని తమ ఏజెంట్లకు సరఫరా చేశారు. వైభవ్, దేవా సూచన మేరకు నిందితుడు అమ్మద్ గులాబ్ షేక్ ఇటీవల విశాఖపట్నం వెళ్లి బుజ్జిబాబు అనే వ్యక్తి నుంచి 300 కిలోల గంజాయి (138) ప్యాకెట్లు) సేకరించాడు. తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కంటైనర్లో ప్లాస్టిక్ స్క్రాప్లోడ్ చేసి దాని కింద గంజాయి దాచి హైదరాబాద్ మీదుగా పూణేకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు గురువారం మధ్యాహ్నం రామోజీ ఫీల్మ్ సిటీ సమీపంలో కంటైనర్ను ఆపి సోదా చేయగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి గంజాయి, టాటా కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.5 కోట్లు ఉండవచ్చునని సీపీ పేర్కొన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్, మహేశ్వరం అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, అబ్దుల్లాపూర్మెట్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరకు నుంచి పూణేకు తరలింపు 300 కేజీల గంజాయి స్వాధీనం డీసీఎం డ్రైవర్ అరెస్ట్ -
కూలుతున్న కాపురాలు
ప్రతీఒక్కరి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం. భవిష్యత్పై ఎన్నో ఆశలు పెట్టుకుని సంసార సాగరంలోకి అడుగేస్తారు నూతన దంపతులు. ఈ క్రమంలో తలెత్తే చిన్నపాటి స్పర్థలకే కొంతమంది బంగారం లాంటి బంధాన్ని తెంచుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి, సమాజంలో విడాకుల ధోరణి విపరీతమవుతోంది. హుడాకాంప్లెక్స్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చివరకు పోలీసు స్టేషన్లకు చేరుతున్నాయి. నువ్వెంత..? అంటే నువ్వెంత..? అనే అహంకార వలలో చిక్కి చివరకు విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా 2024 డిసెంబర్ నాటికి సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో 2,200 గృహహింస, అత్యాచారం, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు అందగా, వీటిలో 540 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పంతాలు, పట్టింపులు పంతాలు, పట్టింపులకు పోయి.. ఠాణాకు వస్తున్న జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2024లో మహేశ్వర్యం జోన్లో 301, ఎల్బీనగర్జోన్లో 1,325, మల్కాజ్గిరి జోన్లో 1,513 మంది దంపతులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్స్ నిర్వహించారు. సాధ్యమైనంత వరకు వారికి నచ్చజెప్పి.. ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే రెండు కుటుంబాల మధ్య వివాదం తార స్థాయికి చేరుకోవడం విడాకులకు కారణమవుతోంది. ఫలితంగా కోర్టుల్లో ఈ తరహా కేసుల జాబితా ఏటా పెరుగుతోంది. గత డిసెంబర్ వరకు ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టు పరిధిలో 314 కేసులు, అడిషినల్ ఫ్యామిలీ కోర్టులో 353 కేసులు, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో 163 కేసులు పెండింగ్లో ఉండటం గమనార్హం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు ఇలా 2023 2024 వరకట్నం 16 18 గృహ హింస 1582 1222 పోక్సో 317 392 అత్యాచారాలు 327 384 ఫ వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమతకు ఎల్బీనగర్కు చెందిన ఐటీ ఉద్యోగి శేఖర్తో ఏడాది క్రితం వివాహమైంది. భర్త తనను తరచూ వేధిస్తున్నాడని, ఇకపై ఆయనతో కలిసి ఉండలేనని పేర్కొంటూ ఇటీవల ఆమె సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. చిన్న అంశంపై నెలకొన్న మనస్పర్థలు చివరకు విడాకుల వరకు దారి తీశాయి. ఫ మీర్పేటకు చెందిన అరుణ.. అదే ప్రాంతానికి చెందిన శ్రవణ్కుమార్తో రెండేళ్ల క్రితం పైళ్లెంది. వీరికి ఓ పాప ఉంది. అదనపు కట్నం కావాలని భర్త వేధిస్తుండటంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. కులపెద్దలు, నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు ఈ పంచాయితీ విడాకుల వరకు వెళ్లింది. ఇలా మమత, అరుణ దంపతులు మాత్రమే కాదు. అనేక మంది చిన్నచిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చిన్నపాటి మనస్పర్థలకే తెగిపోతున్న బంధాలు అకారణ వివాదాలతో ఆగమవుతున్న జంటలు సరూర్నగర్ మహిళా పీఎస్లో ఏటా పెరుగుతున్న కేసులు సర్దుబాటు ధోరణి నశించడమే కారణమంటున్న నిపుణులు ప్రధాన కారణాలివే.. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే కా వడం, భర్త ఒక షిఫ్ట్లో పని చేస్తే.. భార్య మరో షిఫ్ట్లో పని చేస్తుండటం, దీంతో ఇరువురూ కలిసి గడిపే సమయం దొరకకపోవడం. స్మార్ట్ ఫోన్లలో ఇతరులతో చాటింగ్లు, వీడియో కాల్స్ చేస్తుండటం. సంపాదన లేదా జీతంలో కొంత మొత్తాన్ని తమ తల్లిదండ్రులకు పంపుతామని ఒకరంటే.. పంపేది లేదంటూ మరొకరు గొడవకు దిగడం. ఒకరి తల్లిదండ్రులను మరొకరు సూటిపోటి మాటలతో విమర్శించడం. అభిప్రాయ బేధాలు కొంత మంది అత్తామామలు అదనపు కట్నం పేరుతో తరచూ వేధింపులకు గురిచేయడంతో దంపతుల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. పిల్లలను పాఠశాలలో చేర్పించే విషయంలోనూ ఇద్దరి మధ్య అభ్రిపాయ బేధాలు తలెత్తుతున్నాయి. భార్య ఏటీఎం కార్డులు తన వద్దే ఉండాలన్న భర్త వాదన కూడా కాపురాలు కూలిపోతుండటానికి కారణమవుతోంది. మెజార్టీ కేసుల్లో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా కేవలం పంతాలు, పట్టింపులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. – వేణుకుమార్, అడ్వకేట్ -
దైవచింతనతో మానసిక ప్రశాంతత
కేశంపేట: దైవ చింతన కలిగి ఉంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేర్వేరుగా పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోటీలను తిలకించారు. అనంతరం గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ... గ్రామస్తులు ఐకమత్యంగా వేడుకలు జరపడం ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో మొదటి బహుమతి వైపీఆర్ బుల్స్, ఎల్చల ప్రసన్నరెడ్డి, నాదర్గుల్(హైదరాబాద్), రెండో బహుమతి కుందురు రాంభూపాల్రెడ్డి, గంపరమన్నుదిన్నే(నంద్యాల), మూడో బహుమతి కేవీఆర్ బుల్స్, కటకం వెంకటేశ్వర్లు, ఇనిమెట్ల(పల్నాడు జిల్లా), నాలుగో బహుమతి షేక్ మహ్మద్, షేక్ ఫరీద్, బలికురవ(బాపట్ల జిల్లా), ఐదో బహుమతి పావులూరి వీరస్వామి చౌదరి, బలికురవ(బాపట్ల జిల్లా) ఎద్దులు పోటీల్లో ప్రతిభ చూపాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్రెడ్డి, నాయకులు వీరేష్, వెంకట్రెడ్డి, సురేష్రెడ్డి, జగదీశ్వర్, శ్రీధర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి కేశంపేటలో అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు -
యాప్రాల్లో దాడికి కుట్ర
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి చేసి, కస్టడీలో ఉన్న వీర రాఘవరెడ్డి విచారణ ముగిసింది. దాడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 14 రోజుల జుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ చివరిరోజైన గురువారం ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వీర రాఘవరెడ్డిని నగరంలోని యాప్రాల్కు తీసుకెళ్లారు. రంగరాజన్పై దాడికి ముందు రెండు రోజులపాటు రామరాజ్యం సైన్యంతో యాప్రాల్లోని ఓ ఇంట్లో వీర రాఘవరెడ్డి సమావేశం నిర్వహించాడు. అక్కడే దాడికి కుట్ర జరిగిందనే విషయాలను నిందితుడి నుంచి రాబట్టారు. రెండు రోజుల సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరిగింది? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. రామరాజ్య స్థాపనలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోసం పనిచేయాలని.. అందుకు సహకరించనివారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవరెడ్డి సైన్యంతో ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. అక్కడి నుంచి నిందితుడిని మణికొండలోని తన నివాసానికి తీసుకెళ్లి పరిశీలించారు. ఇంట్లో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అనంతరం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తలరించారు. డీసీపీ శ్రీనివాస్, వీర రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి కీలక విషయాలను రాబట్టారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి రంగరాజన్పై దాడి చేయడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. మూడు రోజుల విచారణలో తెలుసుకున్న కీలక విషయాలతో నివేదిక రూపొందించారు. గురువారం కస్టడీ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం శుక్రవారం కోర్టులో సమర్పించనున్నారు.దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ రామరాజ్య స్థాపనకు సహకరించని వారిని అడ్డు తొలగించాలని దిశానిర్దేశం పోలీసుల విచారణలో వెల్లడించిన వీర రాఘవరెడ్డి? ముగిసిన మూడు రోజుల కస్టడీ నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు -
‘చలో విద్యుత్ సౌధ’ భగ్నం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ గురువారం చేపట్టిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సౌధ సహా ఖైరతాబాద్, పంజాగుట్ట సర్కిళ్లలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముందుకు చేరుకున్న జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావును అరెస్ట్ చేయగా, కన్వీనర్ వజీర్ను ఎర్రగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ కో కన్వీనర్ గాంబో నాగరాజు సహా ఇతర ప్రతినిధులు సదానందం, నరేందర్, ఎల్లయ్యలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్ ఎదుట అదుపులోకి తీసుకున్నారు. -
టమాటా.. నష్టాల బాట!
