breaking news
Revanth Reddy
-
చేవెళ్ల దుర్ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Chevella road accident Updates..చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశంచేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశంఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటనఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి మీర్జాగూడ ప్రమాదం కలచివేసింది.మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ ఇన్సూరెన్సును కూడా అందిస్తాం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతాం గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యంరంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందిఈ ప్రమాదంలో మొత్తం 19మంది మంది మృతి చెందారుప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి,పీఎం హాస్పిటల్కు తరలించాంమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం అయ్యింది మూడు రోజుల క్రితం దాన్ని డిస్మిస్ చేయడం జరిగిందికొద్దిరోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి కానీ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగిందిచేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై స్తంభించిన వాహనాలుచేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయిచేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతిచేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.కేసు నమోదు..మీర్జాగూడ ప్రమాద ఘటనపై కేసు నమోదు..బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గుర్తింపు.మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు.ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి(38) మృతి. ఆలూరు నుంచి వాహనాల మళ్లింపుమీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్.చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు.ఆలూరు-చేవెళ్ల మీదుగా హైదరాబాద్కు మళ్లింపు. మంత్రి పొన్నం ఎక్స్గ్రేషియా ప్రకటన.. ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు.బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది.గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం.రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి.ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియాక్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం.కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్.. స్పాట్కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిఘటనా స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నంతీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్కు తరలిస్తున్న అధికారులు..కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం.తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కామెంట్స్..రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.నా ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను.వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుప్రమాద వివరాలు - అధికారుల మధ్య సమన్వయం చేయనున్న కంట్రోల్ రూమ్.ప్రమాద సమాచారం కోసం AS: 9912919545SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కోరిన ప్రభుత్వంఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి..ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రిచేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రిఅవసరమైన వారందరినీ హైదరాబాద్కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు. ఉన్నతాధికారులంతా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశంమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారంక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.ప్రమాదానికి గల కారణాలపై ఆరా, దిగ్భ్రాంతిసీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగం.బాధితులకు న్యాయం చేస్తాం.క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుంది.ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి..ప్రమాదంలో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరంఈ దుర్ఘటన వార్త తీవ్రంగా కలిచివేసిందిమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాక్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలిఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలిప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిప్రమాద ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి..బస్సు ప్రమాద దుర్ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి.జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన మంత్రిప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశంక్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబుగాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ.క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశంమృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు మృతి చెందడంచ, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…— KTR (@KTRBRS) November 3, 2025టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి..బస్సు ఘోర ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.సీఎం రేవంత్ విచారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. 👉మరోవైపు... మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.👉ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.👉ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
విద్యాసంస్థలు బంద్.. సర్కార్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్కు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, బంద్ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం. -
మజ్లిస్కు రేవంత్ జీహుజూర్
గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గులామ్గా మారి జీహుజూర్ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్లో విజయం సాధించడానికి మజ్లిస్ పార్టీకి గులామ్గా మారిందని ఆరోపించారు.మజ్లిస్ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పథకాలకు నిధులు కేంద్రానివే.. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.గత రెండేళ్ల రేవంత్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. -
జూబ్లీహిల్స్ 'డూ ఆర్ డై'
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక ఫలితంతో తనతోపాటు మంత్రులందరి భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వస్తుందనే ధీమాతో ఉండొద్దని, మంత్రులు ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దాదాపు గంటన్నరకు పైగా అక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కూలంకషంగా పరిశీలిస్తోందని, డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. డివిజన్లు, బస్తీలతో సహా బూత్ స్థాయిలో ప్రచార మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలని, ఈ వారం రోజులపాటు ప్రతి మంత్రి ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సీఎంగా నా ఒక్కడిపైనే ప్రభావం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఓ ఇమేజ్ కల్పిస్తుంది. ఈ ఎన్నికలో సానుకూల ఫలితం రాకపోతే నాతోపాటు వ్యవస్థకు నష్టం చేస్తుంది. డూ ఆర్ డై తరహాలో ఈ ఎన్నికను తీసుకోవాలి. తూతూమంత్రపు వ్యవహారాలకు స్వస్తి చెప్పి మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. మంచి మెజార్టీతో ఈ ఎన్నికలో గెలవాలి’అని దిశానిర్దేశం చేశారు. కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా? ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండంలో, సోషల్ మీడియా ప్రచారంలో ఆశించిన మేర మంత్రులు పనిచేయడం లేదని సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన విధ్వంసాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ విషయాలను జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరంగా చెప్పాలని మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా మంత్రులే సోషల్ మీడియాను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వారియర్లను అప్రమత్తం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను వెంటనే తిప్పికొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితోపాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ పాలనలో అభివృద్ధి నిల్
గోల్కొండ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని.. అందుకే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆదివారం ఆయన షేక్పేట్ డివిజన్లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్రెడ్డి పాలనను ఎండగట్టారు. జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లకు చెక్ పెట్టాం.. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితో గ్రామీణ ప్రజలతోపాటు హైదరాబాద్వాసుల మన్ననలు పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు లెక్కకు మించి ఉండేవని.. తమ పాలనలో అవన్నీ మాయమయ్యాయన్నారు. కేసీఆర్ కరెంటు కోతలకు చెక్ పెట్టడమే కాకుండా కృష్ణా, గోదావరి నీటిని నగర ప్రజలకు అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది హైదరాబాద్ వచ్చారన్నారు. కోవిడ్ సమయంలోనూ ఒక్క హైదరాబాద్లోనే 42 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నత్తనడకన అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ది చెందలేదన్నారు. ఆరు గ్యారంటీలంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని ఒక్క సీట్లోనూ గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందుకోసం ఎంఐఎంకు బానిసగా మా రి ఆ పార్టీ షరతులన్నింటినీ ఒప్పుకుందని దుయ్యబట్టారు. నగరవాసులు ఓటేయకుంటే రిగ్గింగ్కు అవకాశం నగరవాసుల ఓటింగ్ సరళిలోనూ మార్పు రావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రసంగాల కోసం.. సైన్యాన్ని అవమానిస్తారా..?సీఎం రేవంత్పై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారతీయ సైన్యంపై చేసిన అవమానకర, దిగజారుడు వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘యూనిఫాం ధరించిన వీరులు సరిహద్దుల్లో అత్యంత క్రూరమైన పరిస్థితుల్లో కష్టపడుతుంటేనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం. ఎన్నికల ప్రసంగం కోసం భారతీయ సైన్యాన్ని తక్కువ చేసి పాకిస్తాన్ను పొగడటం ఏమిటి.. భారతీయ సైన్యానికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి గూండాలను, రౌడీ షీటర్లను ఆరాధించడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. తెలంగాణ ప్రతినిధిగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సైనికులను గౌరవించాలి’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు పట్టించుకోలేదేం? ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు. ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి ‘బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్ఎస్ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఉల్లంఘనపై సీఎంపై ఎస్ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ సైన్యాన్ని అవమానపర్చేవిధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సైన్యంపై తప్పుడు, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలంటూ విజ్ఞప్తి చేసింది. “దేశ భద్రతా బలగాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైవని బీజేపీ మండిపడుతోంది. -
కాంగ్రెస్ సేఫ్ గేమ్.. సీఎం రేవంత్ పబ్లిక్ వార్నింగ్
-
హీటెక్కిన పాలి'ట్రిక్స్'..
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం హాట్హాట్గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే.. నియమావళి ఉల్లఘనలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పరంపర కొన సాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లయింది. మరోవైపు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లో డివిజన్లవారీగా తిష్ట వేసి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విజయం సాధిస్తామని ధీమాతో బీఆర్ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. అందరి దృష్టి ఇక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, సెలబ్రిటీలు, సంపన్నుల ఓట్లు కూడా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పక్షా లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊ హకు అందని విధంగా నిర్ణయాలతో ట్విస్టులపై ట్విస్టు లు ఇస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాటా ముచ్చటా కార్యక్రమంతో టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. రోడ్ షోలు అదుర్స్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి పోటా పోటీగా నిర్వహించిన రోడ్ షోలు ఆ పారీ్టల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేపట్టిన రోడ్ షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షో గులాబీవనాన్ని తలపించింది. నందినగర్లోని నివాసం నుంచి రోడ్ షోకు బయలుదేరేముందు పార్టీ మహిళా నేతలు కేటీఆర్కు హారతి పట్టారు. అడుగడుగునా గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసి కేటీఆర్ సైతం జెండా ఊపారు. ‘అందరూ బాగున్నారా. ‘కొడుతున్నామా జూబ్లీహిల్స్ను మళ్లీ. కేసీఆర్ నాయకత్వం వరి్ధల్లాలి’ అన్నారు. దీనికి స్పందిస్తూ జనం చేయి చూపడంతో అది చూపొద్దు. మొండిచేయి డేంజర్. పిడికిలి బిగించాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. -
కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా అందరినీ పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచి్చన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో కనీస మౌలిక సదుపాయాలు లేక దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా గుంతల రహదారులు, పొంగుతున్న మురుగు కాల్వలు, వెలగని వీధి దీపాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు.నియోజకవర్గానికి చుట్టూ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలు గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు.. ఈసారి బీజేపీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల్లా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని.. తమ నిజాయతీనే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల గూండాయిజం, రౌడీయిజాన్ని అంగీకరించబోమని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదని.. కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లేదని అన్నారు. మజ్లిస్ ఓట్లపై నమ్మకంతోనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే మజ్లిస్ నుంచి అభ్యర్థి ని తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉంటాడని.. ఆయనకు ఒక్క ఫోన్ కాల్ చేయగానే ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి నడుస్తాడని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. -
ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ను కొనసాగించిన రేవంత్రెడ్డి.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు.. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
ఎకరానికి రూ. 10 వేలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరదల్లో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేలు, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత కాలనీలు సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్షణమే నివేదికలు ఇవ్వండి.. తుపాను ప్రభావంపై వెంటనే పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో 12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉంది. ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు అక్కడి కలెక్టర్లతో సత్వరం సమీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలి. వరదలు తగ్గుముఖం పట్టినందున వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. చెత్తను తొలగించి, శానిటేషన్ చేయాలి. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలి. వరదల వల్ల మరణించినవారి జాబితాలను పారదర్శకంగా ఇచ్చేలా పోలీసు శాఖ వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదుచేసి నివేదికలు అందించాలి.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తాం. వరదల వల్ల మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.5 వేలు, పెద్ద పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు ఇచ్చేలా పశుసంవర్ధక శాఖ నివేదికలు పంపాలి. పత్తి, వరి చేతికి వచ్చే ముందు నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. నీట మునిగిన పంటతోపాటు ఇసుక మేటలు వేసిన ప్రాంతాల బాధిత రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు సాయం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. ఇల్లు మునిగినవారికి రూ.15 వేలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.వరదలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాలి. అర్హులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చే అంశంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. వరద ప్రాంతాలపై అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మరోసారి సమీక్ష నిర్వహిస్తాం’అని సీఎం తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఎన్ని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారన్న వివరాలు కూడా చూస్తామని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలేదని అన్నారు.ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాగా పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా ఉంటాయని తెలిపారు. వరదలపై వెంటనే పూర్తి నివేదికలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం పంపుతామని, ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీటి నిర్వహణపై నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలాల కబ్జాదారులపై ఉక్కుపాదం.. వరంగల్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే తరచూ వరదలు వస్తున్నాయని సీఎం అన్నారు. చెరువులోకి వెళ్లే నాలాలు కబ్జాకు గురైతే ఆ కబ్జాలను తప్పక తొలగించాలని ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, పదిమంది కోసం పదివేల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాందించుకున్న ఇంటి సామగ్రి, పిల్లల సరి్టఫికెట్లు వంటి కీలక వస్తువులు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీ వేయాలని ఆదేశించారు. కాలనీవాసుల గోడు విన్న సీఎంసమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీల్లో పర్యటించిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. బాధితులు సీఎంకు తమ సమస్యలు ఏకరువు పెట్టగా.. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద నష్టంపై హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటోల ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ఘన్పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
Warangal: బాధితులతో ఇళ్లల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న సీఎం
-
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. గురువారం రాత్రి ముంబైలో సీఎంతో కొంత సమయం పాటు సల్మాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో చెప్పవచ్చు. దీనిని అందరికీ తెలిసేలా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా తెలంగాణ గురించి స్పందించారు. రాష్ట్రం చాలా వేగవంతంగా పురోగతి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఆ జిల్లాల్లోని ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ఇన్చార్జి మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని నిర్దేశించారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానల వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. కొనుగోళ్లపై రోజూ నివేదికలు వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుతుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘వర్షంతో చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం, రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించింది. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి.అవి అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలి’అని రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రోజూ సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. హెల్ప్లైన్ ఏర్పాటు చేయండి వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ఫ్రీ హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రస్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాలను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్సిబ్బందిని తక్షణమే తరలించాలని చెప్పారు. ఎక్కడైనా వరదలో ఇళ్లపై కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. విద్యుత్శాఖ అప్రమత్తంగా ఉండాలి ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను మళ్లించాలని సూచించారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రకృతి విపత్తుల శాఖను ఆదేశించారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. నిధుల సమస్య లేదు: డిప్యూటీ సీఎం భట్టి సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి నిధుల సమస్య లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకుని 30 రోజుల్లోగా ర్యాటిఫై చేయాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ సహచరులు ముందుగానే హెచ్చరించడం వల్ల ప్రాణ, భారీ ఆస్తినష్టం జరగకుండా నివారించామని చెప్పారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు తుపాను మాన్యువల్ దగ్గర పెట్టుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పంటను కాపాడుకోగలిగామన్నారు. విద్యుత్ శాఖ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపారు. దెబ్బతిన్న సబ్స్టేషన్లను వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు. -
మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం నేడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఒక్కరినే కేబినెట్లోకి తీసుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సీఎస్కు లేఖ రాశారు. ఈసీ ఉత్తర్వులనుబట్టే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే అజహరుద్దీన్ను ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేసింది. గతంలో గోవాలో ఇలాగే ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది. ఏ శాఖ ఇస్తారో?అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మహమూద్ అలీకి రెండు దఫాల్లోనూ కీలకమైన హోం, రెవెన్యూ శాఖలను కేసీఆర్ అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలను ఇచ్చే పక్షంలో పెద్దగా మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని.. లేదంటే మంత్రుల శాఖలు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
డిప్యూటీ సీఎం పదవిపై ఆశలేదు
నిజామాబాద్ సిటీ: ఉప ముఖ్యమంత్రి పదవిపై తనకు అస్సలు ఆశ లేదని.. పీసీసీ చీఫ్గా చాలా సంతృప్తిగా ఉన్నానని మహేశ్ కుమార్గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ పదవి బరువు బాధ్యతలతో కూడుకున్న చాలా పెద్దదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని మహేశ్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మాజీ ఎంపీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు.డిసెంబర్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు మహేశ్గౌడ్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కె నగేశ్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రాజమహేందర్, జావేద్ అక్రం తదితరులు పాల్గొన్నారు. -
రేపు వరంగల్కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతీ ఒక్కరు ఫీల్ట్లో ఉండాల్సిందే.. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రేపు వరంగల్, హుస్నాబాద్లో పర్యటించనున్నట్టు తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.అధికారులపై చర్యలుంటాయ్.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గర లోని ఫంక్షన్స్ హాల్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలిజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలిహైడ్రా సేవలు వినియోగించుకోండి.. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదురేపు వరంగల్, హుస్నాబాద్ పర్యటన.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
కోడ్ ఉండగా మంత్రిని నియమించవచ్చా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, రాష్ట్ర మంత్రిగా ఎవరినైనా నియమించవచ్చా?. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాదా?. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు గవర్నర్ కొత్త మంత్రిని నియమించవచ్చా?. ఈ సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.నాడు సీఎంకు నేరుగా ఈసీ ఫోన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గంలో కొత్త మంత్రిని నియమించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలెక్కడైన జరిగాయా? అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది? అనే సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ఇటీవల హైదరాబాద్లో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో నివృత్తి చేశారు. మంతన్ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ 13న నగరంలోని విద్యా అరణ్య పాఠశాలలో నిర్వహించిన సంస్థ సహా వ్యవస్థాపకుడు ‘అజయ్ గాంధీ’ స్మారక ఉపన్యాసంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గతంలో గోవాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఆ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న సామాజికవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాష్ట్రమంత్రిగా నియమించాలని అప్పటి సీఎం మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నేరుగా మనోహర్ పారికర్కు ఫోన్ చేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు కొత్త మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారని అశోక్ లావాసా వెల్లడించారు. మంత్రుల నియాయకం విషయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను సైతం వాడుకోలేనా? అని మనోహర్ పారికర్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయిస్తే ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని ప్రధాన కమిషనర్ నచ్చజెప్పడంతో అప్పట్లో మనోహర్ పారికర్ వెనక్కుతగ్గి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారని అశోక్ లావాసా తెలిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై సీఈఓ కార్యాలయం స్పందనను ‘సాక్షి’ కోరగా, దీనిపై తమకు ఏమైన ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని బదులిచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -ముహమ్మద్ ఫసియుద్దీన్. -
రైతులకు నష్టం జరగొద్దు
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం,.. పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోంథా ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండటం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మోంథా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని చెప్పారు. నీటిమట్టాలను పరిశీలించండి నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని చెప్పారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. -
సీఎం రేవంత్పై కేసు నమోదు చేయాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు, సుమోటోగా కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ కార్మికుల ఓట్లకోసం సన్మానాల పేరిట కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్కు అందజేశాం. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ను తొలగించడంతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని కోరాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఇచి్చన ఫిర్యాదులో కోరాం. తనకు అడ్డువస్తే చంపేస్తానని నవీన్ యాదవ్ బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. -
తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)
-
