Revanth Reddy
-
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్ పాలకులకు కంట్లో నలుసులా మారిన రాజగోపాల్ రెడ్డి
-
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
-
కల్తీపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్ తరహా పకడ్బందీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థలను, చట్టాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆహారంతో పాటు వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయం, పౌష్టికాహారంపై కమిటీ.. ‘ఆహార భద్రత కల్పనలో భాగంగా అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. నాణ్యమైన ఆహారంతోనే బాధ్యత తీరిపోయిందనుకోకుండా..వ్యవసాయం, పౌరసరఫరాలు, సంబంధిత ఇతర శాఖలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు ఏం చేయాలి అని దానిపై చర్యలు తీసుకుంటాం. విద్యలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం మా ప్రభుత్వ తదుపరి లక్ష్యం. అలాగైతే మోదీ ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకం అమలు కోసం ఏడాదికి రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని 86 శాతం మందికి అంటే.. 3.39 కోట్ల మందికి (గతంలోని 2.80 కోట్ల మంది నుంచి 3.39 కోట్లకు పెరుగుదల) సన్న బియ్యం పథకం అందుతోంది. రేషన్కార్డుల పంపిణీ కూడా సంతృప్త స్థాయి (సాచురేషన్ లెవల్)లో వందశాతం పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వంద శాతం సన్న బియ్యం ఇస్తే ప్రధాని మోదీ ఫొటో పెడతాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేపడితే బాగుంటుందని కేంద్రానికి సూచిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల మార్పిడి జరగాలి ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాభసాటి పంట వరి ఒక్కటే కాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలి. రాష్ట్ర భూమి, నైసర్గిక స్వరూపం, తదితరాలకు అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ విషయంలో రైతుల్ని ఒత్తిడి చేయం. వారికి తగిన అవగాహన కల్పిస్తాం. వరి వేస్తే ఉరేనంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ బెదిరించారు. ఈ విషయంలో ఆయనకు, నాకు ఎలాంటి పోలిక లేదు. మేము బోనస్ కూడా ఇస్తున్నాం. పంటల మార్పిడిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్్కఫోర్స్ కమిటీ వేస్తాం. వారిచ్చే నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రవాణా, కోల్డ్ స్టోరేజీలు, నిల్వ చేసే వ్యవస్థ తదితరాలపైనా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదైనా పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ నిధి ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. బ్రూటల్ మెజారిటీతో నియంతృత్వం ‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల పెంపు ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా లభించే ‘బ్రూటల్ మెజారిటీ’ నియంత పాలనకు, నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఉత్తరాది రాష్ట్రాలకు మరి ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలకు, దక్షిణాది రాష్టాలకు మధ్య ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్యలో తేడా ఎంత ఉందో అంత స్థాయిలోనే సీట్లు పెంచాక కూడా తేడా ఉండేలా చూడాలి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలిపాం. లక్ష్మణ్ రాజీనామా చేయాలి దక్షిణాదికి జరిగే అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఉమ్మడిగా పోరాడుతాం. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఏవేవో లెక్కలు చెబుతున్నారు. దక్షిణ భారత ప్రజల కోసం ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. ఉత్తరం, దక్షిణం మధ్య అంతరం పెరగకుండా చూడాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలిపారు. శకుని వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది ‘మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్రెడ్డికి పేరు, గుర్తింపు వచ్చింది. ఆయన లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావు. సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇలా అన్నీ చేస్తున్నాం. మరి కేసీఆర్ చెప్పినవి చేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చారా? మేము చేసేదే చెబుతున్నాం. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. శకుని చేసిన పనుల వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది. కేసీఆర్ ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. కానీ కేసీఆర్ను బావా, బావమరుదులు కలిసి (హరీశ్, కేటీఆర్) గృహ నిర్బంధంలో ఉంచారేమోనన్నది నా అనుమానం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. -
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..
-
కాంగ్రెస్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి
-
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. -
కేటీఆర్తో రేవంత్ కుమ్మక్కు..: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదన్నారు. కేవలం హరీశ్రావును టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని చెప్పారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో సంజయ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ‘కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడు. బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ సంగతి తెలిసినా రేవంత్ ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్, రేవంత్ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి’అని నిలదీశారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి. హరీశ్తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్కు సీఎం సలహా ఇస్తున్నారు. రేవంత్కు కాళేశ్వరం, హరీశ్పై ఉన్నంత పగ కేటీఆర్పై లేదు. ఎందుకంటే ఫార్ములా–ఈ కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసులపై మాట్లాడటం లేదు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదుర్చేందుకు రేవంత్ యతి్నస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు’అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు రేవంత్ డబ్బులు సమకూరుస్తున్నారని, కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో పొత్తు జరగని పని ‘కేసీఆర్పై ఉన్న కోపం కూడా రేవంత్కు పోయింది. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ఆనాడు తనను జైలుకు పంపించిన సంగతి రేవంత్ మర్చిపోయిండు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై రేవంత్ విచారణ జరిపే అవకాశమే లేదు’అన్నారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగని పని. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేం పోరాడాం. ఆ పార్టీని ఓడించాం. మోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో మేం పొత్తు ఎందుకు పెట్టుకుంటాం’అని సంజయ్ పేర్కొన్నారు. -
ఎంతో కొంత కళా పోషణ ఉండాలి
గన్ ఫౌండ్రీ (హైదరాబాద్): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. : క్రికెట్లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్లో రాందాస్ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్ లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో శంకర్ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్ నాయక్ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్ చేయగా.. రామచంద్రనాయక్ తనదైన స్టెప్పులు వేశారు. -
తల్లిదండ్రులకు తోడుగా..
సాక్షి, హైదరాబాద్: ‘బాధ్యతా రహితంగా వ్యవహరించే కొడుకులను నియంత్రించడంతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకే సామాజిక బాధ్యతగా.. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’తీసుకువచ్చాం. తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక మంత్రదండం. తల్లిదండ్రులను చూసుకోని వారిని సమాజం బహిష్కరించాలి. అలాంటి వారిని చట్టపరిధిలోకి తెచ్చి దారిలో పెట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.అయితే దీనితోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు.. వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివరిరోజుల్లో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధ్యత, భావోద్వేగంతో.. ‘పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృ పితృ భక్తికి అద్దం పడితే..అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పథ్ సింఘానియా చివరకు కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. పిల్లలకు సర్వస్వం ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ.. తన ఆత్మకథ ‘యాన్ ఇన్కంప్లీట్ లైఫ్’పుస్తకంలో సింఘానియా తన చేదు అనుభవాలను వివరించారు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇదే రకమైన ధోరణితో ఉన్నారు. ఒక మాజీమంత్రి తండ్రి సైతం ఇదే విధంగా సరిగా చూసుకోని పరిస్థితుల్లో క్యాన్సర్తో చనిపోయారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం.. బాధ్యత, భావోద్వేగంతో ఈ బిల్లును తీసుకువచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులను సంతానంలో ఎవరో ఒకరు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మేం ఇద్దరం మాకు ఒక్కరన్న పరిస్థితి వచ్చింది. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయాడు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రులపై ఒకవేళ కూతురికి ప్రేమ ఉన్నా పెళ్లి తర్వాత వారిని చూసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులను కాపాడేలా ఎన్నో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యత అని చెబుతూ ఇప్పటికే చట్టాలున్నా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అమ్మా.. నీకు వందనం’ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ బిల్లు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సమాజం మారాలని, విలువలు పెరగాలని ఆకాంక్షించారు. కన్నబిడ్డలు నిర్ల క్ష్యం చేసిన ఓ ముస్లిం మహిళను తాను చేరదీసి అనాథా శ్రమంలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మానవత్వంతో ఆలోచించి ఈ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మా.. నీకు వందనమే..’అనే పాట ఎమ్మెల్యే పాడారు. గతంలో కుటుంబ అనుబంధాలు చాటిచెప్పే సినిమాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భయపెట్టే స్థితిలో కొందరు కొడుకులు, కోడళ్లు ఉన్నారన్నారు. బిల్లుకు ఎమ్మెల్యేలు పాయల్శంకర్, జాఫర్ హుస్సేన్ మద్దతు తెలిపారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. శాసనసభలో మంత్రి @minister_adluri గారు ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్… pic.twitter.com/F1JJLwwWsp— Telangana CMO (@TelanganaCMO) March 29, 2026 -
రేవంత్ పాలనలో 19 ప్రధాన స్కామ్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల మూడు నెలల పాలనలో 19 ప్రధాన కుంభకోణాలు జరిగాయని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా హౌజ్ కమిటీ వేసి విచారణ జరపాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్కు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అక్రమ మైనింగ్పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖను అందజేశారు. తాము ఇచ్చిన లేఖను సీఎం రేవంత్రెడ్డికి పంపాలని కోరారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయింది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దురి్వనియోగం యథేచ్ఛగా సాగుతోంది. వాటిని అడ్డుకోవాల్సిన వారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రులకు ఈ కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఈ కుంభకోణాల ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతోంది. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. అడ్డుకోవడం సీఎంగా మీ బాధ్యత ‘అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జ రుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచా రణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.పౌర సరఫరాలు, అమృత్ టెండర్లు, కేఎల్ఎస్ఆర్, నైనీ కోల్ బ్లాక్, సింగరేణి స్కామ్, సోలార్ పవర్స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సీయూ, లగచర్ల భూ స్కామ్, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా కుంభకోణం, హ్యామ్ రోడ్లు, ఫోర్త్ సిటీ, హిల్ట్–పీ, అక్రమ మైనింగ్ వంటి కుంభకోణాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత విచారణ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్ర జాధనాన్ని రక్షించడం, అవినీతి అక్రమాలను అడ్డు కోవడం రాజ్యాంగబద్ధమైన సీఎంగా మీ బాధ్యత’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, కవితారావు, సంతోశ్రావు, వినోద్రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’
హైదరాబాద్: మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్ కోసం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్ కమిటీ గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్మీట్లో హరీష్రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.సీఎం రేవంత్కు హరీష్ సవాల్సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు సవాల్ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్ చేశారు. నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు. -
TG: తల్లిదండ్రుల చట్టానికి ఆమోదం
సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. ‘తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం..వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి’అని సూచించారు. -
హరీష్రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని.. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్రావు తమ్ముడు మహేశ్ రావు.. ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.కాగా, సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్బాబు అన్నారు.అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
పొలిటికల్ స్పోర్ట్స్.. సై అంటే సై ... (ఫోటోలు)
-
దేవుడి పేరుతో ప్రజలకు మోసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీనది పునరుజ్జీవం పేరిట సీఎం రేవంత్రెడ్డి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిని వ్యతిరేకి స్తున్నా, దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని, ‘శివతాండవం చేస్తాను’అని అహంకారంగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి నిదర్శ నమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం అనవసరంగా అంచనాలు పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల లక్షల ఇళ్లను కూల్చి, సుమారు 3 వేల ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు మాత్రమే కూల్చేస్తున్న ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శనివారం గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో మేధావులు, పర్యావరణ నిపుణులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి వరకు ప్రతి కాలేజీ, బస్తీల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వేసిన తాళా లు బద్దలుకొట్టైనా ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ ఎస్వీ నాయకులకు పిలుపునిచ్చారు.ప్రతిపక్ష నాయకులను బెదిరించే ధోరణిమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై సీఎం బెదిరించే ధోరణి ప్రదర్శించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను దాదాపు పూర్తి చేసి, కాళేశ్వరం నుంచి నీటిని పంపించే ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా భారీ అంచనాలతో స్కామ్కు తెరలేపుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరు ద్ధమని చెప్పి కూల్చేస్తూ, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. పేదల జీవితాలను నాశనం చేస్తూ హైదరా బాద్ను విధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రం ‘పిచ్చోడి చేతిలో రాయి’లాగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిశోర్, పట్లోళ్ల కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. -
బ్లాక్ మెయిలింగ్కు భయపడం.. మైనింగ్పై నిగ్గుదేలుస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ విషయంలో విపక్ష బీఆర్ఎస్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని.. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏమాత్రం భయపడబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు, అక్రమాలపై పూర్తిస్థాయి సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రధానంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్, హరీశ్ సోదరుడి మైనింగ్ సంస్థ సహా ఆరు సంస్థలపైనా సమగ్ర దర్యాప్తు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ విచారణ ముగించి నిజాలను నిగ్గుతేల్చి సభ ముందు నివేదికను ఉంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటికి చెందినదని.. ఆ సంస్థ మైనింగ్ అక్రమాలపై సభాసంఘాన్ని వేయడంతోపాటు విచారణ సజావుగా సాగేలా సంబంధిత మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సభ వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఇసుక లేదా లీజు మాఫియాలో గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి సంబంధిత వ్యక్తులను పార్టీలో చేర్చుకొని మళ్లీ ఆ చార్జీలను తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ ఈ విచారణ ద్వారా తేల్చి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా, ఖనిజ లేదా ఇతర ఆదాయానికి గండిపడేలా ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. నాడు బెదిరించి.. లీజులు రాయించుకొని ‘సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ఇసుక లారీతో ఢీకొట్టించి చంపి సంతోశ్రావు తండ్రి రవీందర్రావుకు సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా అక్రమ ఇసుక రవాణా చేసింది. శిరీష గ్రానైట్స్ జియో గ్రానైట్స్ ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేవి. గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన్ను బెదిరించి వారి మైనింగ్ లీజును రాయించుకున్నారు. మిడ్వెస్ట్ గ్రానైట్స్కు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సోదరుడు మహేశ్రావు అక్రమ మైనింగ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్ అక్రమ మైనింగ్పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణే కాకుండా ఈడీ విచారణ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్పై గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి లొంగదీసుకొని మళ్లీ ఆర్బిట్రేషన్లో తగ్గించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకొని అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు’అని సీఎం రేవంత్ ఆరోపించారు. వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఇసుక ఆదాయం పెంచాం.. ‘మేం అధికారంలోకి వచ్చాక పెంచిన ఆదాయం కళ్ల ముందు ఉంది. రాష్ట్రానికి ఇసుక ద్వారా ఆదాయం 2020–21లో రూ. 721 కోట్ల ఆదాయం వస్తే 2025–26లో రూ. 972 కోట్లు (35 శాతం) పెంచాం. నిర్మాణ రంగం కుంటుపడిందని, రియల్ ఎస్టేట్ దెబ్బదిన్నదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేం ఇసుకను బుక్కుతున్నామా? బిర్యానీ వండుకొని తింటున్నామా? ఇసుకలోనే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం పెరిగిందంటే అర్థం ఏమిటి?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బురదజల్లేందుకే బ్లాక్మెయిలింగ్.. ‘బీఆర్ఎస్ నేతల దోపిడిని నిలువరించి ఇసుక, మైనింగ్లో ఆదాయం పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వచ్చి గత పదేళ్లలో బీఆర్ఎస్ సాగించిన దోపిడి ప్రజలకు అర్థమవుతుందనే సంబంధిత మంత్రిపై బురదచల్లేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రెడ్డికైనా ఏదో ఒక రూపంలో బంధువులు, దూరపు బంధువులు ఉండటం సహజమే. మంత్రి పొంగులేటి, వారి కుటుంబ సభ్యులు, ఎవరో బంధువుల మధ్య ఏవో గొడవలు ఉంటే వాటితో మంత్రికేం సంబంధం? సొంత చెల్లినే ఇంట్లోంచి వెళ్లగొట్టి దోపిడికి పాల్పడిన మీరు.. మంత్రి బంధువులకు ఏవో వ్యాపారాలు ఉన్నాయని పొంగులేటికి ముడిపెట్టి ఆయన్ను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై గతంలోనే చర్యలు తీసుకున్నాం.. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవడంలో భాగంగా సీనరేజీ చార్జీ కింద రూ. 1.52 కోట్లు, పర్మిట్ ఫీజు కింద రూ. 1.22 కోట్లను ప్రభుత్వం, మైనింగ్శాఖ కట్టించుకుంది. ఇదేదో బీఆర్ఎస్ వాళ్లు కనిపెట్టి, ఫిర్యాదు చేస్తే తాము తీసుకున్న చర్య కాదు. మా ప్రభుత్వం తరఫున మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సంస్థకు నోటీసులిచ్చి చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రతిపక్షం కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. 2025 ఆగస్టు 8న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో మంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే నోటీసులిచ్చి ఆదాయం రాబట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయా?’అని విపక్ష సభ్యులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ప్యానెల్ స్పీకర్ బాలూ నాయక్ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. -
ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..
