Ranga Reddy District Latest News
-
చేవెళ్ల బార్ అసోసియేషన్కు ఎన్నిక
చేవెళ్ల: చేవెళ్ల బార్ అసోసియేషన్కు గురువారం హోరాహారీగా ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా జి.శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం.నర్సింలు, జి.క్రిష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సి.మహేశ్గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కె.యాదగిరిగౌడ్, లైబ్రేరియన్గా పి.మల్లేశం, మహిళా ప్రతినిధిగా జె.గీతవనజాక్షి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రకాశం, సీహెచ్.రవీందర్, ఈశ్వర్, ఎం.శివరాజ్, ఎం.ప్రదీప్రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న బార్ అసోసియేషన్ సభ్యులను తోటి న్యాయవాదులు అభినందించారు. అడ్వకేట్ల సమస్యలపై బార్అసోషియేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని నూతన అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి -
నేడు వాహనాల వేలం
చేవెళ్ల: వివిధ కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్లు చేవెళ్ల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం సీఐ ఎం.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల ఎకై ్సజ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ఉంటుందని చెప్పారు. చేవెళ్ల సర్కిల్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుకు వచ్చి వేలంలో దక్కించుకోవాలని కోరారు. మంచాల పీఏసీఎస్ కార్యదర్శిపై వేటు మంచాల: మంచాల పీఏసీఎస్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెదెరె హన్మంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. పీఏసీఎస్లో రూ.7,25,223 సంబంధించిన అవకతవకలపై నిర్వహించిన విచారణలో భాగంగా డీసీఓ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు రాంరెడ్డి, జెనిగె వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో గొడవపడి వ్యక్తి అదృశ్యం పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన వ్యక్తి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్నగర్కు చెందిన వి.నర్సింహులు(55) ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి తాగుడుకు బానిసైన అతడు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నర్సింహులుకు సర్ది చెప్పి బాగు చేయాలని అతని భార్య యాదమ్మ ఈ నెల 26వ తేదీన సర్దార్నగర్కు తీసుకొచ్చింది. అతనితో మాట్లాడేందు కు యత్నించగా, గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
గురువులు సమాజ నిర్మాతలు
ఎమ్మెల్యే కాలె యాదయ్యమొయినాబాద్: గురువులు నవ సమాజ నిర్మాతలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ ఎంఈఓగా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక పీవీ కన్వెన్షన్లో ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్ని వెంకటయ్యను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని. 15 ఏళ్లుగా మొయినాబాద్ మండల ఎంఈఓగా, అజీజ్నగర్, కనకమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడిగా వెంకటయ్య చేసిన సేవలు అందరికీ గుర్తుండిపోతాయన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సధానందంగౌడ్, మాజీ జెడ్పీటీసీ అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ మంజుల, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్, ఎంఈఓలు విజయ్కుమార్రెడ్డి, పురందాస్, అక్బర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నాయకులు పాల్గొన్నారు. -
కోహెడ మార్కెట్ నిర్మాణానికి సహకరించండి
అబ్దుల్లాపూర్మెట్: కోహెడలో నిర్మించబోయే అంతర్జాతీయ సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన పరిపాలన అనుమతులు వేగవంతం చేయడంతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించినట్లు మధుసూదన్రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్రావు, సీఎం ఓఎస్డీ చంద్రశే ఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
పాతబస్తీలో పన్ను వసూలు చేయాలి
మీర్పేట: మీర్పేటవాసులపై ఇంటి పన్ను భారం తగ్గించి, పాతబస్తీలో పన్ను వసూలు చేయాలని బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గురువారం ఇంటి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీర్పేట–1, 2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీనికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్శంకర్రెడ్డిలతో కలిసి శ్రీరాములుయాదవ్ పాల్గొని మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి పన్ను రూపంలో భారం వేస్తోందని, దీనిపై గతంలో నుంచే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 15 నెలలకే అప్పటి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక పన్ను వసూలు చేస్తుందని ఆరోపించారు. మీర్పేటలో పన్నులు తగ్గించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు నర్సింహ, గోవర్ధన్రెడ్డి, సోమేశ్వర్, మధు, మాజీ కార్పొరేటర్లు హరినాథ్రెడ్డి, భీంరాజ్, విజయలక్ష్మి, అరుణ, గౌరీశంకర్, మల్లేష్ ముదిరాజ్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, రాఘవేందర్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి శ్రీరాములుయాదవ్ మీర్పేటలో ఆస్తి పన్ను తగ్గించాలని రిలే నిరాహారదీక్ష -
మెట్రో రెండో దశపై కేంద్రం నజర్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో దశలో ప్రతిపాదించిన మొదటి 5 కారిడార్ల డీపీఆర్లపైన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించింది. డీపీఆర్లలోని సాంకేతిక అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలిసింది. వివిధ మార్గాల్లో చేపట్టనున్న కారిడార్లపై కేంద్ర అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకే హెచ్ఏంఆర్ఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 కారిడార్లపైన హెచ్ఏఎంఆర్ఎల్ సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్లను ప్రతిపాదించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు డీపీఆర్లలో సాంకేతిక అంశాలపైన చర్చలు సాధారణమైన అంశమేనని, కేంద్ర కేబినెట్ దీనిపైన దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలని హెచ్ఏఎంఆర్ఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్లో నార్త్, ఫ్యూచర్ సిటీల డీపీఆర్లు.. మరోవైపు నార్త్సిటీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు ప్రతిపాదించిన రెండు కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రెండో దశ ‘బి’ విభాగంలో ప్రతిపాదించిన కారిడార్లకే ఏప్రిల్లో డీపీఆర్లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకే అందజేయాల్సి ఉండగా ప్రాజెక్టుపైన సర్వేలు, అధ్యయనాల దృష్ట్యా ఏప్రిల్లో డీపీఆర్లు పూర్తి చేసే అవకాశం ఉంది.‘బి’ విభాగంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, శామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు 22 కిలోమీటర్లు, ఫ్యూచర్సిటీ కారిడార్ 41 కిలోమీటర్ల చొప్పున నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో రెండు విభాగాలుగా మొత్తం 8 కారిడార్లలో 190.4 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీపీఆర్లపై స్పష్టత ఢిల్లీలో ఎన్వీఎస్ రెడ్డి పర్యటన సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చలు రెండోదశ మొదటి ఐ కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నార్త్, ఫ్యూచర్సిటీలపై వచ్చే నెలలో డీపీఆర్లు -
రోడ్డుపై కాలిబూడిదైన కారు
చేవెళ్ల: రోడ్డుపై వెళ్తున్న స్కోడా కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ముడిమ్యాల గేట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కేసారానికి చెందిన కె.రాజశేఖర్రెడ్డి తన స్కోడా కారులో గ్రామం నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు. మూడు కిలోమీటర్లు వెళ్లగానే కారు లోపలికి ఏసీ విండోల నుంచి మంటలు అకస్మాత్తుగా రావటంతో భయపడి ఆయన దిగాడు. ఈ క్రమంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ఒక్కడే ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డాడు. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు కలెక్టరేట్లో గురువారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్నవారు.. వలస వచ్చిన కుటుంబాలు.. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న యువత త్వరగా అక్రమార్కుల వలలో పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గానీ, పేదవారిని గానీ నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి వారిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1930.., 100.., 104.., 1098.., 181 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, డీపీఎంఎస్ సీహెచ్ స్వర్ణలత, యాదయ్య, విలాస్రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.కవిత, ఎంపీఎంలు రవీందర్, యాదగిరి, విజయమాలిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత -
శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయం
షాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలతో మమేకం కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. షాబాద్ ఠాణాను గురువారం రాత్రి రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫైళ్లను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ కేసులు ఉండొద్దన్నారు. పోలీస్స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూసి అభినందించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫంక్షన్ వర్టికల్పై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి -
29, 30 తేదీల్లో వాలీబాల్ పోటీలు
చేవెళ్ల: మున్సిపల్ పరధిలోని దామరగిద్దలో ఈ నెల 29,30 తేదీల్లో 6వ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పవన్, ప్రకాశ్, ప్రసాద్, నరేందర్, నవీన్ తెలిపారు. చేవెళ్లలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంట్రీ ఫీజు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. రూరల్ విభాగంలో ఆయా గ్రామాలకు చెందిన క్రీడాకారులే పోటీలో పాల్గొనాలని తెలిపారు. మొదటి బహుమతి రూ.30వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఉంటుందన్నారు. ఓపెన్ టూ ఆల్ విభాగంలో మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ఉంటుందన్నారు. వివరాలకు 76809 88771, 90321 13340, 95501 64093, 80740 63420 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
యూజీ పవర్
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025ఓహెచ్ లైన్ల బదులు అండర్గ్రౌండ్ కేబుళ్లు 10లోuసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇళ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఓవర్హెడ్ (ఓహెచ్) లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయా రు చేసి సమర్పించాల్సిందిగా కోరుతూ డిస్కం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు ప్రముఖ అధ్యయన సంస్థలు దీనికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. 900 కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను వేసేందుకు రూ.520 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఆయా ఏజెన్సీలు రూపొందించిన నివేదికను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సమర్పించనున్నాయి. ఓవర్హెడ్ లైన్ రహిత నగరంగా.. ● గ్రేటర్లో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం లేకపోలేదు. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ● చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలతో పాటు అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగ్లను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్హెడ్ లైన్కు ఆనుకుని విద్యుత్ షాక్తో మృతి చెందుతున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఓవర్హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చవచ్చని డిస్కం భావిస్తోంది. హైదరాబాద్ను ఓవర్హెడ్ లైన్ రహిత నగరంగా అంతర్జాతీయ పటంలో చూపించవచ్చని యోచిస్తోంది. ప్రాధాన్య క్రమంలో పనులు ● హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరంగా మారిన బహిరంగ విద్యుత్లైన్ల (ఓవర్హెడ్)ను తొలగించి, వాటిస్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుళ్లను వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే సుమారు 900 కిలోమీటర్ల ఓవర్ హెడ్ (ఓహెచ్) లైన్లు ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు రూ.520 కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా వేసింది. డీపీఆర్ సమర్పించిన ఏజెన్సీలకే పనులను అప్పగించాలని యోచిస్తోంది. ● గ్రేటర్ మొత్తంగా ఒకే సమయంలో కాకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. పేదలు ఎక్కువగా నివసించే నందినగర్, వారాసిగూడ, రాంనగర్, చిలకలగూడ, ఎన్టీఆర్ నగర్, ఇందిరా పార్కు, అశోక్నగర్, పద్మారావునగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్, బోరబండ, శ్రీరామ్నగర్, లెనిన్నగర్, మన్సూరాబాద్, నాగోలు, అడ్డగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన లైన్లను మార్చే అవకాశం ఉంది. న్యూస్రీల్జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ నెట్వర్క్ ఇలా.. 33/11కేవీ సబ్స్టేషన్లు 498 33కేవీ యూజీ కేబుల్ 1,280 కి.మీ 33కేవీ ఓవర్హెడ్ లైన్స్ 3,725 కి.మీ 11 కేవీ ఓవర్హెడ్ లైన్స్ 21,643 కి.మీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 11కేవీ యూజీ కేబుల్ 957 డిటీఆర్లు 1,50,992 ఇంటర్మీడియట్ స్తంభాలు 58,271 ఆసక్తిగల ఏజెన్సీల నుంచి డీపీఆర్ల ఆహ్వానం గ్రేటర్లో 900 కిలోమీటర్ల ఓవర్హెడ్ లైన్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్కు రూ.520 కోట్లు అవసరం డిస్కంకు నేడు డీపీఆర్లు సమర్పించనున్న ఏజెన్సీలు -
మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.12,01,567 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, సిబ్బంది, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మాసబ్ చెరువును పరిరక్షిస్తాం తుర్కయంజాల్: మాసబ్ చెరువును పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు శిఖం సర్వే నంబర్ 137లోని భూమిలో రోడ్డు నిర్మాణానికి డంప్ చేసిన మట్టిని తొలగిస్తున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి డంప్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారా లేదా అని ఆరా తీశారు. మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో కలపండి మొయినాబాద్: మండలంలోని నాగిరెడ్డిగూడ పంచాయతీని కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని నాగిరెడ్డిగూడ గ్రామస్తులు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ మేరకు గురువారం వేర్వేరుగా వారిని కలిసి వినతిప్రతాలు అందజేశారు. నాగిరెడ్డిగూడ గ్రామం గతంలో రాజేంద్రనగర్ సమితిలో ఉండేదని.. 1982 వరకు హుడా పరిధిలోనే ఉన్న తమ గ్రామ రెవెన్యూలోని భూముల రిజిస్ట్రేషన్ ధరణి రాకముందు హైదరాబాద్లో జరిగేవని వివరించారు. భౌగోళికంగా మొయినాబాద్ మున్సిపాలిటీ మధ్యలో నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ భూములు ఉన్నాయన్నారు. హిమాయత్సాగర్ జలాశయానికి ఆనుకుని ఉన్న తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కీసరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ సద్గుణాచారి, మాజీ ఎంపీటీసీ అర్జున్, నాయకులు మాణిక్యం, సుధాకర్, వినోద్కుమార్, మహేందర్, యాదగిరి, మల్లేష్, అశోక్, రవీందర్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, శ్రీశైలం, ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’మహేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లక్ష్మీసుధ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రయాణికులు 91542 98784 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని, సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపా యాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది. -
డెయిరీ పేరుతో బురిడీ
మొయినాబాద్: డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెడితే ప్రతీ నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని ప్రకటన ఇచ్చాడు.. పెట్టుబడులు ఆకర్షించి రూ.15 కోట్లు రాబట్టాడు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు.. మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలివీ.. నగరానికి చెందిన వ్యాపారులు శ్రీనివాస్రావు, కోటేశ్వరరావు 2019లో అజీజ్నగర్ రెవెన్యూలో 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో కూరగాయలు, పూల తోటలతోపాటు డెయిరీ ఏర్పాటు చేస్తామని లీజు పత్రాల్లో రాసుకున్నారు. వారు లీజుకు తీసుకున్న భూమిలో కోటేశ్వరరావు బంధువైన వేముల సుబ్బారావు 2021లో కొండపల్లి డెయిరీ ఫాం పేరుతో డెయిరీ ఏర్పాటు చేశాడు. సుమారు 400 గేదెలతో డెయిరీని నడుపుతూ పాల ఉత్పత్తులు చేసేవారు. రెండేళ్ల క్రితం సుబ్బారావు డెయిరీలో పెట్టుబడులు పెడితే ప్రతి నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన కొంత మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. రూ.15 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటి నుంచి కొనసాగిన డెయిరీని పది రోజుల క్రితం సుబ్బారావు మూసివేశాడు. అందులోని గేదెలను రాత్రికి రాత్రే తరలించాడు. దీంతో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన సాయి హరీష్ అనే వ్యక్తి ఈ నెల 17న మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం మరో ఎనిమిది మంది బాధితులు వేముల సుబ్బారావు, అతని భార్య కుమారి పెట్టుబడులు పెట్టించుకుని తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో ఆర్థిక నేరం జరిగిందని కేసును సైబరాబాద్ కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసినట్లు ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించి.. బిచాణా ఎత్తేసి రూ.15 కోట్ల వరకు టోకరా పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఆలస్యంగా వెలుగులోకి..నేడు బాధితుల సమావేశం అజీజ్నగర్లో డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేసిన వేముల సుబ్బారావు మోసాలను ఆధారాలతో బయట పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. శుక్రవారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
అల్మాస్గూడలో హైడ్రా పంజా
బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలో హైడ్రా పంజా విసిరింది. రోడ్లను అక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీవాసులకు విముక్తి కల్పించింది. వివరాలివీ.. అల్మాస్గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లే అవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్క్లేవ్ అని పేరుపెట్టారు. సర్వే నంబర్ 39,40,41,42,44లో 5.7 ఎకరాల లే అవుట్ ఉండగా అందులో మూడు రోడ్లు, 236 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు మూడు లింక్ రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్ర మించిన రోడ్ల స్థానంలో బాక్స్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. ఈ క్రమంలో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు లే అవుట్ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం హైడ్రా సీఐ తిరుమలేశ్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హైడ్రా సీఐపై దాడికి యత్నం బాక్స్ క్రికెట్ స్టేడియంను కూల్చివేస్తుండగా ల్యాండ్ వర్గీయులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియం కూల్చివేత మూసిన మూడు రోడ్లు, పార్కు స్థలానికి విముక్తి హైడ్రా సీఐపై దాడికి ల్యాండ్ వర్గీయుల యత్నం -
పేదల ఇళ్ల కోసం మరో పోరాటం
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమణలో ఉన్న పేదల ఇళ్ల స్థలాలు, 370 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించుకునేందుకు మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామేల్ అన్నారు. ఇబ్రహీంపట్నం పాషనరహరి స్మారక కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోకి బుధవారం లబ్ధిదారులు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఫిలింసిటీ యాజమాన్యంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కమ్మకై ్క లబ్ధిదారులైన పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. 18 ఏళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇంటి స్థలాల లబ్ధిదారులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కోసం సేకరించిన భూములను తాము అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేసిందని వారు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో 2,500 ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం చేయడం ఏమిటని నిలదీశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు బుగ్గరాములు, జంగయ్య, జగన్, నర్సింహ, యాదయ్య, బాలరాజ్, శ్రీను, చరణ్, యాదగిరి, ఎల్లేష్ పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్న 370 ఎకరాలను విడిపిస్తాం సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య -
నిందితులను శిక్షించాలి
మహేశ్వరం: న్యాయవాది ఎర్రవాపు ఇజ్రాయెల్ హత్య కేసుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలని మహేశ్వరం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కోర్టు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఇజ్రాయెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో న్యాయం కోసం కోట్లాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహేశ్వరం కోర్టులో పని చేస్తున్న సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను చంపాపేట్లో కత్తితో హత్య చేశారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్వరం బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మహేశ్వరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్ -
ముగ్గురు బాల నేరస్తుల అరెస్ట్
ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజపల్లి గ్రామంలో ఇటీవల మేకలను అపహరించిన ముగ్గురు బాల నేరస్తులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. గ్రామానికి చెందిన బైకని రాజయ్యకు చెందిన 8 మేకలను ఈనెల 21న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. అనంతరం విచారణ జరిపి మేకలను అపహరించిన ముగ్గురు బాల నేరస్తులను అరెస్టు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఫిలింసిటీలో పేదలకు భూములివ్వాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ షాద్నగర్: రామోజీ ఫిలింసిటీలో పేదలకు కేటాయించిన భూములను వెంటనే వారికి పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 189, 203లలోని భూమిలో గతంలో ప్రభుత్వం 577 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని.. ఈ భూములను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం కబ్జా చేసిందని ఆరోపించారు. పేదలకు మరో చోట భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. పేదలకు తమకు కేటాయించిన భూముల వద్దకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేయడం తగదన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య, పలువురు నాయకులను పోలీసులు గాయపరిచి అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యలో ఏఐ విప్లవం
కేశంపేట: ప్రభుత్వం సర్కార్ బడుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(కృతిమ మేధ) ద్వారా విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ఏఐ సహకారంతో విద్యార్థులకు సులభంగా, ఆకట్టుకునేలా వినూత్నంగా బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి ఏఐ బోధన కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 12న హైదరాబాద్లోని సరూర్నగర్ జెడ్పీహెచ్ఎస్లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 17న, 18న మండల పరిధిలోని ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 25 నుంచి బోధన ప్రారంభించారు. ఏఐ బోధనకు ఎంపిక చేసిన పాఠశాలలు మొదటి విడత: కోకాపేట, అజీజ్నగర్, పెద్ద ఎల్కిచర్ల, పెద్ద మంగళారం, టంగుటూరు, తంగేడపల్లి, మల్కారం, రెడ్డిపల్లి, రావిర్యాల రెండో విడత: కొత్తపేట, అజీజ్నగర్, జిల్లేల్గూడ, బహదూర్గూడ బ్యాచ్కు ఐదుగురు విద్యార్థులు విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే మౌఖిక భాష, సంఖ్యా శాస్త్రం, ఇంగ్లిష్ అభ్యసనంతో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఐదుగురు చొప్పున ఒక బ్యాచ్ చేసి బోధిస్తున్నారు. ఎంపిక చేసిన విద్యార్థుల సామర్థ్యాలను 20 నిమిషాల నిడివితో ప్రశ్నలు ఉంటాయి. ఏఐ సులభంగా, సరళమైన భాషలో పాఠ్యాంశాలను బోధిస్తుంది. దీంతో ప్రతిభ పెరిగి చదువుల్లో రాణిస్తారు. ప్రాథమిక తరగతుల నుంచే కృతిమ మేధతో బోధన సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ -
బ్యాడ్మింటన్ పోటీలో సత్తా
హుడాకాంప్లెక్స్: జాతీయ స్థాయి డెఫ్ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలలో కొత్తపేటకు చెందిన బూర్చు సురేష్, అనూష దంపతుల కుమారుడు గోపి బ్యాడ్మింటన్లో జూనియర్ బాయ్స్ సింగిల్స్ అండర్–18లో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటాడు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన 2025 సంవత్సర ఆలిండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ జాతీయ డెఫ్ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో తాను మెడల్స్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛభారత్ నిర్వహించాలని తీర్పు మీర్పేట: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా 2వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజులు మీర్పేట పోలీస్స్టేషన్లో స్వచ్ఛభారత్ నిర్వహించాలని బుధవారం తీర్పునిచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. గుర్రంగూడకు చెందిన ఓ మహిళతో నందిహిల్స్కు చెందిన రమేశ్ అనే వ్యక్తి గొడవపడి ఆమెను దుర్భాషలాడడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా తీర్పు ఇచ్చింది. -
పది వేల మందితో మళ్లీ వస్తాం
ఇబ్రహీంపట్నం/యాచారం: పది వేల మంది నిరుపేదలతో మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు. యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇళ్ల స్థలాలను వదిలేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఫిలింసిటీ వద్ద ఆందోళన నిర్వహించిన సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వీరిని ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మంజూరు ఇళ్ల స్థలాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఆ భూములతో పోలీసులకు ఏం సంబంధం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మందికి 20 ఎకరాల్లో 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చిందని.. అప్పటి నుంచి ఈ భూములు రామోజీ కబ్జాలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో వారి స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లారన్నారు. పోలీసులు రామోజీ యాజమాన్యానికి తొత్తులుగా మారి పేదలను అడ్డుకుంటున్నారని.. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన విషయంలో పోలీసులు తలదూర్చడం తగదన్నారు. రామోజీ కబంధ హస్తాల్లో ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం బయటకు తీస్తామని అన్నారు. పేదల భూములు కబ్జా పెట్టిన రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన తమపై కేసులు బనాయించడం సరికాదన్నారు. నేడు, రేపు ఆందోళనలు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పోలీసుల అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ గురు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల తోపులాటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను అస్పత్రికి తరలించారు. బుగ్గరాములు, సామేల్, జగదీశ్, జగన్, జంగయ్య, కిషన్, వెంకటేశ్, నర్సిరెడ్డి, ఎల్లేశ్, తులసిగారి నర్సింహ, అరుణ, స్వప్న, ప్రకాశ్కారత్, చరణ్, ఆనంద్, శ్రీకాంత్, శివ యాదగిరి, నర్సింహ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్యపరామర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఆ భూముల్లో గుడిసెలు వేస్తాం రెవెన్యూ సంబంధిత విషయంలో పోలీసుల జోక్యం తగదు రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈదురుగాలుల కారణంగా మాడ్గుల మండల పరిధిలోని గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయాధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారని.. ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దీనిపై స్పందించి రైతులకు పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–82 కాలువ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని.. వర్షాలు వచ్చిన సమయంలో కాల్వకు గండ్లు పడుతున్నాయని దీంతో రైతులకు నష్టం వాటిల్లితుందని చెప్పారు. వీటి కట్టడికి డైవెర్షన్లు, గేట్వాల్వ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గత వర్షాకాలంలో తలకొండపల్లి మండల పరిధిలోని మహ్మద్ఖాన్చెరువు, పండుగాని చెరువులకు గండ్లు పడ్డాయని వర్షాకాలం లోపు ఆ చెరువులకు మరమత్తులు చేపట్టాలని కోరారు. వార్డుల సంఖ్య పెంచాలి ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి షాద్నగర్: జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి కోరారు. బుధవారం శాసన మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎదురు చూస్తున్న ఆశావహులు ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడతారని భావించారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంతో బిల్లును ఆపేశారనే అపోహ ప్రజల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే జనాభాకు అనుగుణంగా వార్డులను పెంచాలని కోరారు. పంచాయతీ కార్మికుల వేతనాన్ని రూ.15వేలకు పెంచాలని కోరారు. కొత్త పంచాయతీలకు రెవెన్యూ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చలో కలెక్టరేట్ పాదయాత్ర వాయిదా బందోబస్తుకు పోలీసుల అనుమతి నిరాకరణ యాచారం: ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం గురువారం తలపెట్టిన చలో కలెక్టరేట్ పాదయాత్ర వాయిదా పడింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుకు దరఖాస్తు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఇతర పోలీస్ సిబ్బందికి విధులు నిర్వహించాల్సి ఉంది. అందుకు గాను పాదయాత్ర బందోబస్తుకు పోలీస్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు వివరించారు. పోలీసుల అనుమతి లేకపోవడంతో చలో కలెక్టరేట్ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి కేశంపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండల పరిధిలోని పోమాల్పల్లిలో మంజూరైన 25 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యతతో ప్రభుత్వం ఇచ్చిన మార్కింగ్ల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిష్టయ్య, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ధనుంజయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం బారెడు..