150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించి 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణంతో మహా రాష్ట్రలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు త్వరలో మహారాష్ట్రలో పర్యటించనున్న ట్టు ఆయన తెలిపారు.నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి సుందిళ్ల బరాజ్కి గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోయాలనే ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమో దించారు.తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవచ్చనే వాదన ను ఈ సమావేశంలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు తోసిపుచ్చారు. కనీసం 149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే 80 టీఎంసీలను గ్రావిటీతో సుందిళ్ల వరకు తరలించగలమని స్పష్టం చేశారు. దీంతో 150 మీటర్ల ఎత్తు లో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.ప్రాణహిత ప్రాజెక్టు కింద గతంలో నిర్మించిన పనులను వినియోగంలోకి తెచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనల రూపకల్పన జరగాలన్నారు. సుందిళ్ల బరాజ్కు సత్వరం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్లదే..కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చిచెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ –2021 ప్రకారం 5 ఏళ్లలోపు దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించిన సమగ్ర మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉండగా, ఈ విషయంలో రాష్ట్రం వెనకబడిందని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 17న సీఎం రేవంత్కు లేఖ రాశారు.రాష్ట్రంలోని 173 ఆనకట్టల భద్రతకి సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసేందుకు 15 నెలల సమయమే మిగిలి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా సమీక్ష నిర్వహించాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దీంతో కేంద్రం నిర్దేశించిన గడువులోగా అన్ని ఆనకట్టల భద్రతకు సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. పురోగతి విషయంలో ఆనకట్టలవారీగా స్థితిగతుల నివేదిక రూపొందించాలని, నవంబర్ రెండోవారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
టికెట్ రేట్లు పెంచాలంటే.. 20% సినీ కార్మికులకు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచాలంటే.. ఇకపై పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికుల వెల్ఫేర్ఫండ్ ఏర్పాటు చేసి, ఆ మొత్తాన్ని ఫండ్కు జమచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలా ఇస్తేనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టంచేశారు. ఆ మేరకు ఒక జీవో జారీ చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం సినీకార్మిక సంఘాలు యూసుఫ్గూడ పోలీసు గ్రౌండ్స్లో ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సినీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి సినీ కార్మిక వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేయాలని సంఘాలకు సూచించారు.ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘చాలామంది సినిమా పెద్దలు టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు వస్తున్నారు. ధర పెంచితే నిర్మాత, హీరోలకు ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు మాత్రం దాని ఫలాలు దక్కడం లేదు. మీ శ్రమతో సంపాదించిన ప్రతి రూపాయిలో మీకు భాగస్వామ్యం ఉండాలి. టికెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇస్తుంది.కృష్ణానగర్లో మూడునాలుగు ఎకరాల స్థలం చూడండి. సినీ కార్మికుల పిల్లల చదవుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మిస్తాం. టిఫిన్, లంచ్, ఉన్నత విద్య అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అసోసియేషన్కు భవనం లేదని నా దృష్టికి వచ్చింది. కొంత స్థలం కేటాయించి, నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఫైటర్స్, సినీ కార్మికుల ప్రాక్టీస్ కోసం స్థలం కావాలన్నారు. ఫ్యూచ ర్సిటీలో మీకు కావా ల్సిన ఏర్పాట్లు చేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు. హాలీవుడ్కు కూడా హైదరాబాద్ వేదికవ్వాలిహైదరాబాద్ నగరం హాలీవుడ్ సినిమా షూటింగ్లకు వేదిక కావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ‘ఒకనాడు తెలుగు సినీ పరిశ్రమను మద్రాసీ అని పిలిచేవారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, అగ్ర నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు వంటి మహానుభావులు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడాన్ని ప్రోత్సహించారు. సినీ కళాకారులు, కార్మికులు ఎంతో కష్టపడతారు. నగదు బహుమతుల కంటే కొట్టే చప్పట్లు, సన్మానంలో కప్పిన శాలువాలతోనే సంతోషపడతారు.కవులు, కళాకారులను సన్మానించే కార్యక్రమం పదేళ్లు ఆగిపోయింది. ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో గద్దర్ ఫిలిం అవార్డుల రూపంలో అందిస్తున్నాం. నంది అవార్డులను గెలవడమే గొప్ప అనుకున్నాం. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయం వెనుక డైరెక్టర్లు, నటులే కాదు.. కార్మికుల శ్రమ కూడా ఉంది. తెలుగు సినిమాల షూటింగ్ ఇతర దేశాల్లో జరగడం కాదు.. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలన్నది నా ఆలోచన. మీరంతా అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొచ్చే బాధ్యత మాది’అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ పెడతామని చెప్పారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోను..సినీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలి పారు. ‘మహాభారతంలో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ప్రాణత్యాగం చేశాడు. మీకు అండగా నేను నిలబడతా. సమస్యలు పరిష్కరిస్తా. నిర్ణయం తీసుకోనంత వరకే నేను ఆలోచిస్తాను. తీసుకున్నా క ఆలోచన చేయను. నవంబర్ చివర లో మళ్లీ మీ సంఘాల నాయకులను కలుస్తా. ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన ప్ర ణాళికతో ముందుకెళతాం. నిర్మాతలతో మీకు ప్రతిష్టంభన వచ్చినపుడు.. మీరు రాణించాలంటే కార్మికులను కుటుంబ సభ్యుల్లా చూసుకో వాలని దర్శక, నిర్మాతలకు చెప్పాను. మీ సమ స్యలను తెలుసుకోవడానికి నేనే కృష్ణానగర్కు వస్తా. కార్మికులకు ఇళ్ల గురించి అడిగారు.. ఎంతవరకు సాయం చేయగలనో అంచనా వేసుకున్నాక 24 క్రాఫ్ట్స్ నాయకులను పిలిచి మాట్లాడుతా’ అని సీఎం హామీ ఇచ్చారు. శృంగేరి విధుశేఖర స్వామిని కలిసిన సీఎం⇒ శంకరమఠంలో మర్యాదపూర్వకంగా భేటీ⇒ రేవంత్కు ఆశీస్సులు అందించిన స్వామీజీ నల్లకుంట: శృంగేరి శారదా పీఠం దక్షిణామ్నాయ జగద్గురువు విధుశేఖర భారతీ స్వామిని «ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నల్ల కుంటలోని శంకరమఠంలో మర్యాదపూర్వకంగా క లిశారు. స్వామీజీకి సీఎం పూలమాలను సమర్పించగా, సీఎం మెడలో స్వామీజీ రుద్రాక్ష మాల వేసి జగద్గురువు చిత్రపటం అందజేసి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శంకరమఠం ధర్మా ధికా రి చింతలపాటి శ్రీనివాసమూర్తి, పండితులు వేద మంత్రాలతో సీఎంకు స్వాగతం పలికారు. ముందుగా మఠం ప్రాంగణంలో గల శక్తి గణపతి, చంద్ర మౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యులు, శారదాంబ ఆలయాల్లో సీఎం ప్రత్యేక పూజలు నిర్వ హించారు.‘ధర్మ విజయ యాత్ర–2025’లో భాగంగా హైదరా బాద్ విచ్చేసిన విధుశేఖర భారతీ స్వామీజీ.. శంకరమఠంలో విడిది చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధితోపాటు ముఖ్యంగా వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి వివరాలను స్వామీజీకి సీఎం వివరించారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.హైదరాబాద్లో మెక్డొనాల్డ్ కొత్త గ్లోబల్ ఆఫీసునేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: మెక్డొనాల్డ్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న కొత్త గ్లోబల్ ఆఫీసును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా మెక్డొనాల్డ్ ఈ గ్లోబల్ ఆఫీసును ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆఫీస్ ఫైనాన్స్, హెచ్ఆర్, సోర్సింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, టెక్నాలజీ వంటి కార్పొరేట్ కార్యకలాపాలకు సంబంధించిన బృందాలు ఇక్కడ నుంచే పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా సంస్థకు ఉన్న 43 వేల రెస్టారెంట్లు, 65 మిలియన్ల మంది కస్టమర్లను ప్రభావితం చేసే కార్యకలాపాలపై ఈ గ్లోబల్ ఆఫీసు పనిచేస్తుంది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయం నాలుగు అంతస్తుల్లో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గ్లోబల్ ఆఫీసులో వివిధ కార్యకలాపాల కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియను మెక్ డొనాల్డ్ ఇప్పటికే ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
సినీ టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్
హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బధ్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు సిని పరిశ్రమ 24 క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్, పొన్నం, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం. కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం. కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా. సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి. ఆ రకంగా అయితే ిటికెట్ ధరలు ెపెంచుకునేందుకు జీవో ఇస్తాం. నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు.. ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం. మహా భారతం లో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు. అందుకే మిత్ర ధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని. నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను. ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్ర ధర్మం పాటిస్తాను. డిసెంబర్ 9 నాడు సినీ కార్మికుల కోసం దిశా నిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము. కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన. కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్ల ఫండ్ కేటాయిస్తాము. టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి. టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం. మరి కార్మికులకు ఎం ఒరిగింది. కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు. పెంచిన టికెట్ ధర లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము. మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. నేను ఈ విధంగా చేయాలనీ ఆదేశలు ఇస్తున్న’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటా
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. -
ఆటో ఓనర్లు.. డ్రైవర్లుగా మారుతున్నారు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్/శ్రీనగర్కాలనీ: ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పాలన కారణమని, ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ‘ఆటో అన్నతో మాట ముచ్చట’పేరిట సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఆటోల్లో ప్రయాణించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటో కార్మికుడు మష్రత్ అలీ ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు.జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను రెండు ఆటోల యజమాని అని, అయితే ప్రస్తుతం వాటిని అమ్ముకుని అద్దె ఆటోను నడుపుతున్నానని ఆటో డ్రైవర్ మష్రత్ అలీ.. కేటీఆర్కు వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పాలనలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేలు చెల్లించాలన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరీశ్.. కోకాపేట నుంచి ఎర్రగడ్డ వరకు ‘ఆటో అన్నతో మాట ముచ్చట’లో భాగంగా మాజీ మంత్రి హరీశ్రావు తన కోకాపేట నివాసం నుంచి ఎర్రగడ్డకు, అక్కడ నుంచి తెలంగాణ భవన్కు ఆటోలో చేరుకున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో తమకు రోజూవారీ ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్నామని ఆటో కార్మికులు హరీశ్తో తమ ఆవేదన పంచుకున్నారు.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ప్రయాణం చేసిన వారిలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కేపీ వివేక్, డాక్టర్ కె.సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శంభీపూర్ రాజు తదితరులు ఆటోల్లో ప్రయాణించి కార్మికులతో సంభాషించారు. -
రేపు జూబ్లీహిల్స్లో సీఎం రోడ్ షో
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 28న సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు మద్దతుగా సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు డి విజన్లలో రోడ్షోలో పాల్గొంటారన్నారు.అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. -
కేంద్రమంత్రి కుమారుడి బారసాలకు సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడు శివాన్ బారసాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం వెంట కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.కాగా, డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. తన రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. కేంద్రమంత్రి నివాసంలో జరిగిన బారసాల వేడుకకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై శివాన్ను ఆశీర్వదించారు. -
Jubilee Hills: సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్ షోతో ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) వెల్లడించారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఈ సభను పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొననున్నారు. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్గా మారనుంది. కేటీఆర్కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జూబ్లీహిల్స్లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బతుకుదెరువు కోసం అప్పులు చేసి జోర్డాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడే చిక్కుకు పోయిన 12 మంది వలస కార్మికులు హరీశ్రావు చొరవతో శనివారం తెల్లవారు జామున హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో వారు హరీశ్రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకుని, స్వదేశానికి చేర్చేందుకు చొరవ తీసుకున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఒక్క హామీనీ నెరవేర్చలేదు.రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులపై విధించిన జరిమానా కూడా చెల్లించి వారిని స్వదేశానికి తీసుకువచ్చాం అని హరీశ్రావు వెల్లడించారు. హరీశ్రావుతో భేటీ తర్వాత వారు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. -
ఢిల్లీలో రేవంత్ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు. -
రేవంత్రెడ్డీ.. దమ్ముంటే అశోక్నగర్కు రా..!
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్రెడ్డీ.. నీకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు పోలీసు భద్రత లేకుండా అశోక్నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రాగలవా?’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరు ద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను వేడుకొని, వాడుకొని.. అధికారంలోకి వచ్చాక వదిలేశారని ధ్వజమెత్తారు.శుక్రవారం నెక్లెస్రోడ్లోని జలవిహార్లో ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ఆవిష్కరణ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు కానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జాబ్లు నింపాలని అడిగితే.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గల్లా పెట్టెలు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రెండు లక్షల జాబ్ కేలండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని హరీశ్రావు ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని సీఎంను ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అయిందని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని పిలుపునిచ్చారు. విద్య, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని.. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 1.64 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని హరీశ్రావు తెలిపారు.‘నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్టు పెట్టింది, ఎంపిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే... నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇక గుర్తు పెట్టుకో రేవంత్.. ఈరోజు నుంచి నీకు చుక్కలు చూపిస్తాం’అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్ధన్, ఇందిర నాయక్, పురుషోత్తం యాదవ్, నవీన్ పటా్నయక్, మోతీలాల్, తిరుపతి, సింధురెడ్డి, లలిత రెడ్డి, శింబు, శంకర్ నాయక్, బాలకోటి, మహేందర్, కుమార్, రాడపాక రవి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఒకే సారి రూ. 2,780 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను తెలంగాణ కోర్ అర్బన్ సిటీ మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో ఖర్చు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.15 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు రూ.30 కోట్లు, గ్రామాలను విలీనం చేసిన మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున వెంటనే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ రూ.2,780 కోట్లతో చేపట్టే మొత్తం 2,432 పనులకు సీఎం ఆమోద ముద్ర వేశారు. ఈ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి కచి్చతంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల వాటికి మినహా అన్నింటికి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు.. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతోపాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (UIDF) నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్ లైన్ ఏర్పాటు చేసిందిఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్ సెక్రటరీ-991291954ఈ.చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్-9440854433గద్వాల్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్-9502271122కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599- 9100901598కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్ 9100901604గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. -
విద్యార్థి ఖాతాకే ‘ఫీజు’
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించే ఫీజులను కాలేజీ యాజమాన్య ఖాతాల్లో కాకుండా నేరుగా విద్యార్థి ఖాతాకు విడుదల చేసేలా నిబంధనల మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి ఖాతాకు ఫీజులు విడుదల చేస్తుండగా గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా నేరుగా విద్యార్థులకే ఫీజులు విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి. తాజాగా ఈ ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపాక ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కాలేజీల ఆధిపత్యానికి చెక్... సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కాలేజీల యాజమాన్యాల ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫీజు నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు అందే దాకా విద్యార్థుల ధ్రువపత్రాలు ఇచ్చేందుకు చాలా కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తుండటం వల్ల కోర్సులు పూర్తి చేసినా ఉద్యోగ ఇంటర్వ్యూలు, చేరికల వేళ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజు పథకం పరిధిలోని విద్యార్థుల నుంచి కూడా ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీల ఆదిపత్యానికి చెక్ పెట్టడంతోపాటు విద్యార్థికి నేరుగా ఫీజులు చెల్లించడం వల్ల పారదర్శకత ఉంటుందనే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలవారీగా నిధులు.. ఈ అంశంపై బీసీ సంక్షేమం, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సంక్షేమ శాఖల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై సంక్షమ శాఖలకు నెలవారీగా బడ్జెట్ విడుదల చేస్తామని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. నెలకు రూ. 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తే అందులో గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణతోపాటు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు వాటిని వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. ఈ క్రమంలో నెలవారీగా నిధులు విడుదల చేస్తే ఉపకార వేతనాలు, ఫీజుల కోసం నెలకు రూ. 200 కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. -
స్థానికంపై 7న నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్ 3న హైకోర్టులో జరగనున్న విచారణలో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 7న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీలో టీబీఎంకు స్వస్తి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కోసం ఇప్పటి వరకు అనుసరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానాన్ని పక్కనబెట్టి, అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో మిగతా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దివాళా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్తో గతంలో చేసుకున్న ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి లేదా 2028 జూన్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 44 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 31–32 కి.మీల తవ్వకాలు జరిగాయని, ఆ తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు 2–2.5 కి.మీ.ల మేర మాత్రమే తవ్వకాలు జరిపిందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పొడువైన 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ తీర్మానించింది. 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు... రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లను ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నిర్మించిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ–స్టేషన్ను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, రివర్స్ పంపింగ్ ద్వారా అందుకు అవసరమైన విద్యుదుత్పత్తికి వ్యూహాలు సిద్ధం చేయాలని కోరింది. ఆ నిబంధన ఎత్తివేత.. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్కు ఫైల్ పంపాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. -
కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణభవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది. అసమర్థ, పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నాజీవితంలో చూడలేదు. రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి. 500కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చింది. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్.. శంకరాహిల్స్లో ఏం చేస్తున్నారో.. సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో మాకు అన్నీ తెలుసు.ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయింది. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠానే నడుపుతుంది. దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యాం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుంది. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి.మంత్రి ఉత్తమ్కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారు. ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి. మంచి అధికారిగా శివధర్ రెడ్డికి పేరుంది. రోహిణ్ రెడ్డి, సుమంత్ ను లోపల వేసి తన నిజాయితీని డీజీపీ నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ ఇల్లా.. సెటిల్మెంట్కు అడ్డానా?. కేబినెట్ మీటింగ్లోనే మంత్రులు తిట్టుకుంటున్నారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదు?. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారు.ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారు. తెలంగాణ పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారు. ఐఏఎస్ రిజ్వీ చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ను బలిపశువును చేశారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్కు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం అని వ్యాఖ్యానించారు. -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానికంపై నేడు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేలా గవర్నర్కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది. ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు రద్దు ..?శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. కాళేశ్వరం టెండర్లకు ఓకే?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. -
రెండేళ్లలో ఉస్మా‘నయా’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వందేళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్టు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని, అవసరమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి ప్రణాళికలో మార్చురీ గది నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. రోడ్డుకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి ఆసుపత్రి చుట్టూ ముందుగా రోడ్లు నిర్మించి, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఇప్పటినుంచే రూపొందించాలని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణం పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్రాజ్, డీజీపీ శివధర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్రాజ్, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఇలంబర్తి, ముషారఫ్ అలీ ఫరూఖీ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక లక్షకు పైగా తాత్కాలిక ఉద్యోగులు
-
మావోలు లొంగిపోవాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. మంగళవారం గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కల్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడురోజుల కిందట నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, ప్రమోద్ లాస్ట్ డ్రాన్ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్గ్రేషియాం, పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు. దేశానికే ఆదర్శంగా మన పోలీసులు ‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్’ వింగ్ను ఏర్పాటు చేశాం. కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం. సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది..’ అంటూ రేవంత్ కితాబునిచ్చారు. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి ‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను.. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్ పోలీసింగ్’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్ పోలీసింగ్’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’..’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది: హరీశ్ రావు
-
‘‘కేసీఆర్పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
పోలీస్ అమరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
-
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని, పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే పోలీసుల అత్యాగాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. దేశం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నాలుగు కోట్ల ప్రజల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం... రోజు రోజుకు నేరాల స్వభావం మారుతోంది. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. శాంతి భద్రతల కట్టడికి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అందుకే అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సాంకేతికతలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు మంచి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. తెలంగాణ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటు అందించాలి. అలాగే.. పోలీసుల గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో.. పోలీసుల ప్రతీ అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రసంగిస్తూ.. పోలీస్ అధికారులు అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలి. దేశంలోనే తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఒకరోజు గుర్తు చేసుకుంటే సరిపోదు. వాళ్ళ కుటుంబాన్ని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు అధిక ఎక్స్గ్రేషియా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు. -
సీఎం రేవంత్రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హైదరాబాద్ : సంబరంగా దీపావళి సదర్ వేడుకలు (ఫొటోలు)
-
సీఎంకు రైతుల తిప్పలు కనిపించవా?