-
మూసీ ప్రాజెక్ట్.. సబితపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రంగారెడ్డి: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్లో ముందడుగు ఇది. నదులు కాలుష్యం అవుతున్నాయి. నదులను ప్రక్షాళన చేయాలని చాలా మంది సీఎంలు ఆలోచించారు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన దైవకార్యంగా భావిస్తున్నా. 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదం. మూసీ ప్రక్షాళన అత్యవసరం. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొద్ది మంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారు. ఎవరైనా దీనికి పెడార్థాలు తీసినా, రాజకీయం చేసినా ప్రభుత్వం శివతాండవం చేస్తుంది.బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రాంతంలో ఉండే అక్క అనేక రకాలుగా రాజకీయ లబ్ది పొందారు. అక్క కొడుకే ఎన్జీటీలో కేసు వేశాడు. మూసీ పునరుద్దీకరణ ఆపాలని కేసు పెట్టాడు. కేసు వేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది?. ప్రజాప్రతినిధిగా వారికి అర్హత ఉందా?. ఎవరు అడ్డం వచ్చినా మూసీ నదిని పునరుద్ధరిస్తాం. ఈ అవకాశం చరిత్రలో ఎవరికో ఒకరికి వస్తుంది. దైవ నిర్ణయంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు అవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. విమర్శలు, అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది. సముద్రం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవ తప్పిదం వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి. దీంతో హైదరాబాద్ నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీని చూసి అయినా మనం నేర్చుకోవాలి’ అని అన్నారు.ఇక, ఇక్కడ.. చారిత్రక వీరభద్రస్వామి ఆలయం సమీయంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా 100 అడుగుల గాలి గోపురం నిర్మాణం చేస్తారు. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివని విగ్రహం ఏర్పాటు చేస్తారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా మూడంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. -
తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి తెలిపారు. పశి్చమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్టు సీఎం తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్టు సీఎం వెల్లడించారు.ప్రతి బంక్లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నారనే దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నట్టు సీఎం వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడు తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్టు తెలిపారు. శిలాజ ఇంధనాలపై దృష్టి...తెలంగాణలో శిలాజ ఇంధనాలపై (బొగ్గు, చమురు, గ్యాస్) ఆధార పడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకో సిస్టమ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిటింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆరీ్టసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగించనున్నట్టు సీఎం రేవంత్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్రెడ్డి కేరళ, అసోం, గోవా, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కీలకంసాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డికి జాతీ యస్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన పుదుచ్చేరితోపాటు కేరళ, అసోం, గోవా రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో ఆయనకు చోటు దక్కింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతోపాటు రేవంత్రెడ్డి ఉన్నారు. పుదుచ్చేరి జాబితాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు కూడా చోటు దక్కింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమరి్పంచింది. -
కల్యాణ వైభోగమే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు జానకీరాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాచలం తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మిథిలా స్టేడియానికి సీతారాములను తీసుకువచ్చారు. ఆ తర్వాత వేదస్వస్తితో వివాహ వేడుకలు ప్రారంభిస్తూ ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఆపై వరుసగా పుణ్యాహవచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయాన అభిజిత్ లగ్నంలో వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. 12:11 గంటల సమయంలో మాంగళ్యధారణ జరగగా ఆపై తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.12–40 గంటల సమయాన హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. సీఎం సతీమణి గీతతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మహా సంకల్పం సమయంలో వచ్చిన సీఎం భద్రగిరి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ నిర్వహించే సమయాన కల్యాణ మండపం వద్ద వరపూజ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా పాద ప్రక్షాళన, మధుపర్కం, నూతన వ్రస్తాల సమర్పణ, ఆభరణాల అలంకరణ చేయాల్సి ఉంది. అయితే మధుపర్కం సమయానికి కూడా సీఎం కల్యాణ మండపం దగ్గరకు రాకపోవడంతో తదుపరి కార్యక్రమమైన మహా సంకల్పాన్ని ఉదయం 11–37 గంటలకు మొదలెట్టారు. కాగా సీఎం 11–41 గంటలకు కల్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు. అనంతరం 11–46 గంటలకు నూతన వ్రస్తాలను సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు సమర్పించారు. గోత్రాలు అవే... కల్యాణం సందర్భంగా సీతారాముల గోత్రాల విషయంలో నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కల్యాణం జరిపించే వైదికులు స్పందించారు. కన్యావరణం సందర్భంగా గోత్రాలు చెప్పే విషయంలో శ్రీరాముడికి నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని, సీతమ్మ వారికి లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య గోత్రాన్ని చెప్పారు. రామదాసు కాలం నుంచి ఇవే గోత్రాలు చెబుతున్నారని, ఇకపై కూడా ఇవే గోత్రాలను చదువుతామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. రూ.351 కోట్లతో అభివృద్ధి పనులు ఉదయం 10–45 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా భద్రాచలం ఆలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రూ.351 కోట్లతో చేపట్టే ఆలయ విస్తరణ, పునరుద్ధరణ, పుష్కరఘాట్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు భూమి పూజ నిర్వహించారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. నిలువ నీడ, మంచినీటి కోసం అల్లాడిపోయారు. నేడు పట్టాభిషేకానికి గవర్నర్ కల్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం జరిగే వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా రానున్నారు. ఇందుకోసం మిథిలా స్టేడియంలో దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. -
ప్రాణాలైనా తీసుకోండి.. భూములివ్వం
పరిగి: ప్రాణాలైనా ఇస్తాం కానీ పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు నినదించారు. ఈ మేరకు గురువారం పరిగి బస్టాండ్ ఎదుట బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 1,197 ఎకరాల భూమిలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూమి, 937 ఎకరాల లావాణి పట్టా భూములు ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరు గ్రామాల రైతులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలతో నిరసన తెలుపుతున్నారు.ఇందులో భాగంగా ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల మద్దతుతో కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి బస్టాండ్ ర్యాలీ తీశారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని కోరారు. సీఎం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, తమకు సహకరించాలని పోలీసులను పలువురు రైతుల వేడుకున్నారు. రైతుల మాటలేవీ పట్టించుకోని పోలీసులు నిరసనకారులపై బలప్రదర్శన చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, వెంటనే విరమించాలని సూచించగా, రైతులు కొంత సమయం ఇవ్వాలని కోరారు.ఇందుకు అంగీకరించని పోలీసులు కాళ్లాపూర్ సర్పంచ్ పల్లయ్యతో పాటు, రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పెనుగులాటలో పలువురు రైతులు, సర్పంచ్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో వాహనాలను పీఎస్కు తరలిస్తుండగా మహిళా రైతులు అడ్డుపడ్డారు. తాము తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి, ధర్నా ఆపేస్తామని చెప్పడంతో పోలీసులు శాంతించారు. అనంతరం నాయకులు, రైతులు వెళ్లి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి వెంటనే భూ సేకరణను ఆపాలని, లేదంటే నిరసనలు మరింత ఉద్రితం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదన వివరించారు.వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అయితే ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చెప్పారు. మురళీధరన్తో సమన్వయం చేసుకుని ఆయా అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్రావు అన్నారు. వాయిదా తీర్మానాలు తిరస్కరణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు. -
బఫర్ జోన్ 50 మీటర్లు అయితే 5 కి.మీ.ల పరిధిలో భూసేకరణ ఎందుకు ?
సాక్షి, హైదరాబాద్: మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉంటే శాసనసభ ముందు ఉంచాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అర్ధరాత్రి శాసనసభలో నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు డీపీఆర్ ఉందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రకటించగా, తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.6–7వేల కోట్లుగా మంత్రి శ్రీధర్బాబు ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.లక్షన్నర కోట్లు అని సీఎం నాలుగుసార్లు ప్రకటించారని, మంత్రి శ్రీధర్బాబు డీపీఆర్ను సభలో పెట్టకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు. డీపీఆర్ విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అని చెప్పి 5 కిలోమీటర్ల అవతల వరకు భూముల సేకరణకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అని నిలదీశారు. చట్టం అంటే పేదలకు భూతం..పెద్దలకు వరం అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ..బఫర్ జోన్లో ఉన్న మంత్రుల ఇళ్లను వదిలేసి పేదల ఇళ్లను కూల్చుతా అంటోందని ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేసి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సీఎఫ్ఓను అరెస్టు చేస్తామని బెదిరించారని తప్పుబట్టారు. ఎల్అండ్టీ పైన, ఆ సంస్థ కట్టిన మేడిగడ్డ బరాజ్పైన కక్ష గట్టారని విమర్శించారు. ఎల్అండ్టీకి లీజు మీద ఇచ్చిన 280 ఎకరాల స్థలంపై కొందరు పెద్దలు కన్నేసి ఈ పనులు చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాలను మాత్రమే సేకరించగా, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు మంత్రి శ్రీధర్ ప్రకటించడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.మిగిలిన 16 వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్బాబు తోసిపుచ్చారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేసి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెట్టింగ్ కోసం సమర్పించామని, వెట్టింగ్ పూర్తయిన వెంటనే ఆన్లైన్లో బహిరంగపరుస్తామన్నారు.పద్దులపై చర్చిస్తుంటే ఆటల పోటీలా? అత్యంత కీలకమైన పద్దులపై అసెంబ్లీలోచర్చలు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాటాడారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. -
సీఎస్ఆర్ నిధులపై ప్రత్యేక పాలసీ
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సమీకరణతో పాటు వాటి సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం చూపిన సంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ అభినందన ఉత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యాలయం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సెల్ ద్వారా కార్పొరేట్ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టదగిన కార్యక్రమాల వివరాలన్నింటిని సమన్వయం చేస్తారని సీఎం వివరించారు. సీఎఎస్ ఆర్ నిధులపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక సీఎస్ఆర్ పోర్టల్కు రూపకల్పన ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ పోర్టల్లో సీఎస్ఆర్ విరాళాలు అందించేందుకు, వివిధ విభాగాల పరిధిలో అమలు చేయదగిన ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల్లో తెలంగాణకు కేవలం 3 శాతం వాటా మాత్రమే ఉందని అధికారులు నివేదించగా, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర ప్రాంతాల్లో సీఎస్ఆర్ ఖర్చు చేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణకు మరిన్ని సీఎస్ఆర్ నిధులు రాబట్టేలా కొత్త పాలసీ రూపొందించాలని, కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
విద్య, వైద్యం.. నిధులు పుష్కలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం.. ఈ రెండు అంశాలు ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ రెండు విభాగాలకు సరిపోయినన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోత విధించబోమని చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ఎల్పీ ఉప నేతలు హరీశ్రావు, సంజయ్ తదితరులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఈ పథకం కింది బకాయిలతో ప్రైవేటు ఆస్పత్రులు మూత పడుతున్నాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.627 కోట్లు ఉంటే.. వారసత్వంగా వచ్చిన ఆ బకాయిలను చెల్లిస్తూనే ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటివరకు రూ.2,408.51 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1480.52 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి. వారసత్వ బకాయిలు మరో రూ.100 కోట్లు ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటివరకు దీని కింద రూ.2,046 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం..’అని సీఎం వివరించారు. బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలున్నాయి. బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తక్కువగా ఉంది. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర కొన్నిచోట్ల సరైన డాక్టర్లు లేరు..రోగులున్న చోట నిపుణులు లేరు. అందువల్ల ఆరోగ్యశ్రీ రోగులను బోధనాసుపత్రులకు పంపించాలనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్ఎఫ్ను ఈ ఆస్పత్రులకు ఇస్తాం. దీంతో ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడుతుంది. ఈ ఆస్పత్రుల పర్యవేక్షణకు గ్రూప్–1 లేదా గ్రూప్–2 అధికారులను నియమిస్తాం. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయనున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే ధీమాగా మారుతుంది. విదేశాల్లో ఉండే తెలుగు డాక్టర్ల సేవలు వినియోగించుకునేలా, ఇక్కడికి వచ్చినప్పుడు చికిత్స అందించేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీపై ప్రైవేటు ఆస్పత్రుల ఆసక్తి: మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్సాహం చూపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా 330 కార్పొరేట్ ఆస్పత్రులు చేరాయన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులపై ఓర్వలేకే విమర్శలు: మంత్రి శ్రీధర్బాబు ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని చూసి ప్రతిపక్ష పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. దావోస్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దావోస్కు వెళ్లిన 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 44 ఎంవోయూలు చేసుకోవడం ద్వారా రూ. 2,19,182 కోట్లు పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
గత సర్కార్ తప్పిదాలను సరిచేస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక రూ.2408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీనెల రూ.52 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం ప్రతీనెల ఆరోగ్యశ్రీకి రూ.89 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.ఇవాళ వరకు ఆరోగ్యశ్రీకి రూ.720 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు 200 కోట్ల మించి బకాయిలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల పీఏలు ఇందులో ఉన్నారు. 2046 కోట్ల రూపాయలు సీఏం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీ కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం...మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ అనుసంధానం చెస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవు. కోతలు పెట్టాల్సివస్తే వేరే వారికి కోతలు పెడతాం. పేదల విద్య, వైద్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు’’ అని రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. -
విధి లేకే వీడుతున్నా: జీవన్రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్కు ఎదిరించే వారు వద్దని, రాహుల్గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రేవంత్పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ కోసం కష్టపడ్డా.. కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం
-
కాంగ్రెస్కు గుడ్బై.. రేవంత్పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
తెలంగాణలో పెట్రోల్ నిల్వలు.. డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల వ్యాప్తిచెందిన కారణంగా వాహనాల్లో డీజిల్, పెట్రోల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు అని హెచ్చరించింది.మరోవైపు.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్టు సమాచారం. -
50 శాతం సీట్ల పెంపు ముమ్మాటికీ కుట్రే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దక్షిణాది నుంచి చోటు ఉండదు... తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది. కేసీఆర్ది కుటుంబ సమస్య కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్రావు అనుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్ను ఫామ్హౌస్లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. -
