breaking news
Ranga Reddy District News
-
విలీనంపై వివరణ ఇవ్వండి
● ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలతో నిర్ణయం? ● సమగ్ర పరిశీలనానంతరమే ఖరారు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్)కు బ్రేక్ పడింది. డివిజన్ల పునర్విభజన సహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగర పాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునర్విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో, మాపో విడుదల కాగలదనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. పునర్విభజనపై దాదాపు 6వేల అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన, సమంజసమైనవిగా భావించిన అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ముమ్మర కసరత్తుతో రేయింబవళ్లు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్ను పెండింగ్లో పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకో..? వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్ఐఆర్, జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ను త్వరితంగా పూర్తిచేయాలని పురపాలకశాఖ భావించింది. దానికి తగ్గట్టుగానే చకచకా డివిజన్లు, సర్కిళ్ల హద్దులకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు, తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే, హడావుడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై అచితూచి అడుగువేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పదోతేదీ వరకు గడువుండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికకకు విరామమిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డీనెన్స్లను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బీ రాజు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు. వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీల్లో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని.. విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కగూడ కార్పొరేషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955కు చేసిన సవరణలను ఆపి వేయాలి’అని కోరారు. కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
హిందువులకు రక్షణ కల్పించాలి
శంకర్పల్లి: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం రాత్రి శంకర్పల్లి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులను కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రంగానాథ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడం ఆమానుషమని, దీనిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వారికి రక్షణ కల్పించాలని, బాధ్యులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొయినాబాద్: తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓల) అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మొయినాబాద్ ఏఈఓ ఎన్.సునీల్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాజేంద్రనగర్లో జరిగిన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సునీల్కుమార్తోపాటు కార్యదర్శిగా శివతేజగౌడ్, ట్రెజరర్ రాఘవేంద్రకుమార్లను ఎన్నుకున్నారు. సునీల్కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కార్యదర్శి సురేష్రెడ్డి, రాజేంద్రనగర్ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఈఓలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మంచాల: బొలెరో వాహనం ఫల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన రంగాపూర్ సమీపంలో కోళ్ల వంపు వాగు మలుపు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఓడుసు శివ(25) అతని స్నేహితులు యావ శంకర్, ఎడ్ల నాగరాజుతో కలిసి లోయపల్లి నుంచి రంగాపూర్ వైపు బొలెరో వాహనంపై వస్తున్నారు. రంగాపూర్ సమీపంలో చేరుకోగానే కోళ్ల వంపు వాగు మలుపు వద్ద రోడ్డుపై అతి వేగంగా వచ్చి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శివకు బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వెంటనే 108 అంబులెన్స్లో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య కుత్బుల్లాపూర్: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కొంపల్లికి చెందిన కృష్ణ, నాగమణి(42) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపానికి లోనైన నాగమణి బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా ఫాక్స్సాగర్ సమీపంలో చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి కడ్తాల్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన బీజేపీ నాయకుడు కొర్రదేవు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వంశీచంద్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమర్సింగ్, మాజీ సర్పంచ్ నరేందర్, నాయకులు సురేందర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బలరాంనాయక్, పర్వతాలు, రమేశ్గౌడ్, గణేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తుక్కుగూడ: ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,358 మంది ఆశా కార్యకర్తలకు చీరలు అందజేశామని చెప్పారు. ఆశాలకు ప్రభుత్వం ఏటా ఒక జత యూనిఫాం రూపంలో చీరలను అందిస్తుందన్నారు. ఆశాలు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆమనగల్లు: వరంగల్లో జనవరి 5 నుంచి 7 వరకు జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కోరారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రాష్ట్ర మహాసభల పోస్టర్ను విద్యార్థులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కార్తీక్, వంశీ, నిశాంత్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి కందుకూరు: ఒకరిపై ఒకరు నెపం మోపుకొంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్పా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎవరికీ చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూస్తే దక్షిణ తెలంగాణకు గుండెకాయ లాంటి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం నినాదంగానే ఉందన్నారు. మూడేళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పుకొనే బీఆర్ఎస్, పాలమూరు ప్రాజెక్టును మాత్రం పదేళ్లపాటు పాతరేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు నిద్రలేచి మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేలా కుట్ర జరగడంతో జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరగనుందన్నారు. సమావేశంలో జాగృతి షాద్నగర్ ఇన్చార్జి చీమల రమేష్, నాయకులు చలసాని విష్ణుమూర్తి, నాగని ప్రకాష్ పాల్గొన్నారు. -
వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ధ్యాన జనుల సందడితో వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ధ్యానులతో, పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయిఽ. ఉదయం సంగీత విధ్వాంసుడు సంజయ్కింగి బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యాన గురువు పరిణిత పత్రి ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. పత్రీజీ ఆశయ సాధనకు ధ్యానులు కృషి చేయాలన్నారు. ధ్యానం ద్వారం పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. జీవిత ధ్యేయం తనను తాను తెలుసుకోవాలనే పత్రీజీ ఇచ్చిన ఫార్మూల ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకుడు శ్రేయాన్స్దాగా ప్రసంగిస్తూ.. ధ్యానంలో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనల్ని మనం తెలుసుకోగలుతామని అన్నారు. కోట్లాది మంది ధ్యానులను పత్రీజీ తయారు చేశారని కొనియాడారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను, నూతన సంవత్సర క్యాలండర్లను, ఎనిమిదేళ్ల పీఎంసీ చరిత్రపై రూపొందించిన పీఎంసీ సావనీర్ను పిరిమిడ్ ట్రస్ట్ సభ్యులు, మాస్టర్లతో కలిసి పరిణిత పత్రి, ట్రస్ట్ చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మీడియా కో–ఆర్డినేటర్ భాస్కర్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, లక్ష్మి, నిర్మల, దామోదర్రెడ్డి, రవిశాసీ్త్ర, ఫౌండర్ బుద్ధ, సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో రోజుకు చేరిన వేడుకలు -
‘డబుల్’ నిరసన
● అనర్హులు ఇళ్లు తీసుకున్నారని మహిళల ఆందోళన ● పేదలను గుర్తించాలని ప్రభుత్వానికి అభ్యర్థన తుక్కుగూడ: అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తుక్కుగూడ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని సర్ధార్నగర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లాటరీ పద్ధతిన అర్హులకు కేటాయించిందని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి, ఒక్కొక్కరు మూడు, నాలుగు ఇళ్ల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. కొంత మందికి పట్టాలు ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అనర్హులను తొలగించి, పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
నూతన జాయింట్ సెక్రటరీగా బద్యానాథ్చౌహన్
ఆమనగల్లు: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం జాయింట్ సెక్రటరీగా ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్చౌహన్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీఓ భవన్లో బుధవారం ఫోరం ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్గా కృష్ణయాదవ్, అసిస్టెంట్ ఆఫీసర్గా రామారావు వ్యవహరించారు. నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికై న బద్యానాథ్చౌహన్ను ఫోరం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎకై ్సజ్ శాఖ అడిషనల్ కమిషనర్ ఖురేషీ, సురేశ్రాథోడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మీర్పేట: మిథులానగర్లో విద్యుత్ దీపాలతో హోలీకింగ్స్ టెంపుల్ చర్చి క్రిస్మస్ కాంతులుఊరూరా క్రిస్మస్ సందడి సంతరించుకుంది. ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్చిలు ముస్తాబయ్యాయి. బుధవారం విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. శిలువ, పశువుల పాక, మేరీమాత ప్రతిమ, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. గురువారం పాస్టర్లు దైవ సందేశం వినిపించనున్నారు. -
ఎకరాకు రూ.కోటి ఇవ్వండి
● గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధితుల డిమాండ్ ● అందరికీ సమాన పరిహారం ఇవ్వాలని అభ్యర్థన ● నిర్వాసితులతో ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశం కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించాలని మర్రిపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు తదితరులు బుధవారం కలెక్టరేట్లో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని, భూమి కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం సరిపోదని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం అందించాలని కోరారు. రూ.25 లక్షల పరిహారం.. అడిషనల్ కలెక్టర్, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డులో పూర్తిగా భూమి కోల్పోతున్న బాధితులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5.60 లక్షల చొప్పున పరిహారం, కోల్పోయిన భూమి ఆధారంగా 60 గజాల నుంచి 480 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. న్యాయం జరిగేలా చూస్తాం.. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ బాధితులకు ప్రైవేట్ ఉద్యోగంతో పాటు, కడ్తాల్లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మరింత మేలైన పరిహారం ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఈర్లపల్లి రవి, రైతులు రచ్చ శ్రీరాములు, నారయ్య, మల్లేశ్గౌడ్, సత్తయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు. -
రాజ్పాకాల కేసు వీడియోలు వైరల్
శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై మోకిల పీఎస్లో నమోదైన కేసు, చార్జిషీట్ అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది అక్టోబర్ 26న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, ఇందులో విదేశీ మద్యం వినియోగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై జూన్ 30న చార్జిషీట్ దాఖలు చేశారు. ఈఅంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో 35 మందిని విచారించిన తర్వాత, అనుమతి లేకుండా ఫాంహౌస్లో విదేశీ మద్యంతో పార్టీ చేసిన రాజ్ పాకాలపై, డగ్ర్ పరీక్షలో పాజిటివ్గా తెలిసిన విజయ్ మద్దూరిపై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేశామని మోకిల సీప వీరబాబు తెలిపారు. స్వార్థ ప్రయోజనాలకు యూనియన్ పేరు వాడొద్దు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గణేష్ షాద్నగర్రూరల్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సంఘం పేరును తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే సహించేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్గౌడ్, నరేష్ అధ్యక్షతన సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాల కోసం సంఘం పేరును తప్పుగా వాడుకుంటున్నాని, ఇది సరైన పద్దతి కాదన్నారు. కొందరు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిగా చలామణి అవుతున్నారని, సమంజసం కాదన్నారు. -
హైవేపై హోర్డింగ్ల తొలగింపు
యాచారం: అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్లను అధికారులు తొలగిస్తున్నారు. పంచాయతీలకు ఆదాయం లేకుండా ప్రచారం కోసం వ్యాపారులు నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. జీపీలకు కనీస సమాచారం లేకుండా సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి మాల్ వరకు వందలాదిగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, వస్త్ర వ్యాపారం, విద్యాలయాలు, ఆస్పత్రుల తదితర ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నారు. అవి రోడ్డుకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు సాగించే వాహనాలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు అనుమతులు ఉండడంతోనే వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ సంస్థల ప్రచారం కోసం హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రజలు భావించారు. కానీ ఏ ఒక్క సంస్థ కూడా పైసా పన్ను చెల్లించకుండానే భారీ ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా హోర్డింగ్లు బిగిస్తున్నారు. హైవేపై 200లకు పైగానే.. సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు 200లకు పైగానే భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాచారం పంచాయతీ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం సాగర్ హైవేతో పాటు 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను తొలగించేశారు. ఇకపై అనుమతి లేకుండా ప్రకటనలు చేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ కోసం, వివిధ ఆఫర్ల పేరుతో హోర్డింగ్లు పెట్టి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పంచాయతీలకు ఆదాయం పెంచడం కోసమే హోర్డింగుల తొలగింపునకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ చిన్న హోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా.. ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన అనుమతి పత్రాలు, బాధ్యులైన వారి పేర్లతో కూడిన దరఖాస్తులు చేసుకుంటే నిర్ణయించిన ఫీజులు చెల్లించిన తర్వాత, నిర్ణీత గడువు వరకే అనుమతులు మంజూరు చేస్తారు. గడువు లోపు తొలగించకపోతే పంచాయతీ సిబ్బంది తొలగిస్తారు. లేని పక్షంలో ఆలస్యం కింద భారీ జరిమానాలు వసూల్ చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశంతో కదిలిన యంత్రాంగం అనుమతులు లేకుండా ఏర్పాటు చేయొద్దని సూచన నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా జీపీల ఆదాయం పెంచడంపై అధికారుల కృషి -
రాకపోకలకు అడ్డుగా మట్టి దిబ్బలు
బడంగ్పేట్: అధికారుల మధ్య సమన్వయలోపం వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనున్న భారీ వృక్షాలను తరలించి, దాని నుంచి వెలువడిన మట్టి కుప్పలను అక్కడే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బడంగ్పేట్ పరిధిలోని నాదర్గుల్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేయకుండా ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దాదాపు 65 భారీ చెట్లను గుర్తించి వాటికి రంగులు వేసి నంబర్లతో మార్కింగ్ వేశారు. నెల రోజుల క్రితం చెట్లను వేళ్లతో సహా పెకిలించి క్రేన్ల సహాయంతో వేరే చోటుకు తరలించారు. అప్పుడు జేసీబీతో వేళ్లతో సహా పెకిలించేందుకు చెట్ల చుట్టూ మట్టిని తవ్వి అలాగే రహదారి పక్కన వదిలేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలో తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికై నా స్పందించి మట్టి కుప్పలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అవకతవకలపై మహిళలే నిఘా పెట్టాలి
డీఆర్డీఏ డీపీఎం లీలాకుమారి యాచారం: డ్వాక్రా సంఘాల్లో నిధుల అవకతవకలపై మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు నిఘా పెట్టాలని డీఆర్డీఏ డీపీఎం లీలాకుమారి పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘అప్పు కట్టలేక.. కంటికి కునుకు లేక’ అనే కథనంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆమె మండలంలోని 24 గ్రామాలకు చెందిన మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పాటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని గ్రామాల్లో రూ.లక్షలాది నిధులు అక్రమాలు జరుగుతుంటే, ఆ గ్రామాల అధ్యక్షురాళ్లు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. పర్యవేక్షణ చేయాల్సిన ఐకేపీ సిబ్బంది, ఉద్యోగులు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. యాచారం మండలంలో గతేడాది మల్కీజ్గూడ, ఈ ఏడాది చౌదర్పల్లి గ్రామంలో జరిగిన డ్వాక్రా సంఘాల నిధుల అక్రమాలు జిల్లాలో సంచలనంగా మారాయని అన్నారు. మహిళలకు చెందాల్సిన డబ్బులను స్వాహాకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐకేపీ ఏపీఎం రవీందర్తో పాటు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు వచ్చే నిధులు కేంద్రానివే
● బీజేపీ సర్పంచుల గ్రామాలకు రూ.పది లక్షలు ఇస్తా ● ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల: గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని బుధవారం బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు పార్టీ తరఫున సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో బీజేపీ బలం మూడు నుంచి ముప్పైకి చేరిందన్నారు. పంచాయతీల పాలకవర్గాల ఏర్పాటుతో కేంద్రం నుంచి రూ.మూడు వేల కోట్ల నిధులు రానున్నాయని చెప్పారు. ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తన పార్లమెంట్ పరిధిలో రెండు వందల సీసీ రోడ్లకు నిధులు ఇచ్చానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులకు రూ.10 లక్షల ఎంపీ నిధులను విడుదల చేస్తానని ప్రకటించారు. బీజేపీ దేశం కోసం పనిచేసే పార్టీ అని మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం అన్నారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి సన్మాన సభకు చేరుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్కుమార్, ప్రకాశ్, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, నేతలు వైభవ్రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, వెంకటరాంరెడ్డి, మానిక్యరెడ్డి, వాసుదేవ్కన్నా, రాములు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు అమరేందర్గౌడ్, జయశంకర్గౌడ్, అనంత్రెడ్డి, ఉప సర్పంచ్ పూర్ణచందర్గౌడ్ల ఆధ్వర్యంలో మండలంలోని నాంచేరి సర్పంచ్ పూల్మామిడి అశోక్, తన పాలకవర్గం సభ్యులతో కలిసి బీజేపీలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నంల సమక్షంలో చేరారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రభుత్వ నిర్లక్ష్యం
మీర్పేట: రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై బుధవారం మీర్పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 90 శాతం పనులు పూర్తయినా మిగతా 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు ప్రాజెక్టుపై శీతకన్ను వేశారన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం, పాలమూరు వంటి రెండు పెద్ద ప్రాజెక్టులను నాడు కేసీఆర్ ప్రారంభించారన్నారు. 45 టీఎంసీలు ఎలా సరిపోతాయా? కేసులు కొట్టేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30వేల కోట్లతో పాలమూరు పనులకు శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాక రూ.27వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు కూడా పూర్తయ్యాయని, ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించకపోగా, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారని, అలాంటి గొప్ప నేతను విమర్శించడం మాని, మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన తమ కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హరీశ్వర్రెడ్డి, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, పార్టీ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది శాతం పనులు చేయకుండా ప్రాజెక్టుపై శీతకన్ను పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న సీఎం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: ఎరువుల విక్రయంలో నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ఉష హెచ్చరించారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. డీలర్ల వద్ద ఉన్న ఎరువులు, యూరియా నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాపుల్లో స్టాక్, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఎరువులను ఎంఆర్పీ ధరలకు విక్రయించాలని, అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలని సూచించారు. త్వరలోనే ఎరువుల యాప్ ప్రారంభం కానుందని తెలిపారు. రైతుల సౌకర్యం కోసం ప్రతి విక్రయ కేంద్రంలో వాలంటీర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా సులభంగా ఎరువులను పొందవచ్చన్నారు. కొత్త విధానానికి డీలర్లు సహకరించాలని కోరారు. ఆమె వెంట ఏఓ అనురాధ ఉన్నారు. అంతకుముందు పీఏసీఎస్ కార్యాలయాన్ని పరిశీలించి ఎరువుల నిల్వలపై ఆరా తీశారు. డీలర్లను హెచ్చరించిన డీఏఓ ఉషా -
జోరుగా మొక్కజొన్న విక్రయాలు
కందుకూరు: ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు మార్క్ ఫెడ్ విధించిన గడువు సమీపిస్తుండటంతో రైతులు తాము పండించిన పంటను పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ట్రాక్టర్లు, డీసీఎంలలో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నెల రోజుల నుంచి రైతులు కోతలు ప్రారంభించారు. నవంబర్ 14 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను సేకరిస్తున్నారు. తేమ శాతం 14లోపు ఉంటే క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 చొప్పు న కొనుగోలు చేస్తున్నారు. మార్క్ఫెడ్ మొదట ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి గడువు విధించింది. తర్వాత పంట ఇంకా పొలాల్లోనే ఉండడంతో 30వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం చాలా మంది రైతుల పంట ఇంకా కోతలు చేపట్టాల్సి ఉంది. ఉన్న సమయం సరిపోద ని మరో పదిహేను రోజులు పొడిగించాలని రైతు లు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రారంభంలో క్వింటాల్కు రూ.1,800 వరకు, ప్రస్తుతం రూ.1,900 నుంచి రూ.1,950 వరకు ధర పలుకుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. -
రైతుల అవసరం మేరకు రుణాలివ్వాలి
తుక్కుగూడ: రైతుల అవసరం మేరకు బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల సాంకేతిక కమిటీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రై తుల అవసరాలకు అనుగుణంగా,గత సంవత్సరం కంటే 25 శాతం రుణాలు పెంచాలని సూచించారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు పెంచాలన్నారు. జిల్లా అధికారులు కమి టీకి తమ అభిప్రాయాలు తెలిజేయాలన్నారు. సమావేశంలో డీసీబీసీ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ ప్రభాకర్రెడ్డి, నాబార్డు డీడీఎం సుశీల్కుమార్,జిల్లా వ్యవసాయాధికారి ఉష, హార్టికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మున్సిపల్, నేషనల్ హైవే, ఆర్అండ్బీ, ఆర్టీసీ అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నియంత్రణ, భద్రత కోసం చర్యలు చేపడతామన్నారు. ఇందులో ప్రజల సహకారం సైతం ఉండాలన్నారు. -
సర్ధార్నగర్ను సందర్శించిన రష్యా బృందం
షాబాద్: మండల పరిధిలోని సర్ధార్నగర్ పశువుల సంతను రష్యా పశువైద్యుల బృందం మంగళవా రం సందర్శించింది. సంతలో పశువుల క్రయవిక్రయాలు, వైద్యం వంటి విరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పశువుల నాణ్యత, అల్కబీర్ కంపెనీ మాంసం ఎగుమతులపై ఆరా తీశారు. పశువులకు వైద్యం ఎలా చేస్తున్నారు అనే విషయాలను పరిశీలించారు. వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి క్లుప్తంగా వివరించారు. అనంతరం వారు షాబాద్ పశువైద్యశాలను సందర్శించారు. పుశువులకు రోగాలు వస్తే వైద్యం చేసేందుకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
ఏక్.. దో.. తీన్ !
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై చర్చ ఎడ తెగకుండా సాగుతోంది. ఇటీవల శివార్లలోని 27 పురపాలికల విలీనంతో జీహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే కార్పొరేషన్గా ఉంచుతారని మొదట్లో ప్రచారం జరిగింది. ఈ మేరకు 300 వార్డులతో డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగింది. తాజాగా మరో రకమైన చర్చ తెరపైకి వచ్చింది. బృహత్ జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే మంత్రివర్గ భేటీ, అధికార పార్టీ నేతల సమావేశాల సందర్భంగా ఈ అంశం చర్చకు వస్తోంది. సీఎం రేవంత్రెడ్డి సైతం వివిధ నగరాలను పరిశీలించి ఏ ప్రతిపాదన మనకు అనుకూలమో సూచించాలనడం ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. ఒకవేళ రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా చేయాలనుకుంటే వార్డుల డీ లిమిటేషన్ దశలోనే చేయొచ్చుగా అనే వాదనలున్నప్పటికీ, ప్రస్తుతం జీహెచ్ఎంసీకి పాలకమండలి గడువు ముగిశాకే ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని పట్టణ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. రెండా... మూడా? ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్గా ఉంచి, కొత్తగా కలిసిన ప్రాంతాన్ని 70–80 వార్డుల చొప్పున మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. వంద వార్డుల చొప్పున 3 కార్పొరేషన్లుగా విభిజిస్తారనే ప్రచారమూ సాగుతోంది. కోర్ సిటీ(పాత ఎంసీహెచ్) పరిధిలోని వంద వార్డులతో ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి మిగతా వాటిని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల మాదిరిగా ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మూడు కార్పొరేషన్లకు ముగ్గురు కమిషనర్లు.. వారికి పైస్థాయిలో మూడింటికీ కలిపి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని మెగా కార్పొరేషన్ కమిషనర్గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. సదరు అధికారిగా ఎవరిని నియమించవచ్చో కూడా కొందరు చెబుతున్నారు. ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఉండేలా ఒక కార్పొరేషన్ ఏర్పడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఊహగానాలకు తెరపడి.. జీహెచ్ఎంసీ మెగా కార్పొరేషన్ విభజనపై స్పష్టత రావాలంటే.. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే. తెరపైకి ‘మెగా కార్పొరేషన్ కమిషనర్’ జీహెచ్ఎంసీ పునర్విభజనపై రోజుకో చర్చ కోర్ సిటీ వరకు 1.. మిగతా భాగం 2 కార్పొరేషన్లుగా విభజన! పాలకమండలి గడువు ముగిశాకే విభజనపై స్పష్టత -
చేప పిల్లల పంపిణీ పేరుతో కాంగ్రెస్ డ్రామా
ఎమ్మెల్యే సబితారెడ్డి తుక్కుగూడ: చేప పిల్లల పంపిణీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు అడుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. రావిర్యాల చెరువులో మంగళవారం ఆమె చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడు స్తుంటే ఇప్పుడు చేప పిల్లల పంపిణీ గుర్తొచ్చిందన్నారు. కులవృత్తిదారులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారుల పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా స్పందించి మత్స్యకారులు సంక్షేమం కోసం కృషి చే యాలన్నారు. అనంతరం రావిర్యాల చెరువు కట్ట వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మత్స్యశా ఖ ఏడీ పూర్ణిమ, బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇదే ‘నయా’ జీహెచ్ఎంసీ..!
