breaking news
Revanth Reddy
-
మెట్రోపై సానుకూలం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా వీరితోపాటు చర్చలో పాల్గొన్నారు. ఢిల్లీలోని రైల్వేభవన్ వీరి సమావేశానికి వేదికైంది. వీరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు సాగాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణంతోపాటు మెట్రో ఫేజ్–2 విస్తరణకు త్వరితగతిన అనుమతుల విషయమై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్–1కు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చిందని ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు తెలిసింది. ఫేజ్–2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా రూ.10వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా సూచించిన ఆర్ఆర్టీఎస్ ఫార్ములాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనే విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విషయాన్ని అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తే, తద్వారా సమన్వయ ప్రక్రియ ఆలస్యం లేకుండా మెట్రో విస్తరణ వేగవంతమవుతుందనే విషయాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులూ రేవంత్రెడ్డితో అన్నట్లు తెలిసింది. మెట్రో ఫేజ్–2 50ః50 నిష్పత్తిలో.. హైదరాబాద్ మెట్రో ఫేజ్–1లో ఈక్విటీ షేర్ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15వేల కోట్ల లావాదేవీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు ఐఆర్ఎఫ్సీ రుణం మంజూరు చేయడానికి ఒప్పందం కుదిరింది. అయితే, జూన్ 15న మొదటి విడత రుణం విడుదల కాలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అశ్వినీ వైష్ణవ్కు చెప్పారు. ఆ రుణం విడుదల చేయడంతోపాటు మెట్రో ఫేజ్–2ను 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టేలా ఆమోదించాలని కోరారు. భేటీ అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా సాగినట్లు చెప్పారు. మంగళవారం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన తర్వాత, మెట్రో ప్రాజెక్టు సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఖట్టర్, రేవంత్ భేటీలో కిషన్రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరస్పర సవాళ్ల మధ్య భేటీ హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం ముందుకెళ్లకుండా మోకాలడ్డుతున్నారంటూ కిషన్రెడ్డిపై కొన్నిరోజులుగా రేవంత్రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కిషన్రెడ్డి స్పందిస్తూ ఎన్నికల హామీల అమలులో తమ వైఫల్యంపై ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులివ్వొద్దని తాను ఏ మంత్రికి చెప్పానో నిరూపించగలరా? అని సవాలు కూడా విసిరారు. అయితే తాను రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, అప్పుడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రితో రేవంత్ రెడ్డి, కిషన్రెడ్డి సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అర్జున్రెడ్డి హిట్.. రేవంత్రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్కుమార్రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం రాత్రి ముంబై మీదుగా హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి కేంద్ర మంత్రులతో కీలక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణ, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో నేరుగా తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మెట్రో రైలు పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.‘ఈ నెల 22, 23 తేదీల్లో నేను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాను. మీరు చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి’అని రేవంత్ లేఖలో కోరారు. అలాగే, రాయదుర్గంలో ఎస్బీఐ భూమి వేలం వివాదానికి సంబంధించి రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్బీఐ చైర్మన్పై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన పనులతోపాటు, రాష్ట్ర రాజకీయాలపైనా సీఎం దృష్టి సారించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీలను కలవనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంది. -
గాంధీసరోవర్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్కు లైన్ క్లియరైంది. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూముల అప్పగింతకు తాజాగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని బాపూఘాట్ పరిసరాల్లో రక్షణ శాఖకు చెందిన 83.814 ఎకరాల భూమిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)కు బదిలీ చేసింది.ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (డిఫెన్స్ ల్యాండ్స్ విభాగం) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అవుతున్న ఈ భూముల మొత్తం విలువ రూ.533.42 కోట్లు అని రక్షణ శాఖ నిర్ధారించింది. దీనికి బదులుగా రక్షణ భూముల నిబంధనల ప్రకారం సమాన విలువైన మౌలిక వసతులను సైన్యానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూసీ నదిని సరికొత్త పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చేందుకు, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఈ ల్యాండ్ క్లియరెన్స్ ఎంతో కీలకమని తన ‘ఎక్స్’ఖాతాలో పేర్కొన్నారు. ఈ సహకారానికిగాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, భారత సైన్యానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బదిలీ చేసిన భూములివీ..గండిపేట మండలంలోని బండ్లగూడలో సర్వే నంబర్లు 86, 87, 88లోని 25.15 ఎకరాలు, హైదర్గూడలోని సర్వే నంబరు 126లోని 5.23 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని 91, 92, 96 సర్వే నంబర్లు, హైదర్గూడలోని 123, 124, 125ల్లోని మొత్తం 39.72 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని సర్వే నంబరు 94లోని 5.5 ఎకరాలు, గోల్కొండలోని ఖిలా మొహమ్మద్ నగర్లోని సర్వే నంబర్లు 3/ఎల్/15 (రెవెన్యూ సర్వే నంబర్లు 250, 251, 252లోని 8.09 ఎకరాలను ఎంఆర్డీసీఎల్కు బదిలీ చేసింది. తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (11.8 కి.మీ), హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.2 కి.మీ) మూసీని అభివృద్ధి చేయనున్నారు. ఈ మూసీ కారిడార్ పొడవునా అవసరమైన అదనపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది.త్రివేణి సంగమంగా గాంధీ సరోవర్..మొత్తం 238 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసా నదులతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తరలించి బాపూఘాట్ త్రివేణి సంగమ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడి విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహం పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు). కాంస్య విగ్రహం.ఈ ప్రాజె క్టులో భాగంగా గాంధీ సరోవర్ను హ్యాపెనింగ్ ప్లేస్గా నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ తత్వ శాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం, చేనేత శిక్షణ కేంద్రం, భారీ వీక్షణ గోపురాన్ని నిర్మించనున్నారు. ఈ సంగమంలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వ్యాపార, ఆర్ధిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
దేశాన్ని ఏలే పాలకులు కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ అధికారులుగానే కాకుండా దేశాన్ని ఏలే పాలకులుగా ఎదగాలి. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 100 మంది అంబేడ్కర్లు తయారు కావాలి. మీరంతా (విద్యార్థులు) తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలిం. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి అన్న–అక్క మెంటార్షిప్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అలాగే సుమారు రూ.150 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడామౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటే అద్భుత ఉదాహరణ అన్నారు.విధ్వంసం నుంచి వికాసం వైపు..‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా విశ్వశిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బడుల మూసివేతతో విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించింది. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు కేటాయించాం. దీన్ని ఖర్చుగా కాకుండా ంభవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం.’ అని సీఎం రేవంత్ వివరించారు.విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసమే.. ‘విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. కుల వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 119 పాఠశాలలను ప్రారంభిస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుతాం. ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. బంగారు పతకాలు సాధించే బాధ్యతను రాష్ట్ర విద్యార్థులపై పెడుతున్నాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.బ్లూకాలర్ ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాం‘ఏఐ తుపానుతో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పన వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్యాన్ని అందిస్తున్నాం. ఆంగ్లంతోపాటు జర్మన్, జపానీస్ భాషలను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో నైపుణ్యాలకు పదునుపెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. మన తలరాతను మార్చేది చదువొక్కటే. మీరంతా శ్రద్దతో చదవండి. మీకేం కావాలో ఇచ్చే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా’ అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.డ్రగ్స్రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: గవర్నర్తెలంగాణను మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే తన లక్ష్యమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. గతంలో హిమాచల్ గవర్నర్గా పనిచేసిన తాను ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్రహితంగా తయారు చేసినట్లు గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ఇంటి నుంచే విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నషా ముక్త్ భారత్ కోసం కృషి చేస్తోందన్నారు. మంచిపని చేసే ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని.. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టిరాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మగౌరవానికి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ ప్రతీక అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రజాప్రభుత్వం తీర్చిదిద్దుతోందని చెప్పారు. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్లో బూట్లు, యూనిఫారాలు, పుస్తకాలు, బెడ్షీట్స్ వంటి వస్తువులను అత్యంత నాణ్యతతో సేకరించినట్లు వివరించారు. 27 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని ఈ కిట్లను అందిస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంతో పోటీ పడుతున్న విద్యార్థులను చూసి ఓర్వడం లేదని విమర్శించారు.వాట్సాప్ ద్వారా 18 లక్షల మంది విద్యా సమాచారంరాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థుల పాఠశాల విద్యా సమాచారాన్ని నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్కు పంపే సేవలను గవర్నర్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్లో పంపిస్తారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్స్, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. -
‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారువిద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరుఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందిసోషల్ వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. -
గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్.. రేవంత్ ధన్యవాదాలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, సీఎం రేవంత్ రెడ్డి (శుక్రవారం) కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలని పేర్కొన్నారు.మూసీ పునరుజ్జీవనలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నామని... మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రజా వారసత్వ ఆస్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని బాపూఘాట్ (ఈసీ, మూసీ నదుల సంగమ ప్రాంతం) వద్ద 'గాంధీ సరోవర్' ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ భారీ విగ్రహం, మ్యూజియం, లండన్ ఐ తరహా రాట్నం, సైక్లింగ్ ట్రాక్లు, బోటింగ్ సదుపాయంతో పాటు పలు పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైనింగ్, డీపీఆర్ ఇదివరకే సిద్ధమయ్యాయి.తాజాగా పనుల నిర్వహణకు రక్షణ శాఖఅనుమతులు మంజూరు చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 83.818 ఎకరాల రక్షణ శాఖ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమికి ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడంతో బాపూఘాట్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. -
రేవంత్కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్కు, రేవంత్కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్లో పడితే అది కాంగ్రెస్తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
-
వీపు.. సున్నం సున్నమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కొంతమంది చేసిన కబ్జాలతో వేలాది మంది మునిగిపోతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము వరదలో కొట్టుకుపోతోంది. చెరు వులు, కుంటలను మనుషులు ఆక్రమిస్తే.. నీళ్లు మనుషులు నివాసం ఉండే కాలనీలను ఆక్రమిస్తున్నాయి. కబ్జాదారుల కోరలు పీకేందుకే హైడ్రాను తెచ్చాం. ఇది వారి వీపును సున్నం సున్నం చేస్తుంది. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే కొంతమంది దీన్ని ఓ భూతంలా చూపిస్తున్నారు. అది ఏనాడైనా ప్రైవేటు ఆస్తుల జోలికి వచ్చిందా? చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఆక్రమణలను మాత్రమే కూల్చివేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.భారత్ ఫ్యూచర్సిటీ నిర్మించి తీరుతాం..’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం గుర్రంగూడలోని అర్బన్ ఫారెస్ట్లో వనమహోత్సవం– 2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ‘నాగలింగం’ మొక్కను నాటారు. రోబోటిక్ ఎలిఫెంట్ను ఆవిష్కరించారు.రూ.17.82 కోట్ల అంచనాతో 102 ఎకరాల్లో చేపట్టబోయే ఎకో అర్బన్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.17.66 కోట్ల అంచనా వ్యయంతో పలుజిల్లాల్లో చేపట్టే అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ నగరాలను దృష్టిలో ఉంచుకునే.. ‘హైడ్రా వనస్థలిపురంలోని దేవుడి భూములు సహా కబ్జాలో ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలకు ఇప్పటికే విముక్తి కల్పించింది. చెరువులు, కుంటలు, నాలాలను పునరుద్ధరించింది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, అనేక మంది కోటీశ్వరులు నివసించే దేశ రాజధాని ఢిల్లీ నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు విష వలయంలో చిక్కుకుపోయింది.అక్కడి గాలి, నీరు విషమైంది. రోడ్లు, పాఠశాలలు బంద్ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు బయటికి వెళ్లలేని పరిస్థితి. బెంగళూరులో ఎప్పుడు ఏమౌతుందో తెలియని దుస్థితి. అక్కడి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మన నగరాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాం. విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కాలుష్య రహిత నగరాన్ని ప్రజలకు అందివ్వడమే లక్ష్యం. జూబ్లీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు తరహాలో 424 ఎకరాల విస్తీర్ణంలోని గుర్రంగూడ అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తాం.ఫ్యూచర్లేని వాళ్లు అడ్డుకుంటామంటున్నారు.. ఆనాడు ఒక్క సిరీస్ ఫ్యాక్టరీతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలన్నీ కలుషితమయ్యాయి. అనేక మంది బతుకులు ఆగమయ్యాయి. ఆ కంపెనీ మూసివేత తర్వాతే ఇక్కడి భూములకు విలువ పెరిగింది. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లాలో పుట్టే పిల్లల కాళ్లు, చేతులు వంకరపోతున్నాయి. సాయంత్రమైతే చాలు దోమలు దిల్సుఖ్నగర్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.నల్లగొండ జిల్లా ప్రజలు విషంలోనే బతకాలా? మూసీ ప్రక్షాళన చేపట్టాలని, కాలుష్య రహిత అహ్లాదకరమైన నగరాన్ని ప్రజలకు అందించాలని 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్జీటీ సహా ఇతర కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటోంది. ఫ్యూచర్లేని వాళ్లు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటారా..?’ అని సీఎం మండిపడ్డారు. నువ్వెట్టా గెలుస్తావో చూస్తా అంటూ పరోక్షంగా మాజీమంత్రి హరీశ్రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అవతలి వైపే అభివృద్ధి ‘ఇప్పటివరకు అభివృద్ధి అంతా నగరానికి అవతలి వైపే జరిగింది. ఎల్బీనగర్లో మాత్రం జరగలేదు. సంతోష్ నగర్, సైదాబాద్ అభివృద్ధి బాట పట్టలేదు. పాతబస్తీ, చిన్న గ్రామాలను వదిలేశారు. నిధులు ఇవ్వలేదు. మన ఓట్లతో గెలిచి మరోవైపు అభివృద్ధి పనులు చేసేవారు. మేం కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్లు, పూల మార్కెట్ను తీసుకొచ్చాం. తాజాగా ఎల్బీనగర్ వాసులకు మంచి పార్కు అందించబోతున్నాం. ఎల్బీనగర్ అంటే నాకు ప్రత్యేక అభిమానం.రాజకీయ కుట్రలో భాగంగా 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయా. అంతా రేవంత్ రాజకీయ శకం ముగిసిందని అన్నారు. సరిగ్గా 4 నెలల తర్వాత కాంగ్రెస్ నన్ను మల్కాజిగిరి ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దించింది. 30 వేల మెజార్టీని ఎల్బీనగర్ ప్రజలు అందించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. భుజాన మోశారు. మల్కాజిగిరి ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచి్చంది. మూడేళ్లు గట్టిగా కొట్లాడి ప్రజాపాలనను తీసుకొచ్చుకున్నం..’ అని సీఎం చెప్పారు.అభివృద్ధిని ఆపం: శ్రీధర్బాబు ‘తాము ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాటం చేసి 16 ఎకరాలు కాపాడే ప్రయత్నం చేస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లేని చెట్లను, వన్యమృగాలను ఉన్నట్లు సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అభివృద్ధిని అడ్డుకుంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూ అండర్ గ్రౌండ్ టన్నెల్కు ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిని ఆపబోం..’ అని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ప్రకృతి పరిరక్షణ ఓ సామాజిక బాధ్యతగా భావించి, పుడమి తల్లికి హరిత వందనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని 42 నర్సరీల్లో నాలుగు కోట్ల మొక్కలు సిద్ధం చేశామని తెలిపారు.తెలంగాణలోని 33 జిల్లాల్లో రూ.16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అటవీ శాఖ అధికారి సువర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, చీఫ్ విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఎన్రెడ్డినగర్ ప్రాంతంలో ఉన్న జీవో 118 సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి ఎల్బీనగర్ పార్టీ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ వినతిపత్రం ఇచ్చారు. -
ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!
సాక్షి, హైదరాబాద్: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. ఎల్నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048,హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మెట్రో–2కు సహకరించాలి.. ‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్ పరీక్షకు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. వీబీజీ రామ్ జీ వద్దు..పాత నరేగా కావాలి పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇక డిజిటల్ కేబినెట్ భేటీలు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్ కేబినెట్ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లు అందజేశారు. ఇకపై ఈ– బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. -
హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్ అని చెప్పారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. పేదల జోలికి హైడ్రా వెళ్లదు, కబ్జాదారుల భరతం పడుతుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుట్ర వల్ల కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది ఇక ఏమీకాడని నవ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలబడి మల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రశ్నించే గొంతును నిలబెట్టారు. పార్లమెంటులో పార్టీ, ప్రజల తరుపున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ నన్ను గుర్తించి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. -
పూరీలు చేసిన రేవంత్ రెడ్డి
-
ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్రావు హర్షం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పాలన డిజాస్టర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అంటాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు రావణాసురుడు, నరకాసుడు స్ఫూర్తి అంటాడా? ఆ వ్యాఖ్యలతోనే ఆయన నిజస్వరూపం బయటపడింది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఎస్ఆర్ఐపై బుధవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అధ్యక్షత వహించగా కేటీఆర్ తన ప్రసంగంలో సీఎం రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలపై ధ్వజమెత్తారు. మంత్రుల అనుచరుల దందా కోసం..ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కట్టుకున్న వేయి ఇళ్లను రాత్రికి రాత్రి ప్రభుత్వం రాక్షసంగా కూల్చేసిందని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరుల రియల్ ఎస్టేట్ దందా, సీఎం పైశాచికానందం కోసం ఆడబిడ్డలను రోడ్డున పడేశారన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అవినీతి సామ్రాజ్యం మాత్రం వేల రెట్లు పెరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ములుగు జిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు.సంక్షోభంలో వ్యవసాయ రంగంవ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో ఉందని.. పంట చేతికొచ్చి 60 రోజులు దాటినా ధాన్యం కొనే దిక్కులేదని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల రైతుల శ్రేయస్సును గాలికొదిలేస్తే.. డిప్యూటీ సీఎం కమీషన్ల దందాల్లో జోరుగా ఉన్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి ఇంటర్వెల్ (రెండున్నరేళ్లు) అయిపోయింది.. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్టర్ డిజాస్టర్‘అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి.. 20 లక్షల ఇళ్లు కట్టించాకే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం‘అని అంటున్నారని.. ఆ మాట మీద నిలబడే దమ్ము ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాండ్ పేపర్లు రాసి ఆరు గ్యారంటీల కార్డులను 99 రోజులు భద్రంగా దాచుకోమన్నారని.. ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. పేదల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాడు సీఎంగా కేసీఆర్ అప్పు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు తెస్తే, ఖమ్మం జిల్లా రైతుల కోసం సీతారామ ప్రాజెక్టును 80 శాతం కట్టించి, భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్రాజ్, రాకేశ్రెడ్డి పాల్గొన్నారు. -
తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారవు. అవి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తాయి. భవిష్యత్ తరాల తలరాతలు మారాలంటే ముందు వారు చదువుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా రాణించినప్పుడే బతుకులో మార్పు కన్పిస్తుంది. పుట్టి, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు రంగుల అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదు. తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా విద్యలో రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువును చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకుని రాణించిన వాళ్లే..’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకాన్నీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అటు నుంచి నేరుగా కిచెన్కు వెళ్లి పూరీని వొత్తారు. లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజిక్, డ్యాన్స్ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. క్రీడామైదానానికి చేరుకుని పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. విద్యార్థులు, టీచర్లతో కరచాలనం చేశారు. గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా.. ‘విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. పదేళ్ల పాలనలో విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే టీపీఎస్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల టీపీఎస్లో ఇప్పటికే 1,814 మంది అడ్మిషన్లు పొందారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్ నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఇక్కడ ప్రారంభించిన టీపీఎస్ను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు..తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. డిసెంబర్ 9న స్కిల్స్ వర్సిటీ ప్రారంభం ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రూ.685 కోట్లతో టెండర్ పిలిస్తే..రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూలై ఆఖరి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు అందజేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కుల,మతాలకు అతీతంగా 500 మంది విద్యార్థులను ఒకేచోట చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ప్రారంభించనున్నాం..’అని సీఎం తెలిపారు. మెస్సీని తెస్తే విమర్శించారు.. ‘2034 ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశాం. అకాడమీల్లో ఆడే వాళ్ల కంటే..ఆరుట్ల స్కూలు పిల్లలు బాగా ఆడుతున్నారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, విద్యార్థులను కలిపి ఫుట్బాల్ ఆడించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేయాలని భావించే వారికి భవిష్యత్తు ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’అని రేవంత్ ధ్వజమెత్తారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం 19న ప్రతిజ్ఞ ‘తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యగా మారాయి. సరదాగా మొదలైన అలవాటు ఆ తర్వాత వాటికి బానిసలుగా మార్చుతుంది. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం ఈ నెల 19న ఎల్బీనగర్లో వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించబోతున్నాం. విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎవరైనా గంజాయి, డ్రగ్స్కు అలవాటైతే ఆ విషయం వెంటనే ఉపాధ్యాయుల ద్వారా పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు మీరే సమాచార వారధులుగా నిలవాలి..’అని సీఎం కోరారు. పేదల భూములకు విముక్తి కల్పించండి ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నాగన్పల్లి సర్వే నంబర్ 189లోని పన్నెండెకరాల నాలుగు గుంటల భూమి, 203 సర్వే నంబర్లో ఎనిమిదెకరాల భూమిలో 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. పేదలకిచ్చిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం ఆక్రమించిందని వివరించారు. ఈ భూమికి విముక్తి కల్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. -
రేవంత్ రెడ్డి చిన్నారులతో టిఫిన్ ఎక్కడంటే..!