ప్రజలకు నష్టం చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరికీ నష్టం చేయం. నిరాశ్రయులను చేయం. పునరావాసం కల్పిస్తాం. మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం. ప్రాజెక్టును నిర్మిస్తూనే అక్కడ నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తాం. బఫర్ జోన్లో ఉండే వారికి ఏ రకంగా సహాయం అందించాలో అందిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించకూడదు. అందరం కలిసి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు మహేశ్కుమార్గౌడ్, అద్దంకి దయాకర్ సోమవారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. కావాలంటే కేబినెట్ కమిటీ వేస్తాం.. ‘మూసీ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పారు. మూసీ నది వెంట 50 మీటర్ల బఫర్ జోన్ కూడా మీరు నిర్ణయించిందే. మీరు ప్రారంభించి అర్థాంతరంగా వదిలేసిన పనినే మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఈ విషయంలో మీరు ఏ సూచన చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేవి అయితే 100% అమలు చేస్తాం. నాకు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి మీ సూచనలు చెప్పొచ్చు. ప్రాణాంతకంగా మూసీ నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూస్తే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోరు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలో కాలుష్యం, జంతువుల కళేబరాలు, మనుషుల శవాలతో ఆ నీళ్లు వారికి ప్రాణాంతకంగా మారాయి. ఆ ప్రాంతంలో పండిన పంటలు, బోర్లలో నీళ్లు కూడా పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ సమస్యల నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మూసీలో శుభ్రమైన నీరు ప్రవహించేలా గోదావరి జలాలు తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు ‘గాందీసరోవర్ నిర్మించేందుకు 98 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రం ఇస్తుంది. టూరిజం శాఖ దగ్గర ఇంకో 100 ఎకరాలు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ల (మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల అంశాన్ని ఉద్దేశించి) భూమి తీసుకోకపోయినా పరవాలేదు. కానీ ఆ అపార్ట్మెంట్లలో ఉండే మిత్రులు 2005–06లో 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి అనుమతులు తీసుకున్నారు. అయితే 2016లో మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అయ్యింది. ఆ ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్లు బఫర్ జోన్లో ఉంటాయి. భవిష్యత్తులో వాటిని అమ్ముకోవడానికి వీలుకాదు. అందువల్ల నష్టం జరుగుతుందని మాత్రమే చెబుతున్నాం. మీకు ఇష్టమైతే, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఆ భూమిని ఇప్పుడు ఇస్తే నష్టపరిహారం ఇస్తాం. ప్రత్యామ్నాయం చూపడానికి కూడా అభ్యంతరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి రోడ్మ్యాప్ ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్లో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయి. నగరంలో వాహనాల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశాం. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం. క్యూర్ పరిధిని సేవా రంగంగా, ప్యూర్ను తయారీ కేంద్రంగా, రేర్ను వ్యవసాయ ప్రాధాన్యతగా అభివృద్ధి చేయబోతున్నాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం (క్యూర్)లోని కాలుష్య కారక పరిశ్రమలను బయటకు తరలిస్తేం నగరం నివాస యోగ్యంగా మారుతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసే క్రమంలో ఒకే విధమైన పరిపాలన విధానం కోసం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్మ్యాప్ను తయారు చేశాం..’అని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ..ఎలివేటెడ్ కారిడార్లు ‘ప్రజల సౌకర్యం కోసం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్రెడ్డి ఉన్న సమయంలోనే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు సదుపాయం వచ్చింది. ఆనాడు దేశంలో రెండో స్థానంలో ఉన్న మన మెట్రో గత పదేళ్లలో నిర్లక్ష్యంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు ఎల్అండ్టీ అనుకూలంగా లేకపోవడంతో మెట్రోను రూ.15 వేల కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటోంది. ఏప్రిల్ వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత లాస్ట్మైల్ కనెక్టివిటీ వచ్చేలా మెట్రో రైలును నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు, గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట, రాయిదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మొత్తం 76 కిలోమీటర్లు మార్గాన్ని రూ.24 వేల కోట్లతో నిర్మించేందుకు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. మెట్రో విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. హిమాయత్సాగర్ నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్కు రేడియల్ రోడ్లు వేస్తున్నాం. హిమాయత్సాగర్ నుంచి రామోజీ ఫిల్మ్సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ వేస్తున్నాం. గండిపేట నుంచి గౌరెల్లికి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకుంటారు. నగరంలో ఉండే వాళ్లు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నగరం మధ్యలోంచి మూసీ వెంట ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తాం. దీనికి గౌలిగూడ బ్రిడ్జి దగ్గర, చాదర్ఘాట్ దగ్గర, నాగోల్ దగ్గర, అంబర్పేట జంక్షన్ దగ్గర ట్రంపెట్లు వస్తాయి. ఇలా హైదరాబాద్ను అద్భుత రీతిలో అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం..’అని రేవంత్ వివరించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద రోడ్డు ‘హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు.. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్టు మధ్యలో రన్వే కింది నుంచి అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తెచ్చాం. పనులు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను జూలై వరకు పూర్తిచేస్తాం. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్పాత్ వ్యాపారులకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి ప్రోత్సహిస్తాం. మల్టీలెవల్ పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. -
ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!
-
అవగాహనలేమితో తెలంగాణ పరువు తీస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు. -
ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలోనూ ఆర్యవైశ్యుల భాగస్వామ్యం కీల కమైందన్నారు. ఇటీవల ఆర్యవైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడి యం వేదికగా శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవాన్ని ఆది వారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘అవకాశాలు వచ్చినా రాకు న్నా.. ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో ఉంటారు.నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. ఆయనతో వాదించడం, ప్రశ్నించడం గౌరవంగా ఉండేది. ఆర్యవైశ్యులు వారి హక్కులను కూడా శాంతియుత పద్ధతి లోనే తెలిపే ప్రయత్నం చేస్తారు. ఊరిలో ఒక్క ఆర్యవై శ్యు డున్నా.. ఊరంతా ఆయన చేతిలోనే ఉంటుంది. వ్యవసాయ కూలీలకు, రైతులకు, నమ్మకంతో అప్పులు ఇచ్చి తిరిగి తీసుకుంటారు’ అని చెప్పారు.ఈ సందర్భంగా వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత సీఎంను కోరగా.. శాసన సభ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, ఏపీ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే సూర్య నారా యణ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది పీఠాధిపతులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సామూహిక పారాయణం.. గిన్నిస్ రికార్డుఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో భాగంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి చింత శ్రీనివాస్ రచించి, స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన 102 చరణాల వాసవీ పారాయణాన్ని గాయని కల్పన పాడగా.. 21 వేల మంది (ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి 30 వేల మంది) వైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కాగా, 28 అడుగుల భారీ అమ్మవారి విగ్రహం వద్ద 16 మంది పీఠాధిపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. -
రైతే రాజు కావాలి: సీఎం రేవంత్
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.ఆదివారం సెలవు కావడంతో సోమవారంఅన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి ‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం. యూరియా కొరత వచ్చేలా ఉంది.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు.. ‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. -
‘సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి’
నర్మెట్ట: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా ఆయిల్ఫామ్ ప్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం. 2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్.. ‘రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తుపాన్కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.సీఎం రేవంత్ పర్యటనపై బీఆర్ఎస్వీ నిరసనసీఎం రేవంత్ నర్మెట్ట పర్యటనపై బీఆర్ఎస్వీ(బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అంటూ ఫ్లకార్డులను బీఆర్ఎస్వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. -
శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేటలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించే పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ తెచ్చింది, చేసింది కాదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవే. శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?’అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కృషి ఫలితమే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అని, దానిని ఆదివారం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు.కానీ, ప్రజల మనోఫలకాల మీద తమ పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందే జిల్లాకు మంజూరై, రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్రావు.. సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను శనివారం సిద్దిపేటలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారమన్నారు. కాళేశ్వరాన్ని, కూలేశ్వరం అని అంటున్న రేవంత్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు? రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,170 కోట్లు అర్ధంతరంగా రద్దు చేశారని హరీశ్ తెలిపారు. వీటిలో పశువైద్య కళాశాలను రేవంత్ కొడంగల్కు తీసుకెళ్లారన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?, ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులు చెల్లించాలని కోరారు. -
నేటి నుంచి యాసంగి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కొత్తగా నిర్మించిన ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి రైతుభరోసాను ప్రారంభించనున్నారు. మొదటి విడత కింద రూ. 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. తద్వారా ఎకరం లోపు విస్తీర్ణం భూములున్న సుమారు 73 లక్షల మంది రైతులకు డబ్బులు అందనున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.6 వేలు చొప్పున రాష్ట్రంలోని సుమారు 150 లక్షల ఎకరాల భూములకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. రెండవ విడతగా 20 రోజుల తరువాత రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంబోత్సవానికి వ్యవసాయ, అనుబంధ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ నర్మెటలోనే ఉంటూ సీఎం పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కాళేశ్వరంతో సాగు కావట్లేదు: తుమ్మల ‘ప్రతిపక్ష నేతలవి చిల్లర మాటలే.. కాళేశ్వరం జలాలతో పామాయిల్ సాగు కావడంలేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచి్చన తర్వాతే సిద్దిపేట జిల్లా నర్మెటలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాం. ఫ్యాక్టరీని 16 నెలల్లోనే పూర్తి చేశాం’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని వివక్ష చూపకుండా, సిద్దిపేట భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడే ఫ్యాక్టరీ మంజూరు చేశానని వివరించారు. కాళేశ్వరంతో పామాయిల్ సాగు కావడం లేదని, వాతావరణం అనుకూలంతో రాష్ట్రమంతా ఆయిల్పామ్ సాగవుతుందని తెలుసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తే అది రైతుల వడ్డీకే సరిపోయిందని, ఇంకా ఒక్కో రైతుపై రూ.12 వేలు వడ్డీ మీద పడిందన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం రైతులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రారంభాలు.. శంకుస్థాపనలు సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, పీహెచ్సీలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 30 వేల మంది రైతులతో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న రైతు ఉత్సవాలు సీఎం సభతో ముగియనున్నాయి. -
మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి తొలి విడత పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. తొలి దశ పనులు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. శనివారం రాత్రి ఆయన ఆలయ పునరాభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హన్మంతరావు తదితరులతో సమీక్షించారు.పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తిచేసి, పుష్కరాల అనంతరం మిగతా పనులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి తీరంలో భక్తులకు వసతి కల్పించాలన్నారు. భక్తుల దర్శనాలు కొనసాగుతుండగానే ఆలయ అభివృద్ధి పనులు జరపనున్నందున, భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు జరగాలని చెప్పారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రబద్ధంగా పునరాభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు. -
చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
-
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్కుమార్రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
రేషన్కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్జోన్లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్రావు చెబుతుండడం తప్పు. చక్రధర్గౌడ్ పంజగుట్ట పీఎస్లో తనను హరీశ్రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్రావు బెదిరించినట్టు చక్రధర్గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
నిధుల మూట.. ప్రగతి బాట
సాక్షి హైదరాబాద్: ‘ధీరోదాత్తుడు ఎన్నడూ అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగుతాడు. ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రగతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్పై నమ్మకం కలిగించాం. ఇక పురోగతిలో మా మార్కు చూపుతాం. గత రెండున్నరేళ్లుగా ఈ బాటలోనే సాగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటికి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెడుతున్నాం.ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచి్చన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా లక్ష్యం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేదిగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూపొందించాం..’ అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల బడ్జెట్ను డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మాటల్లోనే.. పన్నుల సొమ్ము ప్రజల అభ్యున్నతికే.. ⇒ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రజలిక్చిన హామీలను, ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను ఈ రెండున్నరేళ్ల పాలనలో సంతృప్తి్కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. పన్నుల రూపంలో వచి్చన సొమ్మును, తిరిగి ప్రజల అభ్యున్నతి కోసమే వెచి్చస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారుగా ఉంటున్నాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం.రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ట ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు. ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. దేశానికి బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ ⇒ 2025–6 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ నిలుస్తోంది. గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం æ1.9 రెట్లు ఎక్కువ. ⇒ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మరిన్ని కేంద్ర నిధులకు కృషి ⇒ 2014–15 నుంచి 2023–24 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి ఉన్న రూ.3 వేల కోట్లను విడుదల చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార, సమాఖ్య వాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. 2021–22లో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు రాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ.7.72 వేల కోట్లను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. గత ప్రభుత్వ అప్పులతో తీవ్ర భారం ⇒ గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20–39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025–26 నుంచి 2031–32 దాకా చెల్లించాల్సిన రూ.34.58 వేల కోట్ల రుణం రూ.11.915 వేల కోట్లకు తగ్గింది. లక్షల కోట్ల పెట్టుబడులు ⇒ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ముఖ్య వేదికగా నిలిచింది. దీని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ వేదికగా ఆవిష్కరించిన ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 వల్ల రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. సింగపూర్, వియత్నాంకు చెందిన సంస్థల నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వ్యవసాయానికి ప్రాధాన్యం... ⇒ దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదించాం. రూ.కోట్లలో మహిళలకు ఆదా ⇒ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా రూ.752 కోట్ల మేర మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటివరకు 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ అయ్యాయి. ఫలితంగా రూ.3,954 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. హైదరాబాద్ సమ్మిళిత, సమాన అభివృద్ధి ⇒ హైదరాబాద్ అభివృ·ద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ 3 కార్పొరేషన్లుగా మార్చి సమ్మిళిత, సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నాం. 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి దానిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 67,763 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే మా విధానం ⇒ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా సమతుల్యంగా బడ్జెట్ను రూపొందించాం. పన్నులతో సామాన్యుడిపై భారం మోపకుండా, ఉన్న వనరులను సది్వనియోగం చేస్తూ, కొత్త సంపదను సష్టించి, దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.‘పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి..’ అన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పునాది ఈ బడ్జెట్. ఈ పునాది ఆధారంగా ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణను నిర్మించేందుకు ఇది బ్లూ ప్రింట్. డిజిటల్ జనగణనకు ముమ్మర ఏర్పాట్లు ⇒ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. తెలంగాణ ప్రజల ఆశాదీపం ⇒ బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం. మన భవిష్యత్తు ⇒ కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం ⇒ ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం ⇒ నీడలేని వారికి నీడ కల్పించడం ⇒ పంట పొలాలకు నీళ్లు పారించడం.. ఫలసాయం పెంచడం ⇒ కష్టపడే వారికి పని కల్పించడం..ఇష్టపడేలా పాలన అందించడం ⇒ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. ⇒ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. -