వసూలు మూరెడుమొయినాబాద్: ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కొన్ని పురపాలక సంఘాలు పన్ను వసూలు ముందంజలో ఉంటే మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో అంతంతమాత్రంగానే టాక్స్ రికవరీ ఉంది. రూ.2.13 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం రూ.80 లక్షలే రికవరీ చేశారు. వంద శాతం పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ నెల 31 వరకు ఇంటింటికీ తిరుగుతున్నారు. అయినా మున్సిపాలిటీలో ఇప్పటివరకు 37 శాతమే పన్ను వసూలు కావడం గమనార్హం. ఇదివరకు జీపీలే.. ఎనిమిది గ్రామ పంచాయతీలతో కలిపి మొయినాబాద్ మున్సిపాలిటీ మూడు నెలల క్రితం ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, సురంగల్, పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్నగర్, అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాలను కలిపి ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇదివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆయా గ్రామాల్లో పన్ను వసూలు పంచాయతీలు చేపట్టాయి. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడటంతో పంచాయతీల్లో వసూలు చేసిన పన్నులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.2,13,17,331 పన్నుల వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు రూ.80 లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 37 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన 63 శాతం పన్నులు వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటికీ తిరుగుతూ... మున్సిపల్ కమిషనర్తోపాటు అధికారులంతా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజు ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ప్రజలకు పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నారు. పన్నులు చెల్లించాల్సిన జాబితాలో అధిక శాతం పెద్ద పెద్ద విద్యా సంస్థలు, రిసార్ట్స్లు, ఫాంహౌస్లు, కన్వెన్షన్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలవే ఉన్నట్లు తెలుస్తుంది. వాటి నుంచి సైతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. వంద శాతం లక్ష్యం మున్సిపల్ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తున్నాం. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో అంతకుముందు చెల్లించిన పన్నులను మినహాయించి మిగిలినవాటినే టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ నెల 31 వరకు పన్నులు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానాతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. – ఖజా మొయిజుద్దీన్, కమిషనర్, మొయినాబాద్ మున్సిపాలిటీ మొయినాబాద్లో 37 శాతమే పన్ను రికవరీ ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు -
సహకారం సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత అన్నా రు. ఉపాధిహామీ నిధులతో ఎల్మినేడులో నిర్మించిన తల్లికోళ్ల పెంపకం షెడ్డును బుధవారం ఆమె ప్రారంభించారు. ముందుగా ఆమె ఉపాధిహామీ పనులను కూలీలకు చేపట్టిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతీ మండలానికి ఒక తల్లికోళ్ల పెంపకం షెడ్డులు మంజూరు చేశామని.. మహిళా సంఘం సభ్యులకు రూ.2.99లక్షల ఉపాధి హామీ నిధులతో షెడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమ నిమిత్తం రుణాలు తీసుకున్న వారికి రూ.83వేలు ఇస్తారని.. ఈ నెల చివర వరకు నిర్మించాలన్నారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ఫ్రూట్, మునగ తోటలు పెంచుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. చెరువులు, కుంట కట్టలు బలోపేతం చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం క్లస్టర్ ఏపీడీ నరేందర్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, ఏపీఓ తిరుపతాచారి, ఈసీ రవికుమార్, ఏపీఎం రవీందర్, సీసీ నరసింహ, పంచాయతీ కార్యదర్శి రవీందర్, సాంకేతిక సహాయకులు సునంద, ఫీల్డ్ అసిస్టెంట్ దాసు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత -
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్లో జేసీబీ మెకానిక్గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్దేవ్పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్ఖాన్, షకీల్ ఖాన్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
పూజారికి జీవిత ఖైదు
ప్రియురాలి హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు హుడాకాంప్లెక్స్/శంషాబాద్రూరల్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తనకు వివాహం జరిగిందనే విషయాన్ని దాచి.. ఆలయానికి వచ్చే మరో మహిళతో ప్రేమాయణం సాగించాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవా లని ఒత్తిడి తేవడంతో.. ఆమెను వదిలించుకునేందుకు హత్య చేసిన పూజారికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు బుధవారం వెలువడింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సరూర్నగర్లో వెంకటేశ్వర కాలనీలో నివసించే పూజారి వెంకట సూర్యసాయి కృష్ణ (36)కు గతంలోనే పెళ్లి జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన కారుగంటి అప్సర (30) తరచూ ఇతను పూజారిగా ఉన్న ఆలయానికి వస్తుండేది. ఆమెతో చనువు పెంచుకున్న సాయి కృష్ణ ప్రేమాయణం సాగించాడు. తనకు వివాహం అయిందనే విషయం దాచిపెట్టి ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయి కృష్ణపై అప్సర ఒత్తిడి చేయగా.. ఆమె అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కారులో తీసుకొచ్చి.. కోయంబత్తూరు తీసుకెళ్లాలని అప్సర సాయికృష్ణను కోరగా.. ఇదే అదనుగా భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్సరను 2023 జూన్ 3న సరూర్నగర్ నుంచి రాత్రి తన కారులో శంషాబాద్ తీసుకొచ్చి.. అక్కడే ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత నర్కూడలోని నవరంగ్ వెంచరులోకి తీసుకెళ్లగా.. అప్సర కారులోనే నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఆమె ముఖంౖపై కారు కవర్ కప్పి ఊపిరి ఆడకుండా చేశాడు. స్పృహ కోల్పోయిన అప్సర తలపై రాయితో బాది హత్య చేశాడు. ఈ క్రమంలో అప్సర మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ దురాఘతం వెలుగు చూసింది. అప్పటి ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్కుమార్ చార్జ్షీట్ ఫైల్ చేయగా.. బాధితురాలి తరఫున ఈ కేసును పీపీ రవికుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సాయి కృష్ణను ముద్దాయిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.జయప్రసాద్ బుధవారం అతడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఏఎస్ఐ రామిరెడ్డి, కానిస్టేబుల్ ఎండీ.ఖాజాపాషాను ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి అభినందించారు. ఈ తీర్పుతో తన కూతురు ఆత్మకు శాంతి కలిగిందని, చివరకు న్యాయమే గెలిచిందని అప్సర తండ్రి శ్రీధర్ శర్మ ఆనందం వ్యక్తంచేశారు. -
మేనిఫెస్టో హామీలు అమలు చేయండి
మహేశ్వరం: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతీ నెల రూ.5వేల గౌరవ వేతనం, క్వింటాల్కు రూ.300 చొప్పున కమీషన్ ఇవ్వాలని రేషన్ డీలర్లు కోరారు. ఈ మేరకు బుధవారం వారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రి శ్రీధర్బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు అందించాలని, రేషన్ డీలర్లు చనిపోతే దహనసంస్కారాలకు ప్రభుత్వం రూ.25వేలు చెల్లించాలని కోరారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఆథరైజేషన్ రెన్యూవల్, గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన మాదిరిగానే తొమ్మిది సరుకులు పంపిణీ చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన స్పీకర్, మంత్రి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రి శ్రీధర్బాబుకు వినతిపత్రాల అందజేత -
విత్తన పండుగకు ఆహ్వానం
కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలో ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ‘తొలి తెలంగాణ విత్తన పండుగ’నిర్వహించనున్నారు. ఈ మేరకు సీజీఆర్ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి హాజరవుతానని చెప్పి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. ఈ సందర్భంగా సీజీఆర్ ప్రతినిధి రజినీకాంత్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న దేశీ విత్తనాల సంరక్షణకు సంస్థ నడుంబిగించిందని చెప్పారు. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఎర్త్ సెంటర్లో చేపట్టనున్న విత్తన పండుగలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సంప్రదాయ విత్తనాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే రైతులకు దేశీ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంద యాదగిరి, ఎర్త్ లీడర్ ప్రభాస్ తదితరులు ఉన్నారు. -
‘ఎస్టేట్స్’ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండటంతో ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో ట్యాక్స్ సెక్షన్ సెలవుల్లేకుండా పని చేస్తోంది. దాంతోపాటు ట్రేడ్ లైసెన్సుల విభాగం, ఎస్టేట్స్ విభాగాలు సైతం టార్గెట్లు చేరుకునేందుకు ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలం వరకు తన ఆస్తులేమిటో, ఎంతమొత్తం రావాలో కూడా పెద్దగా పట్టించుకోని ఎస్టేట్స్ విభాగం దూకుడు పెంచింది. ఆ విభాగానికి నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు ఉండటం తెలిసిందే. వాటిలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెల్ని కచ్చితంగా వసూలు చేయాలని భావించిన ఎస్టేట్స్ అధికారులు నిబంధనల మేరకు నోటీసులు, హియరింగ్లు వంటివి నిర్వహించారు. అంతిమంగా దుకాణాలను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీన తొలుత ఈ చర్యలు ప్రారంభించాక, కొద్దిమేర ఫలితం కనిపించింది. తిరిగి మళ్లీ పరిస్థితి షరామామూలుగా మారడంతో మంగళ, బుధ వారాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది దూకుడు పెంచారు. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో , భారీ వ్యాపాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న కాంప్లెక్స్లలో భారీ బకాయిల అద్దెలున్న దుకాణాలను సీజ్ చేశారు. ● వీటితోపాటు సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ కాంప్లెక్స్, పుత్లిబౌలి తదితర ప్రాంతాల్లోనూ కొన్ని షాపుల్ని సీజ్ చేశారు. వెరసి మొత్తం 250కి పైగా దుకాణాల్ని సీజ్ చేశారు. ● దీంతో దిగివచ్చిన వ్యాపారులు చెల్లించాల్సిన అద్దెల బకాయిల్లో కొంత చెల్లించి, మిగతా త్వరలో చెల్లిస్తామని వేడుకున్నారు. పుత్లిబౌలిలోని రెండు దుకాణాల నుంచే రూ.2.36 లక్షలు వసూలైంది. అలా రెండు రోజుల్లో రూ. 46 లక్షల అద్దెలు వసూలయ్యాయి. సీజ్ చేసిన మిగతా దుకాణాల నుంచీ అద్దెలు రాగలవని అధికారులు ఆశిస్తున్నారు. అలా ప్రస్తుతం సీజ్ చేసిన దుకాణాల నుంచి రూ. కోటికి పైగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అద్దెలు చెల్లించని దుకాణాల సీజ్ ● చర్యలతో దిగివస్తున్న నిర్వాహకులు ● రెండు రోజుల్లో 250 దుకాణాలకు పైగా సీజ్ ● రూ. కోటికి పైగా ఆదాయం సీజ్ చేసిన దుకాణాలు ఇలా.. ఎక్కడ ఎన్ని కోఠి సబ్వే 67 సుల్తాన్బజార్ కాంప్లెక్స్ 53 పటాన్చెరు 56 మంగళ్హాట్ మార్కెట్ 24 కుషాయిగూడ 23 -
ఇక్ఫాయ్– టీహబ్ మధ్య కుదిరిన ఒప్పందం
శంకర్పల్లి: మండలంలోని దొంతాన్పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇక్ఫాయ్ అంకుర సంస్థ– టీ హబ్ ఫౌండేషన్ మధ్య మంగళవారం ఓ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కళాశాలలో ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ఎల్.ఎస్.గణేశ్, టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వీసీ గణేశ్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరిశ్రమలు, విద్యారంగ సాధికారత అనే అంశాలపై నాలెడ్జ్ పెంపొందించుకోవచ్చని, విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన వస్తుందన్నారు. సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలకు సాంకేతికంగా సాయం చేసేందుకు టీ హబ్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీ హబ్ సీనియర్ ఇన్వెస్టడ్ స్టార్టప్ ఫండ్, సీనియర్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నగరానికి నిధుల కేటాయింపు అంతంతే.. అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ స్థలంపై వీడిన వివాదం శంషాబాద్: పంచాయతీ అవసరాలకు స్థలాన్ని అప్పగించి ప్రత్యామ్నాయంగా తీసుకున్న స్థలం సరైందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని బాధితులు చింతల రామకృష్ణ, చింతల లక్ష్మణ్ తెలిపారు. కోర్టు తీర్పువచ్చిన తర్వాత కూడా తమను కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారన్నారు. వివరాలు వారి మాటల్లోనే.. శంషాబాద్ పట్టణంలో 2001లో మహిళా మండలి భవనం వెనకాల భోజనశాల కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గం మా తల్లి చింతల అన్నపూర్ణకు సంబంధించిన 430 గజాల స్థలాన్ని తీసుకుని పట్టణంలోని బృందావన్ కాలనీలో సర్వే నంబరు 687, 688 ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారు. సంబంధిత స్థలంలో గృహ నిర్మాణానికి పంచాయతీ అనుమతి కూడా జారీ చేశారు. ఇందులో గతంలోనే కొంత స్థలాన్ని తాము విక్రయించగా మిగిలి స్థలమైన ప్లాటు నంబరు 173, 174లో ఉన్న 430 గజాల స్థలం పార్కు స్థలంగా పేర్కొంటు కాలనీ అసోసియేషన్ పలుమార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ తమకే సానుకూలమైన తీర్పువచ్చిందన్నారు. 2014 తర్వాత అసోసియేషన్ ప్రమేయంతో అప్పటి పంచాయతీ పాలకవర్గం సంబంధిత స్థలాన్ని వివాదాస్పదంగా పేర్కొంటు తీర్మానం చేయడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పంచాయతీ తమ వద్ద భూమిని తీసుకుని ప్రత్యామ్నాయంగా అందజేయడానికి చేసిన బదలాయింపు డీడ్ను సమర్థించి హైకోర్టు తుది తీర్పును అందజేసిందన్నారు. హైకోర్టు తుదితీర్పు ఆధారంగా తాము పనులు చేసుకుంటుండగా కాలనీవాసులు 9 మంది వరకు వచ్చిన గత నాలుగైదు రోజులుగా పనులు చేస్తే బాగుండదని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత వ్యక్తులపై ఆర్జీఐఏ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపాలిటీకి అందజేసినట్లు పేర్కొన్నారు. పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి శంషాబాద్: పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్, శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు సూచించారు. పట్టణంలో డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఆర్జీఐఏ, శంషాబాద్, కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రజలతో శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పండగ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఐఏ సీఐ బాలరాజు, శంషాబాద్ సీఐ నరేందర్రెడ్డి మాజీ కౌన్సిలర్ జహంగీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్స్నాచింగ్పై రాచకొండ సీపీ ఆరా
ఇబ్రహీంపట్నం రూరల్: కల్లు తాగేందుకు వచ్చి.. మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులకు సంబంధించి సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు స్పందించారు. పోలీసు అధికారులను ఆరా తీశారు. గతంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అడిగి తెలుసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం హుటాహుటిన ఎంపీపటేల్గూడకు చెందిన బాధితురాలు తక్కలపల్లి ప్రేమలత వద్దకు వెళ్లారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు చేయాలని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో సాయంత్రం తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఫిర్యాదు చేయనంటే చేయనని తేల్చి చెప్పింది. గతంలో తన బంగారు పుస్తెలతాడు పోతే నేటికి న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా ఫిర్యాదు ఇచ్చినా దండగేనని వాపోయింది. అలా ఏమీ ఉండదని, తప్పకుండా న్యాయం జరుగుతుందని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. బాధితురాలి నుంచి వివరాల సేకరణ ఘటనపై ఫిర్యాదు చేయాలని సూచన -
బాలురు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 202518,384అత్తాపూర్ హసన్నగర్కు చెందిన ఓ ఏసీ టెక్నీషియన్కు సులేమాన్నగర్కు చెందిన మహిళతో వివాహమైంది. చాంద్రాయణగుట్టలోని బాబానగర్లో కాపురం పెట్టారు. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. మూడో సంతానంలోనూ మళ్లీ ఆడబిడ్డ పుడుతుందనే అనుమానంతో భర్త నెల రోజుల క్రితం తల్లీబిడ్డలను నడిరోడ్డున వదిలేసి వెళ్లాడు.సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ.. ఆడబిడ్డలపై మాత్రం ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టుక నుంచి చదువు, తినే తిండి, వేసుకునే బట్టలు ఇలా అన్నిట్లోనూ వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. సమాజంపై అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు సైతం అదే ధోరణిలో వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పుత్రుడు పుడితే తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే భావన ఇప్పటికీ మెజార్టీ తల్లిదండ్రుల్లో ఉంది. అంతేకాదు తమ తర్వాత వంశం అంతరించిపోకుండా అలాగే కొనసాగుతుందనే నమ్మకం. ఆడపిల్లకు చదువు చెప్పించడం, పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇప్పటికీ భారంగా భావిస్తున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. కన్ను తెరవకముందే కాటికి పంపేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసీ కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి యథేచ్ఛగా పరీక్షలు చేస్తున్నాయి. మొదటి, రెండో కాన్పు తర్వాత ఎక్కడ మళ్లీ ఆడబిడ్డే పుడుతుందో అనే భయంతో నిండు గర్భిణులను వదిలేస్తున్న భర్తలూ లేకపోలేదు. అత్తామామలు, ఆడబిడ్డలు, భర్త తరపు ఇతర బంధువుల సూటిపోటి మాటలను తట్టుకోలేక మహిళలు కూడా అబార్షన్లకు తలవంచుతున్నారు. బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం 2023–24లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 39,861 ప్రసవాలు జరిగితే, వీటిలో 20,903 మంది బాలురు, 18,958 మంది బాలికలు జన్మించారు. 2024–25లో 35,377 ప్రసవాలు జరిగితే 18,384 మంది బాలురు, 16,993 మంది బాలికలు జన్మించారు. 2023–24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 907 మంది బాలికలు జన్మించగా, 2024–25లో 924 మంది జన్మించడం గమనార్హం. ఫలితంగా జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం నమోదువుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మిస్తున్న శిశువులతో పోలిస్తే..ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మిస్తున్న ఆడ శిశువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుండడం గమనార్హం. న్యూస్రీల్ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తిసంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి 2023–24 12,424 11,458 922 2024–25 10,381 9,956 959 ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తి సంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి 2023–24 8,479 7,500 885 2024–25 8,003 7,037 879మొత్తం ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తి సంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి 2023–24 20,903 18,958 907 2024–25 8,384 16,993 924 -
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రామంతాపూర్కు చెందిన సక్కుబాయి (38), పాండు దంపతులు. సక్కుబాయి మహేశ్వరం మండలం ఎన్డీతండా పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్పేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సక్కుబాయి అమ్మగారి గ్రామమైన కొందుర్గుకు స్కూటీపై వచ్చారు. గ్రామంలో గతంలో వారు కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న పండ్లతోట పనులు చూసి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ వద్దకు రాగానే హెచ్పీ పెట్రోల్బంకు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీచక్రాలు బైకుపై నుంచి వెళ్లడంతో సక్కుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన పాండును చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. భర్తకు తీవ్ర గాయాలు -
స్కూల్ బస్లో మంటలు
తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్తో స్కూల్ బస్లో మంటలు చెలరేగిన ఘటన సాగర్ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాదరగ్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు (టీజీ08 యూ1796) ఇంజాపూర్లో విద్యార్థులను దింపేసి, తిరిగి వెళ్తుండగా గుర్రంగూడ వద్ద డ్రైవర్ సీటు కిందినుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు దిగి, తోటి వాహనదారుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేయడంతో పాటు ఫైరిజింన్కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ● విద్యార్థులను దింపేసి వస్తుండగా ఘటన ● సాగర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ -
ట్రేడింగ్ ఫ్రాడ్లో అకౌంట్ సప్లయర్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ట్రేడింగ్ ఫ్రాడ్ చేసే సైబర్ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు అందిస్తున్న గుర్గావ్ వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై దేశంలో 43 కేసులు, రాష్ట్రంలో ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. రాజస్థాన్కు చెందిన హిమాన్షు స్వామి ప్రస్తుతం గుర్గావ్లో నివసిస్తున్నాడు. ఇతడు పవన్ జైన్తో కలిసి బ్యాంకు ఖాతాలు సమీకరిస్తూ సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సోషల్మీడియా ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో రూ.20 లక్షలు స్వాహా చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు హిమాన్షు, పవన్ పాత్రను గుర్తించారు. గుర్గావ్ వెళ్లిన ప్రత్యేక బృందం హిమాన్షును అరెస్టు చేసింది. పరారీలో ఉన్న పవన్ కోసం గాలిస్తోంది. బస్సు కింద పడి మహిళ మృతి బొల్లారం: ఉద్యోగానికి బయలుదేరిన మహిళ యాక్సిడెంట్కు గురై మృతిచెందిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని త్రివేణి కుమారి(43) అల్వాల్ ఎంఈఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు లాల్బజార్ బస్టాప్కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టడడంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో త్రివేణి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని త్రివేణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ నరేశ్, కారు డ్రైవర్ రమేశ్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు పరిగి: ఆటో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బందయ్య, అంజమ్మ పరిగి నుంచి ఇంటికి వెళ్తుండగా కొడంగల్ వైపు నుంచి వస్తున్న ఆటో బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 సహాయంతో పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించినట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. చికిత్సపొందుతూ వ్యక్తి మృతి మోమిన్పేట:ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. అంరాధికలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్(42) కుటుంబ అవసరాల కోసం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొడుకుకు చికిత్స చేయించేందుకు అప్పు లు చేశాడు. ఇవి తీరే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గత ఆదివా రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమ నించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కోడి పందేల స్థావరంపై దాడి
13 మంది అరెస్ట్పహాడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై మహేశ్వరం జోన్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. జల్పల్లి గ్రామంలోని బాలాజీ వెంచర్లో కొన్ని రోజులుగా ఓ ముఠా కోడి పందేలు నిర్వహిస్తుంది. సోమవారం రాత్రి సైతం పందేలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్వోటీ, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, వీరబాబు, నాగరాజు, హరీష్, వెంకటేశ్వర్, ఉదయ్ భాస్కర్రాజ్, రవీందర్, వీర్రాజు, గోపి, వెంకట్రావు, బిసల్ సింగ్, అంకయ్యలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13,610 నగదు, 16 కోడి పందేల కత్తులు, రెండు కోళ్లు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
షాద్నగర్రూరల్: పండుగలను అందరూ కలిసి మెలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి అన్నారు. రంజాన్, ఉగాది పండుగలను పురస్కరించుకొని మంగళవారం షాద్నగర్ పట్టణ సీఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో బుగ్గారెడ్డి గార్డెన్లో శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రంజాన్, ఉగాది పండుగలు వెనువెంటనే ఉన్నందున హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకోవాలని సూచించారు. పండుగల సమయంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని, దీంతో అందరి మధ్య సోదర భావం మరింత పెంపొందుతుందని తెలిపారు. దేవాలయాలు, మసీదుల వద్ద పూజలు, ప్రార్థనలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సునీత, వివిధ పార్టీల నాయకులు బాబర్ఖాన్, అందె బాబయ్య, జమృత్ఖాన్, సర్వర్పాషా, చెంది మహేందర్రెడ్డి, ప్రశాంత్, ముక్తార్ అలీ, అన్వర్, అసద్ తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్మన్, శానిటరీ వర్కర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండాలని, 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ఈనెల 29వ తేదీ వరకు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య మెప్మా సెక్షన్లో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల ఉన్నతికి ఏఐ దోహదం కేశంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేవిధంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పాఠాలు బోధించేందకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్) జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జయచంద్రరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రాథమిక పాఠశాలకు మంజూరైన ఎఫ్ఎల్ఎన్ సిస్టంను మంగళవారం మండల విద్యాధికారి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవ త్సరం నుంచి 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ అభ్యాసన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠాలను అర్థ చేసుకొని సంభాషించి అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చేందుకు ఎఫ్ఎల్ఎన్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంలో తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్పీలు శరత్చంద్ర, స్వప్న, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు లలితకుమారి, కళ్యాణి, శ్రీదేవి, స్రవంతి, మంజుల, సీఆర్పీలు రామకృష్ణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రూ.1.30 కోట్ల నగదు పట్టివేత చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ గురునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట పూల్బాగ్ జంక్షన్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కియా కారును నిలిపి తనిఖీ చేయగా మహ్మద్ యూసుఫుద్దీన్, సయ్యద్ అబ్దుల్ హదీల వద్ద రూ.1.30 కోట్ల నగదు లభ్యమైంది. డబ్బుకు సంబంధించిన వివరాలు కోరగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మని, ల్యాండ్ కొన్నామని, అందుకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపని కారణంగా ఐటీ అధికారులకు అప్పగించారు. -
మదర్సా నుంచి బాలుడి అదృశ్యం
పహాడీషరీఫ్: మదర్సాలో ఉండే బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ సుల్తాన్ కుమారుడు సోల్మాన్(15) సైదాబాద్లోని జువైనల్ హోంలో ఉండడంతో, ఫౌజియా బేగం అనే సోషల్ వర్కర్ బాలుడితో పాటు మరో నలుగురిని జల్పల్లి కమాన్ రోడ్డు సమీపంలోని మదర్సాలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ నెల 24న ఉదయం సోల్మాన్ ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఫౌజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిపై దాడి ఇబ్రహీంపట్నం: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. రాయపోల్ గ్రామానికి చెందిన అచ్చన మహేశ్ (21), కావ్యశ్రీ(19) ప్రేమించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టం లేని కావ్యశ్రీ తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం మహేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. మహేశ్ అక్క మౌనికపై దాడి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అమ్మాయి తల్లిదండ్రులతోపాటు 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
● అగ్గి రాజుకుంటే బుగ్గే.. ● పరిశ్రమల్లో తరచూ అగ్నిప్రమాదాలు ● వేసవి వేళ జాగ్రత్తలు ముఖ్యం ● ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకోవాలి ● సూచిస్తున్న అగ్నిమాపక సిబ్బంది షాద్నగర్: వేసవి కాలం ప్రారంభమైంది.. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండకుంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అగ్నిమాపక కేంద్రాలు ఉన్నా సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ఉన్న ఆస్తి కాస్తా అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంది. వేసవి నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు, వ్యాపారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. తరచూ ప్రమాదాలు షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు, నందిగామ, షాద్నగర్ ప్రాంతాల్లో సుమారు 350కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. 50 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా కాటన్, జిన్నింగ్, ఆయిల్, హెర్చల్ పరిశ్రమల్లో అధికంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఉత్పత్తులు, యంత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో పని చేయాల్సి వస్తోంది. 11 నెలల క్రితం నందిగామలో పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అలైన్ ఫార్మా హెర్బల్ పరిశ్రమలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు స్పాంజ్, థర్మాకోల్ షీట్లపై పడటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు నెలల క్రితం అన్నారం గ్రామ శివారులోని ఆయిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లింది. ఇటీవల బైపాస్ రోడ్డులో వ్యర్థాలకు గుర్తు తెలియని వారు నిప్పంటించారు. గతంలో మొగిలిగిద్ద గ్రామ శివారులో రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. షాద్నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. భారీ ప్రమాదాలు జరిగితే షాద్నగర్ ఉన్న అగ్నిమాపక శకటాలతో పాటు, శంషాబాద్, రాజేంద్రనగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల నుంచి శకటాలను రప్పించి మంటలను ఆర్పేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు సిద్ధంగా ఉండాలి.. వేసవి కాలం ప్రారంభం కావడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ వారు సూచిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు విధిగా మంచినీటిని అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా పరిశ్రమల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. యంత్రాలకు సంబంధించిన విద్యుత్ వైర్లు సరిగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చూసుకోవాలని చెబుతున్నారు. సత్వరం సమాచారం ఇవ్వాలి వేసవి కాలం పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలి. నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. వెంటనే మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకుంటాం. – జగన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్నగర్ అగ్నిమాపక కేంద్రం -