-
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు: సీఎం రేవంత్ రెడ్డి
ఆరుట్ల: ప్రభుత్వ విద్యావ్యవస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) భవనాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా, సుమారు రూ. 15 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆరుట్లకు చేరుకున్న సీఎం, ముందుగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పించే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యపై తల్లిదండ్రులకు పలు అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం తెలిపారు. విద్యాశాఖపై తమ ప్రభుత్వం 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పాఠశాలలోని తరగతి గదులను నిశితంగా పరిశీలిస్తూ క్యాంపస్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి, తరువాత వారితో కలిసి కూర్చుని ఎంతో ఉత్సాహంగా అల్పాహారం తీసుకున్నారు. స్కూల్లోని అత్యాధునిక వంటగదిని పరిశీలించారు. వంట చేస్తున్న మహిళా సిబ్బందితో కలిసి సరదాగా ముచ్చటిస్తూ, స్వయంగా చపాతీలు (పూరీలు) ఒత్తి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం అక్కడ ఉన్న వారందరితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు.ఈ అంతర్జాతీయ స్థాయి మోడల్ పాఠశాలలో కల్పించిన అద్భుతమైన మౌలిక వసతుల గురించి విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ క్యాంపస్లో డిజిటల్ క్లాస్రూమ్లు, అధునాతన సైన్స్ ల్యాబ్లు, విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం (లైబ్రరీ), హైటెక్ కిచెన్, విశాలమైన డైనింగ్ హాల్తో పాటు ఆటల కోసం పెద్ద క్రీడా మైదానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ వేడుకలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్రెడ్డి సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్టుగా చెప్పిన కేంద్రమంత్రి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్రెడ్డి ఆపమంటే కేంద్రం ఆపదు ‘మెట్రో ఫేజ్–2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కూడా ఈ విషయం రేవంత్రెడ్డికి తెలిపారు. మెట్రో ఫేజ్–1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు అందించింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని ఇతర నగరాలకు సహకరించినట్లే హైదరాబాద్కు కూడా సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సహకరిస్తుంది. అంతేకానీ కిషన్రెడ్డి ఆపమంటే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి కేంద్రంలో లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ లేదా రేవంత్రెడ్డి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటా..’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కిషన్రెడ్డి ఆపారనడం సీఎంకు తగదు ‘మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధుల మంజూరును నేను ఆపాననడంలో కూడా వాస్తవం లేదు. దీనిపై కేంద్ర మంత్రి ఖట్టర్తో మాట్లాడా. మెట్రోకు వచ్చే ఆదాయం నుంచి ముందుగా ఐఆర్ఎఫ్సీ రుణాలను చెల్లించాలని కేంద్రం కోరుతోంది. కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని ఖట్టర్ చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా ఏ మెట్రో ప్రాజెక్టులోనూ అప్పులను ముందే చెల్లించరు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతో రుణాలు చెల్లించేలా చూస్తేనే మెట్రో మనుగడ సాగిస్తుందని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన అంగీకరించలేదు. సాంకేతిక, ఆర్థిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిధులు ఇవ్వొద్దని కిషన్రెడ్డి చెప్పారని ఆరోపించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు..’అని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం నిధుల వెల్లువ.. తెలంగాణ అభివృద్ధికి ఏ వివక్ష లేకుండా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని కిషన్రెడ్డి వివరించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించారు. – రాష్ట్రానికి ఇటీవల 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేంద్రం అందించింది. – మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించింది. – జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గత 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల రుణాలు అందాయి. – ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం రూ.34 వేల కోట్లను కేటాయించింది. – గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించకపోయినా, కేంద్ర నిధులతోనే ఎంఎంటీఎస్ ఫేజ్–2 పూర్తి చేశారు. – కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్తో పాటు 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..’అని తెలిపారు. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ కాలయాపన గతంలో మెట్రో ఫేజ్–1 అలైన్మెంట్ మార్పు పేరుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు ఏళ్లు కాలయాపన చేశారని, నేడు రేవంత్రెడ్డి కూడా ఫేజ్–2 విషయంలో అదే తీరుతో వ్యవహరిస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్–1 రుణాల విషయం, ఫేజ్–2 ప్రాజెక్టు, ఎన్ఓసీ సాధించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా.. ఆయనతో పాటు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. -
పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్ రైల్ కారిడార్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పర్యాటకరంగ పరంగా ప్రమోట్ చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్లకు ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్–పుణె కారిడార్లో వికారాబాద్ అనంతగిరిలో స్టేషన్ ఉండాలని, అక్కడి నుంచి ఐటీ హబ్కు రవాణా వసతి కల్పించాలని సూచించారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్తో అనుసంధానమయ్యే హైస్పీడ్ రైల్ కారిడార్లు, వరంగల్ విమానాశ్రయంపై సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి బెంగళూరుకు నిర్మించే కారిడార్లో ఫ్యూచర్ సిటీ స్టేషన్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, రాష్ట్రంలో కీలక పర్యాటక స్థలంగా ఎదిగే వీలున్న సోమశిల ప్రాంతంలో, నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు దగ్గర నల్లమల స్టేషన్ ఉండాలని సూచించారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా ఉండాలన్నారు. వరంగల్ నగరంలో త్వరలో పనులు ప్రారంభం కానున్న విమానాశ్రయ భవనం ఆసాంతం కాకతీయ సామ్రాజ్య చరిత్రను స్ఫురణకు తెచ్చేలా డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. విమానాశ్రయం ముందు భారీ ఐలండ్ ఉండాలని, అందులో రాణి రుద్రమ, రుద్ర దేవుడు, భారీ నంది విగ్రహాలు కొలువుదీరాలని చెప్పారు. -
నర్సరీ టు ఇంటర్ ఒకే క్యాంపస్లో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యారంగంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) నూతన విద్యా విప్లవానికి నాంది పలకబోతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల కేంద్రంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ను బువారం ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం స్కూలుకు సమీపంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభలో ప్రసంగించనున్నారు. రోల్మోడల్గా టీపీఎస్ఆరుట్లలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమప్రాధాన్యం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్గా ఇది రూపుదిద్దుకుందని అంటున్నారు. మొదటి విడతలో ఆరుట్ల, మంచాల పాఠశాలతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. అప్పుడే నో అడ్మిషన్ బోర్డుకార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతా వరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తోపాటు ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు సంబంధించి ప్రత్యేక శిక్షకులనూ అందుబాటులో ఉంచారు. అదీగాక చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకు రావడానికి ప్రభుత్వం ఐదు బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఈ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తు న్నారు. ప్రస్తుతం 1,814 మంది విద్యార్థులు చదువుతుండగా, డిమాండ్ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్లో నెలకొంది. -
కేందమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఐఆర్ఎఫ్సీ లోన్ ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-I ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. ఎల్అండ్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఫేజ్-1 టేకోవర్కు రూ.15,000 కోట్లు - రూ.1,461 కోట్లు ఈక్విటీ, రూ.13,538 కోట్లు రీఫైనాన్స్ నిధులు విడుదలకు సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.ఐఆర్ఎఫ్సీ లోన్ శాంక్షన్ చేసినా నిధులు విడుదల చేయలేదన్న సీఎం.. రాష్ట్రం అన్ని షరతులు పూర్తి చేసిందని.. రూ.84 కోట్ల అప్ఫ్రంట్ ఫీజు చెల్లించిందని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. 1,461 కోట్లు ఎస్క్రో అకౌంట్లో జమ చేశాం.. అయినా ఐఆర్ఎఫ్సీ నిధులు ఆపేసిందన్న సీఎం.. ఫేజ్-2లో 7 కారిడార్లు, 122.9 కి.మీ, రూ.38,595 కోట్ల ప్రాజెక్ట్.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.ఫేజ్-2కి 50:50 జాయింట్ వెంచర్గా ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఒప్పుకోకుంటే రాష్ట్రమే సొంతంగా ఫేజ్-2 చేపడుతుందన్న సీఎం.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదన్న సీఎం.. డ్యూ డిలిజెన్స్ తర్వాత శాంక్షన్ అయిన లోన్ ఇవ్వమంటున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని.. బెంగళూరు, చెన్నై, ముంబై దూసుకుపోతున్నాయని.. హైదరాబాద్ వెనుకబడిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రిగా జోక్యం చేసుకోవాలని కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చాం. అయినా లోన్ ఆపేశారు. ఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగ సంస్థే.. కేంద్రం ఆదేశిస్తే వెంటనే నిధులు వస్తాయి. మెట్రో విస్తరణ ఆలస్యమైతే హైదరాబాద్కు తీవ్ర నష్టం. వెంటనే నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఛత్రపతి సిన్మా యాద్ చేసుకుండు సీఎం సారు
-
కిషన్రెడ్డే అడ్డుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. ‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్ఎఫ్సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్ ఫీజు కట్టింది. ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన కిషన్రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్వోసీ ఇస్తే ఐఆర్ఎఫ్సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు? వరంగల్ ఎయిర్పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు. కేసీఆర్ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం ‘నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్అండ్టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్మెంట్ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. షరతులపై షరతులు పెట్టిన కేంద్రం మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్అండ్టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ షరుతు పెడితే ఎల్అండ్టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్అండ్టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. నేను అండగా ఉంటా కేసీఆర్ను భయపెట్టు ‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్కు భయపడి, లొంగిపోయి కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్ను భయపెట్టు. కిషన్రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కిషన్రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు. -
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. -
‘బీజేపీ అంటే సీఎం రేవంత్ భయపడుతున్నారు’
హైదరాబాద్: తమ పార్టీ అంటే సీఎం రేవంత్రెడ్డి భయపడిపోతున్నారన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్రావు.. హైదరాబాద్ వ్యక్తిగా కిషన్రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్కు హైదరాబాద్ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్ది కాదు. మోదీ ముందు రేవంత్ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. -
మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హాయంలోనే హైదరాబాద్లో మెట్రో రైలుకు టెండర్లు పిలిచారని రేవంత్ తెలిపారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మెట్రో ఫేజ్-2 పనులకు కిషన్ రెడ్డి సహకరిస్తే ఒక మెట్లో స్టేషన్కు ఆయన పేరు పెడతామని తెలిపారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాబట్టి నిధుల అంశం ఆయనను అడుగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కేంద్రమంత్రులను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులు వివరించాను. మెట్రోకు నష్టాలు రాకుండా లాభాల కోసం రకరకాల సంస్థలను సంప్రదించామని. ఫేజ్-1 వరకూ యజమానులు మీరయితే ఫేజ్-2 అనుమతులు ఈజీగా వస్తాయని కేంద్రం చెప్పిందని అయినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదన్నారు. హైదరాబాద్ని విశ్వనగరమని చెప్పుకుంటుంన్నాం దానికి తగ్గట్లు అంతర్జాతీయ నగరానికి ఉండేలా సదుపాయలు కూడా ఉండాలి. ఫేజ్-2 అనుమతి కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం మరో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ జరగాలని కోరాం. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్కు రూ. 350 కోట్ల ఖర్చువుతుందని ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోటి 34 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. -
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్గాందీకి చెప్పినందుకే రేవంత్రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్, అవసరమైతే నేనూ.. ‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా. ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి. ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి ‘వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. తాగునీరు కలుషితం కావొద్దు.. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
‘మీనాక్షికి సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారు’
సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్మోడల్గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్చాట్ చేశారు. ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్కే.. ‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది. బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు.. ‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్ఎఫ్సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్ఆర్ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. కేబినెట్ భేటీకి రానని చెప్పాలి.. మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పేరు వస్తుందని కిషన్రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి. జూలైలో మహారాష్ట్రతో చర్చలు.. గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా? హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం.. రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు. వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా? ‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు. రాహుల్గాంధీతో భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శక్రవారం ఉదయం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది. -
హైదరాబాద్లో భారీ వర్షం ..రేవంత్ ఫ్లైట్ దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంతో విమానాన్ని తిరిగి బెంగళూరు తరలించారు. కాసేపటి క్రితమే విమానం అక్కడ ల్యాండయ్యింది. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది.కాగా నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వానపడుతోంది. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. -
‘బీజేపీ వైఖరి కిమ్ జాంగ్ను తలపిస్తుంది’
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్ జాంగ్లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్. ‘నార్త్ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.‘శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా?, హిట్లర్ నాకు ఆదర్శం కాదు. నా మాటలను మీడియా వక్రీకరించింది. హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో అప్పుడే విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే నరేంద్ర మోదీతో ఉన్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారా?, కేంద్ర మంత్రుల వద్దకు కిషన్ రెడ్డితో పాటే నేను వస్తా. జూలైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సమావేశం ఉంటుంది. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సహకరించాలి. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఢిల్లీలో డాన్స్ చేస్తున్నారు. 8 మంది ఎంపీలు కేంద్రంతో పట్టుపడితే ప్రాజెక్టులు ఎందుకు రావు. ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి మెట్రో రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి అనుచరులే ఫ్లెక్సీలు కట్టారు. కిషన్ రెడ్డి నెగటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీ. స్కూలు ఫీజుల నియంత్రణపై మీడియా గట్టిగా రాస్తే నేను చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు. -
అప్పుల కోసం వందల కోట్ల కమీషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం ముంబైలోని బ్రోకర్కు వందల కోట్ల కమీషన్లు ముట్టచెప్పిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీశ్రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమీషన్లతోనే ఆ బ్రోకర్ ఏకంగా విమానం కొన్నా రని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర కార్పొరేషన్ల నుంచి రుణాలు తెస్తే రేవంత్ సర్కార్ మాత్రం రుణాలు తెచ్చుకోవడానికి కొత్తగా కమీషన్లు ఇచ్చే సంస్కృతి మొదలెట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ నిర్మించి అక్కడ ప్రజలను కలిసేవారని, దానిని కూడా రాజకీయం చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరిట రూ. 7 కోట్లకు జీవో ఇస్తే ఇప్పటికే దానికి రూ.70 కోట్ల వ్యయం అయిందన్నారు.దాని చుట్టూ రక్షణ కోసం 17 కోట్లతో ఇనుప కంచె వేశారని, మరో 10 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం నిర్మించుకుని బోధి పెవిలియన్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం, ఫ్యూచర్సిటీ, సచివాలయం, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాల యాలు ఉన్నా మరొకటి ఎందుకని విమ ర్శించారు. సీఎం ప్రతీనెలా హెలికాప్టర్కు రూ. 2 కోట్లు వ్యయం చేస్తున్నారని, అదీ చాలదని ఇప్పుడు రూ.5 కోట్లకు మరింత అధునాతన హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారన్నారు. రూ. 2,000 కోట్ల కుంభకోణం.. పాఠశాల, గురుకుల విద్యార్థులకు అవసర మైన దుస్తులు, బూట్లు, బెల్ట్ వంటివి చేనేత సహకార సంస్థ, లిడ్క్యాప్ నుంచి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చేవారని, సీఎం రేవంత్రెడ్డి మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి దాదాపు రూ. 2,000 కోట్ల కాంట్రాక్టును గుజరాత్కు చెందిన మార్వాడీకి కట్టబెట్టారని ఆరోపించారు. విద్యార్థుల కు పాఠశాల తెరిచే నాటికి దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు కనీసం వస్త్రం రానేలేదని, అందుకే సాధారణంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వాయి దా వేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పొందిన సంస్థతో కమీషన్లకు సంబంధించి తుది నిర్ణయం కాకపోవడంతో ఆలస్యమవుతోందని ఆరోపించారు. గురుకులాల విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, దుస్తులు కూడా రాలేదని దుయ్యబట్టారు. మీనాక్షి కేసు లీక్పై విచారణ జరపండి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడే బీజేపీ నేతలకు కేసు వివరాలను అందించారని హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతీ దానికి సిట్, న్యాయ విచారణ, సీబీఐ, సీఐడీ విచారణ అనే సీఎం రేవంత్రెడ్డి మీనాక్షి కేసు సమాచారం లీక్ చేసిన ఘటనపై విచారణ జరిపించి నిగ్గుదేల్చాలన్నారు.ఫార్మాసిటీ రద్దుతో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలా లు ఇస్తే తాము వ్యతిరేకించమని, అయితే వివాదాలు లేని స్థలాలు ఇవ్వాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల జీవో 111ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ గురించి పదేపదే సీఎం మాట్లాడుతున్నారంటేనే.. తమ పార్టీ బలంగా ఉన్నట్లు లెక్క అని అన్నారు. ప్రతీరోజు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా సీఎం ఉండలేరని వ్యాఖ్యానించారు. -
ఫ్యూచర్ సిటీకి సింగపూర్ మాస్టర్ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్సీ) అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ) మేర విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)కి సంబంధించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పన బాధ్యతను సింగపూర్కు చెందిన బహుళ జాతి ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ కంపెనీ డీపీ ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ టెండర్ల ప్రక్రియలో మొత్తం ఆరు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడగా.. తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించేందుకు (లోయెస్ట్ బిడ్డర్) ముందుకు రావడంతో ’డీపీ ఆర్కిటెక్ట్స్’ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఫ్సీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులకు అధికారులు ఒప్పంద పత్రాలను అందజేశారు. 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సింగపూర్ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని విధించింది. తొలుత 13 వేల ఎకరాలకే.. ఏ నగరాభివృద్ధికైనా సమగ్ర ప్రణాళిక అవసరం. లేకుంటే అస్తవ్యస్తమైన వృద్ధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు అధికార పరిధి సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో మొత్తం 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎఫ్సీడీఏ పరిధిలో భూవినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అయితే తొలి దశలో సుమారు 13 వేల ఎకరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన జోన్గా గుర్తించి ముందస్తుగా మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నారు. రాబోయే కాలంలో ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ శివార్లలో ఇంండ్రస్టియల్, ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ హబ్లతో కూడిన సరికొత్త నాల్గవ నగరం రూపుదిద్దుకోనుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం లైఫ్ సైన్సెస్ హబ్కు 4 వేల ఎకరాలు, రెసిడెన్షియల్ జోన్కు 2,477 ఎకరాలు, ఎల్రక్టానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్కు 2,177 ఎకరాలు, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కు 1,976 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఏఐ సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కు 255 ఎకరాలు కేటాయించారు. 3 విభిన్న ప్రాంతాలతో.. మూడు విభిన్న ప్రాంతాల కలయికతో కూడిన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సమగ్ర సమత్యులతో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర ప్రాంతం: హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 పరిధితో ఇది కలిసి ఉంటుంది. ఇక్కడ రవాణా నెట్వర్క్లు, కారిడార్లు ఇప్పటికే ఉన్నాయి. మధ్య ప్రాంతం: హైదరాబాద్ ఫార్మా సిటీ భూమి దీని పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్, ఎల్రక్టానిక్స్ రంగాలు అభివృద్ధి చేయనున్నారు. దక్షిణ ప్రాంతం: ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీనికి ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన భూవినియోగ ప్రణాళిక లేదు. ఈ మూడు భిన్నమైన జోన్లను కలుపుతూ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ ఫ్రేమ్వర్క్కు సరిపోయేలా ఒకే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్ అత్యవసరమని సింగపూర్ సంస్థకు అధికారులు స్పష్టం చేశారు. -
హైదరాబాద్కు రూ.లక్ష కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా నిలుస్తున్న ఆరు మెట్రో నగరాల సమగ్ర అభివృద్ధికి ఎం–6 టాస్క్ఫోర్స్ పేరుతో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నగరాలను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఒక్కో మెట్రో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాభివృధ్ధికి రూ. లక్ష కోట్లివ్వాలని కోరింది.ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసిస్తుండగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు పావు వంతు (25 శాతం) వాటాను ఇవే సమకూరుస్తున్నాయని.. అందువల్ల ఈ నగరాల అభివృద్ధిని సాధారణ వ్యయంగా కాకుండా, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని రేవంత్రెడ్డి సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక, పరిపాలనా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రేవంత్రెడ్డి వివరించారు. ‘2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎస్జీడీపీ సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి విప్లవం... విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, భోజనం, రవాణా, డిజిటల్ లెర్నింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం సుమా రు రూ. 24,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ ని వివరించారు.65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కోర్సులు అందిస్తున్నామన్నారు. 26 వేలకుపైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించామని.. ఉపాధ్యాయుల కొరత తీ ర్చేందుకు 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సీఎం వివరించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సీఎంలు వస్తే యంగ్ ఇండియా స్కూళ్లు చూపిస్తాం.. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి లేదా అధికారులైనా తెలంగాణలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చూడాలనుకుంటే సంతోషంగా చూపిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు.నీతి ఆయోగ్కు సీఎం చేసిన వినతులు ఇవీ..⇒ తెలంగాణ విద్యార్థుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఐఐఎంను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. ⇒ హైదరాబాద్ విస్తరణకు వెన్నెముకగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు వేగవంతానికి సహకరించాలి. ⇒ భారత్ ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించే 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి. ⇒ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 విస్తరణకు సహకారం అందించాలి. ⇒ హైదరాబాద్ చారిత్రక జీవనాడి అయిన మూసీ నదిని ప్రపంచస్థాయి రివర్ఫ్రంట్గా అభివృద్ధి చేసేందుకు నిధులివ్వాలి. ⇒ 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్, నెట్ జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక మద్దతు ఇవ్వాలి. ⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు, పీఎంకేఎస్వై సాయం మంజూరు చేయాలి. ళీ సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణకు ప్రాధాన్యమిచ్చి ఎల్రక్టానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీఎంపీ, ఓసాట్ క్లస్టర్లు, మైక్రో ఎల్ఈడీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. -
అండగా నిలవండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎం–6’ నిధికి రూ. 6 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ దార్శనికతను ప్రధానికి వివరించిన రేవంత్రెడ్డి.. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో తాను చేసిన ఎం–6 టాస్్కఫోర్స్ ప్రతిపాదనను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వృద్ధికి ఇంజిన్లలా పనిచేస్తున్న ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ఈ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో రెండో దశకు చేయూతనివ్వండి రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లలో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధానిని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుతోపాటు సస్టెయినబుల్ అర్బన్ హబ్గా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్లు, రైల్వేల విస్తరణకు ఊతం హైదరాబాద్ రీజనల్ రింగ్రోడ్డు (ఉత్తర, దక్షిణ కారిడార్లు), ప్రతిపాదిత హైదరాబాద్–అమరావతి–బందరు పోర్టు ఎక్స్ప్రెస్ వే, మన్ననూర్–శ్రీశైలం (ఎన్హెచ్–765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలిపి అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్ రింగ్రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోపాటు శంషాబాద్లో సెంట్రల్ హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని అభివద్ధి చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని.. ఇందుకోసం హైదరాబాద్ పరిధిలో 200 ఎకరాల వివాదరహిత భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీ, సాగునీటి ప్రాజెక్టులకు దన్నుగా నిలవండి టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఎల్రక్టానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 2.0) ఏర్పాటుకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద కేంద్రం మద్దతివ్వాలని కోరారు. సాగునీటి రంగంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా ప్రధాని చొరవ తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. విద్య, వైద్యమే పునాదిగా.. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే అంశాలను సీఎం రేవంత్రెడ్డి ఈ భేటీలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశాభివృద్ధి వ్యూహంలో నాణ్యమైన విద్య, వైద్యం పునాదిగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునీకరణ వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మోదీకి వివరించారు. మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులివ్వండి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీలో సీఎం విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్–2 ఆవశ్యకతను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్–2 డీపీఆర్లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ గతంలో చేసిన సూచనల మేరకు మార్పులు చేసి ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి కూడా త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయం) అద్వైత్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్ప్రెస్వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