మా ఇల్లు కూల్చొద్దు మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల నిరసన
-
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు. -
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్పై చిరంజీవి, చరణ్ ట్వీట్
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్మీడియాలో స్పందించారు. ఉగాది నాడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై ఈ గౌరవాన్ని చిరు పొందారు. ఈ క్రమంలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు లభించడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన పంచుకున్నారు.'చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే…N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…ఆయన పోషించిన కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.'మెగా హీరో రామ్చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్తో తన తండ్రిని గౌరవించడం తమ కుటుంబానికి అత్యంత గర్వకారణమైన క్షణమని అన్నారు. సినిమాపై ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రేమ, నిబద్ధత చాలామందికి స్ఫూర్తిదాయకమని చరణ్ అన్నారు. ఇండస్ట్రీలోని ప్రతిభను గుర్తించి అవార్డులతో గౌరవించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి
ఉగాది పండుగ నాడు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఉగాది అనగానే గతంలో చిత్రసీమ సినీ పురస్కారాలు ఘనంగా జరిగేవి. అయితే, పలు కారణాలతో సుమారు 13ఏళ్లుగా ఈ పురస్కారాలకు టాలీవుడ్ నోచుకోలేకపోయింది. అయితే, గతేడాది నుంచి సినిమా రంగంలోని ప్రతిభకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ను అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి ప్రసంశించారు. సినిమా నటీనటులను గుర్తించడంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందని చిరు అన్నారు.కాంతారావు పురస్కారాన్ని అందుకున్న ఆర్.నారాయణమూర్తి ఇలా అన్నారు. సినిమా అవార్డ్స్ కోసం పదమూడేళ్లపాటు చిత్ర పరిశ్రమ ఎదురు చూసింది. అయితే, సూపర్స్టార్ కృష్ణ అభిమాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ చూపించి గతేడాది నుంచి మళ్లీ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, కళాకారుల్ని గౌరవించినందుకు నా అభినందనలు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్.'చంద్రబాబునాయుడు గారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు. చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.' అని ఏపీ ప్రభుత్వం గురించి నారాయణమూర్తి అన్నారు.పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవిఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత చిరంజీవి ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి ఇలా అన్నారు. 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు.పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది.' అన్నారుహాలీవుడ్ సినిమా అంటే ఎవరికైనా సరే అమెరికానే గుర్తొస్తుందని చిరంజీవి అన్నారు. కానీ, ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని సీఎంతో అన్నారు. -
పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం
తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్ చేసిన డ్యాన్స్ ఓ హైలైట్... వేదికపై దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్... లవ్ సాంగ్స్ నుంచి మాస్ సాంగ్స్ వరకూ శ్రేయా ఘోషల్ పాడిన పాటలు... సింగర్ మంగ్లీ పాడిన పాటలు... ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్’ కార్యక్రమంలో నన్ను, కమల్హాసన్ వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్స్టర్స్కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.– చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత)హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలుమై ఫ్రెండ్ చిరంజీవిగారు... బ్రదర్ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా హైదరాబాద్కు వచ్చాను ఏయన్నార్గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. నా సినిమా కెరీర్లో నేను కలిసిన యంగస్ట్ సీనియర్ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్. పాలిటిక్స్లో సీనియర్. 1970లో మేం లీడ్ రోల్స్ చేశాం. ఇప్పుడు 70స్లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్ చెబుతున్నాం. ఇక నో మోర్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్.. ఒకే ఒక సినిమా... ఇండియన్ సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్ తరాల కోసం మేం కూడా సపోర్ట్గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. – కమల్హాసన్ (పైడి జయరాజ్ అవార్డుగ్రహీత)ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలినంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్ రెడ్డిగారు గద్దర్ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్. చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.– ఆర్. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)ఏయన్నార్ అవార్డు అందుకోవడం ఆనందంముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్. ఏయన్నార్గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్బస్టర్స్. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా... నా స్టైల్ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్ ఫ్రెండ్ అంటుంటారు. నేను ఆయన లిటిల్ ఫ్రెండ్నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్ లివ్స్ ఆన్ . రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీయంగారు గత ఏడాది నాకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్ స్పీకర్. తెలంగాణ మూమెంట్ సమయంలో హౌస్ అడర్జ్న్డ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు.– ఏయన్నార్ అవార్డుగ్రహీత జయసుధఈ అవార్డు నాకో మోటివేషన్అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చె΄్పాలి. గద్దర్గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్’ సినిమాలో నేను పోషించిన తండేల్ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్ ఘట్టమనేని, శేఖర్ మాస్టర్, సుప్రీమ్ మాస్టర్, కార్తీక్ తీడ... ఇలా ‘తండేల్’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్. మీ అందరి ఎఫర్ట్స్ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’.– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్’)ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చిందిఅందరికీ హాయ్.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజు సార్లకు, హోల్ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్ రవీంద్రన్ కి థ్యాంక్స్. దీక్షిత్, ధీరజ్ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్కి థ్యాంక్స్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. – రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్ ఫ్రెండ్’)అవార్డు విజేతలుఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్)ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయిఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరాఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వాఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాంఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్ఉత్తమ బాలల చిత్రం – అనగనగనాఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్ )ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చంద్రకాంత్)ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ ) -
స్టోరీతో వస్తే రీల్తో వెళ్లేలా..
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. కేవలం స్టోరీతో సంప్రదిస్తే సినిమా పూర్తి చేసుకుని రీల్తో వెళ్లే విధంగా వెంట వెంటనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మా పరిశ్రమకు సమానంగా సినీ పరిశ్రమను గుర్తించామని, చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గురువారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆ నలుగురు చార్ మినార్ల వంటివారు.. ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. హైదరాబాద్ అంటే కేవలం ఐటీ హబ్, బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొక సినిమా హబ్కు కేరాఫ్ అడ్రస్. భారతీయ సినీ పరిశ్రమకు గమ్యస్థానంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్కు చార్మినార్లోని చార్ మినార్ల లాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ..ఈ నలుగురు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రామోజీరావు ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ప్రభాకర్రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు. ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచి్చనా ముందుండే దాసరి నారాయణరావును కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టే. గద్దర్ ఒక చైతన్యం.. ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషం. సినిమా అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. సమాజాన్ని చైతన్యపరిచేందుకు దీన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమా ద్వారా సందేశం అందించాలి..’అని సీఎం సూచించారు. సందేశాత్మక సినిమాలతో ప్రజల్లో మార్పు: డిప్యూటీ సీఎం ‘తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గద్దర్. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమే. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయి. అయితే గత పాలకులు 10 ఏళ్ల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారు..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. -
ప్రతి రైతుకు.. ఒక ఎకరానికి..!
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్కు గాను ‘రైతు భరోసా’కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి అదే వేదిక నుంచి ‘రైతుభరోసా’తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా మొదటి విడతలో.. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా ఒక ఎకరం లోపు విస్తీర్ణానికే సాయం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘రైతు బంధు’కింద 2018 జూన్ నుంచి గత వానాకాలం సీజన్లో ప్రారంభించిన ‘రైతు భరోసా’పథకం వరకు..దశల వారీగా మొదట ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, తర్వాత రెండెకరాలు, అంతకు మించి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగేది. ఈసారి ఆ విధానాన్ని మార్చి తొలి విడతలో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఒక ఎకరానికి రూ.6 వేలు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ కానుంది. తొలివిడతగా 73 లక్షల మందికి రూ.3,590 కోట్లు గత ఏడాది జూన్ 16వ తేదీన వానాకాలం సీజన్ రైతుభరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే 69.40 లక్షల మంది రైతులకు చెందిన 145.75 లక్షల ఎకరాల విస్తీర్ణానికి రూ.8,744.13 కోట్ల మొత్తాన్ని అందజేసింది. అందులో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు (13.54 లక్షల ఎకరాల సాగు భూమికి) రూ.812.63 కోట్లు చెల్లించారు. కానీ ఈసారి రైతులందరికీ ఎకరం లోపు విస్తీర్ణానికి సాయం అందించనున్నారు. ఈ విధంగా 73 లక్షల మంది రైతులకు సాయం అందిస్తుండగా.. ఇవ్వాల్సిన మొత్తాన్ని రూ.3,590 కోట్లుగా తేల్చారు. ఇలా చేయడం ద్వారా ప్రతిరైతుకు పెట్టుబడి సాయం అందిందనే తృప్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భావించినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక రెండో విడత కింద రూ. 2,650 కోట్లను ఏప్రిల్లో విడుదల చేస్తారు. మూడో విడత కింద మిగతా మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేయాలని నిర్ణయించారు. విస్తీర్ణంలోనూ మార్పులు రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి 1.50 కోట్ల ఎకరాలకు పైగానే ఉంటుందని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. అయితే ఇందులో వానాకాలం సీజన్లో పూర్తిస్థాయిలో సాగులో ఉన్న భూమి 1.30 కోట్ల ఎకరాలు. మిగతా భూమిలో మామిడి, నిమ్మ, దానిమ్మ, ఇతర ఉద్యాన తోటలు 12 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. మిగతా భూమి సాగులో లేకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అందింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సాగు చేసే భూములకు మాత్రమే సీజన్ల వారీగా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. కానీ రైతుల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంగా పాత పద్ధతినే కొనసాగించింది. గత జూన్లో మొత్తం 145.73 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. ఈసారి 73 లక్షల మంది రైతులకు మొత్తం రూ.8,881 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ నేపథ్యంలో ఈసారి రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. -
రైతు నామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని రైతు నామ సంవత్సరంగా మారుస్తామని వెల్లడించారు. గురువారం రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయాధారితంగానే మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా వ్యవసాయరంగ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేశామని.. రూ. 18 వేల కోట్లను రైతు భరోసా కోసం ఖర్చు చేశామని వివరించారు. ఈ నెల 22న మరో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. గతంలో రైతులను వేధించిన ధరణి భూతాన్ని పారదోలి భూభారతితో భూ సమస్యలు పరిష్కరించామని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది కొత్త పంచాంగాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పండితులు వేదాశీర్వాదం అందించారు. అనంతరం వేద పండితులు, ఆలయాల్లో సేవలందిస్తున్న కళాకారులను సన్మానించారు. ఈసారి మంచి వర్షాలే.. పరాభవ నామ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండి మంచి వానలు కురుస్తాయని.. ఫలితంగా తెలంగాణ వ్యవసాయ తల్లిగా ధాన్యాగారంగా మారుతుందని పౌరాణికులు, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి పేర్కొన్నారు. శ్రీ పరాభవ ఉగాది వేడుకల్లో ఆయన ప్రభుత్వపక్షాన పరాభవ నామ పంచాంగాన్ని చదివి గోచార వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆరోగ్య శాఖలో అద్భుత ప్రక్షాళన జరుగుతుందని.. ప్రజారోగ్యానికి సంబంధించిన చర్యలు, మెరుగైన వైద్య వసతి కల్పించడంలో సానుకూలత ఉంటుందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల పరంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అవలంభించకుంటే ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదొడుకులు తప్పవన్నారు. ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని.. రాష్ట్రానికి ఖర్చులు బాగా పెరుగుతాయని పేర్కొన్నారు. పరిపాలనలో రాజుకు, మంత్రులకు మధ్య ఆధిపత్యాలను కోరుకొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే ధర్మంగా ఉండేవారికి మాత్రం ఈ ఆధిపత్యంలోనూ విజయం లభిస్తుందని వివరించారు. తులారాశిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులే ఉన్నాయని.. నడుస్తున్న దశా బలం, గోచార బలం, సమర్థత, వబలం వల్ల సవాళ్లను అధిగమించి తిరుగులేని ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని సంతోషకుమార్ శాస్త్రి చెప్పారు. -
హైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా, బిర్యానియే కాదు.. దేశస్థాయిలో సినీపరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా రాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. జపాన్, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయని, అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డుల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ నలుగురే కారణంఈ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీపరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కృష్ణ.. ప్రధాన కారణం. సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేశారు. సినీపరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వాటిని పరిష్కరించి.. శాశ్వతంగా ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో నిలిపేందుకు కృషి చేశారు.సంతోషంబాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో మన సినీ పరిశ్రమను నిలబెట్టాయి. అలాంటి ఇండస్ట్రీ కోసం ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గతేడాది గద్దర్ పురస్కారాలను ప్రవేశపెట్టాం. వరుసగా రెండోసారి ఈ అవార్డులను అందించాం. ఈ కార్యక్రమానికి ఖుష్బూ, జయసుధ వంటి వారు రావడం సంతోషం. నాగచైతన్య, రష్మిక అందరూ యంగ్స్టర్స్. వీళ్లకు అవార్డులు ఇచ్చేందుకు వచ్చిన సీనియర్స్ అందరినీ అభినందిస్తున్నాను.సూచనహైదరాబాద్లో.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తుంది. ఆన్లైన్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతున్నాను. ఇకపోతే గద్దర్ ఒక ప్రజాయుద్ధ నౌక.. ఆయన పేరు కోట్లాదిమందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది.సమాజంలోని సమస్యలపై సినిమాఆయన గళం తెలియనివారు దేశంలో లేరు. గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి. అందుకే ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టాం. సినిమా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలి అని రేవంత్రెడ్డి మాట్లాడారు.అవార్డుల వేడుక'గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రాంచరణ్, ఖుష్బూ, నాగచైతన్య, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, టీచర్లు, లెక్చరర్లు, పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, నర్సు లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా దాదాపు 70 వేల ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు నిర్వహించి అర్హులకు నియామకపత్రాలను జారీ చేసి నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మెజార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రాలు పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు? ఎంతమంది ఉద్యోగాలను వద్దనుకున్నారు? అందుకు ప్రధాన కారణాలను గుర్తించేందుకు జీఏడీ పరిశీలన ముమ్మరం చేసింది. ఇలా ఇవ్వండి... ఉద్యోగ ఖాళీల భర్తీకి వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామకాల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అర్హత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు అర్హుల జాబితాలను సమర్పించడంతో నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. గడువులోగా రిపోర్టు చేయకుంటే సదరు ఉద్యోగావకాశాన్ని రద్దు చేయనున్నట్లు ఆయా అభ్యర్థులకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన జీఏడీ... ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి ఉద్యోగాల్లో చేరిన, చేరని వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగ కేటగిరీ, అర్హత సాధించిన అభ్యర్థి హాల్టికెట్ నంబర్, పేరు, జిల్లా/జోన్/మల్టీజోన్ కేటగిరీ, ఉద్యోగంలో చేరిన తేదీ, డిలీటెడ్ వేకెన్సీ తదితర వివరాలున్నాయి. ఉద్యోగంలో చేరకుంటే అందుకు గల కారణాన్నీ వివరించాలని సూచించింది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో వారంతా మెరుగైన పోస్టును ఎంచుకున్నారు. ఇలాంటి వారి వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వాలని చెప్పింది. ఈ సమాచారాన్ని అందించేందుకు ఆయా శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ఖాళీలపై స్పష్టత ఎంతమంది కొలువుల్లో చేరారో తెలుసుకునేందుకు జీఏడీ ఒకవైపు చర్యలు చేపట్టగా... మరోవైపు శాఖల వారీగా ఖాళీల వివరాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో రెండు అంశాలకు వేర్వేరుగా సమాచారాన్ని ఆయా శాఖలు సిద్ధం చేశాయి. ఇటీవల జీఏడీ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరికలకు సంబంధించి సమీక్షలు కూడా జరిగాయి. నియామకపత్రాలు అందించిన వాటిలో అన్ని కేటగిరీల్లో రిపోర్టింగ్ గడువు ముగిసింది. వచ్చే సోమవారం కల్లా ఆయా శాఖలు వివరాలను అందించాల్సి ఉంటుంది. గ్రూప్–1 కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తయింది. ప్రభుత్వం పలు ఆటంకాలను అధిగమించి ఒకేసారి 563 ఉద్యోగాలను భర్తీ చేసింది. తొలి నోటిఫికేషన్ కావడం... అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం టీజీపీఎస్సీ పరపతికి గీటురాయిగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భర్తీ చేసిన గ్రూప్–1 ఉద్యోగాల్లో ఎంతమంది అభ్యర్థులు చేరారనే అంశంపై కమిషన్ కూడా ఆయా శాఖలకు ప్రత్యేక ఫార్మాట్ పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
లూటీకి సహకరిస్తున్న అధికారుల తోకలు కత్తిరిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తామంటూ తమ పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరిట సీఎం చేస్తున్న దోపిడీకి సహకరిస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. శాసనసభ లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం చాంబర్లో కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి అందరి అభిప్రాయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం వచ్చిందని, డీపీఆర్ పూర్తయిందని సీఎం, మంత్రులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డీపీఆర్ పూర్తయినట్లు సభలో ఆధారాలు చూపకపోతే అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. 3,297 ఎకరాల భూ సేకరణ, 10 వేల నిర్మాణాలపై ప్రభావం చూపుతుందని నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. అసెంబ్లీలో మాత్రం 1,400 నిర్మాణాలు ఉన్నాయని మాత్రమే చెప్తోందన్నారు. బ్లాక్ లిస్ట్లో మూసీ కాంట్రాక్టు సంస్థ ‘మూసీ పరిసరాలను సుందరీకరణ చేయడం మినహా ప్రభుత్వం చేసేదేమీ ఉండదు. మధు రిడ్జ్ పార్కువాసులపై వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సీఎం ఇతర నిర్వాసితులనూ అదే రీతిలో ఎందుకు చూడటం లేదు. మూసీ ప్రాజెక్టు అప్పగించిన మెయిన్హార్ట్ కాంట్రాక్టు సంస్థను సింగపూర్, పాకిస్తాన్తోపాటు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్లాక్ లిస్టులో పెట్టింది. బఫర్జోన్లో 50 మీటర్లు దాటి ఎక్కడో 5 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్నగర్ వాసులకూ నోటీసులు ఇస్తున్నారు.పలువురు మంత్రులు, సీఎం సోదరుడు, పలువురు నేతల ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. నార్సింగి, మంచిరేవుల వరకు మూసీ బఫర్లో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అంటే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అనే విమర్శ ఉంది. హైదరాబాద్లో ఏవీ రెడ్డి, కొండల్రెడ్డి, అనిల్రెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు ముఠాగా ఏర్పడి రిటైర్డ్ అధికారుల అండతో భూ దందా సాగిస్తున్నారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేదు.. ‘సీఎంకు, మంత్రులకు పాలనపై పట్టులేదు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మంత్రులకు అధికారులు బిజినెస్ రూల్స్ చెప్పాలి. ఐటీ రంగం కుప్పకూలితే హైదరాబాద్లో ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటాయి. ఫ్యూచర్ సిటీ పేరిట ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 14 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఫార్మా భూముల్లో ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, జడ్జీలు, జూ పార్కులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తోంది’అని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు ‘అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు. మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధాటిని తట్టుకోలేక అసెంబ్లీ ఎందుకు పెట్టామా అని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. రేవంత్ మమ్మల్ని దూషిస్తున్నా స్పీకర్ ఖండించే పరిస్థితి లేదు. అలాంటపుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్ విధించాం. ఆయన నుంచి సమాధానం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరికపై ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదు’అని కేటీఆర్ వెల్లడించారు. -
నిబంధనల ప్రకారమే బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్తో పాటు ఇతర నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొందరు స్టేషన్ బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్ బెయిల్ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదు... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకతో భేటీలు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
వారు అహంకారం ప్రదర్శించారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి విశిష్ఠ ప్రణాళిక అని అన్నారు. ప్రతిపక్షం ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, హుందాగా ప్రవర్తించకుండా అహంకారం ప్రదర్శించిందని అన్నారు.‘ఎన్నో త్యాగాల ఫలితం మన దేశ స్వాతంత్య్రం. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘపోరాటంతో స్వాతంత్య్రం వచ్చింది. పేదవాడికి బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదు. అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే ప్రతిపక్షం అహంకారం చూపిస్తోంది. 4 కోట్లమంది ప్రజలను నిరాశపర్చేలా విపక్షాల తీరు ఉంది. అధికారం పోయినా రాచరిక పోకడలు పోలేదు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వాళ్ల తీరు మారలేదు. కొందరు తమను తాము రాజులనుకుంటున్నారు. ఇప్పటికీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ‘దేవుళ్ల కాలం నుంచే మారీచుల రూపంలో అడ్డంకులు సృష్టించే వారు ఉన్నారు. చెరువులు, నాలాలు, ఫుట్పాత్లను కబ్జాల నుంచి కాపాడుతున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. అందుకే హైదరాబాద్ను కాలుష్యం, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. -
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
అన్నదాతకు భరోసా
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
అధికారం పోతే.. అందరికీ పోతుంది
సాక్షి, హైదరాబాద్: ‘అధికారంలో ఉంటేనే అందరికీ గౌరవం ఉంటుంది. అధికారం పోతే ఏ ఒక్కరిదో పోదు. అందరికీ పోతుంది. నన్ను అనలేదు కదా అని ఏమీ మాట్లాడకుండా ఉంటే అందరం నష్టపోతాం. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు. వ్యవస్థ మొత్తం డ్యామేజీ అవుతుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ లైన్లోనే అందరూ స్పందించాలి. ఇప్పుడు మనం వేసుకునే రోడ్మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్లపాటు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు చెప్పుకున్నామని, ఇప్పుడు ఆ టైం అయిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పుకునే సమయం వచ్చిందని, చేసింది చెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సోమవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశ మందిరంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వ పరంగా సమష్టిగా ముందుకెళ్లాల్సిన తీరును వారికి వివరిస్తూనే వ్యక్తిగత వ్యవహారశైలిపైనా ఆయన క్లాస్ తీసుకున్నారు. జీవిత లక్ష్యం వృధా చేసుకోవద్దు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు గురించి రేవంత్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా మీరు చట్టసభలకు వచ్చారు. కానీ ఆ పదవికి న్యాయం చేయనప్పుడు ఎందుకు? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీనియర్లు ఉండేవారు. నాకు మాట్లాడటానికి మైక్ ఇచ్చేవారు కాదు. అయినా కొట్లాడి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు సభకు కూడా రావడం లేదు. వచి్చనా సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే ఎందుకు కావాలి? కొందరు సీఎల్పీ సమావేశానికి కూడా రాలేదు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా? కష్టపడి సాధించుకున్న ఎమ్మెల్యే పదవికి అన్యాయం చేయొద్దు. సభకు రాకపోయినా, ఏం చేసినా ఏం కాదులే అనుకోవద్దు. ఇప్పటికిప్పుడే ఏమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. బీఫారం ఇచ్చేటప్పుడు అన్ని లెక్కలూ చూస్తారు’అని చెప్పారు. సమర్థవంతంగా తిప్పికొట్టాలి అసెంబ్లీ, మండలిలో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించా రు. బాగా చదువుకున్న మహిళా ఎమ్మెల్యేలున్నారని, వారంతా సభకు హాజరు కావడమే కాకుండా చర్చల్లో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను గవర్నర్ ప్రసంగంలో వివరించారని సీఎం చెప్పారు. ఈ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. మన భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించాలి. మూడో బడ్జెట్తోపాటు మిగిలిన సంవత్సరాల బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ప్రజారంజకంగా ఉండబోతున్నాయి. ఈ విషయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలి. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాల ను అధ్యయనం చేయాలి. అవసరమైతే చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకూ వెళ్లి రావాలి’అని దిశానిర్దేశం చేశారు. మంత్రులు సమయం ఇవ్వాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలుగా తాము మంత్రులు, అధికారులకు ఇచి్చన వినతులకు సరిగా స్పందన ఉండడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలకు మంత్రులతోపాటు సీఎం టైం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మంత్రులు తమను కలిసేందుకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వా లని సూచించారు. తాను కూడా ఇస్తానని చెప్పారు. ఏదో ఒక సమయం ఇందుకోసం ఫిక్స్ చేసుకోవాలని, ఎమ్మెల్యేలిచ్చే వినతిపత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తన దగ్గరకు వచి్చ న ఎమ్మెల్యేలే మళ్లీ వచ్చి కలుస్తున్నారని, అలా కలవడం ఎందుకని ప్రశ్నించారు. ప్యానెల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ బాగా హ్యాండిల్ చేస్తున్నారని కొనియాడారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్లు పట్టిందని, అంత కష్టపడితే లభించిన పదవికి అడ్లూరి లక్ష్మణ్తో సహా అందరు ఎమ్మెల్యేలు న్యాయం చేయాలని సూచించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీడియాతో చిట్చాట్లు చేయొద్దని, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడవద్దని చెప్పినట్టు తెలిసింది. విలేకరులు అడిగే ప్రశ్నలు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రేమతో కాదని, వార్తల కోసం మాత్రమే వారు ప్రశ్నలు అడుగుతారని చెప్పినట్లు సమాచారం. అబద్ధాలను తిప్పికొట్టండి: పీసీసీ చీఫ్ గత రెండేళ్లలో ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేశామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిప క్షాల అబద్ధపు ప్రచారాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని సీఎల్పీ అభినందించింది. -
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. టి20 ప్రపంచకప్లో భారత జట్టు టైటిల్ సాధించిన తర్వాత తిలక్ వర్మ సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా తిలక్ను జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలుసుకున్న సీఎం రేవంత్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఇదే కార్యక్రమంలో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ను కూడా సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం
-
తెలంగాణలో IAS-IPSల కొరత
-
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అధికార పక్షంవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న కాలే యాదయ్యఅసెంబ్లీలో ఆసక్తికర పరిణామంఅసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామంBJLP చాంబర్ లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్అదే సమయంలో బయటికి వెళ్తూ గమనించిన కేటీఆర్సస్పెండ్ అయిన వ్యక్తి BJLPలోకి ఎలా అంటూ సెటైర్ వేసిన కేటీఆర్BJLP నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా అన్న కేటీఆర్మీరు కూడా BJLP చాంబర్లోకి రండి అంటూ ఆహ్వానించిన పాయల్ శంకర్నేను వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన కేటీఆర్ తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదాతెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్.వందేమాతరం గీతం అసెంబ్లీలో ప్రదర్శించినందుకు వాకౌట్ముగిసిన గవర్నర్ ప్రసంగం.. తెలంగాణ శాసనసభలో ముగిసిన గవర్నర్ స్పీచ్.గంట పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో సాగిన ప్రసంగం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం.రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది.క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు.రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం.2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా.జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం.హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.హైడ్రా ద్వారా 60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.23వ బయోఆసియా సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది.సేవారంగం 13.5 శాతం వృద్ధితో దోహదపడుతోంది.జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారింది.ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్య స్థానంగా కొనసాగుతోంది.ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది.వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించాం. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నిరసన.జూట్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ప్రసంగంలో పథకాల అమలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జూట్ అంటూ నిరసన.గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉభయ సభలను ఉద్దేశించి మొదలైన గవర్నర్ ప్రసంగంతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంతెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు.అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి.కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ.మధ్యాహ్నం రెండు గంటలకు బీఏసీ సమావేశం.పని దినాలు, అజెండాపై బీఏసీలో చర్చ. అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. గన్పార్క్కు బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలురైతులకు వెన్నుపోటు.. రాహుల్కు వెయ్యి కోట్లు అంటూ నినాదులురాహుల్ బందు కాదు.. రైతుబందు కావాలి అంటూ నినాదులుఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ప్లకార్డులతో నిరసనకాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు. అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు..తెలంగాణ శాసనసభలో మారిన పలువురు మంత్రుల చాంబర్లు.లాబీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు మంత్రుల చాంబర్లను షిఫ్ట్ చేసిన అధికారులు.మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్కు తరలింపు.ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి సీతక్క చాంబర్ మార్పు.సీతక్క చాంబర్ను మంత్రి తుమ్మలకు కేటాయింపు.సీతక్కకు సీపీఐ ఛాంబర్ పక్కన బ్యాక్ సైడ్ కేటాయింపు.చాంబర్ల మార్పు స్పీకర్ నిర్ణయం అంటున్న అసెంబ్లీ అధికారులు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..తెలంగాణ శాసనసభ నిబంధనలపై బులిటెన్ విడుదలఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభంఎమ్మెల్యేలు గేట్ నెం.2, గేట్ నెం.4 ద్వారా ప్రవేశంవాహనాలపై అసెంబ్లీ కార్ పాస్ తప్పనిసరిగేట్ నెం.1, 2, 4 వద్ద వాహనాల సెక్యూరిటీ చెకింగ్స్వయంగా నడిపే వాహనాలకు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతిడ్రైవర్తో వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ఎమ్మెల్యేలు ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధంఅసెంబ్లీ లోపల మొబైల్తో ఫొటోలు, వీడియోలు నిషేధంస్పీకర్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిషేధంఅసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, నిరసనలు పూర్తిగా నిషేధంసమావేశం జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వినియోగం నిషేధంటీ/లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వినియోగంఅసెంబ్లీ లాబీల్లో అధికారిక ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతిమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు లోపల లాబీల్లో ప్రవేశం లేదుమండలి చైర్మన్ కీలక ఆదేశాలుతెలంగాణ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో చైర్మన్ కీలక ఆదేశాలుఉదయం 11:45కి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 26వ సెషన్ ప్రారంభంకౌన్సిల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ నిషేధంఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం నిషేధంనినాదాలు, ప్రసంగాలు చేయడం నిషేధంప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధంఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదుచైర్మన్ అనుమతి లేకుండా మొబైల్, ల్యాప్ టాప్లలో వీడియోలు లేదా ఫొటోలు చూపరాదుకౌన్సిల్ ప్రాంగణంలో సభ్యులు సందర్శకులను తీసుకురావద్దని ఆదేశంకౌన్సిల్ లోపలికి సభ్యుల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదుసభ్యులు తమ సెక్యూరిటీ సిబ్బందిని బయటే ఉంచాలని సూచనకార్ పాస్ తప్పనిసరిగా వాహనం ముందు ప్రదర్శించాలిసభ్యుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్ ఏర్పాటుసభ్యుల పీఏలు తమ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మైనారిటీలకు పెద్దపీట మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత షబ్బీర్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. సేవా భావానికి ప్రతీక రంజాన్ రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