చేవెళ్ల: ఆరుగాలం శ్రమించి మట్టి నుంచి సిరులు పండించే అన్నదాతలకు ధరల రూపంలో శరాఘాతం తప్పడం లేదు. ముఖ్యంగా టమాటా పండించే రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక నష్టాలను చవిచూస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రావటం లేదని వాపోతున్నారు. మార్కెట్లో అన్నదాతలకు కిలో రూ.2 నుంచి రూ.6 మించి పలకడం లేదు. ఈ ధరలతో లాభాల సంగతి దేవుడెరుగు కనీసం పెట్టుబడులైన మిగిలితే చాలని కర్షకులు భావిస్తున్నారు. పంట దిగుబడులు వచ్చిన రైతులు వాటిని పొలంలోనే తెంపకుండా వదిలేసి నిస్సహాయస్థితిలో కూరుకుపోతున్నారు. మూడు వేల ఎకరాల్లో సాగు జిల్లాలో దాదాపు 3 వేలకుపైగా ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. రెండు నెలలుగా మార్కెట్లో ధరలు తక్కువగా పలుకుతున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు రోజులు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గుదల కొనసాగుతుంది. మార్కెట్కు రైతులు తీసుకు వచ్చిన 25 కిలోల టమాటా బాక్స్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంది. ఈ ధరలతో తమకు గిట్టుబాటు కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఈ ధరలతో నష్టాలే తప్ప లాభాలు లేవంటున్నారు. ఒక్కోసారి ఆకాశాన్నంటే ధరలు ప్రస్తుతం కనిష్టం కూడా లేకపోవటం బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. ఏపీలోని చిత్తూరు మదనపల్లి నుంచి టమాటా దిగుబడులు పెద్ద మొత్తంలో వస్తుండటంతో ఇక్కడ ధరల తగ్గుదల ఉందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన రైతులు మార్కెట్లో టమాటా ధర లు ఎప్పుడైతే బాగుంటా యో అప్పుడే ఇతర కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మంచి ధరలు వస్తాయి. చేవెళ్ల మార్కెట్లోకి ఎక్కువగా టమాటా రైతులు వస్తుంటారు. రెండు నెలలుగా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాక్స్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు అమ్ము డు పోయింది. దీంతో రైతులు నష్టపోయారు. – రాఘవేందర్గుప్తా, మార్కెట్ ఏజెంట్, చేవెళ్ల పెట్టుబడులు రాలేదు ఎకరం పొలంలో టమాటా సాగు చేశాను. కూలీ, రవాణా ఖర్చులు అధికమయ్యాయి. ప్రస్తుతం ధరలు లేక పొలంలోనే వదిలేస్తున్నాం. దీంతో పంట ఎండిపోతుంది. నెలరోజులుగా ధరలు పెరుగుతాయని చూసినా ప్రయోజనం లేదు. పెట్టుబడులు కూడా రావటం లేదు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలి. – విఠలయ్య, రైతు, ఆలూరు రెండు నెలలుగా మార్కెట్లో తగ్గిన ధరలు కిలో రూ.2 నుంచి రూ.6 మాత్రమే పెట్టుబడులు సైతం రావడం లేదని రైతుల ఆవేదన -
‘ఉపాధి’ని వినియోగించుకోండి
కేశంపేట: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీలత సూచించారు. గురువారం మండల పరిధిలోని సంతాపూర్, బోధునంపల్లి, చౌలపల్లి, నిర్ధవెళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నర్సరీలు, ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉపాధి పనుల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూ చించారు. నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజు కూలీ రూ.300 పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట ఏపీడీ శ్రీచరణ్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ సంధ్య, ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఓ అజీజ్, టీఏ నిలకంఠబాబు తదితరులు ఉన్నారు. అంతకుముందు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ‘ఆరోగ్యం– పోషకాహారం’ శిక్షణ సదస్సులో పీడీ ప్ర సంగించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం(ఐబీ) స్వర్ణలత, ఏపీఎం భగవంతు, మండల మహిళా సమాఖ్య కార్యదర్శి సుగుణ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీలత పథకం కింద చేపట్టిన పనుల పరిశీలన -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
షాద్నగర్రూరల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విద్యార్థి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం విమర్శించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు అద్దెలు చెల్లించలేక, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఆర్తిక్, ఉపాధ్యక్షులుగా సుమయిర్, శివశంకర్, కార్యదర్శిగా శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా ఓంకార్, శివసాయి, గిరిధర్, సభ్యులుగా యశ్వంత్, ఆదిల్, ఆఫ్సన్, సల్మాన్, నెహ్రూ, వినయ్, అశోక్, సమీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను ప్రణయ్ అభినందించారు. ఎడ్యుకేషన్ మంత్రిని నియమించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ -
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
ఎంపీ డీకే అరుణ కొందుర్గు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్నగర్ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారంమండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు చేరువ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, వారిలో భక్తి భావం పెంపొందించేలాకృషి చేయాలని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ సింగ్ పాల్గొన్నారు. ‘ఫ్యూచర్’ భద్రతకు ఠాణా ఏర్పాటు స్థలం పరిశీలించిన డీసీపీ సునీతారెడ్డి యాచారం: ప్యూచర్ సిటీ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పోలీస్స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇందుకు మర్లకుంటతండా సమీపంలోని 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పక్కనే టీజీఐఐసీకి చెందిన మూడు ఎకరాల స్థలంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’ పేరుతో ఠాణా ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. బుధవారం ఆమె.. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏ మార్గం గుండా వెళ్తోంది. ప్రస్తుతం నిర్మించే ఠాణా పక్కనుంచి పీఎస్ పరిధిలోని గ్రామాలకు రోడ్డు ఏ విధంగాఉంటుంది. కొత్త రహదారుల ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని తదితర విషయాలను టీజీఐఐసీ, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ తేజంరెడ్డితదితరులు ఉన్నారు. శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్డీకాపూల్: ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. శివాజీ జయంతి వేడుకల్లో ఎంపీ -
నేల‘పాలు’
పోదాం పోలేపల్లి వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి.8లోuయాచారం: మండల పరిధి కుర్మిద్ద గ్రామంలో 90 మంది రైతులు 25 ఏళ్లుగా మదర్ డెయిరీకి పాలు పోస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం రెండు పూటలా 1,700 లీటర్ల పాలను సంస్థకు విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి గేదె పాలు లీటరు రూ.46, ఆవు పాలు లీటరుకు రూ.31 వరకు సంస్థ చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలలుగా రైతులకు డెయిరీ యాజ మాన్యం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. రూ.45 లక్షలకు పైగా.. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెల బిల్లులు రూ.45 లక్షలకు పైగానే అందాల్సిన ఉంది. వారం క్రితం బిల్లుల పెండింగ్పై రైతులు గ్రామంలోని మదర్ డెయిరీ సంస్థ కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ మహేందర్రెడ్డిని నిలదీశారు. ఇదే విషయాన్ని చైర్మన్ సంస్థ ఉన్నతాధికారులకు తెలిపారు. బిల్లులు అందజేయాలని కోరారు. అయినప్పటికీ.. సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం డెయిరీ ఎదుట పాలు పారబోసి నిరసన వ్యక్తంచేశారు. పశువులను సాకడం కోసం రూ.వేలు ఖర్చు చేసి దాణా, పశుగ్రాసం కొనుగోలు చేసి, నెల మొత్తం కష్టపడితే బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పశు పోషణతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో బిల్లులు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డెయిరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇబ్బంది పెడుతున్నారు రెండు నెలలుగా సంస్థ రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. మొ త్తం రూ.45 లక్షలకు పైగా రావలసి ఉంది. రైతులు పదేపదే అడుగుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. 25 ఏళ్లుగా వారు పాలు పోస్తున్నారు. కానీ ఎప్పు డూ ఇలా జరగలేదు. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. – మహేందర్రెడ్డి, డెయిరీ చైర్మన్, కుర్మిద్ద రూ.లక్షన్నర రావాలి మదర్ డెయిరీకి నిత్యం 60 లీటర్ల పాలను విక్రయిస్తాను. నెలకు రూ.70 వేల బిల్లు అందాల్సి ఉంది. రెండు నెలల నుంచి బిల్లు రావటం లేదు. రూ.లక్షన్నరకు పైగా ఆగిపోయింది. నెలనెలా డబ్బులు రాకపోవడంతో పశుదాణా, గ్రాసం ఖర్చులు, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. – గొట్టే అంజయ్య, రైతు కుర్మిద్ద మదర్ డెయిరీ సంస్థ నిర్వాకం వలన పాడి రైతులు గోస పడుతున్నారు.నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో.. డబ్బుల కోసం అధికారులను ప్రాధేయ పడుతున్నారు. అయినాస్పందన కానరాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలను పారబోసి చేసి నిరసన తెలిపారు. రెండు నెలలుగాఅందని పాల బిల్లులు స్పందించని డెయిరీ యాజమాన్యం ఆందోళన వ్యక్తంచేసిన రైతులు దాణా కొనలేక పోతున్నామంటూ ఆవేదన -
దేశానికే ఆదర్శం మన పల్లెలు
కడ్తాల్: పల్లెప్రగతితో తెలంగాణ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని, దేశానికే మన గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ జాతీయ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలో బీహార్ ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్రంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. గత పంచాయతీ పాలకవర్గంలో.. జీపీల అభివృద్ధి, సమస్యలు, సొంత ఆదాయ వనరుల పెంపు, పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనుల గురించి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, తడిపొడి చెత్త వేరుచేసే విధానం, రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. సమష్టి నిర్ణయాలతో పల్లెలు అభివృద్ధిలో ముందున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా బీహార్ ప్రతినిధులు సంతృప్తి చెందారని, అభినందించి ప్రసంశించారని నర్మింహ్మారెడ్డి తెలిపారు. సమావేశంలో బీహార్ ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖేశ్సింగ్, స్మితా వర్మ, సంజయ్కుమార్, ఊర్మిలదేవి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంఘం రాష్ట్రమాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి జీపీల అభివృద్ధిపై బీహార్ ప్రజ్రాతినిధులు, అఽధికారులకు అవగాహన -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