చిన్నకోడూరు (సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఆదివారం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని మాచాపూర్లో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరి గిందని, మక్కలు మార్కె ట్లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే 30 శాతం వరకు రైతులు దళారులకు విక్రయించారన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగు ఎట్లుందమ్మా: వ్యవసాయం ఎట్లుందమ్మా.. ఇబ్బందులు వస్తున్నా యా అంటూ హరీశ్రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఏమున్న ది సారూ అన్నింటికీ ఇబ్బంది అవుతోందంటూ రైతులు బదులిచ్చారు. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్లో పొలాల వద్ద సద్ది తింటున్న రైతులతో హరీశ్రావు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘యూరియా కోసం రోజుల తర బడి పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరక లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేయలేదు. సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతోంది. మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే ఆసరా’ అని రైతులు చెప్పారు. రేవంత్ పాలన రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు తప్పక తగులుతుందని హరీశ్ పేర్కొన్నారు. -
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి
చార్మినార్: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్ వద్ద రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాజీవ్గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాహుల్గాంధీ భారత్ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్మోహన్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
కవాడిగూడ: యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పిస్తామని...హైదరాబాద్ కా సదర్ ..యాదవుల ఖదర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కులీకుతుబ్షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని, యాదవులకు నమ్మిన వారికోసం ఏదైనా చేసే తెగువ ఉందని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఎంపీ అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా, శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపో తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లా డుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను యాదవ ప్రతినిధులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థా నం లభించిందన్నారు.సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు.. కోలాటం.. బోనాలు, కళారూపాలు ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా జంటనగరాల నుంచి యాదవులు వారి దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయి ంచిన విన్యాసాలు అలరించాయి. సీఎం రేవంత్రెడ్డి మాట్లా డుతుండగా పాత పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్లోని పోలీస్ స్టేడి యంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు డీజీ పీ శివధర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపను న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పో లీస్ కార్యాలయాలలో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పోలీస్ స్టేషన్ పరి«ధులలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31వ తేదీన జరగనున్న జాతీయ సమైక్యతా దినం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ కు చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణా లను అర్పించారని తెలిపారు. ‘అక్టోబర్ 22 –24 మధ్య మర ణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సందర్శించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలకు, ఫొటోలకు వారి స్వగ్రామాలలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. -
రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు. బంగాళాఖాతంలో విసిరేశారు గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. మా సైన్యం మీరే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్రెడ్డి, కె.ఆర్. నాగరాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుట్రలను తిప్పి కొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఉద్యోగులే మా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు పైశాచికానందంలో మునిగితేలుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. కలుషి తాహారం, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు జరిగిన వెంటనే అక్కడ వాలిపోయి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. శనివారం శిల్పకలావేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అథితిగా హాజరై గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం కొత్తగా ఉద్యోగాలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడారు.నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలిఅమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం విమర్శించారు. ‘వాళ్ల (గత పాలకులు) కుటుంబంలో ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు (పదవులు) ఇచ్చారు. కరీంనగర్ ఎంపీగా ఓడిన వ్యక్తికి రెండు నెలల్లో, నిజామాబాద్ ఎంపీగా ఒడిన బిడ్డకు రోజుల వ్యవధిలోనే కొలువులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న వాళ్లను నిలువునా ముంచారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశాం. ఏడాదిలోపే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్స్ ఉద్యోగాలను కూడా అవరోహణ క్రమంలో భర్తీ చేస్తున్నాం. మొన్న గ్రూప్–1, ఈరోజు గ్రూప్–2, త్వరలో గ్రూప్–3.. ఇలా భర్తీ చేస్తున్నాం. ఉద్యోగాలు సాధించిన వారిని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో చీకటి రోజులు పోయి వెలుగు నిండాలి. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యవస్థ మాకు లేదు.. మీరే మా వ్యవస్థ. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్లు. మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ–2047 విజన్కు అనుగుణంగా పనిచేయాలి. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ నెలవారీ జీతం నుంచి 10 నుంచి 15 శాతం కోతపెట్టి ఒకటోతేదీన వారి ఖాతాల్లో జమచేస్తాం. గత పాలకులు దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడంలో లొల్లి జరుగుతోంది. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ను రాజేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అధికారులంతా జాగ్రత్తగ ఉండాలి. ప్రమాదాలు, ఫుడ్ పాయిజన్తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి’అని సీఎం సూచించారు.మానవ వనరులను ఖాళీగా ఉండనీయం: భట్టిరాష్ట్రంలోని మానవ వనరులను వృధాగా ఉంచలేమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడికన్నా వెళ్లాలి... లేదా ఉద్యోగమన్నా చేయాలి అని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు బడికి రావాలని, వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని నైపుణ్యాలు పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్– 2 నియామక పత్రాలు అందించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
కార్పొరేట్ ‘చదివింపులు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా సరికొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.ఇందులో భాగంగా స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చే దాతలు, పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇది సరైన మార్గమని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.ఆయా స్కూళ్లలో ఆట స్థలాలు, అవసరమైనన్ని తరగతి గదులతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. స్థలం సమస్య వల్ల సౌకర్యాలలేమి ఎదుర్కొంటున్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి తరలించాలని ఆదేశించారు. విదేశాల్లో విద్యా వ్యవస్థల పరిశీలనకు టీచర్లను పంపే ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాల్లోని మెరుగైన విధానాలను అనుసరించాలని సూచించారు. నిధుల కొరత వల్ల.. విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలు, జరుగుతున్న కృషిని అధికారులు సీఎంకు వివరించారు. అయితే నిధుల కొరత అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు నిధులు మంజూ రు కాలేదని.. ముఖ్యంగా చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్ల చొప్పున, మిగతా వర్సిటీలకు రూ. 35 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేసినా ఇప్పటికీ నిధులివ్వలేదని పేర్కొన్నారు.దీనివల్ల వర్సిటీల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోతోందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రస్తుతానికి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటున్నందున కార్పొరేట్ సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం. నర్సరీ స్కూళ్లపై దృష్టి నర్సరీ స్కూళ్ల ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తూ వాటి ఏర్పాటు, ప్రజల్లో అవగాహన గురించి అధికారులను వివరాలు అడిగారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు సరికొత్త రీతిలో బోధన జరిగేలా చూడాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళకుండా పేద విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం ఇది అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.కాగా, ఉన్నత విద్యామండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. -
ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రతీ ప్రభుత్వ పారశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ‘ పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించండి. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించండిసరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించండి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయండి విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు
-
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: 1.48 లక్షల ఎకరాల్లో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు సెక్టార్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నల్సార్ యూనివర్సిటీ కి 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో 25 నుంచి 50 శాతం సీట్ల కేటాయింపు కోటా పెంచుతూ కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. రూ.10,500 కోట్లతో 5,500 కి.మీ మేర హ్యామ్ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతాం.ఇద్దరు పిల్లలకు మించి సంతానం వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్ఫోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. -
కేబినెట్ భేటీకి హాజరుకాని మంత్రి కొండా సురేఖ
-
Mahesh Kumar: క్యాబినెట్ భేటీ తర్వాత కొండా సురేఖతో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడతారు
-
BC Reservations: తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
కొండా సురేఖకు బిగ్ షాక్?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... -
కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్..
-
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
‘ఓటుకు కోట్లు’పై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు. ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది. -
మొదటి ప్రాధాన్యం ఆ 8 వైద్య కళాశాలలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన ఎనిమిది వైద్య కళాశాలలను తొలుత అందుబాటులోకి తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కళాశాలలకు చెందిన 30 ఎకరాల ఆవరణ లో వైద్య విద్యార్థులకు హాస్టళ్లు, పారా మెడికల్ కాలేజీ, బోధనాస్పత్రి, ఎంసీహెచ్తోపాటు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెలలో రూ. 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి 2026 మార్చి వరకు ప్రతినెలా రూ. 340 కోట్లు కేటాయిస్తారు. ఈ మేర కు సీఎం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో విడుదల కానున్న రూ. 500 కోట్ల నుంచి తొలిదశలో చేపట్టిన 8 వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించిన బకాయిల చెల్లింపు, మిగిలిపోయిన పనుల పూర్తికి వెచ్చిస్తారు. మొదటి దశ కాలేజీలే ముందుగా... రాష్ట్రంలో 2021 వరకు 9 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండగా, ఆ ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం 8 కొత్త కాలేజీలను ప్రకటించింది. సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, వనపర్తి, మంచిర్యాల, కొత్తగూడెం, నాగర్కర్నూలు, రామగుండంలోని 8 మెడికల్ కాలేజీల్లో 2022 నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే తాత్కాలికంగా వేర్వేరు చోట్ల కళాశాలలను ఏర్పాటు చేసి, జిల్లా ఆస్పత్రులను అనుబంధ ఆస్పత్రులుగా మార్చి ఎంబీబీఎస్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్ల విధి వైద్యమే... వైద్య సంబంధమైన అంశాలపై సూపరింటెండెంట్లు దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతల నుంచి సూపరింటెండెంట్లను తప్పించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఆస్పత్రుల్లో వైద్యం, వైద్యేతర అంశాలను విడివిడిగా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 100 పడకలు దాటిన ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను గ్రూప్–1 స్థాయి అధికారులకు అప్పగించాలని సీఎం రేవంత్రెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన గ్రూప్–1 స్థాయి అధికారుల్లో తొలుత 20 మందిని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు కేటాయించాలని ఆదేశించినట్టు సమాచారం. » జోన్–1లో 65 ఏఓ పోస్టులు ఖాళీగా ఉండగా, జోన్–2లో 49 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సూపరింటెండెంట్లకు పనిభారం తగ్గించనున్నారు. -
మాపై సీఎం రేవంత్ కుట్ర.. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణ
బంజారాహిల్స్ (హైదరాబాద్): తమ కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వేం నరేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. రెడ్లందరూ కలసి తమ కుటుంబంపై పగబట్టారని విమర్శించారు. బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీ లోని కొండా సురేఖ నివాసం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి సురేఖ ఓఎస్డీ సుమంత్ గురించి ఆరాతీశారు. సుమంత్ను అరెస్టు చేసేందుకే వారు వచ్చినట్లు తెలుసుకున్న సుస్మిత బయటకు వచ్చి.. ‘ఎవరి కోసం వచ్చారు?.. ఎందుకొచ్చార’ని ప్రశ్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో మీడియా చేరుకుంది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజకీయంగా అణగదొక్కేందుకే..: ఈ వ్యవహారంపై కొండా సుస్మిత ఓ మీడియా చానల్తో మాట్లాడుతూ.. బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈరోజు సుమంత్పై కేసు పెట్టి, అర్ధరాత్రి ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండటమే మేం చేసిన తప్పా?. రేవంత్రెడ్డి మా కుటుంబంపై ఎందుకు పడ్డాడు? రేవంత్రెడ్డి అన్నదమ్ములైన తిరుపతిరెడ్డి, కొండల్రెడ్డి పార్టీకి ఏం చేశారని గన్మెన్లను ఇచ్చారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని మఫ్టీలో వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో సురేఖ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. -
నేడు హనుమకొండకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి బుధ వారం హనుమకొండ జిల్లాకు వెళ్లనున్నారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం హనుమకొండకు వెళ్తున్నా రని, ఈ కార్యక్రమం అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి వస్తారని సీఎంఓ మంగళవారం వెల్లడించింది. -
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని రేవంత్రెడ్డి కోరుతున్నారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం విచారణ జరపనుంది. ఓటుకు నోటు మత్తయ్య కేసులో సుప్రీంతీర్పు కాపీలను ఇవ్వాలని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఇంప్లిడ్ అయ్యేందుకు అనుమతించాలని అడ్వకేట్ ఆర్యమ సుందరం కోరారు. ఇంప్లీడ్ను అనుమతించవద్దని రేవంత్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. సుప్రీంకోర్టును కోరారు. -
సంక్షేమ వసతి గృహాల్లోనూ ఎఫ్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరు కూ డా ఇదే విధానంలో స్వీకరించాలన్నారు. ఈమేరకు హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఆహారంతో విద్యార్థులకు లభించే కేలరీలను తెలుసుకోవాలని చెప్పారు. హాస్టళ్ల సమాచారం డాష్బోర్డులో... హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలన్నారు. ‘హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను సంక్షేమ హాస్టళ్లతో అనుసంధానించాలి.హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించాలి’అని రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్íÙప్లు, సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ను సీఎం ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయండి హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నిధుల విడుదల కోసం ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, అవసరమైన యాప్లను రూపొందించాలని నిర్దేశించారు.ముఖ్యమంత్రి సహాయనిధి కింద సంక్షేమ విద్యాసంస్థలకు రూ.60 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా... ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందించారు. ఈ నిధులను హాస్టళ్లలో మరమ్మతులు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి
-
ఏఐ హబ్, టీస్వ్కేర్ ప్రాజెక్టులపై ఐసీసీసీలో సీఎం సమీక్ష
-
టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: టీ స్క్వేర్ భవనం అనేది ఐకానిక్ బిల్డింగ్లా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీనికి సంబంధించి నవంబర్ నెల చివరి నుంచి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) ఐసీసీలో ఏఐ హబ్ టీ సక్వేర్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజేఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటి సెక్రటరీ భవేష్ మిశ్రా , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి. టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలి. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో భవనాలను పరిశీలించాలి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఏఐ హబ్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి*అని సూచించారు. -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు -
ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చేలా చూడాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక–2035’ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. వచ్చే పదేళ్లలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంపట్ల విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని సీఎం అభినందించారు.రూపాయి పెట్టుబడికి రూ. 4 లాభంగా...వచ్చే ఐదేళ్లలో రూ.921.40 కోట్లను సాగు పెట్టుబడిగా యూ నివర్సిటీ ఈ ప్రణాళికలో పేర్కొంది. అలాగే రూ. 942.50 కోట్లను బిందుసేద్యం కోసం పెట్టుబడిగా కేటాయించాలని నిర్దేశించింది. తద్వారా రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. తా ము రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత పంటల విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల మేర ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి, సీతాఫలం మొదలైన పండ్ల పంటలను 1.32 లక్షల ఎకరాల్లో 2030 వరకు ఎంపిక చేసిన జిల్లాల్లో సాగు చేయవచ్చని పేర్కొంది.అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయలను పండించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన జిల్లాల్లో టమాటా, వంగ, క్యారెట్, క్యాబేజ్, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలని పేర్కొంది. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలు పరచాలని, సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్య తకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధ తులను అవలంబించాలని ఈ ప్రణాళిక స్పష్టం చేసింది. -
సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం.. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు వాళ్లు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్ చేశారు.గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ.. బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు.రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్-1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాము. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. గ్రూప్-1 పరీక్షపై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ను కలుస్తాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారు.త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి మళ్లీ గ్రూప్-1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15వరకు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ:తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాడివేడిగా కొనసాగాయి తెలంగాణ ప్రభుత్వం తరుఫును అభిషేక్ సింఘ్వి వాదనలురిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందిఇప్పటి వరకూ రిజర్వేషన్ బిల్లును ఎవరూ ఛాలెంజ్ చేయలేదురిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదుకచ్చితమైన ప్రాదమిక,సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండొచ్చురిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదు’ అంటూ వాదనతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం సింఘ్వి వాదానాల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షంబీసీ రిజ్వర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్విహించారు?ట్రిపుల్ టెస్టు విధానాన్ని అనుసరించారా?ప్రజల అభ్యంతరాలను తీసుకున్నారు?గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందికమిషన్ రిపోర్టు పబ్లిష్ చేశారా? షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని ఏజిని ప్రశ్నించిన హైకోర్టుఅందుకు ఇంకా వాదనలు ఉన్నాయి.. విచారణ రేపటికి వాయిదా వేయాలన్న ఏజీ ఇంక వాదనలు అవసరం లేదు.. విచారణ ముగిస్తున్నాం’అంటూ వ్యాఖ్యానించిన హైకోర్టుహైకోర్టు ప్రశ్నలు:అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్ ఎప్పుడైంది?.ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా?.బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా?. రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.పిటిషనర్ తరఫున వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ...నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్ అయింది కానీ.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని పిటిషనర్ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది. -
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
ఎల్ లిల్లీ @ రూ 9వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ (తయారీ కర్మాగారం)ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం సుమారు రూ.9 వేల కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎల్ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తమ విస్తరణ ప్రణాళికలు, రాష్ట్రంలో భారీ పెట్టుబడులపై ఎల్ లిల్లీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. క్వాలిటీ హబ్ ఏర్పాటు హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమని ఎల్ లిల్లీ కంపెనీ ప్రకటించింది. ‘సంస్థ హైదరాబాద్ నుంచి దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్కు సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందిస్తుంది. కొత్త హబ్ ఏర్పాటుతో తెలంగాణతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. త్వరలో కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపడతాం..’ అని తెలిపింది. ‘అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెడుతుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. భారత్లో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి..’ అని సంస్థ ప్రతినిధులు వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్: సీఎం రేవంత్ ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్లో ఆగస్టు 4న ఎల్ లిల్లీ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం తెలంగాణకు గర్వ కారణం. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్గా పేరొందింది. ఎల్ లిల్లీ పెట్టుబడితో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. 1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారింది. ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు ఇక్కడే తయారయ్యాయి..’ అని సీఎం చెప్పారు. హైదరాబాద్లో ఎల్ లిల్లీ పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ స్థానిక ఎన్నికల్లో(Telangana Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్పై(BC Reservations) విచారణ జరగనుంది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంగా గోపాల్రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.ఇక, ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. -
స్ఫూర్తి మూర్తి.. సాంస్కృతిక కీర్తి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి వడ్డాణంలా.. నడిమధ్యలో వయ్యారంగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవానికి అందమైన సొబగులు అద్దుకుంటున్నాయి. మూసీని వాణిజ్య కేంద్రంగానే కాకుండా.. నదీ పరీవాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ఆలవాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈమేరకు మూసీ, దాని ఉపనది ఈసా నదుల సంగమం అయిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు గాంధీ తత్వాన్ని బోధించే ఆశ్రమం, మ్యూజియంను కూడా నిర్మించనున్నారు.సమగ్ర మాస్టర్ప్లాన్ త్వరలోనే ప్రభుత్వానికి.. మెయిన్హార, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్, ఆర్ఐఓఎస్, జెడ్హెచ్ఏ, ఎస్ఓఎంలతో కూడిన కన్సార్టియం తొలి దశ మూసీ సుందరీకరణ సమగ్ర మాస్టర్ ప్లాన్ను అతి త్వరలోనే ప్రభుత్వానికి సమరి్పంచనుంది. గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం 250 ఎకరాల భూమి అవసరం కాగా.. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అ«దీనంలో ఉన్న ఈ భూములను బదిలీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే కేంద్రం 100 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు కేంద్రం అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం చర్చలు జరుగుతున్నాయని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి.సాంస్కృతిక పునరుజ్జీవంగా.. తొలి దశలో గండిపేట నుంచి బాపూ ఘాట్ వరకూ 20.5 కిలో మీటర్ల వరకు మూసీకి పునరుజ్జీవం కల్పించనున్న అధికారులు.. రెండో దశలో హెచ్ఎండీఏ పరిధిలోని 55 కి.మీ. వరకూ నదిని సుందరీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మూసీకి వాణిజ్య, ఉపాధి కేంద్రంతో పాటు సాంస్కృతిక పునరుజ్జీవంగా అభివృద్ధి చేయనున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపి థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు నదీ పరీవాహక ప్రాంతం వెంబడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన వ్యక్తులు, మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.సకల మతాల సమ్మేళనంగా.. నగరం మధ్యలో నుంచి 55 కి.మీ. మేర ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాన్ని సకల మతాల సమ్మేళనంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మంచిరేవులలో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం, పాతబస్తీలోని మసీదు, సిఖ్చౌనిలో గురుద్వార, ఉప్పల్లో మెదక్ కేథడ్రిల్ తరహాలో చర్చిని కూడా నిర్మించనున్నారు. బాపూ ఘాట్ను అభ్యాస ప్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గాంధీ ఆశ్రమం, మ్యూజియంలను నిర్మించనున్నారు. ఇందులో గాంధీ బోధనలను నుంచి ప్రేరణ పొందిన నీతి, కమ్యూనికేషన్, విలువలపై కోర్సులను అందిస్తారు.దండియాత్ర విగ్రహమే.. మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్దకు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి.. ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశ, విదేశాల్లో కొలువుదీరిన మహాత్మా గాంధీ విగ్రహాలను అధ్యయనం చేసిన అధికారులు.. చరిత్రాత్మక దండి యాత్రలో చేతిలో కర్రతో నడుస్తున్న స్థితిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. అహింసా, ప్రతిఘటన, స్వావలంబన, స్వేచ్ఛను సాధించే సమష్టి శక్తికి ఇది సూచిక. గాం«దీజీ నిశ్శబ్ద బలమైన వాకింగ్ స్టిక్.. శ్రద్ధ, దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇప్పటికే 68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాపూఘాట్లో ధ్యాన భంగిమలో ఉన్న 22 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 1999లో ఏర్పాటు చేశారు. -
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ‘ప్లాన్ బీ’ సిద్ధం... కోర్టుల్లో ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు
-
చంద్రబాబులా ఒక సిటీని నిర్మించాలని రేవంత్రెడ్డి ఉత్సాహం!