నగరంలో నయా ప్రపంచం
నిజాం నగరంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుంది. కుతుబ్ షాహీ కాలంలో అభివృద్ధి చెందిన భాగ్యనగరంలో మూసీ నది నీటిని తాగునీటితోపాటు వ్యవసాయం, వర్తకానికి వినియోగించేవారు. 300 ఏళ్లకుపైగా చరిత్రగల మూసీ భాగ్యనగరికి వెన్నెముకగా నిలిచింది. కానీ కాలక్రమేణా పట్టణీకరణ, ఆక్రమణలు, మురుగు, వ్యర్థాల పారబోత, నిర్లక్ష్యం తదితర కారణాలతో జీవం కోల్పోయిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత తరుణంలో మూసీ పునరుద్దరణ ఒక ఎంపిక కాదు ఆవశ్యకతగా మారింది. ప్రభుత్వం మూసీని ఆర్థిక, సాంస్కృతిక, విద్య, పర్యాటక, వినోద రంగంగా అభివృద్ధి చేయనుంది. మాస్టర్ ప్లాన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేసింది. మూసీ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ మేరకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. – సాక్షి, హైదరాబాద్ఐదు జోన్ల అద్భుతం.. తొలిదశలో ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 55 కి.మీ. మేర మూసీ అభివృద్ధి జరుగుతుంది. ఎకోలాజికల్, హెరిటేజ్, ఫ్యూచర్ జోన్ వర్గాలవారీగా వాటిని అభివృద్ధి చేస్తారు. నది ప్రక్షాళనలో భాగంగా మూసీలో పేరుకుపోయిన పూడికతీత, చెత్త తొలగించి హైడ్రాలజీ అధ్యయనంతో నదీ గర్భానికి రూపకల్పన చేసి పరిధులను నిర్ణయిస్తారు. వరదల నివారణ, నదీ తీర వాలు స్థిరీకరణ చేస్తారు. అలాగే నదీ తీరం ఇరువైపులా రహదారుల నిర్మాణం, ప్రధాన మురుగునీటి పైప్లు, ఇరువైపులా వర్షపు నీటి కాలువలు, నాలాల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, బ్యారేజీల వంటి నీటి నిల్వ నిర్మాణాలతో నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తారు. తొలిదశ అభివృద్ధి పనులకు రూ. 6,500 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.ఈస్ట్–వెస్ట్ కారిడార్..మూసీ నది నగరంలో పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలోని గండిపేట నుంచి గౌరెల్లికి ప్రయాణించాలంటే.. ఔటర్ నార్త్ మీదుగా 91 కి.మీ., లేదా ఔటర్ సౌత్ మీదుగా అయితే 69 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలా కాకుండా వెస్ట్ టు ఈస్ట్ మార్గంలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ప్రయాణ దూరం 43 కి.మీ.కి తగ్గిపోనుంది. దీంతో ప్రధాన నగరంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రయాణ సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ కారిడార్ బుద్వేల్ వద్ద మొదలవుతుంది. నెల రోజుల్లో డీపీఆర్ తయారు కానుంది. మూసీని సాంస్కృతిక వారధిగా అభివృద్ధి చేస్తారు. మంచిరేవుల వద్ద హిందూ దేవాలయం, పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, నాగోల్ వద్ద చర్చిని నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్.. మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేస్తారు. ఇది మొత్తం 200 ఎకరాల్లో ఉంటుంది. అందులో 123 అడుగుల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’గాంధీ విగ్రహంతోపాటు చేనేత శిక్షణాæ కేంద్రం, విద్య, జ్ఞాన కేంద్రం, మెడిటేషన్, వెల్నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియం, కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ల వంటివి ఉంటాయి.మూసీ చుట్టూ ఎస్టీపీలు.. ప్రస్తుతం బాపూఘాట్, పురానాపూల్, అఫ్జల్గంజ్, గోల్నాకా వంటి మూసీ పరీవాహక ప్రాంతాల చుట్టూ 25 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)ఉన్నాయి. ఇవి 772 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేస్తున్నాయి. మరో 27 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. ఇవి 1,106 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేస్తాయి. ఇక అమృత్ స్కీమ్ కింద మరో 39 ఎస్టీపీలను నిర్మించనున్నారు. వాటితో 972 ఎంఎల్డీ మురుగునీరు శుద్ధి అవుతుంది. ఈ ప్రతిపాదిత ఎస్టీపీలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు నిర్మితమవుతాయి. ఉస్మాన్సాగర్ మార్గంలో నార్సింగి, తారామతి, హైదర్షాకోట వద్ద, అలాగే హిమాయత్సాగర్ మార్గంలో అత్తాపూర్ వద్ద భూగర్భ ఎస్టీపీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే అత్తాపూర్, అంబర్పేట, నాగోల్లలో మూసీ బఫర్ జోన్లోని ప్రధాన ఎస్టీపీ స్థానాలలో మూడు బ్యాలెన్సింగ్ గ్రే వాటర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, డేటా సెంటర్ల వంటి పరిశ్రమ అవసరాలకు తక్కువ ధరకు అంటే సుమారు కిలోలీటర్ నీటిని రూ. 70–80 చొప్పున సరఫరా చేస్తారు. అలాగే నగరంలోని పార్క్లు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు మూసీపై 14 వంతెనలను నిర్మిస్తారు. అందులో 9 కొత్తవి కాగా.. 5 అప్గ్రేడెడ్ బ్రిడ్జీలు. నీటి నిల్వ కోసం మూడు బరాజ్లు కడతారు.బఫర్లో ఏముంటాయంటే.. నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇందులో విహార ప్రదేశాలు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్లు, పార్క్లు, సీటింగ్ ప్రాంతాలు, వీక్షణ డెక్లు, యాంఫీ థియేటర్లు, ప్లాజాల వంటివి ఉంటాయి. అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు, అనుసంధాన రోడ్లతోపాటు ఇంటర్సెప్టర్ మురుగు కాలువలు, వరదనీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తారు. ఇందులో నివాసాల వంటి ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టకూడదు. ఇక మూసీలో 24/7 మంచినీరు ప్రవహించేలా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం కేటాయించారు. ఔటర్ రింగ్రోడ్ వెంబడి అనుసంధానం కానున్న గోదావరి నదీ అనుసంధాన ప్రాజెక్టు నుంచి ఈ నీటిని సేకరిస్తారు. విదేశాల్లోని నదీ తీర ప్రాంతాలిలా..ప్రపంచ దేశాల్లోని నదీ తీర ప్రాంతాలన్నీ పునరుజ్జీవంతో కొత్త ఆర్థిక రూపును సంతరించుకున్నాయి. గుజరాత్లోని సబర్మతి సహా దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చెయోంగ్యెచియోన్, లండన్లోని థేమ్స్, ఫ్రాన్స్లోని సీన్, టోక్యోలోని సుమిదా, సింగపూర్ రివర్ఫ్రంట్ తదితర నదీ తీర నగరాలన్నీ ఇలా అభివృద్ధి చెందినవే. దీంతో ఆయా దేశాల్లోని అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ఏడాదిన్నరపాటు అధ్యయనం చేసి మూసీ పునరుజ్జీవానికి సంకల్పించారు. వివిధ దేశాల్లో నదీ తీరాల అభివృద్ధి ఇలా.. ⇒ సియోల్లోని చెయోంగ్యెచియోన్ నదీ తీరం మీదుగా సాగే 5.8 కి.మీ. ప్రవాహ మార్గాన్ని అభివృద్ధి చేయగా రోజుకు 50 వేల మంది సందర్శకులు వస్తున్నారు. నదీ తీర అభివృద్ధితో 9 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. గత పదేళ్లలో 190 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ⇒ లండన్లోని థేమ్స్ నది 39 కి.మీ. పునరుద్ధరించగా.. రోజుకు 27 వేలకుపైగా సందర్శకులు వస్తున్నారు. 2.98 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సుమారు లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ⇒ టోక్యోలో 23.5 కి.మీ. మేర సుమిధ నదీ తీర అభివృద్ధితో 67.14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రోజుకు 1.5 లక్షల మంది సందర్శకులతో ఏటా సుమారు 300 మిలియన్లకుపైగా పర్యాటకుల కేంద్రంగా మారింది. ⇒ 3.2 కి.మీ. మేర విస్తరించిన సింగపూర్ రివర్ఫ్రంట్ అభివృద్ధితో ఏటా 23.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 40 వేలకుపైగా సందర్శకులతో ఏటా 16.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ⇒ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 29 కి.మీ. మేర ప్రవహించే సీన్ నదీ అభివృద్ధితో పారిస్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ద్వారా 30 శాతం ఆదాయం సమకూరుతోంది. ఏటా 40 మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. అలాగే 7.4 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. ⇒ గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలిదశ కింద సబర్మతి నదిని 11.5 కి.మీ. మేర సుందరీకరించారు. ఫలితంగా నిత్యం 7 వేల మందికిపైగా సందర్శకులు వస్తున్నారు. అలాగే 85 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. రెండో దశ కింద మరో 13 కి.మీ. మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. -
పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ‘మూసీ ఇన్వైట్’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటూ అసత్యాలు ‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావులు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీలు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాదనతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీటర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు. సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్కు ఉంది. కానీ బాపూఘాట్ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం. అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్ఆర్ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్గా మారుతుంది. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
-
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
-
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
హాలీవుడ్తో పోటీ పడదాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా హాలీవుడ్తో పోటీ పడాలని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మన సినిమా లు బాలీవుడ్తో పోల్చుకునే వారిమని, కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పు డు మన సినిమాలు కేవలం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నాయని, అంతటి ప్రమాణాలతో తెలుగు సినిమా అభివృద్ధి చెందిందన్నారు. కోకాపేట్లో నిర్మించిన అల్లు అర్జున్ థియేటర్ ఆఫ్ అల్లు సినిమాస్ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.‘తెలుగు సినీ పరిశ్రమ దేశంలో ముందువరుసలో ఉంది. అత్యంత ఉత్తమ చిత్రాలను మన పరిశ్రమ నిర్మిస్తోంది. బాహుబలి, కలి్క, అరుంధతి లాంటి సినిమాలు టాలీవుడ్కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఆ సినిమాలు నిర్మించారు. కలెక్షన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీగా నిలిచాయి. సినిమా రంగం సాంకేతికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు వస్తున్నా యి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ధియేటర్ నిర్మించారు. నేను సినిమా అభిమానిని. అందులోనూ కృష్ణ అభిమానిని. కాలేజీ రోజుల్లో మా ప్రాంతంలో సినిమా థియేటర్లు లేవు. వనపర్తి, కర్నూలుకు వెళ్లి సినిమా చూసేవాడిని. లారీఎక్కి సినిమాలు చూశాను. నటుడు కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పు డు ఐదారేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. సినిమా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.సినిమాల్లో కథ, కథనం ఆధారంగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్టీ ఆర్ అక్కినేని, రామానాయుడు లాంటి వాళ్లు తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. కానీ నటుడు కృష్ణ మాత్రం సాహసాలు చేసారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుంది. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీ మాదిరిగా సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మన సినిమాలు హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు. కేవలం టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.’అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్, నటుడు అల్లు అర్జున్, అల్లు వెంకట్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. -
Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్: అల్లు అర్జున్
హైదరాబాద్లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.అల్లు అరవింద్ను టెక్నాలజీ పయనీర్గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్ను హైదరాబాద్కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు హాలీవుడ్ను రప్పించాలనే తన కల నెట్ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు, దిల్రాజు, రానా, సంజయ్జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
1.15 కోట్ల కుటుంబాలకు బీమా
సాక్షి, హైదరాబాద్/మణికొండ: రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించి, ఆరోగ్య భద్రత అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ 25వ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సంపూర్ణమైన విద్య అందిస్తే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పథకాల అవసరం ఉండదు. 2006లో రాజీవ్ ఆరోగ్య శ్రీ వచ్చింది. 20 ఏళ్లలో కోట్లాది మందికి వైద్య సేవలందించాం. ఈ డేటాను ఎనాలసిస్ చేస్తాం. ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయనేది స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్లు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 4 కోట్ల మంది ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి డేటాబేస్ డిజిటల్ కార్డును సిద్ధం చేస్తాం. పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాం. మెడికల్, ఫార్మా, డ్రగ్స్ హబ్గా హైదరాబాద్ మారింది’అని చెప్పారు. విద్యార్థులకు రవాణా సదుపాయం ‘రా్రష్తంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21 లక్షల మంది విద్యార్థులున్నారు. కేవలం పాఠశాలకు వెళ్లి చదువుకునే విధానం తల్లిదండ్రులకు సంతృప్తినివ్వడం లేదు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కేవలం 6.5 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నట్లు మా సర్వేలో తేలింది. విద్యతోపాటు స్కిల్ అవసరం. స్కిల్ లేకుంటే ప్రపంచంతో పోటీపడలేం. నర్సరీ నుంచి 12 వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నాం. ఎడ్యుకేషనల్ రిఫారŠమ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న ఇంటర్మీడియెట్ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి రద్దు చేస్తాం. నర్సరీ నుంచి 12 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తెస్తాం. వివిధ పాఠశాలలను ఒక దగ్గరకు తెస్తాం. ప్రైవేటు స్కూల్స్ సక్సెస్ స్టోరీ.. రవాణానే. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచితంగా, లేదా 50 శాతం రాయితీతో ప్రభుత్వమే విద్యార్థులను పాఠశాలకు తరలిస్తుంది. మేము ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)గా మార్చాం. సీఎస్సార్ కింద పదేళ్ల పాటు టాటాసన్స్ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. రూ.2,400 కోట్ల బడ్జెట్లో 2,100 కోట్లు టాటాసన్స్ భరిస్తుంది. భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలలనూ ఈ కోవలోకి తెస్తాం. ప్లేట్లో ఆహారం వడ్డిస్తే అది ఎన్ని కేలరీలు ఉంటుందో తెలిపే యాప్ ఉంది. దాన్ని వాడుకుంటాం’అని రేవంత్రెడ్డి చెప్పారు.బ్లూ కలర్ జాబ్స్కు సిద్ధం కండి‘వైట్ కాలర్ జాబ్లో వచ్చే గ్యాప్ను భర్తీ చేయడానికి బ్లూ కలర్ జాబ్కు ప్రిపేర్ కావాలి. దీన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. మొదటి దశలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తీసుకున్నాం. రెండో దశలో సేవారంగం తీసుకున్నాం. ఇప్పుడు తయారీ రంగంపై దృష్టిసారిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి హెల్త్ టూరిజంలో తెలంగాణకు 8–10 లక్షల మంది, ఇతర దేశాల నుంచి 2.10 లక్షల మంది వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నెలల్లో రూ.1,800 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం. 10 వేల బెడ్ ఆసుపత్రులుగా ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్, వరంగల్ టిమ్స్, నిమ్స్ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సంవత్సరంలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. మిగతా 11 నెలలు మీరు పనిచేస్తున్న సంస్థలు, కుటుంబం కోసం పనిచేయండి. దీనికి ఒక ప్లాట్ఫాం క్రియేట్ చేస్తున్నాం. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త పాలసీతో మీ ముందుకొస్తాం’అని రేవంత్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్యాదవ్, రఘువీర్రెడ్డి, సీపీ సజ్జనార్, మెడికవర్ ఆసుపత్రి చైర్మన్ అనిల్కృష్ణ తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు (ఫోటోలు)