షాద్నగర్రూరల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విద్యార్థి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం విమర్శించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు అద్దెలు చెల్లించలేక, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఆర్తిక్, ఉపాధ్యక్షులుగా సుమయిర్, శివశంకర్, కార్యదర్శిగా శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా ఓంకార్, శివసాయి, గిరిధర్, సభ్యులుగా యశ్వంత్, ఆదిల్, ఆఫ్సన్, సల్మాన్, నెహ్రూ, వినయ్, అశోక్, సమీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను ప్రణయ్ అభినందించారు. ఎడ్యుకేషన్ మంత్రిని నియమించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ -
కాంగ్రెస్ నుంచి ‘కారు’ గూటికి
కడ్తాల్: మండల పరిధిలోని గోవిందాయిపల్లి తండాకు చెందిన పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో దశరథ్నాయక్ వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలన నచ్చకనే పార్టీ మారుతున్నామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో గణేశ్, జైపాల్, గోపాల్, మునీందర్, దశరథ్, నరి, మల్లేశ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు లచ్చిరామ్నాయక్, ప్రియా రమేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు సంతోశ్కుమార్, గోపాల్, అంజి, హంజద్, శివరాం, దాస్య, గోపాల్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యం
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ.250 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణం చేపట్టామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిపైనే తమ దృష్టి అని పేర్కొన్నారు. తలకొండపల్లి మండల పరిధి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. మండల కేంద్రంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, అంతారంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, వెంకటాపూర్లో రూ.25 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, వెల్జాలలో రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. విద్య, వైద్యం, రవాణా అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని, ప్రజాపాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సర్కార్పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని వెల్లడించారు. పీసీసీ కిసాన్సెల్ రాష్ట్ర నాయకుడు మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుఅంజయ్య, అజీం, వెంకట్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, నర్సింహ ఉన్నారు. రూ.250 కోట్లతో బీటీరోడ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
పులందరివాగు కబ్జా నిజమే
ఇబ్రహీంపట్నం రూరల్: పులందరి వాగు కబ్జా నిజమేనని అధికారులు స్పష్టంచేశారు. ‘పూడ్చేస్తాం.. ఆక్రమిస్తాం’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. సర్వే చేపట్టాలని ఆదేశించడంతో బుధవారం ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారుల బృందం సంయుక్తంగా సర్వే చేసింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్గూడలో పట్టణానికి ఆనుకొని ఉన్న పులందరివాగును నగరానికిచెందిన ఓ బడా వ్యాపారి కాల్వను పూడ్చివేసి, బఫర్ను కబ్జా చేసి మట్టి పోసి చదును చేశాడు. ఇదే విషయమై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిరోజులుగా భారీ ఎత్తున మట్టి పోయడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, సర్వేయర్ సాయికృష్ణారెడ్డి, ఆదిబట్ల టౌన్ ప్లానింగ్ అధికారి అబీబ్ ఉన్నీసాబేగం, ఇరిగేషన్ ఏఈ హరితలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 500 మీటర్లకు పైగా ఉన్న కాలువను కబ్జా చేసినట్లు గుర్తించారు. కాల్వను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. బఫర్తో పాటు కాలువలో పోసిన మట్టిని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, రెండు రోజుల్లో హద్దులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘సాక్షి’ కథనంతో వాగుకు మోక్షం లభించిందని కితాబిచ్చారు. వెల్లడించిన అధికారులు -
లారీ, ట్రాక్టర్ ఢీ నేషనల్ హైవేపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయిన లారీ.. అదుపు తప్పి అదే ట్రాక్టర్ను ఢీ కొట్టింది.
8లోuగ్రేటర్లో విద్యుత్ డిమాండ్ ఇలా తేదీ మెగావాట్లు మిలియన్ యూనిట్లు 10 3310 66.33 11 3365 67.09 12 3437 69.18 13 3455 69.04 14 3353 68.08 15 3203 64.87 16 2899 60.06 17 3358 66.07 18 3423 70.01 -
దళితవాడకు దారి!
దేవరయాంజాల్లో ప్రహరీ తొలగించిన హైడ్రా సాక్షి, సిటీబ్యూరో: ఓ కాలనీ వెంచర్ నిర్వాహకులు దళితవాడకు వెళ్లే దారిని మూసేశారు. దీనిపై బాధితుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని (హైడ్రా) ఆశ్రయించారు. దీని పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు బుధవారం ప్రహరీ తొలగించి, దళితవాడకు సంబంధించిన దారిని పునరుద్ధరించారు. శామీర్పేట్ మండలం తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజాల్లో ఇది చోటు చేసుకుంది. ఒకప్పుడు ఈ దళితవాడకు వెళ్లేందుకు నలువైపుల నుంచి దారి ఉండేది. అక్కడ 1985లో తిరుమల కాలనీ పేరుతో ఓ వెంచర్ వచ్చింది. వీరు ఆ దారులు మూసేయడంతో దళితవాడకు చెందిన వారంతా కేవలం చిన్న బాటకు పరిమితమయ్యారు. దీనిపై వాళ్లు గతంలో పలుమార్లు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ నెల 17న హైడ్రా ప్రజావాణిలో కమిషనర్ ఏవీ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. 2022 ఫిబ్రవరిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ కమిషన్ ఆదేశాలను హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతానికి దారులు మూసుకుపోవడంతో కనీసం అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని, తాము కూడా చుట్టూ తిరుగుతూ కేవలం ద్విచక్ర వాహనాలపై మాత్రమే రాకపోకలు సాగించగలుగుతున్నామని హైడ్రాకు విన్నవించారు. ఈ ఫిర్యాదుకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన కమిషనర్ ఏవీ రంగనాథ్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ప్రహరీ తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది బుధవారం తిరుమల వెంచర్ నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. దీంతో తమ వాడకు దారి దొరికిందని దళితవాడకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గర్భిణీ సీ్త్రలతో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని తాము బయటకు మోసుకువచ్చి అంబులెన్సు ఎక్కించేవారమని, ఇప్పుడు దారులు తెరుచుకోవడంతో ఉపశమనం లభించినట్లు పేర్కొంటున్నారు. -
భానుడు భగ్గుమంటున్నాడు. తాజాగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు నమోదు కాగా.. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉక్కపోతనుంచి ఉపషమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు పనిచెప్పారు. దీంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. సగటున విద్యుత్ డిమాండ్ 60 మ
● ఉక్కపోతతో ప్రజలు విలవిల ● ఆన్ అయిన ఏసీలు, కూలర్లు ● పెరిగిన విద్యుత్ వినియోగం ● సగటున 70 మిలియన్ యూనిట్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో బుధవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు, కనిష్టంగా 21.3 డిగ్రీలు నమోద య్యాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలను ఆన్ చేస్తున్నారు. మొన్నటి వరకు మూలన పడినకూలర్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఇంట్లోనే కాదు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్లో ఉండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగాపెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి రెండో వారం వరకు గ్రేటర్లో రోజు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 70 ఎంయూ దాటింది. అత్యవసరమైతేనే.. ఎల్సీలకు అనుమతి విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ చర్యలు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజు లైన్లను సరి చేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పక్కగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వర్క్స్ నిర్వహిస్తుంది. వారం పది రోజుల్లో వీటిని కూడా పూర్తి చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్, రెండో మూడో వారంలో టెన్త్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియరెన్స్(ఎల్సీ)లకు స్వస్తి చెప్పింది. అత్యవసరమైతే తప్ప.. ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫిబ్రవరిలో.. ఏప్రిల్ డిమాండ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ట (3435 మెగావాట్లు)డిమాండ్.. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే(3455 మెగావాట్లు) నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మే చివరి నాటికి రోజు సగటు డిమాండ్ 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేస్తోంది. ప్రత్యమ్నాయ మార్గాలకు ప్రణాళికలు 60 శాతానికి మించి లోడు ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ప్రత్యమ్నాయ మార్గాలకు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 571 (33కేవీ) సబ్ష్టేషన్లు ఉండగా, వీటి సామర్థ్యం 9,675 ఎంవీఏగా ఉంది. కొత్తగా మరో 213(33/11 కేవీ) సబ్స్టేషన్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ఆయా సబ్స్టేషన్ల నిర్మాణ పనులు అప్పగించి, నిర్దేశిత లక్ష్యం లోగా వాటిని పూర్తి చేయించాలని డిస్కం నిర్ణయించింది. అంతేకాదు కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, ఏడు వేల కిలో మీటర్ల 11 కేవీ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎండీ ముషారఫ్ ఫరూఖీ రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఈలు, సీజీఎంలు, డీఈలతో సమావేశాలు ఏర్పాటు చేసి, లైన్ల పునరుద్ధరణ, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, కూకట్పల్లి, గండి మైసమ్మ, అమీన్పూర్లలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, గత అనుభవాలనుదృష్టిలో పెట్టుకుని రూ.212.20 కోట్లతో బౌరంపేటలో కొత్తగా నిర్మించిన 220/132 కేవీ సబ్స్టేషన్ను ఈ నెలాఖరు లోగా ఛార్జ్ చేయనున్నారు. ఫైళ్ల పెండింగ్పై సీఎండీ సీరియస్ సైబర్సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో కొత్త కనెక్షన్ల జారీకి సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉండటాన్ని సీఎండీ ఫారూఖీ సీరియస్గా తీసుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా కనెక్షన్లను ఎందుకుపెండింగ్లో పెట్టాల్సి వచ్చిందని నిలదీసినట్లు తెలిసింది. నిర్దేశించిన గడువులోగా కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని కొంత మంది ఇంజినీర్లు తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితిలో మార్పు రాకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలిసింది. -