● ఒక్కో సెగ్మెంట్లో 2, 3 సర్కిళ్లు ● ఒక్కో సర్కిల్లో 4–6 వార్డులు ● మొత్తం 60 సర్కిళ్లు.. 12 జోన్లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధే హద్దు!సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో వార్డుల(కార్పొరేటర్ డివిజన్ల) డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవకుండా ఒక వార్డును పూర్తిగా ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగడంతోప్రస్తుతమున్న 30 సర్కిళ్ల సంఖ్య 60కి చేరింది. 6 జోన్లను 12 జోన్లకు పెంచారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సర్కిళ్లు, మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు సర్కిళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వార్డులు ఒక్కో సర్కిల్లో 4 నుంచి 6 వరకు ఉన్నట్లు తెలిపారు. నాలాలు, రైల్వేట్రాక్, రహదారులు వంటి వాటిని సైతం ఒకే వార్డు పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిపైనా పలు ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా, కొన్నింట తక్కువగా ఉన్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితోపెరిగిన ఇళ్ల నిర్మాణాలు, పెరగబోయే జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదీ స్థూలంగా.. మారిన జీహెచ్ఎంసీ ముఖచిత్రం. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, తాజాగా అవి 26కు పెరగనున్నాయి. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. నయా జీహెచ్ఎంసీలో ● జిల్లాలు: 4 ● అసెంబ్లీ సెగ్మెంట్లు: 26 ● జోన్లు: 12 ● సర్కిళ్లు: 60 ● వార్డులు: 300 ● డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు తదితరుల నుంచి అందిన ఫిర్యాదులను వడపోసి, అర్హత లేని వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. అర్హమైన వాటిల్లో తగిన మార్పులు, చేర్పులు కూడా చేసినట్లు జీహెచ్ఎంసీ వర్గాల సమాచారం. ● పరిగణనలోకి తీసుకున్న అభ్యంతరాలు, ఫిర్యాదులు: 5,935 ● అర్హత కలిగినవిగా గుర్తించినవి: 1,044 ● పాక్షికంగా తిరస్కరించినవి: 435 ● తిరస్కరించినవి: 4,456 మార్పు చేర్పుల అనంతరం.. ● పేర్లు మారిన వార్డులు: 29 ● స్వల్పంగా(స్పెల్లింగ్ మిస్టేక్స్ తదితర) మారినవి: 34 ● సరిహద్దులు మారినవి: 71 -
పర్యాటక ప్రాంతంగా మహాపిరమిడ్
కడ్తాల్: రానున్న రోజుల్లో మహేశ్వర మహాపిరమిడ్ గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రీజీ తన జీవితాన్ని ఆధ్యాత్మికత కోసం త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయన 40 ఏళ్ల కృషి ఫలితమే ఇంత మంది పిరమిడ్ మాస్టర్లు తయారు కావడం అన్నారు. ఆనందమయ జీవనానికి ధ్యానమే మార్గమని, ధ్యానం జీవన పురోగమమనానికి ఎంతగానో దోహద పడుతుందని పిరమిడ్ స్పిరచ్యువల్ మూవ్మెంట్ సొసైటీస్ సభ్యురాలు, ధ్యాన గురువు పరిణిత పత్రి పేర్కొన్నారు. ధ్యానంతోనే జ్ఞానం కలుగుతుందన్నారు. ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. ధ్యాన మహాయాగంలో భాగంగా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ సంగీత కళాకారుల బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. సినీ స్టంట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ సోదరులు సందడి చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ భాస్కర్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
కేవీ కేంద్రాలతో లాభాల సాగు
మాడ్గుల: వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధునిక పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నాయని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా భారతరత్న మాజీ ప్రధాని చౌధరీ చరణ్సింగ్ జయంతిని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో సేంద్రియ సాగు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ మెట్ట వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్లు శీకృష్ణ, రజిత, గౌతమ్ చౌహాన్, దిలీప్, ఏఓ అరుణకుమారి, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సెమీ క్రిస్మస్ వేడుకలు షురూ
మొయినాబాద్: క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. మంగళవారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ చర్చీలో సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. మెథడిస్ట్ జిల్లా అధికారి పి.విజయరావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు హైదరాబాద్ రీజియన్ కాన్ఫరెన్స్(హెచ్ఆర్సీ) బిషప్ ఎ.సిమెయోన్ ముఖ్యఅతిథిగా హాజరై లోక రక్షకుడు క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకల్లో హెచ్ఆర్సీ ట్రెజరర్ డి.రాజు, ఆర్ఈబీ సభ్యుడు ప్రవీణ్, యూత్ అధ్యక్షుడు ప్రణయ్కుమార్, సికింద్రాబాద్ డీఎస్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పు కట్టలేక.. కంటికి కునుకు లేక
యాచారం: చౌదర్పల్లి గ్రామ డ్వాక్రా సంఘాల్లో వెలుగులోకి వచ్చిన రూ.లక్షలాది నిధుల స్వాహా పర్వం మళ్లీ మొదటికొచ్చింది. యాచారం ఎస్బీఐ నుంచి ఏఏ మహిళలు, డ్వాక్రా సంఘాల పేర్ల మీద రుణాలు వెళ్లాయో.. గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఒక్కో మహిళ పేరు మీద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు, ఒక్కో సంఘం పేరు మీద రూ. 5 లక్షల నుంచి రూ.19 లక్షలకు పైగా రుణాలున్నట్లు గుర్తించి వారం రోజుల వ్యవధిలోనే అప్పు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో మహిళలు నోటీసులు పట్టుకుని యాచారం ఎస్బీఐ, చౌదర్పల్లి పంచాయతీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తాము తీసుకోనిదే ఎలా చెల్లిస్తామని లబోదిబోమంటున్నారు. మేనేజరే చెల్లించాలి సోమవారం సాయంత్రం యాచారం ఎస్బీఐకి విచారణ నిమిత్తం బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీరాణి వచ్చినట్లు తెలుసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు దిగారు. మేనేజర్, ఐకేపీ సిబ్బందే తమ పేర్ల మీద ఉన్న అప్పులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళల తిరుగుబాటుతో కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీరాణి కొందరిని నమ్మి పూర్తిగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు కూడా ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీల పేర్లపై రూ.లక్షలాది నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ సహకారం లేనిదే నిధుల బదిలీ సాధ్యమయ్యే అవకాశమే లేదని ఎస్బీఐ, డీఆర్డీఓ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బదిలీ అయిన బ్యాంకు మేనేజర్తో పాటు మరో నలుగురు బ్యాంకు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. చౌదర్పల్లి పంచాయతీ కార్యాలయానికి మంగళవారం వెళ్లిన మహిళలు నూతన సర్పంచ్, పాలకవర్గానికి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని వేడుకున్నారు. చట్టపరంగా ముందుకు డ్వాక్రా సంఘాల మహిళలకు హెచ్చరిక నోటీసులు పంపింది వాస్తవమే. కొంత మంది వచ్చి తాము అప్పు తీసుకోలేదని చెబుతున్నారు. త్వరలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి పేర్లపై అప్పులున్నాయో.. వారు కచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే చట్టపరంగా ముందుకెళ్తాం. – మాన్యనాయక్, మేనేజర్, యాచారం ఎస్బీఐ మరింత లోతుగా విచారణ రూ.3 కోట్ల రుణాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేవు. డీఆర్డీఓ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. బాధ్యులైన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టి మహిళలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తాం. – రవీందర్, ఐకేపీ ఏపీఎం, యాచారం డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు నోటీసులు తీసుకోనివాటికి ఎలా కడతామంటున్న బాధితులు మళ్లీ మొదటికొచ్చిన నిధుల స్వాహా పర్వం కంటికి కునుకు లేదు రూ.15 లక్షల చొప్పున అప్పులున్నట్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందిన నాటి నుంచి కంటికి కునుకు లేదు. మా ఆస్తులు అమ్మినా ఆ అప్పులు చెల్లించే స్థితిలో లేం. అప్పులకు బ్యాంకు మేనేజర్, సిబ్బందే బాధ్యులు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – కావలి దేవమ్మ, అమీర్పేట కొమురమ్మ -
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసన
హుడాకాంప్లెక్స్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని నిరసిస్తూ మంగళవారం విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ నేతలు మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెద్ద సంఖ్యలో ఇక్కడ శాశ్వతంగా నివాసాలు ఏర్పర్చుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, నిఘా లేకపోవడంతోనే అక్రమ వలసలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికై నా అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. బాధిత హిందువులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. -
విద్యా సదస్సుకు తరలిరండి
కడ్తాల్: జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయాలని ఈ సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో విద్యా వనరుల కేంద్రంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 28న ఉదయం జనగామలోని నెహ్రూ పార్కు నుంచి మాంగళ్య ఫంక్షన్హాల్ వరకు ఉపాధ్యాయుల మహాప్రదర్శన ఉంటుందని తెలిపారు. సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై తీర్మానాలు చేసి, భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అరుణ, కోశాధికారి నర్సింహమూర్తి, రాజు, రవి, రహీం, పాషా తదితరులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్నాయక్ -
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
శంకర్పల్లి: ఆశా కార్యకర్తలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా కార్యకర్తలతో కలిసి శంకర్పల్లి సీహెచ్ఓకి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా కార్యకర్తలను చిన్న చూపు చూస్తోందని, ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వివిధ సర్వేలు, ఎన్నికల విధులు తదితర వాటికి వినియోగించుకోని గౌరవ భత్యం చెల్లించకపోవడం దారుణమన్నారు. అదే విధంగా ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బోడ మల్లేశ్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి భవాని, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ -
మైసిగండి ఆలయంలో వేలం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఏడాది కాలానికి కొబ్బరి చిప్పలు, వడిబియ్యం, చీరలు సేకరించుటకు హక్కులకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో ముగ్గు రు వ్యక్తులు పాల్గొనగా మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ పరంసింగ్ అత్యధికంగా రూ.13.97 లక్షలకు సేకరణ హక్కులను సొంతం చేసుకున్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ కార్య నిర్వాహణాధికారి మురళీకృష్ణ, ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, నిర్వాహకులు భాస్కర్ నా యక్, ఉప ప్రధాన అర్చకులు యాదగిరిస్వామి, సిబ్బంది కృష్ణ, చంద్రయ్య, రాములు, శ్రీనివాసులు, శ్రవణ్కుమార్, హర్షవర్ధన్ తదితరులు ఉన్నారు. ఆ భూములు ఆలయానివే.. తీర్పు వెల్లడించిన హైకోర్టు చేవెళ్ల: మండలంలోని మల్కాపూర్ పరిధిలోని దేవాలయ భూములు తమవేనంటూ కొందరు వ్యక్తులు హైకోర్టులో వేసిన కేసును మంగళవారం న్యాయస్థానం కొట్టేసింది. ఈ భూములు చేవెళ్ల శ్రీబాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికే చెందుతాయని ఆర్డర్ ఇచ్చింది. ఆలయ ఈఓ నరేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మల్కాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 10, 18, 20, 22, 24, 29, 31, 33, 127, 140, 141, 230, 238, 273, 275, 366/అ, 366/ఆ లలో మొత్తం 79.02 ఎకరాల ఆలయ భూమి ఉంది. మల్కాపూర్కు చెందిన పలువురు కొన్నేళ్లుగా ఇందులో సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మారడంతో ఈ భూములు తమవేనంటూ మల్కాపూర్కు చెందిన శేరి నారాయణరెడ్డితోపాటు మరో 14 మంది 2007లో హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన (కేసు నంబర్ డబ్ల్యూపీ 9786/2007) ధర్మాసనం సదరు భూములు శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికే చెందుతాయని తీర్పునిచ్చింది. నారాయణరెడ్డితో ఇతరులు వేసిన కేసును కొట్టేసింది. ప్రస్తుతం ఈభూమి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. కోర్టు ఆదేశంతో సదరు భూములను స్వాధీనం చేసుకుంటామని ఈఓ తెలిపారు. -
చలికాలం కోడి పైలం
● పౌల్ట్రీల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి ● లేదంటే నష్టాలు వచ్చే ప్రమాదం షాబాద్: జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయంతో పాటు పౌల్ట్రీరంగాన్ని ఎంచుకుని ఆదాయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,780 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి సలహాలు, సూచనలు.. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు.. సాధరణంగా కోడి శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారన్హీట్ ఉంటుంది. అయితే చలికాలంలో ఉష్ణోగ్రత లోపం వల్ల కూడా కోడి పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. లిట్టర్ నిర్వహణలో... ● చలి కాలంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో లిట్టర్ గట్టిపడుతుంది. దీంతో ఈకొలై వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిట్టర్లో ప్రతీ 100 చదరపు అడుగుల స్థలానికి 5–8 కిలోల పొడిసున్నం లేదా అమ్మోనియం సల్ఫేట్ లేదా ఆరు కిలోల సూపర్ పాస్పేట్ కలపాలి. ● లిట్టర్ను తరుచూ కదిలిస్తూ పొడిగా ఉండేలా చూడాలి. ఆహారం విషయంలో... ● శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి కోళ్లు చలి కాలంలో దాణా ఎక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రత తగ్గితే మేత వినియోగం 1.5 శాతం పెరుగుతుంది. మేత ఎక్కువగా తీసుకుంటున్నాయని దాణా తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి దాణా తగ్గించకుండా పోషకాలను సరిచేయాలి. ● తేమవల్ల నిల్వ ఉంచిన దాణా ముడిపదార్థాల్లో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. తేమ 9శాతానికి మించితే అప్లోటాక్సిన్ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు దాణాలో ఈస్టు కల్చర్ బైండర్సన్ రెండు కిలోల చొప్పున కలిపి అందించాలి. బ్రూడింగ్ విషయంలో... ● చలికాలంలో బ్రూడింగ్ నిర్వహణపై అత్యంత శ్రద్ధ వహించాలి. ● కోడి పిల్లలు మొదటి వారంలో 90– 95 డిగ్రీలు ఫారన్ హీట్, ఆ తర్వాత ప్రతీ వారానికి 5 డిగ్రీల ఫారన్ హీట్ చొప్పున తగ్గిస్తూ ఆరో వారానికి 70 డిగ్రీల ఫారన్హీట్ ఉండేలా చూసుకోవాలి. ● కేజ్ సిస్టమ్లో అయితే బ్రూగింగ్ షెడ్డు ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారన్ హీట్, 25 శాతం తేమ ఉండే విధంగా చూడాలి. ఫారాల నిర్వహణలో... ● కోళ్లు చలిబారిన పడకుండా షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి. తగినంత వెచ్చదనం కోసం 16 గంటల పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలి. ● షెడ్ల చుట్టూ పది అడుగుల దూరం వరకు పిచ్చి మొక్కలు, పొదలు తొలగించాలి. ● వంద అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉండే ఫారాల్లో తాత్కలికంగా పార్టీషన్లు ఏర్పాటు చేసుకోవాలి. ● కోడి పిల్లలను కిక్కిరిసి ఉంచితే శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సరిపోయే స్థలం కేటాయించాలి. రక్షణ చర్యలు తప్పనిసరి చలికాలంలో పౌల్ట్రీ ఫారమ్లో నష్టాలు వాటిల్లకుండా రైతులు రక్షణ చర్యలు పాటించాలి. కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే పశువైద్యాధికారులను సంప్రదించాలి. – చంద్రశేఖర్రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి -
ప్రతీ ఇంటికి సంక్షేమం
కడ్తాల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా పంచాయతీ పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్రెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వారు అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మండల కేద్రంలో బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, జూనియర్ కళశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సర్పంచ్గా రాయికంటి భిక్షపతి, ఉప సర్పంచ్గా ఈరెడ్డి యాదగిరిరెడ్డి, వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధికార ప్రతినిఽధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, నాయకులు వెంకటేశ్, లక్ష్మయ్య వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
విపత్తుల సమయంలో జాగ్రత్తలు అవసరం
కలెక్టర్ నారాయణ రెడ్డి నందిగామ: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మండల పరిధిలోని మేకగూడ శివారులో నాట్కో పరిశ్రమ ఆవరణలో సోమ వారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. అకస్మాత్తుగా విపత్తు సంభవించినట్లయితే శాఖల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అగ్నిమాపక శాఖ, వైద్య శాఖతో పాటు పలు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షత గాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు, మందుల లభ్యత చూసుకోవాలని.. ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలనేది ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, ఇన్స్పెక్టర్ ప్రసా ద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హెచ్ఆర్ఏ పెంచాలని వినతి ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్ఎంసీకి ఎని మిది కిలోమీటర్ల పరిఽధి వరకు హెచ్ఆర్ఏ 24 శాతం పెంచాలని టీజీఓ, పీఆర్టీయూ టీఎస్ ఉద్యోగ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు వారు సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ పరిధికి చుట్టు పక్కల ఎనిమిది కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 24 శాతం ఇంటి అద్దె భత్యం మంజూరు చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.రామారావు, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామల మహేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్, రాకేశ్, నాగేశ్వర్రావు, మసూద్ అలా, జగన్మోహన్గుప్తా, ఎనిమిది మండలాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు . మరకత శివాలయానికి బోయపాటి శంకర్పల్లి: ఆకుపచ్చ రంగులోని మరకత శివలింగం ఎంతో ప్రత్యేకంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. సో మవారం మండల పరిధిలోని చెందిప్పగ్రామంలో వెలిసిన 11వ శతాబ్ధపు మరకత శివాలయా న్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి బోయపాటికి ఆ లయ ప్రతిమ అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులు సదానందం గౌడ్, దర్శన్ గౌడ్, జనార్ధన్, అర్చకులు సాయి శివ, ప్రమోద్ పాల్గొన్నారు. ‘సాందీపని’లో అడ్మిషన్లకు 4న ప్రవేశ పరీక్ష తాండూరు: తాండూరు మండలం జినుగుర్తిలోని సాందీపని గురుకులంలో అడ్మిషన్లకు జనవరి 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడ ప్రాచీన వేద విద్యతో పాటు ఆధునిక ఏఐ సాంకేతికతతో కూడిన బోధన ఉంటుందని తెలిపారు. 2026– 27 విద్యాసంవత్సరానికి గానూ 4వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు. ప్రవేశ పరీక్ష అనంతరం, ఇంటర్వ్యూ, శిక్షణ కాలంలో విద్యార్థి ప్రదర్శించే ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై న వారికి ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే ప్రవేశం. అడ్మిషన్ సమయంలో రూ.25,000 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది విద్య పూర్తైన తర్వాత తిరిగి ఇస్తారు. వివరాల కోసం 9154795530 నంబర్లో సంప్రదించండి. -
అభివృద్ధికి కేంద్ర నిధులు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్రూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ల ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా శ్రీరామ్నగర్, బాకారం, రెడ్డిపల్లి గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్నగ ర్ సర్పంచ్ గీతామైపాల్, ఉపసర్పంచ్ సుమలతమెన్రెడ్డి, బాకారం సర్పంచ్ వెంకటేశ్గౌడ్, మాణిక్యం, ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ గౌతమ్కుమార్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, నాయకులు ప్రభాకర్రెడ్డి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానం.. పరమ ఔషధం
కడ్తాల్: ధ్యానం పరమ ఔషధమని ధ్యాన గురువు పరిమళ పత్రి అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 సోమవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానగురువు పరిమళ పత్రి మాట్లాడుతూ.. ఆలోచనలను సరైన స్థితిలోకి తీసుకువెళ్లడమే ధ్యానమన్నారు. నోటి లోని మౌనం, మనసులోని శూన్యమే ధ్యానమని.. అది ఆచరణతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడమే పత్రీజీ కోరుకున్నారని చెప్పారు. అనంతరం యోగా గురువు వెంకటేశ్ గురూజీ ధ్యానం, యోగా, ప్రాణాయామం గురించి వివరించారు. అనంతరం పలు ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు, మేగజైన్లను ట్రస్ట్ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లతో కలిసి పరిమళ పత్రి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ భాస్కరానందా, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, దామోదర్రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం గురువుల ఆధ్యాత్మిక ధ్యాన సందేశాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శాంతి, ధ్యాన సందేశం ఇచ్చిన శ్రీ కృష్ణ చాముండేశ్వరీ మహర్షిని సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తీకేయన్తో పాటు ట్రస్ట్ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా కళాకారులు ఎంఎస్ పార్వతి బృదం ఆలపించిన గీతాలు, సంస్కృతి ముదాల్కర్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ధ్యాన వేడుకలకు సినీ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, జ్యోతిష్య శాస్త్రవేత్త రవిశాస్త్రి హాజరయ్యారు. కోలాటం ఆడుతున్న మహిళలుగురువుతో కలిసి ధ్యానం చేస్తున్న స్టంట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్ సోదరులు -
రాజకీయంగా ఎదుర్కోలేకే ఆందోళన
శంకర్పల్లి: రాజకీయంగా తనను ఎదుర్కోలేక, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై న పదవిని రద్దు చేయాలంటూ ప్రత్యర్థులు అందోళన బాట పట్టడం విడ్డూరమని శేరిగూడ సర్పంచ్ బొల్లారం నివేదిత అన్నారు. సోమవారం ఆమె సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ప్రభుత్వం కేటాయిస్తేనే తన అక్క ఒక అధికారిగా తన బాధ్యతలు నిర్వహించిందన్నారు. ఆమె విధులు నిర్వర్తించిన బూత్లో తనకు మెజారిటీ రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఓడిన అభ్యర్థుల ఆందోళన ఎన్నికల్లో ఓడిన సర్పంచ్ అభ్యర్థులు, చీర మౌనిక, మైలారం గంగా భవానీ తమ మద్దతుదారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్పంచ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోకిల సీఐ వీరబాబు, ఎస్ఐ వారిని సముదాయించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. శేరిగూడ సర్పంచ్ నివేదిత -
కొలువుదీరిన కొత్త పాలకమండళ్లు
మహేశ్వరం: ప్రమాణం చేస్తున్న పెండ్యాల పాలకవర్గంకొత్తూరు: పెంజర్లలో ప్రమాణస్వీకారం చేయిస్తున్న తహసీల్దార్ రవీందర్రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండేళ్లుగా పాలక మండళ్లు లేక బోసిపోయిన గ్రామ పంచాయతీలు..సోమవారం పాలక మండళ్ల సభ్యులతో కళకళలాడాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆయా పంచాయతీల కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. రాగద్వేషాలకు, బంధుప్రీతికి అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని పేర్కొంటూ కొంత మంది రాజ్యాంగంపై ప్రమాణం చేయగా, మరికొంత మంది దైవసాక్షిగా, ఇంకొందరు ఆత్మ సాక్షితో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా కొలువుదీరిన సభ్యులను శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో 21 మండలాల పరిధిలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో ఒకటి మినహా మిగిలిన 525 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లతో పాటు 4,665 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులతో గ్రామస్తులు, ఓటర్ల సమక్షంలో ఆయా పంచాయతీ భవనాల ముందు ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ల కింద ప్రమాణ స్వీకారం చేయించారు. -
కిరాయి కిరికిరికి స్వస్తి!