ఇక్ఫాయ్– టీహబ్ మధ్య కుదిరిన ఒప్పందం
శంకర్పల్లి: మండలంలోని దొంతాన్పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇక్ఫాయ్ అంకుర సంస్థ– టీ హబ్ ఫౌండేషన్ మధ్య మంగళవారం ఓ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కళాశాలలో ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ఎల్.ఎస్.గణేశ్, టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వీసీ గణేశ్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరిశ్రమలు, విద్యారంగ సాధికారత అనే అంశాలపై నాలెడ్జ్ పెంపొందించుకోవచ్చని, విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన వస్తుందన్నారు. సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలకు సాంకేతికంగా సాయం చేసేందుకు టీ హబ్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీ హబ్ సీనియర్ ఇన్వెస్టడ్ స్టార్టప్ ఫండ్, సీనియర్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నగరానికి నిధుల కేటాయింపు అంతంతే.. అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ స్థలంపై వీడిన వివాదం శంషాబాద్: పంచాయతీ అవసరాలకు స్థలాన్ని అప్పగించి ప్రత్యామ్నాయంగా తీసుకున్న స్థలం సరైందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని బాధితులు చింతల రామకృష్ణ, చింతల లక్ష్మణ్ తెలిపారు. కోర్టు తీర్పువచ్చిన తర్వాత కూడా తమను కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారన్నారు. వివరాలు వారి మాటల్లోనే.. శంషాబాద్ పట్టణంలో 2001లో మహిళా మండలి భవనం వెనకాల భోజనశాల కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గం మా తల్లి చింతల అన్నపూర్ణకు సంబంధించిన 430 గజాల స్థలాన్ని తీసుకుని పట్టణంలోని బృందావన్ కాలనీలో సర్వే నంబరు 687, 688 ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారు. సంబంధిత స్థలంలో గృహ నిర్మాణానికి పంచాయతీ అనుమతి కూడా జారీ చేశారు. ఇందులో గతంలోనే కొంత స్థలాన్ని తాము విక్రయించగా మిగిలి స్థలమైన ప్లాటు నంబరు 173, 174లో ఉన్న 430 గజాల స్థలం పార్కు స్థలంగా పేర్కొంటు కాలనీ అసోసియేషన్ పలుమార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ తమకే సానుకూలమైన తీర్పువచ్చిందన్నారు. 2014 తర్వాత అసోసియేషన్ ప్రమేయంతో అప్పటి పంచాయతీ పాలకవర్గం సంబంధిత స్థలాన్ని వివాదాస్పదంగా పేర్కొంటు తీర్మానం చేయడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పంచాయతీ తమ వద్ద భూమిని తీసుకుని ప్రత్యామ్నాయంగా అందజేయడానికి చేసిన బదలాయింపు డీడ్ను సమర్థించి హైకోర్టు తుది తీర్పును అందజేసిందన్నారు. హైకోర్టు తుదితీర్పు ఆధారంగా తాము పనులు చేసుకుంటుండగా కాలనీవాసులు 9 మంది వరకు వచ్చిన గత నాలుగైదు రోజులుగా పనులు చేస్తే బాగుండదని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత వ్యక్తులపై ఆర్జీఐఏ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపాలిటీకి అందజేసినట్లు పేర్కొన్నారు. పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి శంషాబాద్: పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్, శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు సూచించారు. పట్టణంలో డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఆర్జీఐఏ, శంషాబాద్, కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రజలతో శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పండగ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఐఏ సీఐ బాలరాజు, శంషాబాద్ సీఐ నరేందర్రెడ్డి మాజీ కౌన్సిలర్ జహంగీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో అన్నదమ్ములకు రిమాండ్
కందుకూరు: ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు, మంగళవారం వారిని రిమాండ్కు తరలించారు. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన శమంత అలియాస్ శశికళకు గతంలో వివాహం కాగా భర్త చనిపోయాడు. దీంతో తన కుమార్తెను తీసుకుని హైదరాబాద్లోని అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఇదిలా ఉండగా శమంతకు ఇదే గ్రామానికి చెందిన మొలగాసి సుధాకర్తో పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. భర్త చనిపోవడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె అన్న మాదరమోని శేఖర్(33), తమ్ముడు మాదరమోని వినయ్(27) గతంలో పలుమార్లు సుధాకర్ను, శమంతను మందలించారు. కొద్ది రోజుల క్రితం శమంత తన అవసరాల నిమిత్తం సుధాకర్ వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. ఈనెల 22న మధ్యాహ్నం సమయంలో తన డబ్బు ఇల్వాలంటూ సుధాకర్ శమంత ఇంటికి వెళ్లి, కత్తితో బెదిరించాడు. ఈ సమయంలో శమంతతో పాటు సోదరులు సుధాకర్తో గొడవపడ్డారు. దీంతో శమంత అదే రోజు కందుకూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి బైక్పై అదే రోజు సాయంత్రం కందుకూరు పీఎస్కు వెళ్తుండగా.. శమంత సోదరులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకుని, రిమాండ్కు తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడించిన సీఐ సీతారామ్ -
ముగిసిన న్యాయవాది అంత్యక్రియలు
మహేశ్వరం: చంపాపేట్లో హత్యకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మహేశ్వరం మండలం తుమ్మలూరులో మంగళవారం ముగిశాయి. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్లు పాశం లక్ష్మీపతి గౌడ్, ఏనుగు జంగారెడ్డి, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్, మాదిగ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జయకర్ మాదిగ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ నేత ఎర్రవాపు ఇజ్రాయిల్ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుమ్మలూరుకు చేరుకుని ఇజ్రాయిల్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడేవారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇజ్రాయిల్ను కత్తితో పొడిచి హత్య చేసిన దస్తగిరి వెనుక ఉన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య జరిగి ఏళ్లు కావస్తున్నా నిందితులకు ఇప్పటివరకూ శిక్ష వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని కోరారు. ఇజ్రాయిల్ పార్థివదేహానికి నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు -
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
చేవెళ్ల: పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చేపడుతున్న ఉపాధిహామీ పనులను అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలని డీఆర్డీఓ శ్రీలత అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 2023–24 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనులు, గుర్తించిన లోటుపాట్లపై సిబ్బందిని వివరణ కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిలో ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలు, మెటీరియల్ కలిపి మొత్తం రూ.1.58 కోట్ల పనులు జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ఎంపీఓ విఠలేశ్వర్జీ, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్గౌతమ్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సునీత, ఎస్టీఎం నందు, ఈసీ రాజశేఖర్, టీఏలు నాగేశ్వర్రావు, హరిశంకర్, పరమేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ఫ్యూచర్’ బాధిత రైతులను ఆదుకోవాలి
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పో యిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. భూ బాధితుల పక్షాన పోరాటం చేయడానికి మంగళవారం జీపు జాతను ప్రారంభించారు. మండల పరిధిలోని ఆకులమైలారం, మీర్ ఖాన్పేట, బేగరికంచె, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడ, ముచ్చర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో అప్పటి సీఎం కేసీఆర్ 15 వేల ఎకరాలు సేకరించారని, అధికారంలోకి రాకముందు రేవంత్రెడ్డి ఫార్మాను రద్దు చేస్తామని చెప్పి, ఫ్యూచర్ సిటీ పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని అదనంగా భూములు తీసుకుంటున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం రైతులను సమావేశపరిచి, వారి సమ్మతి తోనే భూములు సేకరించాలన్నారు. ఫ్యూచర్ సిటీ గ్రామాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే పాదయాత్రకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.రాంచందర్, జిల్లా కమిటీ సభ్యులు జి.నరసింహ, అంజయ్య, మండల కార్యదర్శి బి.బాల్రాజ్, యాచారం కార్యదర్శి ఎ.నరసింహ, నాయకులు శ్రీనివాస్, నర్సింహ, శ్రీరాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య -
వ్యక్తి దారుణ హత్య
డబ్బు విషయంలో తలెత్తిన ఘర్షణ కందుకూరు: డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన మొలగాసి సుధాకర్(34) వ్యత్తిరీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన సల్ల శమంత అలియాస్ శశికళకు అవసరాల నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఆయన డబ్బును అప్పుగా ఇచ్చాడు. తిరిగి తీసుకోవడానికి శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శశికళతో పాటు ఆమె తమ్ముళ్లు శేఖర్, వినయ్లతో సుధాకర్కు గొడవ జరిగింది. దీనిపై ఆమె కందుకూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి పీఎస్లో ఫిర్యాదు చేయడానికి అదే రోజు సాయంత్రం బైక్పై బయలుదేరాడు. గమనించిన శశికళ తమ్ముడు వినయ్ అతని బైక్ను అనుసరిస్తూ స్కూటీపై వస్తుండగా, లేమూరు గ్రామం దాటిన తర్వాత మరో తమ్ముడు శేఖర్ కాపు కాశాడు. అక్కడికి రాగానే సూధాకర్పై ఇద్దరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి సుధాకర్ మృతిచెందాడని భావించి పరారయ్యారు. క్షతగాత్రుడిని తల్లి స్థానికుల సహాయంతో తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు సంబంధించి బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో టికెట్లను విక్రయిస్తున్న 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
రెక్కీ నిర్వహించి.. భారీగా దోచేసి
ఇబ్రహీంపట్నం రూరల్: రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో ఆదిబట్ల పోలీసులు పురోగతి సాధించారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం అర్ధరాత్రి నాలుగు నిమిషాల్లో ఏటీఎం నుంచి రూ.29 లక్షలు అపహరించిన హర్యానా దుండగులు.. ఎట్టకేలకు రాజస్థాన్లో ఆదిబట్ల పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఫ్లైట్లో స్నేహితులను రప్పించి.. ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నింధితుడు 2023లో నగరంలోని జేసీబీ షెడ్డులో పని చేసేవాడు. అనివార్య కారణాల వలన హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లిపోయాడు. అనంతరం గత నెల 21న నగరానికి కారులో వచ్చాడు. ఏదైనా పెద్ద దోపిడీ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఆటోలో భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ అనుకూలంగా లేకపోవడంతో రావిర్యాల ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. మార్చి 1న హర్యానా నుంచి మరో నలుగురు స్నేహితులను ఫ్లైట్లో రప్పించుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడినగదును అపహరించారు. అనంతరం మైలార్దేవరపల్లిలో మరో ఎస్బీఐ ఏటీఎం దోచే క్రమంలో.. వేరే వ్యక్తుల అలజడితో అక్కడి నుంచి ఆదే రాత్రి స్విఫ్ట్ కారులో పటాన్చెరువు మీదుగా హర్యానా, రాజస్థాన్కు పారిపోయారు. నగరంలోనే షల్టర్.. దోపిడీకి ముందు ప్రధాన నిందితుడు హైదరాబాద్తో పాటు పటన్చెరువు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. ఓ మజీద్లో పని చేసే వ్యక్తి షెల్టర్ ఇచ్చాడని, అతను బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీ చేసేందుకు అక్కడే గ్యాస్ కట్టర్లు, గ్లౌజ్లు, ఇనుపరాడ్లు, గ్యాస్ తదితర సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పహాడీ వీరికి అడ్డా.. కర్ణాటక, ఒడిస్సా, కడప, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ హర్యానా గ్యాంగే ఏటీఎంలను కొల్లగొట్టి నట్లు సమాచారం. రావిర్యాలలో అపహరించిన సొత్తుతో నేరుగా రాజస్థాన్లోని వారి అడ్డా అయిన మేవాడ్ ప్రాంతంలోని పహాడీ పోలిస్స్టేషన్ పరిధి లో తలదాచుకుంటారు. అక్కడే వాళ్ల రాజ్యం. స్థాని క ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసే సెటిల్మెంట్ చేసుకుంటారని తెలుస్తోంది. వాళ్లను పట్టుకోవడం కూడా చాలా కష్టమని, అక్కడి ప్రజాప్రతి నిధులను పట్టుకొని మధ్యవర్తిగా వ్యవహరించిన వారికి ముడుపులు ఇస్తే కాని.. సహకరించరన్నట్లు తెలుస్తోంది. 20 రోజులుగా ఆదిబట్ల పోలీసులు నాలుగు బృందాలుగా హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేసి నిందితులను గుర్తించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో దొంగలు ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి నేతృత్వంలో.. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. రాజస్థాన్లో తలదాచుకున్న నిందితులు ఇద్ద రు, వారికి షెల్టర్ ఇచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి కొంత సొమ్ము రికవరీ చేసినట్లు, మరో నిందితుడిని ఇక్క డి పోలీసులకంటే ముందే వైజాగ్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనా.. క్షణాల్లో ఏటీఎంలను కొల్లగొట్టే దొంగల ముఠాను తక్కువ తక్కువ కాలంలోనే పట్టుకొని పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.ఏటీఏం చోరీ కేసులో పురోగతి రాజస్థాన్లో పట్టుబడిన హర్యానా గ్యాంగ్ ఆదిబట్ల పోలీసుల అదుపులోఐదుగురు నిందితులు! -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
షాబాద్: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శంషాబాద్ ఎస్ఎస్ స్కేటింగ్ అకాడమీ కోచ్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని అండర్ 10 కాంపిటేషన్ ఎస్ఎస్ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో షాబాద్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి లంబాడి నవీష్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, కోచ్ నవీష్ను అభినందించారు. అనంతరం కోచ్ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న వారి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. -
కుల వివక్ష నిర్మూలనకు కృషి చేయాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ మాడ్గుల: ఆత్మగౌరవం, సమానత్వం, కుల వివక్షపై పోరాటాలకు సిద్ధం కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ నెల 31న మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సదస్సును నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రానున్నారని, సంఘం శ్రేణులు, ప్రజలందరూ పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్, నాయకులు అంజి, లింగం, రామకృష్ణ, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో లైంగిక దాడి నాగోలు: ప్రేమ పేరుతో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడమేగాక తన వద్ద ఉన్న ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరిస్తున్న యువకుడిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మాన్సురాబాద్ వినాయక్నగర్ కాలనీకి చెందిన ఓ కుటుంబం కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. వారి కుమార్తె (17) ఇంటి వద్దనే ఉంటోంది. కారు డ్రైవర్గా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెందిన కిలారి నాగార్జున సదరు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె నుంచి బంగారం, నగదు తీసుకున్నాడు. గత కొన్నాళ్లుగా బాధితురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు శనివారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు నాగార్జునపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె లేని జీవితం వ్యర్థం
షాద్నగర్రూరల్: ప్రియురాలు చనిపోయిందని మనస్తాపం చెందిన ప్రియుడు.. ఆమె లేని జీవితం వ్యర్థమని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు.. షాద్నగర్ పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ముగిసినప్పటికీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు తరువాత వెళ్తానని హాస్టల్ అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా.. చందు ప్రేమించిన యువతి నెల రోజులు క్రితం చనిపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన అతను.. తొలుత వసతిగృహం గదిలో ఉరి వేసుకునేందుకు ఫ్యాన్కు బెడ్ షీట్ను కట్టాడు. ఏమైందో ఏమోకాని.. ఆ తరువాత హాస్టల్ భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే హాస్టల్ అధికారులకు, ఇతర విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాయాలతో పడున్నచందును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. యువకుడి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎడమ చేయి విరిగిందని తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్సకోసంచందును.. కుటుంబీకులు ప్రైవేట్ హాస్పిటల్కుతరలించారు. ప్రేమించిన యువతి మరణంతో మనస్తాపం చెంది, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పరీక్షలు సరిగా రాయలేదని చందు సోదరుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్ ఆగం చేసుకోవద్దు ప్రేమ పేరుతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఇంటర్ విద్యార్థి చందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందును ఆయన ఆదివారం పరామర్శించి మాట్లాడారు. తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా.. వారి కలలను సాకారం చేసేందుకు విద్యావంతులుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వసతిగృహాన్ని పరిశీలించారు. ● ప్రియురాలు చనిపోయిందని ప్రియుడి ఆత్మహత్యాయత్నం ● గాయాలతో చికిత్స పొందుతున్నయువకుడు -
ఆమె లేని జీవితం వ్యర్థం
షాద్నగర్రూరల్: ప్రియురాలు చనిపోయిందని మనస్తాపం చెందిన ప్రియుడు.. ఆమె లేని జీవితం వ్యర్థమని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు.. షాద్నగర్ పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ముగిసినప్పటికీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు తరువాత వెళ్తానని హాస్టల్ అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా.. చందు ప్రేమించిన యువతి నెల రోజులు క్రితం చనిపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన అతను.. తొలుత వసతిగృహం గదిలో ఉరి వేసుకునేందుకు ఫ్యాన్కు బెడ్ షీట్ను కట్టాడు. ఏమైందో ఏమోకాని.. ఆ తరువాత హాస్టల్ భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే హాస్టల్ అధికారులకు, ఇతర విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాయాలతో పడున్నచందును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. యువకుడి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎడమ చేయి విరిగిందని తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్సకోసంచందును.. కుటుంబీకులు ప్రైవేట్ హాస్పిటల్కుతరలించారు. ప్రేమించిన యువతి మరణంతో మనస్తాపం చెంది, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పరీక్షలు సరిగా రాయలేదని చందు సోదరుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్ ఆగం చేసుకోవద్దు ప్రేమ పేరుతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఇంటర్ విద్యార్థి చందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందును ఆయన ఆదివారం పరామర్శించి మాట్లాడారు. తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా.. వారి కలలను సాకారం చేసేందుకు విద్యావంతులుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వసతిగృహాన్ని పరిశీలించారు. ● ప్రియురాలు చనిపోయిందని ప్రియుడి ఆత్మహత్యాయత్నం ● గాయాలతో చికిత్స పొందుతున్నయువకుడు -
● పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
చేవెళ్ల: మున్సిపాలిటీకి పన్నుల వసూళ్లే కీలక ఆదాయ వనరు కావడంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు కావటంతో పన్నుల వసూళ్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. గతంలో పంచాయతీలుగా ఉన్న సమయంలోనే 40 శాతానికిపైగా వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోకి మారిన తరువాత పన్నుల వసూళ్ల కోసం ఆన్లైన్ విధానంలో అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించేందుకు ఓ బ్యాంక్ ద్వారా అనుసంధానం అయ్యారు. ఇంకా పన్నులు వసూలు చేసే యంత్రాలు మున్సిపాలిటీకి రాకపోవడంతో పూర్తిస్థాయిలో వసూళ్లు చేయడం లేదు. ప్రస్తుతం పన్నులు చెల్లించే వారి నుంచి చెక్కుల రూపంలో తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. వీటిని ఆన్లైన్ యంత్రాలు వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తామంటున్నారు. అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు. వందశాతం వసూళ్లే లక్ష్యంగా ముందుకు వెళ్తామని మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ చెప్పారు. రెండుమూడురోజుల్లో యంత్రాలు వచ్చిన వెంటనే ప్రక్రియ మరింత వేగవంతంగా సాగుతుందన్నారు. -
రెక్కీ నిర్వహించి.. భారీగా దోచేసి
ఇబ్రహీంపట్నం రూరల్: రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో ఆదిబట్ల పోలీసులు పురోగతి సాధించారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం అర్ధరాత్రి నాలుగు నిమిషాల్లో ఏటీఎం నుంచి రూ.29 లక్షలు అపహరించిన హర్యానా దుండగులు.. ఎట్టకేలకు రాజస్థాన్లో ఆదిబట్ల పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఫ్లైట్లో స్నేహితులను రప్పించి.. ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నింధితుడు 2023లో నగరంలోని జేసీబీ షెడ్డులో పని చేసేవాడు. అనివార్య కారణాల వలన హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లిపోయాడు. అనంతరం గత నెల 21న నగరానికి కారులో వచ్చాడు. ఏదైనా పెద్ద దోపిడీ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఆటోలో భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ అనుకూలంగా లేకపోవడంతో రావిర్యాల ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. మార్చి 1న హర్యానా నుంచి మరో నలుగురు స్నేహితులను ఫ్లైట్లో రప్పించుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడినగదును అపహరించారు. అనంతరం మైలార్దేవరపల్లిలో మరో ఎస్బీఐ ఏటీఎం దోచే క్రమంలో.. వేరే వ్యక్తుల అలజడితో అక్కడి నుంచి ఆదే రాత్రి స్విఫ్ట్ కారులో పటాన్చెరువు మీదుగా హర్యానా, రాజస్థాన్కు పారిపోయారు. నగరంలోనే షల్టర్.. దోపిడీకి ముందు ప్రధాన నిందితుడు హైదరాబాద్తో పాటు పటన్చెరువు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. ఓ మజీద్లో పని చేసే వ్యక్తి షెల్టర్ ఇచ్చాడని, అతను బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీ చేసేందుకు అక్కడే గ్యాస్ కట్టర్లు, గ్లౌజ్లు, ఇనుపరాడ్లు, గ్యాస్ తదితర సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పహాడీ వీరికి అడ్డా.. కర్ణాటక, ఒడిస్సా, కడప, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ హర్యానా గ్యాంగే ఏటీఎంలను కొల్లగొట్టి నట్లు సమాచారం. రావిర్యాలలో అపహరించిన సొత్తుతో నేరుగా రాజస్థాన్లోని వారి అడ్డా అయిన మేవాడ్ ప్రాంతంలోని పహాడీ పోలిస్స్టేషన్ పరిధి లో తలదాచుకుంటారు. అక్కడే వాళ్ల రాజ్యం. స్థాని క ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసే సెటిల్మెంట్ చేసుకుంటారని తెలుస్తోంది. వాళ్లను పట్టుకోవడం కూడా చాలా కష్టమని, అక్కడి ప్రజాప్రతి నిధులను పట్టుకొని మధ్యవర్తిగా వ్యవహరించిన వారికి ముడుపులు ఇస్తే కాని.. సహకరించరన్నట్లు తెలుస్తోంది. 20 రోజులుగా ఆదిబట్ల పోలీసులు నాలుగు బృందాలుగా హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేసి నిందితులను గుర్తించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో దొంగలు ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి నేతృత్వంలో.. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. రాజస్థాన్లో తలదాచుకున్న నిందితులు ఇద్ద రు, వారికి షెల్టర్ ఇచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి కొంత సొమ్ము రికవరీ చేసినట్లు, మరో నిందితుడిని ఇక్క డి పోలీసులకంటే ముందే వైజాగ్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనా.. క్షణాల్లో ఏటీఎంలను కొల్లగొట్టే దొంగల ముఠాను తక్కువ తక్కువ కాలంలోనే పట్టుకొని పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.ఏటీఏం చోరీ కేసులో పురోగతి రాజస్థాన్లో పట్టుబడిన హర్యానా గ్యాంగ్ ఆదిబట్ల పోలీసుల అదుపులోఐదుగురు నిందితులు! -
నూనె గింజల సాగు.. బాగు
షాబాద్: మార్కెట్లో వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిమాండ్ నేపథ్యంలో నూనె గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నా రు. మండల పరిధి ముద్దెంగూడ, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్, బొబ్బిలిగామ, కొమరబండ, గోల్లూరుగూడ తదితర గ్రామాల రైతులు.. ఈ సంవత్సరం తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు, వేరు శనగ తదితర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు పలు కారణాలతో నష్టాలను తెచ్చిపెడుతుండటం, నూనె గింజల పంటలకు మద్దతు ధరతో పాటు ఆదాయం వస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వేలాది ఎకరాల్లో తెల్ల కుసుమ గతంలో మండల పరిధిలో ఎక్కడా తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ ప్రత్యామ్నాయపంటలు వేసుకోవాలనే ప్రభుత్వ సూచన మేరకు.. ఈ యాసంగి సీజన్లో 1,048 ఎకరాలకు పైగా పొద్దు తిరుగుడు, 2,814 ఎకరాలకు పైగా తెల్ల కుసుమ సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కనువిందు చేస్తున్న పొద్దుతిరుగుడు షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ, కొమరబండ, బొబ్బిలిగామ, తిర్మలాపూర్, లక్ష్మారావుగూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, ఏట్ల ఎర్రవల్లి తదితర గ్రామాల శివారుల్లో చెరువులు, బోరు బావుల కింద రైతులు నూనె గింజల పంటలు వేశారు. పొద్దు తిరుగుడు పంట పూత దశలో ఉండి ఆకర్షిస్తోంది. గతేడాది మండలంలో పొద్దు తిరుగుడు 254 ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతం 1,048 ఎకరాలు సాగవుతోంది. వేరుశనగ 68 ఎకరాలు కాగా.. ఇప్పుడు 218 ఎకరాలు,తెల్ల కుసుమ 1,542 ఎకరాలు కాగా.. ప్రస్తుతం 2,814 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న, శనగఅంతర పంటగా 317 ఎకరాలు సాగు చేయగా, ప్రస్తుతం 624 ఎకరాల వరకు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. వాణిజ్య పంటలు ఏపుగా పెరుగుతుండటంతో.. మద్దతు ధరపై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.రోజురోజుకూపెరుగుతున్న ఆయిల్ ధరలు పత్తి, మొక్కజొన్న సాగుకురైతులు స్వస్తి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు,వేరు శనగ పంటలపై ఆసక్తి -
సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆదివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన పద్మశాలీసంఘం నాయకులు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆయనను ఆమనగల్లు భక్తమార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు ఎంగలి బాలకృష్ణయ్య, పద్మశాలీసంఘం నాయకులు అప్పం శ్రీనివాస్, మసున మురళీధర్, యాదగిరి కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు భక్త మార్కండేయస్వామి దేవాలయ ఆవరణలో కమ్యునిటీహాలు, వసతిగృహం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు వినతిపత్రం అందించారు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారిని విస్తరించండికడ్తాల్: శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర నాయకుడు ఆచారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి (ఎన్హెచ్765) రద్దీగా మారిందని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విస్తరణతో రద్దీని, ప్రమాదాలను నివారించొచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రోడ్డుకు సంబంధించి డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలాల్నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్దోనాదుల, కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ అడ్డాల వద్ద సౌకర్యాలు కల్పించాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మొయినాబాద్: భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు లేక కార్మికులు గంటల తరబడి రోడ్లపైనే పనికోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాగునీరు, టాయిలెట్స్ లేక మహిళా కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. బడా నిర్మాణ సంస్థలు తక్కువ కూలీ ఇచ్చి 12–14 గంటలు పనిచేయించుకుంటున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సొంత ఊళ్లకు పంపిస్తున్నారని.. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయన్నారు. ఇలాంటి సమస్యలన్నింటిపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 21, 22తేదీల్లో శంషాబాద్లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని.. ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 21న శంషాబాద్లో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి, కార్యదర్శి సత్యానారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
డబ్బు విషయంలో తలెత్తిన ఘర్షణ కందుకూరు: డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన మొలగాసి సుధాకర్(34) వ్యత్తిరీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన సల్ల శమంత అలియాస్ శశికళకు అవసరాల నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఆయన డబ్బును అప్పుగా ఇచ్చాడు. తిరిగి తీసుకోవడానికి శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శశికళతో పాటు ఆమె తమ్ముళ్లు శేఖర్, వినయ్లతో సుధాకర్కు గొడవ జరిగింది. దీనిపై ఆమె కందుకూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి పీఎస్లో ఫిర్యాదు చేయడానికి అదే రోజు సాయంత్రం బైక్పై బయలుదేరాడు. గమనించిన శశికళ తమ్ముడు వినయ్ అతని బైక్ను అనుసరిస్తూ స్కూటీపై వస్తుండగా, లేమూరు గ్రామం దాటిన తర్వాత మరో తమ్ముడు శేఖర్ కాపు కాశాడు. అక్కడికి రాగానే సూధాకర్పై ఇద్దరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి సుధాకర్ మృతిచెందాడని భావించి పరారయ్యారు. క్షతగాత్రుడిని తల్లి స్థానికుల సహాయంతో తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు సంబంధించి బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో టికెట్లను విక్రయిస్తున్న 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
● గడువు వారమే.. వచ్చింది అరకొరే..