‘మీ సేవ’లో సమస్యలు
మీ సేవా కేంద్రాల్లో చెల్లించే రుసుముకు ఆన్లైన్ పేమెంట్ తప్పనిసరి చేయడంతో ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ఫోన్పే విధానంపై అవగాహన లేని వారు ఇతరులను ఆశ్రయించి అవస్థలపాలవుతున్నారు. మంచాల: ప్రభుత్వ నుంచి ఏ సర్టిఫికెట్ కావాలన్నా మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్, రెవెన్యూ, జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లను సైతం ప్రభుత్వం మీ సేవా కేంద్రాల నుంచే అందజేస్తోంది. ఆన్లైన్ విధానంలో నిర్ణీత కాలంలో ప్రజలకు సర్టిఫికెట్లు అందజేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు మండల కేంద్రంతో పాటుగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేయించింది. పాత పద్ధతికి మంగళం గతంలో తమ వద్దనున్న ఆధారాలతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా నిర్వహకులకు రుసుమును నగదు రూపంలో చెల్లించేవారు. దరఖాస్తులు చేసుకునే సమయంలో నిర్వహకులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు నెలలుగా ఆన్లైన్ విధానం అమలు చేస్తోంది. దీంతో రైతులు, స్మార్ట్ ఫోన్ వాడని వారు.. ఫోన్పే, పేటీఎం, గూగుల్పే లేని వారు స్కానింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అందుబాటులో ఉన్నవారిని బ్రతిమిలాడుతూ.. నగదు ఇస్తాం.. స్కాన్ చేసి సాయం చేయాలని కోరుతున్నారు. స్కానర్తో పాటుగా తమలాంటి వారి కోసం నగదు రూపంలోనూ రుసుం స్వీకరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై మీ సేవా నిర్వహకులను కోరగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడమే తమ విధి అని సమాధానం ఇచ్చారు. ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆన్లైన్ విధానంలోనే రుసుము చెల్లింపులకు అనుమతి వెసులుబాటు కల్పించాలి ఈ మధ్య కాలంలో కుల, ఆధాయ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో స్మార్ట్ ఫోన్ వాడని తమలాంటి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇతరులను బత్రిమిలాడుకుని స్కాన్ చేయించుకుంటున్నాం. దీన్ని నుంచి తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. – పాండునాయక్, రైతు, ఎల్లమ్మతండా రుసుము చెల్లించాల్సి ఉంటుంది మాకు మీ సేవా నిబంధనలు తెలియవు. అవి నిర్వహకులకు మాత్రమే అవగాహన ఉంటుంది. కొంత రుసుము మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించాలనేది నిర్వహకులను అడిగి తెలుసుకుంటాం. – ఎంవీ ప్రసాద్, తహసీల్దార్, మంచాల -
ఆరె కటిక సంఘం అధ్యక్షుడిగా సుభాశ్
ఆమనగల్లు: సూర్యవంశ ఆరెకటిక సంఘం మండల అధ్యక్షుడిగా కమ్లేకర్ సుభాశ్ను ఎన్నుకున్నారు. బుధవారం పట్టణంలో సంఘం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీ నియామకం చేపట్టారు. ఉపాధ్యక్షుడిగా యాదీలాల్ను ఎన్నుకున్నారు. అనంతరం సుభాశ్, యాదీలాల్ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రమేశ్, అమర్సేన్, నిరంజన్, శ్రీను, శంకర్, సుమన్, బబ్లూ, కుమార్, శ్రీను, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు ఏడీఏగా శోభారాణి ఆమనగల్లు: ఆమనగల్లు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా కె.శోభారాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఆదిలక్ష్మి జిల్లాలోని రాంజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రానికి బదిలీ అయ్యారు. కాగా హైదరాబాద్లోని హాకా సంస్థలో పనిచేస్తున్న శోభారాణి బదిలీపై ఏడీఏగా ఆమనగల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఏడీఏను మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆర్థిక సాయం అందజేత అబ్దుల్లాపూర్మెట్: బాటసింగారం రైతు సేవా సహకార సంఘం సభ్యుడు, అనాజ్పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల చిన్న రాజయ్య ఫిబ్రవరి 12న మృతిచెందగా, సహకార సంఘం తరపున మృతుడి కుటుంబానికి అందించే రూ.25వేల ఆర్థిక సాయాన్ని మంగళవారం సంఘం కార్యాలయంలో చైర్మన్ చేగూరి భరత్కుమార్ మృతుడి భార్య ఏర్పుల యాదమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగమయ్య, మేనేజర్ ఐలేష్యాదవ్, మాజీ వైస్ చైర్మన్ సతీశ్కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి తుర్కయంజాల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వేణుగోపాల స్వామి ఆలయం చైర్మన్ కె.రాఘవేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొహెడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రూ.30వేలు వెచ్చించి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాఘేవందర్రెడ్డిని పాఠాశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతిబాయ్, ఉపాధ్యాయులు రాజు, లక్ష్మణ్, గోపాల్రెడ్డి, కొండయ్య, ఉమామహేశ్వరి, రాధా మాధవి, గణేశ్, అమర్సింగ్, చంద్రమోహన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వార్షిక అడ్వైజరీ కౌన్సిల్ అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని గుంతపల్లిలోని అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం అవంతి గ్రూప్స్ వార్షిక అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తెంశెట్టి శ్రీనివాస్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, అవంతి గ్రూప్స్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ టీహెచ్ హనుమాన్ చౌదరి, జేఎన్టీయూ హైదరాబాద్ మాజీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహిద్, వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. -
బీఆర్ఎస్వి దొంగ దీక్షలు
● ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు గులాబీ నేతలకు లేదు ● యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్ కడ్తాల్: రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని.. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుంటే రైతుదీక్షల పేరిట బీఆర్ఎస్ నేతలు దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను కలవడానికి ఇష్టపడని నాయకులకు అధికారం పోగానే ప్రజలు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను, మాటలను ప్రజలు చీత్కరించుకుంటున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి రెండు సార్లు అధికారం చేపట్టినా రూ.లక్ష కూడా మాఫీ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నానరు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పేరిట ఎకరాకు రూ.12వేలు రైతుల ఖాతాలోనే జమ చేస్తుందన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇప్పటికై నా బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాబుద్దీన్, రవి, భానుకిరన్, నరేశ్, శ్రీకాంత్, సాయి, రమేశ్, మహేశ్ తదితరులు ఉన్నారు. -
లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించండి
ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్ మంచాల: గతంలో గుర్తించిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు కంభాలపల్లి భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లింగంపల్లి, నోముల, మంచాల గ్రామాలకు చెందిన లబ్ధిదాలతో కలిసి మంచాల మండల కార్యాలయంలో సూపరింటెండెంట్ మహ్మద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. లింగంపల్లి గేట్ వద్ద గత ప్రభుత్వం 96 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందని.. గ్రామ సభలు పెట్టి లాటరీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. 16 నెలలు అవుతుతున్నా.. ప్రభుత్వం మారినా లబ్ధిదారులకు మాత్రం ఇళ్లు అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇళ్ల పంపిణీ చేపట్టాలని కోరారు. -
గ్రామాలు ప్రశాంతతకు నిలయాలు
యాచారం: గ్రామాలు ప్రశాంతతకు నిలయాలని.. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణం రాజు అన్నారు. బుధవారం ఠాణా పరిధిలోని కుర్మిద్దలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో కొత్త వ్యక్తుల సంచారం.. చోరీలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్లో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని.. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తేజంరెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు -
ఫంక్షన్హాలులో ఎలాంటి నాలా లేదు
ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనంద్రెడ్డి బడంగ్పేట్: పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్హాలును ఎలాంటి నాలాను ఆక్రమించి నిర్మించలేదని, కబ్జాలు చేసి నిర్మించారన్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీటీసీ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దబావి ఆనంద్రెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేటలోని గార్డెన్లో నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో జీపీ అనుమతితో మల్లారెడ్డి పేరుతో ఫంక్షన్హాల్ నిర్మించి 2009లో ప్రారంభించామన్నారు. గాంధీనగర్ దగ్గర ఉన్న తుర్కదానికుంట నుంచి వరదనీరు, వాననీరు పొలాల గుండా పారుతూ బడంగ్పేట్ ప్రధాన రహదారిలో నిర్మించిన కల్వర్టు కింద మత్తడి దాటుతూ కాశీబుగ్గ ఆలయం మీదుగా శివనారాయణపురం కాలనీ దాటుతూ పెద్ద చెరువుకు చేరుకునేది. ఈ కాలువ చాలా సంవత్సవాలు కొనసాగింది. రెండేళ్ల క్రితం వరద కాలువను మట్టితో నింపేయడం కారణంగా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఆ వరద కాలువను బీజేపీ నాయకులు మట్టిపోసి మూసివేశారని ఆరోపించారు. శివసాయినగర్ కాలనీకి చెందిన సెప్టిక్ట్యాంక్ను కూడా బీజేపీ నాయకులు మట్టితో మూసివేయడంతో కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం సైకిల్పై పాలు అమ్మిన అందెల శ్రీరాములు కల్వర్టు మీద నుంచి రోజు వచ్చేవాడన్న సంగతి మరిచిపోయాడా అని నిలదీశారు. బీజేపీ నాయకులే మట్టిని పోసి, తిరిగి వారే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. అందెల శ్రీరాములు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే సబితారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