సాక్షి, సిటీబ్యూరో: సొంత భవనాలు లేక..అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, సర్కారు బడులకు ఇక కిరాయి కిరికిరి తప్పనుంది. తాజాగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీస్లు, పాఠశాలలను ప్రభుత్వ భవన సముదాయాలకు తరలించాలని సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో వివిధ శాఖల్లో కసరత్తు ప్రారంభమైంది. ప్రభుత్వం ఏకంగా ఫిబ్రవరి నుంచి అద్దె భవనాలకు చెల్లించే అద్దెలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వివిధ శాఖల అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవన సముదాయాల వేటలో పడ్డారు. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 30 శాతం పైగా ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఖాజానాకి ఆదాయం సమకూర్చే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఆర్టీఓతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏటా అద్దెల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు విజయవాడకు తరలిపోవడంతో హైదరాబాద్లో పరిశ్రమ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రమంజిల్ వంటి పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే అద్దె ఖర్చులను భారీగా ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే.. రాష్ట్ర రాజధాని మహా హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అద్దె భవనాల్లోనే అత్యధికగా ఉన్నాయి. చార్మినార్, బహదూర్పురా వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నాంపల్లి మండలంలోని బజార్–ఎ–జుమేరాత్ ప్రాథమిక పాఠశాల 1975 నుంచి, కోట్లా అలీజా బాలికల హైస్కూల్ 1995 నుంచి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. .మరోవైపు బస్తీ దవాఖానాలది కూడా ఇదే పరిస్థితి. వీటి అద్దెల చెల్లింపు ప్రభుత్వానికి భారంగా మారతోంది. అంతేకాదు చెల్లిస్తున్న అద్దెకు..భవనంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు పొంతన లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండి ఇబ్బంది పడేకన్నా..ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకాలం ఇరుకై న అద్దె భవనాల్లో కొనసాగుతూ..ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారాని కార్యాలయాలన్నింటినీ తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భవనాలను గుర్తించి, వాటిలోకి షిఫ్ట్ కావాలని ఆదేశించింది. రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నా..ప్రధానంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగతున్నాయి. గ్రేటర్ పరిధిలోని దాదాపు 30 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో మెజార్టీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితికూడా ఇదే. వివిధ గురుకులాలు, చివరికు పోస్టు ఆఫీసులు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే సొంతంగా భవనాలు నిర్మించి ఇవ్వాలని ఏళ్లుగా ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కొన్ని భవనాలకు శంకుస్థాపనలు కూడా చేశారు. మరికొన్నింటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి..కిరాయి భవనాన్ని ఖాళీ చేసి వెళ్లడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. లీజు అగ్రిమెంట్లు, అద్దె బకాయిలు ఉండగా, కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి..ప్రభుత్వ భవనంలోకి వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమనే కొందరు అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాల్లో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణపై అగ్నిమాపక, ఎన్ఆర్డీఎఫ్, మెడికల్ ,రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, హైడ్రా డీఎఫ్ఓ యజ్ఞ నారాయణ, సీఈ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే మాక్ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఈవెంట్ కు జిల్లా ఫైర్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో చేపట్టిన ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తిచేసి అందుబాటులో ఉంచాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు నిర్వహణ విధివిధానాలపై సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్డీసీలు రవి, శ్రీనివాస్, ఎన్ఆర్డిఎఫ్ మేనేజర్ భూపేందర్ కుమార్, పోలీస్, రెవిన్యూ, జిహెచ్ఎంసి, విద్యు త్, ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానంతో ఆరోగ్యం, మానసిక వికాసం
● సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ● మహాపిరమిడ్లో ధ్యాన మహాయాగ వేడుకలు ప్రారంభం కడ్తాల్: ప్రపంచ శాంతి కోసం మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఏటా నిర్వహిస్తున్న ధ్యాన మహాయాగ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానంతో ఆరోగ్యం, మానసిక వికాసం పెంపొందుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని, ధ్యానంతో తమ జీవితాలను బాగు చేసుకోవాలని సూచించారు. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పత్రీజీ అని, ధ్యానమయ సమాజం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. పత్రీజీ చూపిన ధ్యాన మార్గం సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా ఉందన్నారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి తిరిగి వచ్చిన అఖండ జ్యోతికి కడ్తాల్లో ధ్యానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి అఖండ జ్యోతితో పిరమిడ్ వద్దకు ర్యాలీగా చేరుకుని పిరమిడ్ శక్తి స్థల్ వద్ద అఖండ జ్యోతిని వెలిగించారు. అనంతరం పలువురు పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలు వినిపించారు. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పత్రీజీ సతీమణి స్వర్ణమాల పత్రీ, కూతురు పరిమళ పత్రీ, పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హ్మనంత్రాజ్, బుద్ద క్వాంటమ్ ఫౌండేషన్ సీఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలిగా పసుల స్వప్న ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం నిర్వహిస్తుండగా నీటి సమస్యను కాలనీవాసుల ద్వారా తెలుసుకొని నూతనంగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వార్డులో బోరు వేయించారు. త్వరలోనే మోటారును ఏర్పాటు చేసి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్యాదవ్, మాజీ సర్పంచ్ నవీన్కుమార్, ఉప సర్పంచ్ దర్శన్, మాజీ మండల కో–ఆప్షన్ సభ్యులు జమాల్ఖాన్, నరేష్ యాదవ్, కుంటి లక్ష్మయ్య, జగన్రెడ్డి, మహేందర్రెడ్డి, పాల్గొన్నారు. న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి రాజేంద్రనగర్: నూతన సంవత్సరం ప్రారంభ వేడుకల్లో మద్యాన్ని వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేందర్ సూచించారు. ఈవెంట్లతో పాటు ఫంక్షన్ హాళ్లు, క్లబ్లు, ఫామ్హౌస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవిస్తే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉప్పర్పల్లిలోని స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత సంవత్సరం స్టేషన్ పరిధిలో 20 ఈవెంట్లు నిర్వహించారన్నారు. వారందరికీ ఎకై ్సజ్ శాఖ తరఫున మద్యం వినియోగించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులు తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేషన్లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉందన్నారు. వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం, డ్యూటీ ఫ్రీ మద్యాన్ని వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అనుమానాస్పదస్థితిలో మహిళ ఆత్మహత్య ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీలో నివసించే సంజనా(32)కు మంగళ్పల్లిలో నివసించే ఆమనగల్లుకు చెందిన సాయినాథ్రెడ్డితో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో 15 రోజుల క్రితం చైతన్యపురి పోలీస్స్టేషన్లో తానను ఇబ్బంది పెడుతున్నట్లు సాయినాథ్రెడ్డిపై సంజన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుకునేందుకు సాయినాథ్రెడ్డి ఇంటికి ఆమె శనివారం రాత్రి వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి ఘర్షణ జరిగి సంజనా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సంజనాకు భర్త, కుమారుడున్నాడు. -
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
షాద్నగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జగన్(38) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై షాద్నగర్కు వచ్చారు. పట్టణంలోని ముఖ్య కూడలి మీదుగా మహబూబ్నగర్ రోడ్డు వైపు వెళుతుండగా లావణ్య బార్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వాహనం జగన్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ సర్వే నం.24, 25లో తమ ముగ్గురు అన్నదమ్ములకు దాదాపు 12 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే సర్వే నం.23లో ఓ పెద్ద భవన నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. దాంట్లో ఉన్న నక్ష నాలాని సర్వే నం.25లో ఉన్నట్లు అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపించారు. దీనిపై గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూ, డిసెంబర్ 1న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 3న హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు నక్ష నాలాని పునరుద్ధరించాలని సంబంధిత నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మొర పెట్టుకున్నారు. ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎన్నికల కమిషనర్ను కలిసిన సీపీ
సాక్షి,సిటీ బ్యూరో: నగర పర్యటనకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగర పోలీస్ పరిపాలన తరఫున పోలీస్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్కు స్వాగతం పలికారు. లారీ ఢీకొని ఇద్దరి మృతి మేడ్చల్రూరల్: లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం రాత్రి మేడ్చల్ నుంచి శామీర్పేట్ వైపు వెళ్తున్న బోర్వెల్ లారీ వాహనం (బ్రేక్డౌన్)మరమ్మత్తులకు గురైంది. వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ ఆగి ఉన్న వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై మరమ్మతు చేస్తున భువనగిరి జిల్లాకు చెందిన సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, హయత్నగర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు సహకార సంఘం ఇన్చార్జిగా విజయ
తుర్కయంజాల్: రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను రద్దు చేస్తూ శుక్రవారం ప్రకటించడంతో పాలకవర్గాలు బాధ్యతల నుంచి తప్పు కొన్నాయి. దీంతో ఆ స్థానాల్లో పర్సన్ ఇన్చార్జిలు బాధ్యతలను స్వీకరించారు. ఇందులో భాగంగా తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్, డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన కొత్తకుర్మ సత్తయ్య తప్పు కోవడంతో శనివారం సాయంత్రం, సరూర్నగర్ సర్కిల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న ఆర్.విజయ బాధ్యతలను స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. 28న దివ్యాంగుల సమావేశం అబ్దుల్లాపూర్మెట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డికి తెలంగాణ ప్రతిభావంతుల వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న సంఘం తరఫున కుంట్లూరు డివిజన్ రాజీవ్గృహకల్పలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఎంపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.రాంచంద్రయ్య, సభ్యులు గ్యార మహేశ్, గొల్ల పాండు పాల్గొన్నారు. పీజీ హాస్టల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి గచ్చిబౌలి: పీజీ హాస్టల్ బాత్ రూమ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట్కు చెందిన కొమ్మ శ్రీకాంత్ రెడ్డి గౌలిదొడ్డిలో హోమ్ ఇన్ మెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి బుర్రి రాకేష్ గత మూడేళ్లుగా అదే హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 19న రాత్రి అతను భోజనం చేసిన తర్వాత తాను ఉంటున్న 502 గదిలో నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు ఉదయం అతను బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు కిటికీలోంచి చూడగా బాత్రూమ్లో పడి ఉన్నాడు. తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిమాయత్నగర్కు చెందిన మృతుడు బుర్రి రాకేష్ బంధువుల వివరాలు తెలియరాలేదన్నారు. -
‘ఫేక్’ ఓసీలపై డిస్కం గురి!
● డిస్కం కళ్లుగప్పి..కనెక్షన్ల కోసం దరఖాస్తు ● ఇప్పటికే 40పైగా ఫేక్ ఓసీలు, కోర్టు ఆర్డర్ల గుర్తింపు ● దరఖాస్తుదారులపై కేసుల నమోదుకు సిఫార్సు ● 56 మంది ఇంజినీర్లపై వేటుకు రంగం సిద్ధం సాక్షి, రంగారెడ్డి జిల్లా: నకిలీ కోర్టు ఆర్డర్లు, ఫేక్ ఆక్యుపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో డిస్కంను బురిడీ కొట్టిస్తున్న కాంట్రాక్టర్లు సహా కళ్లుమూసుకుని కనెక్షన్లు జారీ చేసిన ఇంజినీర్లపై చర్యలకు రంగం సిద్ధమెంది. ఇప్పటికే గ్రేటర్ జిల్లాల పరిధిలో 40పైగా ఫేక్ ఓసీలను గుర్తించినట్లు తెలిసింది. తప్పుడు పత్రాలతో డిస్కంను తప్పుదారి పట్టించిన కాంట్రాక్టర్లు/ భవన యజమానులపైనే కాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇందుకు సహకరించిన ఇంజినీర్ల పై కూడా చర్యలకు సిద్ధమవడంతో ఆయా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క..గుట్టుగా మీటర్లు జారీ గ్రేటర్లో హైరైజ్ భవనాలు, గెటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. విద్యుత్ అధికారులు ముందు వీటికి తాత్కాలిక కనెక్షన్లు జారీ చేస్తుంటారు. ఆ తర్వాత డిమాండ్ను బట్టి అంచనాలను రూపొంది స్తుంటారు. విద్యుత్ లోడ్ 25 కిలోవాట్లకు మించి ఉన్న భవనాలకు వారు ఆశించిన సంఖ్యలోని మీటర్లు జారీ చేయాలంటే.. దరఖాస్తు సమయంలోనే బిల్డింగ్ పర్మిషన్, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్, సీఈఐజీ నిరంభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంది. అయితే వీటిలో కొన్ని నిర్మాణాలు చెరువుశిఖం, బఫర్ జోన్, గ్రామ కంఠం భూముల్లో ఉంటుండగా, మరికొన్ని జీ+2 అనుమతులు పొంది, అంతకు మించి అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి వాటికి మున్సిపాలిటీ ఓసీ రిలీజ్ చేయదు. నాసిరకం విద్యుత్ పనులు చేసిన భవనాలకు సీఈఐజీ కూడా ఎన్ఓసీ జారీ చేయదు. ఎలాగైనా ఆ భవనానికి విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని భావించిన కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఫేక్ బిల్డింగ్ పర్మిషన్లు, ఫేక్ ఓసీలతో పాటు సీఈఐజీ సంతకాలను ఫోర్జరీ చేసిన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. తీరా డిస్కం ఉన్నతాధికారులు టీఎస్ బీపాస్, జీహెచ్ఎంసీ పోర్టల్స్ను ఓపెన్ చేసి చెక్ చేయగా అసలు విషయం బయటపడుతోంది. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించకుండా గుడ్డిగా కనెక్షన్లు మంజూరు చేసిన 56 మంది ఇంజనీర్లపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘మార్తాండనగర్ సర్వే నంబర్ 80లోని 200 గజాల స్థలంలో ఓ మహిళ మల్టీ స్టోరేజ్ భవనం నిర్మించి, మీటర్ల కోసం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తుతో పాటు కోర్టు ఆర్డర్ కాపీ జత చేసింది. తీరా అనుమానం వచ్చి ఆరా తీస్తే...ఏకంగా కోర్టు ఆర్డరే ఫేక్ అని తేలింది. అదేవిధంగా నల్లగండలో ఓ నిర్మాణ సంస్థ మల్టీ స్టోరేజ్ భవనాన్ని నిర్మించింది. 5.5 లక్షల వాట్స్ డిమాండ్ ఉన్నట్లు గుర్తించి, 11 మీటర్లకు దరఖాస్తు చేసింది. నకిలీ అనుమతి పత్రాలు చూపించి, కనెక్షన్లు పొందినట్లు గుర్తించింది’ ‘వనస్థలిపురంలోని ద్వారకానగర్ రోడ్ నంబర్ 10లో ఓ మల్టీస్టోరేజ్ భవన యజమాని, తను పొందిన ఏడు విద్యుత్ మీటర్లను కేటగిరీ ఎల్టీ–3 నుంచి కేటగిరీ ఎల్టీ–1కు మార్చాల్సిందిగా కోరుతూ ఇటీవల డిస్కంకు దరఖాస్తు చేసింది. డిస్కం కమర్షియల్ విభాగం ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా, ఫేక్ బిల్డింగ్ పర్మిషన్, ఫేక్ ఓసీలను సమర్పించినట్లు తేలింది. ఇందులో ప్రమేయమున్న వారందరిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది’ ‘ఓ నిర్మాణ సంస్థ పీర్జాదిగూడ సెక్షన్ శంకర్నగర్ సర్వే నంబర్ 53/పార్ట్లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది. 1.50 లక్షల వాట్స్ కాంటాక్ట్ లోడ్ అవసరమని గుర్తించి, ఆ మేరకు 30 విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకుంది. నకిలీ ఆక్యూపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్ను అప్లోడ్ చేసి అడ్డంగా దొరికి పోయింది. ఇందులో గుత్తేదారే కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు తేలింది. ఇటు డిస్కంను, అటు యజమానిని మోసం చేసిన గుత్తేదారుపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేసింది’ సరూర్నగర్లో తీగలాగితే డిస్కంలో కదిలిన డొంక సరూర్నగర్ సర్కిల్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ ఏకంగా సీఈఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేశాడు. ఇదే అంశంపై ‘ఫేక్ ఓసీలు..ఫోర్జరీ’ సంతకాల శీర్షికతో నవంబర్ 23న సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని సర్కిళ్లు, సెక్షన్ల వారీగా ఇటీవల మంజూరు చేసిన ఎల్టీ, హెచ్టీ కనెక్షన్లపై ఆరా తీయగా, 40పైగా దరఖాస్తులు నకిలీగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
కొహెడను డివిజన్గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ సర్కిల్ను చార్మినార్ నుంచి ఎల్బీనగర్ జోన్లో చేర్చాలని, జీహెచ్ఎంసీ 53వ డివిజన్కు కొహెడ పేరు పెట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేపట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు 80వేలకు పైగా ఓటర్లున్న తుర్కయంజాల్ సర్కిల్ను రెండు డివిజన్లు మాత్రమే చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మరో డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ కందాల బల్దేవ్ రెడ్డి, కో కన్వీనర్లు సింగిరెడ్డి రాంరెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, బుడ్డ విజయ్ బాబు, శీలం అంగత్ కుమార్, నాయకులు బాల్రెడ్డి, యాదగిరి, శివ తదితరులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు జిల్లా ఫైర్ అధికారి– 2 బి.కేశవులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్స్టేషన్ నిర్మాణానికి గతంలో కలెక్టర్ 900 గజాల స్థలాన్ని సరూర్నగర్లో మంజూరు చేశారని అన్నారు. నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సరూర్నగర్, బాలాపూర్ ప్రజల సౌకర్యార్థం రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ ఫైర్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాహనాలతో ఎల్బీ నగర్ డివిజన్ హెడ్ ఆఫీస్ మంజూరైందన్నా రు. కార్యక్రమంలో ఎల్బీనగర్ కేంద్ర అగ్నిమాపక అధికారి పి.శ్రీధర్, అగ్నిమాపక అధికారి –2 బి.నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు. ● సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాసులుచేవెళ్ల: క్షణికావేశంలో, తెలిసీ తెలియక చేసిన తప్పులతో పెట్టుకున్న కేసులను పశ్చాతాపంతో సరిచేసుకునేందుకు అవకాశం కల్పించేందుకే లోక్ అదాలత్లు ఉన్నాయని జిల్లా అదనపు న్యాయమూర్తి (ఏడీజే) బి.శ్రీనివాసులు అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో ఆదివారం నేషనల్ లోక్ అదాలత్ను చేవెళ్ల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి దశరథరామయ్య, జూనియర్ జడ్జి ఉపాధ్యాయ విజయ్కుమార్, రిటైర్డ్ జడ్జి సాంబశివతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను ఇరువర్గాల ఒప్పందాలతో లోక్అదాలత్ల ద్వారా రాజీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ లోక్ అదాలత్లో 1,019 కేసులు పరిష్కరించటంతోపాటు రూ.24,57,200 జరిమానా విధించినట్లు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సి.మహేశ్గౌడ్, ప్రభుత్వ అభియోక్త గీతా వనజాక్షి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.కుమార్, గ్రేడ్–2 ఏసీపీ అలేపా రాణి, ప్రధాన ఏపీపీ నూతన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
గాంధీ పేరు పలకడం బీజేపీకి ఇష్టంలేదు
● జాతిపితను రెండోసారి హత్య చేస్తున్నారు ● ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ● పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మొయినాబాద్: స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే వారసులు ఆయన పేరును తొలగించి రెండోసారి హత్యచేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమా ర్గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా గాంధీజీ, రాజీవ్గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు గాంధీజీ పేరు పలకడం ఇష్టంలేక ఉపాధి హామీ పథకం పేరు మారు స్తున్నారని మండిపడ్డారు. దేశంలోని పేద ప్రజలకు కనీసం వంద రోజుల పని కల్పించాలనే సంకల్పంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. గ్రామస్వరాజ్యం కోసం కలలుగన్న మహాత్మాగాంధీ పేరును ఉపాధి హామీ పథకానికి పెట్టారని గుర్తుచేశారు. గాంధీజీ, నెహ్రూ దేశానికి అందించిన సేవలను ప్రజలకు తెలియనీయకుండా కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నెహ్రూ హయాంలోనే నిర్మించారన్నారు. ఈ నిజాలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిందో చూపించాలని నిలదీశారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చారన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. భారత్జోడో యాత్రతో రాహుల్గాంధీ దేశంలో ఐక్యత సాధించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు దాన్ని నిరూపిస్తూ అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజ్ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యుడు దర్శన్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, మాజీ జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఆదివారం యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యోగాతో అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్కుమార్, కేశంపేట సీఐ నరహరి, ఎస్ఐలు సుశీల, శ్రీకాంత్, రాంచంద్రయ్య, ప్రణయ్, రాజేశ్వర్, రవీందర్నాయక్, విజయ్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
...అనే నేను
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు, వార్డు సభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని 525 మంది సర్పంచులు .. అనూ నేను అంటూ ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. పంచాయతీ ప్రత్యేక అధికారులు/ కార్యదర్శులు గ్రామ ప్రథమ పౌరుడితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికై న అభ్యర్థులు తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 526 పంచాయతీలు సహా 4,668 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. మొదటి విడతలో భాగంగా ఈనెల 11న 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు, రెండో విడతలో భాగంగా 14న 178 పంచాయతీలు, 1,540 వార్డులకు, మూడో విడతలో భాగంగా 17న 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. గెలుపొందిన అభ్యర్థుల పేర్లను కూడా అదే రోజు ప్రకటించారు. రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో మగ్గిన ఆయా పంచాయతీలు ఇక నుంచి నూతన పాలకవర్గం సభ్యులతో కళకళ లాడనున్నాయి. నేడు సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కొలువుదీరనున్న పాలక మండళ్లు పంచాయతీలకు ‘కొత్త’ కళ ఎన్నికలు నిర్వహించిన పంచాయతీలు 525 కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందిన స్థానాలు 249 బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందినవి 182 బీజేపీ మద్దతుదారులు విజయం సాధించినవి 43 ఇతరులు కైవసం చేసుకున్న స్థానాలు 51 బీసీలకు రిజ్వర్వ్ అయిన పంచాయతీలు 92 జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచినవి 106 మొత్తం బీసీలు దక్కించుకున్న స్థానాలు 198 -
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంచాల: సర్కార్ బడులు అభివృద్ధి పథంలో పయనించాలంటే కచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యా బోధన, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆరుట్ల స్కూల్ మాదిరిగా రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యా కమిషన్ సభ్యులు పద్మజాషా, జ్యోత్న్స, శివారెడ్డి, ఎస్డీఎఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అమరుల ఆశయ సాధనకు సైకిల్ యాత్ర
చేవెళ్ల: తెలంగాణ అమరుల ఆశయ సాధన, గ్రామంలో బెల్టుషాపులు తొలగింపు, ఉద్యమకారులకు గుర్తింపు, పాలకుల్లో మార్పు డిమాండ్లతో ఓ వార్డు సభ్యుడు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం చేవెళ్లకు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం నాగసాన్పల్లికి చెందిన ఎన్నారం యాదయ్య ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాగసాన్పల్లి 1వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. తన గ్రామంలో పైడిమాండ్లను అమలు చేయాలని కోరుతూ గురువారం ఉదయం అసెంబ్లీకి సైకిల్యాత్ర ప్రారంభించారు. రాత్రి చేవెళ్ల పరిధిలోని దామరగిద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం చేవెళ్లలోని అంబేడ్కర్, పూలే, జగ్జీవన్రామ్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగల సాయన్న, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్, ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిచారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు యాదయ్య ఆలోచనను అభినందించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. సైకిల్ యాత్ర ద్వారా ముందు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తానని, అనంతరం అసెంబ్లీకి చేరుకుని, అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులకు తన డిమాండ్లను చెబుతానని స్పష్టం చేశారు. చేవెళ్ల నాయకులు టేకుపల్లి శ్రీనివాస్యాదవ్, అబ్దుల్ గని, బస్తేపూర్ నర్సింలు తదితరులు యాదయ్యకు వీడ్కోలు పలికారు. -
‘భవిష్యత్’కు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో అంతర్జాతీయ నగరాలకు దీటు గా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పర్యావరణానికి అత్య ధిక ప్రాధాన్యత నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఫోర్త్ సిటీలో ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, హరిత జోన్లుగా విభజించిన భారత్ ఫ్యూచర్ సిటీ బృహత్ ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మాస్టర్ ప్లాన్పై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుందని, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) మాస్టర్ ప్లాన్కు ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్ఎఫ్పీ)కు ప్రకటన జారీ చేస్తామని ఎఫ్సీడీఏ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు మాస్టర్ ప్లాన్లు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో నాలుగో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సీడీఏను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ మేర విస్తరించి ఉన్న ఎఫ్సీ డీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. 2 లక్షల ఎకరాల పరిధిలోని ఎఫ్సీడీఏకు మరో మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఎఫ్సీడీఏ కార్యాలయం మీర్ఖాన్పేటలో ఎఫ్సీడీఏ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, సుమారు 16,393 చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఆఫీసును నిర్మిస్తు న్నారు. ఫిబ్రవరిలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి. వంద రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ బృహత్ ప్రణాళిక సిద్ధం నివాస విభాగం: 1,300 డేటా సెంటర్లు: 500 ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాన్యుఫాక్చరింగ్: 2,000 ఎడ్యుకేషన్ హబ్: 500 లైఫ్ సైన్స్ హబ్: 3,000 హెల్త్ సిటీ: 200 ఏఐ సిటీ: 300 ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్: 100 ఈవీ అండ్ బీఈఎస్ఎస్: 200 ప్రత్యేక ప్రణాళికలు ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పలు సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.‘1,300 ఎకరాల్లోని వరంగల్లోని కాకతీ య మెగా టెక్స్టైల్ పార్క్.. 10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. విస్తీర్ణంలో అంతకు వంద రెట్లు పెద్దదైన భారత్ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు, ఉద్యోగావకా శాల్లో నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగావకాశాల కల్పనే ఫ్యూచర్ సిటీ లక్ష్యమని’ ఎఫ్సీడీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
చాంపియన్ సరూర్నగర్ సర్కిల్
హుడాకాంప్లెక్స్: అత్తాపూర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో కొనసాగుతున్న తెలంగాణ ట్రాన్స్కో, డిస్కం ఇంటర్సర్కిల్ టీ–20 క్రికెట్ టోర్నమెంట్లో సరూర్నగర్ సర్కిల్ చాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సరూర్నగర్ సర్కిల్ జట్టు మహబూబ్నగర్ సర్కిల్ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు అతిథులు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వీఎస్ఆర్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ య గ్నప్రసాద్, విద్యుత్సౌధ సీజీఎం హెచ్ఆర్డీ బి.రవి, మెట్రోజోన్ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రాన్స్కో, డిస్కం స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ల్లో తనిఖీ ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా 108 ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు. 108 అంబులెన్స్ వాహనంలో ఉన్న మందులు, వాహనంలో ఉన్న సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్ చంద్రశేఖర్ను అంబులెన్స్ వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సేవలు అందించాలి కేశంపేట: సకాలంలో కాల్స్ స్వీకరించి బాధితులకు సేవలు అందించాలని జిల్లా 108 ప్రో గ్రాం కో ఆర్డినేటర్ రాజబాబు అన్నారు. మండల కేంద్రంలో 108 అంబులెన్స్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్ సరఫరా, మెడికల్ పరికరాల పనితీరును పరిశీలించారు. పైలెట్ దీపక్తో వివరాలు ఆరా తీశారు. నితిన్నబిన్ను కలిసిన శ్రీవర్ధన్రెడ్డి షాద్నగర్రూరల్: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్నబిన్ను శుక్రవారం పార్టీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్రెడ్డి కేంద్ర మంత్రి బండిసంజయ్తో వెళ్లి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అన్నారు. సామాన్య కార్యకర్త జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం భారతీయ జనతాపార్టీలో ఉందన్నారు. నితిన్నబిన్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు శంకర్పల్లి: బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేస్తున్న కారణంగా ము న్సిపల్ పరి ధిలోని 22 ఆస్పత్రులు, క్లినిక్స్కు శు క్రవారం మున్సిపల్ కమిషనర్ యోగేశ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బయో మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆస్పత్రులు, క్లినిక్స్ పాటించడం లేదని అన్నారు. వ్యర్థాలను ప్రభుత్వం సూచించిన ఏజెన్సీలకు అప్పగించాలని, దీనిపై ఇప్పటికే పలుమార్లు మౌఖికంగా హెచ్చరించామని, అయినప్పటికీ వారు తీరు మార్చుకోవడం లేదన్నారు. ప్రస్తుతం షోకాజ్ నోటీసులు ఇచ్చామని, పునరావృతమైతే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