ఇబ్రహీంపట్నం: పన్నుల వసూళ్లకు వారం రోజులే గడువుంది. దీంతో మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.50 కోట్లు లక్ష్యం కాగా అందులో పాత బకాయిలే రూ.7 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.4.10 కోట్లు (48 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. గృహ, వాణిజ్య, వ్యాపార, విద్య, వైద్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారు 7,239 భవనాలకు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల బకాయిలు పక్కన పెడితే ప్రైవేట్ ప్రాపర్టీ పన్నులు రూ.9 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో బకాయిలు రూ.4.50 కోట్లు ఉన్నాయి. ఈ నెల 31వ తేదీలోపు లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. పేరుకుపోయిన ప్రైవేట్ ప్రాపర్టీల రూ.4.50 కోట్లు, ప్రభుత్వ సంస్థల రూ.2.50 కోట్ల పాత బాకాయిల వసూలు మున్సిపల్ యంత్రాంగానికి సవాల్గా మారింది. -
ఊపిరి తీస్తున్న ‘క్షయ’
● జిల్లాలో రెండేళ్లలో4,270 కేసులు నమోదు ● ఏటా పెరుగుతున్న టీబీ రోగులు ● వికారాబాద్ జిల్లాలో కొరవడినవైద్య సేవలు .. నగరంలోనిగాంధీ, చాతి ఆస్పత్రులకు పరుగు తాండూరు: క్షయ మనిషి ఊపిరి తీస్తోంది. కోరలు చాస్తున్న టీబీతో మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో అనంతగిరిలో టీబీ సానిటోరియం ఆస్పత్రి ద్వారా వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించే వారు. ఆస్పత్రిని మూసి వేయడంతో జిల్లాలో టీబీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నగరానికి పరుగు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి టీబీ సానిటోరియం.. దశాబ్దాల కాలం పాటు వేలాది మంది వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందించి ఆరోగ్యంగా మార్చింది. దీంతో రోగుల పాలిట సంజీవని అనంతగిరి అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం పూర్తిగా సానిటోరియం.. సేవలను నిలిపి వేసింది. దీంతో జిల్లాలో టీబి వైద్య సేవలు అందించే ఆస్పత్రులు కరువయ్యాయి. వ్యాధి తీవ్రత అధికమైతే నగరంలోని గాంధీ, లేదా ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రికి రోగులు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతానికి జిల్లాలోని తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి, మర్పల్లి హాస్పిటల్లో టీబీ నిర్ధారణ పరీక్షా కేంద్రాల ద్వారా వ్యాధి గ్రస్తులను గుర్తిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చిపంపిస్తున్నారు. ఎలా సోకుతుంది క్షయ క్రిముల వలన వ్యాపిస్తుంది. ఇతరులు ఎవరైనా దగ్గితే వారి నుంచి బ్యాక్టీరియా మరొకరికిసోకుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన సమయంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అంటు వ్యాధి కావడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టీబీ బారిన పడే ప్రమాదం ఉంది. పూర్వికుల నుంచి సోకే వ్యాధి కాదు. గాలి ద్వారా ఊపిరి తిత్తులకు దగ్గు ద్వారా వ్యాపించే ప్రాణాంతకరమైన వ్యాధి క్షయ. ఇది గాలి ద్వారా ఊపిరి తిత్తులకు సోకుతుంది. అక్కడి నుంచి మెదడు, కిడ్నీ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మైక్రో బ్యాక్టీరియం, ట్యూబర్కులోసిస్ వ్యాధి సోకుతుంది. మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారు త్వరగా క్షయ బారిన పడతారు. నివారణకు అందుబాటులో మందులు ఉన్నాయి. క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నుంచి బయట పడవచ్చు. 27 నెలల్లో 4,250 కేసులు జిల్లాలోని 20 మండలాల్లోని ప్రజలు అత్యధికంగా టీబి బారిన పడ్డారు. 2023లో 1,964 కేసులు, 2024లో 1,946, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 340 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా.. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. గతేడాది ప్రతి నెల ఒక్కో రోగికి రూ.500 చెల్లించేది. ప్రస్తుతం గతేడాది నవంబర్ నుంచి రూ.1,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో వ్యాధిగ్రస్తులు ఏటా ముగ్గురు మరణిస్తున్నారు. అవగాహన పెంచుతున్నాం క్షయ వ్యాఽధిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. వ్యాధి సోకిన వారికి అధికంగా దగ్గు రావడం, రాత్రి జ్వరం, తెమడతో కూడిన దగ్గు, నోట్లో నుంచి రక్తం పడటం జరుగుతుంటుంది. అలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్,రవీంద్రనాయక్,డిప్యూటీ డీఎంహెచ్ఓ -
లక్ష్యం రూ.19.59 కోట్లు.. వచ్చింది రూ.7.50 కోట్లు
అబ్దుల్లాపూర్మెట్: ెపద్దఅంబర్పేట పురపాలక సంఘంలో ఈ సంవత్సరం రూ.19.59 కోట్లు పన్నుల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.7.50 కోట్లు (47 శాతం) వసూలు చేశారు. వంద శాతం వసూలు లక్ష్యంగా ఆస్తి, నల్లా పన్నులు వసూళ్లు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని కమిషనర్ రవీందర్రెడ్డి తెలిపారు. పన్నుల వసూళ్లకు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ వసూలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు సరైన సమయానికి పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో కలపండి
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు విన్నవించారు. ఈ మేరకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్తో వెళ్లి నగరంలో మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో జేఏసీ చైర్మన్ వత్తుల రఘుఫతి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు మనోహర్, మల్లేష్ యాదవ్, దత్తు నాయక్ ఉన్నారు. మంత్రి శ్రీధర్బాబుకు జేఏసీ నేతల వినతి -
సీఐ గురువయ్యగౌడ్కు సీపీ ప్రశంస
షాబాద్: హత్య కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్ష విధించడంలో కీలకపాత్ర పోషించిన ట్రాఫిక్ అడ్మిన్ సీఐ గురువయ్యగౌడ్ను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అభినందించారు. 2023లో షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని దామర్లపల్లిలో జరిగిన హత్య కేసులో అప్పటి సీఐగా ఉన్న గురువయ్యగౌడ్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జిషీట్ కోర్టులో దాఖలు చేయగా నిందితుడికి జీవిత ఖైదు శిక్షపడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి సీఐ గురువయ్యగౌడ్కు ప్రశంసాపత్రం అందజేశారు. ప్రస్తుతం గురువయ్యగౌడ్ ట్రాఫిక్ అడ్మిన్ ఇన్స్పెక్టర్గా సైబరాబాద్ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
కుల వివక్ష నిర్మూలనకు కృషి చేయాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ మాడ్గుల: ఆత్మగౌరవం, సమానత్వం, కుల వివక్షపై పోరాటాలకు సిద్ధం కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ నెల 31న మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సదస్సును నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రానున్నారని, సంఘం శ్రేణులు, ప్రజలందరూ పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్, నాయకులు అంజి, లింగం, రామకృష్ణ, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో లైంగిక దాడి నాగోలు: ప్రేమ పేరుతో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడమేగాక తన వద్ద ఉన్న ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరిస్తున్న యువకుడిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మాన్సురాబాద్ వినాయక్నగర్ కాలనీకి చెందిన ఓ కుటుంబం కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. వారి కుమార్తె (17) ఇంటి వద్దనే ఉంటోంది. కారు డ్రైవర్గా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెందిన కిలారి నాగార్జున సదరు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె నుంచి బంగారం, నగదు తీసుకున్నాడు. గత కొన్నాళ్లుగా బాధితురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు శనివారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు నాగార్జునపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
షాబాద్: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శంషాబాద్ ఎస్ఎస్ స్కేటింగ్ అకాడమీ కోచ్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని అండర్ 10 కాంపిటేషన్ ఎస్ఎస్ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో షాబాద్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి లంబాడి నవీష్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, కోచ్ నవీష్ను అభినందించారు. అనంతరం కోచ్ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న వారి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. -
● ఆదిబట్లలో 72.19 శాతం..
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో ఆస్తిపన్నులు, నల్లా బిల్లులు వసూళ్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా నూటికి నూరు శాతం వసూలు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. మున్సిపాలిటీలో 6,085 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ ఏడాది రూ.4.42 కోట్లు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3.19 (72.19 శాతం) కోట్లు వసూలు చేశారు. మరో రూ.1.23 కోట్లు పెండింగ్ ఉంది. బిల్కలెక్టర్లు, వార్డు అధికారులు కలిసి దశల వారీగా వసూలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న వాటికి రాయితీలు ఇచ్చి పన్నులు చెల్లించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. వారం రోజుల్లో వంద శాతం లక్ష్యం చేరుకునే విధంగా కృషి చేస్తామని చెబుతున్నారు. -
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
● దూకుడు పెంచిన అధికారులు షాద్నగర్: ఆస్తి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు దూకుడు పెంచారు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో గడువులోపు వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేసి వసూలు చేస్తున్నారు. సుమారు 70 వేలకుపైగా జనాభా ఉన్న షాద్నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో 15,933 గృహ, వ్యాపార సముదాయాలు ఉన్నా యి. వీటి నుంచి సుమారు రూ.7.47 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.5.26 కోట్లు (71శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.2.22కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. కొత్తూరులో రూ.1.57 కోట్లు.. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 13,200 జనాభా ఉంది. 2,619 ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.2.56 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1.57 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.98.6 లక్షలు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. రంగంలోకి ‘ప్రత్యేక’ బృందాలు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు షాద్నగర్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలు, ఇళ్ల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బకాయిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ సిబ్బంది బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి వసూలు చేస్తున్నారు. న్యూస్రీల్ -
● సాధించింది సగమే..
ఆమనగల్లు: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం సగం పూర్తయ్యింది. విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా ప్రజలు సకాలంలో కట్టడం లేదు. వసూలు కోసం వార్డు అధికారులు, సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతున్నారు. పెద్ద మొత్తంలో ఉన్న బకాయిల వసూళ్లకు మున్సిపల్ కమిషనర్ శంకర్ స్వయంగా వెళ్తున్నారు. మున్సిపాలిటీలో ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యం రూ.2.21 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు రూ.1.15 కోట్లు మాత్రమే వసూలైంది. వందశాతం పూర్తి చేయడానికి సిబ్బంది విస్తృతంగా తిరుగుతున్నారు. -
బస్తీల్లో అధికారుల ముమ్మర ప్రచారం
పహాడీషరీఫ్: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపునకు గడువు దగ్గర పడుతుండడంతో జల్పల్లి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పరిధిలోని జల్పల్లి, శ్రీరాం కాలనీ, పహాడీషరీఫ్, వాదే ముస్తఫా, వాదే సాల్హెహీన్, షాహిన్నగర్, ఎర్రకుంట, కొత్తపేట, బిస్మిల్లా కాలనీ, సలాల ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్నుపై అవగాహన కల్పిస్తున్నారు. తుది గడువులోగా లక్ష్యం చేరుకోవడంపై దృష్టి సారించారు. రూ.24.76 కోట్లుగా పెరిగిన లక్ష్యం మున్సిపాలిటీలో మొత్తం 37,332 నివాసాలు, 3,300 ట్రేడ్ లైసెన్స్లను కలుపుకొని ఈ ఏడాది ఆస్తి పన్ను లక్ష్యాన్ని రూ.9.26 కోట్లుగా నిర్దేశించుకున్నారు. బకాయిలు రూ.8.33 కోట్లు, జరిమానాలతో కలిపి మొత్తం రూ.24.76 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 27.82 శాతం చొప్పున రూ.6.89 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పించేలా బస్తీల్లో ఆటోల్లో మైక్లు, బల్క్ ఎస్ఎంఎస్లు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. స్వచ్ఛందంగా మున్సిపాలిటీకి వచ్చి చెల్లించే వారి కోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ● సవాల్గా వసూలు శంకర్పల్లి: మున్సిపాలిటీలో పన్ను వసూలు అధికారులకు సవాల్గా మారింది. కొన్ని రోజుల క్రితం పెరిగిన పన్నులకు ఉన్నతాధికారులు కొంత మేర వెసులుబాటు కల్పించారు. 2023 వరకు పంచాయతీలోని రేట్లనే కొనసాగించారు. మున్సిపల్ యాక్టు ప్రకారం మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు అనుగుణంగా రేట్లు పెంచాల్సి రావడంతో రెట్టింపయ్యాయి. ఈ పన్నులు ఏమిటని గత ఏడాది చాలామంది కట్టకపోవడంతో బకాయిలు రూ.3కోట్ల మేర పేరుకుపోయాయి. అప్పటి మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. పన్నురేట్లను పాక్షికంగా తగ్గించనున్నట్లు గెజిట్ విడుదల చేశారు. తాజాగా మున్సిపల్ ఉన్నతాఽధికారులు ఆమోదం తెలపడం, కొంత మంది బకాయిలు కట్టడంతో అధికారులకు ఊరటనిచ్చింది. 58.2 శాతమే వసూళ్లు మున్సిపాలిటీలో 2024–2025 వార్షిక పన్ను లక్ష్యం రూ.5.80 కోట్లుగా అధికారులు పెట్టుకున్నారు. ఇప్పటికి రూ.3.37 కోట్లు (58.2 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.2.43 కోట్లు పెండింగ్ ఉంది. అధికారులు వసూళ్లలో వేగం పెంచినప్పటికీ ప్రజలకు నుంచి ఆశించిన మేర స్పందన రావడం లేదు. పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలను సాధ్యమైనంత వరకు వసూలు చేశాం. ఈ ఏడాది ఇంకా కొన్ని వసూలు కావాల్సి ఉంది. నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్, శంకర్పల్లి -
ఆస్తిపన్ను అంతంతే
ఐదు ప్రత్యేక బృందాలు మీర్పేట: మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను లక్ష్యం రూ.20.60 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 20,720 గృహాలు ఉండగా, కమర్షియల్/ రెసిడెన్షియల్ కలిపి దాదాపు 1,500 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 52 శాతం వరకు పన్నులు వసూలయ్యాయి. వంద శాతం వసూలు చేసేందుకు అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. గృహాలతో పాటు ట్రేడ్ లైసెన్స్, ఎల్ఆర్ఎస్ ఫీజుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు కమిషనర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో వసూళ్లు సగమే.. ● ముగుస్తున్న తుది గడువు ● వేగం పెంచిన అధికారులు ● ప్రత్యేక బృందాలు, స్పెషల్ డ్రైవ్లు ● లక్ష్యం దిశగా ఉరుకులుపరుగులు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా చాలా పురపాలికల్లో సగం కూడా వసూలు కాలేదు. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బస్తీల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లలో వేగం పెంచారు. లక్ష్యం మేర వందశాతం పూర్తి చేస్తామని చెబుతున్నా ఉన్న కొద్ది రోజుల్లో వసూలు కావడం గగనమే. ● వసూలు వేగవంతం మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఈ నెలాఖరు వరకు రూ.2.13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వంద శాతం వసూలు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఫామ్హౌస్లు, రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు గ్రామాల్లో వసూలు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రూ.59 లక్షలు వసూలు చేశారు. మిగతా వాటి కోసం సెలవు దినాలు, ఆదివారాలు స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వందశాతం వసూలుకు కృషి ఈ నెల 31లోపు పన్నులు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో ఇప్పటి వరకు రూ.59 లక్షలు వసూలయ్యాయి. వందశాతం వసూలు చేసేందుకు అందరం కృషి చేస్తున్నాం. – ఖాజా మొయిజుద్దీన్, కమిషనర్ -
రాంగురూట్లో వచ్చి.. బైక్ను ఢీకొట్టి
షాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని సంకెపల్లిగూడ పంచాయతీకి అనుబంధ గ్రామమైన శేరిగూడకు చెందిన చీమల బాల్రాజ్ (40), హరిబాబు (42) కలిసి శనివారం మధ్యాహ్నం కూలి పనికోసం బాల్రాజ్ బైక్పై నాగర్గూడకు వెళ్తున్నారు. మల్లారెడ్డిగూడ సమీపంలో రాంగ్రూట్లో వచ్చిన బైక్ బలంగా ఢీ కొట్టింది. దీంతో బాల్రాజ్, హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాల్రాజ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరిబాబును ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాల్రాజ్కు భార్య హంసమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. హరిబాబు 25 ఏళ్ల క్రితం ఒంగోలు జిల్లా టంగుటూరు నుంచి వలస వచ్చారు. మూడేళ్ల కిత్రం హరిబాబు భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాల్రాజ్ భార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిని, రోడ్డు మధ్యలో డివైడర్ తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముద్దెంగూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ మాజీ సర్పంచ్లు చందిప్ప జంగయ్య, కుమ్మరి దర్శన్, బీజేపీ మండల అధ్యక్షులు మద్దూరు మాణెయ్య డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం -
దాడి కేసులో నిందితుడికి రిమాండ్
యాచారం: పశువుల మేత విషయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో దాడి చేసిన వ్యక్తికి ఇబ్రహీంపట్నం న్యాయస్థానం 14 రోజులరిమాండ్ విధించింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్ల గ్రామంలో పశువుల మేత విషయంలో ఈ నెల 12న అదే గ్రామానికిచెందిన ఎర్ర మల్లయ్య, ఎదిరే కృష్ణయ్య మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఎర్ర మల్లయ్య తన చేతిలో ఉన్న గొడ్డలికామతో ఎదిరే కృష్ణయ్యను కొట్టగా అతనికి తీవ్ర గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇబ్రహీంపట్నం న్యాయస్థానం శనివారం ఎర్ర మల్లయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జలమండలి నీటితో కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా వేయండి
బంజారాహిల్స్: ఎండాకాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు జలమండలి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, నగరవాసులు కూడా వారికి సహకరించాల్సిన అవసరం ఉందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ కార్యాలయంలో మేయర్ జలమండలి, జీహెచ్ఎంసీ, కాలనీ వాసులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జలమండలి నీటితో కొంతమంది నిత్యం తమ కార్లు, ఇంటి ముందున్న బండలు, రోడ్లు కడుగుతున్నారని, వారికి నీటి విలువ తెలియడం లేదన్నారు. అలా ఇష్టారాజ్యంగా కార్లు కడుగుతున్న వారికి రూ.10 వేల జరిమానా విధించాలంటూ జలమండలి అధికారులను ఆమె ఆదేశించారు. అదే విధంగా ఎమ్మెల్యే కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర కో– ఆపరేటివ్ సొసైటీ ఎమ్మెల్యే కాలనీ అధ్యక్షుడు టి. నారాయణరెడ్డి, జలమండలి జీఎం హరిశంకర్, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
డ్రైవర్ను బెదిరించి ఆటో తీసుకెళ్లిన ముగ్గురి అరెస్టు
శంషాబాద్ రూరల్: ర్యాపిడో ఆటోను బుక్ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు.. హైదరాబాద్ నుంచి మండల శివారు ప్రాంతానికి వచ్చిన తర్వాత.. డ్రైవర్ను బెదిరించి ఆటోను దొంగిలించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి సమాచారం మేరకు... ఉప్పల్లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన బ్రహ్మయాదవ్ ర్యాపిడో ద్వారా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 13న ముగ్గురు వ్యక్తులు ఇతని ర్యాపిడో రైడ్లో బుక్ చేసుకున్నారు. ఉప్పల్ నుంచి మండలంలోని రాయన్నగూడ వద్దకు రాగా.. రాత్రి 10 గంటల సమయంలో బహర్భూమి కోసం ఆటోను ఆపారు. తర్వాత డ్రైవర్ బ్రహ్మయాదవ్ను బెదిరించి ఆటోతో పరారయ్యారు. జైలుకు వెళ్లివచ్చినా మారని బుద్ధి హైదరాబాద్లోని బండ్లగూడ ప్రాంతంలోని మహమ్మద్నగర్ వాసి మహ్మద్ రషీద్(26) ఆటో డ్రైవర్గా, బాలాపూర్ పరిధిలోని షాహిన్నగర్కు చెందిన షేక్ హసనుద్దీన్(22) డెకరేషన్ పని, మహ్మద్ ఆరీఫ్(25) ప్లంబర్గా పని చేస్తున్నారు. వీరు ర్యాపిడో రైడ్లో ఆటోను బుక్ చేసుకున్నారు. మార్గ మధ్యలో డ్రైవర్ను బెదిరించి ఆటోను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకి వెళ్లారు. అయినా వారి ప్రవర్తన మార్చుకోలేదు. వీరి నుంచి పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చారు. ర్యాపిడోలో బుక్ చేసుకుని... మార్గ మధ్యలో ఆటోతో పరార్ -
‘అకాల’ నష్టం
ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.. ఆయా మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.. పూల తోటలు దెబ్బతిన్నాయి.. మామిడికాయలు నేలరాలాయి.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లముందే పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మునిగిపోయారు.. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.షాబాద్: మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. లింగారెడ్డిగూడ, దామర్లపల్లి, సాయిరెడ్డిగూడ, నాందార్ఖాన్పేట్, పెద్దవేడు, మద్దూరు, హైతాబాద్, సోలీపేట్, నాగర్కుంట, మాచన్పల్లి, అంతిరెడ్డిగూడ గ్రామాల్లో సాగు చేసిన పూల తోటలు, కూరగాయలు, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన మాణెయ్య, గోపాల్రెడ్డి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుమ్మరిగూడలో వర్షం, గాలికి మామిడి కాయలు నేలరాలిపోయాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను అంచనా వేసి న్యాయం చేయాలని పంటలు నష్టపోయిన రైతులు కోరుతున్నారు.కడ్తాల్లో కురిసిన వడగళ్లు కడ్తాల్: మండల కేంద్రంలో శనివారం సాయంత్రం తేలిక పాటి వడగళ్ల వాన కురిసింది. వర్షం కారణంగా కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉరుములతో కూడిన వడగళ్ల వర్షానికి ఆయా కాలనీల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జనం, సాయంత్రం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. ● ఉరుములు, మెరుపులు, వడగళ్లు కందుకూరు: మండల పరిధిలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన అకాల వర్షంతో నష్టం వాటిల్లింది. కొత్తూరు, కందుకూరు, కటికపల్లి, రాచులూరు, గూడూరు తదితర గ్రామాలో్ల్ మామిడి కాయలు నేలరాలాయి. జైత్వారంలో ఒక విద్యుత్ స్తంభం, గూడూరులో రెండు విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పశువుల కొట్టాలపై ఉన్న రేకులు లేచిపోయాయి. ● ఈదురుగాలులతో కూడిన వర్షం యాచారం: మండల పరిధిలోని నస్దిక్సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వడగళ్లు కూడా కురిసాయి. ఈదురుగాలులతో మామిడితోటలు, కూరగాయల పంటలు, వరి పంటకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.న్యూస్రీల్ -
డీజీపీ‘ఎస్’
ఆస్తుల పరిరక్షణకు.. ఈ సర్వేతో అంగుళం స్థలం కూడా కబ్జా కాదు సాక్షి, సిటీబ్యూరో: సంస్థ ఆస్తుల పరిరక్షణ, అక్రమాల కట్టడికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేయనుంది. జీహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నో ఆస్తులున్నాయి. వాటిపై తగిన శ్రద్ధ, పర్యవేక్షణ లేకపోవడంతో కమ్యూనిటీ హాళ్ల నుంచి పార్కుల దాకా ఇప్పటికే ఎన్నో కబ్జాలు జరి గాయి. పలు ఆస్తులు ఆక్రమణదారుల పరమయ్యాయి. వీటితో పాటు లే ఔట్లలోని ప్రభుత్వ స్థలాలు తదితరాలు సైతం బడాబాబులకు కాసులు కురిపించే కల్పతరువులయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేషన్ ఆస్తులతోపాటు ప్రభుత్వ ఆస్తులు కూడా పరిరక్షించేందుకు, కబ్జాల పాలు కాకుండా ఉండేందుకు మరో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అదే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సర్వే. జీపీఎస్ కన్నా ఉత్తమం.. జీపీఎస్ గురించి అందరికీ తెలిసిందే. దానికంటే ఉన్నతమైనది డీజీపీఎస్. ఈ సర్వేతో ఆయా ఆస్తులు, స్థలాల సర్వే, మ్యాపింగ్ తదితర అంశాల్లో అంగుళం వరకు కచ్చితత్వం ఉంటుంది. ఇందులో రెండు జీపీఎస్ రిసీవర్లను వినియోగిస్తారు. నిర్ణీత ప్రదేశానికి సంబంధించి జీపీఎస్ సిగ్నల్స్కు, ఉపగ్రహం సూచించిన ప్రదేశానికిమధ్య ఉండే ఎర్రర్స్ ఫీల్డ్లోని మొబైల్ (రోవర్) డీజీపీఎస్ రిసీవర్లకు ట్రాన్స్మిట్ అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం వల్ల అంగుళం వరకు కచ్చితత్వం ఉంటుందని తెలిపారు. జీపీఎస్లో 10 నుంచి 15 మీటర్ల వరకు వ్యత్యా సముంటుందన్నారు. డీజీపీఎస్తో అంగుళం స్థలం కూడా తేడా రాకుండా కచ్చితంగా తెలుస్తుందన్నారు. డీజీపీస్ సర్వేతో పార్కులు సహా జీహెచ్ఎంసీ ఆస్తులన్నింటినీ, ఆయా లే ఔట్లలోని ప్రభుత్వ స్థలాల్ని, మ్యాపింగ్ చేయనున్నారు. ప్రయోగాత్మకంగా ఒక జోన్లో.. డీజీపీఎస్ సర్వేను తొలుత ఒక జోన్లో ప్రయోగాత్మకంగా చేపట్టి, అనంతరం అన్ని జోన్ల లోనూ నిర్వహించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇప్పటికే పరుల పాలైన జీహెచ్ఎంసీకి చెందిన ఆస్తులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు తదితరమైన వాటిని కూడా గుర్తించి పరిరక్షించాలనేది కార్పొరేషన్ లక్ష్యం. నగరంలో భూముల విలువ కోట్లలో ఉండటంతో అంగుళం స్థలం కూడా పోనివ్వకుండా ఉండేందుకు ఈ సర్వేకు సిద్ధమవుతున్నారు. విద్యుత్ స్తంభాలకు సైతం ఐడీలు ప్రతి రోడ్డుకూ ఒక ప్రత్యేక ఐడీ ఇవ్వాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల నుంచి వె వెల్లువెత్తుతున్న విమర్శలతో విద్యుత్ విభాగంలోనూ ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని విద్యుత్ స్తంభాలు, కనెక్షన్లు, వినియోగిస్తున్న విద్యుత్ తదితరమైనవి పక్కాగా లెక్క తెలిసేలా స్తంభాలకు ఐడీలు, క్యూఆర్ కోడ్లు, పర్యవేక్షణకు యాప్స్ వంటివి వినియోగించనున్నారు. రోడ్ల చరిత్ర మాదిరే ఐడీతో స్తంభం ఏర్పాటు నుంచి దానికి అమర్చిన బల్బులు.. ఎంత కాలం పనిచేశాయి.. కొత్తవి ఎప్పుడు వేశారు? తదితర వివరాలన్నీ తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల్లో అక్రమాలకు సంబంధించి టౌన్ప్లానింగ్ విభాగం అగ్ర స్థానంలో ఉండగా, నిర్వహణ లేమిలో విద్యుత్ విభాగం ఉంది. చీకట్లో మగ్గుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా నిర్వహణలేమి, అక్రమాలతో పరిష్కారం కావడం లేదు. చేయబోయే పనులతో వాటికి తెర పడుతుందని భావిస్తున్నారు. పార్కులు, లే ఔట్లు, ఇతర స్థలాలకు రక్షణ టెక్నాలజీ వినియోగంలో జీహెచ్ఎంసీ మరో అడుగు -