సంఘం అభివృద్ధి అభినందనీయం
హిమాచల్ప్రదేశ్ బృందం కితాబు తుర్కయంజాల్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అపెక్స్ బ్యాంకు అధ్యక్షులు, డైరక్టర్లు, సీనియర్ సిబ్బంది బృందం బుధవారం తుర్కయంజాల్లోని రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సంఘం అభివృద్ధికి చేపట్టిన చర్యలు, పని విధానాన్ని, రైతుల కోసం చేపడుతున్న చర్యలపై వివరించారు. బీఎన్రెడ్డి నగర్, కొహెడలోని బ్రాంచి కార్యాలయాలు, గోదాంలను పరిశీలించారు. సంఘం అభివృద్ధిని చూసి సత్తయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సీటీఐ గౌతమ్, డీసీసీబీ ఏజీఎం శైలజ, హిమాచల్ ప్రదేశ్ డెలిగేట్స్ జీబీ శర్మ, శక్తి చంద్ ఠాకూర్, ప్రేమ్ కంషల్, సంఘం సెక్రటరీ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీనగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
హస్తినాపురం: ఎల్బీనగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. హస్తినాపురం డివిజన్ సప్తగిరిహిల్స్ కాలనీలో రూ.65 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను బుధవారం ఆయన స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, రేవంత్రెడ్డి ప్రభుత్వంలో నిధులు మంజూరుచేసి అభివృద్ధి చేస్తుంటే రాజకీయాలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు, ఆక్రమణలతోనే ఇన్నాళ్లు పాలన సాగించిన కొందరు నాయకులు అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో సప్తగిరిహిల్స్ కాలనీవాసులకు రోడ్లు, డ్రైనేజీ కోసం అడిగితే నిధులను మంజూరు చేయకుండా ప్రజాప్రతినిధులం అని చెప్పుకునే నాయకులు ఇబ్బందులు పెట్టారని కానీ తమ ప్రభుత్వం కాలనీల్లోని సమస్యలు తీర్చేందుకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్యాదవ్, నాయకులు శశిధర్రెడ్డి, నర్సింహ్మయాదవ్, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వేణుగోపాల్యాదవ్, డేరింగుల కృష్ణ, దాము మహేందర్యాదవ్ పాల్గొన్నారు. -
ఉద్యోగులకు బదిలీలు సహజం
కడ్తాల్: ఉద్యోగులకు బదిలీలు సహజమని బీఆర్ఎస్ నాయకుడు చేగూరి మహేశ్ అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రాధిక విజయ డెయిరీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం మైసిగండిలో ఆమెకు వీడ్కోలు సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. మేనేజర్గా ఆమె రైతులకు అందించిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతయని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ పనితీరు కనబర్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. అనంతరం మేనేజర్ రాధిక దంపతులకు మెమెంటో అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలశీతలీకరణ సిబ్బంది, పాడి రైతులు రంగయ్య, మోహన్రెడ్డి, నర్సింహ, శ్రీనివాస్, రామకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దిల్సుఖ్నగర్: ఆర్కేపురం డివిజన్లోని కుర్తాళ పీఠం శ్రీ ప్రత్యంగిరా దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్తాళ పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార పసుపు కుంకుమ అలంకరణలో దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో మహిళల సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో మునిపల్లె శ్రీనివాస్, మునిపల్లె సువర్ణ లత, విఠల్ శర్మ, హేమంత్ శర్మ, శ్రీపతి, అన్నపూర్ణ, హేమ, దేవి, హిమబిందు పాల్గొన్నారు. నేడు అన్నాభిషేకం.. దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యంగిరా అమ్మావారికి అన్నాభిషేకం, పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్ తెలిపారు. -
తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలి
నాగోలు: తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మాజీ పీఏ దేవిరెడ్డి సతీష్రెడ్డి మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియా వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని నేను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానన్నారు. రాజకీయాలలోనే ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డి దగ్గర గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న నేను రాజగోపాల్ రెడ్డి కానీ.. నా కుటుంబానికి కానీ మచ్చ తెచ్చే పని చెయ్యలేదన్నార. కొన్ని సోషల్ మీడియా వేదికలు బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేసిన వార్తలతో నేను నా కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నామన్నారు. -
కులగణన రీసర్వేలో అందరూ పాల్గొనండి
దిల్సుఖ్నగర్: కులగణ రీసర్వేలో అందరూ పాల్గొనాలని బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్కేపురం డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి గతంలో కులగణనలో పాల్గొనని వారిని కలిసి ఈ సారి వివరాలు ఇవ్వాలని కోరారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కొంత మంది ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదన్నార. కులగణన సర్వేను సమగ్రంగా నిర్వహించేందుకు బీసీ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున్న గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు బండి మధుసూదన్ రావు, గట్ల రవీంద్ర, తల్లాటి రమేష్ నేత, శివ, ధనరాజ్ గౌడ్, గుండా నరసయ్య, జల్లా జగన్నాథం, దోర్నాల చంద్రమౌళి, దుర్గాప్రసాద్, ఆనంద్ కుమార్, ఇమ్రాన్, శ్రీశైలం పాల్గొన్నారు. -
కేటీఆర్కు ఘన స్వాగతం
కందుకూరు: ఆమనగల్లులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డికి మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి జేసీబీ యంత్రాలతో గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు చౌరస్తాతో పాటు దెబ్బడగూడ గేట్ వద్ద పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన వెంట రైతుదీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి.లక్ష్మినర్సింహారెడ్డి, గణేశ్రెడ్డి, కార్యదర్శి మహేందర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దొంగల చేతివాటం కందుకూరు చౌరస్తాలో కేటీఆర్కు స్వాగతం పలికే పనుల్లో నాయకులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. మురళీనగర్ గ్రామానికి చెందిన బాల్రాజ్ జేబులో నుంచి రూ.25 వేలు తస్కరించారు. దీంతో అతను కార్యక్రమం అయిన తర్వాత చూసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తుక్కుగూడ ఔటర్ వద్ద.. తుక్కుగూడ: ఆమనగల్లులో మంగళవారం చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తుక్కుగూడ ఔటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జల్లాల లక్ష్మయ్యయాదవ్, మాజీ కౌన్సిలర్ రవినాయక్, సుమన్, లావణ్య, నాయకులు తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మన్సూరాబాద్: డివిజన్లో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సూచించారు. హయత్నగర్ పరిధి కొలను శివారరెడ్డినగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ లెవల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. కాలనీవాసులు అభివృద్ధి పనులను పర్యవేక్షించుకోవాలని కోరారు. కాలనీలో మిగిలి ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొలను నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాదిరెడ్డి, మధుసూధన్, వెంకటేష్ నాయకులు పాతూరి శ్రీధర్గౌడ్, కడారి యాదగిరియాదవ్ పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
లింగోజిగూడ: రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి హెచ్చరించారు.కర్మన్ఘాట్ ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్ల సముదాయం వద్ద రోడ్డును కబ్జాచేసి చెట్లు పెట్టేందుకు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం స్థానికులు కార్పొరేటర్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు సహకారంతో నిర్మాణాలను తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కర్మన్ఘాట్ ప్రధాన రహదారిలో భవిష్యత్కు అనుగుణంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారని అనుమతుల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ దీక్షలు
ఆమనగల్లు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను వరుసగా అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ మిత్తీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాడ్గుల ప్రాంతంలో రేవంత్రెడ్డికి 1,500 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించాలని సవాలు విసిరారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల పాపం గత సర్కార్దేనని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు జగన్, బిచ్చానాయక్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరి శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు ధనుంజయ, ఖలీల్, అలీం, ఖాదర్, ఖరీం తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ -
హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే చర్యలు
తుక్కుగూడ: మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఏ.వాణి పేర్కొన్నారు. మంగళవారం పుర కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారిపై మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా భవనాలపై ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హైడ్రా జోనల్ ఇన్చార్జి బి.సుదర్శన్రెడ్డి ఇటీవల తుక్కుగూడలో పర్యటించి వీటిని గుర్తించారన్నారు. హైడ్రా ఆదేశాల మేరకు వీటిని తొలగించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వాణి -
చాక్లెట్లు పంచితే హెచ్ఎంను సస్పెండ్ చేస్తారా?