ఇదే 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఓ దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లు, ఏఐ, ఫార్చ్యూన్– 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది. టోక్యో, సింగపూర్, న్యూయార్క్ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వేదికగా నిలవబోతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వేదికగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఎఫ్సీడీఏ విజన్ ఇన్ యాక్షన్ ప్లాన్ పోర్టల్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. ‘150 రోజుల్లో ఎఫ్సీడీఏ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి పథం వైపు నడవాలి. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. భవిష్యత్తులో ఈ నగరం మరింత రాణిస్తుంది. అడ్డుపడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహితనగరంగా రాణిస్తుంది చిన్న వర్షానికే వరదలు నగరంలోని వీధులను తరచూ ముంచెత్తుతున్న వరదలకు, ట్రాఫిక్ అంతరాయానికి నాటి పాలకుల పాపమే కారణం. నగరంలో పెద్ద వర్షం పడలేదు. చిన్నపాటి వర్షానికే వరద ఏరులై పారింది. ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పట్టింది. పదేళ్లలో అభివృద్ధి చేశాం. వంద కోట్లకు ఎకరం అమ్మామని చెప్పడం కాదు. నిన్నటి ట్రాపిక్ సమస్యకు కారణం ఎవరో చెప్పాలి. కబ్జాలపై మరింత కఠినంగా.. గత ప్రభుత్వంలోని దుర్మార్గులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చెరువులను చెరబట్టి, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే చెరువులు, కుంటలోŠల్ ఉండాల్సిన వరద నీరు రోడ్లపైకి వస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి, చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నాం. వాటి చుట్టూ పార్కులు, మార్కెట్లు తీసుకొచ్చి లేక్ ఎకానామీ సృష్టించబోతున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నాం. కబ్జాలకు పాల్పడిన వాళ్లను వదలం. వారి వెనుక ఉన్నవాళ్ల తోకలు కట్ చేయడానికి కూడా వెనకాడం. అదేమైనా మీ తాత జాగీరా? బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి 15 ఎకరాలు కబ్జా చేశాడు. దీన్ని కేసీఆర్ ఆయనకు రాసిచ్చాడు. అదేమైనా మీ తాతా జాగీరా? ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించాం. కుంటకు మళ్లీ జీవం పోశాం. గండిపేట, హిమాయత్సాగర్ ఆక్రమణలను తొలగించే పని చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ ముఖ చిత్రమే మారింది ‘హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి కులీకుతుబ్షాలు, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చార్మినార్ నుంచి గుల్జార్హౌస్ వరకు, మొజాంజాహీ మార్కెట్ నుంచి ఖబూతర్ఖానా వరకు విస్తరించకపోతే చరిత్రలో గుర్తింపు వచ్చేదా? 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ విస్తరణతో జంటనగరాలుగా వెలుగొందుతున్నాయి. సైబరాబాద్ సాంకేతిక విప్లవం. 60 శాతం ఆదాయం అందిస్తుంది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లు పలుకుతోంది. తెలంగాణ ముఖ చిత్రమే మారింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ అధికం. కుట్రలు, కుతంత్రాలు చేసినవాళ్లూ ఉన్నారు.. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తి వేలాది మంది చనిపోతే నిజాం చలించారు. మూసీ, ఈసీలు ఉప్పెనై కమ్మేయకుండా జంట జలాశయాలు నిర్మించారు. ఆనాడు సైబరాబాద్, హైటెక్సిటీ అంటే నవ్వినోళ్లు ఉన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దు అన్నోళ్లూ ఉన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ఆనాటి ముఖ్యÐమంత్రులు హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీ, ఐటీ సంస్థలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలను తీసుకురాకపోతే.. పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. వచ్చేసారి ప్రతిపక్ష హోదాకూడా రాదు.. ‘ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు.. నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్లో పండిండు. మారీచుడు, సుబాహులను మనపై వదిలాడు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు కలిసి ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామంటున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. కానీ మీకు గతమే ఉంది. భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..’ అని సీఎం ఎద్దేవా చేశారు. విషం చిమ్ముతున్న బీఆర్ఎస్: భట్టి ఆనాటి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి, గ్రీన్ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఉన్న బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని విమర్శించారు. కొన్ని గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.హైటెక్ సిటీకి దీటుగా..: శ్రీధర్బాబు హైటెక్ సిటీకి దీటుగా కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో రెండున్నరేళ్లుగా అహరి్నశలు శ్రమిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక తదితరులు మాట్లాడారు. కొత్త శక్తిని నింపుకోవడానికి కలిసి రండి – ‘ఎక్స్’లో సీఎం రేవంత్రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఒక నిజం. మనం విదేశాలకు వెళ్లి గొప్ప నగరాలను చూసినప్పుడల్లా.. ఇంతటి ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, అద్భుతంగా నిర్వహించే నగరం మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాం. భారతీయులందరి సామూహిక కోరికకు సమాధానమే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. దీని కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోనే ప్రారంభించుకున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో దీని ప్రాముఖ్యత కారణంగా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని భూగోళంపైనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే వరకు శ్రమించేలా కొత్త శక్తిని నింపుకోవడానికి నాతో కలిసి రండి..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ( FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది ప్రారంభించారు. ఎఫ్సీడీఏ లోగో, వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ‘‘నిన్న 2 గంటల వానకే హైదరాబాద్లో నీరు నిలిచిపోయింది. అంతర్జాతీయ నగరం అన్ని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి?. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత?. ఈ వరద పరిస్థితి మీ కబ్జాల పుణ్యమే కదా’’ అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.‘‘పదేళ్లు అభివృద్ధి చేశామన్న వాళ్లు వరదపై మాట్లాడాలి. ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంకల్పాన్ని అడ్డుకోవాలని రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు’’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. -
‘కోటి’ సంపద సృష్టి
సాక్షి, హైదరాబాద్: మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలుగా ఎదిగేవిధంగా సముచితమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. వారిని రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకెళ్లే ఆర్థిక విప్లవానికి ఈ బస్సులు చిహ్నలుగా నిలుస్తాయని అన్నారు. ఆర్టీసీకి లీజుకు.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర రాష్ట్రంలో ఒకేరకమైన పంటలు పండించే విధానానికి స్వస్తి పలకాలని, అన్ని రకాల పంటలను పండించేవిధంగా పంట మార్పిడి విధానంపై మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, ఇతర ఆస్తులపై మహిళలకు యాజమాన్యం కల్పింస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు.మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, గణేష్, మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్షి్మ, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసత్యపు వార్తలతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపై ఆరోపణలకు ఉన్న ఆధారాలను వారికి ఇవ్వాలని అన్నారు.వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్క్లబ్లో గానీ, అమరవీరుల స్తూపం వద్ద గానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడను.. ‘పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్రెడ్డి చేస్తున్న తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా. వారి ఇళ్ల ముందే ఘెరావ్లు చేసి, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్రెడ్డి సరి్టఫికెట్ నాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని.ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోలీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన, చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, అభద్రతాభావం, అహంకారంతో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు..’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. మంత్రులు దోచుకుంటున్నారు.. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహారశైలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి..’అని కేంద్రమంత్రి విమర్శించారు. ఆఖరి గింజ వరకు కొంటామన్నారుగా.. ‘రాష్ట్రం అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతోంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, గోడౌన్లు ఖాళీ లేకపోయినా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణలో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం..’అని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్లో రాష్ట్రం నుంచి మరొకరికి చాన్స్! ఈ నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, బీజేపీ పార్టీ కమిటీలను కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తారని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో అవకాశం ఉంటుందన్నారు. -
ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్. ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం -
కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి పైవిధంగా స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి? ‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం సమకూర్చింది ‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? ‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్రావు, కేటీఆర్లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్ఫ్రంట్ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం అడ్డుకుంటారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్, మూసీ ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు.‘మున్సిపల్ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశాననిఅడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వివక్ష, వితండవాదం వద్దు ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే.. ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్కు ఆ దుస్థితి రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు. పేదల కోసం లక్ష ఇళ్లు ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు. ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్లోని లక్ష్మీనగర్లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.కాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేసిన శాలువ, బొకెతో సీఎం రేవంత్రెడ్డిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సన్మానించారు. వాటర్ పెట్ బాటిల్స్ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కూర్చున్నారు. దుండిగల్లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. -
పొలిమేర దాటనివ్వననడానికి రేవంత్రెడ్డి ఎవరు..?: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.‘‘పొలిమేర దాటనివ్వననడానికి అతను ఎవరు..? కలసికట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం. అలాగే, టీబీజేపీ నేతలమంతా ఐక్యంగానే ఉన్నాం. అందుకు ఎలాంటి అనుమానాలకు తావులేదు’’ అని డీకే అరుణ తెలిపారు. -
గోదావరి–కావేరి లింక్పై రేవంత్ సర్కార్ జలద్రోహం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–నల్లమల సాగర్ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని హరీశ్రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్కు లింక్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే...పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్ పెన్గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాంపోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్తో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు సాగనిస్తాం
సాక్షి, హైదరాబాద్: భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు జరగనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోహెడలో 239 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు భూములు రైతులవని, వారి నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు.ఇప్పటికే అక్కడ ఫ్రూట్ మార్కెట్ అందుబాటులో ఉందని, అయినా, రైతుల భూములను సేకరించి, వాటిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ భూసేకరణను రైతులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా రైతులను అరెస్టు చేశారని, సాయంత్రం వారిని విడుదల చేశారని తెలిపారు. పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగినవి కాదన్నారు.సీఎంతోపాటు కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ సంస్థలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ గేట్ వద్ద అయినా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేస్తే, తాము కూడా వివరాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ’ది హిందూ’ సదస్సులో (ది హిందూ కాన్క్లేవ్) సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆదివారం స్పందించారు. రేవంత్రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్ ముమ్మాటికి నిజమేం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది! మీరు నియంతలను పూజిస్తారు, పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు.తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్రెడ్డి’అని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు. ‘రేవంత్రెడ్డి.. మీలాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత మేధావులం మేము కాదు. అందుకే, మా పదేళ్ల పరిపాలనను మేము డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అభివృద్ధికి కలసిరండి
సాక్షి, హైదరాబాద్: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. శనివారం ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కనీస కనికరం ఉండొద్దా? ‘గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్ఫ్రంట్ దగ్గర ఒక్కో అపార్ట్మెంట్ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు. సింగపూర్, న్యూయార్క్తో పోటీ నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్ జంక్షన్– ఎల్బీనగర్ –ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్–ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ – హయత్నగర్ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్ రింగ్రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్–1 యాప్ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిషన్రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... ‘హైదరాబాద్కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్ ఆర్కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్రెడ్డి గారూ..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. -
సీఎంకు ‘హిట్లర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్సెట్’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్తో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.‘హైడ్రా పదం హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్పాత్ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్ స్ఫూర్తి కలిగించాడని రేవంత్రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజలను అణచివేసింది. రేవంత్రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంతికిరణ్ రిజిజు సైతం ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్.. కాంగ్రెస్ సీఎం హిట్లర్తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. ‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా పేరు లేదు హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్ ఆపరేషన్ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్ కామిక్ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి. -
‘ఆర్ఆర్ఆర్పై కిషన్రెడ్డి జవాబు చెప్పాలి’
హైదరాబాద్: మూసీ మురికి కారణంగా ఉప్పల్ పరిధిలో ఉన్న భూముల రేట్లు పెరగడం లేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. మూసీ ప్రక్షాళన చేద్దామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో రేవంత్ మాట్లాడారు. ‘మేం మూసీ నది ప్రక్షాళన చేయోద్దా..?, మూసీ మురికి కారణంగా ఇక్కడ భూముల రేట్లు పెరగడం లేదు. నల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆడబిడ్డలు కడుపుకోతకు గురౌతారని అక్కడి వాళ్లు బయటకు పంపుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయమని నల్గొండ ప్రజలు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశాను. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మూసీకి అడ్డంపడుతున్నాడు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు.హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి పడిపోయింది. మెట్రోను విస్తరించడానికి అడ్డుపడుతున్నారు. మెట్రో విస్తరించాలన్న అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. అన్ని అనుమతులు వచ్చాక కేంద్ర మంత్రి గా పనిచేస్తున్న ఆయన కాళ్లలో కట్టెలు పెట్టి ఆపుతున్నాడు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం ఉంటుంది. రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని కలిశాను. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..?, హైదరాబాద్ ప్రజలు కిషన్రెడ్డికి ఓట్లు వేయలేదా..?, మెట్రోకు అనుమతులు తెచ్చే బాధ్యత, మూసీకి నిధులు తీసుకువచ్చే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..?, తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవరు కొనాలి. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా?, తెలంగాణ ప్రజలతో గోకున్నోడు బాగుపడినట్లు లేదు. 15 వ తేదీ తర్వాత బరాబర్ మా కార్యచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
రేవంత్.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్: తనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, నిన్న(శనివారం, జూన్ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. -
మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120కి పెరుగుతాయి. మేం దీనినే వ్యతిరేకిస్తున్నాం. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని సవాలు విసిరారు. ‘వాళ్లు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు’అని కేంద్రానికి హితవు పలికారు. ‘ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత: తెలంగాణకు సుపరిపాలన’అనే అంశంపై శనివారం బెంగళూరులో ‘ది హిందూ’గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ నిర్వహించిన ముఖాముఖిలో రేవంత్ పాల్గొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రేవంత్ ఏమన్నారంటే.. రాష్ట్ర పెట్టుబడులు గుజరాత్కు మళ్లింపు కేంద్రంపై ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతాం. మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా గుజరాత్ వెళ్లి పెట్టాలని వాళ్లు (మోదీ ప్రభుత్వం) ఒత్తిడి చేస్తున్నారు. బలవంతంగా గుజరాత్లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారు. 18 గంటలు పని.. ఫ్రెండ్స్ లేరు.. రోజుకు 16–18 గంటలు పనిచేస్తా. వేరే ఇతర వ్యాపకాలు లేవు. అదే నాకు పెద్ద సమస్య. సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప వేరే ఎవరూ లేరు. రాత్రి 10 గంటల తరా>్వత ఫుట్బాల్ ఆడతా. ఇప్పుడు సమయం చిక్కడం లేదు. నేను మెస్సీకి అభిమానిని. అందుకే మెస్సీని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఆర్ఎంపీ డాక్టర్ టీజీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ పునరావాస కేంద్రం కాకూడదు. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి ఎలా పని చేస్తుందో తెలుసుకుని టీజీపీఎస్సీలో అమలు చేశా. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. కేసీఆర్ మీడియాకూ అనుమతిస్తా.. పది రోజులకో ప్రెస్మీట్ నిర్వహించి ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా. కేసీఆర్ మీడియా సంస్థ ప్రతినిధినీ అనుమతిస్తా. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతా. వ్యతిరేక వార్తలు రాస్తే దూషించను. వ్యంగ్యంగా మాట్లాడతా. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం. పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతుంటేనే హైడ్రాను ఏర్పాటు చేశా. ‘హైడ్రా’.. ఇది హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా... ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టాను. మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఆక్రమణలు, పర్యావరణం, నీటి కొరతపై సొంత మోడళ్లను అనుసరించాలి. జీఎస్టీ ఆదాయం పెంచాం.. వడ్డీలను 11–11.50 శాతం నుంచి 7–8 శాతానికి తగ్గించుకోవడానికి రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. గత 7–8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం. ఆరు నెలల్లోనే రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది. రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి. రూ.20,616 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశా. 2024–25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఏఐ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యామ్నా యం సృష్టించలేదు. ఏఐ అన్నీ సృష్టించ వచ్చు. రాజకీయ నాయకున్ని సృష్టించలేదు.నాకు ఏఐ భయం లేదు. యువతరం స్కిల్స్ పెంచుకోవాలి. అధికారులు ఏం అడిగినా ‘యెస్..’అంటారు. నేను ముందుగా ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాసుకుంటా. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు. 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో తెలుసుకున్నా. నన్ను తప్పుదోవ పట్టించలేరు. నేను ప్రతి బ్యూరోక్రాట్ మైండ్సెట్ను అర్ధం చేసుకోగలను. -
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
-
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
-
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
-
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. -
నేడే ‘కొహెడ’ మార్కెట్కు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్నగర్ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు. మార్కెట్ ప్రత్యేకతలివే.... ⇒ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3,367.35 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.32 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, మిగతాది ప్రైవేట్ భాగస్వామ్యం.ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ⇒ ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న విక్రయాలు.. 2047 నాటికి 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశముంది. తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరగనుంది. ⇒ వ్యాపారుల సంఖ్య 341 నుంచి 967కు, వినియోగదారుల సంఖ్య 16,450 నుంచి 53 వేల మందికి పెరుగుతుంది. ⇒ వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్ప్లాజా, తిరిగి వెళ్లేందుకు ఆరు వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా సహా క చ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్ వెయింగ్ బ్రిడ్జి. ⇒ పూల వ్యాపారానికి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్. దీని ద్వారా 3,600 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ⇒ వంద మందికి సరిపడా రైతు మార్కెట్. రిటైల్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం. ⇒ రైతులు, హమాలీలు, వ్యాపారులు, సందర్శకులకు విశ్రాంతి భవనాలు, సమావేశ మందిరాలు. క్యాంటీన్, హెల్త్సెంటర్, పోలీసు ఔట్లెట్, ఫైర్ స్టేషన్ ఉంటుంది. ⇒ మార్కెట్ మొత్తానికి కమాండ్ కంట్రోల్ సెంటర్గా నిలిచే టవర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నిర్మించనున్నారు. ⇒ ఇందులో బహుళజాతి వ్యాపారులు, సీసీ టీవీ వ్యవస్థ, హెలికాప్టర్ ల్యాండింగ్కు హెలిపాడ్ ఏర్పాటు చేయనున్నారు. ⇒ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సహా ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం 210 షాపులతో రిటైల్ వ్యాపార ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు 30 షాపులతో ప్రత్యేక వేదిక అందుబాటులోకి ఉంటుంది. ⇒ మామిడి, బత్తాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి పండ్ల వేలానికి ఆరు ప్రత్యేక ఆక్షన్ హాళ్లు సహా 250 మేజనైన్ షాపులను వ్యాపారులకు కేటాయించనున్నారు. ⇒ పండ్లు పాడవకుండా కాపాడేందుకు 335 షాపులతో కూడి న విశాలమైన నాలుగు శీతలీకరణ షెడ్లు నిర్మించనున్నారు. ⇒ పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, పైనాపిల్ మార్కెటింగ్కు దేశంలోనే తొలి ‘డ్రైవ్–త్రూ మెలన్ మార్కెట్’ను నిర్మించబోతున్నారు. ⇒ వ్యాపారస్తుల కోసం 52 ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తారు. ⇒ డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, డ్రైఫ్రూట్స్ కోసం 40 ఏసీ షాపులు సహా నానో క్లోరినేషన్, ఇన్–హౌస్ ఐస్ ఫ్లేక్ ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఫిష్ అండ్ సీ ఫుడ్స్ మార్కెట్ ⇒ ఫౌల్ట్రీ, మాంస ఉత్పత్తుల విక్రయాలకు 24 ఏసీ షాపులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే ఇది అత్యాధునిక మార్కెట్: తుమ్మలతుర్కయాంజల్: సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశంలోనే అత్యాధునిక వ్యవసాయ మార్కెట్గా రూపుదిద్దుకోనుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ అభివృద్ధి, ధరల సమాచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. -
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మోటార్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ మేరకు హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదేపదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని మేము ముందుగానే హెచ్చరించినా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టు ద్వారా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి పడిపోయింది.కృష్ణా జలాల్లో తెలంగాణ తాత్కాలిక వాటా 34 శాతం, ఆంధ్రప్రదేశ్కు వాటా 66 శాతం. 2025–26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరగ్గా తెలంగాణ వినియోగం ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయిలో 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తో సాగునీటి రంగానికి ముప్పు ‘సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్కో సూచించడంతో భారీ పంపులను తరచూ ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తోంది. ఈ విధానంతో పంపులు, మోటార్లకు జరిగే నష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.8 ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ పరిమిత సమయంలోనే జరిగే ప్రమాదం పొంచి ఉంది.తద్వారా నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా–గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతు డిస్కమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
పాలమూరు, డిండికి ఏపీ ఒప్పుకుంటేనే..