-
రేవంత్కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూసీ.. అందాల రాశి!
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి.. త్వరలోనే మూసీ సమగ్రాభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మూసీ 55 కి.మీ. మేర ప్రవహిస్తుండగా..తొలి దశలో 20.5 కి.మీ. మేర నదిని పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జంట జలాశయాలైన హిమాయత్సాగర్, గండిపేటల నుంచి బాపూఘాట్ వరకు రూ.5,641 కోట్ల వ్యయంతో మూసీ నది సుందరీకరణ చేపట్టనున్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ! తొలి దశ మూసీ అభివృద్ధి పనుల కోసం రుణం మంజూరు చేసేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సుముఖత వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీతీర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఇందుకోసం ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. తొలి దశలో 20.5 కి.మీ. అభివృద్ధి చేసేందుకు రూ.5,641 కోట్ల వ్యయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫేజ్–1ను రెండు సబ్ ఫేజ్లుగా విభజించిన అధికారులు ఫేజ్–1ఏలో హిమాయత్సాగర్ టు బాపూఘాట్ వరకు 9.5 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్సాగర్ టు బాపూఘాట్ వరకు 11 కి.మీ. అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏ కింద రూ.2,500 కోట్లు, ఫేజ్–1బీ కింద రూ.3,141 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. అంచనా వ్యయంలో రూ.4,100 కోట్లు ఏడీబీ నుంచి రుణం రూపంలో పొందనుండగా.. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనుంది. 493 ఎకరాలు అవసరం మూసీ తొలి దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి 493 ఎకరాల (199.89 హెక్టార్లు) భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 340 ఎకరాలు (137.72 హెక్టార్లు) పట్టా భూములు కాగా.. మిగిలిన 153 ఎకరాలు (62.17 హెక్టార్లు) ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. భూ సేకరణ, పునరావాసం, నాణ్యమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం (ఆర్ఎఫ్సీటీఎల్ఏఆర్ఆర్)–2013 కింద భూ సేకరణ చేపట్టనున్నారు. సేకరించే భూమిలో మూసీ చుట్టూ గ్రీన్ బెల్ట్ కోసమే సుమారు 270 ఎకరాలు (109.42 హెక్టార్లు) కేటాయించనున్నారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్లు మూసీకి పునరుజ్జీవం కల్పించాలంటే తొలుత ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నదిలో 2 మీటర్ల లోతు వరకు వ్యర్థాలు, పూడిక తీయనున్నారు. నదికి ఇరువైపలా రిటైనింగ్ వాల్లను నిర్మిస్తారు. ఆ తర్వాత నదిలోకి గోదావరి జలాలను వదులుతారు. ఈ నీళ్లు 24/7 ఉండేలా చూస్తూ గండిపేట నుంచి బాపూఘాట్ వరకు బోటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. నది సరిహద్దుల నుంచి 20 మీటర్ల వెడల్పు వరకు గ్రీన్ బెల్ట్ ఉంటుంది. ఇందులో గ్రీనరీ పెంపకంతో పాటు వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. వరదల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ నదికి ఇరువైపులా 50 మీటర్లు బఫర్ జోన్గా అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేస్తారు. మరోవైపు మూసీ వరదలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బఫర్ జోన్లో వరద నియంత్రణ కాల్వలు, నాలాలు, పంపింగ్ స్టేషన్లు, వరద నియంత్రణ గోడలు, వరద పర్యవేక్షణ భవనాలు, వరద నిరోధక డెక్ల వంటి పటిష్టమైన మౌలిక సదుపాయాలుంటాయి. త్వరలో ‘మూసీ ఉద్యోగాల’ భర్తీ మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్మాణ దశలో 100 శాశ్వత పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన 3 వేల మంది ఉద్యోగులను నియమించనున్నారు. కార్యాచరణ దశలో 200 శాశ్వత పోస్టులతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన మరో 200 పోస్టులు ఏర్పాటు చేసి నియామకాలు జరుపుతారు. మూసీని నైట్ (రాత్రి) ఎకానమీగా, అదనపు ఆదాయాన్ని సమకూర్చే వనరుగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు మూసీ చుట్టూ యాంఫీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లు, వీధి విక్రేతల దుకాణాలు, కియోస్్కలు వంటి వ్యాపార, వాణిజ్య నిర్మాణాలను చేపడతారు. లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్ స్పోర్ట్స్, మేళాలు, సాంస్కృతిక వేదికలు కూడా ఉంటాయి. -
కాళేశ్వరంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం(kaleshwaram Project) ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చిన డిజైన్ టెండర్లను ప్రభుత్వం సీల్డ్ కవర్లో పెట్టనుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం ఓపెన్ చేయనుంది. కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం అందుకుంది.ఇక, ఎన్డీఎస్ఏ ప్రకారం, వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణలో అంతులేని అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. సర్కార్ కాదిది.. సర్కస్ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా.. ‘స్థానిక సమస్యలు తీర్చడానికిరాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!భారీవర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితేరాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదనిఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడుఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే! రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుసరిగ్గా పనిచేస్తలేదు కాబట్టిపరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూరాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో. సర్కారు కాదిది సర్కసే!’ అంటూ పోస్టు చేశారు. -
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు. పాకిస్తాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ అజేయ అర్ధ సెంచరీ సాధించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను, జెర్సీని అందజేశాడు. తిలక్ ఇచ్చిన బ్యాట్తో రేవంత్ రెడ్డి క్రికెట్ షాట్ కొడుతున్న ఫోజు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీ బాలాదేవి, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆశలు వమ్ము చేయకూడదని... శేరిలింగంపల్లి: పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఎంతో ఒత్తిడి ఉన్నా... ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టినా... ఎక్కడా సంయమనం కోల్పోలేదని... వారికి తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. చిన్ననాటి నుంచి తాను ప్రాక్టీస్ చేసిన శేరిలింగంపల్లిలోని లేగలా క్రికెట్ అకాడమీకి మంగళవారం తిలక్ వచ్చాడు. ఈ సందర్భంగా తన కోచ్ సలామ్ బాయష్, అకాడమీ ఎండీ పృథ్వీ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేయకూడదనుకున్నాను. చివర్లో ఒత్తిడి వచ్చినా... దేశం కోసం ఆడాలి, గెలిపించాలన్న లక్ష్యంతో ఓపికగా ఆడాను. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించారు. నేనీ స్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ సలామ్, పృథ్వీ పాత్ర ఎంతో ఉంది. ఈ ఇద్దరినీ ఎప్పటికి మర్చిపోలేను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ విషయంలో కోహ్లి, రోహిత్ శర్మలు ఆదర్శం’ అని తిలక్ తెలిపాడు. -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసియా కప్ ఫైనల్లో పాక్పై అద్భుతంగా ఆడి భారత్ను గెలిపించిన తిలక్ను.. సీఎం రేవంత్ సత్కరించి అభినందించారు. అనంతరం సీఎంకు తిలక్వర్మ బ్యాటును బహురించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి… pic.twitter.com/o8x5b9Eusc— Revanth Reddy (@revanth_anumula) September 30, 2025 -
రేవంత్ ఫ్యూచర్ సిటీ కామెంట్స్ కు KTR కౌంటర్..
-
‘ఫ్యూచర్ లేనిది ఫ్యూచర్ సిటీ.. గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందన్నారు. ఇదే సమయంలో అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఫ్యూచర్ లేని సిటీ ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది. వేయి కోట్ల రూపాయలు చేతులు మారాయి. 15వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై మోపారు. ఉన్న ఆర్టీసీనే నడపలేక పోతున్నారు. ఓ పథకం ప్రకారం ఎల్ అండ్ టీపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారు. వేయి కోట్ల లాభం ముఖ్యమంత్రి పొందారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. 35వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆదాని, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.మరో వేయి కోట్ల కోసం ప్రణాళిక రచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ ఆయనకే తెలియదు. అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా?. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేయడం రేవంత్ మూర్ఖత్వమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వంపై విశ్వాసం లేదు. బీసీ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు.. అసెంబ్లీలో అనిత అబద్దాలు
-
విమలక్క పాట.. సీతక్క కోరస్
సాక్షి, హైదరాబాద్/అంబర్పేట: అంబర్పేటలోని బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి విమలక్క, కనకవ్వ సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వేదికపై సీఎంరేవంత్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు మాత్రమే కూర్చునే అవకాశం కల్పించారు. తన స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి.. స్టేజ్ సమీపంలో నిల్చుని ఉన్న స్థానిక మహిళలు, కనకవ్వను గమనించారు. దీంతో తన పక్కన, వెనుక ఉన్న సీట్లను ఖాళీ చేయించి వారిని పైకి పిలిచి కూర్చోబెట్టారు.‘బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ, అమ్మ, అక్కల పండుగ. వారికే ప్రాధాన్యం ఇవ్వాలి’అని సీఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవం విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విమలక్క.. ఈ చెరువుపై రాసిన ఓ పాటను పాడారు. దీనికి కొందరు కోరస్ కావాలని కోరగా.. వేదికపై ఉన్న మంత్రి సీతక్క వెళ్లి కోరస్ అందించారు. ఆమె ఈ పాటతో పాటు కనకవ్వ పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటకూ కోరస్ ఇచ్చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం సెక్యులర్ పండుగగానూ ప్రకటించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
చెరువుల్ని చెరబడితే తాటతీస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలను రక్షించడంతోపాటు మూసీకి పునరుజ్జీవం కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చెరువుల్ని చెరబడితే తాట తీస్తామని హెచ్చరించారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన అంబర్పేటలోని బతుకమ్మ కుంటను ఆదివారం సీఎం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదన మేరకు ఈ చెరువుకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పేరు పెట్టనున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనలతో మూసీ ప్రక్షాళన.. కోవిడ్ తర్వాత పర్యావరణ మార్పులతో దేశవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోందని, ఒకటి రెండు గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందని సీఎం తెలిపారు. దీన్ని ముందే ఊహించి చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ‘నిజాం హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచి్చన ప్రణాళిక ఆధారంగానే ఇప్పు డు మూసీని అభివృద్ధి చేయనున్నాం. నగరంలోని ఎమ్మెల్యేలు వారివారి పరిధిలో మూసీతోపాటు బఫర్జోన్లో నివసిస్తున్న పేదల వివరాలు సేకరించండి. వారందరికీ ప్రభు త్వం న్యాయం చేస్తుంది.హైడ్రా పెట్టినప్పుడు కొందరికి అర్థం కాలేదు. అర్థమైన కబ్జాకోరులు బురద చల్లాలని చూశారు. ఓర్పు, సహనం, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాం. గుంటూరు, గుడివాడ, అమెరికాలో చదివి వచి్చన వాళ్లకు పేదరికం అంటే విహారయాత్ర లాంటిది. బెంజ్ కార్లలో తిరుగుతూ పేదల కష్టాలు చూస్తున్నం అంటారు. నేను చిన్నప్పటి నుంచి పేదల మధ్యలో, వారి కష్టాలను చూస్తూ పెరిగాను. మూసీని అభివృద్ధి చేసిన తర్వాత చుట్ట చుట్టి ఇంటికి పట్టుకుపోతానా? విదేశాలకు తరలించేస్తానా? అభివృద్ధి చేసి అనర్థాలు తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తు న్నా.మూసీతోపాటు బఫర్జోన్లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం. దీనికోసం త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అధికారులను క్షేత్రస్థాయికి పంపిస్తాం. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా పునరావాస చర్యలు తీసు కుంటాం. అంబర్పేటలో అన్ని విభాగాల కార్యాలయాలతో ఓ మినీ సెక్రటేరియట్ నిర్మి స్తాం. డిసెంబర్ 9 లోపే అనుమతులు, నిధులు మంజూరు చేస్తాం’అని ప్రకటించారు. కబ్జా చేసిన వ్యక్తే ఆ నాయకుడికి పూలు చల్లాడు.. ‘బతుకమ్మ కుంటను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అతడే ఆ నాయకుడు (ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) వస్తే ఆకాశం నుంచి పూలు చల్లాడు. బతుకమ్మ కుంటను చెర విడిపించి కేవలం 100 రోజుల్లో అభివృద్ధి చేశాం. తమ్మిడికుంటలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ యజమాని నాగార్జున నాకు మంచి మిత్రుడు. ఖాళీ చేయమని చెప్పినా వినకపోవడంతో మా అధికారులు దానిని కూల్చేశారు. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చి రెండు ఎకరాలు అప్పగించారు. ఎవరైనా తక్కు వ రేటుకు ఇస్తున్నామని ప్రభుత్వ స్థలాలను అమ్మితే తీసుకోవద్దు. మూసీ నిర్వాసితులకు శాశ్వత ఇళ్లను నిర్మించి ఇస్తాం.ప్రగతి భవన్కు జ్యోతిరావు ఫూలే పేరు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వీహెచ్ సలహాలతో చేసినవే’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం కల్పించడం ఆరంభం మాత్రమేనని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువు చుట్టూ ఉన్న పేదల ఇళ్లను కూల్చకుండానే చెరువును అభివృద్ధి చేశామని వివరించారు. అంబర్పేట నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. -
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఆపుతావా?