హస్తినాపురం: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నందనవనం కాలనీలో రోడ్డుపై కేక్కట్ చేసి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేస్తే ఆ పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆండోజు సత్యంచారి, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ ప్రశ్నించారు. మంగళవారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ వ్యక్తిగతంగా చాలా మంచివారని ఆమె పీఏ చంద్రశేఖర్రెడ్డి కావాలని డివిజన్లో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నారగోని శ్రీనివాస్యాదవ్, మాజీ అధ్యక్షుడు గోదల రఘుమారెడ్డి, సయ్యద్, రమావత్ శ్రీనివాస్నాయక్ పాల్గొన్నారు. -
కలగానే బస్టాండ్!
కడ్తాల్: మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. బస్ షెల్టర్లు ఒక చోట ఉండగా.. బస్సులు మరో చోటు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రధాన రహదారి పక్కన లయన్స్క్లబ్ వారు ఏర్పాటు చేసిన చిన్న బస్షెల్టర్ ఉండేది. పదిహేను సంవత్సరాలుగా ప్రయాణికులను ఎండా, వానల నుంచి రక్షించింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దీన్ని కూల్చేయడంతో ప్రస్తుతం నిలువ నీడ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు రెండు చోట్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినా, బస్సులను ఇక్కడ నిలపడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి నిత్యం అనేక మంది వచ్చివెళ్తున్నారు. ఇలాంటి వారికి సేదతీరేందుకు కనీసం నీడ కూడా కరువైంది. గతంలో రోడ్డు విస్తరణ చేపట్టక ముందు, బస్సుల కోసం వేచి ఉండటానికి ప్రధాన రహదారి పక్కన కనీసం చెట్లయినా ఉండేవి. పనుల్లో భాగంగా వీటిని తొలగించడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఎండ, దుమ్ములో బస్సుల కోసం నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కడ్తాల్ గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డును నిర్మించారు. నిత్యం రద్దీ మండల కేంద్రం మీదుగా నిత్యం వందలాది బస్సులు తిరుగుతుంటాయి. వీటిని బస్ షెల్టర్ల వద్ద కాకుండా రోడ్డు పక్కనే నిలపడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి రోడ్డు పక్కన నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దుకాణ సముదాయల ఎదుట నిలబడితే యజమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన చోట బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కడ్తాల్లో నిలువ నీడ కరువు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు రోడ్డుపైనే వాహనాల నిలుపుదల తరుచూ ట్రాఫిక్ సమస్యలు -
హామీలు అమలు చేయాలి
ఇబ్రహీంపట్నం: అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల నాయకుడు మైసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 పెన్షన్ ఇవ్వాలని, తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి అబ్దుల్లాపూర్మెట్: నైపుణ్యాలపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీఎల్ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్, పీఎం ఇంటర్న్షిప్ ప్రాజెక్టు ప్రాంతీయ నోడల్ ఆఫీసర్ అనుముల శ్రీకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ క్యాంపస్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై మంగళవారం ఒకరోజు అవగాహన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కే రుస్తుం పాల్గొన్నారు. ఉపాధి సమస్యలపై ఆరా యాచారం: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కీజ్గూడ, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో మంగళవారం కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డులున్న ప్రతి కూలీ ఉపాధి పనులకు రావాలని సూచించారు. నింబంధనల ప్రకారం పనులు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి ఎండిపోకుండా సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ లింగయ్య ఉన్నారు. రైతు దీక్షకు తరలిన నాయకులు మాడ్గుల: కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులో నిర్వహించిన రైతు దీక్షకు మాడ్గుల నుంచి తరలివెళ్లారు. వీరిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్ రెడ్డి, డైరెక్టర్ రాజావర్ధన్రెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, శంకర్నాయక్, విజయ్, రాజు, నిరంజన్, తదితరులు ఉన్నారు. హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలి నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ స్టూడెంట్ హాస్టల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్, ఇతర సభ్యులు మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (210) కాలేజీ హాస్టల్స్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ (670) స్యూల్ హాస్టల్స్లలో ఉన్న సమస్యలపై గతంలో జీవోలను ప్రభుత్వం ద్వారా సాధించడం జరిగిందని కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. గతంలో జారీ చేసిన జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేడు రైతుబజార్కు సెలవు దిల్సుఖ్నగర్: సరూర్నగర్ రైతు బజార్కు బుధవారం సెలవు ఉన్నందున ఎలాంటి క్రయ విక్రయాలు ఉండవని ఈఓ స్రవంతి తెలిపారు. ప్రతి నెల మూడో బుధవారం రైతు బజార్కు సెలవు ఉంటుందని గురువారం యథావిధిగా క్రమవిక్రయాలు కొనసాగుతాయన్నారు. -
రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నాం
మన్సూరాబాద్: హిందూ దర్మలో విద్వేషానికి తావులేదని, చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూస్ ఫర్ పూరలిటీ అండ్ ఈక్వాలిటి జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి అన్నారు. ఎల్బీనగర్ సూర్యోదయనగర్కాలనీలోని జైభారత్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం వేదవాదం–శాంతినాదం వేద సూక్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుళత్వానికి, సమానత్వానికి, ద్వేష రహిత్యానికి హిందూ ధర్మం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. రంగారాజపై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయశంకర్స్వామి, రజనీకుమార్, యడ్లపల్లి మోహన్రావు, త్రినాథ్, ఉమారాణి, నర్సింహాచార్యులు, సాధు త్రినాథ్, సుబ్రహ్మణ్యశర్మ, లక్ష్మినారాయణశర్మ, శరణ్శర్మ, దత్తాత్రేయశర్మ, గౌరీశంకర్శర్మ, వసుధాశర్మ పాల్గొన్నారు. -
మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్లాంటేషన్ సూపర్వైజర్ సక్కుబాయి సూచించారు. మంగళవారం ముకునూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఆమె మొక్కలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు ఎండాల తీవ్రత పెరుగుతున్నందున నర్సరీల్లో పనిచేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం విధిగా నీళ్లు పట్టాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పెంచుతున్న మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లింగం, నర్సరీ సంరక్షకుడు రాములు ఉన్నారు. డీఆర్డీఏ ప్లాంటేషన్ సూపర్వైజర్ సక్కుబాయి ముకునూర్ నర్సరీలో మొక్కల పరిశీలన -
కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితి లేదు
యాచారం: రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్థ్యావత్ రాజునాయక్ తల్లి రూప్లీబాయి మొదటి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన బొల్లిగుట్టతండాకు చేరుకుని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నందివనపర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజల మెప్పు పొందలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం చతికిల పడిందని ఎద్దేవా చేశారు. కులగణనలో అలసత్వం వహించొద్దు చాదర్ఘాట్: కులగణన సర్వేలో ఎన్యుమరేటర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీ జయంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే రెండో దఫాలో మలక్పేట్ సర్కిల్లో 5307 కుటుంబాల సర్వే చేయాల్సి ఉందన్నారు. గత మూడు రోజుల నుంచి దాదాపు 972 కుటుంబాల వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోని పూర్తిస్థాయిలో సర్వే చేస్తామన్నారు. మలక్పేట్లో అధికారులపై విజిలెన్స్ విచారణ చాదర్ఘాట్: మలక్పేట్ సర్కిల్–6లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై గత నెల రోజుల నుంచి విచారణ పేరుతో హడావుడి నెలకొంది. టౌన్ప్లానింగ్ ఏసీపీ అధికారిపై అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే స్పందించడం లేదని పలువురు మలక్పేట్ నుంచి హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబందిత అధికారికి ఫోన్చేసి ఏసీపీకి మెమోతో పాటు విచారణ చేయాల్సిందిగా డీసీకి ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్ సూపర్వైజర్ అధికారిపై ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడంలో అవినీతి జరిగిందని పలువురు ఫిర్యాదులు చేయడంపై కమిషన్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వెల్లడించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చాదర్ఘాట్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చాదర్ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భరత్కుమార్ వివరాల ప్రకారం.. ఓల్డ్మలక్పేట్లోని వాహెద్నగర్కు చెందిన సయ్యద్ ఆజమ్(43), సబాబేగం దంపతులు. వీరికి నలుగురు సంతానం. గత కొన్ని రోజులుగా ఇరువురి నడుమ వివాదం జరుగుతోంది. మనస్తాపానికి గురైన సయ్యద్ ఆజమ మంగళవారం ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. క్యాట్ ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చైతన్యపురి: ఇటీవల నిర్వహించిన క్యాట్ ఒలింపియాడ్ పరీక్షల్లో వీవీనగర్లోని పాణినీయ మహా విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 6–10 తరగతుల 73 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది ప్రైజ్మనీ, 38 మంది మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు సాధించారన్నారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, నాగేశ్వరరావు,జ్యోతి పాల్గొన్నారు. -