సమస్యల స్వాగతం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నిధుల లేమితో రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలకవర్గాలకు సవాల్గా మారబోతున్నాయి. సీసీరో డ్లు, డ్రైనేజీ కాల్వలు వంటి అభివృద్ధి పనులకు నోచు కోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికంగా పెనుభారంగా మారబోతున్నాయి. పంచాయతీ పగ్గాలు చేపబట్టబోతున్న కొత్త పాలకవర్గాలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈనెల 11న మొదటి విడతలో భాగంగా 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు.. రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఈనెల 14న, మూడో విడతలో 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించింది. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సర్పంచులు సహా వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ఒకే సమయంలో నిర్వ హించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పెండింగ్లో నిధులు.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్లకు 2024–2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్లోనే ఉన్నాయి. మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. తండాలు, ఇతర చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. డీజిల్ సహా చిన్నచిన్న రిపేర్లు చేయించేందుకు సైతం నిధులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా.. పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. 15వ ఆర్థిక సంఘం విదిల్చే నిధులపైనే కొత్త పాలకమండళ్లు ఆశలు పెట్టుకున్నాయి. నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని పల్లెలు లెక్క చెప్పాల్సిందే..గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఓటమి పాలైన వారు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లో వెల్లడించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఐదు వేల జనాభా ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలుగా నిర్ణయించింది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడి ఖర్చు రూ.50 వేలుగా నిర్ణయించింది. మెజార్టీ పంచాయతీల్లో ఒక్కో సర్పంచ్ అభ్యర్థి రూ.50 లక్షలకుపైనే ఖర్చు చేసినట్లు సమాచారం. తొలి విడత ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు జనవరి 24లోగా, రెండో విడత అభ్యర్థులు 27లోగా, మూడో విడత అభ్యర్థులు జనవరి 30లోగా ఎన్నికల ఖర్చులను సంబంధిత ఎంపీడీఓలకు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆయా అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను పరిశీలించి టీఈపోల్ వెబ్లో అప్ లోడ్ చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అందజేయాల్సి ఉంది. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లు పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం పదవిని కోల్పోవడంతో పాటు వచ్చే మూడేళ్ల పాటు మరే ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉండదు. -
సుప్రీం తీర్పు హర్షణీయం
బడంగ్పేట్: 102 ఎకరాలు ఫారెస్ట్దే అని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం సంతోషకరమని అడిషినల్ పీసీసీఎఫ్ శర్వానంద్ అన్నారు. బడంగ్పేట సర్కిల్లోని గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్లో అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చిందని తెలిపారు. సరైన సమయంలో అటవీ అధికారులు వ్యవహరించడంతో 102 ఎకరాలు ప్రభుత్వ పరమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి గోపిడి రోహిత్రెడ్డి, రేంజ్ అధికారి కె.శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి కస్లనాయక్, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ గ్రామాల్లో హెచ్ఆర్ఏ అమలు చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్ఎంసీలో విలీనమైన గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పెరిపెరి ప్రాంతాన్ని వెంటనే గుర్తించాలన్నారు. మండలంలోని పెరిపెరిలోకి వచ్చే ఎల్మినేడు, పోచారం, ఉప్పరిగూడ, మల్సెట్టిగూడ, కప్పపహాడ్, తుర్కగూడ, చర్లపటేల్గూడ, తులేకలాన్, కర్నంగూడ, నాగన్పల్లి, పోల్కంపల్లి, నెర్రపల్లి, ఖానాపూర్, తులేకలాన్, దండుమైలారం వరకు హెచ్ఆర్ఏ వర్తింపజేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ విగ్రహావిష్కరణ
మొయినాబాద్: ఏడాది క్రితం మరణించిన భార్య విగ్రహంతోపాటు తన విగ్రహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు రైతు కళ్లెం నర్సింహారెడ్డి. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఉన్న కళ్లెం నర్సింహారెడ్డి వ్యవసాయ కళాక్షేత్రంలో శుక్రవారం తన కూతుళ్లు, బంధువులు, స్నేహితుల సమక్షంలో స్వయంగా ఆయనే విగ్రహాలను ఆవిష్కరించారు. ముప్పై ఏళ్ల పాటు అమెరికాలో వ్యవసాయం చేసి ఉత్తమ అవార్డు అందుకున్న నర్సింహారెడ్డి 2005లో స్వదేశానికి వచ్చి చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో వ్యవసాయ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. గత సంవత్సరం భార్య లక్ష్మి మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను ఒంటరిగా ఉంచలేనంటూ తన విగ్రహాన్ని సైతం పక్కనే ఏర్పాటు చేశారు. శుక్రవారం విగ్రహాల ఆవిష్కరణ చేసిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. -
నాయకత్వ లక్షణాలు లక్ష్యం
గురునానక్లో జాతీయ స్థాయి బిజినెస్ కాన్క్లేవ్ ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వ్యాపార దృష్టిని పెంపొందించేడమే లక్ష్యంగా గురునానక్ యూనివర్సీటీ ఆఫ్ మేనేజ్మెంట్ కామర్స్లో జాతీయ స్థాయి బిజినెస్ కాన్క్లేవ్–2025ను శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం కోసం అవగాహన కల్పించారు. గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లి, వైస్ చాన్సలర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైనీ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. సెమినార్ ప్రారంభోత్సవానికి రెక్టర్ డాక్టర్సీ కలైరాసన్, రిజిస్ట్రార్ డాక్టర్విశాల్ వాలియా, అడ్వైజర్ డాక్టర్ ఎంపీ సింగ్ ఇషార్లు హాజరై ప్రారంభించారు. నవీన వ్యాపార దోరణులు, డిజిటల్ మార్పులు, నాయకత్వం, సస్టైనబిలిటీ, భవిష్యత్ వ్యాపార అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోజ్ మేరీ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీల్లో సాయిచరణ్ ప్రతిభ జాతీయస్థాయిలో గుర్తింపు ఆమనగల్లు: భోపాల్లో శుక్రవారం జరిగిన జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్షిఫ్ పోటీల్లో దయ్యాలబోడు తండాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాయిచరణ్ అత్యంత ప్రతిభ కనబరిచి బెస్ట్ రైడర్గా బహుమతిని అందుకున్నాడు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సాయిచరణ్ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్షిఫ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అండర్ 17 విభాగంలో సాయిచరణ్ సాయిచరణ్ బెస్ట్ రైడర్ అవార్డు అందుకున్నాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలి ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ధర్నా ఇబ్రహీంపట్నం: అంగన్వాడీ టీచర్లపై అనుచిత వాఖ్యలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన బీఎల్వోల సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు, పారితోషికం తదితర విషయాలపై డీటీ ప్రవీణ్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే అనుచిత వాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా, తమను అగౌరవ పరిచే వాఖ్యలు చేశాడని మండిపడ్డారు. అనంతరం వారు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తక్షణమే ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి ఎలక్షన్ డీటీపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పి. కృష్ణ, జగన్, అంగన్వాడీ యూనియన్ నాయకులు బాలమణి, అండాలు, సువర్ణ, యాదమ్మ, మంజుల, విజయలక్ష్మీ, హంసమ్మ, శివరాణి పాల్గొన్నారు. కాగా ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. జింక పిల్లను ఫారెస్ట్ సిబ్బందికి అప్పగింత కందుకూరు: లేమూరు పరిధిలోని రోబోమాటిక్ కంపెనీ ఫారెస్ట్ ఫెన్సింగ్లో చిక్కుక్కున్న జింక పిల్లను గ్రామస్తులు కాపాడారు. మాజీ సర్పంచ్ పరంజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం అటవీ సిబ్బంది అందజేశారు. వీరిలో శ్రీకాంత్, కార్తీక్, అనిరుధ్, ఆకాష్, రోబోమాటిక్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. -
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
అబ్దుల్లాపూర్మెట్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 14 మంది సర్పంచుల్లో ఆరుగురు మహిళా సర్పంచులు విజయం సాధించారు. అందులో ఐదుగురూ విద్యావంతులు కావడంతో పాటు, 35 ఏళ్లలోపు వయసున్న వారే కావడం గమనార్హం. విద్యలో ఉన్నతంగా రాణించిన వీరు, మహిళా ప్రజాప్రతినిధులుగా గెలుపొందడంతో స్థానిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తారనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కవాడిపల్లి సర్పంచ్గా గెలుపొందిన కొలన్ లక్ష్మీప్రసన్న ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించి, రాజకీయశాస్త్రంలో డాక్టరేట్ సాధనలో ఉన్నారు. అమెరికా, యూరప్లో నోవార్టిస్, మైక్రోసాప్ట్ వంటి బహుళజాతీయ సంస్థల్లో పనిచేశారు. ఈమె మామ గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఇక ప్రజాప్రతినిధిగా.. ఈమె మందుగుల విజయ. అబ్దుల్లాపూర్మెట్ సర్పంచ్గా విజయం సాధించారు. త్వరలోనే సర్పంచ్గా గ్రామ పాలనా పగ్గాలు అందుకోనున్నారు. ఎంసీఏ పూర్తి చేసిన ఈమె ఇప్పటివరకు గృహిణిగా ఉన్నారు. ఇక ప్రజాప్రతినిధిగా కొనసాగనున్నారు. అధైర్య పడకుండా.. మజీద్పూర్ సర్పంచ్గా విజయం సాధించిన మేడిపల్లి ప్రియ బీఎస్సీ, బీఈడీ చదివారు. గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఏమాత్రం అధైర్య పడకుండా సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. ఇంటి నుంచి.. గ్రామ సేవకు బలిజగూడ గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై న ఉప్పు మాధవి ఇంటర్ చదివి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొంది, ప్రజా సేవలో నిమగ్నమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి.. అనాజ్పూర్ సర్పంచ్గా ఎన్నికై న రాచపాక నవనీత బీకాం, బీఈడీ చదివారు. ప్రస్తుతం గృహిణిగా ఉన్న ఆమె ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఈమె తోటి కోడలు తాజా, మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. తొలి ప్రయత్నంలోనే సర్పంచ్గా గెలుపొందిన ఆమె ప్రజా సేవకు సై అంటున్నారు. -
అమ్మానాన్న అడుగుజాడల్లో..
మా నాన్న బుగ్గయ్యగౌడ్ సింగిల్విండో డైరెక్టర్గా, గ్రామ సర్పంచ్గా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా, ఎంపీపీగా సేవలందించారు. అమ్మ ఉమావతి కూడా ఎంపీటీసీగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారం. నేను కూడా ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో నిలిచి, విజయం సాధించా. ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలందిస్తా. – కరుణాకర్గౌడ్, ఎంబీఏ, బీటెక్, ఎక్వాయిపల్లి ● -
సమస్యలపై అవగాహన ఉంది
గ్రామ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. నా భర్త నిరంతరం అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, రేషన్కార్డులు, పింఛన్లు ఇవ్వాలని పోరాడారు. మైనింగ్ కంపెనీని నిలిపేయాలని ప్రజల పక్షాన నిలిచారు. మా గ్రామం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నాకు అవకాశం వచ్చింది. స్థానిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు వారితో కలిసి పనిచేస్తా. – సంధ్యవెంకటేశ్గౌడ్, ఎమ్మెస్సీ, సర్పంచ్, ముద్వీన్ ● -
రక్షణ చట్టం కోసం పాదయాత్ర
ఆమనగల్లు: న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఈ నెల 22 నుంచి సచివాలయం ముట్టడి, పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు యాదీలాల్ తెలిపారు. శుక్రవారం ఆమనగల్లు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4 ప్రధాన డిమాండ్లతో ఆమనగల్లు నుంచి ప్రారంభించి హైదరాబాద్లోని సచివాలయం వరకు నిర్వహిస్తామని ఆయన వివరించారు. పాదయాత్ర వివరాలు.. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రారంభించి ఆమనగల్లు నుంచి కందుకూరు వరకు మొదటిరోజు పాదయాత్ర నిర్వహిస్తామని యాదీలాల్ తెలిపారు. రెండవరోజు కందుకూరు నుంచి తుక్కుగూడ వరకు, మూడో రోజు తుక్కుగుడ నుంచి సచివాలయం వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి విజయ్కుమార్, కోశాధికారి కృష్ణ, గ్రంథాలయ కార్యదర్శి మల్లేశ్, క్రీడా కార్యదర్శి శేఖర్, సీనియర్ న్యాయవాదులు లక్ష్మణశర్మా, మల్లెపల్లి జగన్, మల్లేశ్, మధుగౌడ్, గణేశ్గౌడ్, జగన్, సంతోశ్, శిరిష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్ -
భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలుపు
భర్తకు ఉప సర్పంచ్గా అవకాశం ఇబ్రహీంపట్నం రూరల్: భార్య భర్తలు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. భర్తకు ఉప సర్పంచ్ పదవీ వరించింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, సుధారాణి దంపతులు పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు. భర్త వెంకటేష్ 4వ వార్డు సభ్యులుగా, భార్య సుధా 7వ వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ ప్యానెల్లో ఇద్దరు విజయం సాధించారు. దీంతో భర్త వెంకటేష్కు ఉప సర్పంచ్గా అవకాశం వచ్చింది. మూడు సార్లు వార్డు సభ్యునిగా గెలిచిన రమేశ్.. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గొరిగే రమేశ్ 1వ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో అతను మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. బాలుడిపై వీధి కుక్క దాడి తుర్కయంజాల్: సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం కమ్మగూడలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కాట్రావత్ సంజయ్ అనే బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. -
ఓటేయలేదని చితకబాదారు
● కుటుంబ సభ్యులంతా కలిసి దాయాదిపై దాడి ● చికిత్స పొందుతున్న బాధితుడు యాచారం: ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి.. తన పరాజయానికి కారణమయ్యాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జీపీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బోద్రమోని రవీందర్ 7 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యాడు. తనకు ఓటేయకపోగా, పరాజయానికి కారణమయ్యాడంటూ దాయాది బోద్రమోని మల్లేశ్పై అనుమానం పెంచుకున్నాడు. రెండు రోజులుగా అతని కదలికలపై నిఘా పెట్టాడు. శుక్రవారం ఉదయం మల్లేశ్ తన పిల్లలను స్కూల్ బస్ ఎక్కించేందుకు బైక్పై వెళ్తుండగా అడ్డుకున్న రవీందర్, అతని తల్లి నాగమణి, తండ్రి నారాయణ, తమ్ముడు రాజేశ్ కలిసి చితకబాదారు. తీవ్ర గాయాలైన మల్లేశ్ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. స్కూటీని ఢీ కొట్టిన కారు మహిళ దుర్మరణం నందిగామ: స్కూటీని కారు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని మేకగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సుమిత్ర(30) శుక్రవారం స్కూటీపై పొలానికి బయలుదేరింది. ఇన్ముల్నర్వకు చెందిన ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురి అరెస్టు సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం తెలిపారు. అల్మాస్గూడకు చెందిన అవుల శ్రీనివాస్ దుబాయ్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అక్కడ రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్లో శ్రీనివాస్ ఇండియాకు వచ్చాడు. అప్పటినుంచి రాజస్థాన్ వ్యక్తి శ్రీనివాస్తో వాట్సాప్ కాంటాక్ట్లో ఉన్నాడు. కరెంట్ బ్యాంక్ ఖాతాలను అందిస్తే కరెంట్ ఖాతాల్లో డిపాజిట్ అయ్యే డబ్బులో 25 శాతం కమీషన్ ఇస్తామని ఆఫర్ చేశాడు. దీంతో శ్రీనివాస్ తన మిత్రుల సహకారంతో బెంగళూరుకు వెళ్లి కేరళకు చెందిన ఇద్దరికి కరెంట్ బ్యాంక్ వివరాలను అందించగా, శ్రీనివాస్కు రూ.2.5 లక్షల కమీషన్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని శ్రీనివాస్,సతీష్, రాజేందర్, మైఖేల్ రెడ్డిలు పంచుకున్నారు. ఈ ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ మోసాల కోసం వినిగించారు. ఇందులో దేశవ్యాప్తంగా నమోదైన 94 సైబర్ నేరాలకు సంబంధించి 6.29కోట్ల లావాదేవీలు జరిగాయి. -
యూరియా.. ఇక సులువయా!
● రైతుల కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ● స్లాట్ బుక్ చేసుకోగానే ఎరువులు ● నిరీక్షణకు పడనున్న తెర ● రేపటి నుంచి అందుబాటులోకి సేవలు కొందుర్గు: రైతుల అవసరం మేరకు యూరియా అందించేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్నకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రబీ సీజన్ నుంచే ఇది అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఒకవైపు పంటల నమోదుతోపాటు మరోవైపు ఎరువులు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి యాప్ రైతులకు అందుబాటులోకి వస్తుంది. యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద వేచి చూడకుండా.. సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన యాప్పై ఇప్పటికే అధికారులు ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకున్న పంటల వివరాలు కేవలం యూరియా కోసమే కాదని పంటల ఉత్పత్తి అనంతరం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. స్లాట్ బుక్ చేయడం ఇలా.. ● ప్లేస్టోర్ ద్వారా రైతులు తమ స్మార్ట్ ఫోన్లో ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ● మొదటగా పట్టాదారు పాసుపుస్తకం నంబర్ నమోదు చేయాలి. ● పీపీబీలో ఉన్న భూమి విస్తీర్ణం కనిపిస్తుంది. అందులో సాగు విస్తీర్ణం పంటల వారీగా నమోదు చేయాలి. ● అనంతరం పంటల వారీగా ఎకరాకు యూరియా కేటాయింపు నమోదు అవుతుంది. ● జిల్లాలో ఏ దుకాణంలో ఎంత స్టాకు ఉంటుందో తెలుసుకోవచ్చు. ● రైతులే తమకు అనుకూలమైన షాపులను ఎంపిక చేసుకోవచ్చు. ● యూరియా బుకింగ్ అనంతరం రైతు ఐడీ వస్తుంది. ఈ ఐడీ ద్వారా ఎంపిక చేసుకున్న దుకాణంలో 24 గంటల వ్యవధిలో యూరియా తీసుకోవచ్చు.వరి 2.5 బస్తాలు మొక్కజొన్న 3.5 బస్తాలు చెరుకు 5 బస్తాలు మిర్చి 5బస్తాలు ఇతరపంటలు 2బస్తాలు -
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే
నా తల్లిదండ్రులు పాలకూర్ల లక్ష్మమ్మ, రాములుగౌడ్ గత ముప్పై ఏళ్లుగా ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామానికి సేవలు అందించారు. ఉన్నత చదువులు చదివిన నేను కొంత కాలం బిజినెస్తో పాటు, జర్నలిస్ట్గా పనిచేశా. స్థానిక యువత అభిప్రాయం మేరకు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్గా పోటీ చేశా. అమ్మానాన్నల దీవెనలు, యువత ప్రోత్సాహం, గ్రామస్తుల ఆశీర్వాదంతో సర్పంచ్గా విజయం సాధించా. – పి.మహేందర్గౌడ్, ఎంబీఏ, సర్పంచ్, చరికొండ ● -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
పహాడీషరీఫ్: హత్యలు, హత్యాయత్నాలతో ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి భంగం కలిగించే రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకీ రెడ్డి హెచ్చరించారు. బా లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని 15 మంది రౌడీషీటర్లకు గురువారం ఆయన, ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు.రౌడీషీటర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. గతంలో ఏం చేసేవారని తెలుసుకున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, రాత్రి 10 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని, అనంతరం బయటికి వెళ్లరాదన్నారు. ఏదైనా కేసులో ప్రమేయం అయినట్టు తేలితే పీడీ యాక్ట్, నగర బహిష్కరణకు సీపీకి ప్రతిపాదిస్తామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి సూచనల మేరకు బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ప్రతి కదలికపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. స్టేషన్ పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 57 మందిపై రౌడీషీట్ కొనసాగుతోందని వివరించారు. కౌన్సెలింగ్లో ఎస్సైలు సుధాకర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆ 103 ఎకరాలు సర్కారువే
సాలార్జంగ్ వారసులకు సుప్రీం షాక్● గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ భూములపై కీలక తీర్పు ● హైకోర్టు, కింది కోర్టుల ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం ● జాగీర్ల రద్దుతోనే ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయని స్పష్టీకరణ ● 8 వారాల్లోగా ‘రిజర్వ్ ఫారెస్ట్’ నోటిఫికేషన్ పూర్తి చేయాలని సీఎస్కు ఆదేశంసాక్షి, న్యూఢిల్లీ: గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అదిపూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంకై ్వరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుసీ్త్ర దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది. -
అధికార, ప్రతిపక్షాలను వెనక్కి నెట్టేసాం
కందుకూరు: సర్పంచ్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి అన్నారు. గురువారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ పోటీపడి గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు చెప్పారు. అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఒరవడిని భవిష్యత్లో జరిగే ఏ ఎన్నికలోనైనా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువమోర్చా నాయకుడు సామ మహేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బొక్క సత్యనారాయణరెడ్డి, బొక్క సురేందర్రెడ్డి, సాధ ప్రవీణ్రెడ్డి, బొక్క పరశురాంరెడ్డి, కొత్తగూడ ఉప సర్పంచ్ ముచ్చర్ల రవీందర్, హనుమంతుల అరుణ్ పాల్గొన్నారు. -
ధ్యాన యాగం.. ఆధ్యాత్మిక యోగం
కడ్తాల్: ధ్యాన మహాయాగం కోసం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం ముస్తాబవుతోంది. మండల కేంద్రం సమీపంలోని పత్రీజీ శక్తి స్థల్లో ఈ నెల 21న (ఆదివారం) వేడుకలు ప్రారంభమై, 31 వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు హాజరుకానున్నారు. ఈ మేరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పదమూడు సంవత్సరాలుగా.. 13 సంవత్సరాలుగా ఏటా డిసెంబర్లో ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాది మంది ధ్యానులు తరలిరానున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ఉచిత అన్నదాన కేంద్రం, శాశ్వత గదులతో పాటు తాత్కాలిక వసతి గృహాలు, కుటీరాలు నిర్మిస్తున్నారు. వేడుకలు జరిగినన్ని రోజులు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక సిద్ధం చేస్తున్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యంతో పాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలు ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతిరోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. నిత్యం ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు సామూహిక వేణుగాన ధ్యానం, అఖండ ధ్యానం, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురు సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విజయవంతం చేయాలి వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. పిరమిడ్ ఆవరణలో గురువారం ట్రస్ట్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రా లకు చెందిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మేధావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మంది ధ్యానులు, సందర్శకులు హాజరుకానున్నారని, ఈమేరకు 10 లక్షల మందికి ఉచి త అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు దామోదర్రెడ్డి, మాధవి, జేజీ నారాయణ, చంద్రశేఖర్, మహేశ్వరి, మీడియా ఇన్చార్జి భాస్కరానంద, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సర్పంచ్లు సేవ్యా, శ్రీను పాల్గొన్నారు. -
ఫాంహౌస్ల్లో వేడుకలకు అనుమతి తప్పనిసరి
మొయినాబాద్: ఫాంహౌస్ల్లో నిర్వహించే ఎలాంటి వేడుకలకైనా అనుమతులు తప్పని సరి తీసుకోవాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతం అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో శుక్రవారం ఫాంహౌస్ నిర్వాహకులు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో లిక్కర్ వినియోగిస్తే ఎకై ్సజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పార్టీల నిర్వహణకు ఫాంహౌస్లు ఇచ్చే ముందు అందరి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేదంటే సంఘటనకు కారణమైనవారితోపాటు యజమానులు, నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, ఎస్సైలు నర్సింహారావు, వెంకన్న, నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి.. అమాంతం పైకెళ్లి
హుడాకాంప్లెక్స్: బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 లోపే ఉండగా తాజాగా హోల్సేల్ మార్కెట్లో రూ.35 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి కూరలోనూ ఉల్లిని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. తాజాగా వీటి ధరలు పెరగడంతో నెలకు రెండు మూడు కిలోలు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం కేజీ లోపుతోనే సరిపెట్టుకుంటున్నారు. అమాంతం పెరిగిన ధరలు సరిహద్దులోని బంగ్లాదేశ్ నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్ర, సహా తెలు గు రాష్ట్రాల్లో పండించిన పంటను పశ్చిమ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తు తం పంట దిగుబడి కూడా లేదు. గోదాముల్లో నిల్వ చేసిన కొద్ది పాటి పంటను కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. దీంతో గ్రేటర్ జిల్లాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్కు రోజుకు సగటున 25 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది.నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ. 1,500 నుంచి రూ.1,800 వరకు పలికింది. ఇక్కడికి రావాల్సిన ఉల్లి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండటంతో ధర అమాంతం పెరిగింది. గడ్డ సైజు ను బట్టి క్వింటాల్కు రూ.3,500 పలుకుతోంది. కొండెక్కిన కోడు గుడ్డు సాధారణంగా చలికాలంలో గుడ్డును ఎక్కువగా తీసుకుంటుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆమ్లెట్, ఉడికించిన గుడ్డును అందిస్తుంటారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన గుడ్లను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గుడ్డుపై 65 పైసలు ఎక్కువ వస్తుండటంతో రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ హోల్సేల్ గుడ్డు ధర రూ.6.66 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. ఒకవైపు ఉల్లి.. మరోవైపు కోడిగుడ్డు ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూస్తే దడ ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉల్లి, కోడిగుడ్డు కాంబినేషన్ పెరిగింది. మాంసాహారాల్లోనే కాదు శాఖాహారాల్లోనూ ఉల్లి తప్పనిసరైంది. రోజు కు కనీసం ఒకటి రెండు గడ్డలు అవసరం. నెలకు మూడు నుంచి నాలుగు కిలోలు కొనే దాన్ని. ప్రస్తుత ధరలతో సగానికి తగ్గించాను. ఇక కోడిగుడ్డు రోజుకు బదులు.. వారానికి ఒకటి రెండుసార్లే కొనుగోలు చేస్తున్నాం. – కృష్ణవేణి, గృహిణి -
మత్తుకు బానిసలు కావొద్దు
మొయినాబాద్: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ యూని ట్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో లైన్స్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం పబ్ సంస్కృతి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందని అరు. కేసులు నమోదైతే విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వృత్తిపరమైన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు మల్లేష్, చంద్రశేఖర్, వెంకటరాజు, భవానిసుష్మ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దారపల్లి యాదయ్య తన భార్య వరలక్ష్మి(32), కుమారులు రాంప్రసాద్(12), సాయి(10), కుమార్తె అఖిల(8)లతో కలిసి ఏడాది క్రితం తుక్కుగూడకు జీవనోపాధి నిమిత్తం వలస వచ్చారు. యాదయ్య పార పని చేస్తుండగా, వరలక్ష్మి హోటల్లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన యాదయ్య ఇంట్లో ఉండగా, భార్య హోటల్కు వెళ్లింది. పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తల్లి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారు. ఎంతకి ఇంటికి రాకపోవడంతో వారి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై యాదయ్య పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
పల్లె పోరులో అద్వితీయ విజయాలు
భర్త కారోబార్.. భార్య సర్పంచ్ యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలువురి సర్పంచుల విజయం చర్చనీయాంశంగా మారింది. యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మస్కు అనిత గెలుపొందారు. ఆమె భర్త శివశరణం ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వర్తిసున్నారు. అనిత కాంగ్రెస్ మద్దతుతో మాజీ ఎంపీపీ కొప్పు సుకన్యను 300 ఓట్ల తేడాతో ఓడించారు. మాజీ ఎంపీటీసీల భర్తల గెలుపు యాచారం: మండల పరిధిలోని మంతన్గౌరెల్లి ఎంపీటీసీగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన కొర్ర జ్యోతినాయక్ భర్త కొర్ర అరవింద్ నాయక్(కాంగ్రెస్) ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారుడైన యాదయ్యగౌడ్ను 200లకు పైగా ఓట్లతో ఓడించారు. యాదయ్యగౌడ్ ప్రస్తుతం యాచారం పీఏసీఎస్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మల్కీజ్గూడ గ్రామ ఎంపీటీసీగా సేవలందించిన డేరంగుల శారద ఆమె శంకర్ ప్రస్తుతం సర్పంచ్గా గెలుపొందారు. ఒక పర్యాయం ఎంపీటీసీ కందుకూరు: సర్పంచ్గా ఎన్నికై న సరికొండ పాండు 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించారు. ఎంపీటీసీ అనంతరం సర్పంచ్గా గెలుపొందడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కారోబారే సర్పంచ్ యాచారం: మండల పరిధిలోని నస్దిక్సింగారం గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వర్తించిన బోడ కృష్ణ సర్పంచ్గా గెలుపొందారు. తన ప్రత్యర్థి చింతుల్ల చిత్తారి(కాంగ్రెస్) మీద వందకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. కారోబార్గా పనిచేస్తూ సమస్యలను గుర్తించానని, సర్పంచ్గా గెలుపొందడంతో బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తానని కృష్ణ పేర్కొన్నారు. నాడు తండ్రి.. నేడు కొడుకు యాచారం: మండల పరిధిలోని చింతపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గతంలో తోట్ల మల్లయ్య బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమేశ్ ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. తక్కళ్లపల్లి తండా గ్రామ సర్పంచ్గా రమావత్ జగదీష్ సర్పంచ్గా పనిచేయగా ప్రస్తుతం ఆయన తల్లి కౌసల్య సర్పంచ్గా విజయం సాధించారు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో గతంలో అచ్చెన జంగయ్య ఆ గ్రామానికి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఆయన భార్య మంగ సర్పంచ్గా గెలుపొందారు. నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్ కందుకూరు: మండల పరిధిలోని గుమ్మడవెల్లికి చెందిన పల్స మహేశ్గౌడ్ 1995–2001 వరకు ఉప సర్పంచ్గా, 2001–2006 మధ్య ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించారు. ప్రజా మద్దతుతో ఈ విజయాలు సాధ్యం అయ్యాయని పేర్కొన్నారు. మూడోతరం నేత యాచారం: మండల పరిధిలోని తమ్మలోనిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా దెంది రాంరెడ్డి(కాంగ్రెస్) 489 ఓట్లతో గెలు పొందారు. వారి ఇంట్లో మూడో తరం సర్పంచ్గా పేరుగాంచారు. చింతపట్ల గ్రామ పంచాయతీ కింద తమ్మలోనిగూడెం అనుబంధ గ్రామంగా ఉండేది. ఆ గ్రామానికి 1959 మొదటి సారి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దెంది రాంనాథ్రెడ్డి సర్పంచ్గా గెలుపొందారు. తర్వాత రాంనాథ్రెడ్డి కుమారుడు పర్వత్రెడ్డి సర్పంచ్గా పనిచేశాడు. ప్రస్తుతం రాంరెడ్డి మూడోతరం సర్పంచ్గా గెలుపొందారు. అప్పుడు భర్త ఇప్పుడు భార్య కందుకూరు: మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో 2019–2024 జనవరి వరకు కాసుల రామకృష్ణారెడ్డి సర్పంచ్గా సేవలందించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా ఆయన భార్య కాసుల స్వాతి విజయం సాధించారు. దీంతో భార్య, భర్త ఇద్దరు సర్పంచ్లుగా గెలిచినట్లయింది. గతంలో ఎంపీటీసీగా.. కందుకూరు: మండల పరిధిలోని చిప్పలపల్లికి చెందిన సురమోని లలిత 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె చెప్పారు. -
బడా నేతలకు ఝలక్!
యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలను ఖంగు తినేలా చేశాయి. పార్టీలోనే కీలక పదవులు.. కానీ సొంత గ్రామాల్లో మాత్రం ప్రజల నుంచి వారికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న నేతల స్వగ్రామాల్లో వారు పోటీలో నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. రూ.లక్షలాధి ఖర్చు చేసి, కాళ్లకు గజ్జలు కట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకోకపోవడం గమనార్హం. ఏళ్లుగా రాజకీయాల్లో అరితెరిన నాయకులు ఓటమిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతు దారుల ఓటమిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు తమ పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. యాచారంలో ఉల్టా.. పల్టా! మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామాలైన యాచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న కొప్పు బాషా గ్రామ పంచాయతీ సర్పంచ్గా తన భార్య కొప్పు సుకన్య(మాజీ ఎంపీపీ)ను పోటీలో నిలబెడితే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంగోత్ వెంకటేష్ తక్కళ్లపల్లి తండాలో తన భార్య విజయను బరిలో పెడితే ఓడిపోయారు. గునుగల్లో పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి సర్పంచ్గా పోటి చేసి ఓటమి పాలయ్యారు. మంతన్గౌరెల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ తన మద్దతుదారుడైన పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్ను సర్పంచ్గా పోటీలో నిలబెడితే పరాజయం చెందారు. నక్కర్తమేడిపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తన భార్య లావణ్యను సర్పంచ్ బరిలో నిలబెడితే ఓటమి చెందారు. నందివనపర్తిలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బిలకంటి చంద్రశేఖర్రెడ్డిలు కాంగ్రెస్ నుంచి పేరుమల్ల రవిని పోటిలో నిలబెడితే పరాజయం చెందారు. ఆయా పార్టీల్లో కీలక నేతలున్న గ్రామాల్లో వారి మద్దతుదారులు ఓటమిపాలు కావడంతో మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఊర్లల్లో బోల్తాపడిన ఉద్దండులు పంచాయతీ ఎన్నికల్లో పలువురికి భంగపాటు ఊహించని ఓటమితో అంతర్మథనం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైనం -
తమ్ముడిపై అన్న విజయం
మహేశ్వరం: మండల పరిధిలోని పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి తోడబుట్టిన అన్నదమ్ములు పోటీ పడ్డారు. ఈ పోరులో తమ్ముడిపై అన్న విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం జగనోహ్మన్రెడ్డి(అన్న), బీజేపీ బలపర్చిన అభ్యర్థి జైత్వారం శ్రీధర్రెడ్డి(తమ్ముడు) పోటీ పడ్డారు. బుధవారం ఫలితాల్లో జగన్మోహన్రెడ్డి 143 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. జగన్మోహన్రెడ్డికి 565 ఓట్లు, శ్రీధర్రెడ్డికి 422 ఓట్లు వచ్చాయి. -
సర్పంచులుగా అక్కాచెల్లెళ్లు
మహేశ్వరం: మూడో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కాచెల్లెళ్లు సర్పంచ్లుగా గెలుపొందారు. మండల పరిధిలోని దిలావార్గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సభావత్ మంజుల(అక్క) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోత్వాల్ చెర్వుతండా గ్రామ సర్పంచ్గా జాటోత్ సుజాత(చెల్లి) గెలుపొందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. వీరి పుట్టినిళ్లు దుబ్బచర్ల గ్రామం. మంజుల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలవగా, సుజాత బీఆర్ఎస్ సపోర్ట్తో విజయం సాధించారు. పార్టీలు వేరైనా గ్రామ అభివృద్ధి విషయంలో చర్చించుకుంటామని వారు తెలుపుతున్నారు. సోదరీమణులు గెలవడంతో వారి బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నా విగ్రహావిష్కరణ నేడే!
● బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం ● విభిన్న కార్యక్రమంతో అందరినీ ఆకర్షిస్తున్న ‘అమెరికా ఆదర్శ రైతు’ ● తన వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మొయినాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యవసాయం చేసి, ఆదేశంలో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్న ఓ వ్యక్తి వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.. ఆయనే కళ్లెం నర్సింహారెడ్డి. తాను బతికి ఉండగానే తనతో పాటు తన భార్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కందికల్గేట్కు చెందిన కళ్లెం రాజిరెడ్డి, పెంటమ్మ దంపతులకు 1937లో నర్సింహారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. పుట్టింది రంగారెడ్డి జిల్లా కోహెడలో అయినా.. పెరిగింది అంతా చాంద్రాయణగుట్ట సమీపంలోని కందికల్గేట్లోనే. శాలిబండ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచే వ్యవసాయంపై మక్కువ. నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరంతా అమెరికాలో స్థిరపడటంతో 1975లో ఆయన కూడా అమెరికా వెళ్లారు. అక్కడ ఐదువేల ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 30 ఏళ్ల పాటు వ్యవసాయం చేశారు. రకరకాల పంటలు పండించి ఆదర్శరైతుగా నిలిచారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మాతృభూమిపై మమకారం.. మాతృభూమిపై ఉన్న మమకారంతో 2005లో నర్సింహారెడ్డి తెలంగాణకు వచ్చారు. నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో మూడున్నర ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు పంటలు సాగుచేస్తూనే మరోవైపు పలు సాంస్కృతిక సంఘాలకు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. నీతోడుగా నేనుంటా.. గత ఏడాది డిసెంబర్లోనే తన వ్యవసాయ క్షేత్రంలో నర్సింహారెడ్డి తన భార్యతో కలిసి ఆయన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. కానీ ఈ విగ్రహం బాగోలేదని భావించారు. ఇటీవల తన భార్య మరణించడంతో రాజస్థాన్ వెళ్లి తనతో పాటు భార్య విగ్రహాన్ని తయారు చేయించి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం బంధువులు, స్నేహితుల మధ్య వీటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తన భార్యకు తానెప్పుడూ తోడుగా ఉంటానని, అందుకే ఆమె పక్కనే, తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయించానని చెబుతున్నారు. అందరూ రావాలని బంధువులు, సన్నిహితులను ఆహ్వానించారు. -
కట్టమైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
మొయినాబాద్: అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సురంగల్లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్ పెద్దచెరువు కట్టపై ఉన్న మైసమ్మ దేవాలయంలోని హుండీని దుండగులు రాత్రి వేళ ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బులు దొంగిలించి హుండీని ఆలయం నుంచి 50 మీటర్ల దూరంలో పడేశారు. గురువారం ఉదయం చెరువుకట్టపైకి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది ధ్వంసమైన హుండీని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. స్థానికులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలో సేకరించారు. సురంగల్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద హుండీని దొంగలించడం ఇప్పటికీ మూడోసారి కావడం గమనార్హం. -
నిద్రలోనే నూరేళ్లు నిండాయి
● ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం ● దుకాణంలోకి దూసుకెళ్లిన కారు మైలార్దేవ్పల్లి: అతివేగం.. డ్రైవింగ్లో నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన తండ్రీకొడుకులు అసువులు బాశారు. నిద్రలోనే వారికి నూరేళ్లు నిండాయి. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే యువకుడు తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి శంషాబాద్ నుంచి ఇన్నోవా కారులో తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రభు మహారాజ్ కుటుంబ సభ్యులు దుర్గానగర్ ప్రాంతంలో దుప్పట్లు, రగ్గుల విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు మాదిరిగానే వారు దుకాణంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ (60), దీపక్ (25), సంతునాథ్ (27)పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సంతునాథ్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సయ్యద్ హుస్సేన్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో కారు బీభత్సం సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్
ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు. 19న పట్టుబడిన వాహనాల వేలం ఆమనగల్లు: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా డిపాజిట్ చెల్లించాలని సూచించారు. రోహింగ్యా యువకుడి దారుణ హత్య పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణకు పరిధులు చూడొద్దు నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుస్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డు కాకూడదని నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో(టీజీ ఐసీసీసీ) బుధవారం మూడు కమిషనరేట్లకు సంబంధించి కీలక సమన్వయ సమావేశం సజ్జనర్ అధ్యక్షతన జరిగింది. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అవినాష్ మహంతి, జి.సుధీర్బాబులతో పాటు ఉన్నతాధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేరగాళ్లు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పోలీసులు కాలయాపన చేయడంతో నేరగాళ్లు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా పోలీసులు వెంటనే స్పందించాలన్నారు. రౌడీ షీటర్లు, నేరగాళ్లు తరచూ తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడికి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. -
పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్గా జ్యోతినరేందర్రెడ్డి
కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ ఉప సర్పంచ్గా తాండ్ర జ్యోతినరేందర్రెడ్డి ఎన్నికయ్యారు. తొలి విడతలో భాగంగా ఈనెల 11నసర్పంచ్తో పాటు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తయినా, కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ సమక్షంలో బుధవారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. పది మంది వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ హాజరయ్యారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జ్యోతికి ఐదుగురు వార్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ఉప సర్పంచ్గా ఎన్నికై నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. సీఐ నరహరి బందోబస్తును పర్యవేక్షించారు. 12 మంది ఉప సర్పంచ్ల ఎన్నిక ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గానూ 12 చోట్ల బుధవారం ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. చర్లపటేల్గూడ, ఉప్పరిగూడ ఉప సర్పంచ్ల ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. ఉప సర్పంచ్లు వీరే.. దండుమైలారం జి.విజయలక్ష్మి, కప్పపహాడ్ పి.రమేశ్, కర్ణంగూడ వై.రవిందర్రెడ్డి, ముకునూర్ ఆర్.పావణి, నాగన్పల్లి పి.జంగయ్య, నెర్రపల్లి వేణుగోపాల్రెడ్డి, పోచారం ఎం.కృష్ణ, పోల్కంపల్లి కె.వెంకటేశ్, రాయపోల్ జి.శేఖర్రెడ్డి, తుర్కగూడ ఏనుగు వెంకట్రెడ్డి, తులేకలాన్ డి.జంగయ్య, ఎల్మినేడు ఎం.వెంకటప్రతాప్రెడ్డి ఉప సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ‘గండిపేట’లోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని బుధవారం స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. శివనాయక్కు సంబంధించిన వాహనమని.. హిమాయత్నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు విద్యుత్ అంతరాయం 11 కేవీ ప్యూజ్ సెట్పై ఇనుప తీగను వేసిన గుర్తు తెలియని వ్యక్తి యాచారం: ఎన్నికల వేళ మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో బుధవారం తీవ్ర అంతరాయం కలిగింది. గుర్తు తెలియని వ్యక్తి గ్రామంలోని 11 కేవీ ఫ్యూజ్ సెట్పై ఇనుప తీగను వేశాడు. దీంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాలో రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సరూర్నగర్ డివిజన్ ఎస్ఈ లక్ష్మీనారాయణ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పోలింగ్, కౌటింగ్ వేళ గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. -
హోరాహోరీ!
మహేశ్వరం మండల కేంద్రం వద్ద కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత పంచాయతీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలు బలపర్చిన మద్దతుదారుల మధ్య హోరాహోరీగా సాగాయి. ఏడు మండలాల్లోని 174 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించాయి. ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన కందుకూరు మండలం మీర్ఖాన్పేట సహా బేగరికంచె ఓటర్లు మాత్రం అధికార పార్టీని అంతర్మథనంలోకి నెట్టినప్పటికీ.. మిగతా చోట్ల హస్తం పార్టీకే పట్టం కట్టారు. ఇక యాచారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య ఓటింగ్ నువ్వా.. నేనా అనేలా కొనసాగింది. కందుకూరులో 35 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వీటిలో 12 స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోగా, మరో 13 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు జయకేతనం ఎగరేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి.కిషన్రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి జి.అంజమ్మను గెలిపించుకొని పట్టు నిలుపుకొన్నారు. ఇక ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి స్వగ్రామమైన కొత్తగూడలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొక్క సువర్ణ విజయం సాధించారు. తిమ్మాపూర్ సర్పంచ్ అంజమ్మను కేంద్ర మంత్రి అభినందించారు. మహేశ్వరం మండలంలో 30 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. హస్తం ఖాతాలో 12 స్థానాలు, బీఆర్ఎస్ ఖాతాలో 12 చొప్పున పడ్డాయి. ఐదు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మండలంలో 14 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఎనిమిది చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది. ఒక చోట బీజేపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మళ్లీ తన పట్టు నిలుపుకొన్నారు. మంచాలలో అత్యధికం.. మెట్లో అత్యల్పం మూడో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలి తీవ్రతకు తోడు, విపరీతమైన మంచు కారణంగా ఉదయం మందకొండిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ 11 తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మంచాల, యాచారం, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలోని మొత్తం 174 పంచాయతీలు, 1598 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో పది సర్పంచ్ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు 559 మంది పోటీ పడ్డారు. 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడ్డారు. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,93,852 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,53,371 మంది (86.22 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మహేశ్వరం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. అత్యధిక ఓటింగ్ శాతం మంచాల మండలంలో నమోదు కాగా, అత్యల్ప ఓటింగ్ శాతం అబ్దుల్లాపూర్మెట్లో రికార్డు అయింది. పోలింగ్ శాతం ఇలా..మండలం మొత్తం ఓటర్లు ఓటు వేసిన వారు శాతం అబ్దుల్లాపూర్మెట్ 35,267 27,864 79.01 ఇబ్రహీంపట్నం 31,835 28,502 89.53 కందుకూరు 50,874 44,686 87.84 మాడ్గుల 42,200 36,717 87.01 మహేశ్వరం 44,096 36,416 82.58 మంచాల 39,385 35,739 90.74 యాచారం 50,195 3,447 86.56 మూడో విడతలో గెలుపొందిన ఆయా పార్టీల మద్దతుదారులు ఇలా.. మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు అబ్దుల్లాపూర్మెట్ 07 04 01 02 ఇబ్రహీంపట్నం 05 08 01 – కందుకూరు 13 09 12 01 మాడ్గుల 23 06 – 03 మహేశ్వరం 12 12 05 01 మంచాల 10 08 02 03 యాచారం 10 07 05 02 -
జోక్యం చేసుకోలేం..