పది పరీక్షల్లో పొరపాట్లకు తావివ్వొద్దు
ఆమనగల్లు: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయా లేదా అని ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఎంఈఓ పాండు, చీఫ్ సూపరింటెండెంట్లు శ్రీధర్, ప్రభాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో అలసత్వం తగదని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా ఉండాలని, తగినంత వెలుతురు వచ్చేలా చూడాలని సూచించారు. సీఎస్పై డీఈఓ ఆగ్రహం! ఆమనగల్లులోని బాలికల ఉన్నత పాఠశాల ఎస్ఎస్సీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్రెడ్డిపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరీక్షల కోసం సీసీగా నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడిని నియమించడంపై సీఎస్ను ప్రశ్నించినట్లు సమాచారం. పక్కజిల్లా నుంచి సీసీగా ఉపాధ్యాయుడిని తీసుకోవాల్సిన అవసరం ఏమిటని నిలదీసినట్టు తెలిసింది. కాగా సీసీని శుక్రవారం రోజే రిలీవ్ చేశామని సీఎస్ ప్రభాకర్రెడ్డి డీఈఓ సుశీందర్రావ్కు వివరించినట్టు సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు -
వందశాతం పన్నుల వసూలే లక్ష్యం
చేవెళ్ల: ఈ నెలాఖరు వరకు గ్రామాల్లో వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డీఎల్పీఓ సతీష్కుమార్ అన్నారు. మండలంలోని ఆలూరు, రేగడిఘనాపూర్, ఖానాపూర్ గ్రామాల్లో శనివారం పన్నుల వసూళ్ల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి పన్నులు సేకరించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఇప్పటి వరకు 82 శాతం పన్నులు వసూలైనట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని మండలాలు వందశాతం లక్ష్యాలను చేరుకోవాలని ఆయా మండలాల ఎంపీలు, కార్యదర్శులకు సూచించారు. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ విఠలేశ్వర్జీ, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీకి యువతే కీలకమని యువతీయువకులంతా ఏకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రతాప్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాములుగౌడ్, సుదర్శన్రెడ్డి, జ్ఞానేశ్వర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పీసరి సతీష్రెడ్డి, మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య, మాజీ అధ్యక్షులు రవీందర్రెడ్డి, కిరణ్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, జిల్లా యువ మోర్చా అధికార ప్రతినిధి కూతురు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
షాద్నగర్ ఆస్పత్రిలో కాయకల్ప బృందం
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని శనివారం కాయ కల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా డాక్టర్ వై.ప్రజ్ఞారెడ్డి ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. స్వచ్ఛత, బయో మెడికల్ వేస్టేజ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పారిశుద్ధ్య కార్మికుల రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రసవాల సంఖ్య, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, జరుగుతున్న అభివృద్ధి, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ మాధవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మోకిల సీఐ వీరబాబుకుసైబరాబాద్ సీపీ అభినందనశంకర్పల్లి: భార్యను రాయితో మోది హత్య చేసిన కేసును ఛేదించడంలో విశేషంగా కృషి చేసి, నిందితుడైన భర్తకు శిక్ష పడేలా చేసిన మోకిల సీఐ వీరబాబుని శనివారం సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, జాయింట్ సీపీ గజరావు భూపాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఐకి నగదు ప్రోత్సాహకం అందించారు. గతేడాది ఏప్రిల్లో మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్లో ఓ వ్యక్తి తాగిన మైకంలో భార్యతో గొడవపడి రాయితో మోది హత్య చేశాడు. మోకిల సీఐ వీరబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని, లోతుగా విచరాణ చేపట్టి చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టుకి పక్కా వివరాలు సమర్పించడంతో ఎల్బీనగర్ కోర్టు గత ఫిబ్రవరిలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది. 26న ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీలు కొందుర్గు: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26న అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ ర్యాలీలు ఉంటాయని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ అన్నారు. కొందుర్గులో శనివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. దీంతో మాదిగల 70 ఏళ్ల కల సాకారమైందని అన్నారు. ఈ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఉదయ్కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్, దర్శన్, రామకృష్ణ, యాదయ్య, రమేష్, యాదగిరి, రామచంద్రయ్య, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణకు సహకరించండి: సీతక్క సైదాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం సైదాబాద్లోని ప్రభుత్వ బాలుర పరిశీ లన గృహంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలోని అబ్జర్వే షన్ హోం పిల్లల కోసం పైలట్ ప్రాజెక్ట్గా సైదాబాద్లోని హోంలో సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ ప్రత్యేక మానసిక నిపుణుల బృందం మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన కౌన్సెలింగ్, వైద్య చికిత్సలు సహా అనేక సేవలను అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లల కుటుంబాలకూ అవగాహన పెంచుతామన్నారు. త్వరలోనే ఇలాంటి డీ అడిక్షన్ సెంటర్లను అన్ని అబ్జర్వేషన్ హోంలలో ఏర్పాటు చేయిస్తామన్నారు. -
అక్రమంగా మట్టి తరలింపు
మహేశ్వరం: అక్రమంగా మట్టి తరలిస్తున్న మాఫియాపై పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గంగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గంగారం సర్వే నంబర్ 85లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్న గ్రామస్తుడు మునావత్ రెడ్యానాయక్కు డబ్బులిచ్చిన కట్రావత్ లక్ష్మణ్, మునావత్ నగేశ్, మునావత్ రాజేశ్ మట్టి తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున దాడి చేసి మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. మట్టిని విక్రయించిన వ్యక్తితో పాటు లక్ష్మణ్, నగేశ్, రాజేశ్, వారి టిప్పర్ డ్రైవర్లు మెగావత్ రాజు, జెటావత్ తుల్చానాయక్, సందీప్ కుమార్ దాస్, మునావత్ కృష్ణం రాజుపై కేసు నమోదు చేశారు. మూడు టిప్పర్లు, ఓ ఇటాచీ వాహనాన్ని సీజ్ చేశారు. మూడు టిప్పర్లు, జేసీబీ సీజ్ ఎనిమిది మందిపై కేసు -
తల్లీకొడుకు అదృశ్యం
చేవెళ్ల: లేడీస్ టైలర్ వద్దకు వెళ్తున్నానని రెండేళ్ల కుమారుడితో వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని ముడిమ్యాలలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఎంజాల కామిని(24), మహేందర్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు సంతానం. గురువారం బ్లౌజ్ కుట్టించుకుంటానని కుమారుడితో కలిసి వెళ్లిన కామిని రాత్రయినా తిరిగి రాలేదు. వారి కోసం మహేందర్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన శుక్రవారం చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో వెలసిన శివ సీతారామాంజనేయస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ జనార్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, స్థానిక నాయకులు నరోత్తమ్రెడ్డి, బాలకుమార్గౌడ్, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, పర్వతాలు, గిరి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో మృతిచెందిన వారి అంత్యక్రియలు పూర్తి
షాద్నగర్: అమెరికాలోని ఫ్లోరిడాలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి అంత్య క్రియల్లో పాల్గొన్న బంధువులు, కుటుంబ సభ్యులు మృతులకు తుది వీడ్కోలు పలికారు. కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి, పవిత్ర దంపతుల కూతురు ప్రగతిరెడ్డి, మనమడు హర్వీన్రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. మృతదేహాలను ఇండియాకు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. భారత కాలమాణం ప్రకారం గురువారం రాత్రి 10గంటలకు ఓర్లాండో అవెన్యూలోని ఫ్యూనరల్ హోం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మృతులతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
ఇబ్రహీంపట్నం రూరల్: అతివేగం ఒకరి ప్రాణం తీయగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అరుణ్(21) తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ నుంచి రావిర్యాల్ మీదుగా బొంగ్లూరు వైపు ప్రయాణిస్తున్నారు. రావిర్యాల్ చెరువు సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కేటీఎం బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొడుతూ వెళ్లి గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు మహేందర్ కాలు విరగడంతో పాటు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. అరుణ్ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ● బైక్ అదుపుతప్పి విద్యార్థి దుర్మరణం ● మరో యువకుడి పరిస్థితి విషమం -
క్రీడలతో నూతనోత్తేజం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేవెళ్ల: క్రీడలు యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. పట్టణ కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న పెద్దోళ్ల పర్మయ్య మెమోరియల్ మండల స్థాయి క్రికెట్ టోర్నీ శుక్రవారంతో ముగిసింది. ఈ పోటీల్లో విజేతలకు పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దయాకర్, కేఎస్ రత్నం నగదు బహుమతులు అందజేశారు. విజేత జట్టు ఊరెళ్లకు రూ.50వేలు, రన్నరప్ జట్టు రామన్నగూడకు రూ.25వేల నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దయాకర్, కేఎస్ రత్నం మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కె. శివప్రసాద్, నాయకులు వెంకట్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, జహంగీర్, నర్సింలు, పి. ప్రభాకర్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... మండల పరిధిలోని అనాజ్పూర్ గ్రామంలోని శివాలయం వద్ద బస్టాండ్లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి సూరిబాబు అక్కడికి చేరుకుని 108 వాహనానికి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది మహిళను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా మృతిచెందిన మహిళ స్థానికంగా బిక్షాటన చేసుకుంటూ ఉండేదని స్థానికులు తెలిపారు. -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
షాబాద్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాచన్పల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5లక్షల ఎస్సీపీ నిధులు కేటాయించడంతో శుక్రవారం ఆయన్ను గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యగౌడ్, నరేందర్గౌడ్, మహేందర్రెడ్డి, చందు, మహేందర్, శేఖర్, నరేష్, ముసలయ్య, మల్లేష్, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
నందిగామ: బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రాజ్భూపాల్గౌడ్ను బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల అరవింద్ ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఆయన పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి శంషాబాద్లోని పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ సంరద్భంగా అరవింద్ మాట్లాడుతూ.. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేందుకు రాజ్భూపాల్గౌడ్ ప్రత్యక్ష సాక్షి అన్నారు. పార్టీ ఆయన సేవలను గుర్తంచి పార్టీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మనోహర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, నాయకులు కమ్మరి భూపాల్ చారి తదితరులు పాల్గొన్నారు. అభినందనల వెల్లువ ఇబ్రహీంపట్నం: బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నేతలు శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భూపాల్గౌడ్ను శాలువతో సన్మానించి, మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్రెడ్డి, శ్రీశైలం, రమణారెడ్డి, బుగ్గారెడ్డి, స్వామిగౌడ్, నర్సింహ, బాలశివుడు, బాబు, కృష్ణ, రాజు, విజయ్, సురేశ్, శేఖర్, దాసరి, రవి, యాదయ్య, వెంకట్రమణ పాల్గొన్నారు. -
గొడ్డలితో గొంతుపై నరికి
షాద్నగర్ రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. పట్టణ సీఐ శంకరయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పరశురాములు, జమున (38) భార్యాభర్తలు. వీరి ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయడంతో అత్తవారి ఇళ్లలో ఉన్నారు. పరశురాములు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మరింత మద్యం కోసం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవ పడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఇంట్లోని గొడ్డలితో జమున గొంతుపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భూమి డబ్బుల కోసమే.. గతంలో అమ్మిన భూమికి సంబంధించిన రూ.2.50 లక్షలను జమున తెలిసిన వారికి అప్పుగా ఇచ్చింది. భార్యను చంపితేనే ఆ డబ్బులు తనకు వస్తాయని భావించిన పరశురాములు.. నిద్రిస్తున్న జమునపై గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను హత్య చేసిన భర్త మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని దారుణం నిందితుడికి రిమాండ్ -
వరద కాల్వ పరిశీలన
మొయినాబాద్: సురంగల్, కనకమామిడి పొలిమేరలో ఆక్రమణకు గురైన వరద కాల్వను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మొయినాబాద్లోని సురంగల్, కనకమామిడి రెవెన్యూల్లో వెంచర్ ఏర్పాటుకు రియల్టర్లు కాల్వను పూడ్చేసి చదును చేయడంపై ‘వరద కాలువ మాయం’అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం తహసీల్దార్ గౌతమ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, సర్వేయర్ వరద కాలువను పరిశీలించారు. సురంగల్, కనకమామిడి, నజీబ్నగర్ రెవెన్యూల పొలిమేర నుంచి వరద కాలువ ఉన్నట్లు విలేజ్ మ్యాప్ను పరిశీలించి గుర్తించారు. నీటి వనరులను, వరద కాలువలను పూడ్చివేసినా, ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. ఆక్రమణకు గురైన వరద కాలువను పునరుద్ధరిస్తామన్నారు. వరద కాలువను పూడ్చినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
రూ.32 లక్షల బకాయి
ఆమనగల్లు: వీధి దీపాలకు సంబంధించి విద్యుత్శాఖకు మున్సిపాలిటీ దాదాపు రూ.32 లక్షల బకాయి పడింది. మున్సిపల్ పరిధిలో మొత్తం 1,657 వీధి దీపాలు ఉన్నాయి. నూతనంగా వెలసిన కాలనీల్లో ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్కు సంబంధించి 120 స్తంభాలు ఉండగా 240 వీధిదీపాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో వినియోగిస్తున్న వీధి దీపాలకు సంబంధించి ప్రతినెలా రూ.1.55 లక్షల దాకా బిల్లు వస్తోంది. ఏడాదికాలంగా చెల్లించకపోవడంతో రూ.32 లక్షల బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కాలనీల్లో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. ఆమనగల్లులో జాతీయ రహదారిపై ఉన్న వీధిదీపాలు ‡‡ -
ఏడాదిగా నిలిచిన బిల్లులు
శంకర్పల్లి: మున్సిపాలిటీలో అవసరాలకు తగినట్లు ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ఇప్పటికే వేలల్లో విద్యుత్ దీపాల అవసరం ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సుమారు 1,500 లైట్లకు ఆర్డర్ ఇచ్చి వాటి కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు. వీధి దీపాల కోసం నిత్యం మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. శంకర్పల్లి ప్రధాన చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసినా చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాత్కాలికంగా మరమమ్మతులు చేసి వదిలేస్తున్నారు. రూ. 80లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు మున్సిపాలిటీలో మొత్తం 3,145 వీధి దీపాలు ఉన్నాయి. ప్రతీ నెల రూ.7లక్షలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది. ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిలిపివేశారు. దీంతో రూ.80 లక్షలకు పైగా పెండింగ్ ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ యంత్రాంగం ఎస్టీఓ చెక్కుల రూపంలో బిల్లుల చెల్లింపులు చేసినా.. నిధులలేమి కారణంగా అవి నిరుపయోగంగా మారాయి. త్వరలో చెల్లిస్తాం మున్సిపాలిటీలో విద్యుత్ బకాయిలు ఉన్న మాట వాస్తవమే. రానున్న వారం, పది రోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు సిద్ధమయ్యాం. ఈ మేరకు ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. త్వరలో అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్ -
నామమాత్రంగా వీధి దీపాల నిర్వహణ
మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల అలంకార ప్రాయంగా మారాయి. మరికొన్ని చోట్ల నెలల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొత్తగా వెలుస్తున్న కాలనీలు రాత్రి వేళ అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది. ఆయా పురపాలికల్లో నిర్వహణ బాధ్యత చూడాల్సిన సంస్థ పట్టించుకోకపోవడంతో భారం మున్సిపాలిటీలపైనే పడుతోంది. మరోవైపు మున్సిపాలిటీల నుంచి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి.● మరమ్మతులు చేయరు.. కొత్తవి బిగించరు ● అంధకారంలోనే రహదారులు, కాలనీలు ● పేరుకుపోతున్న విద్యుత్ బిల్లులు ● మున్సిపాలిటీలకు భారంగా మారిన వైనం -
వెలగని విద్యుత్ దీపాలు
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై రాత్రి సమయంలో అంధకారం అలముకుంటోంది. రహదారి పొడువునా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి వెలగడం లేదు. మున్సిపల్ కేంద్రంతోపాటు జేబీఐటీ కళాశాల నుంచి అప్పా జంక్షన్ వరకు ఏర్పాటు చేసినవి అలంకారప్రాయంగా మిగిలాయి. మున్సిపల్ కేంద్రంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై గతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి వెలిగిన దాఖలాలు లేవు. పంచాయతీ ఉన్నప్పుడు ఒకసారి మరమ్మతులు చేయించినా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. తరువాత తిరిగి వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. జేబీఐటీ కళాశాల నుంచి అప్పా జంక్షన్ వరకు రెండేళ్ల క్రితం కొత్తగా రోడ్డు మధ్యలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులపాటు వెలిగాయి.. నాలుగైదు నెలలుగా వెలగడం లేదు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన వీధిదీపాలు కొన్నిచోట్ల బాగానే పనిచేస్తున్నా మరి కొన్ని చోట్ల వెలగడం లేదు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో నిర్వహణ మున్సిపల్ అధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మున్సిపల్ అధికారులు వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. విద్యుత్ బిల్లులు పెండింగ్.. మూడు నెలల క్రితం వరకు పంచాయతీలుగా ఉన్న 8 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పడింది. అప్పటి వరకు పంచాయతీల పేరుతో విద్యుత్ బిల్లులు వచ్చేవి. ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పడినా ఇంకా పంచాయతీల పేరుతోనే వస్తున్నాయి. విద్యుత్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో బిల్లులు మార్చాల్సి ఉంది. రూ.లక్షల్లో విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే స్పందిస్తున్నాం హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రహదారి మధ్యలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని వెలగడంలేదు. విస్తరణలో తొలగిస్తారనే మరమ్మతులు చేయించడంలేదు. వీధుల్లో మాత్రం ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తున్నాం. – ఖాజా మొయిజుద్దీన్, కమిషనర్ -
పల్లెల్లో డ్రోన్ల కలకలం
చేవెళ్ల: మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా రాత్రి వేళ డ్రోన్లు సంచరించడం కలకలం రేపుతోంది. మండలంలోని చేవెళ్ల, కందవాడ, ఊరేళ్ల, సింగప్పగూడ, కేసారం తదితర గ్రామాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో డ్రోన్లు తిరిగినట్లు గుర్తించిన కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ను వివరణ కోరగా కందవాడ గ్రామంలో ఆర్హెచ్ రీసెర్చ్ అనే కంపెనీ పరిశోధనలో భాగంగా కొద్ది రోజుల పాటు డ్రోన్లు ఉపయోగించుకుంటామాని అనుమతి తీసుకున్నట్లు తెలి పారు. వారే డ్రోన్లు వినియోగించి ఉంటారని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఏదైనా ఉంటే మళ్లీ ఆ కంపెనీ వారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పారు. వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి కేశంపేట: పంచాయతీ కార్యదర్శులు మూడు రోజుల్లోగా వందశాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ఆదేశించారు. మండల పరిధి లోని సంగెం గ్రామ పంచాయతీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మోహన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, మురుగు కాల్వలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్ఆర్ఎస్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా నాయకుడు రాంచంద్రయ్య అధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు డీపీఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డీఎల్ పీఓ మల్లారెడ్డి, ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య పాల్గొన్నారు. ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సుమారు 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్–2025 క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పలు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయను న్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లాఅండ్ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు షీ టీమ్స్, ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, ఆక్టోపస్, ఏఆర్ వంటి అన్ని విభాగాల పోలీసులు బందోబస్త్లో పాల్గొంటారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈమేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్టేడియం చుట్టూ 450 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టనున్నామని చెప్పారు. నిమ్స్లో కొత్త యూనిట్ లక్డీకాపూల్: అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్ మరో సరికొత్త వైద్య విభాగాన్ని సమకూర్చుకుంది. మూర్ఛ వ్యాధికి గట్టి భరోసా కల్పించే దిశగా అధునాతన పీడియాట్రిక్ న్యూరాలజీ, ఎపిలెప్సీ మ్యానిటరింగ్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొయినాబాద్ రోటరీ క్లబ్, ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థల సహకారంలో మిలీనియం బ్లాక్లో ఈ యూనిట్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈ విభాగాన్ని ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేంద్ర పాల్సింగ్, రోటరీ జిల్లా గవర్నర్ శరత్ చౌదిరి, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎస్.రాంప్రసాద్తో కలిసి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రతినిధి డేనియల్ హిమెల్స్పాచ్ ప్రారంభించారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రాజేంద్రనగర్: పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ సరళిని పరిశీలించారు. వేసవి అయినందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మెయిన్ గేట్ వద్ద విద్యార్థినీ విద్యార్థులను వేర్వేరుగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపాలని పోలీసులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు. -
● అధ్వానం.. ఆగమాగం
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. ఒక్కోసారి పట్ట పగలే వెలుగులు విరజిమ్ముతాయి. మరోసారి రాత్రిళ్లు కూడా అంధకారం నెలకొంటోంది. బల్బులు పోతే మార్చడానికి రోజులు పడుతోంది. మున్సిపాలిటీలో 4,189 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణ ఈఈఎస్ఎల్ ఏజెన్సీ చూసుకో వాల్సి ఉంది. ప్రతీ నెల వీరికి రూ.2.6 లక్షలు మున్సిపాలిటీ చెల్లిస్తోంది. వీధి దీపాలు, బోర్లు అన్నింటికీ కలిపి ఏటా విద్యుత్ శాఖకు రూ.7లక్షలు బిల్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది ఇంకా చెల్లించలేదు. వీధి దీపాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యత ఈఈఎస్ఎల్ సంస్థదే. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ చేతులెత్తేసింది. దీంతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కంట్రోల్ బోర్డులు, ప్యానెల్స్ మార్చడం మున్సిపాలిటీనే చూసుకోవాల్సి వస్తోంది. 2027వరకు నిర్వహణ సంస్థతో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ నెల బిల్లులు పంపుతున్నారు కానీ పనులు చేయడం లేదని, అందుకే కొన్ని నెలలుగా బిల్లులు నిలిపివేసినట్లు తెలిసింది. భారం భరిస్తున్నాం వీధి దీపాలు, విద్యుత్ బిల్లులు మున్సిపాలిటీ చూసుకుంటుంది. ఏటా రూ.7 లక్షల బిల్లులు చెల్లిస్తున్నాం. నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ సంస్థ చూసుకోవాలి. వారు స్పందించడం లేదు. అనేకమార్లు కమిషనర్ ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. మళ్లీ భారమంతా మేమే భరిస్తున్నాం. – స్వర్ణకుమార్, డీఈ -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
షాద్నగర్రూరల్: మనస్తాపానికి గురైన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శివారులో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన సంద శ్రీనివాస్(32) డ్రైవర్గా పని చేస్తూ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొంత కాలం క్రితం అతడి తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ అబుదేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
యువ ఇంజనీర్ దుర్మరణం
శంకర్పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న మృతిచెందాడు. శంకర్పల్లి పట్టణ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లిగుండ్లకు చెందిన గోవర్ధన్రెడ్డి, సుధ దంపతులకు హర్షవర్ధన్రెడ్డి(30), ధ్రువతేజరెడ్డి సంతానం. శంకర్పల్లి శివారులో నిర్మిస్తున్న సుభిషి కన్స్ట్రక్షన్స్లో హర్షవర్ధన్రెడ్డి సైట్ ఇంజనీర్గా, ధ్రువతేజరెడ్డి సేల్స్ ఎగ్జిక్యూటీవ్గా పని చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విధులు ముగించుకున్న హర్ష తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత.. వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అదుపు తప్పిన బైక్ వేగంగా వెళ్లి డివైడర్ను తాకింది. దీంతో హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన -
చెత్తను శుభ్రం చేయించిన అధికారులు
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని శంకర్పల్లి ప్రధాన రోడ్డు పక్కన డంపింగ్లా వేసిన చెత్తను మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. సాక్షిలో ప్రచురితమైన మున్సిపాలిటీలలో లోపిస్తున్న పారిశుద్ధ్యం అనే కథనానికి స్పందించారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద, శంకర్పల్లి ప్రధాన రోడ్డుపక్కన వేసిన చెత్త డంపింగ్లను పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. ప్రజలు అందరూ కూడా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని ఇళ్ల వద్దకే వచ్చే వాహనాల్లో వేయాలని సూచించారు. -
పద్దులో విద్యకు నిరాశే
హుడాకాంప్లెక్స్: బడ్జెట్లో ఈసారి విద్యకు ఆశించిన నిధులు కేటాయించలేదు. కేవలం రూ.23,108 కోట్లు(7.57శాతం) మాత్రమే పద్దులో చూపారు. గతేడాది కంటే 0.2శాతం కేటాయించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పటికీ అనేక గురుకులాలు అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు ప్రత్యేక వసతులు లేక వారిలో డ్రాప్అవుట్ శాతం పెరుగుతోంది. 7.57 శాతం బడ్జెట్తో ఇవన్నీ సాధ్యమేనా. – కరుణాకర్రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
బడ్జెట్ ఊరటనివ్వలేదు
షాద్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులు, కార్మికులకు ఎలాంటి ఊరటనివ్వలేదు. బడ్జెట్లో ప్రభుత్వం కార్మిక శాఖకు నామమాత్రంగా రూ.900 కోట్ల కేటాయించింది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీలు, మున్సిపల్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తదితర శాఖలకు వేతనాల పెంపు గురించి, క్రమబద్ధీకరణపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలను పూర్తిగా విస్మరించింది. – రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు -
‘ఫ్యూచర్’లో విలీనానికి ఉద్యమిస్తాం
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడానికి అన్ని వర్గాల ప్రజలతో ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహా నగరం చేస్తామని గతంలో సీఎం ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్రెడ్డిలను కలిసి తమ సమస్యను విన్నవిస్తామన్నారు. ఈ నెల 21న మండల పరిధిలోని అమీర్పేట్ పద్మావతి ఫంక్షన్ హాలులో ఫ్యూచర్ సిటీ జేఏసీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు మల్లేష్ యాదవ్, అంధ్యానాయక్, ఈశ్వర్ముదిరాజ్, సుదర్శన్యాదవ్, యాదయ్య, కృష్ణానాయక్, పాండునాయక్, దత్తునాయక్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి -
రైతులకు రుణాలందించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున వాటిని ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు అందించాలన్నారు. యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు సకాలంలో అందించాలని తెలిపారు. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు పంపిణీలో జాప్యం చేయవద్దని చెప్పారు. ఎస్హెచ్జీ గ్రూపులకు యూనిట్ల గ్రౌండింగ్లో జాప్యం జరుగుతుందని చెప్పగా కలెక్టర్ స్పందించి వెంటనే పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శ్రీదేవి, లీడ్బ్యాంక్ మేనేజర్ కుసుమ, నాబార్డు ఏజీఎం, వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీలత, మెప్మా పీడీ మల్లీశ్వరీతో పాటు వివిధ బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
కనుల పండువగా రథోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోపాలాచార్యులు, రామాచార్యులు, రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజ్కుమార్, ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు
షాద్నగర్ డీఎం ఉష షాద్నగర్రూరల్: శ్రీరామ నవమిని సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యా ణ తలంబ్రాలను కావాల్సిన భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని డీఎం ఉష బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ నిర్ణయించిందని.. తలంబ్రాలు కావాల్సిన భక్తులు రూ.151 చెల్లించి బస్టాండ్ ఆవరణలోని కార్గో కేంద్రంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆశలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ● ప్రతీ నెల రూ.18 వేల వేతనం ఇవ్వాలి ● సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్ ● కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా ఇబ్రహీంపట్నం రూరల్: ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతీ నెల రూ.18 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని.. బడ్జెట్ సమావేశాల్లో తగిన కేటాయింపులు చేయాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్, కవిత మాట్లాడుతూ.. ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, జూలై 30న, డిసెంబర్ 10, ఫిబ్రవరి 9న ఆరోగ్య కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 2021 జూలై నుంచి డిసెంబర్ 6 వరకు ఆరు నెలల పీఆర్సీ, ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిభారం తగ్గించి.. పారితోషికం లేని పనులు చేయించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాయిబాబా, రుద్రకుమా ర్, జిల్లా నాయకులు బుట్టి బాల్రాజ్, కృష్ణ, పెంటయ్య, ఆశ యూనియన్ జిల్లా నాయకు లు రాధిక, కవిత, అనిత, జహంగీర్, నీలమ్మ, నిర్మల, కవిత, అనిత, చంద్రకళ, సుశీల, జయసుధ, సరస్వతి పాల్గొన్నారు. త్వరలో పెండింగ్బిల్లులు విడుదల ● సమస్యల పరిష్కారానికి చర్యలు ● సీఐటీయూ నాయకులతో జిల్లా విద్యాధికారి సుశీంధర్రావు ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్రావు హామీ ఇచ్చారు. బుధవారం సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలపై కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇవ్వడంతో ఆయన వెంటనే డీఈఓతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు సుశీంధర్రావు వారితో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న కార్మికుల సమస్యలను డీఈఓకు వివరించారు. ఎనిమిది నెలల బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కొన్ని మండలాల్లో ఉదయం టిఫిన్ బిల్లులు అందలేదని.. మరికొన్ని పాఠశాలల్లో మెనూ జావాలేనప్పటికీ హెచ్ఎంలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు హెచ్ఎంలకు ముందుగా స్నాక్స్ బిల్లులు అందినా వేరే వారితో స్నాక్స్ పెట్టిస్తున్నారని చెప్పారు. పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా కన్వీనర్ కవిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, కిషన్, సాయిబాబా, జిల్లా నాయకులు కృష్ణ, పెంటయ్య, శేఖర్, బాలరాజు, అలివేలు, గణేశ్, సరిత, శిరీష, లావణ్య, పద్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు. -
‘ఆహార భద్రత’కు భంగం కలిగిస్తే చర్యలు
కడ్తాల్: ఆహార భద్రత హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణంతో పాటు, అంగన్వాడీ కేంద్రం, బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్రెడ్డి, జ్యోతి, అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని రేషన్షాపును తనిఖీలు చేపట్టారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు పంచదార అందించడం లేదని తెలుసుకున్నారు. దీనిపై 30 రోజుల్లో కమిషన్కు నివేదిక అందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ఫిర్యాదు బాక్స్, స్టాక్ వివరాలు, సంబంధిత పౌర సరఫరా శాఖ అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు ఖచ్చితంగా పెట్టాలని కమిషన్ బృందం ఆదేశించింది. గుడ్లు పంపిణీ చేసిన ఎజెన్సీకి నోటీసులు అంగన్వాడీ కేంద్రం–2, 4 కేంద్రాలను సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహా రం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. గుడ్డు పరిమాణం తక్కువగా ఉందని.. గుడ్లు పంపిణీ చేసిన ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్(డీడబ్ల్యూఓ)ను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కేజీబీవీ, బాలుర ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను, ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. ఆయా పాఠశాలల్లోని సమస్యలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాల బాలికల్లో రక్తహీనత ఉందని, దానిని అధిగమించేందుకు పోషకాలు అఽధికంగా ఉన్న ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో వెంటనే ఏఎన్ఎంను నియమించాలని అఽధికారులను ఆదేశించారు. కేజీబీవీ పాఠశాలలో నీటి సమస్య ఉందని, పాఠశాల ఎస్ఓ అనిత కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపాలని ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ ఆహర భద్రత చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీటీడీఓ రామేశ్వరి, ఏటీడీఓ వెంకటయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ డీసీఎస్ఓ శ్రీనివాస్, మేనేజర్ గోపీకృష్ణ, డీడబ్ల్యూ సంధ్య, సీడీపీఓ శాంతిరేఖ, డీఆర్డీఏ ఏపీడీలు, నరేందర్రెడ్డి చరణ్గౌతమ్, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీఓ సుజాత, ఎంఈఓ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఏసీఎం రాజేశ్వరి, డీటీలు రవీందర్నాయక్, భానుప్రకాశ్, కార్యదర్శి అల్లాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి -
షాద్నగర్కు ‘లక్ష్మీదేవి’ కటాక్షం
షాద్నగర్: సాగు సస్యశ్యామలానికి గంగమ్మ తల్లి కావాలి.. గంగమ్మ తల్లి రాకకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. షాద్నగర్ రైతులకు లక్ష్మీ కళను ఇచ్చేది లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల ఎట్టకేల కు సాకారం కాబోతుంది. గతంలో పాదయాత్రలో భాగంగా ఈ రిజర్వాయర్ స్థలాన్ని స్వయంగా పరిశీలించి సాగు నీటి అవసరాలను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిజర్వాయర్ కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదీ ఆరంభం నియోజకవర్గ రైతులకు నీటి వనరులు లేక కేవలం చెరువులు, బోర్ల ఆధారంగానే సాగు చేపట్టారు. చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, తా ము అధికారంలో వస్తే తొలి ప్రాధాన్యత ఇస్తామని మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రకటించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు లో అంతర్భాగమైన ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయ ర్ను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు విస్తరించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన మూడు సర్వేలు కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి మోక్షం వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలుపొందాక రిజర్వా యర్ నిర్మాణం విషయమై పలుమార్లు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.266.65కోట్లతో పాలనాపరమైన అను మతి ఇచ్చినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నేతలతో పాటుగా, నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి అయితే సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు తమ ఆనందాన్ని వెల్లిబుచ్చుతున్నారు. రిజర్వాయర్ కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు స్ధానిక నేతలు అభినందనలు తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు రూ.266.65 కోట్ల నిధులు కేటాయింపు బడ్జెట్లో భట్టి ప్రకటనతో రైతన్నల్లో ఆనందం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషికి ప్రశంసలు ఆందోళనలకు అందరి మద్దతు గత ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ విషయంలో ఆశించిన స్థాయిలో ముందడుగు వేయ లేదు. దీంతో వివిధ పార్టీలు రిజర్వాయర్ నిర్మించాల్సిందేనని ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చిన కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకొని ఈ రిజర్వాయర్ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. రిజర్వాయర్ నిర్మించే స్థలాన్ని గతంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా సందర్శించగా కిషన్రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల, కోదండరాం, గద్దర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆందోళనలకు మద్దతిచ్చారు. -
పెండింగ్ ‘ఉపాధి’ నిధులు విడుదల చేయాలి
షాద్నగర్: పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పీర్లగూడ, చించోడ్, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలను వారు పని చేస్తున్న ప్రదేశాల్లో కలిశారు. ఈ సందర్బంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ.. ఉపాధి పథకంలో పని చే స్తున్న కూలీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పి ంచడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. పని ప్రదేశాల్లో తాగునీరు. టెంట్లు, వైద్య సదుపాయం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం రోజు వారీ కూలీ రూ.300 నుంచి రూ.800లకు పెంచాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్త గా దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్కార్డులను ఇచ్చి పని కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మల్లేష్, కి ట్టు, చంద్రకాంత్, శ్రీను, యాదయ్య, శంకర్ నా యక్, శివ శంకర్, ఆంజనేయులు, కృష్ణయ్య, రాంచంద్రయ్య, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ -
వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
షాద్నగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలను భర్తీచేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలని కోరారు. మాదిగలకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యమాన్ని విరమించేదిలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాండు, బాల్రాజ్, నాగభూషణం, సురేష్, మహేందర్, శ్రీనివాస్, శివశంకర్, యాదగిరి, చందు, శ్రీను, హరీష్, శ్రీశైలం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ -
సాదాసీదాగా ప్రమాణ స్వీకారం
శంకర్పల్లి: ఆరు నెలల క్రితం తీసుకున్న నిర్ణయం తారుమారవ్వడంతో శంకర్పల్లి మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం సాదాసీదాగా ముగిసింది. మార్కెట్ కమిటీ పాలవర్గం వివరాలతో సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేయగా.. మరునాడు ఉదయానికే అధికారులు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగలకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ బందోబస్తు పర్యవేక్షించి పలు సూచనలిచ్చారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గోవిందమ్మ, వైస్ చైర్మన్గా కాశెట్టి చంద్రమోహన్ ప్రమాణస్వీకారం చేశారు. 12 మంది డైరెక్టర్లకుగాను ఉదయం ఆరుగురు మాత్రమే ప్రమాణం చేశారు. మిగిలిన ఆరుగురిలో నలుగురు డైరెక్టర్లు కార్యక్రమం ముగిసే సమయానికి.. మరో ఇద్దరు చైర్పర్సన్, వైస్ చైర్మన్ వెళ్లిపోయిన అనంతరం అధికారుల సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ అధికారి ఎండీ రియాజ్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, నాయకులు ప్రవీణ్, గోపాల్రెడ్డి, ప్రకాశ్, వెంకట్రాంరెడ్డి, పాండురంగారెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివాదం మొదలైంది ఇలా .. శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనార్ధన్రెడ్డి భార్యకు ఇవ్వాలని పార్టీ, ఎమ్మెల్యే, నాయకులు అంతా కలిసి ఆరు నెలల క్రితమే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పేర్లతో ఆర్డర్కాపీ సైతం సిద్ధమైంది. ఈ క్రమంలో జనార్ధన్రెడ్డి స్వగ్రామం కొండకల్లో ప్రైవేట్ కంపెనీల వ్యతిరేకంగా గిరిజనులు భూ పోరాటం చేస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో జనార్ధన్రెడ్డి పాల్గొనడంతో కొంతమంది నాయకులు విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నాటినుంచి పెండింగ్లో ఉంచిన శంకర్పల్లి ఏఎంసీకి చైర్పర్సన్గా జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు గోవిందమ్మ, వైస్చైర్మన్గా చంద్రమోహన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం మొదలైంది. స్థానం కల్పించాలి.. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా జనార్థన్రెడ్డి తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ, కష్టపడి పని చేశాను. సొంత గ్రామంలో తలెత్తిన సమస్యకు మద్దతిచ్చాను తప్పా పార్టీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమకు కేటాయించిన పదవిని మరొకరికి కేటాయిస్తామని సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం. ప్రస్తుత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం బీఆర్ఎస్ సమావేశాలకు వెళ్లారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తనకు సముచిత స్థానం కల్పించని ఎడల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి ఉదయ్మోహన్రెడ్డి, నూతన డైరెక్టర్లు రవీందర్రెడ్డి, ప్రశాంత్, నాయకులు అనిల్, ప్రశాంత్, బల్వంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసుల బందోబస్తు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడి నిరసన -
విలీనం చేసేంతవరకు పోరాటం
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుఫతి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కర్నాటి మనోహర్ కాంప్లెక్స్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్నగర్లను మాత్రమే ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు మహేశ్వరాన్ని మహానగరంగా మార్చుతామని ఉచిత హామీలిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కేవలం రెండు గ్రామాలను విలీనం చేసి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్కు అతి చేరువలో ఉన్న మహేశ్వరం మండలాన్ని ప్యూచర్ సిటీలో విలీనం చేయకపోవడం సరికాదన్నారు. త్వరలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఐక్యం చేసి ఫ్యూచర్ సిటీలో మండలపరిధిలోని అన్ని గ్రామాలను కలిపేవరకు ఉద్యమిస్తామన్నారు. నియోజకవర్గంలో స్ధానికేతలరులను గెలిపిస్తే తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను కలిసి సీఎం రేవంత్రెడ్డికి కలిసి తమ సమస్యలను విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులు మనోహర్, కడారి జంగయ్య, కాకి ఈశ్వర్, మల్లేశ్ యాదవ్, అంధ్యా నాయక్, నందిగామ నర్సింహ, ఆవుల యాదయ్య, యాదయ్య గౌడ్, యాదగిరి గౌడ్, దత్తు నాయక్, రవికుమార్, రాజు నాయక్, సుదర్శన్ యాదవ్, యాదీష్, కృష్ణా నాయక్, రమేష్, ఆంజనేయులు, శ్రావణ్ పాల్గొన్నారు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీజేఏసీ చైర్మన్ రఘుఫతి -
ముసుగు దొంగల హల్చల్
చేవెళ్ల: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ముగ్గురు దుండగులు మూడు గ్రామాల్లో హల్చల్ చేశారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగదు, ఓ బైక్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని సింగప్పగూడ, రామన్నగూడ, న్యాలట గ్రామాల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. సింగప్పగూడలో శేఖర్రెడ్డి తన ఇంటికి తాళం వేసి శంషాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన దుండగులు తాళం పగులగొట్టి రూ.8 వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి మహేందర్ ఇంటికి తాళం వేసి మరోగదిలో నిద్రించాడు. ఆయన పడుకున్న గదికి గడియ పెట్టి తాళం వేసిన ఇంట్లో రూ.6 వేల నగదు దోచుకెళ్లారు. న్యాలటకు చెందిన కానిస్టేబుల్ అశోక్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. ఈ ఇంట్లో చొరబడిన దొంగలు రూ.10 వేలు దొంగలించారు. సింగప్పగూడలో రంగారెడ్డి ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్తో పరారవుతుండగా మార్గమధ్యలో రామన్నగూడ వద్ద బైక్లో పెట్రోల్ అయిపోవడంతో ద్విచక్రవాహనం నిలిచిపోవడంతో అక్కడే వదిలేశారు. రామన్నగూడ గ్రామంలోకి వెళ్లి అక్కడ గ్రామానికి చెందిన షఫీ ఇంటి ఎదుట పార్కు చేసిన మరోబైక్తో పలాయనం చిత్తగించారు. సీసీ కెమెరాకు చిక్కిన దుండగులు మూడు గ్రామాల్లో దొంగలు పడినట్లు గుర్తించిన గ్రామస్తులు గ్రామాల్లోని సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించారు. ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చేతిలో కత్తులు, రాడ్లు పట్టుకుని వచ్చినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పక్కింటి వారు లేచి బయటకురాకుండా చుట్టూ ఉన్న ఇళ్లకు గడియలు పెట్టి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు మూడు గ్రామాల్లో క్లూస్టీంతో వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుల దర్యాప్తు చేపట్టారు. మూడు గ్రామాల్లో చోరీలు నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దుండగులు -
27న ఫార్మా రద్దుకు పాదయాత్ర
● 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా ● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య యాచారం: గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవా లని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ అధ్యక్షతన మంగళవారం యాచారంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ఇచ్చేస్తామని పేర్కొందన్నారు. ఫార్మాసిటీ భూసేకరణలో పెద్ద భూ కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు. ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా, భూరికార్డుల్లో టీజీఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు నమోదు చేయాలనే డిమాండ్తో ఈ నెల 27న నక్కర్తమేడిపల్లి నుంచి వందలాది మంది రైతులతో పాదయాత్ర నిర్వహిస్తామని, 28న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని లిపారు. ఈ కార్యక్రమనికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, నాయకులు బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్, పెద్దయ్య, జగన్, వెంకటయ్య, తావునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పనకు కృషి కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎల్మినేడులో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు 68 మంది దరఖాస్తు చేసుకోగా 52 మందిని స్పాట్ సెలక్షన్ చేశారన్నారు. త్వరలోనే మిగిలిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ డైరెక్టర్ ఉష, మేనేజర్ భారతి, కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు జంగయ్య, సురేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గోవులను తరలిస్తున్న వాహనాల అడ్డగింత చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గోవులను చేవెళ్ల బజరంగ్దళ్, బీజేవైఎం, హిందూ సంఘాల నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళవారం సర్ధార్నగర్ నుంచి చేవెళ్ల మీదుగా హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న వాహనాలను గుర్తించిన బీజేపీ అనుంబంధ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గోవులను నార్సింగి పరిధిలోని గోషాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ నాయకులు అనిల్కుమార్, సహా ప్రముఖ గణేశ్, ధర్మ రక్షా ప్రముఖ్ రాఘవేంద్రచారి, కావలి శివకుమార్, అనిల్కుమార్ తదితరులు ఉన్నారు. -
బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి సీజ్
షాద్నగర్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం వైద్యాధికారులు బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇటీవల కేశంపేట మండలం కోనాయపల్లికి చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం రావడంతో వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆదివారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామ్యనాయక్ మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆస్పత్రిని తనిఖీ చేశారు. సామ్యనాయక్కు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్, పేషంట్ ల్యాబ్ రిపోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సామ్యానాయక్కు వైద్యం చేసిన డాక్టర్లు సింధు, అఖిల్, ఫైజల్తో మాట్లాడి వివరాలు సేకరించి ఆస్పత్రిని సీజ్ చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీయంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. తనిఖీలో పాల్గొన్న వారిలో డాక్టర్ నిఖిల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఫార్మాసిస్టు ఉదయ్కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటముని ఉన్నారు. -
చెరువు కట్ట పునరుద్ధరణ
మొయినాబాద్: శిఖం పట్టాలో ఉన్న చెరువు కట్టను తొలగించి నవారే పునరుద్ధరించారు. అధికారులు దగ్గరుండి మట్టి పో యించి కట్ట నిర్మాణం చేపట్టా రు. బాకారం జాగీర్ రెవెన్యూలో జంబులకుంట చెరువు కట్టను నిబంధనలకు విరుద్ధంగా తొలగించడంపై ‘పట్టాలు అడ్డుపెట్టి చెరువును చెరబట్టి’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. అదే రోజు చెరువుకట్ట తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చెరువు కట్ట తొలగించిన రైతునే పునరుద్ధరించాలని చెప్పారు. లేదంటే కేసు నమోదుచేస్తామని హెచ్చరించడంతో మంగళవారం రైతు మట్టి పోసి చెరువుకట్టను పునరుద్ధరించారు. ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి జేసీబీ సహాయంతో చెరువు కట్ట పునఃనిర్మించారు. ఎవరైనా చెరువులు, కుంటల కట్టలు తొలగించినా, కాలువలు పూడ్చిన కఠిన చర్యలు ఉంటాయని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఆటో బోల్తా గాయపడిన ప్రయాణికులు కొందుర్గు: చౌదరిగూడ మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో బోల్తాపడి ప్రయాణికులు గా యపడ్డారు. మంగళవారం ఉదయం జిల్లేడ్ నుంచి చౌదరిగూడ వైపు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చౌదరిగూడ సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తు న్న భీమమ్మ, చిన్నయ్య, రాజు గాయపడినట్లు సమాచారం. డ్రైవర్ రాజుకు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మొయినాబాద్ ఠాణాలో కేటీఆర్పై కేసు మొయినాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మొయినాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్రెడ్డి ఫోటోలను బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారంటూ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య మొయినాబాద్ ఠాణా లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ సూచనలతోనే బీఆర్ఎస్ నాయకులు ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్తోపాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్రావు, డి.మచ్చు, కె.యాదగిరి, రవికిరణ్, మురళి, అనిల్, వర్ధన్, అభిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్కుమార్రెడ్డి తెలిపారు. -
● రోజు విడిచి రోజు..