-
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం.. వీడియో
‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు. -
నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
జిల్లా కేంద్రాల చుట్టూ రింగురోడ్లు : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటికీ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. జిల్లా కేంద్రాలైన ప్రధాన పట్టణాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా ముందుకు సాగేందుకు రింగురోడ్లు దోహదం చేస్తాయని అన్నారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న రోడ్లను అనుసంధానించి రింగురోడ్లుగా మార్చాలని, ఆయా పట్టణాల నుంచి రింగురోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. సమీపంలోని జాతీయ రహదారులకు రింగురోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు కొత్తగా రోడ్డు నిర్మించే అంశంపై కూడా అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీలను వేగంగా పూర్తి చేసి, అవసరమైన కొత్త వాటి కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఈవీల వినియోగం పెంచాలి.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నుంచి ప్రభుత్వ వినియోగం కోసం కొనే వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని స్పష్టం చేశారు. ‘క్యూర్’ పరిధిలో అద్దెకు తీసుకునే ప్రభుత్వ వాహనాలు కూడా అవే ఉండాలని చెప్పారు. రవాణా శాఖలో ఇక అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే సాగాలని ఆదేశించారు. కార్యాలయాలన్నీ సొంత భవనాల్లోనే ఉండాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో ఆధునిక బస్ టెర్మినల్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మించాలని, ఇందుకు స్థలం కేటాయిస్తామని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్ది, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ఆయన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. తెలుగులో ప్రమాణం గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయనకు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసినట్టు లోక్భవన్ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చార్మినార్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నేడు కొత్త గవర్నర్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారు. గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. -
పోలీసింగ్ మారాలి : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాలక్రమేణా నేర స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా వంటి భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా పోలీసింగ్లోనూ మార్పులు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీసుల వైపేనని, ఏళ్లుగా ప్రజల్లో పోలీసులు పెంచుకున్న విశ్వాసం అలాంటిదన్నారు. అయితే, పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని సీఎం హెచ్చరించారు. మారుతున్న సాంకేతికత, నేరాలకు తగ్గట్టుగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్గ్రేడ్ కావాలని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్– 2026 కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులనుద్దేశించి రేవంత్రెడ్డి ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... శాంతిభద్రతలు బలంగా ఉండాలి.. అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాల్లోనే పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలోనూ శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దేశం వందేళ్ల స్వాతంత్య్రదిన వేడుకల నాటికి తెలంగాణ సాంకేతికంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. అందుకు కొత్త విధానాలు తెస్తున్నాం. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి. అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కేవలం 24 గంటల్లో 2 సెం.మీ.వర్షపాతానికి తట్టుకునేలా అన్ని వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ, కోవిడ్ తర్వాత రెండు మూడు గంటల్లో 40 సెం.మీ.వర్షం వచ్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గుట్టుగా అన్ని వ్యవస్థలు మార్చుకోవాలి. సమస్యను అర్థం చేసుకోవాలి.. పోలీసు విధుల్లో నిరంతరం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉటుంది. ఎన్నో సమస్యలు పరిష్కరించాలి. అయితే సమస్య పరిష్కారంలో వేగంగా పరిగెత్తితే అది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. సమస్యలను అర్థం చేసుకుంటే 50 శాతం పరిష్కారం దొరుకుతుంది. సమస్యను అర్థం చేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందికి తగిన సమయం ఇవ్వండి. అధికారుల విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా వాళ్లకు డ్యూటీలు ఇస్తే మరింత రాణించే అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదికన క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా పోలీసులపై పనిభారం, ఒత్తిడి తగ్గించేలా సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలి. ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి సంస్థలు తమ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నాయి. కూబింగ్ పోయింది కాబట్టి గ్రేహౌండ్స్లో ఉన్న సిబ్బందిని మరోచోట వాడుకోవాలి. విచారణలో సేకరిస్తున్న సమాచారాన్ని ఐసీసీసీలో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయండి. పోలీసులను ఏ, బీ, సీగా వర్గీకరించుకున్నా.. పోలీసు అధికారుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దాని ఆధారంగా వాళ్లను నేను ఏ, బీ, సీ కేటగిరీల్లో వర్గీకరించుకుని పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే నేను వారికి పోస్టింగ్స్ ఇస్తున్నా. ఈ విషయంలో నేను కరెక్ట్ లేదా తప్పు కావొచ్చు. ఈ రెండేళ్లలో ఎలాంటి ఫైరవీలు లేకుండా 90 శాతం మందికి ఇలానే పోస్టింగ్లు ఇచ్చాం. టీవీల్లో వచ్చే వరకు కూడా ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో తెలియలేదు. పోలీసింగ్లో మార్పులు, నూతన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏటా డిసెంబర్లో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ నిర్వహించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించుకోవచ్చు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్, ఇతర సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై విశ్లేíÙంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ నియమిస్తాం. అందరికీ పోస్టింగ్లు వచ్చాయి: డీజీపీ శివధర్రెడ్డి 2001–02లో అప్పటి డీజీపీ హెచ్జే దొర ఆఫీసర్స్ రిట్రీట్ ను ప్రారంభించారని, 24 ఏళ్ల తర్వాత ఆ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించినట్టు డీజీపీ బి.శివధర్రెడ్డి తెలిపారు. గతంలో రెండు మూడేళ్లపాటు కూడా ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లు లేకుండా చీఫ్ ఆఫీస్లో ఉండేవారని, అయితే గత రెండేళ్లలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ పోస్టింగ్లు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు అని చెప్పారు. భవనాలు, రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ, పోలీసులు, రవాణాశాఖ అధికారులు కలిసి పనిచేస్తే ట్రాఫిక్ పరమైన సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీ పోలీస్ అకాడమీ మ్యానువల్ను రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ స్ట్రెంథెనింగ్ యూనిట్ ఏర్పాటుపై టీజీపీఏ, యూనిసెఫ్ల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్
-
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్లెట్స్ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. -
మహిళల భద్రత అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్ విత్ హర్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డీజీపీ బి.శివధర్రెడ్డి, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు. డిజిటల్ క్రైం పెరిగింది.. ‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్ విత్ హర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!
(సాక్షి, హైదరాబాద్) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్ మింటన్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. సంరక్షణలో అనేక సవాళ్లుభవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్గా నిలిచింది. లైమ్ మోరా్టర్ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. ప్రధాన సభా మందిరంలోనూ.. భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్ ఆర్చ్ నిర్మాణం బయటపడింది. హాల్లోని గోడలపై పూసిన ఎనామెల్ పెయింట్ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. కోరింథియన్ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్ టైల్స్తో మరమ్మతులు చేశారు. బాహ్య భాగంలో అలంకార శిల్పాలు భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. ఆధునిక వసతులతో ఏర్పాట్లుతెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ -
సీఎస్గా జయేశ్? లేదా వికాస్?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది, ఈనెల 31న సీఎస్గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు. ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్రెడ్డి సీఎస్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అన్నీతానై... జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు. ఆ తరువాత ‘టాస్్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు. మిగిలిన వారు ఎలా..? ఇక వికాస్రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్లో స్పెషల్ సీఎస్గా ఉన్న శశాంక్గోయల్ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్మిత్తల్, దాన కిషోర్లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్రెడ్డి పట్టం కడతారని సమాచారం. -
Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ మేరకు పలు సూచనలు చేశారు. ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
-
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
నెరవేరిన సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్స్పేస్గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
నేను అందరివాడిని
సాక్షి, హైదరాబాద్: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణపై వడివడిగా కదిలాం.. ‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.అలాగే వన్ మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్క్యాప్ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మిత్రధర్మం... పేదల పక్షం... ‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్ప్లాన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది. ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే, సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.కార్యాచరణ ఇలా...1వ వారం – గ్రామీణాభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4) 2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుంచి 11) 3వ వారం – అరైవ్–అలైవ్ (ఏప్రిల్13 నుంచి 18) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి 25) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2) 6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 10వ వారం – పర్యావరణం (జూన్ 1 నుంచి 6) -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
ముఖ గుర్తింపు మస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను వినియోగంలోకి తీసుకుని రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదని తేల్చి చెప్పారు. ఆసరా పెన్షన్ల పథకం అమలులో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను అమల్లోకి తెచ్చి 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని వెల్లడించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించతలపెట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి ‘ప్రభుత్వం సేకరించిన రూ.3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉంది. వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిసినా వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తాం. అవకతవకలకు తావు లేకుండా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పనితీరు ఆధారంగా అవార్డులు రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులుంటాయి. జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.. ’ అని సీఎం చెప్పారు. ఈ మూడు నెలలే కొలమానం ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలి. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానం. మీ సర్వీస్ కెరీర్కు ఇవే పునాదిగా నిలుస్తాయి. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. సమర్ధవంతంగా పని చేస్తేనే కొనసాగింపు కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎస్ నివేదిక ఇవ్వాలి. (నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు) క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలి. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను ప్రజలకు తెలియజేయాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి. ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి..’ రేవంత్ సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి.. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. జాబ్ మేళాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు. డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. జూన్ 12నే పుస్తకాలు, యూనిఫామ్లు ‘వచ్చే విద్యా సంవత్సరంలో 100 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూలు బస్సు సౌకర్యం, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ను ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్ 12నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి..’ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం సహించం.. ‘ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోంది. అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది. 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తాం. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆస్పత్రుల్లో పరిపాలన, వైద్య సేవలను విభజిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 25 వేల బోగస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ‘బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించాం. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తాం. వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు సీఎం జారీ చేసిన ఇతర ఆదేశాలు ⇒ పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ⇒ రహదారులపై గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్ నంబర్ ద్వారా సేకరించి మరమ్మతులు చేపట్టాలి. ⇒ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓఆర్ఆర్ ఏజెన్సీ బాధ్యత తీసుకోవాలి. ⇒ నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ ఉండాలి. యాజమాన్యాలు జవాబుదారీతనంతో ఉండాలి. ⇒ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ–సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి. ⇒ భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ్చ -
పలు జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్. సీఎస్ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్. వారందరినీ భాగస్వామ్యులను చేయాలి.. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలివ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి.ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి...గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి.వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి..రవాణా శాఖ డాటా ఆన్లైన్ పూర్తి చేయాలిపాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి.ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి..రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి.ఆ నంబర్కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి . -
నేడు కలెక్టర్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జనగణన–2027 తొలి విడత కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 మధ్య చేపట్టే రాష్ట్రంలో గృహాల గణన నిర్వహణపై రాష్ట్ర జనగణన అధికారి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన 34 ప్రశ్నలతో గృహాల గణన నిర్వహణకు 89వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భోజన విరామం అనంతరం 1.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2 నుంచి 2.30 గంటల వరకు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం నిర్వహణపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2.30 నుంచి 4 గంటల మధ్య 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కలెక్టర్లకు సూచనలు జారీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లకు నిర్దేశించనున్నారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, రవాణా, అటవీ, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమలు, టీజీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు కలెక్టర్లకు అవగాహన కలి్పంచనున్నారు. చివరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రేవంత్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శుల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించనున్నట్టు తెలిసింది. -
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా) -
రాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేసాడు..