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తోందని, నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే ఆల్మట్టి పనులు ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ రోడ్షో నిర్వహించిన అనంతరం జరిగిన జనగర్జన బహిరంగసభలో మాట్లాడారు. ఆల్మట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే పోరాటం సాగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లతో ఆల్మట్టి ఎత్తును 5 మీటర్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇదే జరిగితే కృష్ణానది నుంచి పాలమూరుకు ఒక్క చుక్కనీరు కూడా రాదన్నారు. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పనులు ఆపాలని కోరారు. నల్లమల పులిగా గర్జిస్తారా? లేక పిల్లిలా ఇంట్లో కూర్చుంటారా? సీఎం రేవంత్ తేల్చుకోవాలన్నారు. అప్పుడే ఆయన నల్లమల పులో లేక నక్కో తేలుతుందని చెప్పారు. రాహుల్గాంధీ తనను సీఎం పదవి నుంచి ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంతో రేవంత్ గడుపుతున్నారన్నారు. కేసీఆర్కు పేరొస్తదనే పాలమూరు ముట్టుకోవడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన 10 శాతం పనులను సీఎం రేవంత్ రెండేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును ముట్టుకోవడం లేదన్నారు. చరిత్రలో ఏ సీఎం ఇంత హీనంగా మాట్లాడలేదు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, కేసీఆర్ వంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఏనాడూ సీఎం రేవంత్ తరహాలో హీనంగా మాట్లాడలేదని కేటీఆర్ చెప్పారు. గుడ్లతో గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటూ గలీజు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం దివాలా తీసిందని, కేన్సర్ పేషెంట్లా ఉందంటూ, తనను కోసినా రూపాయి రాదంటూ మాట్లాడటం ఆయన చిల్లర బుద్ధికి నిదర్శనమన్నారు.స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అచ్చంపేటలో ఎమ్మెల్యే ఓడినా కేసీఆర్ గెలుస్తారని ఇక్కడి ప్రజలు అనుకున్నారని, రాష్ట్రమంతా ఇలాగే అనుకునే మోసపోయారని కేటీఆర్ చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత ఏడాది మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసి నోట్ల కట్టలు దొరికాయని వార్తలు వచ్చాయని, ఇప్పుడు ఈడీ, మంత్రి ఎవరూ నోరు విప్పడం లేదని చెప్పారు. దీనిని బట్టే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలుస్తోందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్యాదవ్, పట్నం నరేందర్రెడ్డితోపాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన సాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీ సులో కూర్చు ని పనిచేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవన నిర్మాణంతోపాటు రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భూమి విలువ నాకు తెలుసు. వ్యవసాయంతోనే కాదు వ్యాపారంలోనూ భూమితో నాకు సంబంధం ఉంది. మీ తాతల నాటి ఆస్తులు గుంజుకునే ఆలోచన నాకు లేదు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకుని ముందుకు వెళ్తాం. డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించుకోబోతున్నాం. ఫ్యూచర్సిటీ అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తాం. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీసులో కూర్చుంటా. నెలకు మూడుసార్లు ఇక్కడే ఉంటా. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఇకపై ఇక్కడి నుంచే చేపడుతా. నాతోపాటు ఉపముఖ్య మంత్రి భట్టి కూడా నెలకు నాలుగుసార్లు ఇక్కడికి వస్తారు. ఆయన కూడా తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. సింగరేణి సంస్థ కోసం 10 ఎకరాలు కేటా యించి, 2026 డిసెంబర్లోగా ఆఫీసును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. ఫ్యూచర్సిటీలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లు కూడా తొలగించి, యూజీ కేబుల్స్ వేయబోతున్నాం. ఈ ఫ్యూచర్సిటీలో ఫార్చూన్ 500 జాబితాలోని కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు నగరంలో 85 వరకే ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాం’అని వివరించారు. భావితరాల కోసమే మా తపన భావితరాల బంగారు భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం కష్టపడుతోందని సీఎం రేవంత్ తెలిపారు. ‘ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ మంచి సంకల్పంతో చేపట్టిన నవ్య.. భవ్య.. భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన కోసం వరుణుడ కూడా సహకరించాడు. రేవంత్రెడ్డికి భూములున్నాయని చెప్తున్నారు. ఆయన కోస మే నగరం కడుతున్నారని ఆరోపిస్తున్నారు. నాకు భూమి ఉంటే భూమి మీదే ఉంటుంది. రహస్యంగా దాచుకోవడానికి నా దగ్గరేమీ లేదు. నేను నాగురించో.. నా సహచర మంత్రుల గురించో ఆలోచన చేయడం లేదు. మేమంతా రేపటి తరాల కోసమే ఆలోచన చేస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్లో ఉన్నవాళ్లు చెప్పుకునేలా చేస్తా ‘కుతుబ్షాహీలు, నిజాంలు పునాదులు వేసిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. నాడు చంద్రబాబు, వైఎస్సార్ మాకెందుకు అనుకుని ఉంటే..ఇవాళ హైటెక్సిటీ, ఔటర్రింగ్రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చేవి కాదు. నాటి నాయకుల ఆలోచన వల్లే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో మన పిల్లలు గొప్ప స్థానాల్లో ఉన్నారు. గతకాలపు నేతల నుంచి మంచిని నేర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ తరహాలో ఫ్యూచర్సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం’అని సీఎం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు.. బందర్కు రోడ్డు ఫ్యూచర్సిటీకి తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర నగరాలకు రవాణా సౌకర్యం, అంతర్జాతీయ విమానాశ్ర యం వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇటు ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు, బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం. దక్షిణ భారతదేశంలో నౌకాశ్రయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్ర మే. ఈ కొరతను తీర్చేందుకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్కు కేంద్రం అనుమతించింది’అని చెప్పారు. రైతులు నాయకుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోవద్దని సూచించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్, టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. ‘అందరికీ న్యాయం చేస్తా. కోర్టు బయట కూర్చొని నష్టాన్ని పూడ్చుకుందాం’అని సూచించారు. భవిష్యత్తు అంతా ఇక్కడే దేశ భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ చుట్టే తిరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఏ నగరానికి లేని రేడియల్ రోడ్లు, సరీ్వసు రోడ్లు, మెట్రో సౌకర్యం దీనికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే తలమానికం అవుతుందన్నారు. ఈ ప్రాంత వాసులకు అత్యాధునిక వైద్యశాలలు, కాలేజీలు, వర్సిటీలు, పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. సింగరేణి గ్లోబల్ కార్పొరేషన్ ఆఫీసు నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేస్తామని వెల్లడించారు. కొత్త యుగానికి కొత్త బాటలు వేయాలనే ఆలోచనతో ప్రణాళికాబద్ధమైన ఫ్యూచర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. చండీగఢ్ కంటే పది రెట్లు భిన్నంగా ఫ్యూచర్సిటీ రాబోతోందని చెప్పారు. సిటీ నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్: అంబర్ పేట బతుకమ్మ కుంటను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం(సెప్టెంబర్ 28వ తేదీ) ప్రారంభించారు. పాడు పడ్డ చెరువును ఏడున్నర కోట్ల రూపాయిలతో పునరద్ధరించింది హైడ్రా. ఈ మేరకు బతుకుమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించిన తర్వాత ప్రారంభించారు. బతుకమ్మ కుంటకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా బతుకమ్మ కుంటలో స్వయంగా మొదటి బతుకమ్మను వదిలారు. బతుకమ్మకు చీర, సారె అందజేశారు సీఎం రేవంత్.సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ హైడ్రా తీసుకొచ్చిమంచి పని చేస్తుంటే బురదజల్లారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు.. ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గంటలో 40 సెం.మీ వర్షం కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మూసీ మురికికూపంలా మారిపోయింది. ఈ బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాటం చేశారు. ఈ రోజు చాలా సంతోషకరమైన దినం’ అని పేర్కొన్నారు. -
న్యూయార్క్లో ఉన్న వాళ్లను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి: ఇంకెన్నాళ్లు టోక్యో, న్యూయార్క్ అంటూ గొప్పలు చెప్పుకుంటామని.. భావితరాలకూ అలాగే ఓ నగరం ఉండాలనే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. చేయకూడని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్కు భూములు ఉన్నాయని, అందుకే నగరాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. భూములుంటే దాచితే దాగేది కాదు. రికార్డుల్లో ఉంటాయి. అందరికీ తెలిసిపోతుంది. కుతుబ్షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి లాంటి నాయకులు ఆలోచన చేశారు. అలాంటి వాళ్లు మాకెందుకులే అనుకుని ఉంటే ఇవాళ ఓఆర్ఆర్, శంషాబాద్లు ఏవీ వచ్చేవి కావు. గత అనుభవాలు పునాది కావాలి. భూముల విలువ నాకు తెలుసు. నేను ఎవరికీ అన్యాయం చేయను. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఫ్యూచర్ సిటీకి స్థానికులు సహకరించాలి. ఇంకెన్నాళ్లు న్యూయార్క్, టోక్యో నగరాలంటూ మాట్లాడుకుందాం. ఎందుకు మనమే ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవద్దు. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తాం. బుల్లెట్ రైలు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాం. ఫ్యూచర్ సిటీ మన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం అని సీఎం రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బందరుపోర్ట్ వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీ లో జరగనున్నాయి. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి తలమానికం కానుంది. రేవంత్ రెడ్డి సంకల్పం త్వరితగతిన పూర్తికావాలని కోరుకుంటున్నా అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రణాళిక బద్దమైన నగరంగా చండీఘడ్ నిర్మించారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ క్యాపిటల్ చేసే విధంగా క్రీడా విశ్వవిద్యాలయం అందేలా చర్యలు చేపడతాం. జీరో పోల్యూటెడ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ గా రూపుదిద్దడానికి స్థానికులు భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ప్రసంగించారు. ఇదీ చదవండి: ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోండి -
‘రేవంత్.. ఫ్యూచర్ సిటీ దేవుడెరుగు.. ఉన్న నగరాన్ని పట్టించుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జూబ్లీహిల్స్ పరిధి షేక్పేటలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవకాశం ఉపఎన్నిక, స్థానిక ఎన్నిక రూపంలో వచ్చింది. వీటిలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ప్రచారం చేసేది టూరిస్టు మంత్రులే. ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ మాయమైపోతారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు.‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనం. కాంగ్రెస్కు ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. -
‘ఫ్యూచర్సిటీ’కి సీఎం రేవంత్ శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్సిటీకి పునాది రాయి పడింది. కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) కార్యాలయానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నట్లు సమాచారం. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మోడల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 30 వేల ఎకరాల్లో.. 15,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా(హరిత ఊపిరి)గా కేటాయించింది. -
మూసీ ఇలా.. బ్యూటీ ఎలా?
సాక్షి, హైదరబాద్: ప్రతీ ఏటా మూసీ వరద భాగ్యనగరాన్ని ముంచేస్తోంది. నదీ గర్భం, పరీవాహక ప్రాంతాలలో ఆక్రమణలు, వరద కాల్వలు, నాలాల విస్తరణ లేకపోవడం వంటి కారణాలనేకం. ప్రభుత్వంతో పాటు ప్రజలూ బాధ్యతగా భాగస్వామ్యం అయితే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం కార్యరూపం దాల్చడం కష్టమే. ఇప్పటికే గండిపేట నుంచి బాపూఘాట్ వరకూ మూసీ సుందరీకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే బ్యూటిఫికేషన్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలాంటి తరుణంలో మూసీ వరద ముంచెత్తడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఏటేటా వరదలే.. నగరం మధ్యలో 55 కి.మీ. మేర మూసీ ప్రవహిస్తుంది. దీనికి 1908లో 4.1 లక్షల క్యూసెక్కుల వరద వచి్చనప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులను అడ్డుకట్ట వేసేందుకు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. 2.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. కానీ, వందేళ్లలో మూసీ ఎన్నెన్నో ఆక్రమణలకు గురైంది. నగరంలో 1908 తర్వాత 62 ఏళ్లకు 1970లో వరదలు వచ్చాయి. అనంతరం 30 ఏళ్లకు 2000లో వరద సిటీని ముంచెత్తింది. ఆ తర్వాత 2008, 2014, 2016, 2018, 2020లలో కూడా వరదలు వచ్చాయి. ఎక్కడ చూసినా ఆక్రమణలే.. నగరంలో గంటలో రెండు, మూడు సెంటీ మీటర్ల వర్షం పడితే తట్టుకునే వరద కాలువల వ్యవస్థే లేదు. అంతకుమించి కురిస్తే మునక తప్పడం లేదు. ఆక్రమణల కారణంగా రోజురోజుకూ కుంచించుకుపోతోంది. జియాగూడ, చాదర్ఘాట్, గోల్నాక, అంబర్పేట ఇలా ఎక్కడ చూసినా మూసీ వెంట ఆక్రమణలే ఉన్నాయి. మూసీ నదీ గర్భం, బఫర్ జోన్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి మూడు జిల్లాల్లో కలిపి 8 వేలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.. నగరంలో చెరువులను కాపాడుకుంటూ.. పునరుద్దరించుకుంటూ వరద వెళ్లేలా చేయాలి. నీటి పారుదల శాఖ అధికారులు జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రాను సమన్వయం చేసుకోవాలి. దీంతో పాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. నగరంలో వరద కాల్వల్లో ఏటా 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంట్లోని పాత వస్తువులు నాలాల్లో వేయకుండా వ్యక్తిగత బాధ్యత వహించాలి. -
రేవంత్ అహంభావం వల్లే 15,000 కోట్ల భారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ అహంభావం వల్లే తెలంగాణకు 15,000 కోట్ల నష్టం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎల్ అండ్ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు అని అన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రేవంత్ రెడ్డి చేతకానితనం మరియు మితిమీరిన అహంభావం కారణంగా రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది. పౌరులపై మెట్రో రైల్వే ఎల్ అండ్ టి సంస్థ కోసం తీసుకుంటామన్న ప్రభుత్వం నిర్ణయం వలన రూ. 15,000 కోట్ల భారం పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం, అనవసరపు అహంభావం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్ సిటీ వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను రద్దు చేశారు.మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్&టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారు. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమే. నేషనల్ టెలివిజన్ లోనే స్వయంగా ఎల్&టీ కంపెనీ సీఎఫ్ఓను జైల్లో పెట్టాల్సిందిగా పోలీసులను కోరానని గొప్పలు చెప్పుకున్నారు. ఎల్&టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయితే, తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం ఈ కంపెనీలకి లేకపోయింది. అందుకే వారు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. సీఎం మితిమీరిన అహంభావం, గూండాగిరి కారణంగా రాష్ట్ర పన్ను చెల్లింపుదారులపై రూ. 15,000 కోట్ల అప్పు భారం పడనుంది.ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోయింది, ఆరోగ్యశ్రీ పథకం స్తంభించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి. కానీ, కార్పొరేట్ కంపెనీ రుణాన్ని భరించేందుకు మాత్రం రేవంత్ రెడ్డికి నిధులు ఉన్నాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. One man’s incompetence & Telangana suffersWah Revanth ! Wah ! You did it again You managed to derail the development of Telangana, yet again! Not just because of your insurmountable incompetence but also because of your superfluous egoYou bragged on National Television that…— KTR (@KTRBRS) September 28, 2025 -
ఇక విదేశీ పర్యాటకులకు.. గమ్యస్థానం తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించి చూపాం. తెలంగాణ ఎంత భద్రమైన ప్రాంతమో అది ప్రపంచానికి తెలియజెప్పింది. రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగిన ప్రభుత్వ విధానాన్ని మేం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలలోనే కాదు..తెలంగాణలో పర్యాటక రంగంలో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయి’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆయా సంస్థల ప్రతినిధులకు అవగాహన ఒప్పంద పత్రాలను అందజేశారు. ‘తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా పర్యాటక విధానం రూపొందలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాల పర్యాటక విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి మెరుగైన పర్యాటక విధానాన్ని రూపొందించాం. అది రూపొందిన ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాన్ని నిర్దేశించాను. దాన్ని కూడా సాధించే సత్తా తెలంగాణకు ఉంది. హైదరాబాద్లో చార్మినార్, గోల్కొండ కోటలాంటి చారిత్రక ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలో కవ్వాల్, అమ్రాబాద్లాంటి పులుల అభయారణ్యాలున్నాయి. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాల్లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలున్నాయి. వెరసి ఇప్పుడు తెలంగాణ ఓ గొప్ప పర్యాటక గమ్యం కాబోతోంది. పాత నగరం ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఖ్యాతిని మళ్లీ పునరుద్ధరించబోతున్నాం.’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వారికెందుకో బాధగా ఉంది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో పర్యాటక రంగం పురోగమిస్తుండటంతో కొందరికి ఎందుకో బాధగా ఉంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. భాష, ప్రాంతం అన్న భేదం లేకుండా అందరినీ అక్కున చేర్చుకుంటున్న తెలంగాణ, ఇప్పుడు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో ముందుకు సాగబోతోందన్నారు. రెండు జీవనదుల మధ్య వెలిసిన ఈ దక్కన్ పీఠభూమి ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప ర్యాటక రంగం అంటే కేవలం దర్శనీయ స్థలాలకే పరిమితం కాదని, రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా, ఉపాధి కల్పనగా మార్చటాని కి దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, నిథిమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ ప్రియాంక తదితరు లు హాజరయ్యారు. అనంతరం 37సంస్థలతో పర్యాటక శాఖ పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి దోహదం చేసిన హోటళ్లు, రిసార్టులు, సోషల్ మీడియా, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీల్లో ఉత్తమ పురస్కారాలను అందజేశారు. -
నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాలం కలిసివచ్చి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుని దర్పంతో కారణజన్ములుగా తమకుతామే భావించారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాల్సినవారు తమ కుటుంబ సంక్షేమం, కుటుంబ సభ్యుల ఉపాధి మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు.పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ఒక్క గ్రూప్–1 ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల్లోనే ఏకంగా 562 గ్రూప్–1 ఉద్యోగాలు భర్తీచేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు శిల్పకళావేదికలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో నరేందర్రెడ్డి, కేశవరావు, జూపల్లి, పొంగులేటి, రామకృష్ణారావు, పొన్నం, శ్రీహరి, జితేందర్ తదితరులు తెలంగాణ ఇక్కడే ఉంది.. ఉంటది.. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు నమ్మి అధికారాన్ని కట్టబెడితే నమ్మక ద్రోహం చేశారని బీఆర్ఎస్పై సీఎం మండిపడ్డారు. వాళ్లు ఇప్పుడు నమ్మక ద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ‘తెలంగాణ ఎక్కడుందంటూ కొందరు అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు. వారికి నేను చెబుతున్నా... తెలంగాణ ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంది.. ఇక్కడే ఉంటది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఏ పల్లెకు వెళ్లినా తెలంగాణ స్ఫూర్తి ఉట్టిపడుతుంది. యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదిరెడ్డిలాంటి వాళ్ల త్యాగాలను గత పాలకులు అపహాస్యం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అర్హత లేనివారిని పబ్లిక్ సర్విస్ కమిషన్లో సభ్యులుగా నియమించారు.సరైన జ్ఞానం లేనివారిని నియమిస్తే వారు రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసు ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు. అందుకే అప్పట్లో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కమిషన్ను ప్రక్షాళన చేశాం. పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాం. కొంతమందికి అది నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని రేవంత్రెడ్డి రూ.2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని సిగ్గులేకుండా ఆరోపణలు చేశారు.అలాంటి వ్యాఖ్యలను నేను ఏమాత్రం పట్టించుకోకుండా మీ భవిష్యత్ కోసమే పోరాడా. నాడు అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు... నాకు నిరుద్యోగుల భవిష్యత్ మాత్రమే కనిపించింది. మీరంతా తెలంగాణ మోడల్. కోచింగ్ సెంటర్ల కుట్రను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏళ్ల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇప్పుడు ఉద్యోగాలు అందుకుంటుంటే కొందరు రూ.లక్షలు ఫీజు ఇచ్చి కేసులు వేస్తున్నారు’అని విమర్శించారు జీడీపీలో మన వాటా పది శాతానికి పెంచుదాం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక నమూనాగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎకానమీ రూ.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ధీమా వ్యక్తంచేశారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 నుంచి 10 శాతానికి పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని, అందరం కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దామని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కొత్త గ్రూప్–1 అధికారులకు సూచించారు. ‘మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం సహించబోము. నిర్దాక్షిణ్యంగా మీ జీతాల్లోంచి పది శాతం కోత పెట్టి వారి ఖాతాలో జమచేస్తాం. ఈ మేరకు త్వరలో చట్టాన్ని తీసుకువస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మేధాశక్తిని ప్రపంచానికి చాటుదాం: భట్టిప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లలో కూడా ఇంతపెద్ద సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయలేదని చెప్పారు. ఈ గ్రూపు–1 పరీక్షల్లో వ్యవసాయ కూలీ బిడ్డ మొదలుకొని, పంచర్లు వేసే కుటుంబానికి చెందిన బిడ్డలు కూడా ఉన్నతాధికారులుగా నియమితులు కావడం ఎంతో షంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 22,500 కోట్లతో లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదవారి కలలు నెరవేరుస్తోందని అన్నారు.యువత మేధాశక్తిని ఉపయోగించుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రపంచంతో పోటీపడే స్థాయికి యువత మేధాశక్తిని తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.అక్క, బావ ప్రోత్సాహంతోనే.. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ కేన్సర్తో మృతి చెందింది. నాన్న వ్యవసాయానికి దూరమయ్యాడు. అన్నయ్య ఆటో నడిపిస్తున్నాడు. అక్క పుష్పలత, బావ వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి రాగలిగాను. 2017లో బీటెక్ పూర్తి చేశాను. 8 ఏళ్లుగా గ్రూప్–1 కోసం చదువుతున్నా. ఇప్పుడు 142వ ర్యాంకు వచ్చింది. డీఎస్పీగా ఉద్యోగం వచ్చింది. గతంలో పేపర్ లీకేజీల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇటీవల ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు మమ్మల్ని బాధించాయి. నా కుటుంబ నేపథ్యం చూస్తే ఉద్యోగం కొనటం సాధ్యమయ్యేదేనా? – ఆంజనేయులు, చోడంపల్లి, నార్కట్పల్లి మండలం, నల్లగొండ జిల్లానా విజయం చూడకుండానే నాన్న చనిపోయారు చిన్నప్పటి నుంచి చదువులో నేను టాపర్నే. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. జేఎ న్టీయూ హైదరాబాద్లో గోల్డ్ మెడల్ సాధించా. సివిల్స్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యాను. ఐదేళ్లు ఇంట్లోనే ఉండి సొంతంగానే చదువుకున్నాను. గ్రూప్స్–1లో 39వ ర్యాంకు సాధించాను. డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. నన్ను ఎంతగానో ప్రోత్సహించే మా నాన్న గత ఫిబ్రవరిలో చనిపోయారు. నా విజయం చూడకుండానే ఆయన దూరమైనందుకు బాధగా ఉంది. ఆయన లెగసీని పూర్తి చేసేందుకు సర్విస్లో డెడికేటెడ్గా పనిచేస్తాను. -మోక్షిత, ఇటిక్యాల, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా.నేను ఐఏఎస్ కావాలన్నది నాన్న కోరిక మా నాన్న సురేశ్ ఉపాధ్యాయుడు. నేను ఐఏఎస్ కావాలన్నది ఆయన కోరిక. ఆయనే నా ఇన్స్పిరేషన్. బీఏ పూర్తి చేశాక యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాను. ప్రిలిమ్స్ 3 సార్లు రాశా. గ్రూప్–1లో 270 ర్యాంకు వచ్చింది. ఈ మధ్య మాపై వచ్చిన ఆరోపణలు బాధించాయి. అందరూ నిజాయితీగా ఉద్యోగాలు సాధించారు. ఎట్టకేలకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఎంపికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. – గడ్డం నాగవైష్ణవి, భూపాలపల్లి -
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక విభాగం
విజయనగర్ కాలనీ(హైదరాబాద్): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. యువతీయువకులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల అవకాశాలు కల్పింస్తుందని, ఆ అవకాశాలను సది్వనియోగం చేసుకొని భవిష్యత్కు ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ.2,000 స్టైపెండ్ ఇస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఖర్చు కాదు. భవిష్యత్కు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలని’చెప్పారు. తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలి ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతమున్న 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే, టాటా సంస్థ రూ.2,100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దిందని చెప్పారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నా, నైపుణ్యం లేని కారణంగా చాలామందికి ఉద్యోగావకాశాలు రావడం లేదని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేనిదే ప్రైవేట్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా సంకల్పమన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. -
‘తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ పది శాతం జీతం కట్ చేస్తా’
హైదరాబాద్: తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని గ్రూప్-1 అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ రోజు(శనివారం, సెప్టెంబర్ 27) శిల్పకళా వేదికలో గ్రూప్-1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఏం రేవంత్ మాట్లాడారు. ‘మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు మీరు సహకారం అందించాలి. ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్. మీరు, మేము కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం. మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తాం’ అని సీఎం రేవంత్ హెచ్చరించారు. ‘కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.. తెలంగాణ ఎక్కడున్నది.. ఎక్కడ ఉంటది అని. వారికి నేను ఒక్కటే చెబుతున్నా…తెలంగాణ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం… ఇది తెలంగాణ భవిష్యత్. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయి. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ కొంత మంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారు. తెలంగాణ ప్రజలు వారికి నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారునమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం. ఒక యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. పరీక్షలు నిర్వహించాం.. ఇది కొంతమందికి నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో మీకు తెలుసు. కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించిండ్రు. అయినా మీ భవిష్యత్ కోసం కొట్లాడినం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగాం. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు నాకు మీ భవిష్యత్ మాత్రమే కనిపించింది. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి.. ఒక బాధ్యతతో వ్యవహరించండి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ప్లాన్తోనే ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచేశారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో రేవంత్రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్పై రగిలిపోతున్నారన్నారు. కేటీఆర్ సమక్షంలో కొడంగల్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమన్నారు.‘‘కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువ కొడంగల్ ప్రజలకే తెలుసు. రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ భూములను.. తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రేవంత్ అవమానించాడు. కొడంగల్ రేవంత్రెడ్డి జాగీరా.. కొడంగల్కు రేవంత్రెడ్డి చక్రవర్తి కాదు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది...తెలంగాణకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. కొడంగల్కు తిరుపతిరెడ్డి ముఖ్యమంత్రి. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డికి.. కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అన్నదమ్ములు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఎంబీబీఎస్ బస్టాండ్ను ముంచాడు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15గేట్లు తెరిచారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంబీబీఎస్ బస్టాండ్ మునిగింది. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
కాంగ్రెస్కు బిగ్ ఝలక్.. బీఆర్ఎస్ ‘బాకీ కార్డు ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.తెలంగాణ భవన్లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ‘బాకీ కార్డు’ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడిందో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు."కాంగ్రెస్ బాకీ కార్డు" లను ఇంటింటికి తీసుకొని పోతాం..ప్రజలను జాగృతం చేస్తాం.. కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥#CongressBaakiCard pic.twitter.com/kgwwsLzMKa— BRS Party (@BRSparty) September 27, 2025..‘మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు. అదే నేడు నిజమైందన్నారు కేటీఆర్. మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటి వరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని కేటీఆర్ మండిపడ్డారు. ఏ వర్గాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలువునా ముంచిందో ఆయన అంకెలతో సహా వివరించారు. అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నది. ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న హామీ ఏమైంది?. రెండు లక్షల రుణమాఫీ ఊసేలేదు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు, అది కూడా బాకీనే. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వారికి ఇస్తామన్న 15,000, 12,000 ఏ గంగలో కలిపారు? ఇవన్నీ బాకీ కాదా? అని నిలదీశారు...మా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. రెండు లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? అని ప్రశ్నించారు...మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజుకు ఒక్కో మహిళకు దాదాపు 55,000 బాకీ పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ. ఇది నయవంచన కాదా? అని మండిపడ్డారు...వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు. నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ఒక్కొక్కరికి 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగుల విషయంలో మరీ దారుణం. నెలకు 6,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన 4,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రతి నెలా 2,000 కోత పెడుతూ, ఒక్కో దివ్యాంగుడికి 44,000 బాకీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల తరఫున గొంతు విప్పుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఓవైపు న్యాయపరంగా పోరాడుతూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నయ వంచనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఈ బాకీ కార్డులను ముద్రించామని, తెలంగాణ ప్రజలను జాగృతం చేసే ఈ ప్రచారానికి మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఎంజీబీఎస్ వరదపై సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ మహోగ్రరూపంతో(Moosi Floods) వరద పోటెత్తి ఇమ్లీబన్(ఎంజీబీఎస్) బస్టాండ్ను ముంచెత్తింది. దీంతో అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులంతా ఆందోళనతో ఆగం అయ్యారు. అయితే ఈ వరదపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.మూసీ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా.. ప్రయాణికులెవరూ ఆందోళనకు గురికావొద్దని.. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని అన్నారాయన. అదే సమయంలో బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తేయడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. నది వెంట హైదరాబాద్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పురానాపూల్ వంతెనపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో ఉండడంతో బస్సులను ఎక్కడిక్కడే ఆపేస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం నుంచి వచ్చే బస్సులను ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వరకే అనుమతిస్తున్నారు. అలాగే.. మహబూబ్నగర్, కర్నూల్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్లోనే ఆపేస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్రోడ్.. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జూబ్లీ బస్టాండ్ వరకే అనుమతిస్తున్నారు. ఇంకోవైపు..మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసేయడంతో.. దిల్సుఖ్ నగర్-అంబర్ పేట్ రాకపోకలు ఆగిపోయాయి. వరద నీళ్లతో కాలనీలు మునుగుతుండగా, ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎగువన వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
నవమి నాటికి తేలకపోతే.. సజీవ సమాధి
సాక్షి, యాదాద్రి: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని శుక్రవారం ఫేస్బుక్లో మరో ప్రకటన పోస్టు చేశారు. ఇది తన మరణ వాంగ్మూలంగా ఆమె పేర్కొన్నారు. నవమి నాటికి తన సరీ్వస్ సమస్యలు సీఎం రేవంత్రెడ్డి తేల్చకపోతే సజీవ సమాధి అవుతానన్నారు. ‘చాలామంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో అత్యంత ప్రమాదకరమైంది. అలోపతిలో దీనికి స్టెరాయిడ్స్ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కాళ్లు, చేతులు వంకర్లుపోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను. కాబట్టే ఎనిమిదేళ్లయినా అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. నాకు ఈ వ్యాధి తీవ్రస్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడం, వెంటాడి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం. 21నెలల క్రితం నేనిచి్చన రిపోర్ట్పై ఇంకా చర్య తీసుకోకుండా సీఎం రేవంత్రెడ్డి నిర్లిప్తంగా ఉన్నారు. ఇది నన్ను మరింత ఒత్తిగికి గురిచేస్తోంది. ఇదే నా చావుకు దారి తీస్తుందేమో! ఏ ఆఫీసర్నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. అలా చేయకపోతే 7వ నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలి. ఈ పనిని ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ కూడా నా విషయం పట్టించుకోలేదు. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతాను’అని తన పోస్టులో పేర్కొన్నారు. -
పర్యాటకం.. పెట్టుబడులు.. ఉపాధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. పర్యాటక రంగాన్ని కేవలం ప్రజలకు ఆహ్లాదం కల్పించడానికి మాత్రమే పరిమితం చేయకుండా పెట్టుబడులు ఆకర్షించడం, పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో పాటు పూర్తిస్థాయి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వనించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పలు ఒప్పందాలు చేసుకోనుంది. శనివారం శిల్పకళావేదికలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే సదస్సులో పలు పథకాలు, కార్యక్రమాలను సీఎం ప్రకటించనున్నారు.పకడ్బందీగా హెలీ టూరిజంహెలీకాప్టర్ టూరిజాన్ని అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెలీ టూరిజం లేదు. కేవలం మేడారం జాతర సందర్భంగా ఒకటి రెండుసార్లు ఏర్పాటు చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈసారి దీ న్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. పెరిగిన జీవన ప్రమాణాలు, సమయాన్ని సది్వనియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు సరికొత్త అనుభూతి పొందేందుకు హెలీకాప్టర్ పర్యాటకంవైపు ప్రభు త్వం అడుగు లు వేస్తోంది. తొలుత హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడ నుంచి శ్రీశైలం వర కు హెలీకాప్టర్ సేవలు ప్రారంభించనుంది.పర్యాటకుల ఆదరణ ఆధారంగా దానిని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. మరోవైపు సీ ప్లేన్ అనుమతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీటి మీద నుంచి టేకాఫ్ తీసుకోవడంతో పాటు నీళ్లలోనే ల్యాండయ్యే సీ ప్లేన్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీప్లేన్ విహారం ఉండనుంది. ప్రస్తుతం దీని సాధ్యాసాధ్యాలపై (ఫీజబిలిటీ) ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.‘సినిమాలకు’ సింగిల్ విండో అనుమతులు ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్కు పేరుందని ప్రభుత్వం పేర్కొంది. దాన్ని మరింత అభివృద్ధి పరచడం ద్వారా చిత్ర పరిశ్రమకు మరింత స్నేహపూరిత వాతావరణం కల్పించాలని, అత్యధిక చిత్రాలు హైదరాబాద్లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా శనివారం ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ ప్రాంతాల్లో షూటింగ్లకు తక్షణ అనుమతి లభించనుంది. ఈ సులువైన విధానాలతో జాతీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాణాలకు హైదరాబాద్ నిలయంగా మారుతుందని భావిస్తున్నారు.హోటళ్లు.. హాస్పిటాలిటీ ప్రాజెక్టులు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటళ్లు, వెల్నెస్ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తోంది. అనంతగిరి కొండల్లో జెసోమ్ అండ్ జెన్ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్నెస్ సెంటర్, ద్రాక్ష పంట ఆధారిత వైన్ తయారీ యూనిట్, అటవీ ప్రాంతంలో తాజ్ సఫారీ ఏర్పాటు కానున్నాయి. మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రంట్ రిసార్టులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రాష్ట్రంలోని టైర్ 2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జునసాగర్లో వెల్నెస్ రిట్రీట్కు ఒప్పందాలు కుదరనున్నాయి.తైవాన్కు చెందిన ఫో గౌంగ్ షాన్ వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం ఈ సంస్థలు ఆయా పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫలితంగా రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు ప్రత్యక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.విదేశీ రోగుల కోసం ఎంవీటీ పోర్టల్ వివిధ దేశాల నుంచి చౌక వైద్యం కోసం హైదరాబాద్కు రోగులు వస్తున్న సంగతి విదితమే. కాగా మరింత పెద్ద సంఖ్యలో వారిని ఆకర్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్లో హైదరాబాద్లో ఏ ఏ ఆసుపత్రులున్నాయి..?ప్రముఖ వైద్యులెవరు..? ఏరకమైన సేవలు అందిస్తారు.. ఏ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది.. వీసాల జారీ.. పొడిగింపు తదితర వివరాలన్ని అందులో పొందుపర్చనున్నారు. విమానాశ్రయం నుంచి ఆ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలో సూచనలు పొందుపరచడంతో పాటు, ఆయా దేశాల వారి సౌలభ్యం కోసం వారి భాషను అనువదించే ట్రాన్స్లేటర్ల వివరాలు కూడా పోర్టల్లో ఉంటాయి. వంటలు.. రుచులకు ప్రాచుర్యం తెలంగాణలో వంటల వైవిధ్యం ఎంతగానో ఉంది. హైదరాబాద్ బిర్యాని, సర్వపిండి, సకినాలు, బోటీ కూర..ఇలా ప్రత్యేక వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏ ప్రాంతంలో ఏ వంట.. ఆ వంట ప్రత్యేకతలతో కూడిన వివరాలతో మ్యాప్నకు రూపకల్పన చేసింది. ఈ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాలతో మన వంటలకు అంతర్జాతీయంగా గిరాకీ పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.పర్యాటకులకు పటిష్ట భద్రత రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కేవలం 15 మంది టూరిస్ట్ పోలీసులే ఉండగా ఆ సంఖ్యను 90కు పెంచాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు ఒంటరిగానే పర్యాటక ప్రదేశాలకు వస్తున్న నేపథ్యంలో వారికి భద్రత, భరోసా కల్పించేలా ఈ టూరిస్ట్ పోలీసులు సేవలు అందించనున్నారు.సర్కారు భాగస్వామ్యంతో ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు రాష్ట్రంలో భారీ కార్యకమాల నిర్వహణకు వీలుగా ‘బుక్ మై షో’తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంతో భారీ సినిమా ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే వీలుంది. మరోవైపు పర్యాటక రంగంలోని హోటళ్లు, ఇతర సంస్థలు అందించే సేవల ఆధారంగా వాటికి అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.నేడు ‘ముచుకుందా’ ప్రారంభంజల విహారాలను ప్రోత్సహించడంలో భాగంగా శనివారం హైదరాబాద్ హుస్సేన్సాగర్లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్ డెక్కర్ బోట్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. హైదరాబాద్కు ఒకనాడు జీవనాడిగా ఉన్న మూసీ అసలు పేరైన ముచుకుందా నది పేరును ఈ బోట్కు పెట్టినట్లు అధికారులు తెలిపారు. -