బడంగ్పేట్: నాదర్గుల్, బడంగ్పేట్, గుర్రంగూడ, కుర్మల్గూడ, అల్మాస్గూడ, మల్లాపూర్, వెంకటాపూర్, బాలాపూర్, మామిడిపల్లి ప్రాంతాలను కలుపుతూ మిషన్ భగీరథ పథకం కింద పది లక్షల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న 13 ట్యాంకులు నిర్మించారు. మీర్పేట, జిల్లెలగూడ, వినాయకహిల్స్, తిరుమలనగర్ ప్రాంతాలను కలుపుతూ మరోలైన్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్లైన్లు ఏర్పాటు చేసి రోజువిడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 5వ డివిజన్, ఇతర కాలనీల్లో వారానికి ఒకసారి కృష్ణా నీరు వచ్చేది. ఇటీవలే సమస్యను పరిష్కరించి రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నారు. సాయినగర్ కాలనీలో నీటి సరఫరా సరిగ్గా కావడం లేదని కొంత కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్ర పరిశీలన చేసి కొత్తలైన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని జలమండలి అధికారులు చెబుతున్నారు. -
● లీకేజీలు.. మరమ్మతులు
చేవెళ్ల: మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో నీటి సమస్య కొంత మేరకు తీరినా పైపులైన్ల లీకేజీలు, మరమ్మతుల కారణంగా అక్కడక్కడా సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ పరిధిలో 19 వేల జనాభా ఉంది. పలు కాలనీల్లో పైపులైన్ లీకేజీల కారణంగా చేపడుతున్న మరమ్మతులతో స్థానికులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో మరమ్మతులతో వారంరోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు పూర్తి చేసి పునరుద్ధరించారు. మున్సిపల్ పరిధిలోని ఊరేళ్లలో నీటి సమస్య ఏర్పడడంతో చర్యలకు ఉపక్రమించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలతోపాటు అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 35 లక్షల లీటర్ల ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు. ఇప్పటికే సమస్యలున్న ప్రాంతాలను గుర్తించామని, ఎక్కువ ఇబ్బంది వస్తే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
● కొత్త కాలనీల్లో సమస్య
అవసరం ఉన్న చోట కొత్త బోర్లు మున్సిపాలిటీలో మొత్తం 116 బోర్లు ఉన్నాయి. వాటిలో 84 పని చేస్తుండగా.. 32 పని చేయడం లేదు. నీటి వనరులు ఉన్న బోర్లను గుర్తించి వారం రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం. అవసరం ఉన్న చోట కొత్త బోర్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. టెక్నికల్ అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్ శంకర్పల్లి: మున్సిపాలిటీలో సుమారు 7వేల వరకు నివాసాలు ఉన్నాయి. 4,592 నివాసాలకు గాను మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా నివాసాలకు బోర్లు, ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కాలక్రమేణా పట్టణం విస్తరిస్తోంది. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. భారీగా నిర్మాణాలు జరగుతున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో తాగునీటి సమస్య తప్పడం లేదు. అధికారులు పైప్లైన్ లేని చోట్ల రెండు ట్యాంకర్ల ద్వారా, పైప్లైన్లు ఉన్న చోట సమీపంలోని బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు సాయి కాలనీ, శ్రీరాంనగర్, సాయిబాబా టెంపుల్, పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో పైపులైన్ మరమ్మతులు, లీకేజీ పనులు పూర్తయ్యాయి. రిత్విక్ వెంచర్, మైనార్టీ కాలనీల్లో ఇతరత్రా పనుల కారణంగా పైప్లైన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టణంలోని రెడ్డి కాలనీ, బోప్పన్న వెంచర్, ఆదర్శ్నగర్, క్రిస్టల్ వెంచర్–1లో కొత్తగా లైన్లు వేయాల్సి ఉంది. -
ఎద్దడి లేకుండా చూడాలి
అధికారులు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్య ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎండలు మరింత తీవ్రం కాకముందే చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇబ్బందులు తప్పుతాయి. – పైళ్ల శ్రీనివాస్రెడ్డి, బొంగ్లూర్ ట్యాంకర్లతో సరఫరా కొత్త కాలనీలకు నీరు అందడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లు బాగు చేయించాం. కృష్ణనీరు, మెట్రోవాటర్ అందని ప్రాంతాలకు బోరు నీరు అందిస్తున్నాం. అవసరమైతే 24 గంటలు ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సరఫరా చేస్తున్నాం. – బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
ముసుగు దొంగల హల్చల్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగులు గ్రామాల్లో హల్చల్ చేశారు. చోరీకి పాల్పడి నగదు, ఓ బైక్ ఎత్తుకెళ్లారు.
● జనాభాకు తగ్గట్టు లేని సరఫరా బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 20258లోuఇబ్రహీంపట్నం: జనాభా అవసరాలకు తగ్గట్టు మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా కావడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో 45 నుంచి 50 వేల జనాభా నివసిస్తున్నారు. 7,500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 50 లక్షల లీటర్ల తాగునీరు అవసరం ఉండగా 39 లక్షల నుంచి 41 లక్షల లీటర్ల లోపే సరఫరా అవుతోంది. మరో పది లక్షల లీటర్ల కోసం ఇతరత్రా మార్గలపై ఆధారపడాల్సి వస్తోంది. వేసవి వచ్చిందంటే చాలు నీటి ఎద్దడి షరా మామూలే అవుతోంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు మున్సిపల్ యంత్రాంగం చెబుతోంది. మున్సిపల్ పరిధిలోని 102 బోర్లకు మరమ్మతులు, ప్లషింగ్ చేయించామని, సుమారు 5 లక్షల లీటర్ల నీటిని ఈ బోర్ల ద్వారా ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. 5,500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ ద్వారా రోజుకు నాలుగైదు ట్రిప్పులు ఆయా బస్తీల్లో సరాఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి ఎద్దడి తీవ్రమైతే మరో రెండు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతోపాటు కొత్తగా రెండు బోర్లను వేసేందుకు ఉన్నతాధికారులతో అనుమతులు పొందినట్టు చెప్పారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు గిరాకీ ఎండలు ముదురుతుండటంతో తాగునీటి సమస్య ఉత్పన్నం అవుతోంది. కొత్తగా వెల సిన కాలనీల్లో పంపిణీ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. రూ.500 చొప్పున ట్యాంకర్ నీటిని పంపిణీ చేస్తున్నారు. న్యూస్రీల్చర్యలు తీసుకుంటున్నాం వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మిషన్ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. ఇక్కడున్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త బోర్లు వేసేందుకు, ప్రైవేట్ వాటర్ ట్యాంకులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్ -
● ప్రత్యామ్నాయ చర్యలు
కొత్తూరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. 6,200 మిషన్ భగీరథ కుళాయిలు ఉన్నాయి. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఏర్పడితే ఇప్పటికే మరమ్మతులు చేసిన 22 బోరుబావుల ద్వారా సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతానికి అన్ని వార్డుల్లో నీటి సరఫరా సక్రమంగా ఉందని, ఎక్కడా పైపులైన్ల మరమ్మతులు కూడా లేవని తెలిపారు. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
● బోరు నీరే ఆధారం
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలో మొత్తం 14,500 తాగునీటి కనెక్షన్లు ఉండగా, నిత్యం 78 లక్షల లీటర్ల సరఫరా అవసరం ఉంది. 68 లక్షల లీటర్లు మాత్రమే ఉండటంతో సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలకు నీటి తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా సరిపడా నీరు రాకపోవడంతో బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. బోరు నీటి వసతి లేని వారు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. జలమండలి కానీ మున్సిపాలిటి కానీ ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకోక తప్పడం లేదు. మున్సిపాలిటీలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల కారణంగా నీటి స రఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చాలా కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పైప్లైన్లు ధ్వంసం అవుతున్నాయి. జలమండలి అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడంతో పలు చోట్ల రోజుల తరబడి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై జలమండలి మేనేజర్ వినయ్ను వివరణ కోరగా పైప్లైన్ల మరమ్మతులను వేగంగా చేపడుతున్నామని, అదనంగా సిబ్బందిని సైతం నియమించుకున్నట్టు తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కడచూపు కోసం.. కన్నీటి పయనం
షాద్నగర్: విదేశీ ప్రయాణం అంటే సంతోషంగా ముందుకు సాగుతారు.. అక్కడే స్థిరపడి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన పిల్లలు, బంధువులను చూసేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతారు. కానీ కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి, పవిత్ర దంపతుల అమెరికా ప్రయాణం కన్నీటి మయమైంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్రెడ్డి, వియ్యంకురాలు సునీతారెడ్డిని చివరిసారిగా చూసేందుకు మంగళవారం వారు బయల్దేరారు. ఈ క్రమంలో టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు, మనుమడిని తలచుకుంటూ బాధితులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను ఇండియా తెప్పించేందుకు వీలు కావడంలేదని, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రగతి అత్తింటి వారి నుంచి సమాచారం రావడంతో బరువెక్కిన హృదయాలతో వెళ్లారు. పలువురి పరామర్శ అమెరికాకు పయనమైన మోహన్రెడ్డి దంపతులు టేకులపల్లి నుంచి నగరంలోని కొత్తపేటలో ఉన్న తమ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి వీరిని కలిసి ఓదార్చారు. -
భూ సేకరణ విరమించుకోవాలి
యాచారం: పారిశ్రామిక పార్క్ల పేరుతో చేపట్టే భూ సేకరణను విరమించుకోవాలని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణను వెంటనే నిలిపేయాలని కోరుతూ మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు పండే భూములను తీసుకుంటే జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ సేకరణను వెంటనే విరమించుకోకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ అనంత్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాన్ని సందర్శించి సర్కార్కు నివేదిక ఇస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అంతకు ముందు రైతులంతా సమావేశమై భూసేకరణను వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో మర్పల్లి అంజయ్య యాదవ్, మేకల యాదగిరిరెడ్డి, తాండ్ర రవీందర్, బండిమీది కృష్ణ, నక్క శ్రీనువాస్ యాదవ్, కుంచారపు సందీప్రెడ్డి, మాదం జంగయ్య, బాల్రాజ్, పాండు యాదవ్, ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నతో కలిసి మాట్లాడారు. ఎనిమిది నెలల పెండింగ్ బిల్లులు, మూడు నెలల వేతనాలు వెంటనే ఇప్పించాలని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వంట బంద్ చేసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు జయమ్మ, సావిత్రి, రజిత, శివ రాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వర్గీకరణను ఉభయ సభలు ఒకేరోజు ఆమోదించడం హర్షణీయమన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఫిబ్రవరి 24న తెలంగాణ సోషల్ జస్టిస్డేగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. కులగణనపై కూడా సరైన నిర్ణయం తీసుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా వెంకట్రెడ్డి మంచాల: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన వింజమూరి వెంకట్రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధినాయకత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సందర్భంగా మంగళవారం వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో క్రమశిక్షణతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
● బోర్లు.. ట్యాంకర్లతో సరఫరా
ఆమనగల్లు: మున్సిపాలిటీ జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా లేకపోవడంతో కొన్ని కాలనీల్లో నీటికోసం ఇబ్బందులు తప్పడం లేదు. పలు కాలనీలకు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా లేని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ట్యాంక్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా 19 లక్షల లీటర్ల సరఫరా జరుగుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కాలనీలకు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని బీసీ కాలనీ, విద్యానగర్ కాలనీలకు బోర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. కొన్ని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు తీవ్రమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా చూస్తాం మిషన్ భగీరథ నీరు అందని కాలనీలకు బోర్ల ద్వారా అందిస్తున్నాం. అవసరమైన చోట నూతన పైప్లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. – శంకర్, మున్సిపల్ కమిషనర్ పైప్లైన్ నిర్మించాలి మా కాలనీకి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. కాలనీలో ఉన్న బోరు ద్వారా సరఫరా చేస్తున్నారు. నూతనంగా పైప్లైన్ నిర్మించి మిషన్ భగీరథ నీరు అందించాలి. కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి. – అనిత, విద్యానగర్ కాలనీ, ఆమనగల్లు -
● మిషన్ భగీరథ.. అంతంతే..
మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో కొన్ని గ్రామాలు, కాలనీల్లో బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ, భరద్వాజ్ కాలనీ, ముస్తఫాహిల్ కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఆయా కాలనీల్లో ఉన్న బోర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. లక్ష్మీగణపతి నగర్ కాలనీలో బోర్ల నుంచి ఇళ్లలోకి నేరుగా పైపులు వేసుకుంటున్నారు. పెద్దమంగళారం గ్రామానికి సైతం మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. వచ్చిన నీటిని అరగంటసేపు మాత్రమే ఇళ్లలోకి వదులుతున్నారు. చిలుకూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీకి మిషన్ భగీరథ పైప్లైన్ ఇప్పటి వరకు వేయలేదు. అక్కడ బోర్ల ద్వారానే నీళ్లు అందిస్తున్నారు. ప్రస్తుతం బోర్లలో సైతం నీళ్లు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో బోర్లు ఎండిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. హిమాయత్నగర్లో మిషన్ భగీరథ పైప్లైన్లు తరచూ లీకేజీ అవుతున్నాయి. రెండు నెలల కాలంలో పది చోట్ల పైప్లైన్లు లీక్ అయ్యాయి. రెండు రోజుల క్రితం సైతం హిమాయత్నగర్లోని ఎస్సీ కాలనీలో పైప్లైన్ లీకేజీ కావడంతో కాలనీకి నీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యలు రాకుండా చూస్తున్నాం గతంలో ఉన్న జనాభా ప్రకారం మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం కాలనీలు పెరగడంతో ఆ నీళ్లు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రానిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. వేసవి మొదలు కావడంతో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఖాజా మొయిజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
మాడ్గుల: మండల పరిధి కొల్కులపల్లిలో వైన్ షాప్లో చోరీకి పాల్పడిన నేనావత్ సాయికుమార్ను సోమవారం అరెస్టు చేశామని సీఐ వేణుగోపాలరావు తెలిపారు. జనవరి ఒకటిన మద్యం దుకాణంలో దొంగతనం చేశాడని, నిందుతున్ని మాడ్గుల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని సీఐ వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య కేశంపేట: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధి వేములనర్వ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె అనంత(44), భర్త గతంలో మరణించడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. మృతురాలు కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మామ వడ్డె కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. వ్యర్థాలకు నిప్పు షాద్నగర్రూరల్: పట్టణ శివారులోని అన్నారం వై జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలకు నిప్పు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వై జంక్షన్ సమీపంలోని ఉడిపి హోటల్ వెనకాల ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు మంటలను ఆర్పారు. కారు, డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు కేశంపేట: ఎదురెదురుగా డీఎసీఎం, కారు ఢీకొన్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కార్తీక్, కీర్తన్లు కంటి ఆస్పత్రికని షాద్నగర్కు వచ్చారు. తిరిగి గ్రామానికి రాత్రి వెళ్తున్న క్రమంలో మండల పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారు ఐరన్ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రులను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితుడి తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కందుకూరులో.. ఆరుగురికి కందుకూరు: కారు, డీసీఎం ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి శ్రీశైలం రహదారి అలిఖాన్పల్లి గేట్ వద్ద కల్వకుర్తి వైపు నుంచి వస్తున్న కారు, కడ్తాల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా వారి వివరాలు తెలియరాలేదు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మహేశ్వరంలో.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు మహేశ్వరం: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధి తుమ్మలూరు– మహేశ్వరం రోడ్డులో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన ఉండెల శివకుమార్(23) డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి మహేశ్వరం నుంచి గుమ్మడవెళ్లి గ్రామానికి పల్సర్ బైక్పై వెళ్తుండగా, మహేశ్వరం గ్రామానికి చెందిన రెవేళ్ల యాదగిరి రాయుడు, సురేష్ ఇద్దరు బైక్పై తుమ్మలూరు నుంచి మహేశ్వరం వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివకుమార్కు తీవ్రగాయాలై నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి
చేవెళ్ల: లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి ఖానాపూర్ బస్స్టేజీ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై సోమ వారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన భగిర్తి వెంకటయ్య, సుమిత్రలకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు బి.సాయికుమార్(20) ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం చేశారు. కుటు ంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయి పదో తరగతితోనే చదువు ఆపేసి, ప్రైవేటు పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి లాగే యువకుడు పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ యువకుడు నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను ఎగిరి కిందపడగా.. బైక్తో పాటు యువకుడి తలపై నుంచి లారీ ముందుకు దూసుకుపోయింది. దీంతో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. లారీని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. మృతుడు సాయికుమార్గా గుర్తించిన పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేశాయి. -
ప్రాణం పోయినా భూములివ్వం
● మొండిగౌరెల్లి రైతుల తీర్మానంయాచారం: పారిశ్రామిక పార్కుల పేరుతో అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా తీసుకుంటామంటే ఊరుకునేది లేదని, ప్రాణం పోయినా భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. నేలతల్లిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న తమ భూములను గుంజుకుంటామంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామిక పార్కులకోసం గ్రామంలోని పలు సర్వేనంబర్లలోని 822 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు సోమవారం జీపీ కార్యాలయం ఎదుట సమావేశం అయ్యారు. సర్కారు భూములు తీసుకోకుండా అడ్డుకుందామని, సమష్టిగా పోరాటం చేద్దామని తీర్మానించారు. ఇందులో భాగంగా టి.రవీందర్, బి.కృష్ణ, సందీప్రెడ్డి, సంగెం రవి, ప్రవీణ్కుమార్లతో పాటు మరో 30 మందితో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, కలెక్టర్కు వినతిపత్రాలు, న్యాయపరంగా కోర్టుకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. మాజీ సర్పంచ్ అంజయ్య యాదవ్, రైతులు మేకల యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్, జంగయ్య, శ్రీకాంత్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జ్వరమని వెళ్తే.. ప్రాణం తీశారు!
షాద్నగర్రూరల్: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం కోనాయపల్లి గ్రామ పంచాయతీ పరిధి లచ్యానాయక్తండాకు చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం వచ్చిందని కుటుంబ సభ్యులు ఈ నెల 14న పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువచ్చారు. అతన్ని పరీక్షించిన ఆర్ఎంపీ.. తాను నిర్వహిస్తున్న బాలాజీ ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. సామ్యనాయక్కు డెంగీ ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న వ్యక్తికి.. ప్లేట్లెట్స్ క్రమంగా తగ్గుతుండటంతో.. మెరుగైన వైద్యంకోసం నగరానికి తీసుకెళ్తామని ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబీకులు చెప్పినా.. వినిపించుకోలేదు. ఇక్కడ మంచి వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. గమనించిన వైద్యులు సీపీఆర్ చేశారు. రోగి మృతి చెందాడని నిర్ధారించుకున్న వైద్యులు, యాజమాన్యం ఆస్పత్రి షట్టర్స్ను మూసి వేశారు. మృతుడి కుటుంబీకులు కిందకు వెళ్లి తిరిగి పైకి వచ్చే సరికి.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఆందోళన సామ్యనాయక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆదివారం అర్ధరాత్రి బాలాజీ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం మరోసారి ఆందోళన చేశారు. ‘మా నాన్న చావుకు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే’ కారణమని మృతుడి కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ రాంచందర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కుటుంబీకులు,బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ధర్నా -
‘ప్రజావాణి’ దండగ
సమస్యలు తీరవు, బాధలు పట్టవు ● కాగితాలు తీసుకొని పొమ్మంటున్నారు ● ఫిర్యాదుదారుల ఆవేదన ● ప్రజావాణికి 72 దరఖాస్తులు ఇబ్రహీంపట్నం రూరల్: ‘సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజావాణి దండగ’ అని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితం తీసుకునే వరకు లైన్లో ఉండాలని, మేడమ్ వద్దకు వెళ్లగానే ఏం మాట్లాడకుండా కాగితం తీసుకొని పోలీసుల చేత వెనక్కి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. సమస్యలు తీరవు, మా బాధలు ఎవరికీ పట్టవు. ఇక మాకు చావేదిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 72 ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రెవెన్యూ, ఇతర సమస్యలపై చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాబాద్, ఆమనగల్లు తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకే ఏకంగా 40 అర్జీలు రాగా, ఇతర శాఖలకు 32 వచ్చాయి. ఈ దరఖాస్తుల స్వీకరణలో అదనపు కలెక్టర్తో పాటు డీఆర్ఓ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్ కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని సీఐటీయూ జిల్లా కమిటీ హెచ్చరించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్యలక్ష్మి, కవితల ఆధ్వర్యంలో సోమవారం 48 గంటల దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, చంద్రమోహన్లు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసి, పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావాలని చూస్తుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతెచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మూత పడనున్న ఐసీడీఎస్లు పీఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ కేంద్రాలను 28 జిల్లాల్లో 56 కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మొబైల్ అంగన్వాడీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపిందని ఆరోపించారు. తద్వారా ఐసీడీఎస్లు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదని, దీంతో పేద పిల్లలకు పౌష్టికాహారం దూరం కానుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అనేక హామీలను ఇచ్చి నేడు, విస్మరిస్తుందని విమర్శించారు. టీఏ, డీఏలు పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల బలోపేతానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జగన్, జిల్లా నాయకులు కిషన్, దేవేందర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్దే రాత్రి బస 48 గంటలు దీక్షకు పిలుపునివ్వడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాత్రి కలెక్టరేట్ కార్యాలయం వద్దే బస చేశారు. అక్కడే వంటావార్పు చేశారు. రోడ్డుపైనే టెంట్ల కింద పడుకున్నారు. ఆట పాటలతో బతుకమ్మలు ఆడి సరదాగా గడిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని స్పష్టంచేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష -
సామాన్యుడికి అందుబాటులో..