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై పిటిషన్ల దాఖలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డుల్ఢసంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీలిమిటేషన్లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్లు బహిర్గతం చేయడంతో వచ్చే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది. వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు మరోరెండు రోజులు అవకాశం ఇచ్చింది (వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది). విభజనలో లోపాలున్నాయన్న పిటిషనర్ల వాదనపై.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించలేదు.. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, మరో ఇద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996 ప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలియాబాద్ ప్రాంతాన్ని రెండు వార్డులుగా విభజించడంతో ప్రజా సౌకర్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ స్థానిక స్వపరిపాలనకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా, జీవో 266 ప్రకారం డీలిమిటేషన్ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అభ్యంతరాలపై రెండ్రోజులు గడువు పెంచిన హైకోర్టు మ్యాప్లు, జనాభా లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం విముఖత విస్తృత అధ్యయనం చేసిన తర్వాతే.. ‘డీలిమిటేషన్ నిబంధనల్లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకూడదు. విభజన తర్వాత వార్డుల జనాభా గణాంకాలను వెల్లడించలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో మ్యాప్లు, సరిహద్దు వివరణ, ఇంటి సంఖ్య వివరాలు లేవు. ఇలా ఉంటే ప్రజలు వార్డు పరిమితులను గుర్తించడం అసాధ్యం. అలాగే ప్రభుత్వం పరిపాలనా, భౌగోళిక సామీప్యతను ఉల్లంఘించింది. కొన్ని వార్డులు బహుళ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రాథమిక నోటిఫికేషన్ను జీహెచ్ఎంసీ ప్రతినిధి జనరల్ బాడీ ముందు సరిగా ఉంచలేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. విస్తృత అధ్యయనం, చర్చల తర్వాత చేపట్టామన్నారు. ‘ఇది ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మున్సిపాలిటీల విస్తరణతో పరిపాలనలో సత్ఫతాలిస్తుంది. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాం. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం’ అని చెప్పారు. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను అర్థవంతంగా పరిగణించలేదని, వార్డుల వారీగా జనాభా డేటాను బహిర్గతం చేయలేదన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. కాగా.. పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, ప్రామాణీకరించిన మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలు రెండు రోజుల వ్యవధిలో మరిన్ని అభ్యంతరాలు లేవనెత్తవచ్చని హైకోర్టు సూచించింది. -
ఆమే కీలకం
● మండలంలోని పది గ్రామాల్లో మహిళా ఓటర్లే అధికం ● సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్న అతివలు ఇబ్రహీంపట్నం: మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు, 140 వార్డులకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31,835 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,780, మహిళలు 16,053 మంది, ఇతరులు ఇద్దరున్నారు. పురుషులకంటే 273 మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఒక్కో ఓటు కీలకమే.. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. అవే ఫలితాలను తారుమారు చేస్తాయి. ఏ ఒక్క ఓటు చేజారకుండా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేశారు. అతి తక్కువగా కర్ణంగూడలో .. మండలంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కర్ణంగూడ. ఈ గ్రామంలో కేవలం 697 మంది ఓటర్లే ఉండటం గమనార్హం. అదేవిధంగా అత్యధికంగా దండుమైలారంలో 4,959 మంది ఉన్నారు. సుమారు రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికల కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గెలవడం ఓ పరీక్షలా మారింది. అంగ, అర్థ, బంధు బలగాలతో ప్రచారంతోపాటు, ఓటర్లకు తాయిలాలను సమర్పించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలతో పంచాయతీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇక ఓటర్ల తీర్పు ఏరకంగా ఉంటుందో వేచిచూడాల్సిందే. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు గ్రామపంచాయతీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం చర్లపటేల్ గూడ 951 941 – 1,892 దండుమైలారం 2,456 2,503 – 4,959 ఎలిమినేడు 1,653 1,734 – 3,387 కప్పపహాడ్ 909 935 – 1,844 కర్ణంగూడ 339 358 – 697 ముకునూర్ 591 579 1 1,171 నాగన్పల్లి 865 864 1 1,730 నెర్రపల్లి 710 542 – 1,052 పోచారం 1,083 1,088 – 2,171 పోల్కంపల్లి 1,646 1610 – 3,256 రాయపోల్ 2,475 2,481 – 4,956 తుర్కగూడ 505 546 – 1,051 తులేకలాన్ 942 1,000 – 1,942 ఉప్పరిగూడ 855 872 – 1,727 -
కన్నతల్లే కర్కశురాలై
● అపార్ట్మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన వైనం ● అక్కడికక్కడే మృతిచెందిన ఏడేళ్ల చిన్నారి మల్కాజిగిరి: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెల్పిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విన్పిస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం
కడ్తాల్: చరికొండకు చెందిన పాలకూర్ల లక్ష్మమ్మ–రాములుగౌడ్ కుటుంబం 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. లక్ష్మమ్మ 1996లో తొలి సారి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2006లో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయంసాధించారు. అనంతరం ఆమె భర్త రాములుగౌడ్ 2019లో ఎంపీటీసీ సభ్యుడిగా సేవలు చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వీరి కుమారుడు మహేందర్గౌడ్ సర్పంచ్గా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. నాడు తనయుడు.. నేడు తల్లి కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రా మంలో రెండు పర్యాయాలు ఉత్కంఠగా సాగిన పోరులో నాడు తనయుడు, నేడు తల్లికి సర్పంచ్ పదవులు వరించాయి. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన నాయిని నరేందర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు. 2019లో బీసీలకు రిజర్వ్ కావడంతో ఆయన పోటీ చేయడం కుదరలేదు. ఇటీవల ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో నాయిని నరేందర్ తల్లి యశోధ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు రేవల్లి మల్లమ్మపై 44 ఓట్లతో విజయం సాధించారు. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించిన దంపతులు కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్నాయక్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్నాయక్ సతిమణి నీలావతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు అభినందనలు -
పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్యచేవెళ్ల: స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రావుపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్యగౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించి.. స్వీట్లు తినిపించారు. ఆయనను కలిసిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, ఉపసర్పంచ్ అనూషఅంజన్కుమార్, వార్డుసభ్యులు మల్లీశ్వరి, జ్యోతి వెంకటేశ్, గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ప్రకాశ్రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక.. మండలంలోని నాల్యట గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎల్లయ్య, తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాలట గ్రామ నాయకులు, యవకులు ఉన్నారు. -
దొంగ ఓట్లు వేసినా పట్టించుకోలేదు
ఓటమిపాలైన అభ్యర్థుల ఆవేదన మొయినాబాద్ రూరల్: మండల పరిధిలోని కుత్బుద్దీన్గూడలో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని రిటర్నింగ్ అధికారులు, పోలీసులకు అప్పగించినా పట్టించుకోలేదని ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ముజాహిద్ఆలీ, మిరాజుద్దీన్ ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కుత్బుద్దీన్గూడలో 1,725 మంది ఓటర్లు ఉన్నారని, ఈనెల 14న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 1,404 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సమయంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిలో సుమారు పది మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కొద్దిసేపటి తర్వాత వదిలేశారని పేర్కొన్నారు. యూఎస్, దుబాయ్లో ఉన్న వారి పేర్లతో ఇతరులు వచ్చి ఓట్లు వేశారన్నారు. ఓటరు జాబితాలోని చాలా మంది హైదరాబాద్లో ఉంటారని, వీరి పేరుతో నగరం వచ్చిన వారిలో చాలా మంది దొంగ ఓట్లు వేశారని తెలిపారు. భోజనం చేస్తూ వ్యక్తి మృతి షాబాద్: భోజనం చేస్తుండగా గొంతులో అన్నం ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్కు చెందిన చిల్కమర్రి జంగయ్య (50) సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా సరం పడింది. ఆయాస పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణం వదిలాడు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్గౌడ్, సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రాహుల్ గుప్త బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. గొడవలకు కారణమైన పలువురి బైండోవర్ చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు చేవెళ్ల ఎస్ఐ సంతోష్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం 13 మందిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కృష్ణయ్య ఎదుట బైండోవర్ చేశామన్నారు. గత 14న సింగప్పగూడలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి తరఫు వ్యక్తులు, గెలపొందిన సర్పంచ్ మద్దతుదారుడు వెంకటేశ్వర్రెడ్డిపై దాడి చేశారు. ఈకేసుతో సంబంధం ఉన్న వారిని బైండోవర్ చేసి, రూ.5 లక్షల పూచీకత్తుపై వదిలేశామన్నారు. కేసు నమోదైన వారిలో షేక్ ఫయాస్, అలీ హస్నన్, ములుగు ప్రమోద్రెడ్డి, మహమ్మద్ అర్షద్, ఎండీ ఆదిల్, ఎండీ ఫెరోజ్, ఎండీ అద్నాన్, ఎండీ సల్మాన్, అస్లాం, ఆరిఫ్, జాఫర్పాషా, రవికిరణ్రెడ్డి, ఎండీ సుమేర్ ఉన్నట్లు తెలిపారు. ఎయిర్హోస్టెస్తో అసభ్య ప్రవర్తన అబిడ్స్ పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపుఅబిడ్స్: అబిడ్స్ పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సంస్థ అబిడ్స్ పోలీస్స్టేషన్కు 2025 గుర్తింపునిచ్చింది. సంస్థ ప్రతినిధులు అబిడ్స్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ ఇమాన్యుయేల్కు సర్టిఫికెట్ను అందజేసి ప్రశంసించారు. ఈ పోలీస్స్టేషన్లో సిబ్బంది పనితీరు, రిసెప్షనిస్ట్ సేవలు, పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల ప్రవర్తించే విధానాలు, పోలీస్స్టేషన్లో పరిశుభ్రత, స్టేషన్లో స్బింది ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని ఐఎస్ఓ అంతర్జాతీయ సంస్థ గుర్తింపు ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇమాన్యుయేల్ మాట్లాడతూ...పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సరైన న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమ సిబ్బంది, ఎస్ఐలు, అందరి కృషి తోనే ఈ గుర్తింపు లభించందన్నారు. -
కేఎల్హెచ్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలు
మొయినాబాద్: నూతన ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యంలో విద్యార్థుల ప్రతిభకు ‘ఐడియా ఎక్స్ప్రో 2025’ వేదికగా నిలిచింది. అజీజ్నగర్ రెవెన్యూలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో డిజైనింగ్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియా ఎక్స్ప్రో 2025 ఘనంగా నిర్వహించారు. తొలి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ(ఏఐ), సమాచార సాంకేతికత, సామాజిక ఆవిష్కరణ వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ వైస్ చైర్మన్ మిహిర్కుమార్ పరియాల్, సీఎస్ఆర్, ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సుదర్శనం, ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న బ్యాగు ప్రయాణికుడికి అప్పగింత -
అప్రమత్తంగా ఉండాలి
మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్ల్లోకి అనుమతించొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
విభజనపై రగడ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వార్డుల (కార్పొరే టర్ల డివిజన్ల) డీలిమిటేషన్పై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అడ్డగోలుగా చేశారని, కనీసం మేయర్కు తైలియకుండానే చేయడంలో ఆంతర్యమేటని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యాల కోసం డీలిమిటేషన్ అని చెబుతూ.. ప్రజలు, ప్రజాప్రతినిధులకు సైతం తెలియకుండా గోప్యంగా, త్వరితంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రెండు పార్టీ లకు అనుకూలంగా ఉండేలా చేశారని ఆరోపించారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో డీలిమిటేషన్ చేశారంటూ బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ సభ్యులు డీలిమిటేషన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్, మ్యాపుల పత్రాల్ని చించి సభలో విసిరేశారు. సభ ప్రారంభం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, సాయంత్రానికి తీవ్ర గందరగోళానికి దారి తీయడంతో మేయర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సభ్యుల అభ్యంతరాలు, సూచనలన్నీ నోట్ చేసుకున్న కమిషనర్ వాటిని సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివే దించాల్సిందిగా సూచించారు. సభ వాయిదా అనంతరం బీజేపీ సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విస్తీర్ణం పెరిగితే చాలదు కేవలం గూగుల్ మ్యాపులు, ల్యాప్టాప్లతో పని చేశారని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ (బీఆర్ఎస్) పునరుద్ఘాటించారు. దేశంలోనే పెద్దదిగా చూపేందుకు.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండా కేవలం విస్తీర్ణం పెంపుతోనే డీలిమిటేషన్ చేయడం తగ దన్నారు. కనీసం మేయర్, డిప్యూటీ మేయర్లకు కూడా తెలియకుండా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గతంలో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం జీవో జారీతో డీలిమిటేషన్ చేశా రని గుర్తుచేశారు. డీలిమిటేషన్ సైంటిఫిక్గా ఉండాలని, ప్రజాప్రతినిధులతో మేయర్ కానీ, కమిషనర్ కానీ మరోమారు సమావేశం నిర్వహించాలని కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ.. ఇది కేవలం పరిపాలనపరంగా తీసుకున్న నిర్ణయమని, 2011 తర్వాత జనాభా లెక్కలే సేకరించలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన వార్డులను విభజించారంటూ, ఇది ఎంఐఎంకు నష్టం కలిగించేందుకు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 12 మున్సిపాలిటీలు విలీనమయ్యాక రెండేళ్ల వరకు ఎన్నికలు జరగలేదని, ఆలోగా వందల కోట్లతో శివార్లలో మౌలికవసతుల పనులు జరిగాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, రాజీవ్గాంధీ తెచ్చిన 74వ రాజ్యాంగసవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజలతో, స్థానికసంస్థలతో సంబంధం లేకుండా చేస్తున్నారని తప్పుబట్టారు. తీవ్ర అభ్యంతరాలు పార్టీలకతీతంగా పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం కార్పొరేటర్లకు తెలియకుండా చేశారని, కొన్ని వార్డులు ముగ్గురి ఎమ్మెల్యేల పరిధిలోకి వెళ్లాయని, ఐదేళ్లుగా తాము ఎంతో కష్టపడి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రాంతాలు ఇప్పుడు తమ పరిధిలో లేకుండా పోతుండటంతో తమ ఓటర్లు మారి తమకు తీవ్ర నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వార్డునే కొత్తప్రాంతానికి మార్చడంతో తమ ముఖం ఎవరికి తెలుసని కొందరు ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వార్డులు, కొన్ని చోట్ల తక్కువ వార్డులు చేయడంపై కాంగ్రెస్–ఎంఐఎం పొత్తు ఉందని తమకు అనుమానంగా ఉందని బీజేపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీలకతీతంగా ప్రాథమిక నోటిఫికేషన్కు ముందుగానే సమావేశాలు నిర్వహించాల్సిందని, కమిటీలు వేయాల్సిందని అన్నారు. -
ఉపాధి హామీ పేరు మార్చడం సరికాదు
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ మొయినాబాద్ రూరల్: మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ సర్కార్పై పోరాటం తప్పదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధిస్తున్నారని తెలిపారు. -
ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి
తుక్కుగూడ: కుష్టు వ్యాధి నివారణ కోసం ఇంటింటికీ తిరిగి, ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి అన్నారు. కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మంగళవారం వైద్య సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్న వారిని దగ్గరలోని ఆరో గ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య ఉప అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పార మెడికల్ అధికారి సులోచన, సిబ్బంది పాల్గొన్నారు. కేన్సర్ వ్యాక్సిన్ అందించాలి 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ గర్భాశయ కేన్సర్ వ్యాక్సిన్ అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం హ్యూ మన్ పాపిలోనా వైరస్ వ్యాక్సిన్పై వైద్య సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యా క్సిన్ను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందిస్తోందని, అర్హులైన ఆడపిల్లలందరికీ ఒక డోస్ చొప్పున ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టీపీఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి షాద్నగర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ ప్రభాకర్ కోరారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం టీపీఎఫ్ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోకన్వీనర్ అర్జునప్ప, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య, ప్రజా కళామండలి జిల్లా కన్వీనర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం షాద్నగర్రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన తదితరులు పాల్గొన్నారు. రేపు మెగా హెల్త్ క్యాంపు మీర్పేట: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టీకేఆర్ వాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ శాలివాహన లయన్స్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18న (గురువారం) మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లోని అక్షర టెక్నో స్కూల్లో మలక్పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించే హెల్త్క్యాంప్కు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
విద్యతోనే మార్పు సాధ్యం
మంచాల: విద్యతోనే మార్పు సాధ్యమని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకే ప్రాంగణంలో ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండడంతో అప్గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్నల్ రోడ్లు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్రావు, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ వెంకట ప్రసాద్, ఎంఈఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ క్షణం కీలకమే
అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ అబ్దుల్లాపూర్మెట్: మూడో విడతలో భాగంగా బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం నుంచే మొదలైన డబ్బు, మద్యం, మాంసం, తాయిలాల పంపిణీ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆతర్వాతి ప్రతీ క్షణం కూడా ఎంతో ముఖ్యమైనదని, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనేక అంశాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మేజర్ గ్రామపంచాతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులెవరూ ఖర్చుకు వెనకాడకుండా, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆ ఊర్లలో నోట్ల వర్షం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బలిజగూడ, ఇనాంగూడ, బాటసింగారం, జాఫర్గూడ, మజీద్పూర్, లష్కర్గూడ, దేశ్ముఖి, గుంతపల్లి, అనాజ్పూర్ గ్రామాల్లో ఓటర్లకు నోట్ల వర్షం కురుస్తోంది. బలిజగూడలో ఒక్కో ఓటరుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అందినట్లు తెలుస్తోంది. బరిలో ఉన్నవారందరూ లెక్క పెట్టకుండా డబ్బులు పంచడంతో ఓటర్ల పంట పండుతోంది. మజీద్పూర్లో వరుసకు తోటికోడళ్లు ముగ్గురు, జాఫర్గూడలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. యువత, వలస ఓట్లే కీలకం మొదటి, రెండో దశ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో యువత, వలస ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపారు. తుది విడతలోనూ చాలా చోట్ల వారే కీలకంగా మారనున్నారు. దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము బలపర్చిన వారికే ఈ ఓట్లు పడేలా రాజకీయ పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. -
నేడే తీన్మార్
ఇబ్రహీంపట్నం: డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బంది సాక్షి,రంగారెడ్డిజిల్లా/ఇబ్రహీంపట్నం: మూడో విడ త పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని 5 మండలాలు, కందుకూరు డివిజన్లోని 2 మండలాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికేపోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోసం 1,969 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,809 మంది ఓపీఓలు, 55 మంది జోనల్ అధికారులు, 42 మంది ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, 193 మంది ఆర్ఓలు, 21 మంది మండల పర్యవేక్షణ అధికారులు, 22 ఎంసీసీ బృందాలు, 21 వ్యయ బృందాలు విధుల్లో పాల్గొంటున్నాయి. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 174 పంచాయతీలు, 1,598 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 10 సర్పంచ్ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు 559 మంది, 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 30 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 24 మంది మైక్రో అబ్జర్వర్లను ఇందు కోసం నియమించారు. ఉప సర్పంచ్ల ఎన్నిక పక్రియ అదేరోజు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడి కాగానే ఉప సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఒకవేళ అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజ ఉంటుంది. అప్పటికీ తేలకుంటే మరోమారు ఎన్నిక ప్రక్రియను చేపడతారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు మూడో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్క అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏ చిన్నపొరపాటుకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం మంచాల మండలంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించాారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. మొదటి, రెండో విడతలో ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన 125 మంది ఉద్యోగులపై ఇప్పటికే చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న మండలాలు : 7 పోలింగ్ జరిగే పంచాయతీలు : 163 పోలింగ్ నిర్వహించే వార్డులు : 1,448 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 559 పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు : 4,091 పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఎన్నికలు జరిగే మండలాలు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మూడో విడత పల్లె పోరుకు సర్వం సిద్ధం -
విజేతలెవరో?
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఉంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజేతలెవరో తేలి పోనుంది. అలుపెరుగని ప్రచారం వారం రోజులుగా ఇంటింటికీ, గడపడపకూ తిరిగి అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టంలో ఎవ్వరినీ కాదనకుండా హామీల వర్షం గుప్పించారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు, ఆకట్టుకునేందుకు మందు, విందు, గిఫ్ట్లు, నగదు చెల్లింపులు చేశారు. ప్రత్యర్థి అంత ఇచ్చాడంటే దానికంటే కొంత ఎక్కువిచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ తాయిలాలు సమర్పించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు వెచ్చించినట్టు సమాచారం. పైకి గంభీరంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మత్రం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆదరించేనా.. తిరస్కరించేనా.. లక్షలు ఖర్చు చేసినా ఓటర్లు తమను ఆదరిస్తారా.. అందలం ఎక్కిస్తారో లేదోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. శతవిధాలా ప్రయత్నించినా ఓటరు నాడిని మాత్రం పసిగట్టలేకపోయారు. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో.. ఓటరు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయోనని టెన్షన్తో గడుపుతున్నారు. ఏలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని రప్పించి ఓట్లు వేసేవిధంగా ఎవరికివారే ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రత్యేక సదుపాయాలు, ప్యాకేజీలు సమర్పించారు. కొన్నిచోట్ల తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. బుధవారం సాయంత్రంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్లు ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరికి పట్టం కడతారో తేటతెల్లం కానుంది. -
యువకుడి దారుణ హత్య
గోల్కొండ: తమ్ముడితో తగాదపడుతున్న వారిని వారించబోయిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి టోలిచౌకీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ తెలిపిన మేరకు.. హకీంపేట్ విరాట్నగర్ కుంటకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్(24) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం ఇతను కాలేజీ నుంచి వచ్చిన తరువాత ఆటో నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో తన తమ్ముడు అద్నాన్నుపై పారమౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4 వద్ద కొందరు యువకులు దాడి చేస్తునట్లు తెలిసింది.వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి వారిని వారించాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్పై బిలాల్ తన స్నేహితులతో దాడి చేశాడు. బిలాల్ తన వద్ద ఉన్న కత్తితో ఇర్ఫాన్ను చాతి, మెడ కింది భాగం, కడుపులో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడు. ఇర్ఫాన్ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి కేపీహెచ్బీకాలనీ: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఉమర్ ఫరూక్ కేపీహెచ్బీ కాలనీలోని హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అతని స్నేహతుడు షేక్ సుల్తాన్ బాషాతో కలిసి బైక్ మీద హౌసింగ్ బోర్డు నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్నారు. లులు మాల్ ఫ్లై ఓవర్ వద్ద ముందు వెళుతున్న హోండా కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగడంతో వెనుక ఉన్న మరో డిజైర్ కారు కూడా ఆగి నెమ్మదిగా వెళుతోంది. ఈ క్రమంల బైక్ అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా షేక్ ఉమర్ ఫరూక్ మృతి చెందగా షేక్ సుల్తాన్ భాషా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఫరూక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజులు..126 కెమెరాలు.. నిందితులను పట్టించిన నిఘా నేత్రం బంజారాహిల్స్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ఖరీదైన నగలు, నగదు ఉన్న బ్యాగ్ను దారి మధ్యలో పోగొట్టుకోగా, బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు ఆరు రోజులు కష్టపడి 126 కెమెరాలను వడబోసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–11లో నివసించే స్వాతి అగర్వాల్ (41) ఈ–కామర్స్లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల వేళ ఆమె బ్యాంక్లో డబ్బులు జమ చేయడానికి బైక్పై వెళ్తూ తన హ్యాండ్బ్యాగ్ను కాళ్ల వద్ద ఉంచుకుంది. రోడ్డునెంబర్–12లో బ్యాగ్ కింద పడిపోగా, ఆమె గమనించలేదు. అదే సమయంలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు కారులో వెళ్తుండగా బ్యాగ్ కనిపించింది. డ్రైవర్ కారు ఆపి ఆ బ్యాగ్ను తీసుకుని వైద్యురాలికి ఇచ్చాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కొద్దిదూరం ఆమెను అనుసరించి బైక్ అడ్డంగా నిలిపి కారును ఆపారు. బాధితురాలు మినిస్టర్ క్వార్టర్స్ సమీపంలో ఏడుస్తూ కూర్చొన్నదని, ఆమెకు ఇస్తామని చెప్పి వైద్యురాలి దగ్గరున్న బ్యాగ్ను తీసుకుని ఉడాయించారు. అదే రోజు రాత్రి బాధితురాలు స్వాతి అగర్వాల్ తాను బ్యాగ్ పోగొట్టుకున్నానని, అందులో డైమండ్ పెండెంట్, బంగారు గాజులు, చెవి రింగులు, మూడు సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులు, ఇతర ధ్రువపత్రాలు ఉన్నాయని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దారిలోని సీసీ కెమెరాలు వడబోస్తూ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లో ఆ యువకుల బైక్ నెంబర్ను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ను సేకరించి బోరబండలో నిందితులు సయ్యద్ పర్హాన్ (27), మహ్మద్ మోసిన్ (26)ను పట్టుకుని బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సత్తాచాటారు సర్పంచ్లయ్యారు
శంకర్పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మద్దతుదారాలు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచు ఎన్నికపై విచారణ జరపాలి కలెక్టర్కు అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదుతాండూరు రూరల్: మండల పరిధి అంతారం సర్పంచు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని సర్పంచ్ అభ్యర్థి బుడుగ జంగం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనమాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరుఫున 7 వార్డులు గెలిచామని తెలిపారు. విజయం సాధించిన వారికి కౌంటింగ్ రోజు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆర్ఓ నిరాకరించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ధ్రువపత్రాలతో పాటు.. ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించారని వివరించారు. ఆర్ఓ ప్రవర్థన సరిగ్గా లేదని,ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిఆరోపించారు. అలాగే ఓట్ల లెక్కింపు తుది దశ వరకు తానే గెలుపు దిశగా ఉండగా.. కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయారని ఆర్ఓ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని వాపోయారు. సర్పంచు ఎన్నికతో పాటు.. ఆర్ఓ పాత్రపైపూర్తి విచారణ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
షూటింగ్ బాల్ విజేత వరంగల్
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యాక్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాల మైదానంలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహద పడతాయన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం టోర్నీ నిర్వహణ కార్యదర్శి ఎం.రాములు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులు జనవరి చివరి వారంలో ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్క్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి, పీడీ గౌరీశంకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, సీహెచ్ రాములు, ఆంజనేయులు, రాము, రవీందర్ రెడ్డి, శరణ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రాములు తదితరులు పాల్గొన్నారు.ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం -
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి, నర్సాయిపల్లి, మాడ్గుల, రామ్దుగ్యాల గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొల్కులపల్లిలో అభ్యర్థి బట్టు అనురాధతో కలిసి భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, సామాజిక న్యాయం, నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్రెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, నాయకులు కొండల్రెడ్డి, రమేశ్రెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
రూ.10 కోట్ల మద్యం పంచేశారు!