అరెస్ట్ చేస్తే చేసుకోండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తాను ఏ తప్పూ చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధం.. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లై డిటెక్టర్ టెస్ట్కు తాను సిద్ధం.. రేవంత్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రానే కారణమంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యం. మా హయాంలో మెట్రోకు మరింత ఊతమిచ్చాం. మెట్రో తొలి దశను మూడేళ్లలో పూర్తి చేశాం. మెట్రోకు రూ.900 కోట్లు రుణం కూడా ఇచ్చాం. మేం ఉన్నప్పుడు మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండేది. ఎయిర్పోర్టు వరకు విస్తరించాలని గతంలో నిర్ణయించాం. రేవంత్ రాగానే మా ప్రతిపాదనలు రద్దు చేశారు. నిర్మాణం చేపట్టి ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.‘‘నాకు భూములు ఉన్నాయని.. ఆ ప్రాజెక్ట్ను రద్దు చేశారనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఎల్ అండ్ టీతో పంచాయితీ మొదలైంది. పెట్టుబడిదారులను రేవంత్ బెదిరించారు. ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయిందో రేవంత్ చెప్పాలి. హైదరాబాద్కు ఇది మాయని మచ్చ’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బతుకమ్మ కుంట(BatukammaKunta) ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా(HYDRA) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సీఎం రేవంత్(Revanth Reddy) చేతుల మీదుగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవానికి హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. అంతుకుముందు బతుకమ్మ కుంటపై హైడ్రా స్పందిస్తూ.. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొదలు.. పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉన్న బతుకమ్మ కుంట.. నేడు జలకళతో చూడముచ్చటగా తయారయ్యింది. కబ్జాల చెరను విడిపించుకుని కనువిందు చేస్తోంది. నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. వరద నివారణకు బతుకమ్మకుంట బాటలు వేసింది. నగరవ్యాప్తంగా చెరువులు అభివృద్ధి చెందితే వరదలు చాలావరకు నివారించవచ్చునని బతుకమ్మకుంట నిరూపించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.-చెర వీడి చెరువైన బతుకమ్మ కుంటజాతీయ స్థాయిలో `బతుకమ్మకుంట` వైభవం-ఈ నెల 26న సీఎం చేతులమీదుగా ప్రారంభం-బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సన్నద్ధం-సర్వాంగ సుందరంగా మారిన బతుకమ్మ కుంట🔸బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు… pic.twitter.com/cEYRJw7sGs— HYDRAA (@Comm_HYDRAA) September 26, 2025మండు వేసవిలో దాదాపు 7.15 కోట్లతో బతుకమ్మ కుంట పనులను హైడ్రా చేపట్టింది. జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని రుజువు చేసింది. అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారిని ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి ముళ్ల పొదలను తొలగించి తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. అంబర్పేట మండలం, బాగ్అంబర్పేట్లోని సర్వే నంబరు 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట. బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది.ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. శంషాబాద్లో దిగని విమానం.. -
తెలంగాణలోనూ సీఎం బ్రేక్ఫాస్ట్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్’పథకం తన హృదయాన్ని తాకిందని, వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వ ఆహ్వానం మేరకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. అన్నాదురై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధులు జన్మించిన రాష్ట్రం తమిళనాడు అని కొనియాడారు. కరుణానిధి విజన్ను స్టాలిన్, ఉదయనిధి అమలుచేస్తున్నారని అభినందించారు. ‘మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం.. మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం’అని వెల్లడించారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకంగా బలమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు, తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని సీఎం అన్నారు. తమిళనాడు విద్యావిధానం దేశానికి అనుసరణీయం మద్రాస్ స్టేట్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కామరాజ్ నాడు తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం నేడు అనుసరిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాందీ.. కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారని, ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో తాము విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారని ప్రశంచారు. స్కిల్,, స్పోర్ట్స్ వర్సిటీలు తెచ్చాం తెలంగాణలో యువతలో నైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. ‘తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకపోతుండడంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించాం. ఇక్కడ అనేక మంది క్రికెట్, టెన్నిస్, ఇతర క్రీడాకారులు ఉన్నారు. అందులోకి సంజయ్ గోయెంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, ఉపాసన కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్లను తీసుకున్నాం. స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. తమిళ విద్యార్థులు, కోచ్లకు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తాం. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించే బాధ్యత తెలంగాణ–తమిళనాడు తీసుకుంటాయి. మోదీ, అమిత్ షాతో అది సాధ్యం కాదు’అని సీఎం పేర్కొన్నారు. వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘గతంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవి. మేం వారంతా వేర్వేరని అనుకోవడం లేదు. అందుకే వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట చదువుకుంటారు. ప్రతి స్కూల్ను 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నాం. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్పటికీ అదే సిలబస్ కొనసాగిస్తున్నారు. డీజిల్ మెకానిక్, ప్లంబర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించడం లేదు. అందుకే టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ( అఖీఇ) అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇటీవలే నూతన విద్యా విధానం తీసుకువచ్చాం. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నాం. తమిళనాడులో మాదిరే తెలంగాణలో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి. తమిళనాడు, తెలంగాణ దేశానికి రోడ్మ్యాప్ ఇవ్వనున్నాయి. నాలెడ్జ్ హబ్ కానున్నాయి. విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నాం. విద్యను విప్లవంగా మేం భావిస్తున్నాం’అని తెలిపారు. -
స్థానిక పోరుకు ఎస్ఈసీ సై
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల ఖరారు ఆదేశాలు, ఎన్నికల తేదీల నిర్వహణపై లేఖ అందిన వెనువెంటనే ఎన్నికల షెడ్యూల్తోపాటు నోటిఫికేషన్ జారీకి రెడీగా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున తమకు రాజకీయంగా ఉపయోగపడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరపాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, 18 నుంచి 21 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత మళ్లీ వారం, పది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. నేడు సీఎంతో ఉన్నతస్థాయి అధికారుల భేటీ? శుక్రవారం ఉదయం సీఎం రేవంత్రెడ్డితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, పీఆర్ఆర్డీ డైరెక్టర్ డా.సృజన, ఇతర అధికారులు సమావేశం కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన ప్రత్యేక జీవోలపైనే చర్చ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం స్పష్టత తీసుకుంటారని చెబుతున్నారు. శుక్రవారమే అటు బీసీ సంక్షేమశాఖ లేదా ప్రణాళిక శాఖ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం, పంచాయతీరాజ్ శాఖ ద్వారా బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక జీవోలు విడుదల అయ్యే అవకాశం ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జీఓలు జారీ కాగానే... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోతోపాటు, ఎన్నికల తేదీని తెలియజేస్తూ ప్రభుత్వం అధికారిక లేఖ అందజేసిన వెంటనే కార్యరంగంలోకి దూకేలా ఎస్ఈసీ సన్నాహాలు పూర్తి చేసినట్టు సమాచారం. సర్కార్ నుంచి సమాచారం అందిన వెంటనే ఎన్నికలు ఏర్పాట్లపై ఎస్ఈసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పీఆర్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి చీఫ్ సెక్రటరీ కూడా హాజరై, ఆయా శాఖల వారీగా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. గతంలో 3 దశలు... ఇప్పుడు 2 దశల్లోనా?గతంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మూడు దశల్లో జరగగా...ఈసారి రెండు విడతల్లోనే పూర్తిచేసే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టుగా ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేసుకొని, ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, ఎన్నికల మెటీరియల్ ప్రింట్ చేసి, మార్గదర్శకాలు, ఇతర పుస్తకాల ముద్రణ, తదితరాల తయారీ, గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు తమ వెబ్సైట్లోని టీ–పోల్లో సిద్ధం చేసి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎస్ఈసీకి ఉత్తర్వులు అందగానే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కానుంది. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలు మినహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మిగతా సమస్యలేవీ లేనందున ఎస్ఈసీ సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆ వర్గాలు వెల్లడించాయి. -
‘హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సమంజసం కాదు’
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులపై తమ ఆఫీసులో మానటరింగ్ సెల్ ఏర్పాట్లుపై పర్యవేక్షణ చేస్తున్నానని, రీజనల్ రింగ్రోడ్డుకు ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ లేదని కిషన్రెడ్డి తెలిపారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 25) ఢిల్లీలో ప్రెస్మీట్లో మాట్లాడారు కిషన్రెడ్డి. ‘నిధుల సేకరణ అంశాలపై తగిన వివరాలు ఇవ్వాలి. కళ్ళు మూసుకుని ఏ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వదు. మెట్రో పై ఎల్ అండ్ టి నుంచి ఏకాభిప్రాయం కావాలి. దీనిపై ట్రై పార్టీ అగ్రిమెంట్ కావాలి. కాళేశ్వరం పై సిబిఐ దర్యాప్తు అంశం కేంద్రం వద్దకు వచ్చింది. దీనిపై సిబిఐ పరిశీలన చేస్తోంది. ఏ పార్టీతో మేం కలవం. టిఆర్ఎస్లో కలిసి కాపురం చేసి, పదవులు తెచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్ది. మాకు నీతులు చెప్పవద్దు. నేపాల్ లాంటి జెన్ జి నిరసన రావాలన్న కేటీఆర్ డిమాండ్ దేశ ద్రోహం కిందకు వస్తుంది. నేపాల్ లాంటి దాడులను కేటిఆర్ కోరుకుంటున్నారా ?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
రైతు ద్రోహి కాంగ్రెస్.. ప్రజా ద్రోహి బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుతాన్ని రైతు ద్రోహిగా, బీజేపీ సర్కార్ను ప్రజా ద్రోహిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకుందన్నారు. కానీ బిహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కరీంనగర్కు చెందిన వైద్యులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని, సూర్యాపేటలో గిరిజన యువకుడిపై థర్డ్ డగ్రీ ప్రయోగించారన్నారు. పోలీసుల దాష్టీకాన్ని ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెబుతున్న ‘మొహబ్బత్కీ దుకాణ్’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు. గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ తీరని ద్రోహం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) బృందం సభ్యులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లోకుర్తి నరేష్కు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రేవంత్.. మోదీ, చంద్రబాబుల కోవర్ట్ ‘ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే రేవంత్ తప్పు పట్టడం లేదు.. కానీ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యం. గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదు, నాయకులుగా మనమే విఫలమయ్యాం. ఎమ్మె ల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది కాంగ్రెస్ తీరు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని ఆరోపించారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్(CM Revanth Reddy) ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారు. పూట పూటకో మాట.. ఘడియ ఘడియకో లెక్క అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్(Congress Party) పార్టీనే. చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్. ఒకవైపు చంద్రబాబుకు(Chandrababu) భయపడి బనకచర్లపై మౌనం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తుపై సైలెంట్. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా?. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెలియదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి వ్యక్తులు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నారు.. కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నాడు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నారు?. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటున్నారు. మంత్రి ఉత్తమ్ ఏమో 763 టీఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారు.హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరుకృష్ణా జలాల వాటా పై సీఎం @revanth_anumula ఒక మాట, మంత్రి @UttamINC మరో మాటపూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క299 tmc కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేచారిత్రక తప్పిదం చేసింది మీరు,… pic.twitter.com/e2K8XpOElj— Harish Rao Thanneeru (@BRSHarish) September 24, 2025వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు?. కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్-3 కోసం పోరాటం చేశారు. ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిశారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్-3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. ఉత్తమ్ డబ్బా కొడుతున్నాడు.అదనపు టీఓఆర్ ప్రకారం, మేము కృష్ణా జలాల్లో మొత్తం 935 టీఎంసీల వాటా సాధించేందుకు గ్రౌండ్ తయారు చేశాం. 811 టీఎంసీలు, 195 సర్ ప్లస్ వాటర్ షేర్, 45 టీఎంసీల పోలవరం వాటర్. ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నారు 904 టీఎంసీలే మా న్యాయమైన వాటా అంటున్నారు. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్ -
KSR Live Show: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులు గురుశిష్యులే..!
-
సర్వాంగ సుందరంగా బతుకమ్మ కుంట.. హైడ్రాపై ప్రశంసలు (ఫొటోలు)
-
మేడారం సమ్మక్క–సారలమ్మ మొక్క చెల్లించుకున్న : సీఎం రేవంత్రెడ్డి (ఫొటోలు)
-
ప్రపంచం కీర్తించేలా మేడారం: సీఎం రేవంత్
నాడు పాలకులు సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఆదివాసీ బిడ్డలను అభివృద్ధి చేయడంతో పాటు ఆదివాసీ దేవతల ఆలయాలకు సేవ చేసే భాగ్యం కలిగింది. సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో మంత్రి సీతక్కకు, నాకు జన్మ ధన్యమైనట్లే. ఆదివాసీలను, పూజారులను,సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయేలా ఉంటాయి. మహా జాతరకు మళ్లీ వస్తా.. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం.. – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా నిర్వహించే మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాకతీయులు నిర్మించిన రామప్ప తరహాలో చరిత్రకు సాక్ష్యాలుగా, వెయ్యేళ్లు నిలిచేలా ఆలయ పునర్నిర్మాణాన్ని రాతి కట్టడాలతో చేపడతామని చెప్పారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలీసు కమాండ్ కంట్రోల్ రూం ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గిరిజన కొమ్ము కోయ నృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన గద్దెల నూతన డిజైన్లను విడుదల చేశారు. ఆలయం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయం పనుల ప్రారంభించారు. సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అమ్మల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం ‘మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఇద తెలంగాణ ప్రజల ఆతీ్మయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనాన్ని, గిరిజనుల పోరాట చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఆదివాసీలు దేశానికి మూలవాసులు.. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ తల్లులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నా. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డ మీదనుంచే పాదయాత్ర మొదలుపెట్టా. అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. శాశ్వత ప్రాతిపదికన గద్దెల ప్రాంగణం, పునర్నిర్మాణం పనులు చేపట్టాం. ఈ ఆలయం డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా కేటాయిస్తుంది. ఆదివాసీ కుంభమేళాకు నిధులెందుకివ్వరు..? ‘కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఈ విషయం ఆలోచించాలి. అయోధ్య, కుంభమేళాకే కాదు.. మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి నిధులు తీసుకురావాలి..’ అని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..గతంలో ఈ మహా జాతరను అధికారికంగా నిర్వహించే అవకాశం తనకు ఇవ్వాలని కోరుకున్నానని, అదే మాదిరిగా నా కోరికను తీరుస్తూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై జాతరను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మొక్కులు సమర్పించుకున్న సీఎం మేడారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. 2024 ఫిబ్రవరిలో తల్లులను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నప్పుడు ముఖ్యమంత్రి బరువు 68 కిలోలు కాగా.. ఇప్పుడు కూడా 68 కిలోలే ఉన్నారు. పూజారులు, ఆదివాసీ సంఘాలతో భేటీ ఆలయ అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా అలయ విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. వీటిపై స్పందించిన సీఎం..ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో వీరితో పాటు ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బాలునాయక్, కడియం శ్రీహరి, మురళీనాయక్ , రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఇక ఒకే వరుసలో గద్దెలు – ఇదీ మాస్టర్ప్లాన్.. సమ్మక్క, సారలమ్మ గద్దెలు ప్రస్తుతం ఒక వరుసలో ఉండగా, వీరి ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. అయితే భక్తులు క్యూ లైన్ ద్వారా సమ్మక్క– సారలమ్మను దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావటం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణానికి వీలుగా కొత్తగా డిజైన్ రూపొందించారు. గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ స్థానంలో గ్రానైట్ నిర్మాణం చేపట్టనున్నారు. గ్రానైట్పై సమ్మక్క, సారలమ్మ చరిత్రతో పాటు గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, వారి లిపి, జాతర వైభవం తెలియజేసే బొమ్మలను చెక్కనున్నారు. అదే విధంగా మహా జాతర వేళ భక్తులకు సమ్మక్క, సారలమ్మ తల్లులు.. పగిడిద్ద రాజు, గోవిందరాజుల దర్శనం కష్టం కాకుండా స్థల సేకరణ ద్వారా గద్దెల ప్రాంగణం విస్తరణను ప్లాన్లో చేర్చారు. ఇందుకోసం దేవాదాయ శాఖకు చెందిన 4 ఎకరాలు, ప్రభుత్వ భూమి 19 ఎకరాలు.. మొత్తం 23 ఎకరాలు సేకరిస్తారు. అతిథి గృహాలు నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. -
చేసిందంతా చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు.. చంద్రబాబు, రేవంత్లే పంపారు.. ‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. రేవంత్ను సీఎంగా తప్పించండి.. ‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు. లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు. -
సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
కోక లేకుండానే పండుగా ?!