కబ్జా చెరలో పులందరి వాగు
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీపటేల్గూడలో ఉన్న పులందరి వాగు ఆక్రమణకు గురైంది. ఔటర్రింగ్రోడ్డు నుంచి ఎంపీపటేల్గూడ మీదుగా మంగళ్పల్లి నుంచి మల్సెట్టిగూడలో ఉన్న చెక్డ్యాంకు ఈ వాగు నుంచే నీరు పారుతుంది. కాలువపై మట్టి పోసి కిలోమీటర్ మేర కబ్జా చేశారు. అక్రమార్కులు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎంపీపటేల్గూడ పట్టణానికి ఆనుకొని ఉన్న చోట సుమారు 500 మీటర్ల మేర కబ్జాకోరులు టిప్పర్లతో మట్టి తెచ్చి కాలువను నింపేశారు. బఫర్ జోన్లోనే నిర్మాణం చేపట్టారు. దీంతో కాలువ మొత్తం కుంచించుకుపోయింది. వర్షాకాలం వస్తే పెద్ద ప్రవాహం వచ్చే కాలువ చిన్నగా అయిపోయింది. -
అభివృద్ధిలో రాజకీయాలొద్దు
షాద్నగర్: ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ.28 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణాలు అభివృద్ధి చెందితేనే దేశం త్వరితగతిన ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. పట్టణాల్లో 24 గంటలు తాగునీరు అందించేందుకు అమృత్ పథకాన్ని చేపట్టిందని అన్నారు. మంజూరైన నిధులతో ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో నియోజకవర్గ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, జమృత్ఖాన్, శ్రావణి, ఇబ్రహీం, ఎంకనోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు. అంతా కలిసి పనిచేయాలి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
పోలీస్ కస్టడీకి వీరరాఘవరెడ్డి
● అనుమతించిన కోర్టు మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పోలీసులు అతన్ని విచారించనున్నారు. ఈ నెల 7న రామరాజ్యం సైన్యం పేరుతో వీరరాఘవరెడ్డితో పాటు మరో 25 మంది చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి అర్చకుడు రంగరాజన్ ఇంట్లో ఆయనపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఈ నెల 8న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపారు. ఈ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వా లని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మంగళవారం పోలీసులు అతన్ని చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 8 మంది నిందితులకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గాలిస్తున్నారు. -
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
మహేశ్వరం: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఘట్టుపల్లి శివారులోని కోరుపోలు చంద్రారెడ్డి రిసార్ట్స్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పని చేసే నాయకులకు పార్టీ, నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. రాబోయే కాలం యూత్ కాంగ్రెస్దే అన్నారు. అంతకు ముందు జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీకృష్ణ అల్లవారు, అధ్యక్షుడు ఉదయ్భాను ఛిబ్ ‘చలో పంచాయతీ వార్డు 2025, నా ఓటు–నా బాధ్యత’ బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు కోరుపోలు రఘుమారెడ్డి, దేప భాస్కర్రెడ్డి, రాకేష్రెడ్డి, కరుణాకర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
నీటి ఎద్దడి లేకుండా చూడండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పైపులైన్లకు మరమ్మతులు చేయించి, లీకేజీలను నియంత్రించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్ అధికా రులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్నారు. జిల్లాలో గ్రౌండింగ్ అయిన పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి 64 ఫిర్యాదులు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు అంద జేసిన అర్జీలను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 41, ఇతర శాఖలకు సంబంధించి 23 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. వేసవిలో ఎక్కడా ఇబ్బంది రావొద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నందిగామ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులకు చిన్నవయస్సులోనే పర్యావరణ స్పృహను పరిచయం చేయాలని కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పాట్రిసియా స్కాట్లాండ్ అన్నారు. మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సస్టెనబిలిటీ ఇన్ క్లాస్ రూమ్’ కార్యక్రమం సోమ వారం రెండో రోజు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాట్రిసియా స్కాట్లాండ్ కన్హాలోని హార్ట్ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. ఆచరణాత్మక విధానంతో తరగతి గదులకు స్థిరత్వాన్ని తీసుకురావడంలో హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేక చొరవ తీసుకుంటోందని అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అన్నా రాజ్కుమార్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి షాద్నగర్: విద్యార్థుల కంటి పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి షబా హయత్ అన్నారు. షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి శరీర భాగంలో కళ్లు ఎంతో ప్రధానమైనవని అన్నారు. సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కళ్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది రోజుల పాటు శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమనగల్లు, శంషాబాద్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డాక్టర్ పుష్పలత, చంద్రశేఖర్, రమేష్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యా విధానంపై బహిరంగ విచారణ లక్డీకాపూల్: హైదరాబాద్ జిల్లాలో విద్యా విధానంపై తెలంగాణ విద్యా కమిషన్ బహిరంగ విచారణను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందన్నారు. కార్యక్రమా నికి సంబంధిత శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఇమేజ్ను పెంచుదాం బంజారాహిల్స్: దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు నగరంలో సుందరీకరణ పనులను చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం సాయంత్రం రోడ్డు నంబర్.45, షేక్పేట నాలా జంక్షన్ వద్ద మొత్తం రూ.49 లక్షల వ్యయంతో సుందరీకరించిన జంక్షన్లను మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. హైదరాబాద్కు పర్యాటక రంగంలో అంతర్జాతీయ నగరంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకు న్నట్టు తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.150 కోట్ల అంచనా వ్యయంతో 106 ప్రదేశాల్లో పనులను చేపట్టే లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 78 పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. షేక్పేట నాలా వద్ద రూ.24 లక్షల వ్యయంతో చేపట్టగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.45 వద్ద చేపట్టిన సుందరీకరణ పనులకు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టారని వివరించారు. కార్యక్ర మంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డీసీ ప్రశాంతి, ఎస్ఈ రత్నాకర్, ఈఈ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● చిన్నదైన ‘పెద్ద’ చెరువు
చెరువు కట్టపై వేసిన బండరాళ్లు సుదీర్ఘకాలం పాటు నీటితో కళకళలాడిన కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలోని పెద్ద చెరువు పూర్తిగా రియల్ వ్యాపారులు, మైనింగ్ నిర్వాహకుల కబంధ హస్తాల్లోకి వెళ్లింది. చెరువు శిఖంలో ఆక్రమణలతోపాటు స్టోన్క్రషర్ నిర్వాహకులు యథేచ్ఛగా రాళ్ల వ్యర్థాలు పారబోస్తు న్నారు. రికార్డుల్లో మాత్రమే చెరువు భద్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో గుట్టలు, వెంచర్లోని ప్లాట్లు దర్శనమిస్తున్నాయి. అప్పట్లో మైనింగ్ వ్యాపారు లకు స్థానిక నాయకులు, కొందరు అధికారులు తోడవడంతో పది ఎకరాల్లో విస్తరించిన చెరువు ప్రస్తుతం ఐదెకరాలు కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి, చెరువును పరిరక్షించా లని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ పరిస్థితి ఇన్ముల్నర్వలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 254లో సుమారు 10.6 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. పదేళ్ల క్రితం చెరువు సమీపంలో ఏర్పాటైన ఓ గ్రానైట్ క్వారీ నిర్వాహ కులు మైనింగ్ అనంతరం వచ్చే బండరాళ్లను చెరువు కట్టతో పాటు చెరువులో పడేశారు. బండరాళ్లపై మట్టి పోసి తమ వాహనాల రాకపోకల కోసం చదును చేశారు. మరోవైపు సర్వే నంబర్లు 249, 250, 251లో చెరువు ఎఫ్టీఎల్ లెవల్లోనే ఓ భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. ఏకంగా చెరువు శిఖంలోనే ప్లాట్ల రాళ్లను పాతారు. చెరువు ఆక్రమణలు, పూడ్చివేతలతో ఉనికిని కోల్పోతున్నప్ప టికీ అటు హెచ్ఎండీఏ, ఇటు ఇరిగేషన్ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. -
చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కడ్తాల్: పార్కింగ్ చేసిన ఆటోను అపహరించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించారు. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన సదానందంగౌడ్, రామచంద్రయ్య ఇరువురు ఆటోలో ఈ నెల 9న మండల కేంద్రంలోని అగస్త్య ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆటోను పార్కింగ్ చేసి, వైద్యం చేయించుకుని వచ్చేసరికి ఆటో కనిపించలేదు. వెంటనే డ్రైవర్ సదానందంగౌడ్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. క్రైమ్ టీం సిబ్బంది రాజశేఖర్, రాంకోటీలు సోమవారం మండల కేంద్రంలోని తలకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంటకు చెందిన నాగశేషు అనుమానస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగశేషును రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సిబ్బందికి పోలీసు ఉన్న తాధికారులు అభినందించినట్లు సీఐ వెల్లడించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