శంకర్పల్లి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో లక్షలాది రూపాయల సరుకు తీసుకెళ్తున్నా.. ఎక్కడికి, ఎందుకు వెళ్తుందోనని కూడా చూడటం లేదు. ఎవరైనా ఈవిషయాన్ని అడిగినా అదేం లేదు.. అని చెబుతుండటం గమనార్హం. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రూ.10 కోట్ల వరకు మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిత్యం పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నియ మావళి ప్రకారం అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ప్రలోభ పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అర్ధరాత్రి అనుకున్న చోటికి.. శంకర్పల్లి మండల పరిధిలో మొత్తం పది మద్యం దుకాణాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువుగా ఉన్న షాపుల యజమానులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి తరఫు వారు కాకుండా, షాపులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అర్ధరాత్రి వేళ అనుకున్న చోటికి తరలించారు. ఇవన్నీ గమనిస్తున్న పోలీసులు దుకాణదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. తనిఖీలు, కేసులు అంతంతే.. మండలంలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవి తూతూమంత్రంగానే పని చేశాయి. పలు గ్రామాల్లో మద్యం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ.. పోలీసులు మాకేంటి అన్న విధంగా వ్యవహరించారని అభ్యర్థుల మద్దతుదారులు వాపోయారు. మరికొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడితే, పరిచయం ఉన్న నాయకులు ఫోన్లు చేయడంతో కొంత మేర పట్టుకున్న కేసులు నమోదు చేసి మమ అనిపించారు. ‘ఫ్రెండ్లీ’గా వ్యవహరించిన పోలీసులు నేతల ఒత్తిళ్లకు లొంగి.. నామమాత్రపు తనిఖీలతో సరి -
కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’
షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యారాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్కు చెరో స్థానం దక్కింది. ఒక్క ఓటు తేడాతో విజయం కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్నాయక్కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్కుమార్కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్నాయక్ విజయం సాధించారు. పంచాయతీ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ షాబాద్: గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నల్లటి పొగ రావడంతో స్థానికులు గమనించి పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని తెలిపారు. -
కన్హాలో ఏపీ సీఎం సందడి
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ పటేల్తో కలిసి ఆశ్రమ పరిసరాలను పరిశీలించారు. శాంతివనంలోని పచ్చదనాన్ని, బాయోచార్, రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలతో పాటు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు కన్హాకు వచ్చిన చంద్రబాబు సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఆశ్రమంలోని ప్రతీ అంశాన్ని ధ్యాన గురువు కమ్లేష్ పటేల్ను అడిగి తెలుసుకున్నారు. కన్హాలో పచ్చదనం బాగుందని, ఏపీలో సైతం కన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కాగా చంద్రబాబు కన్హాను సందర్శించేందుకు వచ్చిన విషయం తెలిసిన మీడియా కన్హా ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. వ్యక్తిగత పర్యటన అని చెప్పారు. శాంతివనంలో పచ్చదనం బాగుందని కితాబు మీడియాకు అనుమతి ఇవ్వని నిర్వాహకులు వ్యక్తిగత కార్యక్రమమని వెల్లడి -
ఎలా ఓడామబ్బా..!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొంతమంది అభ్యర్థుల అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు ఓటమిపాలై నైరాశ్యంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి వచ్చిన ఫలితాల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలగా ఓటమి పాలైన వారు, వారి మద్దతుదారులు నిరాశతో కనిపించారు. గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు రిజర్వేషన్లు కలిసి రావడంతో పంచాయతీ బరిలోకి దిగారు. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. అయినా గెలుపు అంచులకు చేరుకోలేకపోయారు. దీంతో ఎలా ఓడిపోయామా అని అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఆలోచనలో పడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఏం తక్కువ చేశాం.. ఓటర్లు ఎందుకు విశ్వసించలేదనే ఆలోచన ఒకవైపు.. ఖర్చుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని మరోవైపు అంతర్మథనంలో మునిగిపోయారు. ఎవరి అంచనాలకు అందని విధంగా ఆయా గ్రామాల్లో ఓటర్లు తీర్పిచ్చి షాకిచ్చారు. ఎక్కడా ఓటర్లు తమకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించలేదని, అయినా ఎలా ఓటమి పాలయ్యామా అని పలువురు అభ్యర్థులు విశ్లేషణ చేస్తున్నారు. కొందరైతే ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో స్థాయికి మించి ఖర్చు పెట్టారు. చేతిలో డబ్బులు లేని వారు ఆస్తులను తాకట్టుపెట్టి, వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సర్పంచ్గా పోటీ చేశారు. ఓటమి పాలు కావడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు పలువురు కంటతడి పెట్టారు. ప్రలోభాలకు గురిచేసినా.. నాయకులంతా ఏకమై ప్రత్యర్థిని ఒంటరి చేసిన అనేక గ్రామాల్లో ప్రత్యర్థి వైపే ఓటర్లు నిలబడి గెలిపించారు. హంగు ఆర్భాటాలు, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీకి ఎక్కడా ఓటరు అనుకూలంగా తీర్పు వెల్లడించలేదని ఈ ఫలితాలతో రుజువయ్యింది. డబ్బులు, మద్యం పంచి ఎలాగైనా గెలవాలనుకుని ప్రలోభాలకు గురి చేసినా ఫలితం లేకపోవడం చెంపపెట్టుగా మారింది. కొన్నిచోట్ల ఇద్దరు అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేయాలనుకున్న వారికే వేసి.. తీర్పు ఇవ్వాలనుకున్న వారికే ఇచ్చారు. కొన్ని పంచాయతీల్లో అయితే వార్డు సభ్యులకు ఒకవైపు సర్పంచ్లకు మరో వైపు అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అభ్యర్థుల అంతర్మథనం ఓటమిపాలైన వారిలో నైరాశ్యం డబ్బులు, మద్యం పంచినా ఓటర్లు అదరించలేదని ఆవేదన ఎన్నికల ఖర్చుతో అప్పులపాలైన అభ్యర్థుల నిట్టూర్పు -
ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి బట్టు ధర్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్పార్టీ అమలు సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం మాయమాటలు చెబుతూ ప్రజలను వంచిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ -
ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్ జాగ్రత్త
శంకర్పల్లి: ప్రైవేటు బ్యాంకులు ప్రజలకు వి రి విగా రుణాలిస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ ఇన్నోవేటివ్ హాబ్ సీఈఓ రాజేశ్ బన్సాల్ సూచించారు. దొంతాన్పల్లిలో ని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్యాంకింగ్ సదస్సుకు సోమవారం ఆయన, విశ్వవిద్యాలయ కులపతి, ఆర్బీఐ మాజీ గవర్నర్ డా. సి. రంగరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్బీఐలో పనిచేసి, పదవీ విరమణ పొందిన నిపుణులు రాసిన పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మ్యూచువల్ ఫండ్ తదితర ఆర్థికపరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పురోభివృద్ధిని మారుస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. సదస్సులో ఇక్ఫాయ్ సొసైటీ చైర్పర్సన్ శోభా రాణి యశస్వి, ఉప కులపతి డా. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన నియామకం ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి నియమితులయ్యారు. శంషాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేర కు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పురుషోత్తంరెడ్డిని నియమించి ఘనంగా సత్కరించారు. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్ బీజేపీ నాయకులు సోమ వారం కమిషనర్ కర్ణన్ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత జనాభా లెక్కల ప్రకారం కాకుండా, కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బచ్చిగళ్ల రమేష్, నాయకులు కొత్త రాంరెడ్డి, సానెం అర్జున్ గౌడ్, కొండ్రు పురుషోత్తం, అనిల్ కుమార్, బిందు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జూకి ‘వంతారా’ కంగారూలు చార్మినార్: నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శ నశాలకు త్వరలో కంగారూలు రానున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా గుజరాత్లోని వంతారా జూ నుంచి ఇక్కడికి ఒక జతను రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. జాంనగర్లోని రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ప్రపంచ వన్య ప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా అధికారులతో జంతువుల మార్పిడి కింద కంగారూలను రప్పించడం కోసం జరుగుతున్న చర్చలు ఫలిస్తే.. మన సందర్శకులకు కంగారూలు కనువిందు చేయనున్నాయి. గత 2020లో జపాన్ జూ పార్కు నుంచి రెండు జతల కంగారూలను రప్పించడం కోసం ఇక్కడి జూ పార్కులో ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఈ డీల్ కుదరకపోవడంతో..తిరిగి ఇప్పుడు వంతారా జూ పార్కు అధికారులతో సెంట్రల్ జూ అథారిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కంగారూల కోసం ఎన్క్లోజర్లు సిద్ధంగా ఉన్నాయి. కంగారూలను మనం తెచ్చుకుంటే.. జంతు మార్పి డిలో భాగంగా మనం ఒక ఏనుగును (మగ/ఆడ) వారికి ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత జూ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే జంతు మార్పిడిలో భాగంగా రెండు నెలల క్రితం 20 జతల మూసిక జింకలను ఇచ్చి ఒక జత జీబ్రాలను రప్పించుకోగా.. అవి వారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. -
నిన్న కళకళ.. నేడు వెలవెల
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజలు, విద్యార్థుల సందర్శనార్థం 10 నుంచి 13వతేదీ వరకు అనుమతించారు. ఈ నెల 13తో సమ్మిట్ పూర్తవడంతో తాత్కాలిక నిర్మాణాలను కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా డిజిటల్ స్క్రీన్లు, రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలు, వీఐపీల రాకతో సందడిగా మారిన ప్రాంగణం ప్రస్తుతంచిన్నబోయింది. అబ్బురపరిచిన డిజిటల్ వాల్ ఇలా.. తొలగిస్తున్న తాత్కాలిక నిర్మాణాలు -
‘మూడు’లో మూగబోయిన మైకులు
ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. వారం రోజులుగా పల్లెల్లో హోరెత్తిన మైకులు మూగబోయి, నిశబ్ద వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. అభ్యర్థుల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది. రేపే 73 గ్రామాల్లో ఎన్నికలు ఈనెల 17న (బుధవారం) డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 73 పంచాయతీల సర్పంచ్, 694 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 14 సర్పంచ్, 140 వార్డులకు.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 13 సర్పంచ్, 129 వార్డులకు.. యాచారం మండలంలో 24 సర్పంచ్, 220 వార్డులకు.. మంచాల మండలంలో 22 సర్పంచ్, 205 వార్డులకు పోలింగ్ జరుగనుంది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పెగ్లిపూర్, మంచాల మండలంలోని కొర్రవాణి తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డివిజన్ పరిధిలో 32 మంది వార్డు సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. పోలీసు బందోబస్తు.. ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీ సు బలగాలు మోహరించనున్నాయి. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఓటర్ జాబితా, బాక్స్లు సీల్ చేసే తదితర పోలింగ్ సామగ్రిని, సిబ్బందిని ఆయా గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన జెడ్పీ సీఈఓ ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రి పంపిణీకి ప్రత్యేకంగా టెంట్లు వేసి సిద్ధం చేశారు. అదనంగా బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సోమవారం కూడా కొనసాగింది. గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి మాడ్గుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమ వారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ రూపొందించిన హ్యాండ్బుక్ను ప్రతి పీఓ, ఏపీఓ తప్పకుండా చదివి నిబంధనలు పాటించాలని సూచించారు. పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధి విధానాలు, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టే అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
ఇబ్రహీంపట్నం: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి సూచించారు. మండలంలోని తులేకాలన్ గ్రామాన్ని సోమవారం సందర్శించిన ఆయన ఓటర్లు, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ ఎం.మహేందర్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు యాచారం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమ వారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మీరాఖాన్పేట, యాచారం, గునుగల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహే శ్వరం డివిజన్ డీసీపీ పరిధిలో 471 మందిని బైండోవర్ చేసినట్లు, తనిఖీల్లో 1,800 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా 1,200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల సీఐలు నందీశ్వర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి -
ఖర్చులకు కటకట!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల నిర్వహణ ఖర్చులు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారాయి. ఓటర్ల జాబితా, నామినేషన్ పత్రాలు జీరాక్సులు సహా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, టెంట్లు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భోజనాలకు కటకట తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అవుతున్న ఖర్చులకు.. ఎన్నికల కమిషన్ విదిల్చిన నిధులకు పొంతనే లేదు. ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో ఆయా ఖర్చులను ఎంపీడీ ఓలు, కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశంతో నోటిఫికేషన్ తరచూ వాయిదా పడటంతో ఆమేరకు ఓటర్ల జాబితా సహా నామినేషన్ పత్రాలను కూడా మార్చాల్సి వచ్చింది. ఒక్కో వార్డు, గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాను రెండు మూడు సార్లు మార్చారు. కేవలం జీరాక్స్ కాపీలకే ఒక్కో ఎంపీడీఓ పరిధిలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఒక్కో ఎంపీడీఓకు ఇప్పటి వరకు రూ.రెండున్నర లక్షలకు మించి ఇవ్వలేదు. మండల స్థాయిలోని ఖర్చులను పరిగణలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పంచాయతీలకు చెల్లించాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన మొత్తం మండల పరిధిలోనే ఖర్చుకావడంతో పంచాయతీలకు నిధులు చేరలేదు. ఆయా ఏర్పా ట్లకు అవసరమైన నిధులను కార్యదర్శులే సమకూర్చాల్సి వచ్చింది. ఏర్పాట్ల బాధ్యత వారిపైనే.. జిల్లాలో 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 174 పంచాయతీలు, 1,530 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించగా, రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు 14న పోలింగ్ నిర్వహించారు. మూడో విడతలో 174 పంచాయతీలు, 1,598 వార్డులకు 17న ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి విడతలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సహా ఆర్ఓలు, ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, ఎంసీసీలు, భద్రతా సిబ్బంది కలిపి మొత్తం 4,500 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన సహా రిటర్నింగ్ అధికారుల కేంద్రాల ఏర్పాటు, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, తుది జాబితా తయారీ, పోలింగ్ సామగ్రి తరలింపు, సిబ్బందికి భోజనాలు, పోలింగ్ కేంద్రాల్లో ధ్వంసమైన వాష్ రూమ్లకు రిపేర్లు చేయించడం, ఓటర్లు ఎండతాకిడికి గురికాకుండా ఆయా కేంద్రాల్లో టెంట్లు వేయించాల్సి వచ్చింది. తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున రూ.20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటి వరకు రూ.5 వేలకు మించి ఇవ్వలేదు. దాతల సహకారంతో భోజనం జిల్లాలోని ఒక్కో ఎంపీడీఓ కేవలం జీరాక్స్ కాపీల కోసమే రూ.లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిధులకు, క్షేత్రస్థాయిలోని ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆయా గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. రెండేళ్లుగా పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మెజార్టీ జీపీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. సిబ్బందికి వేతనాలు సైతం ఇవ్వలేని దుస్థితి. పాడైన వీధిలైట్లు స్థానంలో కొత్తవి కొనలేని పరిస్థితి. మోటార్ల రిపేర్లకే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు తలకు మించిన భారంగా మారింది. కొంత మంది బరిలో నిలిచిన అభ్యర్థులు అందించిన ఆర్థిక సహకారంతో సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేస్తే.. మరికొంత మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మండల స్థాయి అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు కనీసం రూ.పది కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు రూ.కోటి కూడా మంజూరు చేయలేదని తెలుస్తోంది. తలకు మించిన భారంగా ఎన్నికల నిర్వహణ -
భావితరాలకు ఆదర్శం ‘రాజా బహదూర్’
మీర్పేట: భావితరాలకు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఆదర్శమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట సర్కిల్ చందన చెరువు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరామరెడ్డి విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వెంకటరామరెడ్డి నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్కు పోలీస్ కమిషనర్గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఉత్తమ పరిపాలన, ప్రజలకు చేసిన సేవలకు గాను నిజాం ప్రభుత్వం ఆయనను ‘రాజా బహదూర్’ బిరుదుతో సత్కరించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, జిల్లెలగూడ రెడ్డి సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకర్రెడ్డి, నాయకులు బొక్క రాజేందర్రెడ్డి, అర్కల కామేశ్రెడ్డి, మేకల రవిందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి చందన చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సబితారెడ్డి సర్కిల్ అధికారులను ఆదేశించారు. చెరువును సందర్శించిన ఆమె మాట్లాడుతూ 2021లో చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా ఇటీవల రూ.2.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వాకర్స్, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వెంటనే పనులు చేపట్టాలని, మురుగునీరు చెరువులో కలవకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. -
విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయా లను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహ కరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు -
రెండో విడతలోనూ హస్తందే హవా
ఆమనగల్లు: కాంగ్రెస్ బలపర్చిన శంకర్ కొండ తండా సర్పంచ్ మండ్లీ రాములు విజయోత్సవం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు పోరాడి ఓటమి పాలైన బీఆర్ఎస్ మద్దతుదారులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిన బీజేపీ మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆమనగల్లు 13 03 03 01 06 తలకొండపల్లి 32 09 16 02 05 కడ్తాల్ 24 11 07 02 04 మొయినాబాద్ 19 07 07 04 01 చేవెళ్ల 25 16 03 03 03 శంకర్పల్లి 24 12 07 01 04 షాబాద్ 41 17 22 01 01 మొత్తం 178 75 65 14 24గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా ఇలా.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వీరికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థానాల్లో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీ లు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రముఖుల పల్లెల్లో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన మర్పిల్లిలో పార్టీ మద్దతుదారును గెలిపించుకున్నారు. తన ఆధిపత్యానికి అడ్డు లేదని నిరూపించుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డినారాయణరెడ్డి సొంతూరు ఖానాపూర్లో తన మద్దతుదారు దుగ్గాపురం అనితను గెలిపించుకుని తన పట్టు నిలుపుకొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట మండలం చించల్పేట పంచాయతీలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థి విజయలక్ష్మి ఓటమిపాలయ్యారు. అదే పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసిన డి.అనసూజ గెలపొందారు. మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితారెడ్డి తన స్వగ్రామమైన కౌకుంట్లలో బీఆర్ఎస్ మద్దతుదారును మల్లారెడ్డిని గెలిపించుకుని చేవెళ్లలోనూ తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. చేవెళ్ల లోక్ సభాస్థానం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి స్వగ్రామమైన గొల్లపల్లిలో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టుకోలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థి రాఘవేందర్కు మద్దతు పలికారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ గెలుపొందడం విశేషం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్వగ్రామమైన షాబాద్ మండలం గొల్లూరుగూడలో తన ఆధిపత్యాన్ని చాటుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి బదులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్యనేత, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామమైన శంకర్పల్లి మండలం మాసానిగూడలో తన పట్టు నిలుపుకోలేక పోయారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్వగ్రామమైన కడ్తాల్ మండలం చల్లంపల్లి కాంగ్రెస్ మద్దతుదారు యశోదమ్మ గెలుపొందారు. -
ఊరు.. ఓటుకు..కదిలారు
రెండో విడత పంచాయతీ పోరు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మంచుతో పాటు చలుగాలులు వీస్తుండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 తర్వాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం నగరంతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్, కౌంటింగ్ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటెత్తారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటిపిల్లలతో తల్లులు పోలింగ్ కేంద్రా లకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. తొలి ఫలితం మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే వెల్లడైంది. రాత్రి తొమ్మిది తర్వాత కూడా కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరిన వారిని పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఆమనగల్లు: చంటిపిల్లలతో వస్తున్న మహిళలుముగిసిన రెండో విడత పంచాయతీ పోరు జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు 85.3 శాతం ఓటింగ్ నమోదు పల్లెల్లో పండుగ వాతావరణం -
ఉత్సాహంగా ‘తొలి’ ఓటు
మొదటిసారి వినియోగించుకున్న యువత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఎంతో కీలకం. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకునేందుకు అవకాశం రావడంతో ఉదయమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. ఆనందంగా ఉంది మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ఎవరు పని చేస్తారో వారిని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకున్నా. ఓటుహక్కుతో సర్పంచ్ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది. – అభిషేక్గౌడ్, తాళ్లపల్లి, షాబాద్ ఓటు విలువైనది ఓటుహక్కు వచ్చిన తరువాత తొలిసారి ఓటు వేశా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. అలాంటి విలువైన ఓటును మొదటిసారి వినియోగించుకున్నా. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాను. – సౌమ్య, శెట్టిపల్లి, ఆమనగల్లు -
నూతన సర్పంచ్లకు సన్మానం
కొత్తూరు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు, పాలకవర్గాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మాజీ ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లాపూర్ పంచాయతీ రెడ్డిపాలెంలో ఆదివారం నిర్వహించిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు, గ్రామస్తులు నూతనంగా ఎన్నికై న మక్తగూడ సర్పంచ్ శ్రీరాములు, మల్లాపూర్తండా సర్పంచ్ మీనాక్షి దశరథ్నాయక్, మల్లాపూర్ సర్పంచ్ చిట్టెడి నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్లు రాములుగౌడ్, శంకర్నాయక్తో పాటు పలువురు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు, నాయకులు, యువజన సంఘాల నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయా లు చేయాలని, అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయేందర్రెడ్డి, జార్జి రెడ్డి, రాజు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్
చేవెళ్ల/షాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమంలో సరి చూసుకొని ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటింగ్ శాతం నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు కృష్ణయ్య, అన్వర్, ఏసీపీ కిషన్, ఎంపీడీఓలు హిమబిందు, అపర్ణ, మండల ప్రత్యేకాధికారులు వెంకటేశ్వర్రావు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. శంకర్పల్లిలో డీసీపీ శంకర్పల్లి: మహాలింగాపురం గ్రామంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెక్కల రామయ్య(85) అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి గ్రామంలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన 1994 నుంచి 1999 వరకు ఎలికట్ట ఉపసర్పంచ్గా, 1999 నుంచి 2004 వరకు సర్పంచ్గా పనిచేశారు. సౌమ్యుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా చెక్కల రామయ్యకు ప్రజల్లో మంచి పేరు ఉంది. 2018లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రంగంపల్లిని ప్రత్యేక జీపీగా గుర్తించింది. దీంతో అప్పటివరకు ఎలికట్టలో కొనసాగిన రంగంపల్లి ప్రత్యేక జీపీగా ఏర్పడింది. ఎలికట్ట గ్రామాభివృద్ధికి చెక్కల రామయ్య అందించిన సేవలు మరువలేనివని పలువురు నాయకులు కొనియాడారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య, బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీయాదవ్ ఉన్నారు. -
శ్రీరాముడి మార్గం అనుసరణీయం
షాద్నగర్రూరల్: మానవాళికి శ్రీరామచంద్రుడు చూపిన మార్గం అనుసరణీయమని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) క్షేత్రప్రముఖ్ బండారి రమేశ్ అన్నారు. పట్టణంలోని భగీరథ కాలనీ, డ్రీం విల్లాస్ కాలనీల్లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం విశ్వహిందూ పరిషత్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పానుగంటి రోజా ఆధ్వర్యంలో సత్సంగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. హైందవ సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యతతోనే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్నారు. కలియుగంలో మానవాళికి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడని, పితృవాక్య పరిపాలకుడి బాటలో మనమందరం నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ విభాగ్ సహ కార్యదర్శి మఠం రాచయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు భాగ్యవతి, నాయకులు నరహరి, శశిధర్, రంగయ్య, బాలబ్రహ్మచారి, హన్మంత్రెడ్డి, కోటేష్, హరిత తదితరులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ క్షేత్ర ప్రముఖ్ రమేశ్ -
డివిజన్కు కొహెడ పేరు పెట్టాలి
తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని 53వ డివిజన్కు తొర్రూర్ పేరుకు బదులుగా కొహెడ పేరును పెట్టాలని డిమాండ్ చూస్తూ కొహెడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న కొహెడను వదిలేసి, చిన్న గ్రామామైన తొర్రూర్ పేరుతో డివిజన్ను ఏర్పాటు చేయడం కక్షసాధింపు చర్యలాంటిదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేరును మార్చాలని అన్నారు. అదేవిధంగా చార్మినార్ జోన్ నుంచి ఎల్బీనగర్కు మారుస్తున్నట్లు ఉత్తర్వులను వెల్లడించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, అమర్నాఽథ్ గుప్తా, కృష్ణాచారి, రంగారెడ్డి, బల్దేవ్రెడ్డి, విజయ్బాబు, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్
హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్–2025 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4 నుంచి 20 ఏళ్లలోపు బాలురు, బాలికలు 60, 80, 100, 300, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్ విభాగాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రూ.299 రుసుము చెల్లించి ఆన్లైన్లో లేదంటే గ్రౌండ్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. నమోదు కోసం ఆధార్ లేదా బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ సమర్పించాలని చెప్పారు. వివరాలకు 99630 48320, 99590 91114 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
గ్రామాలపై ప్రత్యేక నిఘా
● ఘర్షణలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ● పంచాయతీ ఎన్నికల్లో కట్టుదిట్టమైన బందోబస్తుయాచారం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మండలంలోని యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల పరిధిలో మంతన్గౌరెల్లి, గునుగల్, చౌదర్పల్లి, ధర్మన్నగూడెం, చింతుల్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తండా, మాల్, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాదారులను ఇప్పటికే తహసీల్దార్ అయ్యప్ప ఎదుట బైండోవర్లు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో ఆదివారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల సీఐలతో పాటు పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరికలు చేశారు. వారం రోజులుగా విందు భోజనాలకు ఆయా గ్రామాల్లో అభ్యర్థులు వేసిన టెంట్లను తొలగించేశారు. సమస్యాత్మాక గ్రా మాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేలా ఇబ్ర హీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలకు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన వరకు ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారా యణ, యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. -
ముమ్మరంగా మూడో విడత
ప్రచారానికి దగ్గర పడుతున్న గడువు ● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర పాట్లు ● గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఇబ్రహీంపట్నం రూరల్: గడువు దగ్గర పడుతున్నా కొద్దీ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ఇక ప్రలోభాల ఎరవేతకు తీవ్ర ఎత్తుగడలు రచిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాగైనా సర్పంచ్, వార్డు స్థానాల్లో పాగా వేసేందుకు ఓటర్లకు మద్యం, డబ్బు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. అవసరమైతే ప్రమాణాలు, బుజ్జగింపులు చేస్తూ ఓట్లు రాబట్టే పనిలో ఆయా పార్టీల మద్దతుదారులు బిజీగా ఉన్నారు. రోజుకో తీరు ప్రచారం జోరు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వారం రోజులుగా వినూత్నంగా ప్రచారాలు చేశారు. ప్రజలను వెంటేసుకొని ర్యాలీలు నిర్వహించడం, ఇంటింటికి తిరిగి అయ్యా, అమ్మా.. మీ ఓటు మాకే అని బతిమిలాడటం, ఆలింగనం చేసుకోవడం, కాళ్లు మొక్కడం చేస్తున్నారు. గుర్తులను చూపించుకుంటూ జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనం ర్యాలీలకు ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.500ల వరకు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఓ వైపు ఓటర్లకు ఉపాధి కూడా దండిగా లభిస్తుంది. మరో వైపు ప్రచారానికి డబ్బులిస్తే ఓటు తమకే వేస్తారనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. అంతు చిక్కని ఓటరు నాడి అభ్యర్థులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైకి మనమే గెలుస్తున్నామని తమ అనుచరులతో తెలుపుతున్నా లోపల మాత్రం భయంగా ఉంటున్నారు. పలానా ఇంట్లో మనకు ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఓటరు మాత్రం అందరికీ ఒకే రకంగా సమాధానం ఇస్తున్నాడు. ఆయా గ్రామాల్లో కనీసం ఒక్కో ఓటరుకు రూ.ఐదు వేల వరకు ఎన్నికల తాయిలాలు చెందే అవకాశం ఉంది. చివరిరోజు ఇచ్చే నగదు బట్టి అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. -
న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టికెట్లు విక్రయిస్తూ న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల నుంచి కచ్చితంగా అను మతి తీసుకోవాలని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం 15 రోజుల ముందు (ఈ నెల 16వ తేదీ లోపు) దరఖాస్తు చేసుకుని అను మతి పొందాలని పేర్కొన్నారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచ్చి తమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదని ఆయన ప్రకటించారు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు ఎలాంటి శబ్ధం వినిపించకూడదని, అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్లను నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై విస్తృతంగా ప్రచారం చేయాలి. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత అవుతుంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు సైతం కనిష్టంగా మూడు నెలలు రద్దు అవుతాయి. ఈ విషయాలు ఈవెంట్ జరిగే చోట ప్రదర్శించడంతో పాటు ప్రచారం చేయాలని కొత్వాల్ పేర్కొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట భద్రత
శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఆమనగల్లు: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఆయా మండలాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించకుండా అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు కేటాయించిన ప్రాంతాలను వదలరాదని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేని వ్య క్తులను, ఓటరు కానివారిని రానివ్వొద్దని, ఓట ర్లు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా చూడాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించేలా చూడాలన్నారు.ఆయా సమావేశాల్లో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, కడ్తాల్ సీఐ గంగాధర్, ఎస్ఐలు వెంకటేశ్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తీర్పు.. ఇచ్చేనా ఓదార్పు!
చేవెళ్ల/షాబాద్: రెండో విడత పంచాయతీ ఎ న్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. గెలు పే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగించిన అభ్యర్థులు శనివారం ఓటరు దేవుడి ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నాలు వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు తాయి లాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాల సభ్యులను వేర్వేరుగా కలిసి వారికి కావాల్సిన హామీలు గుప్పించడంతోపాటు ప్యాకేజీలు సైతం ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఓవైపు ధీమా.. మరోవైపు టెన్షన్ ఆదివారం పోలింగ్ జరుగుతుండడం..వెంటనే ఓట్ల లెక్కింపు కానుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలింగ్కేంద్రాలకు వెళ్లే ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారోనని..ఓటరు తీర్పు ఎలా ఉంటుందో నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. ఎవరిని ఆదరిస్తారు..ఎవరినితిరస్కరిస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరి వద్దకు వెళ్లిన నీకే నా ఓటు అంటూ చెప్పడంతో ఓవైపు ధీమాగా ఉన్నా మరోవైపు ఓటు వేయకపోతే పరిస్థితి ఏమిటోనన్న భయం వెంటాడుతోంది. గెలవకుంటే ఎట్లా..? ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేశారు. వారం రోజుల పాటు రోజు కూలీ రూ.500 నుంచి రూ.1000 వరకు ఇవ్వడంతోపాటు మందు, విందులు ఏర్పాటు చేశారు. ఓటుకు ఇంత అంటూ రేటు కట్టి మరీ ముట్టజెప్పారు. ఇంతా చేసినా ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని జంకుతున్నారు. ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం.. గెలవకుంటే ఎలా అని కలవరానికి గురవుతున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
ముగిసిన గ్లోబల్ సమ్మిట్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్ నిర్వహించింది. 10 నుంచి 13వ తేదీ వరకు ప్రాంగణాన్ని సందర్శించడానికి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు అనుమతిచ్చింది. ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శనివారం ముగింపు సందర్భంగా ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, స్పీడీ సీఈఓ ఈవీ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్ శ్రేయస్సుకు వర్తమాన పద్ధతులు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహ్యం అనే అంశంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సెంటర్ ఫర్ సస్టేయినబుల్పై అగ్రికల్చర్ డైరెక్టర్ జీవి రామాంజనేయులు, విశ్రాంత ఐఏఎస్ ఎంవీ రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎస్డీ శిఖామణి, పార్మర్స్ కార్పొరేషన్ ఫౌండర్ సీఎస్ రెడ్డి, అగ్రి బిజినెస్, అగ్రిటెక్ నిపుణుడు విజయ్ నడిమింటి తదితరులు చర్చించారు. గ్రామీణ తెలంగాణను పట్టణ ప్రాంతానికి అనుసంధానించడం అనే అంశంపై వీసీ డి.రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.నర్సింహారెడ్డి తదితరులతో చర్చా గోష్టి నిర్వహించారు. రైతు సంఘం నాయకులు అన్వేష్రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు, ఆదర్శ మహిళా రైతు లావణ్య తదితరులు వ్యవసాయంపై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. గాయని మంగ్లీ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -
2 విడతకు..రెఢీ
రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజులపాటు గ్రామాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయం కోసం చివరి క్షణాల వరకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇక పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో పోటీలో ఉన్నవారిలో టెన్షన్ మొదలైంది. అధికార కాంగ్రెస్పార్టీ, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో.. ఎవరిని నిరాశకు గురి చేస్తుందోనేటితో తేలిపోనుంది. – ఆమనగల్లు/చేవెళ్ల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చేవెళ్ల డివిజన్లో ఇలా.. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్లకు 59 మంది, షాబాద్లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. ఎన్నికల నిర్వహణపైసలహాలు, సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది బ్యాలెట్బాక్స్లు, ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పంచాయతీలకు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సందర్శించారు. చేవెళ్ల డివిజన్లోని కేంద్రాలను ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. డీఈఓ సుశీందర్రావు, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు తగిన సూచనలు అందించారు. ప్రలోభాల పర్వం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్తశస్త్రాలు వినియోగించారు. ఇంటింటికీ మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. హోరాహరీ పోరు తప్పదనుకున్న గ్రామాల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓటరు కటాక్షం ఏ అభ్యర్థికి వరంగా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.నేడు మలిదశపంచాయతీ పోరు ఎన్నికలు జరగనున్న మండలాలు: 7 మొత్తం సర్పంచ్ స్థానాలు: 165 మొత్తం వార్డు స్థానాలు: 1,306 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 499 పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508 పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట -
పవర్ఫుల్ పదవి..
