Ready to Fight
-
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. – న్యూఢిల్లీ/గ్వాలియర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు. -
అమరావతిలో అసెంబ్లీ యుద్ధానికి సిద్ధం
-
పందెం కోడి రె’ఢీ’
సంక్రాంతి కోడిపందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో సంక్రాంతి రానుండటంతో ఇప్పటినుంచే పందెపురాయుళ్లు పాత సరంజామను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో దిగే పుంజులకు రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది భారీ బరులు ఏర్పాటు చేయాలనే తలంపుతో రాజకీయ నాయకుల అనుచరులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అభయంతో పందేలు ఈ ఏడాది కోట్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరు : కోడిపందేల సమరం ఆరంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఇటు పందెపురాయుళ్లు, అటూ వీక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే ప్రాంతాల్లో లాడ్జీలు బుక్ అయిపోయాయి. ఏడాది పాటు కంటికి రెప్పలా పెంచిన కోళ్లను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఐ-భీమవరం, నరసాపురం, ఉండి, సీసలి, గండిగుంట, ఎంట్రప్రగడ, రుద్రపాక, బైరపట్నం, చింతపాడు, ఇంగిలిపాకలంక, భుజబలపట్నం గ్రామాల్లో భారీ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. మెనూ మస్ట్.. పందెం బరిలో దిగే కోడిపుంజులు రాజ వైభవాన్ని అనుభవిస్తున్నాయి. వ్యాయామం కోసం ఉదయం 7 గంటలకు చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. కిస్మిస్, జీడిపప్పు, బాదంను పెస్ట్గా చేసి రోజుకు మూడు ఉండల చొప్పున తినిపిస్తున్నారు. వారానికి రెండు రోజులు తాటిబెల్లం, నల్లనూనె తాగిస్తున్నారు. సొన తీసేసిన కోడిగుడ్డును ఆహారంగా ఇస్తున్నారు. పిక్కలు బలంగా అవ డానికి వారానికి రెండు రివిటల్ మాత్రలు వేస్తున్నారు. పందెం ఒక్కరోజు ముందు వేప, ఎదురు, అవిశ జామ ఆకులను బాగా మరగబెట్టి అందులో పసుపు పోసి స్నానం చేయిస్తారు. పందెంలో పాల్గొనే ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నారు. రంగును బట్టి డిమాండ్ కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను విభజించి ధరలు నిర్ణయిస్తారు. సాధారణంగా పచ్చకాకి, నెమలి, డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసింగి, నెమలి, గేరువా, కాకి నెమలి, మైలా, కాకిడేగ, తీతువా, నల్లబొట్ల తీతువా, అబ్రాస్లకు డిమాండ్ ఉంది. పచ్చకాకి ధర రూ.25వేల నుంచి రూ.లక్షా 50 వేలు పలుకుతోంది. నెమలి, డేగ, కాకి, నల్లబొట్ల తీతువాలకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకూ డిమాండ్ ఉంది. ముసుగుపందెం, చూపుడు పందెం, జోడీలు, గుంపు పందెం వంటి నాలుగు పద్ధతుల్లో పోటీలు జరుగుతాయి. ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.10లక్షలు, ఒక్కోసారి రూ.50లక్షల వరకు జరుగుతాయి. నున్నలో జోరుగా విక్రయాలు నున్న గ్రామంలో సంక్రాంతి పండుగకు కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో బలిష్టంగా పెంచిన పుంజులను అమ్మకానికి సన్నద్ధం చేశారు. జాతి పుంజులు రూ.10వేల నుంచి 70వేల ఖరీదు చేస్తున్నారు. సంవత్సరం వయస్సు పైబడి ఉన్న కోడిపుంజులకు బాదంపిస్తా, కిస్మిస్, నువ్వులు, రాగులు, సజ్జలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పెట్టి పెంచుతున్నారు. వ్యాయామం కోసం చెరువుల్లో ఈత కొట్టిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నున్న గ్రామానికి వచ్చి పుంజులను కొంటుంటారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని పెంపకందారులు చెబుతున్నారు. - నున్న (విజయవాడ రూరల్) పల్నాడులోనూ జోరు సాక్షి, గుంటూరు : పల్నాడులో కోడిపందేల జోరు పెరుగుతోంది. జిల్లాలోని అటవీ, సముద్ర తీర ప్రాంతాలు అధికంగా ఉన్న మండలాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి పోలీసులు రాకుండా జాగ్రత్తపడుతూ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చిన పందెపురాయుళ్లు ఈ పందేల్లో పాల్గొంటున్నారు. పోలీసులకు భారీ మామూళ్లు కోడిపందేలవైపు రాకుండా ఉండేందుకు ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ మాట వినకపోతే అధికార పార్టీ నేతల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. పల్నాడులోని ఓ మండలంలో సీఐ బందోబస్తు విధుల్లో ఉన్న సమయం చూసి కోడి పందేలు నిర్వహించిన టీడీపీ నేతలు పందెం రాయళ్లు, విలేకరులకు మాత్రం తాము సీఐ అనుమతితోనే నిర్వహిస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తీవ్ర ఆగ్రహంతో ఆ నేతలను హెచ్చరించారు. అధికార పార్టీ అండతో.. జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతో కోడి పందేలు జరుగుతున్నాయి. గత సంక్రాంతి రోజు రేపల్లెలో కోడిపందేల నిర్వహణకు సమాయత్తం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చర్నకోళా పట్టుకుని బరిలో నిలబడి పోటీలు నిర్వహించారు. పోలీసులు ఆవైపు రాకుండా హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాలతోపాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఉన్న మండలాల్లో కోడి పందేలు యథేచ్ఛగా జరగడానికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. -
ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తోంది!