సాక్షి, హైదరాబాద్: ‘పక్క రాష్ట్రం (ఏపీ)తో చర్చలు జరుగుతున్నాయి. తొందర్లోనే వాటిని (జల వివాదాలను) పరిష్కరించుకుంటాం. మీకు తొందర్లోనే మంచి వార్త వినపించబోతున్నా. ముందు మాకు పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నూటికి నూరు శాతం నికర జలాలను ఇస్తే సముద్రంలో పోయే నీళ్ల గురించి ఏపీతో మాట్లాడతాం. కృష్ణా జలాల పంపిణీ అంశం బచావత్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలు.. మీరు (ఏపీ) 512 టీఎంసీలు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకాలు చేసి కృష్ణా పరీవాహక ప్రాంతానికి శాశ్వతంగా మరణశాసనం రాసిండు.ఆ మరణశాసనాన్ని తిరగరాయడం చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులకు అంగీకరిస్తూ ఏపీ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఏపీ ప్రాజెక్టులపై చర్చిస్తాం. లేకపోతే చర్చించే సమస్యే లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ శుక్రవారం కరివేన రిజర్వాయర్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నికర జలాల్లో ఒక చుక్కకూ రాజీపడం...‘గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల్లో ఒక చుక్కకే రాజీపడం. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతి చుక్క నీటి హక్కునూ కాపాడే బాధ్యత నేను, మంత్రి ఉత్తమ్ తీసుకుంటాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇస్తేనే పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై మాట్లాడటానికి ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీకి చెప్పించాం. పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపులను సైతం తీసుకొస్తాం.డిసెంబర్లోగా చర్చల ద్వారా జిల్లాకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో మెజారిటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రాజెక్టులు కట్టుకొని మనం 968 టీఎంసీలను వాడుకున్న తర్వాతే సముద్రంలో పోయే నీళ్ల లెక్క తేలుతుంది. 968 టీఎంసీలను మనం భద్రం చేసుకొని మిగిలిన దాని (వరద జలాలు) గురించి మళ్లీ చర్చ చేస్తాం. గోదావరిలో ఏపీకి ఉన్న 516 టీఎంసీలను వాళ్లు ఎక్కడ వాడుకుంటారో వారిష్టం. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.కమీషన్ల కోసమే లిఫ్టులు, పంపులు...‘కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్ల ఖర్చు చేసిండు. అందులో అధిక భాగం పంపులు, లిఫ్టులకే ఇచ్చి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసిపోయిండు. వాళ్లలాగా కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పనిచేసే వాడిని కాదు. 20 ఏళ్లలో జెడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు జిల్లాలో రూ. వేల కోట్ల పనులు జరిగినా ఒక్క రోజైనా నాపై చిన్న ఆరోపణ అయినా వచ్చిందా?’ అని రేవంత్ ప్రశ్నించారు.పంచె కట్టుకున్నోళ్లంతా రాజశేఖరరెడ్డి కాదు..‘పాలమూరు’ ప్రాజెక్టును కొలిక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటే రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వారు (బీఆర్ఎస్) బయలుదేరారు. ఒకాయన పంచె కట్టుకొని రాజశేఖరరెడ్డి అనుకుంటడు. పంచె కట్టుకున్నోళ్లంతా రాజ శేఖరరెడ్డి అయితే బానే ఉండే. ఇంటి పేరు మార్చుకున్నడు ఇంకొకాయన. ప్రజలు చీదరించుకుంటారనే సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.జూన్కల్లా పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలు..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. తక్కువ భూసేకరణతో ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలను జూన్ వరకు పూర్తి చేస్తాం. బ్రాంచి కాల్వలు, మిగతా పనులకు ఆ తర్వాత టెండర్లు. పంపులు, లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్లను 2027 జూన్లోగా పూర్తి చేసి ఉదాండాపూర్ వరకు నీళ్లను తరలిస్తాం. లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలి? డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఎలా చేయాలో 6 నెలల తర్వాత సమీక్షిస్తాం’ అని సీఎం తెలిపారు.కర్ణాటక సరిహద్దులో బరాజ్లు‘కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చిన్న బ్రిడ్జీ కమ్ బరాజ్లు కట్టి దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకుంటోంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జి కమ్ బరాజ్లు కట్టుకుంటే నిల్వతోపాటు భూగర్భ జలాలూ పెరుగుతాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చెరి సగం ఖర్చు భరించేలా 60–70 శాతం నీళ్లు మనం వాడుకునేలా కార్యాచరణ తీసుకున్నం’ అని సీఎం రేవంత్ చెప్పారు.మోదీనే దిగిపోమనండి..‘ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఏం వెలగబెట్టిండో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు వేశాడా? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసిండా? అందుకే తక్షణమే మోదీని గద్దెదిగమనండి. రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ నెరవేరేలా చేయిస్తా. పాలమూరు–రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయిస్తా. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కేంద్రంతో కొనిపిస్తా. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఆర్నెల్లలో సమస్యలన్నీ పరిష్కారం: మంత్రి ఉత్తమ్ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాసం, పునర్నివాసం సమస్యలతోపాటు పర్యావరణ, అటవీ అనుమతులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్తో కలిసి కరివేన రిజర్వాయర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం గూడెందొడ్డి, భూత్పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడంతోపాటు భీమా, కృష్ణా నదులపై కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత సర్కారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ. 1.81 లక్షల కోట్ల అప్పులు చేసి ఎలాంటి సాగునీటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. తమ పాలన పూర్తయ్యేలోగా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్నారు. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’
జడ్చర్ల: పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు తెలుసన్నారు సీఎం రేవంత్రెడ్డి. జడ్చర్ల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కెసీఆర్ను లంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే…పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికిఖర్చు చేశాం. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డికి కమలాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. రేవంత్రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. -
సీఎం బామ్మర్దిది రూ.15 వేల కోట్ల కుంభకోణం
చంచల్గూడ: సీఎం రేవంత్రెడ్డి బామ్మర్ది సృజన్రెడ్డి రూ.15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన గురువారం చంచల్గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. సోలార్ టెండర్ల అంశం, నైనీ బొగ్గు టెండర్ల అవకతవకలను మాజీమంత్రి హరీశ్రావు వెలుగులోకి తెచ్చారని చెప్పారు.సింగరేణిలో ఉద్యోగ నియామకాలపై విజిలెన్స్ విచారణ చేపిస్తామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో కార్మికులు కలత చెందారన్నారు. కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే సుమన్ను జైల్లో పెట్టారని చెప్పారు. బాంబులు పెట్టి సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్ను లేపేస్తామని గతంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారని, అది కూడా శిక్షార్హమేనన్నారు. హరీశ్రావుపై పెట్రోల్ పోసి తగులబెడతానని మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ఇతరులకో న్యాయం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకో న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో సుమన్పై 220 కేసులు పెట్టారని, ఇప్పుడు ఇంకా అక్రమ కేసులు పెట్టి రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నారని చెప్పారు. తీయని 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును తీసినట్టు అవకతవకలకు పాల్పడి రూ.1,600 కోట్ల గోల్మాల్కు తెరలేపారన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు శ్రీనివాస్యాదవ్, సుధీర్రెడ్డి ఉన్నారు.పాతబస్తీలో సందడి చేసిన కేటీఆర్..చార్మినార్ (హైదరాబాద్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం పాతబస్తీలో పర్యటించారు. చంచల్గూడ జైల్లో తమ పార్టీ నాయకుడు బాల్క సుమన్ను పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు అలీ మస్కతీ తదితరులతో కలిసి అక్కడి నిమ్రా కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ చాయ్ తాగారు. తర్వాత ఆయన చార్మినార్ వద్ద పర్యాటకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్ను సందర్శించి, ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ని ఆస్వాదించాను’అని పేర్కొన్నారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు కేఫ్ సిబ్బందికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరు నెలల్లో ‘పాలమూరు’ నీరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్/సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్ వరకు నీరందించాలని చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను సత్వరంగా పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ప్రధాన భూసేకరణను వేగవంతం చేయాలని, ఈ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో అధికారులతో రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. నార్లాపూర్, ఏదుల, కరివెన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాగా, వీటి లింకేజీకి సంబంధించి పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. నెలవారీగా ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నిధులతో పూర్తయ్యే పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఆరు నెలల్లోగా కరివెన రిజర్వాయర్ వరకు నీళ్లు అందించే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మరో 15 రోజుల తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తొలి రోజు చకచకా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం చకచకా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పలు ప్రాజెక్టులను సందర్శించారు. కొడంగల్– నారాయణపేట– మక్తల్ ఎత్తిపోతలు, గుడ్డెందొడ్డి పంప్హౌస్ పనుల ప్రగతిపై స్వయంగా ఆరా తీశారు. కోయిల్సాగర్, కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బరాజ్ల ప్రతిపాదిత స్థలం, జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించిన అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో రేవంత్రెడ్డి బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. హామీల అమలుకు కట్టుబడి... మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిపారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పురోగతిపై రేవంత్రెడ్డి ఒక్కో ప్యాకేజీలో పెండింగ్ పనులకు గత కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ పనులు నూరు శాతం పూర్తికాగా, ఏదుల రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వట్టెం రిజర్వాయర్ కట్ట పనులు పూర్తికాగా, ప్రస్తుతం కాంక్రీట్, రివిట్మెంట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల అంచనాలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. కీలకమైన కాల్వల నిర్మాణంపై... గరిష్ట ప్రయోజనాల కోసం కీలకమైన కాల్వల నిర్మాణం పైనే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. నిధుల అవసరాలు, కాలపరిమితులతో కూడిన వాస్తవిక గడువులను సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారన్నారు. కోర్టు కేసుల్లో ఉన్నవి, పనులపై స్టే విధించిన వాటి విషయంలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులను మొదటి ప్రాధాన్యతగా భావించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు
సాక్షి,హైదరాబాద్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. బీమా కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకోగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి లకు జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన ఇరిగేషన్ అధికారులు. -
డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనాలంటూ దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతో పాటు ఆ దేశ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంపై మషాటిలే సానుకూలంగా స్పందించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పాల్ మషాటిలే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ప్రతినిధుల బృందంతో సీఎం సమావేశమయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారంపై చర్చించారు. గత ఏడాది సమ్మిట్తో పెట్టుబడుల వెల్లువ గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025’భారీ విజయాన్ని సాధించిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని సీఎం గుర్తు చేశారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి రంగాలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఫారŠూచ్యన్ 500 కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీలు) హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేస్తాం తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో మధ్యప్రాచ్య, ఇతర అనేక దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్నారని రేవంత్ తెలిపారు. నగరాన్ని ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 30 వేల ఎకరాల్లో పర్యావరణ హితంగా, నెట్ జీరో టెక్నాలజీతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పరిశోధనలకు ఇది కేంద్రంగా మారుతుందని వివరించారు. పెట్టుబడులకు అనుకూలం: మంత్రి శ్రీధర్బాబు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు చెప్పారు. బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రెండు దేశాలదీ చారిత్రక బంధం: పాల్ మషాటిలే వచ్చే డిసెంబర్లో జరిగే సమ్మిట్–2026కు తమ దేశ ప్రతినిధుల బృందంతో కలిసి పాల్గొంటామని మషాటిలే తెలిపారు. ఈ సదస్సుతో ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య చారిత్రక బంధం ఉందని, దశాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల ఉప మంత్రి మొరాకాతో పాటు పలువురు మంత్రులు, దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఎ.సూక్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీశ్రావు చేసిన విమర్శల్లో తప్పేమీ లేదు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీపై తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాం. రేవంత్ సీఎం కాగానే తెలంగాణ తల్లి రూపం మార్చి, సెక్రటేరియట్ ముందు రాజీవ్గాంధీ విగ్రహం పెట్టాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ విగ్రహాలను గాందీభవన్కు పంపుతాం. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలపై రుద్దింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి తిరోగమనంలోకి నెడుతోంది. మోదీ– రేవంత్ భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం సాగుతోంది. మొదటి అర్ధభాగం ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ పాలనలో ట్రైలర్ కాదు, ఇంటర్వెల్ కూడా పూర్తయింది. మిగతా అర్ధభాగం మరింత అధ్వానంగా ఉంటుంది. ఆయన తెలంగాణను పాతాళంలోకి తొక్కుతున్నారు. మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీని రేవంత్ బొంద పెడతారు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రవికాంత్రెడ్డి వ్యవహరించగా.. ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.విజయ్కుమార్రెడ్డి, వరికుప్పల రమేష్ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. పదేళ్లలో సాధించిన ప్రగతి క్షీణించింది.. తెలంగాణ రైజింగ్ నినాదం పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్ జరుగుతోంది. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పురోగతి ప్రస్తుతం క్షీణించింది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు కాంగ్రెస్ హామీలతో మోసపోయారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఉచిత విద్యుత్ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్రెడ్డి సిద్ధాంతం. లేని అప్పులను ఉన్నదిగా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆర్బీఐ తన నివేదికతో చెంపదెబ్బ కొట్టింది. తెలంగాణాకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్ మాకు పొలిటికల్ గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 90కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి ఓడిపోతారు. దుమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఉప ఎన్నికలకు రావాలి. 2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నా. బీజేపీతో పొత్తు ఉంటుందన్నది పూర్తిగా ఊహాజనిత ప్రచారం. బీఆర్ఎస్కు కేసీఆర్ ట్రంప్ కార్డు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్. ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు. పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ ఖచ్ఛితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అనడంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. ఈ నేల.. పోరాటాలు, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిచింది. మీరు వచ్చి మీ కుటుంబాలతో ఉండండి. మీ భూములు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదం అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నాడు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయేందుకు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? మోదీ ఆర్థిక ప్రాంతీయ వాదం సరైనదేనా? ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తీసుకెళ్తున్నారు. జాతీయ వాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం, గుజరాత్కు ప్రధానమంత్రి మాదిరి వ్యహరిస్తున్న తీరు సరైనదేనా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. జనగణమన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. మాకు జాతీయ భావన, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్ కళ్యాణ్ను నటుడిగా అభిమానిస్తాం, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం. పవన్ వ్యాఖ్యల వెనుక రేవంత్ ఉన్నట్టు అనుమానం ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో 2018లో చంద్రబాబు టీడీపీ, 2023లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసింది. తెలంగాణలో కొత్తగా జనసేన పోటీ చేసేదేం ఉంది? తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇక్కడకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు వచ్చి ఇక్కడ సభ పెట్టి విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. మరొకాయన ంతల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. జనసేన సభకు అనుమతి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారనే అనుమానం వస్తోంది. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చట్టం చేయాలి ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే.. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తాం. రేవంత్రెడ్డి హయాంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని అన్ని కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లకే దక్కుతున్నాయి. సుంకిశాల నిర్మాణం కూలిన ఘటనలో కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టు చేయాలని జలమండలి కోరితే.. చేయలేని దమ్ములేని సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. సెక్షన్ 8ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర గతంలో కొంత జరిగింది. మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలో మరో బలమైన ఉద్యమం వస్తుంది. -
DK శివ కుమార్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్
-
రేవంత్ కు KTR ఓపెన్ ఛాలెంజ్..నేను సిద్ధం నువ్వు సిద్దమా?