ఖమ్మంమయూరిసెంటర్: ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ నాటికి సభ్యులకు రెండేసి చీరలు ఇస్తామని ప్రకటించారు. అయితే, బతుకమ్మ పండుగ రెండు రోజులు గడిచినా జిల్లాకు పూర్తి స్థాయిలో చీరలే చేరకపోగా.. పంపిణీపై యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. కనీసం ఒక్కో చీర ఇవ్వాలని భావించినా ఆ స్థాయిలో స్టాక్ రాకపోవడం.. కొందరికే ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియక పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.స్టాక్ పాయింట్లకు 1.80 లక్షల చీరలుమహిళా సంఘాల సభ్యులకు అందించే చీరలను జిల్లాలకు సరఫరా చేసింది. జిల్లాలో 3,35,879 మంది సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయింయగా.. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులను గుర్తించారు. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు పంపిణీ చేసేందుకు మొత్తం 6,71,758 చీరలు అవసరమవుతాయి. మొదటి విడతలో 3,35,879 చీరలు సరఫరా చేస్తామని ప్రకటించినా అందులో 1,80,779 చీరలే వచ్చా యి. దీంతో చీరలను సెర్ప్ అధికారులు గోదాంల్లో భద్రపరిచారు. ఇక మెప్మాకు సంబంధించి సంఘాల్లోని సభ్యులకు సరఫరా చేసేందుకు ఒక్క చీర కూడా జిల్లాకు చేరలేదు.ఒక చీర ఇవ్వాలన్నా..గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినట్లుగా ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మహిళ సభ్యులకు చీరలు అందుతాయని అంతా భావించారు. ఈనెల 5వ తేదీ నుంచే ప్రభుత్వం జిల్లాలకు చీరల సరఫరాను ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ నాటికి 1.80 లక్షల చీరలే రాగా.. మిగిలిన చీరలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. బతుకమ్మ వేడుకల మొదటి రోజే ఒక్కో చీర అయినా పంపిణీ చేస్తారని భావించినా అలా జరగలేదు. జిల్లాలోని సభ్యులకు ఒక్కో చీర పంపిణీ చేయాలన్నా ఇంకా 1,55,100 చీరలు అవసరం కావడం.. అవి ఎప్పుడు వస్తాయో తెలియక అధికారులు ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. -
మేడారంలో సీఎం రేవంత్.. వనదేవతలకు మొక్కుల చెల్లింపు
సాక్షి, ములుగు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారం(68 కేజీల బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం చేపట్టిన పనులను మరికాసేపట్లో ఆయన పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు, పూజారులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారంఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు మంది దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతోపాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలాచరించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయనున్నారు.మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగొద్దనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతి నిర్మాణం.. ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్స్టోన్ను వాడుతారు. ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఏర్పాట్లను సీఎం పరిశీలించడం ఇదే తొలిసారి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. మేడారం జాతర ఏర్పాట్లపై తొలిసారిగా సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పర్యటించనున్నారు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్షిస్తారు. ఈ నెల 20న హైదరాబాద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డి.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి రివ్యూ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.సీఎం టూర్ షెడ్యూల్ ఇలా...సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాయి. ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.15 గంటల నుంచి 1.30 గంటల వరకు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకొని పూజారులతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్లో ఆలయ పునరుద్ధరణ పనుల ప్లాన్ను డిజిటల్ లాంచ్ చేస్తారు. 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మేడారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. -
హైవే పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ, పరిహారం ఖరారు, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం జరగడం సరికాదని అన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబర్ నెలాఖరుకల్లా కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రోడ్ల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.సోమవారం సచివాలయంలో.. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్)తో పాటు ఇతర శాఖలు, ఎన్హెచ్ఏఐ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. ‘కాలా’(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్) నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని వారు చెప్పారు.అయితే ఎన్హెచ్ఏఐ అధికారులు నిధులు వెంటనే విడుదల చేస్తున్నామని, కలెక్టర్లు పనులు త్వరగా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం.. కలెక్టర్లు, సంబంధిత ఇతర అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్లు చెప్పగా, వారంలోపు అడ్వకేట్ జనరల్తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. ఎప్పటికప్పుడు కొత్త కొర్రీలెందుకు? ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంపై కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్హెచ్ఏఐ అధికారులను సీఎం ప్రశ్నించారు. సందేహాలన్నింటినీ ఒకేసారి పంపాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలను వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని, రెండింటికీ ఒకే జాతీయ రహదారి నంబరు కేటాయించాలని, వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో పనులు ప్రారంభించాలని కోరారు. వెంటనే అనుమతులివ్వండి భారత్ ఫ్యూచర్ సిటీ–అమరావతి–మచిలీపట్నం 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గం కూడా నిర్మించాలని, బెంగళూరు–శంషాబాద్ ఎయిర్పోర్ట్–అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని అన్నారు. హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో రావిర్యాల–మన్ననూర్ ఎలివేటెడ్ కారిడార్కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. హైదరాబాద్–మంచిర్యాల–నాగ్పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమరి్పంచిన ప్రతిపాదనలనే అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘వన్య ప్రాణులు లేనిచోట కూడా ఆ చట్టం అమలు’ 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అట వీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాథ్కుమార్ చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. అవసరమైనచోట అడవి పెంపకానికి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని, దీనిపై కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో భేటీ అవుతానని తెలిపారు.వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని రేవంత్రెడ్డి అన్నారు. ఇలావుండగా..తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ముఖ్యమంత్రిని కోరగా, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నా జీవితం ముగియనుంది అంటూ మాజీ డీఎస్పీ లేఖ.. సీఎం రేవంత్ స్పందన
భువనగిరి: మాజీ డీఎస్పీ నళిని ఫేస్బుక్ ద్వారా పంచుకున్న ఓ బహిరంగ లేఖకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘ఇక నా ప్రయాణం ముగియనుంది’ అంటూ ఆమె రాసిన లేఖ సీఎం రేవంత్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నళినితో మాట్లాడాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. దాంతో కలెక్టర్ హనుమంతరావు.. మాజీ డీఎస్పీని కలిసి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆమెకు కలెక్టర్ వివరించారు. సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు కలెక్టర్. ఇదిలా ఉంచితే, తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఫేస్బుక్ ద్వారా ఆదివారం పంచుకున్న ఒక బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. మరణ వాంగ్మూలం అంటూ పేర్కొన్న ఈ పోస్టులో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ఫేస్బుక్ పోస్టులో నళిని పేర్కొన్న ప్రకారం.. ‘ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ల జబ్బు, రెండు నెలలుగా ఫీవర్ వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. 2018లో ఈ జబ్బు రాగా, హరిద్వార్ వెళ్లి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక, డబ్బు లేదు’అని పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: మరణ వాంగ్మూలం అంటూ ఫేస్బుక్లో నళిని పోస్ట్ -
‘హెచ్1బీ’ని యుద్ధప్రాతిపదికన పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్ల (రూ. 88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు టెక్ నిపుణులు సహా అక్కడి భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
వచ్చేవారమే ‘స్థానిక’ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. వెంటనే వచ్చేవారంలోనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఎన్నికలు వాయిదా వేయడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే గురువారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మెజారిటీ అభిప్రాయం మేరకే..: గ్రామ పంచాయతీలకు దాదాపు 20 నెలలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు దాదాపు 14 నెలల కిందట కాలపరిమితి ముగిసింది. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని భావించి ఇంతకాలం ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపగా, దానిని ఆయన రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి వద్దనే పెండింగ్లో ఉంది. దీంతో మరో ప్రయత్నంగా పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా పరిమితి విధించిన నిబంధనను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపించింది. ఆ బిల్లు కూడా ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆపే అధికారంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు తేలిన తరవాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కానీ, శనివారం సాయంత్రం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితర అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తోనూ సమాలోచనలు జరిపారు. అనంతరం ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. రిజర్వేషన్ల జీవో జారీ చేసిన తరువాత న్యాయస్థానాలకు వెళ్లే సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
న్యాయవ్యవస్థలో వసతుల కల్పనకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, కోర్టుల్లో సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జిల్లా కోర్టుల నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ సూచనలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్, జస్టిస్ ఏకే సింగ్ శనివారం భేటీ అయ్యారు.కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన సిబ్బంది నియామకాలను త్వరితగతిన చేపట్టాలని జస్టిస్ ఏకే సింగ్ కోరారు. దీనిపై పలు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తెచ్చారు. న్యాయవ్యవస్థ సూచనల మేరకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలియజేశారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నక్సలైట్లు, టెర్రరిస్టులు ఒకటే..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులు, మావోయిస్టులు ఒకటేనని, అందువల్ల టెర్రరిస్టులు లేదా మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పినా వినకపోవడంతోనే కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చలు ఎందుకు విఫలం అయ్యాయో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలిచి ఎన్కౌంటర్ చేసిందని, ఇప్పుడు కేంద్రం ‘కగార్’నిర్వహిస్తుంటే అభ్యంతరం ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అవినీతి, లోటు బడ్జెట్, అప్పుల్లోనే తెలంగాణ రైజింగ్ అని, వీటన్నింటి ప్రభావంతో త్వరలోనే ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ డౌన్ ఫాల్ తథ్యమని జోస్యం చెప్పారు. హైడ్రోజన్ బాంబు తుస్సుమంది.. రాహుల్గాంధీ పేలుస్తానన్న హైడ్రోజన్ బాంబు తుస్సుమందని రాంచందర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ ఓట్చోరీ ఆరోపణలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని చెప్పారు. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లోని సగానికిపైగా మంది రెండు రాష్ట్రాల్లో ఓట్లేశారని చెప్పారు. అందువల్ల డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి వాటిని సరళీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు రాంచందర్రావు జవాబు నవ్వులు పూయించింది. ‘అక్కడ టికెట్ కోసం 3,4 దరఖాస్తులు వచ్చాయి. అంతకంటే తమకు పద్మశ్రీ ఇప్పించాలంటూ అప్లికేషన్స్ ఇస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది’అన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత... రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దానిని బీజేపీ అధికారంలోకి రావడం ద్వారా పూరిస్తామని ఒక ప్రశ్నకు రాంచందర్రావు బదులిచ్చారు. తమ వద్ద ఇందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్పై, అందులో ముడిపడిన అవినీతిపై, కాంట్రాక్టర్ల పాత్ర ఇలా అన్ని అంశాలపై సీబీఐతో విచారణ కోరాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోబియా పట్టుకుందని, అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదకొండేళ్లలో గ్రూప్–1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని కారణంగా రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని రాంచందర్రావు చెప్పారు. -
రెండు బతుకమ్మ చీరలిస్తాం.. తూచ్, ఒక్కటే ఇస్తాం!
షాద్నగర్: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి పేరిట అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారిగా బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.సభ్యత్వం ఉన్న మహిళలకు పంపిణీగత ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేవారు. రేష నాకార్డులో పేరు ఉన్న 18 ఏళ్లు నిండిన మహి ళలకు వివిధ రంగుల్లో చీరలను అందించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్యులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంతన్న కానుకగా ప్రతీ సంఘం సభ్యులకు చీరలను అందించనున్నారు. అయితే బతుకమ్మ పండగకు ముందుగా ఒక చీర ఆ తర్వాత రెండు నెలలకు మరో చీరను పంపిణీ చేయనున్నారు. ఒక్కో చీరకు రూ.800గతాని కంటే భిన్నంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారు చేయించిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.800 ఖర్చు అయిందని అధికారులు తెలి పారు. జిల్లాకు ఇప్పటి వరకు 1.55 లక్షల చీరలు వచ్చాయని వీటిని సర్ధార్ నగర్ , కందు కూరు మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో నిల్వ ఉంచామని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు.అర్హుల గుర్తింపుగ్రామాల్లో పంచాయతీ కార్యదర్శలు, సీసీలు, గ్రామ సంఘం అధ్యక్షుడు, వీఓఏలు అర్హులను ఎంపిక చేసి అనంతరం చీరలను పంపిణీ చేయ నున్నారు. మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి, గ్రామ స్థాయిలో ఐకేపీ సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలను అప్పగించనున్నారు.పంపిణీకి ఏర్పాట్లుదసరా కానుకగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు బతుకమ్మ చీరలను అం దజేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు ఇప్పటి వరకు 1,55 లక్షల చీరలు వచ్చాయి. వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.శ్రీలత, డీఆర్డీఏ పీడీ -
'ఓజీ' టికెట్ రేట్ల పెంపు.. ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు రూ.800 రేట్లతో స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ సీఎం రేవంత్ వద్దే ఉండటం గమనార్హం. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్ను హరీశ్రావు తన పోస్ట్కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలుతెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈమేరకు జీవో కూడా విడుదలైంది. ఈ నెల 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800 అని పేర్కొంది. సినిమా విడుదలరోజు ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.ఏపీలో టికెట్ రూ.1,000ఏపీలో 25న అర్ధరాత్రి 1గంటకు ఓజీ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దాని టికెట్ ధర రూ.1,000 పెంచేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే, మిగిలినరోజుల్లో ప్రస్తుతమున్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్లలో రూ.125 , మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. గతంలో ఇంత భారీ ధర ఏ సినిమాకు అవకాశం కల్పించలేదు..@revanth_anumula U TURN@RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/QcJPftqQpb— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025 -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని.. పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నగరం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని గొప్పగా నిర్మిస్తున్నామని తెలిపారు. భావితరాలకు అవకాశాలు సృష్టించడమే తమ ఆలోచన అన్నారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ, హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు.శుక్రవారం ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) 12వ వార్షిక సదస్సుకు రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాల గురించి సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఉద్దేశాలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు లక్ష్యాల గురించి వివరించారు. తెలంగాణలో ‘ట్రంప్’ను ప్రజలు పక్కనబెట్టారు... ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్ ఒకరోజు ప్రధాని మోదీని స్నేహితునిగా అభివర్ణిస్తారు. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి) ఉండేవాడు. ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచి్చన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. న్యూజెర్సీ గవర్నర్తో భేటీ... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో... పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాల గురించి ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్–2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. న్యూజెర్సీ రైల్ అథారిటీ ద్వారా హైదరాబాద్ పట్టణ, ప్రజారవాణా రంగాలకు, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని సీఎం రేవంత్కు మర్ఫీ హామీ ఇచ్చారు. దావోస్కు రావాలని సీఎంకు డబ్ల్యూఈఎఫ్ చీఫ్ ఆహా్వనం.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్డ్ బ్రేండేతోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్–2047కు మద్దతిస్తామని సీఎంకు తెలియజేశారు. వచ్చే ఏడాది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు విచ్చేయాలని రేవంత్ను ఆహా్వనించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే విషయమై చర్చించేందుకు త్వరలో హైదరాబాద్కు వస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచి్చన అమెజాన్అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) చేతన్ కృష్ణస్వామితో సీఎం రేవంత్రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులను ‘కళాకార్’కార్యక్రమం కింద మార్కెటింగ్ చేసుకొనేందుకు ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చేతన్ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్లో గిగ్ వర్కర్ల కోసం 100 విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల విక్రయదారులు వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకొనే విషయంలో తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు గోద్రెజ్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో జెర్సీ క్రీమ్ బ్రాండ్ కింద రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కొత్త డెయిరీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. -
నీటి వినియోగ లెక్కల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదుల్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వినియోగిస్తున్నామన్న లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నా అందులో ఎంత నీటిని వాడుతున్నామన్న దానిపై స్పష్టత కొరవడిందన్నారు. శుక్రవారం ఢిల్లీలో వివిధ అంశాలపై సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందులో భాగంగా నీటి వినియోగ లెక్కల గురించి ఆయన వివరించారు. ‘గోదావరిలోని 968 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటోందో ఎవరికీ తెలియదు. ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నదీ.. ఎంత ఆయటక్టుకు నీళ్లిస్తున్నదీ తెలియకుండా గత ప్రభుత్వం అంతా గందరగోళం చేసింది. ఒక ప్రాజెక్టు ఆయకట్టును ఇంకో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టులో కలిపి చూపించింది. దీంతో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉందో, ఎంత నీటిని వినియోగిస్తున్నామో రాష్ట్రం వద్ద లెక్కల్లేవు. అందుకే ఆ లెక్కలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. అది పూర్తయితేనే తెలంగాణకు మిగిలిన నీటి వాటా ఎంతో తెలుస్తుంది.ఆ మిగిలిన నీటి వాటాను వినియోగించుకునేలా తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులను చేపడతాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఇక కృష్ణాలోనూ పరీవాహకం ఆధారంగా 904 టీఎంసీలను కోరుతున్నామని.. అందులో నికర, వరద, మిగులు జలాలన్నీ కలిపి ఉన్నాయని సీఎం వివరించారు. ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణకు జాప్యం ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరినా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇంతకాలం అవుతున్నా కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదు? ప్రాజెక్టు లోపాల్లో కుట్రదారులెవరో తేల్చాల్సి ఉన్నా, సమగ్ర విచారణ జరగాల్సి ఉన్నా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? విచారణ జరగకుండా కేటీఆర్ ఆపుతుంటే దానికి కిషన్రెడ్డి సహకరిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది’అని సీఎం ఆరోపించారు. హైకోర్టు చెప్పినట్లుగా ఈ నెలాఖరులోగా ‘స్థానికం’కష్టసాధ్యం.. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు విధించిన ఈ నెల 30లోగా నిర్వహించడం కష్టసాధ్యమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాం. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అధికారం సుప్రీంకు ఉందా? అని రాష్ట్రపతి సుప్రీంకు రెఫరెన్స్ ఇచి్చంది. ఆ రెఫరెన్స్పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థలపై నిరీక్షిస్తాం. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణ చేపడతాం’అని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్, ఎల్ అండ్ టీ తప్పులకు ప్రజలపై భారమా? హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఎల్ అండ్ టీ సంస్థ తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సహకరించాలని.. లేకపోతే ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ‘మెట్రో విస్తరణలో భాగంగా 76 కి.మీ. కనెక్టివిటీ జరగాలి. ఇది పూర్తి కావాలంటే ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం షరతు పెడుతోంది. కానీ మెట్రోతో మాకు నష్టాలు వస్తున్నందున కొత్త పనులు చేయలేమని ఎల్ అండ్ టీ అంటోంది. కేసీఆర్, ఎల్ అండ్ టీ చేసిన తప్పిదాలు, భూసేకరణలో జాప్యం వల్ల రూ. 13 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం కాస్తా రూ. 20 వేల కోట్లకు పెరిగింది. వాళ్లు చేసిన తప్పిదాలకు రాష్ట్ర ప్రజలు భారం భరించాలా? ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ డిక్టేట్ చేయజాలదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కోసమే యూరియా డ్రామా... రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధిస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రానికి సీజన్లో 9.8 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ 2 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరైన సమయానికి సరఫరా చేయలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్కు తిరిగి జీవం పోసేలా బీజేపీ డ్రామాలాడింది. ఇదే అదునుగా బీఆర్ఎస్ ప్రజల్లో యూరియా లేదని ఒక అస్థిరతను సృష్టించడం.. రైతులు ఎక్కువగా కొనుగోళ్లు చేయడంతో సమస్య పెద్దదైంది. బీఆర్ఎస్ను నిలబెట్టేందుకు కేంద్రం రైతులకు నష్టం చేస్తోంది’అని సీఎం ఆరోపించారు. కండువాలు కప్పితే పార్టీ మారినట్లు కాదు.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని స్పీకర్కు సూచించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అయితే పార్టీ కండువాలు కప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదన్నారు. ‘కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను ఈరోజు ఎంతో మందికి కండువాలు కప్పాను. వారికి కప్పిన కండువా ఏదో వారికే తెలియదు. ఎవరి ఇంటికి వెళ్తే ఏం భోజనం పెడతారో ముందే తెలియదు కదా? బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లోంచి ప్రతి నెలా రూ. 5 వేలు ఆ పార్టీ ఫండ్కు వెళ్తున్నాయి. తమ పారీ్టకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఆ మేరకు సమయం కేటాయించాలని అసెంబ్లీలో హరీశ్రావు ఆన్ రికార్డుగా చెప్పారుగా’అని సీఎం గుర్తుచేశారు. బీఆర్ఎస్లో ఆస్తుల గొడవతో కాంగ్రెస్కు సంబంధం లేదు.. బీఆర్ఎస్లో కవిత ముసలం పుట్టిందని సీఎం అన్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదు కదా? అంటూ కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావులు కలిసి కవితపై మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారని.. అయితే ఈ ఆస్తుల గొడవతో తమ పారీ్టకి సంబంధం లేదన్నారు. మావోలతో చర్చించాలి.. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ సూచించారు. ఉగ్రవాదులతోపాటు దాయాది దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. వాళ్లూ ఈ దేశ ప్రజలే కదా.. మన అక్కాతమ్ముళ్లే కదా అని పేర్కొన్నారు. -
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
MLA Bathula Lakshma Reddy: రైతుల కోసం రెండు కోట్లు
-
యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ వితరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నదే. అయితే తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు భారీ విరాళం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ (Revanth Reddy)ను లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. తాను అందించిన వితరణతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ అభినందించారు.