రెడీ టు ఫైట్ కాలం మారింది. కాలం మారింది అంటే మగాళ్లు మారారని! మొదట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకు పనికిరారు అనేవారు. ఇప్పుడు ఈ ఉద్యోగానికనో, ఆ ఉద్యోగానికనో మాత్రమే పనికిరారని అంటారు. అంటే మేల్ థింకింగ్ కొంత మెరుగైనట్టే! కానీ ఈ ‘కొంత’... ‘పూర్తిగా’ ఎప్పుడవుతుంది? ఆడవాళ్ల శక్తిసామర్థ్యాల విషయంలో మగవాళ్ల ఆలోచనా ధోరణి పూర్తిగా ఎప్పటికి పాజిటివ్ రూట్లోకి వస్తుంది? ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అప్పటి వరకు జెండర్ వాదనలు, చర్చలు జరుగుతూ ఉండడం ఆరోగ్యమే తప్ప ఎవరికీ హానికరం కాదు. ‘ఆడవాళ్లు, వాళ్లకు అనువైన ఉద్యోగాలు’ అంటూ ఓ పెద్దాయన చేసిన కామెంట్ మీద ఆ మధ్య ఇండియాలో పెద్ద డిబేట్ జరిగింది. ఈ డిబేట్ కారణం అయిన వ్యక్తి సరదాగా ఆ కామెంట్ చేయలేదు. వ్యంగ్యంగా చేయలేదు. కోపంగానో, పురుషాధిక్యంతోనో చేయలేదు. సిన్సియర్గా తను నమ్మి, నమ్మినదాన్ని బయటికి చెప్పారు. ఆయన పేరు మనోహర్ పారిక్కర్. మన రక్షణ శాఖ మంత్రి. ఖదక్వాస్లా (మహారాష్ట్ర)లోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో గత మే 30న పాసింగ్ అవుట్ పరేడ్లో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్లను యుద్ధరంగంలోకి తీసుకునే విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడాయన స్పష్టంగా ఒక మాట చెప్పారు. ‘‘యుద్ధంలోకి, ఆయుధాలు పట్టుకుని పోరాడే బాధ్యతల్లోకి మహిళల్ని తీసుకునే ప్రసక్తే లేదు’’ అని! అందుకు ఆయన చెప్పిన కారణం.. మహిళలు బందీగా దొరికితే వారిని శత్రుదేశ సైనికులు చిత్రహింసలకు గురిచేయడం తేలిక. అందుకే యుద్ధభూమిలోకి వారికి నో ఎంట్రీ అని. పారిక్కర్ భయం అర్థవంతమైనదే. అర్థం చేసుకోదగినదే. మరి యుద్ధరంగంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న మగువల మాటేమిటి? వాళ్లు తమ ఆసక్తిని చంపుకోవలసిందేనా? శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని ఈ దేశం యువకులకు మాత్రమే ఇస్తుందా? స్త్రీలు ఉద్యోగాలు చేయడం గురించి, ఆఫీసులలో స్త్రీ ఉద్యోగుల వల్ల తలెత్తే సమస్యల గురించి ఎవరు ఏం మాట్లాడినా దానికంత ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదు. స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చిందంటే దాని వెనుక కచ్చితంగా పురుషుడొకడు ఉండి ఉంటాడు. స్త్రీ చేయలేదని సమాజం అంటున్న, అనుకుంటున్న ఉద్యోగాలేవేనా ఉన్నాయి అంటే, వాటిని పురుషులు సమర్థంగా నిర్వహిస్తున్నారనీ అర్థం చేసుకోనక్కర్లేదు. అర్హతలు, ఆసక్తి ఉండీ స్త్రీ అయినంత మాత్రాన అవకాశాన్ని పొందలేకపోవడం నాగరిక సమాజపు లక్షణం కాదు. బలాలు, బలహీనతలు, పరిమితులు స్త్రీ పురుషులిద్దరికీ ఉండేవే. వాటిని అనుసరించే సమాజం తనకు కావలసిన దాన్ని తను స్వీకరిస్తుంది. ఇప్పుడలాగే వైమానిక దళంలోకి ఆడవాళ్లను ‘ఫైటర్ పెలైట్గా’ స్వీకరిస్తోంది! గుడ్ న్యూస్ ఏంటంటే... ఫస్ట్ బ్యాచ్ ఉమన్ ఫైటర్స్ 2016 జూన్లో బయటికి వస్తున్నారు. పారిక్కరే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు ‘నో’ అన్న మంత్రిగారు ఆర్నెల్ల తర్వాత నిన్ననే ‘ఎస్’ అన్నారు. కాలం మారుతోంది. అంటే మగాళ్లు మారుతున్నారని మాత్రమే కాదు. మార్పు కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారని కూడా. - భావిక