ఫిలింనగర్: నకిలీ సర్టిఫికెట్ల విక్రయ ముఠా గుట్టును ఫిలింనగర్ పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన వజాహత్ అలీ (27) టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతను అవసరమైన వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి షేక్పేట నాలా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వజాహత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లే వారే టార్గెట్.. దుబాయ్, కువైట్, మస్కట్, సౌదీ ఆరేబియా, బెహ్రైన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లే యువకులు అందుకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం వజాహత్ను సంప్రదించేవారు. దీంతో అతను తనకు పరిచయస్తుడైన రఫీవుల్లాతో సంప్రదింపులు జరిపి సర్టిఫికెట్లు అవసరమైన వారి సమాచారం, యూనివర్సిటీ వివరాలు అందజేసేవాడు. వాటిని రఫీవుల్లా మలక్పేటలోని ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీలో పని చేసే హబీబ్కు అందజేసేవాడు. హబీబ్ వాటిని ఖాన్పూర్కు పంపడంతో అక్కడ ఉన్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు సదరు వివరాలతో అవసరమైన యూనివర్సిటీ సర్టిఫికెట్లను ముద్రించి కొరియర్లో నగరానికి పంపేవాడు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్కు వజాహత్ రూ.80 వేల వరకు వసూలు చేసేవాడు. అందులో రూ.10 వేలు కమీషన్ తీసుకుని మిగతా రూ.70 వేలు రఫీవుల్లాకు అందజేసేవాడు. రఫీవుల్లా రూ.10 వేలు కమీషన్ తీసుకుని రూ.60 వేలు హబీబ్కు ఇస్తే, అతను రూ.20 వేలు మినహాయించుకుని రూ.40 వేలు ఖాన్ఫూర్లో ఉంటున్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడికి ఇచ్చేవాడు. ఈ తరహాలో వీరు ఆంధ్రా యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సింబియాసిస్ యూనివర్సిటీ తదితర 20 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను అచ్చు గుద్దినట్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడు వజాహత్ను అరెస్టు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి రిమాండ్ భారీగా సర్టిఫికెట్ల స్వాధీనం -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
షాద్నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో నడుస్తోందని ధ్వజమెత్తారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందం, బండి విజయ్కుమార్, కార్యదర్శి జగదీశ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దేవేందర్, జిల్లా కార్యదర్శి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశ్, నరేష్, నరసింహారెడ్డి, ఆంజనేయులు, భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య -
బాలుడి చేతిలో యువకుడి దారుణ హత్య
మేడ్చల్రూరల్: మద్యానికి బానిసైన ఓ యవకుడు తన కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో ఆగ్రహానికి లోనైన ఓ బాలుడు తన మేనత్త కొడుకు(బావ)ను దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పట్టణం, రాఘవేంద్రనగర్ కాలనీలో రాధ తన తండ్రి జంగయ్య, ఇద్దరు కుమారులు శ్రీనివాస్, వెంకటరమణ(30), తమ్ముడి కుమారుడి(16)తో కలిసి నివాసం ఉంటోంది. వెంకటరమణ కిష్టాపూర్, అర్చన కాలనీ శివాలయంలో పూజారిగా పని చేసేవాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై అర్చక వృత్తిని వదిలేసిన అతను కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఐదు రోజుల క్రితం రాధ, తండ్రి జంగయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఇంట్లో వెంకటరమణ ,అతని బావమరిది అయిన మైనర్ బాలుడు ఉన్నారు. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అప్పటికే అతడి వైఖరితో విసిగిపోయిన బాలుడు వెంకటరమణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వెంకటరమణను కత్తితో గొంతు నరికి హత్య చేశాడు. సోమవారం ఉదయం మృతుడి సోదరుడికి ఫోన్ చేసి వెంకటరమణ మృతి చెందినట్లు చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మైనర్ బాలుడే హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్రజావాణి’కి అభాగ్యురాలు
ఇబ్రహీంపట్నం: చేతిలో ప్లాస్టిక్ సంచి, అందులో పాత గుడ్డలతో పాటు ఆధార్, డిజేబుల్డ్ (దివ్యాంగుల) జిరాక్స్ పత్రాలు, కిరాణా దుకాణానికి నిధులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన లేఖతో ఓ అభాగ్యురాలు సోమవారం ప్రజావాణి కార్యక్రమం వద్దకు వచ్చింది. ఆర్డీఓ అనంతరెడ్డి ఏం కావాలని అడిగినా సమాధానం చెప్పలేకపోవడంతో సిబ్బందిని పిలిపించి ఆమె సమస్యను తెలుసుకోవాలని సూచించారు. దీంతో వారు వెళ్లి చేతిలోని సంచిని పరిశీలించగా.. అండేకార్ స్వర్ణలత, వయస్సు 44, తుర్కయంజాల్ వివరాలతో ఆధార్ కార్డుజిరాక్స్, దివ్యాంగురాలిగా పేర్కొన్న డిజేబుల్డ్ జిరాక్స్ కార్డు లభించాయి. దీంతో తుర్కయంజాల్ పరిధిలోని పలువురికి ఫోన్ చేసి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంలో అంగన్వాడీ సూపర్వైజర్ పల్లవి అక్కడికి చేరుకున్నారు. సదరు మహిళను పలుమార్లు ప్రశ్నించగా.. తన స్వగ్రామం మండల పరిధిలోని పోచారం అని ఒకసారి, మహబూబ్నగర్ జిల్లా అని మరోసారి చెప్పింది. తనకు ట్రై సైకిల్ కావాలని, తాను బస్టాండ్ల వద్ద ఉండి జీవనం కొనసాగిస్తున్నానని తెలిపింది. తినడానికి తిండి, ఉండేందుకు చోటు ఉంటే సరిపోతుందని, తనకు రావాల్సిన దివ్యాంగుల పింఛన్ అందడం లేదని పేర్కొంది. దీంతో ఆమెను సఖి సెంటర్కు తరలించారు. చేరదీసిన అధికారులు సఖి సెంటర్కు తరలింపు -
పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం
బడంగ్పేట్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పందంగా మారింది. ఇదెలా జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో అధికార పార్టీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం కాంగ్రెస్ వారికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు.. రోడ్లకు ఇరువైపులా కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయగా.. ఆదివారం రాత్రికిరాత్రే వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. సోమవారం కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బ్యానర్లు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీల కతీతంగా విధులు నిర్వహించాలని కమిషనర్కు సూచించారు. మరోసారి ఇలాంటివి జరిగితే.. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆమె.. ఫ్లెక్సీలు ఎవరు, ఎందుకు తొలగించారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అర్జున్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఉన్నారు. బ్యానర్ల తొలగింపుపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు -
ప్రజల గుండెల్లో కేసీఆర్
మీర్పేట: ఫ్లెక్సీలు చించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తొలగించలేరని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం మీర్పేట మంత్రాల చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 ఏళ్లు అన్ని వర్గాలు, సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు లలితానగర్ చౌరస్తాలో కేక్ క్ట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్కల భూపాల్రెడ్డి, రామిడి రాంరెడ్డి, అనిల్యాదవ్, అర్కల కామేశ్రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, రజాక్, దిండు భూపేష్గౌడ్, సిద్ధాల లావణ్య, దోమలపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. మహనీయుల విగ్రహావిష్కరణ మీర్పేట కార్పొరేషన్ 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాదరి సురేఖ రమేష్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ కమలానగర్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్రాం, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గజ్జెల రాంచందర్, మాదరి శ్రీనివాస్, లప్ప లక్ష్మణ్, బాలకృష్ణ, ఎన్.శ్రీనివాస్, బొజ్జ భాస్కర్, జి.శైలేందర్, గౌతం, ఎన్.హరికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితా రెడ్డి -
రైతు దీక్షకు అంతా సిద్ధం
ఆమనగల్లు: ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు దీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి అనుమతి కోరగా మొదట పోలీసులు నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయ కులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమనగల్లు పట్టణ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను సోమవారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, గువ్వల బాలరాజు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్ తదితరులు పరిశీలించారు. నేడు ఆమనగల్లుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు -
● ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
గతంలో కాలువను మరోచోట కబ్జా చేసి పైపులు వేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో పైపులు తొలగించారు. తాజాగా టిప్పర్లతో మట్టి తెచ్చి పోస్తున్నారు. కాలువను కబ్జా చేస్తున్నారని ఆదిబట్ల మున్సిపాలిటీలో, కలెక్టరేట్లో ఎంపీపటేల్గూడ వాసులు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఓవైపు మున్సిపాలిటీ అధికారులు అండర్ డ్రైనేజీ నీరు ఇదే వాగులోకి కలిపి కలుషితం చేశారని, మరోవైపు కబ్జా పాలవుతున్న పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే వాగు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువను పరిరక్షించాలని కోరుతున్నారు. -
అభివృద్ధి ఘనత ఆయనదే
ఇబ్రహీంపట్నం: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసిన ఉద్యమనేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరువరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అనివర్గాలు, ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేసి అభివృద్ధి దిశగా పాలన కొనసాగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. స్ఫూర్తి జ్యోతి అంధుల ఆశ్రమంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ కృపేశ్, ఎంపీటీసీల సంఘం మండల మాజీ అధ్య క్షుడు ఏనుగు భరత్రెడ్డి, మాజీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు పాల్గొన్నారు.