-
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
సాక్షి, సోమాజిగూడ: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి సాధించినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోని తప్పుకుంటానని సవాల్ చేశారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డి.. అందరినీ తొక్కేస్తా అంటూ నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా సోమాజిగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఎన్నో పోరాటాలు, బలి దానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ పుట్టింది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం పూర్తి అయ్యింది. తెలంగాణ పోరాట, త్యాగాలను స్మరించుకోవాలి. అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టేలా చేశాం. గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నిర్మించాం. 2014కు ముందు వలసలు, ఆత్మహత్యలు ఉండేవి. తెలంగాణ వచ్చాక వలసలను అరికట్టాం, ఆత్మహత్యలను నిర్మూలించాం. రైతుల ఆత్మహత్యలు నివారించాం. తెలంగాణను టాస్క్గా తీసుకున్నాం. కేసీఆర్ తెచ్చిన పథకాలను కేంద్రం సైతం కాపీ కొట్టింది. చివరకు మాపైనే అహంకారం అనే ముద్ర వేశారు. అధికారం పోయింది అనే బాధ మాకు లేదు. తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ మనపై రుద్దింది. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో 300 మంది అమరులను బలిగొన్నది కాంగ్రెస్. 2004లో కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ కథలో నంబర్-1 విలన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ ఆమరణ దీక్ష లేకపోతే తెలంగాణ లేదు. 2001లో పార్టీ పెట్టి ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి అన్న గుండె ధైర్యం ఒక్క కేసీఆర్కు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవచ్చు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాంతాలుగా విడిపోయినా కలిసి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా కేసీఆర్ పాలన సాగింది. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రాజెక్ట్లను నిర్మించాం. తెలంగాణలో నాయకత్వ కెపాసిటీ ఉందా? అని అడిగిన వాళ్ళు మాకు కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండేది అనే పరిస్థితి వచ్చింది.కేసీఆర్ తెలంగాణలో అమోఘమైన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి జరిగిందా?. కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నా. ఇతర రాష్ట్రాల్లో ప్రగతి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఇస్తామన్నారు. మళ్లీ మూడు నెలల్లో పిల్లలు పుడతారా? అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 30 నెలలు అయినా హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని ఏమనాలి?. ఢిల్లీకి కప్పం కట్టడం ఒక్కటే రేవంత్ రెడ్డికి తెలుసు. కేసీఆర్ నామస్మరణ తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏంటి?. తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది’ అని ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొక్కేస్తా.. తొక్కేస్తా అని నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశాడు. మా పదేళ్ల పాలనలో మేము రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారు. మంత్రులు పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేబినెట్లో మంత్రులకు శృతి, లయ లేదు. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. రెండేళ్లలో కాంగ్రెస్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బంతా ఏం చేశారు. దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కం ఇక్కడే ఎందుకు? అని ప్రశ్నించారు. -
బిగ్ షాక్: రేవంత్, ఉత్తమ్లకు అధికారుల డీమోషన్!
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు."ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! -
రాష్ట్రం 'పంట' పండాలి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూల క్షేత్రం. రైతులు కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలు, కూరగాయలు, పండ్లు పండించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని చెప్పారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘2025–26లో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేశాం. యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.11,903 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దేశంలో యాసంగిలో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% కావడం గర్వకారణం. యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగుతో రైతులు చరిత్ర సృష్టించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..’అని సీఎం చెప్పారు. రూ.60 వేల కోట్ల భూములు స్వాధీనం ‘రాష్ట్రంలో ప్రజలు రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆదరాభిమానాలు చూపడం మాకు ఎనలేని శక్తిని ఇచ్చింది. మేం పాలకులుగా కాకుండా సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. క్యూర్ ఏరియాలో ప్రభుత్వ భూములు, చెరువుల్లో కబ్జాలను తొలగించడం ద్వారా రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా భూములను హైడ్రా స్వాదీనం చేసుకుంది. మెట్రో రైలు కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చాం. ఫేజ్–1 కింద మూసీ ప్రక్షాళన ప్రారంభించాం. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి రూ.లక్ష కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ.60 వేల కోట్ల రుణాలను పంపిణీ చేశాం. రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. కొత్తగా ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. మహారాష్ట్ర సీఎంకు ఏడాదిగా లేఖలు.. ‘జలయజ్ఞం ప్రాజెక్టులు, 2014–15 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పునరుద్ధరణ మొదలు పెట్టాం. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించడానికి మహారాష్ట్ర సమ్మతి కోరేందుకు ఆ రాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం గతేడాదిగా లేఖలు రాస్తున్నా. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్ శాఖలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అటవీ, విద్యా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ల జారీ నిరంతరం జరుగుతుంది. విద్యా రంగంలో సంస్కరణలు సర్కారీ విద్యలో సంస్కరణలతో కేంద్రం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్ వ్యవస్థీకరించాం. స్కిల్స్ యూనివర్సిటీలో 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా, 838 మంది మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మరో 2,769 బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య ప్రవేశపెట్టబోతున్నాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ బడులు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం..’అని రేవంత్ వెల్లడించారు. గ్రేహౌండ్స్కు గ్యాలెంటరీ అవార్డులు విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్యాలెంటరీ అవార్డులు ప్రదానం చేశారు. విద్యారంగంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకూ పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో గ్రేహౌండ్స్ విభాగం ఆర్ఐ టి.మహేశ్, ఎస్ఐ షేక్ నాగుల్ మీరా, హెచ్సీ కె.ఆదినారాయణ, ఏఆర్ఎస్ఐ కె.అశోక్, పీసీలు ఆర్.సునీల్కుమార్, ఎం.కళ్యాణ్కుమార్, జి.శ్రీధర్, సీహెచ్ రవీంద్రబాబు, రాథోడ్ రమేశ్, కె.సందీప్కుమార్, ఎం.కార్తీక్, వి.మధు, సీహెచ్ సంపత్, ఎస్ఐబీ ఏఆర్ఎస్ టి.మహేందర్ రావు, ఇంటిలిజెన్స్ హెచ్సీ బి.శివకుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ పీసీ బండికింది శ్రవణ్కుమార్ ఉన్నారు. 2018 మార్చి 2న ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని పూజారి కాంకేర్లో నక్సల్స్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన బి.సుశీల్కుమార్ తరఫున అతడి సతీమణి బి.సుష్మకుగ్యాలెంటరీ పురస్కారాన్ని సీఎం అందజేశారు. కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గోవర్ధన్, మహబూబ్నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, హనుమకొండలోని గట్ల నార్సింగాపూర్ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా మణికొండ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.నిరంజన్ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. సీఎం ప్రసంగానికి ఎండ దెబ్బ! రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎండ తీవ్రతను ప్రస్తావించిన సీఎం.. తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా ముగిస్తున్నట్టు ప్రకటించారు. రాతపూర్వకంగా ఇచి్చన పూర్తి ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు సూచించారు. 13 నెలల్లోనే 1.2 లక్షల ఇళ్లు‘రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 13 నెలల్లోనే లక్షా 20 వేల ఇళ్లను పూర్తి చేశాం. సెప్టెంబర్ 17 నాటికి మిగతా 2 లక్షల ఇళ్లూ పూర్తి చేస్తాం. రెండో విడతగా క్యూర్ పరిధిలో లక్ష, మిగిలిన ప్రాంతాల్లో 2.5 లక్షలు కలిపి మొత్తం 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనూ రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 3.38 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. స్కిల్డ్ వర్కర్లకు 25.9 శాతం, అన్ స్కిల్డ్ వర్కర్లకు 34.95 శాతం కనీస వేతనాలు పెంచాం. తెలంగాణ పోరాట యోధులను గుర్తించడానికి కమిటీని నియమించాం. త్వరలో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు చేయనున్నాం. రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించాం. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. -
CM రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ 2026 హైలైట్స్
-
నేను మాట ఇస్తున్నాను.. తండాల్లో అందరికి ఇల్లు కట్టిస్తా..
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోంది. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు. ‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ అన్నారు. కాళోజీ స్ఫూర్తితో.. అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రహితం కోసం పని చేస్తున్నాం. మాది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యాం. తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నాం. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీపైమరీ తరగతులు ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం. జూనియర్ కళాశాల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తాం.పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది. పేదలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయాలని నిర్ణయించాం. 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాం. రూ.22 వేల కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఈసారి క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డులు ఇచ్చాం. అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని.. ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం కంటే ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి ఆయన నివాళులర్పించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ ఉన్నారు. మరోవైపు.. ఖమ్మం గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తోపాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు.ఇక.. తెలంగాణ అసెంబ్లీలో ఉదయాన్నే వేడుకలు జరిగాయి. శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా వాళ్లు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలువేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. -
అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా వాటా!
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితు లు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను రాబ ట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లోని జలాశయాలు నిండిన తర్వాతే నీటిని విడుదల చేసే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉండడంతో అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించడానికి ముందుగానే ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చించాలని ఆదేశించారు.వానాకాలం సన్నద్ధతపై సోమవారం సచివాలయంలో వివిధ శాఖలతో సీఎం సమీక్షించారు. మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదుత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని.. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని ప్రత్యామ్నాయంగా వారికి విద్యుత్ సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మితమైన సీలేరు, తుంగభద్ర ప్రాజెక్టుల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణ అంచనాలకు తగ్గట్టూ పంటల సాగువాతావరణ శాఖ అంచనాలను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు. పంటల మార్పిడి, పంట వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంటలు, ఇతర పంట రకాల సాగుపై రైతు వేదికల నుంచి రైతులకు అవగాహన కల్పించాలని, ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని ఆదేశించారు. గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తాను పర్యటించి ఇచ్చిన హామీల అమలులో పురోగతిపై అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.క్యూర్లో వరద నీటి సంరక్షణకు 141 బావులు క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి నీటి సంరక్షణ బావులు నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే 11 బావుల నిర్మాణం పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 67 లక్షల క్వింటాళ్ల వడ్లను సేకరించామని, ఇంకా 15 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని, వాటన్నింటినీ సేకరిస్తామని, మొత్తం 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటామన్నారు. సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను రేవంత్ ప్రారంభించారు. మొదటి విడతలో పూర్తయిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం కొండపల్లి శివారు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సోమవారం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషీ పంజాబ్, హరియాణాకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. జూన్ 15లోపు ధాన్యం సేకరణ పూర్తవుతుందని, అన్ని పంటలను మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆఫీసు ముందు ధాన్యాన్ని పోస్తామని హెచ్చరించారు. కేంద్రంతో యుద్ధమే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రైతుల పక్షాన పోరాటం చేసి మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కిషన్రెడ్డి తెలంగాణలో తిరగడానికి సమస్య అవుతుందన్నారు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి సిఫారసు తీరుగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని, కేంద్రం కొనుగోలు చేసేలా ఆయన బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు భూ సేకరణకు 1500 ఎకరాలు కోసం చర్చిద్దామని లేఖ రాస్తే కిషన్రెడ్డి నుంచి ఇప్పటికీ స్పందన లేదన్నారు. బస్సుయాత్ర పేరుతో బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లడం కాదని దుయ్యబట్టారు. ఎవరినీ లెక్కచేయను నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగం హక్కులు, సమస్యలే ముఖ్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వారి కోసం ఎవరినీ లెక్కచేయని స్పష్టం చేశారు. ఏదైనా నేను మొదట పరిష్కారం చేసుకోవాలని చూస్తానని, అలా కాకపోతే పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ అంటే ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంను ఒప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించకపోగా, మీ ఆలోచన ఏంటని ప్రశ్నించారు. ప్రాణహితపై బరాజ్ కట్టి ఎల్లంపల్లి గ్రావిటీతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను విడిచిపెట్టి, కాళేశ్వరం కడితే కూళేశ్వరంగా మారిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర నదీ జలాలు పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నారని, అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహకరించడం లేదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి లక్షలాది మందికి అన్యాయం చేశారని చెప్పారు. తాము మనుషులు, ఊళ్లను అడగం లేదని, కేవలం భూమి అడుగుతున్నామని చెప్పారు. రెండో విడత రెండన్నర లక్షల ఇళ్లు రాష్ట్రంలో మొదటి విడత 4.50 లక్షల ఇళ్లకు అదనంగా గూడేలకు 21వేలు అదనంగా ఇచ్చాం. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తున్నాం. ఇంకా ఇళ్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండో విడతలో అందరికీ ఇళ్లు వచ్చేలా 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో ఇల్లు వచ్చిన వారికి భాగస్వామ్యం చేసి అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు. గిరిజనులు తమకు ఆత్మగౌరవంగా బతికేందుకు ఇళ్లు ఇవ్వాలని కోరారని చెప్పారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ప్రేమ్సాగర్రావు, పాల్వాయి హరీశ్బాబు, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కెరమెరి మండలం కొఠారి గ్రామపంచాయతీ కొత్తగూడలో లబ్ధిదారులు సిడాం కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ మడావి శంతాబాయితో కలిసి ప్రారంభించారు. కాసేపు నేలపైనే కూర్చుని లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఆరు సబ్స్టేషన్లు, రెబ్బెన మండలం నంబాలలో 2 మెగావాట్ల సోలార్ప్లాంట్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం రూ.112.14కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ను చేస్తాం గుడిసెలు లేని ఆదిలాబాద్ను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది వరకు అవసరమైన ప్రతీ ఒక్కరికి ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఇందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో వివరాలు తీసుకుని ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వివక్ష లేని పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెలు ఉన్న చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇవ్వాలని సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలను కోరారు. ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదని, మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కోరారు. మీ పిల్లల్ని చదివిస్తామని మాటివ్వండి.. ‘ఉచిత విద్యుత్, బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనని అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆదివాసీ మహిళల్ని అడిగారు. ‘మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం చదివించాలని కోరుతున్నా.. చదివిస్తామని మాట ఇవ్వండి అని ఆదివాసీ మహిళలను కోరారు. చదువు ఒక్కటే మార్పు తెస్తుందన్నారు. కొత్తగూడలో 25 ఇళ్లు పూర్తికాగా వాటిని పరిశీలించారు. -
బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్
ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్కు కిషన్రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్లు అవసరం లేదు.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు.. కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. -
అది రైతులను చంపేసే డిస్కమ్!
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో రైతుల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటును ఎగ్గొట్టేందుకే ఇప్పుడు రైతు డిస్కమ్ అంటూ పాటపాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం చెప్పే రైతు డిస్కమ్ రైతు మెడకు ఉరిపెట్టే డిస్కమ్ అని, అది రైతులను చంపేసే డిస్కమని ఘాటుగా విమర్శించారు. ఆదివారం సికింద్రాబాద్లోని మిల్లీనియం గార్డెన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్రెడ్డి బయటి దేశానికి వెళ్లినపుడు రైతులకు 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందన్నారని, దాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు రైతు డిస్కమ్ పాట అందుకున్నారన్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధు రైతుల ఖాతాలో పడటం లేదు కానీ.. రాహుల్ బంధుకు మాత్రం నెలనెలా పడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం సంచులు ఇవ్వడం పట్టించుకోకున్నా, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద ముఖ్యమంత్రికి బాగా మోజుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించే ధైర్యముందా? కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లలో ఆరు ఇళ్లయినా కట్టించారా, కనీసం ఆరు ఇటుకలైనా పెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరిచ్చిన 420 హామీలు నెరవేరుస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చిన్న పిల్లల దగ్గరకు వెళ్లినా బూతు పురాణాలు మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకుతానని, లాగులో తొండలు వేస్తానని అంటున్నారని మండిపడ్డారు.అందుకే ఆయన తమ్ముడు కొండల్రెడ్డి లాగే ఈయనను తొండలరెడ్డి పేరుతో పిలవాలని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చమంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశాడని అంటున్నారని.. అదే నిజమని కానీ అప్పులు చేసి లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేశారని, రెండుమార్లు రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయలేనిది కేసీఆర్ 6 నెలల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ వ్యవస్థను మార్చి 24 గంటలు కరెంటు ఇచ్చాడన్నారు.కాంగ్రెస్ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకుందని కానీ తెలంగాణలో ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, బూత్స్థాయి నాయకులు బీఎల్వోలతో ఉంటూ అర్హులది ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఖర్గేకు స్వాగతం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న ఆయన కొద్దిసేపు హైదరాబాద్లో ఆగారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారని, ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) వివరాలతో పాటు రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఖర్గేకు మహేశ్గౌడ్ వివరించారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఇందిరమ్మ రెండో విడతకు నేడు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రవేశపెట్టిన పేదలకు సొంటింటిని కల్పించే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు శ్రీకారం చుడుతోంది. కీలక పథకమే అయినప్పటికీ, తొలివిడత కేటాయించిన ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగటం, కేంద్రం నుంచి సకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం అందకపోవటం వెరసి కాస్త గందరగోళంగా మారిన ఈ పథకాన్ని ఎట్టకేలకు పట్టాలెక్కించిన ప్రభుత్వం, సోమవారం రెండో విడత ఇళ్ల కేటాయింపు ప్రారంభిస్తోంది.ఆసిఫాబాద్ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రెండో విడతను ప్రారంభిస్తున్నారు. అక్కడికి సమీపంలోని కొత్తగూడలో మొదటి విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఇళ్ల గృహప్రవేశాలు జరగబోతున్నాయి. గృహ ప్రవేశానికి 1.13 లక్షల ఇళ్లు.. గత ఏడాది ఫిబ్రవరి 3న నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ విడతలో నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం కోటా కలుపుకొని 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిల్లో ఇప్పటికే 60 వేల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 1.13 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి.వాటి గృహప్రవేశాలు జరగబోతున్నాయి. 50 వేల మంది లబి్ధదారుల ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతకు వచ్చే సరికి ప్రభుత్వం కోటాను తగ్గించింది. జీహెచ్ఎంసీ–కోర్ పరిధి పోను మిగతా వంద నియోజకవర్గాలకు సంబంధించి రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1500 వరకు మంజూరు చేయటం విశేషం. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు పేదల ఇళ్ల రికార్డు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 10 అంతస్తుల్లో ఉండే భారీ టవర్లు కూడా ఉండనున్నాయి. ఇవి కాకుండా నగరంలో సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు వ్యక్తిగత ఇళ్లను కూడా మంజూరు చేస్తారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇప్పుడే లబ్ధిదారులకు కేటాయించనున్నారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరై , లబ్ధిదారులు పూర్తి చేసుకోలేకపోయిన నాటి ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయనున్నారు. గత ప్రభుత్వం 2023లో గృహలక్ష్మి పథకంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడా నిధులు మంజూరు చేస్తారు. వెరసి మరో ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో స్వల్ప సమయంలో ఇంత భారీ సంఖ్యలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం జరగటం రికార్డుగా ప్రభుత్వం చెబుతోంది.నేడు కుమురంభీం జిల్లాకు సీఎం రెబ్బెన: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా సాయంత్రం 5:45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చేరుకుంటారు. గ్రామంలో నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని లబి్ధదారులతో మాట్లాడతారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తారు. అనంతరం 6.55 గంటలకు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లాలో రూ.112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయల్దేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సభ ఇన్చార్జి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. -
‘బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది’
సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్ కరెంట్ విషయంలో బడేభాయ్ చెప్పినట్టు సీఎం రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24గంటల విద్యుత్ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.గుజరాత్లో రైతులకు ఏడుగంటలే కరెంట్ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్కు మంగళం పాడింది. టీజీఆర్పీడీసీఎల్ థర్మల్ పవర్ ఇవ్వరట.. సోలార్ పవర్ మాత్రమే ఇస్తారట. బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం...సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు -
YSR చరిత్ర ఏంటి.. మీ చరిత్ర ఏంటి..? రేవంత్ పాలనపై అరవింద్ కామెంట్స్
-
రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం..