పల్లెకు సుప్రీం ప్రథమ పౌరుడే అయినా.. ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల వినియోగంలో సర్పంచితో పాటు సమానంగా పంచాయతీ రాజ్ చట్టం హక్కు కల్పించడంతో.. ఆ పదవికి బలం పెరిగింది. కుర్చీ కోసం పోటీ పెరిగింది. పరిగి: గ్రామ పాలనలో ఉపసర్పంచ్ పదవి కీలక భూమిక పోషిస్తోంది. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఆ పదవి.. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్ఫుల్గా మారింది. గ్రామంలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఆ పదవికి బలం చేకూర్చింది. దీంతో ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. వారి దృష్టంతా దానిపైనే.. పరిగి నియోజకవర్గంలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. అందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. సెగ్మెట్లో 157 పంచాయతీలు ఉండగా, అందులో 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 139 గ్రామాలకు ఎన్నిక జరగనుంది. ఐదు మండలాల్లో 1,340 వార్డులు ఉండగా.. అందులో 306 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,033కి ఎన్నిక జరగనుంది. అయితే సర్పంచ్ని నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉప సర్పంచ్ను మాత్రం వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ ఉండేది కాదు. వార్డు సభ్యుడికి ఉన్న అధికారాలే ఉపసర్పంచ్కు ఉండటం వలన అది అలంకారప్రాయంగానే ఉండేంది. పంచాయితీ రాజ్ చట్టం అమలుతో ఈ పోస్టుకు యమ గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచికి పోటీ పెరిగింది. ఆ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరి ఆశించి భంగపడిన వారు.. దీనిపై నజర్ పెట్టారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భవిస్తూ బరిలో నిలుస్తున్నారు. మంతనాలు షురూ వార్డు మెంబర్గా విజయం సాధించి, ఉపసర్పంచ్ని చేజిక్కించుకోవాలన్న ఎత్తుగడలో చాలా మంది ఉన్నారు. ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచే వార్డు బడిరలో నిలిచిన వారు.. మిగతా వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. నువ్వా.. నేనా! సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. విధుల నిర్వహణ సర్పంచ్లకే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలులో విఫలమైతే సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్ సహా పాలకవర్గాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయకున్నా సర్పంచ్పై వేటు పడుతుంది. ఉపసర్పంచ్కు మాత్రం మినాహాయింపు నిచ్చింది. పంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్లకే అప్పగించింది. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పోస్టుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతోంది. ఉప సర్పచ్ పదవి కోసంవార్డు సభ్యుల పోటాపోటీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ బాధ్యతలు పూర్తిగా సర్పంచ్కే అయినా.. పవర్ కోసం ఆరాటం -
విధులకు ఆలస్యంపై ఎంపీడీఓ ఆగ్రహం
● స్పృహతప్పి పడిపోయిన జూనియర్ అసిస్టెంట్ ● ధారూరులో ఘటన ధారూరు: ఎన్నికల విధులకు ఆలస్యంగా వచ్చిన ఓ ఉద్యోగిని ఎంపీడీఓ మందలించడంతో ఆందోళనకు గురై, స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరులోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాలాల మండలంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషాచారికి.. ఓ జీపీలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్గా విధులు కేటాయించారు. ఆయన సకాలంలో హాజరుకాకపోవడంతో ఎంపీడీఓ నర్సింహులు మండిపడ్డారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసినా.. ఎందుకిలా వ్యవహరించారని మండిపడ్డారు. మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని అందరిముందూ మైక్లో గద్దించడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన మిగిలిన సిబ్బంది ఎంపీడీఓ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఏపీఓను ధారూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. అనంతరం ఇంటికి పంపించేశారు. -
ఓటు.. ఎటు!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. విజేతలెవరో.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో..? నేటితో తేలిపోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ప్రచారం ముగిసే వరకూ అనుచరులు, మద్దతుదారులతో హోరాహోరీగా గ్రామాల్లో మద్దతు కూడగట్టిన అభ్యర్థులు.. ఇక బ్యాలెట్ బాక్సుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండా ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏఅంశంలో వెనకబడినా ప్రత్యర్థికి అవకాశం చిక్కుతుందనే ధోరణిలో ఒకరికి మించి ఒకరు ముందుకు సాగుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే పరమావధిగా పోరాడుతున్రాను. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల ద్వారా ఓటర్లను మచ్చిక చేసుకుని, తమకే ఓటు వేసేలా చూసుకుంటున్నారు. ఎంతైనా ఇద్దాం.. గ్రామాల్లో ఇప్పటీకే అభ్యర్థులు ఇచ్చిన హామీలతోపాటు ప్రచారంలో భాగంగా రోజు కూలీ, మందు, విందులు పూర్తయ్యాయి. ఇక ఒక్కో ఓటుకు రేటు కట్టి పంపకాలూ జరిగిపోయాయి. ఉన్నదల్లా ఓటర్లను తీసుకెళ్లి అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈక్రమంలో ఓటరు దేవళ్లు ఎవరివైపు మొగ్గు చూపుతారోననే టెన్షన్ అందరు అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులు ముందుగానే తాయిలాలు ముట్టజెప్పి, ఇక ప్రత్యర్థులు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్యాకేజీలతో పిలుపు గ్రామాలకు బయట ఉండే ఓటర్లను కలిసిన అభ్యర్థులు ఇప్పటీకే వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందజేశారు. ఎలాగైనా ఊరికి వచ్చి ఓటేయాలని ప్రాధేయపడ్డారు. రవాణాఖర్చులు ఇవ్వడంతో పాటు అన్ని సదుపాయాలూ సమకూరుస్తామని చెప్పారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా గ్రామాలకు వలస వచ్చిన వారికి సైతం స్థానికంగా ఓట్లు రావడంతో వారిని మచ్చిక చేసుకుని అన్ని హామీలు ఇచ్చేశారు. చివరి దశకు చేరిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా గెలవాల్సిందే.. సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థులు పోలింగ్ చివరి క్షణం వరకూ కొనసాగనున్న ప్రలోభాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగం మిగిలింది ఓటు వేయించుకోవడమే -
అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోండి
మొయినాబాద్రూరల్: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని బాకారంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్యాదవ్ తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు. బాకారంలో శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
● బరిలో బ్రదర్స్
మహేశ్వరం: బంధుత్వాలను పక్కనపెట్టి పలువురు పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగారు. నిన్నమొన్నటివరకు కలిసున్న వారు కాస్తా ప్రత్యర్థులుగా మారి ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ పదవి కోసం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా అన్న జైత్వారం జగన్మోహన్రెడ్డి, బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా తమ్ముడు జైత్వారం శ్రీధర్రెడ్డి పోటీలో నిలిచారు. ఇద్దరి మధ్య తీ వ్ర పోటీ నెలకొంది. కు టుంబసభ్యులు సైతం విడివిడిగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికీ గతంలో ఉపసర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో తాము చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సం‘గ్రామంలో’ రాజకీయం వెడెక్కింది. వీరి తండ్రి జైత్వారం శాయిరెడ్డి గతంలో సర్పంచ్గా చాలా కాలం పని చేశారు. ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో ఈ నెల 17తో తేలనుంది. -
ముగిసిన రెండో విడత ప్రచారం
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పోటాపోటీగా గడపగడపనూ చుట్టేశారు. ఈనెల 14న పోలింగ్ జరగనున్న డివిజన్లోని అన్ని పంచాయతీల్లో వారం రోజులుగా హామీల వర్షం కురిపించారు. భారీ ర్యాలీలతో తమ బలం చాటుకున్నారు. బలాబలాల ప్రదర్శన ముగియడంతో ఇక అసలు రాజకీయం మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లెపారు. మందు, విందు, తాయిలాల పంపిణీ మొదలు పెట్టారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నగరానికి అతీ సమీపంలో ఉన్న జిల్లాలో రియల్ ప్రభావంతో భూముల రేట్లు పెరిగినట్లుగానే ఎన్నికల్లో ఓటర్లకు ఓటు రేటు కూడా పెరిగిపోయింది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం ఓటుకు రూ.3వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో, ఎంతిస్తున్నాడో తెలుసుకొని అంతకు మించి పంపకాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు. -
● వలస ఓటర్లకు గాలం
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు ఊరికి రావాలని కోరుతున్నారు. కొంతమంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంతమొత్తం ముట్టజెపుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. -
సందడిగా ‘సమ్మిట్’ ప్రాంగణం
కందుకూరు: ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శుక్రవారం మూడో రోజు విద్యార్థులు, సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లనుఆసక్తిగా తిలకించారు. రోబోలతో స్వాగతం, ఏఐ ఫొటో ఇమేజ్లు తీసుకోవడం, స్టాళ్లలో ఏర్పాటు చేసిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదికలో ఎమర్జింగ్ టెక్నాలజీ అనే థీమ్తో రియల్ లైఫ్లో రిజిలియెన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి.సత్యనారాయణ, ఛీప్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీఓ అవికా, క్యూవైఎల్ఐఎస్ సీఈఓ కిషోర్ ఉప్పలపాటి చర్చా వేదికలో పాల్గొన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత తదితర అంశాలపై విద్యార్థుల సమక్షంలో విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించారు. అనంతరం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శనకు శనివారం చివరి రోజని, ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మంచాల: గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివా స్ అన్నారు. మండలంలోని ఆరుట్ల ఆదర్శ పా ఠశాలలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలు, నిబంధనలు అమలు పర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతోప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ వెంకటప్రసాద్,ఎంఈఓ రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మీర్పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్పేట సర్కిల్లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్రెడ్డి, చల్లా బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలపై శిక్షణ కందుకూరు: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. కొత్తగూడ పరిధిలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిసైడింగ్, స్టేజ్–2 అధికారులకు పంచాయతీ ఎన్నికల పై శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..ఎన్నికల నియమావళి ప్రకా రం విధులు నిర్వర్తించాలన్నారు. మాస్టర్ ట్రైన ర్లు ఇమాన్యూల్, మల్లేశం విధి విధానాలపై శిక్ష ణ ఇచ్చారు.కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారి సుధారాణి, ఎంపీడీఓ సరిత పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక– సంగీత కార్యక్రమం మొయినాబాద్: ఆధ్యాత్మిక గంభీరత, భావరసం, రాగబంధం, సాహిత్య సౌందర్యంతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో శుక్రవారం తెలంగాణ భక్తి సంగీత సంపదలో విశిష్ట స్థానం సంపాదించిన రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు, శేషులతా విశ్వనాథ్ స్వరరచనలో సంప్రదాయ భజన శైలిలో చేపట్టిన ఆధ్యాత్మిక–సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఆలయ అర్చక ధర్మకర్తలు ఎంవీ సౌందరరాజన్, గోపాలకృష్ణస్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కీర్తనల్లోని రాగభావం, ఆధ్యాత్మికత, వాగ్గేయకార శైలి వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
● తల్లి సర్పంచ్గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా పసూలాది లక్ష్మి పోటీలో ఉండగా అదే పంచాయతీలో 7వ వార్డు సభ్యుడిగా ఆమె కు మారుడు పి.మన్మోహన్ పోటీ పడుతున్నారు. స్పరంచ్గా తల్లికి, వార్డు సభ్యుడి గా తనకు అవకాశం కల్పించాలని తన వార్డులో కొడు కు ప్రచారం చేస్తున్నాడు. సర్పంచ్గా గెలిస్తే తల్లికి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో పోటీకి దిగారు. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి వార్డు అభ్యర్థి మన్మోహన్ -
అక్రమ మైనింగ్పై
నిమ్స్ పరిధిలోకి వెల్నెస్ కేంద్రాలుభద్రతా ఏర్పాట్ల పరిశీలన ఉక్కుపాదం!సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గుట్టుగా తవ్వకాలు జరిపి.. రాయల్టీ ఎగవేతకు పాల్పడిన అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణ యించింది. ఈ మేరకు ఆయా మైనింగ్/ సెల్లార్ యజమానులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, హయ త్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్ మండలాల్లో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ అంశంపై స్థానికుల నుంచి జిల్లా మైనింగ్ అధికారికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమాలను గుర్తించడమే కాకుండా భారీ పెనా ల్టీలతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ చెల్లించకుండా గుట్టుగా మట్టిని తరలించే లారీలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఇటీవల ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోగా, పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ నోటీసులతోనే సరి.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రూ.9.5 కోట్లకుపైగా ఫైన్ వేశారు. తట్టి అన్నారం సర్వే నంబర్ 121/పీలోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. రూ.3.39 కోట్ల జరిమానా విధించారు. ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. సరూర్నగర్ మండలం మన్సూరాబాద్ సర్వే నంబర్ 38లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్ తవ్వుతోంది. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ.రెండు కోట్లతో డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు పైసా వసూలు చేయలేక పోయారు. గతంలో సెల్లార్ తవ్వుతుండగా, మట్టి కూలి నలుగురు కూలీలు మృతి చెందిన ప్రదేశంలోనూ యథావిధిగా తవ్వకాలు మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు తెలిసింది. శ్రీనగర్ రెవెన్యూ సర్వే నంబర్ 185,188, 189లోనూ ఓ మైనింగ్ ఏజెన్సీ అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపట్టి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. తవ్వకాలను ఆపాలంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. తాజాగా మన్సూరాబాద్, హయత్నగర్ రెవెన్యూ పరిధిలోనూ అక్రమ సెల్లార్లను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంగం హోటల్ ఎదురుగా కృపా కాలనీలోనూ సెల్లార్ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బయటికి అమ్ముతున్నట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. అడ్డగోలు తవ్వకాలు, మైనింగ్ అమ్మకాలపై ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలకు వెళ్లడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం మినహా పైసా కూడా వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. సీరియస్గా తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం ముక్కుపిండి రాయల్టీవసూలు చేయాలని నిర్ణయం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు సన్నాహాలు ఆర్ఆర్ యాక్ట్తో ఆదాయంనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. గండిపేట్, మంచిరేవుల, కోకాపేట్, బుద్వేల్, నార్సింగి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, శంషాబాద్, వనస్థలిపురం, తుర్కయంజాల్ కేంద్రంగా భారీగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగు తున్నాయి. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బహిరంగ మార్కెట్లో టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రానేట్ను సైజును బట్టి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో ఉపయోగించే రోబోశాండ్ టన్నుకు రూ.600 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రషర్లు ఏర్పాటు చేసి, ఎత్తయిన గుట్టలు, సెల్లార్ తవ్వకాల్లో భాగంగా వచ్చిన రాళ్లను క్రషర్లలో వేసి డస్ట్గా మారుస్తున్నారు. కనీస చర్యలు చేపట్టక పోవడంతో దుమ్ము, ధూళి సమీప కాలనీలను ముంచేస్తోంది. ప్రతి నెలా అడిగినంత ఇచ్చే వాళ్లకు రాచమర్యాదలు చేస్తూ.. నిరాకరించిన వాళ్ల టిప్పర్లపై కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.ఆరు వేల కోట్ల ఆదాయం వస్తే.. ఆర్ఆర్ యాక్ట్తో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై.. రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఆర్ యాక్ట్ను అమలుతో ఇప్పటి వరకు తిన్నదంత కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ ఫెనాల్టీల వసూళ్ల కోసం దీన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లక్డీకాపూల్: ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో వెల్నెస్ కేంద్రాల పరిపాలన, నిర్వహణ బాధ్యతలు ‘నిమ్స్’ పరిధిలోకి వచ్చాయి. ఈ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతో పాటు లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలో ఉన్న వెల్నెస్ కేంద్రాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత అధిగమించే క్రమంలో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్కు అప్పగించింది. దీంతో ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ కేంద్రాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చే దిశగా నిమ్స్ చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్యులు సేవలను అందిస్తున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహించడం గమనార్హం. శంకర్పల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్గౌతమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలోని మహాలింగాపురం, గాజులగూడెంలో ఈనెల 14న ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమణగౌడ్, ఎస్హెచ్ఓ శ్రీనివాస్గౌడ్, డీఐ సమరం, ఎస్ఐ సురేశ్తో కలిసి ఆయా గ్రామాల్లో పోలింగ్ జరిగే కేంద్రాలను, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. పోలింగ్ రోజు ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మద్యం, మత్తు పానీయాల పంపిణీని అరికట్టేందుకు పర్యవేక్షణ, పహారాలు, చెక్పోస్ట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా పరిస్థితులు కల్పించేందుకు సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కూ స్వస్తిక్ మార్కు ఇవ్వాలి
శంకర్పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నా అది బహిర్గతం అవుతోందని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో పెన్నుతో రైట్ మార్కు ఇచ్చి తమ ఓటును వేస్తారని, దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు ఎవరు వేశారు అనే విషయం బహిర్గతమవుతోందని అన్నారు. సాధారణ పౌరులు స్వస్తిక్ మార్కు ద్వారా ఓటు వేసినట్లే, తమకూ అవకాశం ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విడిగా కాకుండా, అందరితో పాటే లెక్కించాలని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. -
బీఆర్ఎస్ నాయకులపై దాడి
బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్కోట్తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్ను విశ్వసించని ప్రజలు ● స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం ● మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు: ‘మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఫలితాలతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యాయం ముగిసింది. మరో మూడేళ్లలో తిర్మలాపూర్ వెళ్లేందుకు మూటముల్లె సర్దుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కలసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి పోటీ ఉంటుందని, అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెధిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బలపర్పించిన 70 మంది సర్పంచ్గా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉందని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలిచి, జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను గెలిచి, ఎంపీపీలను దక్కించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, వీరెందర్రెడ్డి, పంజుగుల శ్రీశైల్రెడ్డి, రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గులాబీలో జోష్
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గు లాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మెజార్టీ జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పాగా వేయడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మండలంలో 39 జీపీలు ఉండగా బాబునాయక్తండా, హంక్యానాయక్తండా, నంద్యానాయక్తండా, మంతన్గౌడ్, బాద్లాపూర్ ఏకగ్రీవమై, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన 34 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, 17 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. ఇందులో మేజర్ జీపీలైన జీవన్గీ, నీళ్లపల్లి, పర్వత్పల్లి, దామర్చెడ్, నవల్గా, మంతట్టితో పాటు గొట్టిగకలాన్, కొర్విచెడ్, కొర్విచెడ్గని, గంగ్వార్, క్యాద్గీరా, ఇందర్చెడ్, అల్లాపూర్, కొత్లాపూర్, కుప్పన్కోట్, మల్కన్గిరి, కంసాన్పల్లి(ఎం)ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన బలమైన నాయకులు ఉన్న మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డినా పరాజయం పాలవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకుంది. జీవన్గీలో అధికార పార్టీ అభ్యర్థి కే.నర్సిములు, బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు పార్టీల మద్దతుదారులు ఐదేసి చొప్పున వార్డులను గెలుచుకోగా, సర్పంచ్ స్థానం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి రామని బసప్ప కై వసం చేసుకున్నారు. అలాగే నీళ్లపల్లిలో దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల సుధాకర్రెడ్డిని బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్రెడ్డి అనే యువకుడు ఓడించాడు. అలాగే పర్వత్పల్లిలోనూ అధికార పార్టీ అభ్యర్థి జనార్దన్రెడ్డిని గులాబీ పార్టీ మద్దతుదారుడైన పాండురంగారెడ్డి చిత్తు చేశాడు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచును మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వేరు కుంపట్లే పుట్టిముంచాయా..? అధికార పార్టీలో ఎమ్మెల్యే మహనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వర్గాలుగా.. పార్టీ నాయకులు, శ్రేణులు రెండుగా విడిపోయాయి. ఎమ్మెల్యే వర్గంలోనూ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో రెండు బలమైన సామాజికవర్గాల నాయకులు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతోనే బషీరాబాద్ మండల కేంద్రంలో ఇద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ పడ్డారు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుకోవడంతో వెంకటేశ్ మహరాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఖాతాలో 21 జీపీలు మండలంలోని 34 పంచాయతీల్లో 17 గ్రామాలు బీఆర్ఎస్ కై వసం చేసుకోగా, 16 జీపీల్లోనే అధికార కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవమైన 5 పంచాయతీలు కలిపి ఆ సంఖ్య 21కి చేరింది. వీరు శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇదిలా ఉండగా కంసాన్పల్లి(బి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బీజేపీ నాయకురాలు సునీతా గ్రామాభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. బషీరాబాద్ మండలం మేజర్ జీపీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పాగా ‘పైలెట్’ మద్దతుతో కారెక్కిన 17 మంది గ్రామ ప్రథమ పౌరులు వర్గపోరుతో దెబ్బతిన్న అధికార పార్టీ కాంగ్రెస్ గూటికి కంసాన్పల్లి(బి) సర్పంచ్? -
మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట ● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు చలి అనుకూలమే.. మొగ్గ దశలో చలి ఎక్కువ గా ఉండడం మొక్కకు చాలా ఉపయోగమే. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది. అధికారుల సూచన లు, యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా. సకాలంలో మందులు పిచికారీ చేస్తున్నా. రాత్రి వేళల్లో చలి తీవ్రత 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే పూత బాగా నిలుస్తుంది. – పిట్ల మల్లేశ్, మామిడి రైతు, హస్నాబాద్ సూచనలు పాటించాలి మామిడి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా తోటల ను పరిశీలించాలి. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య ఉన్నా వెంట నే అధికారులను సంప్రదించాలి. ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉంటారు. – ఎంఏ సత్తార్, ఉద్యాన శాఖ అధికారి దుద్యాల్: మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 13 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పండే ప్రధాన పంటల్లో మామిడి కూడా ఒకటి. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగానే ఉందని ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. పూమొగ్గ బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు. మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొగ్గ పడిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది. జూన్– జూలై మాసంలో ఎరువులు వేయని మామిడి రైతులు ప్రస్తుత దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్ను వేసువేసుకోవాలి. నీటి వసతి లేనివారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పూత ఆలస్యమైతే తోటలో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి. మామిడిపై చీడపీడల యాజమాన్యం.. ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేసుకోవాలి. ఆకుపై నల్ల మచ్చలు ఉంటే పైకొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 3 గ్రాముల ఆక్సీక్లోరైడ్ మందును కలిపి స్ప్రే చేయాలి. పూత, పిందె దశలో ఆకుమచ్చ పురుగు వ్యాప్తి చెందితే నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూల కాడ పొడవుగా పెరగడానికి పొటాషియం నైట్రేట్(13:0:45) 10 గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఫిఫ్రోనిక్ 2 మి.లీ లేదాఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోపాడ్(ట్రెసర్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సిన్(అక్టరా) 0.3 గ్రాముల మందులను లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి పురుగు నేల నుంచి చెట్టు పైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీసు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు కాండం చుట్టూ చుట్టాలి. -
రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
తాండూరు రూరల్: ప్రజలు బీజేపీని గ్రామాల నుంచి బలోపేతం చేసేందుకు నడుంకట్టారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి తూర్పు లక్ష్మి విజయం సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీని అధిక స్థానాల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మిని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫిరంగి జర్నప్ప నాయకులు నర్సింలు, హరి, శ్రవణ్, పాల పరుశురాం, వాకిటి పరుశురాం, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి -
పంచాయతీ ప్రచారంలో సినీ నటుడు శివారెడ్డి
ఆమనగల్లు: ఆకుతోటపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి నాలపట్ల నరేందర్రెడ్డికి మద్దతుగా శుక్రవారం సినీ నటుడు శివారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థికి బంధువైన ఆయన ప్రచారంలో భాగంగా తన హాస్యంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నరేందర్రెడ్డిని గెలిపించి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
యాలాల అభివృద్ధికి సహకారం
యాలాల: నూతన సర్పంచ్లను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఘనంగా సన్మానించారు. యాలలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, జెడ్పీటీసీ మాసీ భ్యుడు సిద్రాల శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిపై పేరి రాజేందర్రెడ్డి బలపరిచిన సీహెచ్ శివయ్య 244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శివయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యాలాల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.యాలాల సర్పంచ్, నాయకులతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
పరిగి: బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