‘సాండ్ బజార్’లో తక్కువ ధరకే లభ్యం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్మెట్: దళారీ వ్యవస్థను అరికట్టి, సామాన్యుడికి తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేషన్ చైర్మన్ అనిల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఇసుక విక్రయకేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్ఎండీసీ ఎండీ.సుశీల్కుమార్, జనరల్ మేనేజర్ రాజశేఖర్రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ నర్సిరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ దండగ
సమస్యలు తీరవు, బాధలు పట్టవు ● కాగితాలు తీసుకొని పొమ్మంటున్నారు ● ఫిర్యాదుదారుల ఆవేదన ● ప్రజావాణికి 72 దరఖాస్తులు ఇబ్రహీంపట్నం రూరల్: ‘సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజావాణి దండగ’ అని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితం తీసుకునే వరకు లైన్లో ఉండాలని, మేడమ్ వద్దకు వెళ్లగానే ఏం మాట్లాడకుండా కాగితం తీసుకొని పోలీసుల చేత వెనక్కి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. సమస్యలు తీరవు, మా బాధలు ఎవరికీ పట్టవు. ఇక మాకు చావేదిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 72 ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రెవెన్యూ, ఇతర సమస్యలపై చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాబాద్, ఆమనగల్లు తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకే ఏకంగా 40 అర్జీలు రాగా, ఇతర శాఖలకు 32 వచ్చాయి. ఈ దరఖాస్తుల స్వీకరణలో అదనపు కలెక్టర్తో పాటు డీఆర్ఓ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేసిన ఘనత మాదే ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ● మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహేశ్వరం: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ ని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రిదుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కిందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో కొంత మందికి రుణమాఫీ కాలేదని, వాటిని పరిశీలించి అర్హులందరికీ మాఫీ అయ్యేలా చూస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నామని, వాటిని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ బాధితులను ఆదుకుంటాం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఎస్టీ గిరిజన, బీసీ రజక సామాజిక వర్గాలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయని మంత్రి అన్నారు. అంతకు ముందు పాలకవర్గ సభ్యులు చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, డైరెక్టర్లుగా పుష్ప, ప్రశాంత్ కుమార్, కె.యుగేందర్, సురేందర్, విష్ణువర్ధన్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎంఏ.జావీదు, బోధ పాండు రంగారెడ్డి, యాదయ్య, ధన్పాల్రెడ్డి, పాండు మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జెడ్పీ చైర్పర్సన్ మాజీ సభ్యురాలు అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు భాస్కర్రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్లీడర్ జంగారెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ నర్సింహ, మాజీఎంపీపీ రఘుమారెడ్డి పాల్గొన్నారు. -
డబుల్రోడ్డుకు అనుమతివ్వండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలను కలిపే కడ్తాల్ నుంచి కొట్ర ఎక్స్రోడ్డు వరకు ఉన్న రోడ్డులో.. అటవీ భూమిలో డబుల్రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం రెండు వరుసలుగా రహదారిని నిర్మించారని తెలిపారు. మాదారం దాటిన తరువాత అటవీశాఖ భూమిలో 1.5 కిలో మీటర్ల రోడ్డు ఉందని, ఆ శాఖ అనుమతి లేకపోవడంతో రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సింగిల్ రోడ్డును డబుల్రోడ్డుగా నిర్మించాలని కోరారు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతకు ముందు కల్వకుర్తి ఆర్టీసీ డిపోనకు నూతనంగా 16 కొత్త బస్సులను కేటాయించడంపై ఎమ్మెల్యే కసిరెడ్డి మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం ● అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీనివాస్రెడ్డి ● రాజ్భూపాల్గౌడ్కు రూరల్ జిల్లా బాధ్యతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: బీజేపీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడిగా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన పంతంగి రాజ్భూపాల్గౌడ్, జిల్లా అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీ నివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా ఎన్నికల అధికారి కట్ట సుధాకర్రెడ్డి వీరికి నియామకపత్రం అందజేశారు. 1970లో జన్మించిన రాజ్భూపాల్గౌడ్ బాల్య స్వయం సేవక్గా పని చేశారు. 1995లో బీజేపీ పాలమాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, 1997లో యువమోర్చా మండల అధ్యక్షుడిగా, 2000లో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, 2007లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2015లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. 2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఆయనకు అనుబంధం ఉంది. ప్రస్తు తం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ఆయన సన్నిహితులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాలకు చెందిన శ్రీనివాస్రెడ్డికి డ్రాగన్ ఫ్రూట్ రైతుగా పేరుంది. ప్రస్తు తం ఆయన వనస్థలిపురంలో ఉంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గోవిందమ్మ శంకర్పల్లి: మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్గా శంకర్పల్లి పట్టణానికి చెందిన చంద్రమోహన్తో పాటు మరో 16మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ సందర్భంగా గోవిందమ్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం తేదీ ఖరారు కావాల్సి ఉంది. సిటీ హీటెక్కుతోంది! మరో మూడ్రోజులు భానుడి భగభగలు సాక్షి, సిటీబ్యూరో: నగరం గరం అవుతోంది. ఉదయం 7 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరులోగా 45 డిగ్రీలకు చేరి వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఒంటి పూట బడులు ప్రారంభం కావడంతో మధ్యా హ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో విద్యా ర్థులు ఎండలకు తల్లడిల్లుపోతున్నారు. సోమ వారం గోల్కొండ, ముషీరాబాద్, చార్మినార్, బహదూర్పురా, బండ్లగూడ, అంబర్పేట, మారేడుపల్లి, హిమాయత్ నగర్, షేక్పేట్, ఖైరతాబా ద్, సైదాబాద్లలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్టోగ్ర తలు నమోదయ్యాయి. -
ఆన్లైన్లో ఇసుక
● టీజీఎండీసీ ఆధ్వర్యంలోప్రభుత్వ సాండ్ బజార్లు ● సన్న ఇసుక టన్నుకు రూ.1,800, దొడ్డుది రూ.1,600 ● అందుబాటులోకి అబ్దుల్లాపూర్మెట్ సాండ్బజార్.. ● నేడు మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, ● రేపు వట్టినాగులపల్లిలోనూ ప్రారంభం సాక్షి, రంగారెడ్డి: ఇసుక అక్రమ దందాకు ప్రభు త్వం చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇసుక బుకింగ్, తరలింపులో దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా నాణ్యమైన ఇసుకను నిర్మాణదారులకు అందజేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సాండ్ బజార్లను ప్రారంభించాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో సాండ్ బజార్ను ప్రారంభించింది. మంగళవారం మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, బుధవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో మరో రెండు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వమే స్వయంగా క్వారీల నుంచి ఇసుకను లారీల్లో ఇక్కడికి తరలించి, నిర్మాణదారులకు సరఫరా చేయనుంది. సన్న ఇసుక టన్నుకు రూ.1800, దొడ్డు ఇసుక టన్నుకు రూ. 1600 ధరగా నిర్ణయించింది. భవన నిర్మాణదారులు మీ సేవ కేంద్రాల్లో/టీజీఎండీసీ వెబ్సైట్లో నేరుగా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. రోజుకు 50 వేల టన్నులు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ సంఖ్యలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత నివాసాలతో పాటు అపారు్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం ఇసుక అవసరం. నగరంలో రోజుకు సగటు 50 వేల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా. కాళేశ్వరం, కరీంనగర్, భద్రాచలం, జాజిరెడ్డిగూడెం నుంచి గత నెల వరకు రోజుకు సగటున 1,400 లారీల్లో ఇసుకను తరలించగా, ప్రస్తుతం ప్రభుత్వ లోడింగ్పై విధించిన ఆంక్షలతో ఇసుక తరలించే లారీల సంఖ్య రెండు వేలకు చేరుకుంది. గతంలో ఒక్కో లారీలో 50 టన్నులకుపైగా ఇసుక తరలిస్తే.. ప్రస్తుతం 25 టన్నులే వస్తోంది. ఫలితంగా ఇసుకను తరలించే లారీల సంఖ్య ప్రస్తుతం రెండు వేలకు చేరింది. ఆయా లారీల యజమానులు ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుకను లోడ్ చేసుకుని వచ్చినగర శివారు ప్రాంతాల్లోని ఆటోనగర్, ఉప్పల్, మంద మల్లమ్మ చౌరస్తా, ఉప్పరిగూడ, శివరాంపల్లి, ఉప్పల్ రింగ్రోడ్డు, బోడుప్పల్ ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిపి అమ్ముతుంటారు. దళారులకు ఇక చెక్.. దళారులు ఆయా లారీల యజమానులతో ముందే కుమ్మకై ్క ఇసుక ధరను అమాంతం పెంచేస్తున్నారు. అంతేకాదు.. ఏకధాటి వర్షాలకు వాగుల్లో వరదలు పోటేత్తే సమయంలో కృత్రిమ కొరత సృష్టించి, అప్పటికే డంపింగ్ కేంద్రాల్లో నిల్వ చేసిన ఇసుకకు భారీ ధరలు నిర్ణయించి అమ్ముతున్న విషయం తెలిసిందే. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో టన్ను రూ.1200 లోపే దొరికే ఇసుక.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఏకంగా రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక లేకపోతే పని ఆగిపోయే ప్రమాదం ఉందని భావించి ఇష్టం లేకపోయినా నిర్మాణదారులు వారు చెప్పిన ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వారీలపై నిఘా పెంచింది. ప్రస్తుతం ఆయా ఇసుక క్వారీలన్నింటిని తమ చేతుల్లోకి తీసుకుంది. ఓవర్లోడు కారణంగా రహదారులు దెబ్బ తినకుండా చెక్ పెట్టేంది. అంతేకాదు బహిరంగ మార్కెట్లో ఇసుక అధిక ధరలకు కళ్లెం వేసినట్లయింది. -
ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి
షాద్నగర్: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ స్పష్టం చేశారు. వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్రెడ్డి స్వాగతించారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తింజేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. అసెంబ్లీలో ఈనెల 18న చట్టం చేస్తామని చెబుతూనే మరోవైపు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, చెన్నగళ్ల శ్రావణ్, పాండు, యాదగిరి, జోగు శ్రీశైలం, శ్రీను, హరీష్, వినోద్, మధు, శివశంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి షాద్నగర్: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంగుడ్ల బిల్లులు, మూడు నెలల నుంచి గౌరవ వేతనం, మెనూ చార్జీలు చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిల్లులు ఇవ్వకుంటే విద్యార్థులకు ఎలా భోజనం అందిస్తారని ప్రశ్నించారు. రోజు రోజుకూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను ఏవిధంగా సరఫరా చేస్తుందో అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, కార్మికులు శ్రీలత, శ్రీనివాస్, వసంత, సంతోష, సత్తెమ్మ, వెంకటమ్మ, అనిత, షాహినీబేగం తదితరులు పాల్గొన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలి ఇబ్రహీంపట్నం: ఈనెలాఖరులోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని డీఎల్పీఓ సాధన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని ముకునూర్లో వివిధ రకాల టాక్స్ల వసూళ్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 31లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్, ఉస్మాన్, అశోక్ ఉన్నారు. నేడు ఓయూ బంద్కు పిలుపు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఆందోళనలపై అధికారులు విధించిన నిషేధంపై విద్యార్థి సంఘాల నేతలు, ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్వీ, ఎంఎస్ఎఫ్, దళిత, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట సమావేశమై అధికారుల తీరుపై మండిపడ్డారు. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించలేని, పాలన చేతకాని వీసీ ప్రొ.కుమార్ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం సిగ్గుచేటన్నారు. ఆందోళనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వీసీ ప్రొ.కుమార్ నియంతృత్వ పోకడలకు, ఆందోళనలపై నిషేధాలకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్కు ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. -
పారిశుద్ధ్య సిబ్బంది కొరత
ఆమనగల్లు: విఠాయిపల్లి గ్రామాన్ని కలిపి ప్రభుత్వం ఆమగల్లు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా అవసరమైన సిబ్బందిని మాత్రం నియమించలేదు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రధాన రహదారిని మాత్రం శుభ్రం చేస్తుండగా కాలనీల్లో మాత్రం రెండుమూడు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 48 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నిత్యం 1.8 టన్నుల తడిచెత్త, 2.1 టన్నుల పొడిచెత్తను సేకరించి పట్టణ సమీపంలోని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 17 కిలోమీటర్ల భూగర్భ మురుగు కాలువలు ఉన్నాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరో రెండు కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. -
సేకరిస్తున్నా పేరుకుపోతోంది
బడంగ్పేట్: మున్సిపల్ కార్పొరేషన్లో 32 డివిజన్లు ఉన్నాయి. నిత్యం 50 టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో నిర్మించిన డీఆర్సీకి, అక్కడి నుంచి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా రాత్రివేళ రోడ్లకు ఇరువైపులా, ఓపెన్ ప్లాట్లలో, కాలనీల మలుపుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీంతో కుప్పలుగా పేరుకుపోతోంది. ఎప్పటికప్పుడు పడేసిన చెత్తను డంపింగ్యార్డుకు తరలిస్తున్నామని శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదని అంటున్నారు. రంగులతో ముగ్గులు, జరిమానా మలుపులు, కూడళ్ల వద్ద చెత్తను నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. మహిళా సిబ్బందితో చెత్త వేయొద్దని రంగురంగుల ముగ్గులు వేయిస్తున్నాం. చెత్త వేస్తే జరిమానా సైతం విధిస్తున్నాం. ప్రజల్లోనూ మార్పు రావాలి. – వి.యాదగిరి, శానిటరీ ఇన్స్పెక్టర్ -
అపరిశుభ్రంగా రోడ్లు
తుక్కుగూడ: పురపాలక సంఘం పరిధిలోని తుక్కుగూడ నుంచి బాసగూడతండాకు వెళ్లే రోడ్డు, రావిర్యాల నుంచి ఆర్సీఐ రోడ్డు, ఔటర్ రింగు సర్వీసు రోడ్లు పూర్తిగా అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ కాగితాలు పేరుకుపోయాయి. అధికారులు స్వచ్ఛ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలను ఉపయోగించి గృహాలు, వ్యాపార సముదాయులు, పరిశ్రమల నుంచి రోజుకు 9 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించినప్పటికీ నగరం నుంచి రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు, కొంత మంది స్థానికులు చెత్తను తెచ్చి ప్రధాన రోడ్లపై వేస్తున్నారు. ఇందులో జంతు వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. చెత్తను ఆరుబయట వేయకుండా అవగాహన కల్పించాలని, చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆగని పొగలు.. తీరని వెతలు
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025శంకర్పల్లి: ఐదు గ్రామాల కలయికతో 2018లో మున్సిపాలిటీ ఆవిర్భవించింది. ఇక్కడ డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది. స్థలం కోసం అన్వేషిస్తున్నప్పటికీ దొరకడం లేదు. గతంలో రెవెన్యూ అధికారులు సింగాపురం సమీపంలో అసైన్డ్ భూమిని కేటాయించగా.. అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అడుగు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు మున్సిపాలిటీ అవసరాలను తగినంత లేకపోగా.. దానిపై నుంచి 400 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆకతాయిలు, చెత్త సేకరించే వారు నిప్పు వేయడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. కిలో మీటర్ల మెర పొగలు వ్యాపిస్తుండడంతో సమీపంలోని ఆదర్శనగర్, సింగాపూర్, బొప్పన్న వెంచర్వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తడి, పొడి చెత్త సేకరణ ముందుకు సాగడం లేదు. సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపాలిటీలో 52మందితో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయిస్తున్నాం. డంపింగ్ యార్డు సమస్య ఉన్న మాట వాస్తవమే. స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలోనే కొత్తది నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నిప్పు వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – యోగేశ్, మున్సిపల్ కమిషనర్, శంకర్పల్లి న్యూస్రీల్ -
మద్యం మత్తులో భార్యను తోసేసిన భర్త
శంషాబాద్ రూరల్: మద్యం మత్తులో భార్యను తోసేయడంతో బస్సు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన బద్దన్న, పద్మ దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో నివాసముంటున్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు శంషాబాద్ బస్టాండ్కు వచ్చారు. షాద్నగర్ వైపు వెళ్లే మార్గంలో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న బద్దన్న భార్యను తోసేశాడు. ఇదే సమయంలో అఫ్జల్గంజ్ నుంచి శంకరాపురం వెళ్తున్న బస్సు పద్మను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బద్దన్నను చితకబాదారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కొత్త కాలనీల్లో సమస్యలు
కొత్తూరు: మున్సిపాలిటీలో ప్రస్తుతం 12 వార్డులు, సుమారు 20 వేల మంది జనాభా ఉన్నారు. కొత్తగా విస్తరించిన వింటేజ్, శ్రీరామ్నగర్, తిరుమల కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవు. నిత్యం మున్సిపాలిటీలో 35 మంది సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల నుంచి సేకరించి చెత్తను నాలుగు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న డంప్యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీలో 42 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. -
భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీనిరంజన మఠంలో ఆదివారం వీరశైవ సమాజం భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మఠం మల్లికార్జునస్వామి, గడ్డం చంద్రశేఖర్స్వామి, మఠం విజయకుమార స్వామిలు వీరశైవ సమాజం సభ్యులచే ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, సుగంధ ద్రవ్యాలతో బసవలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా నమక చమక అధ్యాయాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బిల్వాష్టకం, శివాష్టకం, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. దూప, దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి వారికి వీరశైవ సమాజం భక్తులు పాదపూజ చేశారు. నిరంజన మఠంలో బసవలింగేశ్వర స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ ముందు భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తూ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డి శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతులు శ్రీజగద్గురు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామివారు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయ భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్దన్, సమా జం సభ్యులు బిఆర్ విజయకుమార్, గంతల సంఘమేశ్వర్, బాలప్రకాశ్, తారాపురం రవి, గంటి సర్వేష్, రాకేష్, నాగభూషణం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరశైవ సమాజం భక్తులు స్వామివారి సేవలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి ఆధ్యాత్మిక చింతన అవసరం ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం కేటాయించాలని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శ్రీజగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీజగద్గురు నిరంజన మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ప్రవచనాలు అందించారు. ప్రతిఒక్కరూ భక్తి, ధ్యానం, భగవత్ చింతన అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భక్తితో దేన్నైనా సాధించొచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తిమృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సింగారం మధు(24), శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కుటుంబీకులు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి జ్ఞానేశ్వర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పెద్ద చెరువు తూము వద్ద మధు చెప్పులు, పర్సు, ఐడీ కార్డు, సెల్ఫోన్ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలించి మధు మృతదేహాన్ని వెలికితీశారు. అవివాహితుడైన యువకుడి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రెండు నెలలుగా విధులకు హాజరు కావడంలేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ తెలిపారు. -
నిశ్చితార్థం రద్దు చేయించి..
మీర్పేట: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు. కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లిచేసుకుంటానని మోసం చేసిన ప్రేమికుడు యువకుడి ఎదుట ధర్నా, అట్రాసిటీ కేసు నమోదు -
లింకురోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి
చేవెళ్ల: పెండింగ్ రేగడిఘనాపూర్–చనువెళ్లి లింక్రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు రఘువీర్రెడ్డి కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చీఫ్ విప్.. ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పట్నంను కలిసి, సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామం నుంచి చనువెళ్లి లింక్రోడ్డుకు మంత్రిగా ఉన్న సమయంలో రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. వెంటనే ఆయన పంచాయతీ రాజ్ ఎస్ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోడ్డుపై ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు రిజెక్ట్ అయ్యాయని, మరోసారి ప్రతిపాధనలు పంపాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడి మంత్రి శ్రీధర్బాబుతో చర్చించి ఈ ప్రాంతంలో ఇలా మిగిలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
పంచాయతీ కార్మికుడి మృతి
వాటర్ ట్యాంక్లో పడితాండూరు రూరల్: ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్లో పడి ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కరన్కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మప్ప(42) ఏడేళ్లుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్గా పని చేస్తున్నారు. అప్పుడప్పడు ఆయన వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆదివారం ఉదయం గ్రామంలోని పంచాయతీకి చెందిన బంగారమ్మ తాగునీటి ట్యాంక్పైన లక్ష్మప్ప బట్టలు కనిపించాయి. వెంటనే వెళ్లి చూడగా వాటర్ ట్యాంక్లో విగతజీవిగా పడున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే లక్ష్మప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది. శుభ్రం చేయించాం కరన్కోట్ గ్రామంలోని బంగారమ్మ గుడి వద్ద ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ 60 వేల నీటి సామర్థ్యం కలదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ట్యాంక్ నుంచి జయశంకర్ కాలనీతో పాటు సీసీఐ కాలనీకి నీటి సరఫరా అవుతుంది. శనివారం రాత్రిపంచాయతీ కార్మికుడు ట్యాంకులో పడి మృతిచెందాడు. మృతదేహం నిల్వ ఉన్న నీరు ఆదివారం ఉదయం సరఫరా కావడంతో కాలనీవాసులుఆందోళన చెందుతున్నారు. ఈ విషయమైపంచాయతీ కార్యదర్శి ఆనంద్రావును వివరణ కోరగా.. ట్యాంక్ను శుభ్రం చేయించామన్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ నీటిని తాగామని గ్రామస్తుల భయాందోళన కరన్కోట్లో ఘటన -
హైవేపై కూలిన మర్రిచెట్లు
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రెండు చోట్ల ప్రమాదవశాత్తు రెండు మర్రిచెట్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలు చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టేజీ సమీపంలో ఒకటి, ఆలూరు బస్టేజీ సమీపంలో మరొకటి చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప వ్యవధిలో రెండు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు పరుగు తీయకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మరోమార్గం లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ శంకరయ్య, ఏఎస్ఐ చందర్నాయక్లు సిబ్బంది, స్థానికుల సహాయంతో జేసీబీతో చెట్లను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ మర్రి చెట్లు మొదళ్లు కాలిపోయి ఉండటంతో గాలి వీచిన సమయంలో ఇలా రోడ్డుపై పడిపోతున్నాయని, వాహనదారులు చెట్ల కింద ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు సూచించారు. తప్పిన ప్రమాదం, ట్రాఫిక్ అంతరాయం -
బైక్ దొంగకు రిమాండ్
ఆమనగల్లు: బైక్ను చో రీ చేసిన వ్యక్తిని శనివారం రిమాండ్కు తరలించినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్వాల్య గత ఏడాది డిసెంబర్లో తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని సరూర్నగర్కు చెందిన హాజీ బైక్ను చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజీని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్కు తరలించారు. చికిత్స పొందుతూ గర్భిణి మృతి వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ శంషాబాద్ రూరల్: ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి మృతి చెందింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్పేట్ నివాసి బుషమోని ప్రమీల(33) 9 నెలల గర్భిణి. మొదటి నుంచి ముచ్చింతల్ శివారులోని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుంది. నెలలు నిండడంతో ప్రమీలను ఈ నెల 11న జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 13వ తేదీ వరకు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. 18న ఆస్పత్రికి రావాలంటూ డాక్టర్ పూజిత కొన్ని మందులు రాసిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రమీల భోజనం తర్వాత వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంది. కాసేటి తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో భర్త సాయిబాబు ఆమెను రాత్రి 10.30 గంటలకు జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆమెను పరిశీలించారు. 12.15 గంటలకు డాక్టర్ రామారావు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయింది. సకాలంలోవైద్యం అందక తన భార్య మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చెరువును చెరబట్టి
పట్టాలు అడ్డుపెట్టి మొయినాబాద్: చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించాలని ఓ వైపు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తుంటే కొందరు మాత్రం చెరువులనే మాయం చేసేస్తున్నారు. చెరువు కట్టను పూర్తిగా తొలగించి, ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో ఉన్నారు. మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ రెవెన్యూలో ఈ తతంగం సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాకారం జాగీర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 11, 12లో జంబులకుంట చెరువు ఉంది. 21 ఎకరాల్లో విస్తరించిన ఉన్న చెరువు భూమిలో శిఖం పట్టాలున్నాయి. చెరువులోని నీళ్లు ఇంకిపోయినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తులు ఇందులో పంటలు సాగు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇతర అవసరాలకు సైతం వాడుకోవద్దు. కానీ కొంతమంది ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కొందరు చెరువు ఆనవాళ్లకే ఎసరు పెడుతున్నారు. ఈ క్రమంలో కట్టను పూర్తిగా తొలగించారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారుజంబులకుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పనులు శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కట్టను ధ్వంసం చేస్తున్న వైనం చెరువు ఆనవాళ్లను మాయం చేసేలా కుట్ర ఇరిగేషన్ అధికారులకుఫిర్యాదు చేసిన స్థానికులు