కవాడిగూడ/ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి జీవో 17తో చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు సీఎం రేవంత్రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు, బీజేపీ నేతలకు దక్కుతున్నాయని ఆరోపించారు. 2028లో బీఆర్ఎస్ వస్తుందని, 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మందా శ్యామ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఒక్క ఇళ్లయినా కట్టావా? జీహెచ్ఎంసీలో ఒక్క ఇళ్లయినా కట్టావా అంటూ సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఎంత మంది ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ ఘాటుగా మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా... అన్న సీఎం రేవంత్రెడ్డి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి?’అని సీఎం రేవంత్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్ పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ ఎత్తేయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్ఎస్ నా సవాల్ను స్వీకరించాలి. అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్సే. 2017, జూన్ 30న అజయ్మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా. మోదీకి కిషన్రెడ్డి చెప్పాలి కదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా? సోయి తప్పిన మాటలు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు? ప్రధానికి కనపడడం లేదా? గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్ఐఆర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం. మహిళా సమాఖ్యలతో గోదాములు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్ఏనే అబద్ధాల డీఎన్ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. హరీశ్.. ఓ బబుల్ షూటర్ అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్రావు బీఆర్ఎస్లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్రావు మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది? కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో నాది, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వడ్లు కొనంది ఎవరు?అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?. -
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
రేవంత్ రాజకీయ కుట్రలపై.. బీజేపీ నేత కిశోర్ రెడ్డి కామెంట్స్
-
నాకూ మినహాయింపొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందే. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో సహా. నాకు కూడా మినహాయింపు ఇవ్వొద్దు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్చార్జీలతో సమన్వయంతో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో మమేకం కావాలి. నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేరే వారికి అప్పగించండి. నాకు ఏదైనా ఇతర అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వండి. నేనే వెళ్తా. ఆ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతా. వారితో కలిసి ఎస్ఐఆర్ విషయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తా..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు 45 లక్షల పార్టీ సభ్యత్వం చేర్పించామని, పార్టీ సభ్యులు ఒక్కొక్కరు ఇంకో ఓటు వేయించడంతో పార్టీ అధికారంలోకి వచి్చందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలవాలని, ఇందుకోసం కనీసం కోటి ఓట్లు రావాల్సి ఉంటుందని అన్నారు. అలా రావాలంటే పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా ఎస్ఐఆర్ ద్వారా పోకుండా ఉండాలని, ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న నేతలు, మంత్రులతో సహా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఇందిరాభవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ‘ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ కార్యక్రమంపై పార్టీ పక్షాన అవగాహన పెంచుకోవాలి. ఎస్ఐఆర్ కారణంగా వలసదారుల ఓట్లకు ఇబ్బంది రావచ్చు. వారి ఓట్లు పోకుండా చూడాలి. లంబాడీ, ఆదివాసీ, మైనార్టీ, దళిత, మహిళా ఓట్ల విషయంలో సమస్యలు రావచ్చు. ఈ సమస్యల పరిష్కారమెలా అన్న దానిపై బూత్స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించాలి. గతంలో పార్టీ డిజిటల్ సభ్యత్వం చేర్పించిన వారికి ఈ విషయంలో కీలక బాధ్యతలు అప్పగించాలి.ఎస్ఐఆర్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించాలి. అసెంబ్లీ ఇన్చార్జులు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందే. వారు సరిగా పనిచేస్తేనే ఓట్లు పోకుండా ఉంటాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్లోని నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీ సమావేశాలు నిర్వహించాలి..’ అని సీఎం సూచించారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో శిక్షణ ఇవ్వాలి ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేడర్ పూర్తిగా సోషల్ మీడియా వారియర్లుగా మారిపోయి పనిచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వీక్ అయ్యాం. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లు అయ్యారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు రీచ్ కావడం లేదు. ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమాలు, ఎంపీలు కొబ్బరికాయలు కొట్టిన కార్యక్రమాలే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎలాంటి ప్రచారం జరగడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోషల్ మీడియాలో శిక్షణ ఇవ్వాలి. నేతలు ఈ తీరును సరిచేసుకోవాలి. నెలలో మూడు రోజులు పార్టీకి.. నేతలు కార్యకర్తల వద్దకు వెళితేనే, కార్యకర్తలు బూత్స్థాయిలో ఓటరు వద్దకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. జిల్లాల ఇన్చార్జి మంత్రులు కూడా కార్యకర్తల వద్దకు వెళ్లి కలవాలి. నేను కూడా 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ కార్యకర్తలను కలుస్తా. నెలలో మూడు రోజులు పార్టీకి కేటాయిస్తా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి..’ అని సీఎం చెప్పారు. కార్యకర్తల్లో నిరుత్సాహం పలువురు మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడుతూ ఎస్ఐఆర్తో పాటు పార్టీ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఆచితూచి వ్యవహరించాలని, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని, సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని చెప్పారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని ఉన్న పదవులను వీలున్నంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంత్రుల తీరుతో నష్టం: మాజీ ఎంపీ వీహెచ్ మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సలహాదారు వి.హన్మంతరావు మాట్లాడుతూ..కొందరు మంత్రుల వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ‘పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారున్నారు. కోట్లు ఖర్చుపెట్టుకుని ఆస్తులు అమ్ముకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వారిని పట్టించుకోరా? మీరు నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు కనీసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇన్చార్జులకు సమాచారం కూడా ఇవ్వరా?..’ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలతో ఎక్కువగా అంటకాగవద్దని, అలా చేస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించినట్టు సమాచారం.రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ర్గౌడ్లు పలు సూచనలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు జెట్టి కుసుమకుమార్, జి.చిన్నారెడ్డి, రాములు నాయక్, టి. రామ్మోహన్రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, జె.గీతారెడ్డి, ఎస్.సంపత్కుమార్, ఈరవత్రి అనిల్, ఎర్రబెల్లి స్వర్ణ, మిద్దెల జితేందర్, జక్కిడి శివచరణ్రెడ్డి, యడవెల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు వారంలో ఒకరోజు పార్టీకి కేటాయించాలి ప్రతి వారంలో ఒక రోజు మంత్రులు ప్రభుత్వ పనులకు సెలవు పెట్టి పార్టీ పనులపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల బాధ్యతలు కేటాయించనున్నారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ప్రభుత్వ సలహాదారులు వీహెచ్, షబ్బీర్ అలీ, పార్టీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్రావులు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. -
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆది శ్రీనివాస్కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
చేతులు జోడించి మరీ అడిగిన కూడా...
-
సంక్షేమ చిట్టా.. ఒకేచోట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండే విధంగా ‘సమగ్ర సంక్షేమ కార్డు’(యూనిఫైడ్ కార్డ్)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికి, ఏయే ప్రభుత్వ శాఖల ద్వారా ఏయే సంక్షేమ పథకాల కింద ఎంత మేర లబ్ధి చేకూరుతోందో స్పష్టంగా తెలిసేలా ఈ కార్డు ఉండాలని సూచించారు. తక్షణమే ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి గురువారం ఆయ న సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు. అర్హులకు పథకాలు..అనర్హుల గుర్తింపు సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. అసలైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరతాయని అన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందన్నారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. సాంకేతికతపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని ఆదేశించారు. కార్డుకు ఆధార్ తరహా ప్రత్యేక నంబర్ ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా తదితర పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్డుకు అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చే అంశంపైనా ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఈ కార్డుకు అనుసంధానించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ను కూడా లింక్ చేయాలన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా కార్డు ఉండాలని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు సేకరించండి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు. ఇందులో ప్రధానంగా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలన్నారు. ఎక్కడైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే, అక్కడి నుంచి ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరాలని, దాని ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోగలగాలని చెప్పారు. కేరళ గల్ఫ్ విధానాలపై అధ్యయనం కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని చెప్పారు. -
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీలో కార్మిక సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం.. ఈ రెండు అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం వెల్లడించాలి’.. మేడే రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి వారికి సూచించిన మాట ఇది.‘మాకు యూనియన్ ఎన్నికలు అవసరం లేదు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనమే ముఖ్యం, ఆ మేరకే ఆమోద లేఖ సమర్పించాలి’ అని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేయటంతో కార్మిక సంఘాల నేతలు ముందు విలీన ప్రక్రియే జరపాలని, జూన్ రెండు రాష్ట్రావతరణ దినోత్సవం రోజున అపాయింటెండ్ డేట్ను ప్రకటించాలని పేర్కొంటూ యూనియన్ల వారీగా ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. దీంతో జూన్ రెండున అపాయింటెడ్ డేట్పై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని వెయ్యి కళ్లతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.అయితే, బుధవారం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, త్వరలో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ తర్వాతనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన సూచనల ప్రకారం తాము వెల్లడించిన అభిప్రాయానికి ఇది విరుద్ధంగా ఉండటంతో కార్మికులు కంగు తినాల్సి వచ్చింది. మొదట గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన సంఘం ప్రతినిధులను.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ విధివిధానాలు రూపొందించేందుకు సిఫారసు చేసే అధ్యయన కమిటీలో అధికారులతోపాటు నియమించనున్నట్టు మంత్రి వెల్లడించారు. నేతల ఒత్తిడితోనే? ముఖ్యమంత్రి సూచించటంతో, కార్మికుల ఆకాంక్షల మేరకు కార్మిక సంఘాల నేతలు విలీనమే కావాలంటూ ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. కానీ, లోపాయికారిగా మాత్రం యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని పలువురు నేతలు గట్టిగా ప్రయత్నించారు. యూనియన్లు లేకుంటే ప్రభుత్వం కార్మికులను పట్టించుకోదని, యూనియన్లు ఉండాల్సిందేనని కొందరు నేతలు మాట్లాడిన ఆడియో రికార్డులు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. దీంతో యూనియన్లు కాదు, విలీనం కోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మికులు సంఘాలకతీతంగా నేతలను డిమాండ్ చేశారు. కానీ, చివరకు కొందరు నేతల ఒత్తిడే ఫలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనను యూనియన్ల నేతలు ఖండించారు. -
క‘న్నీటి’పాలు
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి ప్రకృతి మరో సారి కన్నెర్రజేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతుల కష్టాన్ని నీటిలో కలిపేసింది. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ఆశగా తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న వర్షానికి తడిసిముద్దవగా.. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. తమ పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు నిస్సహాయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు మళ్లీ వాటిని ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులు రాత్రివేళ కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యం నిల్వలు తడవకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంట్రాక్ట్ లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయి. వర్షం మొదలవగానే రైతులు పరుగులు తీస్తూ బస్తాలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాశారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. వారాల తరబడి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లలోనే నిల్వ ఉంచుతుండటంతో... తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి తలెత్తింది. కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచుల కొరత, లారీల లేమి కారణంగానే ఈ నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా అకాల వర్షంతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షానికి తడిసిన వడ్లను పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. ‘వారం రోజులుగా లారీలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికీ రాలేదు. ఒక్క వానతో మా కష్టం అంతా పోయింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, సూరారం కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజుల తరబడి లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్, రామాయంపేట, చేగుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. నిజాంపేట మండలంలో కల్లాలు లేక రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోసుకున్నారు. వర్షం రావడంతో రోడ్లపై ఉన్న వడ్ల కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ⇒ కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సదాశివనగర్ మండలం మల్లుపేట, ఎల్లారెడ్డి పరిసరాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచిపోయింది. ⇒ జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డులో వర్షం కారణంగా ధాన్యం, మక్కలు తడిశాయి. ⇒ పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్ల కుప్పలు, బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోవడంతో వర్షపు నీరు ధాన్యంలోకి చేరింది. ⇒ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాత్రివేళ రైతులు ప్లాస్టిక్ షీట్లు కప్పి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ⇒ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పంటలను కాపాడేందుకు వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మృతి చెందిన ఘటన అకాల వర్షాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, హమాలీలు, లారీలు లేకపోవడం వల్లే ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అచ్చంపేట మార్కెట్కు వడ్లు తీసుకొచ్చి చాలా రోజులైనా కాంటా వేయలేదు. కుప్పలుగా పోసిన ధాన్యం మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసింది. నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కనీసం తడిసిన వడ్లను వెంటనే కొనాలి. –రషీదా, మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ జిల్లా చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిపై ఉత్తమ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేందుకు ఇసుక రవాణా లారీలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇప్పటికే రూ.10,097 కోట్ల చెల్లింపులు జరిగాయని, దీనివల్ల 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు కాగా, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని (వోన్ సోర్స్ రెవెన్యూ) ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అలాగే జీతాలు అందాలన్నారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. మంగళవారం డా.ఎంసీఆర్హెచ్ఆర్డీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీ, ఆర్థికశాఖల అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి పెన్షన్ల పంపిణీ విధానంపై కీలక ఆదేశాలిచ్చారు. ప్రస్తుత పెన్షన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. అర్హులకే చేయూత పించన్లు అందేలా చూడాలని స్పష్టంచేశారు. ఓటర్ ఐడీ, ఆధార్, కులగణన (సీప్సీ డేటా) ఆధారంగా పెన్షన్లను స్ట్రీమ్ లైన్ చేయాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా సొంత ఆదాయంపై గ్రామపంచాయతీల స్వతంత్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం నిబంధనను తొలగించిందని, ఇప్పుడు దానిని పునరుద్ధరించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నర్కు పంపిస్తే ఆయన ఆమోదం తర్వాత ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఈ మేరకు ఆర్డినెన్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాల సమయంలో దీనిపై చట్ట సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం ఆదేశాలతో జీపీల సొంత ఆదాయాన్ని (వోన్ సోర్స్ రెవెన్యూ)బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా పీఆర్ఆర్డీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పీఆర్ ఆర్డీమంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ దానకిషోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీ 11 జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ.. ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యంఇస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4 వేల ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్కు కేటాయించగా.. నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. 762 చ.కి.మీ... హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో నాల్గో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం ఏడు మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ ఎఫ్సీడీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. జూన్ 2న కార్యాలయం ప్రారంభం రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2న ఎఫ్సీడీఏ కార్యాలయం ప్రారం¿ోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్ఖాన్పేటలో ఎఫ్సీడీఏ కార్యాలయం కోసం ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాన్ఫరె¯న్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి. -
ఆటా మహాసభలకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ బాల్టిమోర్లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా బృందం మహాసభ కార్యక్రమ వివరాలను సీఎంకు వివరించారు. ఎన్నారైలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దత్తత అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎంను కలిసిన వారిలో ఆటా నేషనల్ కో–ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కో–ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహాసభలకు హాజరవుతానని ఆటా ప్రతినిధులకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. చదవండి: ఇకపై ప్రభుత్వ ఆస్తిగా హైదరాబాద్ మెట్రోముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (#ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న… pic.twitter.com/g7WTYtpWl1— Telangana CMO (@TelanganaCMO) May 25, 2026 -
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ పంటలను మాత్రం పూర్తిస్థాయిలో కొనడం లేదని అన్నారు. సోమవారం సచివాలయంలో సీపీఎం రాష్ట్ర నాయకులు.. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు అక్కడే ఇళ్లు..: కాగా, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీపీఎం నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల స్కూల్ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీపీఎం నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
ఒక్కటైనా కట్టారా?
కూకట్పల్లి (హైదరాబాద్): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం కూకట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసం చేసింది.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి ‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్’పై కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
అంతా మీ ఆశీర్వాదమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మళ్లీ ఈ సర్కార్ను అధికారంలోకి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది.. కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. ఈ దిశలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది..’ అని అన్నారు. సోమవారం సచివాలయంలో..ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా..8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం స్విచ్ నొక్కి వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక బలోపేతానికి కీలక నిర్ణయాలు ‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.800 కోట్లతో 8 వేల మహిళా సంఘాల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశాం. ఈ మేరకు ప్రభుత్వం దేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీలు) మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంలో భాగంగా మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం అవసరమైన భూమి, బ్యాంకు రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. మహిళా సంఘాలు మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం వంద ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తాం. అలాగే మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేస్తాం. ఈ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది. వీటిల్లో నాణ్యమైన వస్తువులు దొరికేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో వీటి కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకు లీజుకు ఇస్తాం. ఇవి దేశంలోనే బెస్ట్ సూపర్ బజార్లుగా తయారు కావాలి. డీమార్ట్, బిగ్ బజార్ల కంటే బెస్ట్గా మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండాలి..’ అని సీఎం అన్నారు. 5వ తేదీన మహిళలకు మరో 553 బస్సులు ‘మహిళలను బస్సుల యజమానులను చేయాలని వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆరీ్టసీకి అద్దెకు ఇచ్చాం. అదే విధంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్లో మహిళా సంఘాల ద్వారా నడిచే మరో 553 బస్సులను ప్రారంభిస్తున్నాం. మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వ చేయం భవిష్యత్తులో మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టం. మహిళా ఎస్హెచ్జీలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారిగా ఉంటారు. ఇకపై రూ.10 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ రుణాలు సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ గుర్తుకు వస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తోంది. రిలయన్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని కూడా మహిళా స్వయం సహాయ సంఘాలతో చేయిస్తున్నాం. మహిళలకు సంబంధించి రూ. 5 లక్షల వరకున్న బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.10 లక్షలకు పెంచుతున్నాం. మహిళలు తాము తీసుకున్న ప్రతి రూపాయిని నిక్చచ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు మాత్రం ఎగ్గొట్టి పారిపోతున్నారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు ‘రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు సారెలా చీరలు అందజేసింది. గతంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారు. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణి చేస్తాం. చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్లో ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నాం. అన్నదమ్ములు కొందరు ఇంట్లో నుంచి చెల్లెళ్లను వెళ్లగొడుతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు వెళ్లగొడితే బయటకు వెళ్లి ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మహిళా వారోత్సవాల పురస్కరించుకుని మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే మట్టా రాగమయికి సీఎం చీరలు బహూకరించారు. మహిళా సమాఖ్యలతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో రేవంత్ ముఖాముఖిలో పాల్గొన్నారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు రూ.27 లక్షలు సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.దానకిశోర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పనులు షురూ మహిళా శక్తి భవనాల వర్చువల్ ప్రారంభం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఆయా భవనాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి అధికారులు పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులు పూర్తయిన వందకు పైగా మహిళా భవనాలను ఎక్కడికక్కడ ప్రారంభించారు. -
ఆశల పల్లకీలో రేవంత్...
తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు. ఇవన్నీ రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నా పదేళ్లపాటు తానే సీఎం అని చెప్పడమే కొంత ఆశ్చర్యం. ఇలా చెప్పడం.. కేవలం ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించడానికా?లేక కాంగ్రెస్లో తనకు పోటీ లేదని చెప్పడానికా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?అంటే ఏమైనా కావచ్చు.రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు పదేళ్లనే ఏముంది.అంతకుమించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు.అలాగే ఆయనే సీఎంగా కొనసాగవచ్చు. అలాకాకుండా పదేళ్ల తర్వాత జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఏమి చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్లోనే ఉంటారా?అన్నది కొందరి అనుమానం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ ను ఉద్దేశించి తనతో కలిసి రావాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.అది అధికారికంగా సహకారం కోరడం తప్పమరొకటి కాదని రేవంత్ వివరణ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా! గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి, తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ,ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఆయన ఆ మాట చమత్కారంగా చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్ఎస్లో కూడా పనిచేశారు.ఆ తర్వాత స్వతంత్రంగా జెడ్పీటీసీ పోటీచేసి గెలిచారు.తదుపరి శాసనసమండలి ఎన్నికలలో పోటీచేసి అన్ని పార్టీలవారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి మద్దతు పొందడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో,మరేమో తెలియదు కాని, ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటు కు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనేం రెండున్నరేళ్ల సీఎం పదవికాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్న మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు, కర్ణాటక, హిమచల్ ప్రదేశ్ లలోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీకి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పాలి. పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలికగా ప్రజలలో పట్టు నిలబెట్టుకోవడం అంత తేలికకాదు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది.ఆయా అంశాలలో రేవంత్ విధానాలపై ఆ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది.హైడ్రా వ్యవస్థ వల్ల కొంత మంచి పేరు వచ్చినా, నష్టం కూడా గణనీయంగానే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని,వృద్దాప్య పెన్షన్ నాలుగువేలు చేస్తామని, దళితులకు పది లక్షల ఆర్థిక సాయం తదితర అనేక వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఎన్నికల సమయంలో చేశారు.వాటిని అమలు చేయడం అంత తేలిక కాదని అనుభవం చెబుతోంది. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. మరో రెండున్నర ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన రీతిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అది పదివేలు అన్నట్లుగా ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ కేసులో కాని, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సందర్భంలో కాని రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్లే రేవంత్కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. భగీరధ అరెస్టు అయినప్పటికీ, అది జరిగిన తీరుపై విమర్శలు ఉన్నాయి.సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా అన్న చర్చ జరిగింది. 2028లో జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణం అంత తేలికగా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.అంతేకాక ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థంఅవుతుంది.బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్దతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది. ఇక జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చీనీయాంశం కాదు.ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు.అది తప్పు కాదు.గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేశారు.వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సారధిగా ఉన్న టైమ్ లో ఏపీలో అత్యధిక కాంగ్రెస్కు ఎంపీ సీట్లు వచ్చాయి. అయినా ఆయనను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండేవారు.ఆయన ఇంకా పూర్తిగా బలపడలేదు.ఆ టైమ్ లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసీసీ సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. అప్పట్లో తనకు ఉన్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులుకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద వ్యాఖ్యలు చేశారు.ఆ విషయం పీవీకి తెలియడంతో, తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా, అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు.మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక భూమిక పోషించారు. సీఎంగా రెండుసార్లు ఎంపికయ్యారు.అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడు అన్న భావన ఉండేది.కాని ఆ రెండుసార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు.అప్పటి రాజకీయాలకు ప్రస్తుత ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీలలో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి.ఏది ఏమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికి అభ్యంతరం ఉండదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.5 లక్షల గృహాలు నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. 2 వేల ఇళ్లలో 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్నుబట్టి దశలవారీగా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ అండ... ఉమ్మడి ఏపీలో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇంకా ఎవరైనా లబ్ధిదారుల ఇళ్లు అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ. 3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున సహాయం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మూడో, నాలుగో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సైతం అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనర్హులని తొలి విడతలో ప్రభుత్వం చెప్పింది. నాడు సిమెంట్, స్టీల్, నగదు రూపంలో రూ. 25 వేలు తీసుకున్న వారిని రెండోవిడత ఇందిరమ్మ పథకం కింద అర్హులుగా పరిగణించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. ఆ రూ. 25 వేలను మినహాయించుకొని రూ. 5 లక్షల్లో మిగిలిన మొత్తాన్ని వారికి అందజేయనుంది. గుడిసె లేని రాష్ట్రంగా... రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14,800 పూరి గూడిసెలున్నట్లు వివిధ దఫాలుగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఆయా కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. క్యూర్లో లక్ష ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ పథకం కింద కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో 6–7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలను నెలాఖరులోగా ప్రభుత్వం మంజూరు చేయనుంది. మిగిలిన దరఖాస్తుదారుల్లో సొంత స్థలాలు లేని 3–3.5 లక్షల మంది అర్హలుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. క్యూర్ ఏరియాలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్గా పరిగణించి అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ)కు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎల్ఐజీ ఇళ్ల పథకం కింద 400–420 చదరపు గజాల విస్తీర్ణంతో ఫ్లాట్ల నిర్మాణానికి రూ. 5 లక్షలతోపాటు అన్డివైడ్ ల్యాండ్ షేర్ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల అదనపు వ్యయాన్ని లబ్ధిదారులు భరించాల్సి రానుంది. నిరుపేదలు జీవనోపాధి కోసం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఎల్ఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. మురికివాడల్లో నివసిస్తే అక్కడే కట్టిస్తామని పొంగులేటి తెలిపారు. వారు ఉండే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం లేకుంటే హౌసింగ్ బోర్డు, ఇతర ప్రభుత్వ శాఖల నివాసయోగ్యమైన భూముల్లో వారి కోసం ఇళ్లను నిర్మించనున్నారు. నియోజకవర్గం యూనిట్గా ఇప్పటికే కొన్ని స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక క్యూర్ ఏరియాలో నిర్మించనున్న లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ లబ్ధిదారులకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్తోపాటు ఫ్రీహోల్డ్ నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని నామమాత్ర లాభంతో ఎంఐజీ వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేసి ఆ నిధులను ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. ఎల్ఐజీ, ఎంఐజీ పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ తదితర వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లతో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్ల పథకాలకు తేడా ఉందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు జీవనోపాధి పొందుతున్న ప్రాంతానికి 30–40 కి.మీ.ల దూరంలో ఇళ్లను కట్టడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులు నిరుపయోగంగా వదిలేశారని తెలిపారు. జూన్ 1న లక్ష గృహ ప్రవేశాలు... తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తైన లక్ష ఇళ్లలో గృహప్రవేశాలను జూన్ 1న నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు రూ. 1,000 కోట్లు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా రూ. 300 కోట్లు మంజూరు చేసింది. ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు సై.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం 2021లో ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సామర్థ్యం పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పథకం కింద చేరాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జనవరి 2న కేంద్రంతో త్రెపాక్షిక ఒప్పందం చేసుకున్నా అమలు చేయలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం ఈ పథకంలో చేరాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో మీటర్లు (వ్యవసాయ కనెక్షన్లకు) అమర్చేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిందని ఆరోపించారు. తమ నిర్ణయంలో మీటర్లు బిగించే ప్రసక్తే లేదన్నారు. లైఫ్ సైన్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రాన్ని 2030 నాటికి ప్రపంచంలోని టాప్–5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టడానికి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని మంత్రివర్గం ఆమోదించింది. దావోస్ సదస్సులో ఈ పాలసీని సీఎం ఆవిష్కరించగా కొన్ని మార్పులతో తాజాగా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతోపాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఫార్మా ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టగా ఇకపై ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్ అండ్ డీ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా ఈ పాలసీలో మార్పులు చేసింది. ఇంటర్ విద్యార్థులకూ భోజనం, అల్పాహారం.. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందించనుంది. ‘పాలమూరు’భూసేకరణకు రూ. 587 కోట్లు పాలమూరు–రంగారెడ్డి పథకం మిగులు పనులతోపాటు చివర్లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన భూసేకరణ కోసం తొలి విడతగా రూ. 587 కోట్లు కేటలాయించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి చేపట్టిన గత ప్రభుత్వం 18 ప్యాకేజీల పనులనే కొంత మేర చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాగా, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీలను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ‘హాకా’లో విలీనం చేయాలని కేబినెట్ తీర్మానించింది. -
వేద పాఠశాలకు భూమిపూజ
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులన్నింటికీ ఒకేచోట పెద్దగుట్టపై శిలాఫలకం వేశారు. అందులో ప్రధానమైనది వేద పాఠశాల. వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతిస్వామి వేద ఆశీర్వచనం అనంతరం అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు.సీఎంతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నృసింహుని దర్శించుకున్న సీఎం రేవంత్ అభివృద్ధి పనులకు భూమిపూజ అనంతరం సీఎం రేవంత్రెడ్డి కొండపైకి కాన్వాయ్లో చేరుకున్నారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం నుంచి, త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అర్చక బృందం, వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలకగా మొ¬దట ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ప్రధానాలయంలోని స్వయంభూలను, ఉత్సవ మూర్తులను దర్శించుకుని రేవంత్ పూజలు నిర్వహించారు. వేదపండితులు ప్రధానాలయం ముఖమండపంలో సీఎంకు వేదాశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆలయ ఈవో భవాని శంకర్ స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు. వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం సీఎం పశ్చిమ రాజగోపురం గుండా ఆలయం నుంచి బయటకు వచ్చారు. గోశాల స్థలంలో బదులు పెద్దగుట్టపై దిగిన సీఎం హెలికాప్టర్ సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యం చోటుచేసుకుంది. సీఎం, మంత్రులు ఉన్న హెలికాప్టర్ ప్రొటోకాల్ ప్రకారం నిర్దేశిత యాదగిరిగుట్ట గోశాల స్థలంలో ల్యాండ్ కావాల్సి ఉండగా దానికి బదులు పెద్దగుట్టపై దిగింది. అక్కడ స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, భద్రతా అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు 10 నిమిషాలపాటు హెలికాప్టర్లోనే వేచి చూశారు. అనంతరం హెలికాప్టర్ దిగిన సీఎం.. కాన్వాయ్ లేకుండా అక్కడున్న సాధారణ పోలీసులతోనే కాలినడకన సుమారు 300 మీటర్లు నడుచుకుంటూ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. మరోవైపు హెలికాప్టర్ మరోచోట దిగడంతో సీఎం షెడ్యూల్ మారిపోయింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం కొండ కింద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే కాన్వాయ్తో సీఎం రేవంత్ కొండపైకి చేరుకోవాలి. అక్కడ దైవదర్శనం అనంతరం పెద్దగుట్ట (టెంపుల్ సిటీ)లో వేద పాఠశాలకు భూమిపూజ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో అల్పాహారం చేసి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్లాలి. కానీ హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ కావడంతో సీఎం ముందుగా శంకుస్థాపన నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు.ఆపై అల్పాహారం చేయకుండానే హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. గత సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనల సందర్భంగా హెలికాప్టర్లో పలుమార్లు పెద్దగుట్టపై ఏర్పాటు చేసిన ఈ హెలిపాడ్ వద్దే దిగారు. ఆ హెలికాప్టర్ నడిపిన పైలట్.. ఇప్పుడు హెలికాప్టర్ను నడిపిన పైలట్ ఒకరే కావొచ్చని.. అందుకే యాదగిరిగుట్టలో ల్యాండింగ్ అనగానే పెద్దగుట్ట వద్ద హెలిపాడ్ను సూచిస్తూ ఏర్పాటు చేసే విండ్ ఫ్లాగ్ లేనప్పటికీ నేరుగా దించాడని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఉదంతంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. అలాగే ఆర్ అండ్ బీ ఈఈకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు ఇవీ.. ⇒ రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో పెద్దగుట్ట (టెంపుల్ సిటీ)లో 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల నిర్మాణం. అక్కడే యాగశాలలతోపాటు ఒక గోశాల ఏర్పాటు. ⇒ యాదగిరికొండపై రూ. 43.12 కోట్లతో డారి్మటరీ, దీక్షాపరుల సదనం నిర్మాణం. ⇒ కొండపై గతంలో బాలాలయం ఉన్న చోట స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో కల్యాణ మండపం. ⇒ భక్తుల కోసం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో రక్షణ పైకప్పు నిర్మాణం. ⇒ రథశాల వైపు ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణం. -
సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు
సాక్షి,ఆదిలాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన 224వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 396 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 163, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, ఇందిరమ్మ ఇండ్ల కోసం 113, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందాయి.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా: ఆకునూరి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్కు పంపించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మేము విద్యపై సిఫార్స్లతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాము. నాకు అప్పగించిన పనిని పూర్తిచేసినందున తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ విద్యా రంగంలో కీలక పాత్ర పోషించిన ఆకునూరి మురళి 2024లో టీఈసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండు సంవత్సరాలు కాగా ఇవాళ (మే22)సమగ్ర నివేదిక సమర్పించి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.ఆకునూరి మురళి రాష్ట్రంలోని ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టారు. ఆయన కరికులం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధన పద్ధతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. దీర్ఘకాలిక విద్యా విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును పర్యవేక్షించారు.ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో 100 మోడల్ స్కూల్స్ ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రయత్నం చేశారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యా రంగంలో సేవ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు. -
కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్లోనైనా పంట కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడి పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతీ రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు గుండె పగిలి కుప్ప కూలుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో దైర్యంతో బతికిన అన్నదాత కాంగ్రెస్ పాలనలో ఆత్మ విశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. రైతులకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ ఒక్కొక్కటిగా పాతరేసి రైతుల వెన్ను విరించారు. రైతుభరోసా ఎగవేసినా, యూరియా కష్టాలు అధిగమించి రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు’అని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు ‘పంట కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు తమ పంటలను తగుల పెట్టుకుంటున్నారు. రెండు నెలలుగా నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోరో జరగని రహదారి లేదు. పగలూరాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై సీఎంకు పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ రైతులు రోడెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభానికి అద్దం పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, క్వింటాల్కు పది కిలోల తరుగు, గన్నీ బ్యాగులకు రూ.50 డిపాజిట్ వంటి సమస్యలను తీర్చేవారే లేరు. పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు సీఎం క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి రైతుల పంటను కాపాడుకునేందుకు చివరకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కాంగ్రెస్కు మరణ శాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని ఆ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
ఈ శాడిజం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు. వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు. ప్రవీణ్కుమార్కు ఉద్యోగం లేదు.. ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు. కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా? ‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్కి నోటీసులు ఇచ్చాం. ఫామ్హౌస్లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు. మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్తో ఫామ్హౌస్లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్హౌస్లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?. కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు. మా పోలీసులు చెప్పిందే నమ్ముతా.. ‘బండి భగీరథ్ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు. రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం మెదక్లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.కొంతమంది బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్రెడ్డి లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ పాల్గొన్నారు. -
కోటి ఆశలు నెరవేర్చాం!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, వివేక్తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత ‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి. ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్గ్రేడేషన్తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ‘ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్ సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు. -
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
-
సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
-
‘బండి భగీరథ్ లొంగిపోలేదు..పోలీసులే అరెస్ట్ చేశారు’
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. -
తెలంగాణలో కార్మికులకు గుడ్న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను నాలుగు విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువతకు నా విజ్ఞప్తి. సాంకేతిక నైపుణ్యం పెంచుకోండి. నైపుణ్యం ఉన్న వాళ్లను పంపాలని.. మన ప్రభుత్వాన్ని ఎన్నో దేశాలు సంప్రదిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు కనీస వేతనం ఎక్కువగా ఉండాలి. కార్మికుల హక్కులను కాపాడటమే మా లక్ష్యం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన 15 ఏళ్లలో కార్మికులకు వేతన సవరణ చేయలేదు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశాం.గతంలో అర్బన్, రూరల్.. రెండే జోన్లు ఉండేవి. ఇప్పుడు మూడు జోన్లు చేశాం. నాలుగు కేటగిరిలుగా కార్మికులను విభజించాం. కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కోటీ 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు’ అని చెప్పుకొచ్చారు.వేతనాల పెంపు ఇలా..అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంపు.హైస్కిల్డ్ కార్మికులకు రూ.14,600వేల నుంచి 20వేలకు పెంపు.సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.13590 నుంచి రూ.15వేలకు పెంపు.స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.17వేల నుంచి రూ.18వేలకు పెంపు. -
రాజస్థాన్లోని కోటా తరహాలో ట్రాఫిక్ ఫ్రీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్ రహత నగరంగా మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో..ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని కోటా నగరంలో ప్రస్తుతం సిగ్నల్ ఫ్రీ రహదారులు ఉన్నాయి. ఆ తరహాలోనే మన నగరంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘కేబీఆర్’తో మొదలు.. 800 కిలో మీటర్ల రహదారి నెట్వర్క్ ఉన్న గ్రేటర్లో తొలుత జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిల్మ్నగర్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత కారిడార్ను నిర్మించనున్నారు. రోడ్ నంబరు– 45, ఫిల్మ్నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధ జంక్షన్తో సహా కీలక కూడళ్ల వద్ద గ్రేడ్ సెపరేటర్లను ప్రతిపాదించారు. రెండు వేర్వేరు ప్యాకేజీల కింద జీహెచ్ఎంసీ కేబీఆర్ పార్క్ జంక్షన్, బంజారాహిల్స్ చుట్టూ రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను నిర్మిస్తోంది. కేబీఆర్ పార్క్ భూమిని ఆక్రమించకుండా ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు, అండర్పాస్లన్నింటినీ ఇప్పటికే ఉన్న రోడ్డు మధ్యభాగాల్లోనే నిర్మించనున్నారు. అలాగే కాంక్రీట్ నిర్మాణాల కంటే స్టీల్ ఫ్లై ఓవర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో 13.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల విడుదల నివారణతో వాయు కాలుష్య స్థాయిలను 72 శాతం తగ్గించొచ్చు. ఏటా 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. సాధ్యమేనా? రాజస్థాన్లోని కోటా నగరం తరహాలో గ్రేటర్లో ఈ విధానాన్ని అమలు చేయడం అంత సులువు కాదని, ఈ ప్రతిపాదన ఆచరణలో అనేక సవాళ్లున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాపడుతున్నారు. 2014లో నగరంలో 42.2 లక్షల వాహనాలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 94.16 లక్షలు దాటింది. నగరంలో సగటున ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈమేరకు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలా చేస్తే బెటర్.. నగరం మొత్తాన్ని సిగ్నల్ రహితంగా మార్చడం కాకుండా కీలక కూడళ్ల వద్ద దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తొలగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి ఆరి్టఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగిస్తే కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని బట్టి వాహనాల వెయిటింగ్ సమయం ఆటోమేటిక్గా మారుతుంది.లాభమేంటంటే? సిగ్నల్ ఫ్రీలతో ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతీ లైన్కూ ప్రత్యేకంగా రహదారి ఉంటుంది. దీంతో జంక్షన్లో ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అవసరం ఉండదు. దీంతో ప్రధాన నగరంలో రహదారి భద్రత మెరుగవడంతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ‘కోటా’ కథ ఇదీ..15 లక్షల జనాభా ఉన్న కోటా నగరం 2022లో దేశంలోనే తొలి సిగ్నల్ రహిత నగరంగా అవతరించింది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో వందకు పైగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, రౌండ్ అ»ౌట్లు, రోటరీలు, రింగ్రోడ్లను పునరి్నరి్మంచారు. కోటాలోని సుమారు 12 ప్రధాన కూడళ్లలో రోజుకు 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. -
ఫ్యూచర్ సిటీలో వెంటనే నిర్మాణాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూ కేటాయింపులు జరిపిన వెంటనే ఆయా పరిశ్రమలు నిర్మాణాలు ప్రారంభించాలనే నిబంధన తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక వాడలో వివిధ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జూన్లో భూమి పూజలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు వీలైన అన్ని చర్యలు చేపట్టాలి. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ రూపొందించాలి. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలి. గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్గా నియమించే అంశాన్ని పరిశీలించాలి. హైదరాబాద్ బయట కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలి.నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..’అని సీఎం ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో పరిశ్రమల శాఖ, ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో విధానాలు ‘భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్సీ)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్ జీరో విధానాలు అమలు చేయాలి. ఎక్కడా రాజీ పడొద్దు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకుని రావాలి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలి. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలి. ‘‘బియాండ్ క్యూర్‘ (కోర్ అర్బన్ రీజియన్కు ఆవలి) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేనిచోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని కూడా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలి. కేంద్రం ప్రకటించిన ఐదు హెల్త్ క్లస్టర్లలో ఒకటి ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐ సిటీలో పనులు వెంటనే ప్రారంభించాలి ‘ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీలో పనులను వెంటనే ప్రారంభించాలి. ప్రపంచంలోనే గొప్ప ఏఐ సదుపాయాలుండేలా చూడాలి. ఇక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలి. 1,500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి. డేటా సిటీ నీటి అవసరాల కోసం మురుగునీటి నిర్వహణ ప్లాంట్లను (ఎస్టీపీలను) వినియోగించాలి. జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలి. ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలి. బుల్లెట్ రైల్ కోసం భూ సేకరణ వెంటనే ప్రారంభించాలి. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్కు కనెక్ట్ కావాలి..’అని సీఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే టీ ఫైబర్కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, టీజీఐఐసీ వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతలపై అలసత్వం సహించను
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పావిలియన్లో పోలీసుశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్తోపాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని అన్నారు. ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్క్వార్టర్ దాటితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అన్ని స్టేషన్లలో క్యూఆర్ కోడ్ అన్ని పోలీసు స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇక నుంచి క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పారు. నైట్ పెట్రోలింగ్ను బలోపేతం చేయాలని, రౌడీషీట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని, డ్రోన్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్లు డ్రగ్స్, గంజాయిపై కఠినచర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్పై పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, అగి్నప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకొని ఫైర్ డిపార్ట్మెంట్పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. మ్యాన్హోల్స్ నిర్వహణపై పోలీసు, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని, పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
‘పాలమూరు’కు యుద్ధప్రాతిపదికన భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణలో జాప్యం జరగకుండా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కీలక సూచనలు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సంబంధిత జిల్లాధికారులతో జిల్లా మంత్రులు సమీక్షించి పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేశ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు. 1226 గ్రామాలకు తాగునీరు : మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అనుబంధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని కరువు పీడిత జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరా అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం జిల్లా ప్రాజెక్టులపై సచివాలయంలోఉత్తమ్ సమీక్షించారు. ప్రాధాన్యతలను పున:సమీక్షించడానికి, పనులను వేగవంతం చేయడానికి పక్షం రోజుల్లోగా మరోసారి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని జిల్లా ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. జూరాల పూడిక తొలగింపు గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పూడికతో జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 8 టీఎంసీల కంటే తగ్గిపోయిందన్నారు. జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం అమలు చేస్తున్న ‘డ్రిప్’పథకం కింద జూరాల ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డ్రిప్ కింద పూడికతీతతోపాటు ప్రాజెక్టు భద్రత, నిల్వ సామర్థ్యం, నిర్వహణ మెరుగు అవుతుందని తెలిపారు. -
60 శాతం మహిళలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి అనూహ్యరీతిలో పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధి బారిన పడుతుండటం, అందులోనూ పొగతాగే అలవాటు లేని మహిళల్లో సైతం ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాయు కాలుష్యం, గృహాల్లో బయో మాస్ పొగ, మారిన జీవన శైలి, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ డేటా ఆధారంగా, ప్రముఖ ఆంకాలజిస్టు, ప్రభుత్వ కేన్సర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నేతృత్వంలో రూపొందించిన రాష్ట్ర తొలి ‘కేన్సర్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ మ్యాపింగ్ అక్రాస్ తెలంగాణ’నివేదికను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సమర్పించారు. ఈ ‘కేన్సర్ అట్లాస్’నివేదిక రాష్ట్రంలో కేన్సర్ విస్తృతిపై విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ముప్పు ఆరోగ్యశ్రీ పథకం కింద గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,00,294 కేన్సర్ రోగులు చికిత్స పొందారు. వీరిలో 59,994 మంది మహిళలు కాగా, 40,300 మంది పురుషులు. అంటే మొత్తం రోగుల్లో 60 శాతం మహిళలే. అన్ని వయసుల వారితో పోలిస్తే 39 నుంచి 48 ఏళ్ల వయసు గల మధ్య వయసు్కలైన మహిళల్లో కేన్సర్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వయసు విభాగంలో 15,198 మంది మహిళలు చికిత్స పొందగా, పురుషులు 8,318 మంది మాత్రమే ఉన్నారు. అయితే, చిన్నారులు, 19–32 ఏళ్ల యువతలో మాత్రం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. మహిళలను వేధిస్తున్న ప్రధాన కేన్సర్లు ఏంటి? మహిళల్లో ప్రధానంగా రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషుల్లో తల, మెడ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారత మహిళల్లో పొగతాగే అలవాటు పది శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ, వారిలో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లోని వాహనాల ఉద్గారాలు, నిర్మాణ రంగ ధూళి, పరిశ్రమల పొగ ఒకవైపు అయితే, గ్రామీణ ప్రాంతాల్లో గృహాల్లో వాడే కట్టెల పొయ్యిల బయోమాస్ పొగ మహిళల ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. ఈ సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి కణాల జన్యు నిర్మాణాన్ని మారుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధన సంస్థల అధ్యయనాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని ప్రత్యేక జన్యు మార్పులున్నాయి. ఇవి పర్యావరణ కాలుష్య ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేసి, శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపే సహజ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్నాయి. దీనికితోడు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, మితిమీరిన మానసిక ఒత్తిడి కూడా కేన్సర్ కణాల వృద్ధికి దోహదం చేస్తున్నాయి. జిల్లాల వారీగా ఎలా ఉందంటే? రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో ప్రతి లక్ష మందికి 45 కంటే ఎక్కువ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే ఈ సంఖ్య 40 కంటే తక్కువగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండలో ప్రతి లక్ష జనాభాకు 79 కేసులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో కేన్సర్ చికిత్స కోసం 81 గుర్తింపు పొందిన ఆస్పత్రులు ఉన్నప్పటికీ, అందులో 54 ప్రభుత్వ, 27 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే మొత్తం కేసుల్లో 53.4 శాతం కేసులను ప్రైవేట్ ఆస్పత్రులే నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోనే 26 చికిత్స కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ చికిత్స పరిమితిని కుటుంబానికి రూ. 10 లక్షల వరకు పెంచింది. 2020లో రూ. 89.03 కోట్లుగా ఉన్న ఆరోగ్యశ్రీ కేన్సర్ చికిత్స వ్యయం, 2025 నాటికి రూ. 260.98 కోట్లకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే.... ⇒ ముందస్తు జాగ్రత్తలతోనే కేన్సర్ ముప్పు నుంచి బయటపడొచ్చు. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏటా రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ⇒ కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో లంగ్ కేన్సర్పై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ, స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, 100 శాతం గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. ⇒ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ⇒ కాలుష్యానికి దూరంగా ఉండటం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. -
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది! -
కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
పెట్రో ధరల పెంపు.. కేంద్రంపై రేవంత్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. అలాగే, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పెట్రో ధరల పెంపుపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్..‘పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు. ధరల పెంపుతో నిత్యాసరాల రేట్లు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుంది. అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది.ఎన్నికలు ముగిసిన పది రోజులకే లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకం. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చెప్పుకుంటారు?. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది’ అని మండిపడ్డారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల…— Revanth Reddy (@revanth_anumula) May 16, 2026 -
2034 వరకు నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారని ఆయన మరోమారు ధీమా వ్యక్తం చేశా రు. 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, 10% జీడీపీ దేశానికి ఇచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని అన్నా రు. ప్రస్తుతం ప్రజలు ‘స్విగ్గీ పాలిటిక్స్’ కోరుకుంటున్నారని, ఫలాలు తక్షణమే అందాలనే ఆలోచనతో జెన్జీ ఉందని, అందుకు అనుగుణంగా రాజకీయంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాహుల్కు ప్రధాని కావాలనే లక్ష్యం లేదు.. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉంది. రాహుల్గాంధీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే. ప్రధాని కావాలన్న లక్ష్యం ఆయనకు లేదు. కానీ ప్రధాని పదవి తీసుకోవాలని వికారాబాద్ మీటింగ్లో రాహుల్ను నేను ఒప్పించా. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్గాం«దీయే. ఈ మేరకు ఇండియా కూటమిని ఒప్పిస్తాం. మాట్లాడింది ప్రభుత్వాల సహకారంపైనే.. ప్ర«దానిగా మోదీ, సీఎంగా నేను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాం. మేం మైక్ల ముందే మాట్లాడుకున్నాం. ఇందులో రహస్యం లేదు. నిధుల కోసం తమతో కలసిరావాలని మోదీ నన్ను అడిగారు. మేం మాట్లాడుకుంది ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే. చొరవ ఉంది కానీ గీత దాటను.. నేను రాహుల్గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. నేను నా మనసుకు నచ్చినట్టు చేస్తా. అవకాశాల కోసం అవకాశవాదిగా మారను. కొంతమంది ఓటమికి కుంగిపోతారు. గెలుపునకు పొంగిపోతారు. కానీ ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నిబద్ధతతో పార్టీలో చేరాననే గాంధీ కుటుంబం నాకు అవకాశమిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంకల వద్ద నాకు చొరవ ఉంది. కానీ నా గీత నేను దాటను. అప్పుడూ ఇప్పుడూ ఒకే ఇంట్లో.. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో సీఎం అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నా. ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జు, రూపాయి చేతిలో లేని మందుల సామేల్ను ఎమ్మెల్యేలను చేశాం. కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులిస్తున్నాం. చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఆకనూరి మురళి ఇలా అందరిని గుర్తు పెట్టుకుని పదవులు ఇచ్చాం. ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా.. 100 శాతం సంతృప్తితో ఉన్నా. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆలోచన. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రజా సమస్యలపై అవగహన ఉంది. సీఎంగా వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత నాపై ఉంది. గతంలో కులాలు, మతాల వారీగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా? నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్లో అన్ని కులాలు, మతాల విద్యార్థులుంటారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనుకుంటున్న నన్ను విలన్లా చూస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఏ కీలుకు ఆ కీలు తీస్తా. మూసీ ప్రక్షాళన ఆగదు.. ఎవరు అడ్డువచ్చినా మూసీని ప్రక్షాళన చేస్తాం. నగరాలను కలుషితం చేస్తే మరిచిపోతారు కాని నీటి వనరులను కలుషితం చేస్తే ఎప్పటికీ మరిచిపోరని జపాన్లో ఒక సామెత ఉంది. యుద్ధం జరిగినప్పుడు కొందరు అమాయకులు కూడా చనిపోతారు. యుద్ధ నీతే అది. ఆక్రమణలదారులకు ముందే నోటీసులు ఇస్తున్నాం. ఎవరూ మూసీ మురికిలో ఉండాలని కోరుకోరు. వారసత్వంగా సీఎం పదవి వస్తదని కొందరు కలలు కన్నారు.. బుర్రలేని లేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారు.. టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునే వారి ఆలోచన వేరే ఉంటుంది. నా దగ్గరకి వచ్చి నీకు ఇంత ఇస్తాం పని చేయి అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. రోజుకు 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నా. నా ప్యూచర్ను ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్షం కాదు. వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి వస్తదని కొందరు కలలు కన్నారు. నేను వాస్తవంలో ఉంటా. ఉహాజనితమైన ప్రపంచంలో ఉండను. అలాగైతే పోక్సో కేసు ఎందుకు పెడతాం.. మేం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు నియంత్రించాం. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. 9 తేదీన విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11 వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి సంజయ్కి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి సంజయ్కి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. బండి సంజయ్ తీరు సరికాదు.. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల తగ్గింపు..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్లో వాహానాలు తగ్గించాలని నిర్ణయించారు. ఇక నుంచి నాలుగు వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్ బయల్దేరనుంది. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మధ్యనే సీఎం కాన్వాయ్ వెళ్లడానికి నిర్ణయించారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్కు సంబంధించిన వాహనాలపై నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియాలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాహనాల వాడకాన్ని కాసేపు పక్కనపెట్టి సైకిళ్లు, మెట్రోల్లో, ఎడ్లబండిపై పయనిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్లోని వాహనాలను రెండుకు పరిమితం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో తొలుత కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను నాలుగుకు పరిమితం చేశారు. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఎంతో పాటు ఇతర మంత్రుల వాహనాల సంఖ్యలోనూ తగ్గింపు చేసినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్లో ప్రస్తుతం 9 వాహనాలు ఉండగా ఆ సంఖ్యను మూడుకు తగ్గించినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భద్రతాధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో భాగంగా గురువారం తన క్యాంపు ఆఫీసు నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి మూడు వాహనాల కాన్వాయ్లోనే వెళ్లారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని, నేడో, రేపో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా కేబినెట్ మంత్రుల కాన్వాయ్ లోనూ పైలట్ వాహనాలను తొలగించనున్నట్లుగా సమాచారం. దీంతో మంత్రుల వాహనాల సంఖ్య రెండుకు తగ్గనుంది. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
నీట్ పేపర్ లీక్పై సీఎం రేవంత్రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్రెడ్డి ఎక్స్లో స్పందించారు. నీట్ పేపర్ లీక్తో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
పొలిటికల్ స్టైల్ షో.. ఈ అదిరే లుక్స్ చూశారా?..
-
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్లో రెండో దశను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ కేంద్రంగా అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈవీలే లీజుకు తీసుకోవాలి.. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ కేంద్రంగా డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ కారిడార్.. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. – వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడాడ్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లకు బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్కు ఇవ్వొచ్చని సూచించారు. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసిందని, అయితే ఒక్కరోజులో ఈ కేటాయింపులను పెంచే పరిస్థితి ఉండదన్నారు. కేటాయింపులను ప్రతి ఏటా బడ్జెట్లో క్రమంగా పెంచుతూ పోతామని, 15 శాతానికి పెరిగే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి టీచర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘విద్యాశాఖకు ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్లో 8.22 శాతం కేటాయింపులు జరిపాం.గతేడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పెంచాం. ఇదేవిధంగా ఏటా పెంచుతాం. ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. వర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను నేనే నిర్వహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.ప్రజాప్రభుత్వంలో కేవలం 60 రోజుల వ్యవధిలో 11 వేల మంది టీచర్లను నియమించడం చరిత్రాత్మక అంశం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 22 వేల టీచర్లకు పదోన్నతులు, 36 వేల మంది టీచర్లకు బదిలీలు పూర్తి చేశాం. నీతిఆయోగ్ నివేదికలో విద్యలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. ఇందుకు విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలకు పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.1.05 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నాడు. విదేశాల్లో విద్యాబోధన, అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో విద్యావిధానాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. మంత్రులు, ఉన్నతాధికారులే కాదు.. క్షేత్రస్థాయిలో బోధించే టీచర్లు ఈ అధ్యయనంలో భాగం కావాలి. అందుకే ఇటీవల 25 మంది ప్రభుత్వ టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్కు పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా మరో ప్రత్యేక దినాన టీచర్లకు సన్మానం చేస్తాం.దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదోతరగతి పాసైన తర్వాత ఇంటర్లో డ్రాపౌట్స్ను అరికట్టేందుకే ఈ నిర్ణయం. వర్సిటీలల్లో సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్, మరో జత జూన్ నెలాఖరున ఇస్తాం.ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను’అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను సీఎం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, జి.వివేక్ పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు’
హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు. -
బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్
-
అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో దీనిపై స్పందించారు.‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.2029లో జమిలి ఎన్నికలు కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదు. మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరాం. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు. రాజకీయ అంశాలకు తావు లేదు. నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధిని మాత్రమే. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. -
బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్ ఆరా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. మైనర్ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
రేవంత్ కు మోదీ ఓపెన్ ఆఫర్
-
ఇంటర్ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రవేశాలు 2026–27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉందని, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలోనే కొనసాగించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అక్కడితోనే చదుకు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణాలతో ఆదివారం సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో అతి త్వరలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ను వికసిత్ భారత్లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా ‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.వరంగల్లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ప్రధాన హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాత్ర అత్యంత కీలకం హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.మాటకు మాట... సీఎం రేవంత్రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు. -
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
అదే మా లక్ష్యం.. హైదరాబాద్లో మోదీకి చెప్పిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఎకానమీని 2047 నాటికి 30 ట్రిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ 1గా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్సిటీ, మూసీనది అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అవసరమని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టిపెడతామని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడానికి రైజింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.మరోవైపు, గతంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలకు వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి?ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్రోడ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. -
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న నగరీకరణతో సమీప భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతం మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగ రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ వంటి మూడు విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది: స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు ఇతర సభ్యులు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై కమిటీ ముఖ్యమంత్రిని అభినందించింది. దీంతోపాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడింది. అంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్తోపాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను కమిటీ సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఈ ఘోరమైన కేసుల్లో చర్యలేవీ?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో గత 15 రోజులుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగినా, కరీంనగర్ గోల్డ్ షాపులో భారీ చోరీ జరిగినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని విమర్శించారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను 40 మంది ఆకతాయిలు వేధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి 'సిట్' వేస్తారని, మరి రాష్ట్రంలో పెరుగుతున్న ఈ నేరాల పరంపరపై ఎందుకు ప్రత్యేక విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసు శాఖ తూతూ మంత్రంగా పనిచేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.‘‘రేవంత్ రెడ్డి నిజంగా మీకు, బండి సంజయ్ కు మధ్య ఎలాంటి దోస్తానా లేకుంటే, మీ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే బండి సాయి భగీరథ్ ను వెంటనే జైలుకు పంపండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. అమ్మాయి తల్లితండ్రులకు ఎలాంటి హాని జరిగినా దానికి రేవంత్ రెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి. బండి సంజయ్ కొడుకు బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలేవీ? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్నేహితులు కాబట్టే చర్యలు లేవు’ అని అన్నారు. -
బంగారు తునకలా మార్చుకుందాం
వికారాబాద్: దశాబ్దాల తరబడి అన్యాయానికి గురైన కొడంగల్ను బంగారు తునకగా మార్చుకుందామని సీఎం రేవంత్రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, దేశంలోని గొప్ప గొప్ప పరిశ్రమలు కొడంగల్ బాట పట్టాయని తెలిపారు. శుక్రవారం కొడంగల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి రూ.110 కోట్లతో కొడంగల్ వెంకటేశ్వరస్వామి, రూ.2 కోట్లతో కోస్గి వేణుగోపాలస్వామి, రూ.2.5 కోట్లతో దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తాం. దీనికి సంబంధించిన భూసేకరణ బాధ్యతలను మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెల రోజుల్లో పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకానికి ఇక ఏ అడ్డంకులూ లేవు. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాం. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు నీరందిస్తాం. రైల్వేలైన్ కోసం పరిగి ఎమ్మెల్యే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వికారాబాద్– కృష్ణా రైల్వే మంజూరు పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయ్యాయి.మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి పరిగి, కొడంగల్లో రైలు కూత వినిపిస్తాం. సుద్ద గనులు మన దగ్గర ఉంటే సిమెంటు కంపెనీలు కర్ణాటకలో ఉండేవి. మన ఖనిజ సంపదంతా అక్కడకు తరలివెళ్లేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.మెడికల్, ఇంజనీరింగ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు అవుతున్నాయి. ఏడాదిన్నరలోపు ఎడ్యుకేషన్ హబ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి అవకాశాలు లేక పేదలు పూణే, బాంబేలకు వలసలు వెళ్లేవారు.. నేడు మన దగ్గరే పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పింస్తున్నాం. పేదల తిరుపతిగా కొడంగల్ వెంకటేశ్వరాలయం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు పునరి్నర్మాణ పనులు చేపట్టి తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతానికి చెందిన ఆగమ శాస్త్ర పండితులు సుందర వరదాచార్యుల సలహా ప్రకారమే తిరుపతిలో అన్ని కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కూడా ఆయన పెట్టిన ముహూర్తానికే చేశాం. కానీ ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోవటం ఎంతో లోటు. ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఆలయంలోని ఓ విడిదికి వరదాచార్యుల పేరు పెడతాం. వెనుకబాటుకు గురయ్యాం.. గురునాథ్రెడ్డి కొడంగల్ నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధికి ఆనాడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారెవరూ మంత్రి కాలేకపోయారు. దీంతో అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యాం. ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అన్న తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిలో కలిసిసాగాలి పార్టీలకతీతంగా నాయకులు, సర్పంచ్లు కలిసొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్రంలోనే కొడంగల్ ఎత్తయిన ప్రాంతం. నీరు వచ్చే అవకాశం లేకపోయింది. కందులు తప్ప వడ్లు పండించే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి తండా, ప్రతీ పంచాయతీకి రోడ్డు నిర్మించుకున్నాం. ఇంకా ఎక్కడ ఏం అవసరం ఉన్నా చేసుకుందాం. కార్యకర్తలు, నాయకుల కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చా.. కొడంగల్ కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యమంతి పదవి వచ్చింది.. దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందాం. ఏది కావాలన్నా చేసుకుందాం.. 2,300 ఎకరాల్లో ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎయిర్పోర్టు నుంచి కోస్గి వరకు 300 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించుకుంటున్నాం. 2009లో మీరు నాటిన మొక్క నేడు చెట్టుగా మారింది. సీఎంగా మీముందు కూర్చుంది.. ఏది కావాలన్నా కొదవ లేకుండా చేసుకుందాం’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్రెడ్డి, కల్వ సుజాత, కలెక్టర్ దీపక్తివారి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