-
మూసీ మురిసేలా మహాత్ముడు
సాక్షి, హైదరాబాద్/లంగర్హౌస్: మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి. నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే.ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు).మూసీ చుట్టూ 25 వేల ఎకరాల భూమి..: తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు వైపులా మొత్తం 21 కిలో మీటర్ల మేర మూసీని సుందరీకరించనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో సుమారు 5,600 కోట్ల వ్యయంతో నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. రోడ్లు, వంతెనలు, స్కైవాక్లతో పాటు నదీ తీరాలను అభివృద్ధి చేసేందుకు వెచ్చించనున్నారు. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీపీ) రూ.4,100 కోట్లు రుణం రూపంలో అందించనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్లు, పీపీపీ విధానం, ఇతరత్రా రూపంలో సమీకరించనుంది. ఆ తర్వాత దశల వారీగా హెచ్ఎండీఏ పరిధిలో మూసీ ప్రవహించే 55 కి.మీ. వరకూ నదికి పునరుజ్జీవం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మూసీకి ఇరువైపులా సుమారు 25 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 120 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని నివాస, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా స్థిరాస్తి కార్యకలాపాలకు వినియోగించాలని భావిస్తున్నారు.సరోవర్లో ఏముంటాయంటే..సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 238 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్లో 52 ఎకరాలు కేంద్ర రక్షణ శాఖకు చెందినవి ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 38.9 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. నది పరీవాహక ప్రాంతాన్ని హ్యాపెనింగ్ ప్లేస్గా, నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ సరోవర్లో గాంధీతత్వశాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం వంటివి ఉంటాయి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నది పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 99 రోజుల కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించి, వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని సీఎస్ను ఆదేశించారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. ఈ 99 రోజుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్తోపాటు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని.. ప్రతి పథకం, ప్రతి పాలసీ విజయం, వైఫల్యం వారిపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. మార్చి 4న నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపై మాట్లాడతానని వెల్లడించారు. ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా.. పరిపాలనలో అధునాతన సాంకేతికను సమర్థంగా వినియోగించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారానే అన్ని పథకాలు, సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. కరెంట్ మీటర్, ఇళ్ల నిర్మాణానికి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని చెప్పారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ అధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశించారు. మూడు వారాల్లో నివేదికను అందజేయాలని కోరారు. ప్రతీ విభాగంలో డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కేంద్రం సమ్మిట్పై విమర్శలొచ్చాయి.. కేంద్రం నిర్వహించిన ఏఐ సమ్మిట్పై కొన్ని విమర్శలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించామని గుర్తు చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల డేటా సిద్ధంగా ఉండాలి.. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం అన్ని శాఖల కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండాలని, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారు.. పారదర్శకత, జవాబుదారీతనం, మార్పును తీసుకొస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం రెండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని అధికారులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించారు. -
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
సెక్రటేరియట్ : మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన సీఎం.. ప్రమాదం లో గాయపడిన ఒకరి కి 3 లక్షల పరిహారం.. నవంబర్ 17, 2025 న సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన 44 మంది హైదరాబాద్ వాసులు..కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్,హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా,తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్.సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యల పైన కేంద్రం తో మాట్లాడాను..మంత్రి అజారుద్దీన్ ను మదీనా పంపించాను..బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం..దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు..కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం..నాంపల్లి అగ్ని ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం..ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం..అందుకే కుటుంబాలను సెక్రటేరియట్ కి పిలిచి పరిహారం అందించాం…ఇది మీ ప్రభుత్వం..ఆందోళన వద్దుమీ కష్టం,ఆనందం లో మీతో ఉంటుంది..ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది..అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం..కొడంగల్ లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్ కు పంపిస్తున్న.. -
శారదాపీఠం భూములపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలోని శారదాఫీఠం భూముల అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో జలమండలికి భూ కేటాయింపులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిర్మాణాల తాజా స్థితిని తెలియజేయనందుకు అధికారులపై రేవంత్ ఫైర్ అయినట్లు సమాచారం. కాగా, 2019లో తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని, ఇది ఆ పీఠం విజ్ఞప్తి మేరకే జరిగినట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ ధ్వజంశారదా పీఠం భూములు అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇక దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారంటూ హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్లం లేదా అంటూ ప్రశ్నించారు. -
నీకు దమ్ముంటే.. రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్
-
కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.భూదాన్ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్ర: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయింది.. దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగింది. ఇప్పుడు దేవాలయ స్తలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడం సరికాదు. శారద పీఠం ఆధ్వర్యంలో 16 దేవాలయాలు ఉన్నాయి. వేదం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాలు కూల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా?. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా?.గుళ్లు, ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. సర్వే నెంబర్ 239, 240లలో పది ఎకరాలు భాగ్యలక్ష్మి మైన్స్ మినరల్స్ కంపెనీలు ఉన్నాయి. పక్కన 17 ఎకరాల స్థలం కబ్జా చేశారు. రేవంత్ అల్లుడికి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని చూస్తున్నారు. మేము రాగానే పోలీసులు, అధికారులు పారిపోయారు. చట్టపరంగా పద్ధతులు పాటించరా?. దేవాలయాల భూమి కూల్చడానికి శ్రీధర్ బాబు ఎలా ఒప్పుకున్నారు?. స్థలం లేక కాదు.. కక్షతో చేస్తున్నారు. గుడిని, మఠాన్ని కూడా వదలరా?. బ్రహ్మణులు పూజలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయాల్లో పూజలు ఆపే మూర్ఖత్వమా?. ఇదేం సంస్కృతి?. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని కూల్చేస్తారా?. దేవాలయ భూమి కాపాడడానికి మేం పోరాటం చేస్తాం. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. -
తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్ అర్వింద్కుమార్ సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం.ఇక, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బీఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. -
ఇక కోర్ అర్బన్ చట్టం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టాన్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమ తులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరి యాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలి యక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలికోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి, ఆ లోపు దానిని తొలగించినా అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు.ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని, నగరంలోని సర్కిల్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ ఎంఏయూడీ(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్)పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. భవనాల పనులు వేగవంతం చేయాలిభారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని , అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతోపాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సచివాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయ్యారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.గత రెండేళ్లలో ఇప్పటివరకు నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు సహా మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 5,865 మంది లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ నుంచి మిగిలిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈస్ట్ డివిజనల్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్ విభాగం ఇన్చార్జి పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్ సుదర్శన్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జి వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, గణపతి భార్య.. మాడ్ డివిజన్ ఇన్చార్జి జోడే రత్నాభాయ్ అలియాస్ సుజాత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎడ్యుకేషన్ కమిటీ ఇన్చార్జి లక్కా సుశీల అలియాస్ రేల, దేవ్జీతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అనిల్కుమార్ అలియాస్ భగత్సింగ్, మాడ్ డిజినల్ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్ సంగీత, దేవ్జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్ కుంజం ఇడామల్ ఉన్నారు. -
అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్
-
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. -
సనత్నగర్ టిమ్స్కు ముహూర్తం ఖరారు.. ఉగాది రోజు నుంచే సేవలు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి.గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మారి్పడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?
సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?.. రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?.. అది చూస్తూ మేం ఊరుకోవాలా? ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు ఏం చెప్పినా మేం తలూపాలా..?’’ అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందో లేదో సూటిగా జవాబు చెప్పాలి అని నిలదీశారు. అధికారపక్షం జవాబు చెప్పకుండా దాటవేయటాన్ని బట్టి రేవంత్రెడ్డి చెప్పిందే నిజమేనని ఒప్పుకున్నట్లైందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మేం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.. లేదంటే సమాధానం చెప్పలేం.. తర్వాత చెబుతామని ఒప్పుకోండి. ఇది రాజకీయ అంశం కాదు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం’ అని తేల్చి చెప్పారు. చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాలతో రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయించానని రేవంత్రెడ్డి పేర్కొనటంపై అధికారపక్షం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రాజెక్టు రాయలసీమకు ఎంత అవసరమో గుర్తించి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని గొడవలు వచ్చినా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్’పై గురువారం శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇషాక్బాషా, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 2014లో పూర్తయిందని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల మేరకు నిలిపివేశారని, ఆ పథకంలో 22.82 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. స్వప్రయోజనాల కోసం బాబు లాలూచీ..!రాయలసీమకు ఎంతో అవసరమైన ఆ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్బాషా డిమాండ్ చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ను ప్రారంభించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి సూచనల మేరకు ఆ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని, రాయలసీమ వాసిగా దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ఇషాక్ బాషా ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటిని ఆపడం న్యాయమా? దాన్ని పూర్తి చేస్తారా? లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? అని ఇషాక్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరంలేదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి గత 20 ఏళ్లుగా నీటిని పూర్తిగా వాడుకోలేకపోయామన్నారు. రేవంత్రెడ్డి ప్రకటనను సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఖండించకపోవడం దారుణమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టును కచ్చితంగా చేపట్టి రాయలసీమ ఎడారి కాకుండా కాపాడాలని కోరారు. రాజకీయ ధృక్పధంతోనే ఆ ప్రాజెక్టును ఆపేశారని ప్రజలు నమ్ముతున్నారని, దానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.సమాధానం చెప్పకుండా అధికారపక్షం సుదీర్ఘ ప్రసంగాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 10.31 గంటలకు చైర్మన్ కొయ్యే మోషేన్రాజు సభను వాయిదా వేశారు. అనంతరం 10.43 గంటలకు సభ పునఃప్రారంభమైన వెంటనే ప్రభుత్వం రెండో ప్రశ్నకు జవాబు చెప్పాలని సూచించడంపై ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా రెండో ప్రశ్నకు ఎలా అనుమతిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వెల్లో నిల్చుని నిరసన తెలిపారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రులు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారని బొత్స అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లోకి చేరుకుని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ 10.48గంటలకు సభను రెండోసారి వాయిదా వేసిన చైర్మన్ మళ్లీ 11.03 గంటలకు తిరిగి ప్రారంభించారు. లైన్మెన్ల నియామకంపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి బదులిచ్చిన అనంతరం గాలేరు–నగరి సుజల స్రవంతి, రాయలసీమ ప్రాజెక్టులపై ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు బదులిచ్చారు. మంత్రి తాము అడిగిన దానికి కాకుండా ఏదో చెబుతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లో నిల్చుని బిగ్గరగా కేకలు వేశారు. ఇలాంటి వ్యూహాలతో వస్తే సభను నడపలేమని చైర్మన్ మోషేన్రాజు అసహనం వ్యక్తం చేశారు. సభలో ఆందోళన నెలకొనడంతో కేవలం మూడు ప్రశ్నలకే సమాధానం రాగా మిగిలిన వాటిని డీమ్్డగా ప్రకటించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అది నిజమా.. కాదా? ఈ పథకాన్ని ఎప్పటిలోగా ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉంటూ ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు జవాబు చెప్పాలి. అలా కాకుండా రాజకీయ ఉపన్యాసాలు ఏమిటి? మీకు రాయలసీమకు నీరు రావడం ఇష్టం లేదు.. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదని చెప్పడం లేదు.. – శాసన మండలిలో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స ధ్వజం -
పబ్లిక్ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అన్ని సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా కమి షన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో పాఠశాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని కోరింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ ను ప్రభుత్వం సమకూర్చాలని పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన తెలంగాణ విద్యా విధానం డాక్యుమెంట్ను గురువారం సీఎంరేవంత్రెడ్డికి అందజేసింది. నివేదికలోని అంశాలను కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మీడియాకు వివరించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు ప్రారంభించాలి‘పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి చేసేందుకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రారంభించాలి. ఒకటవ తరగతి నుంచే తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ భాషలతో కూడిన విధానాన్ని అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే బోధనా మాధ్యమం ఇంగ్లిష్లో ఉండటం ప్రయోజనకరం. ప్రస్తుతం ఉన్న 6–14 ఏళ్ల పరిమితిని 3 నుండి 18 సంవత్సరాలుగా మార్చి నిర్బంధ విద్యను అందించాలి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును రద్దు చేయాలి. బి.ఎడ్ను ప్రైమరీ (నర్సరీ–5వ తరగతి), సెకండరీ (6–12వ తరగతి) గా విభజించాలి.కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలిమధ్యాహ్న భోజనానికి ఇచ్చే ధరను పెంచాలి. మెనూలో గుడ్డు, అరటి పండు ఉండేలా చూడాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ను రద్దు చేసి, ఇంటర్ మార్కుల ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పేరుతో నిర్వహించే పోటీ పరీక్షల కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలి. ఫీజుల నియంత్రణకు కమిషన్విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమా రు 72 శాతం రెగ్యులర్ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను అంచనా వేయడా నికి ‘తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారి టీ’ని ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించడానికి చట్టబద్ధమై న కమిషన్ ఏర్పాటు చేయాలి. విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 18 శాతం కేటాయించాలి..’ అని సిఫారసు చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా విధానం అమలు కోసం ఏడేళ్ల రోడ్ మ్యాప్ను కమిషన్ సిద్ధం చేసింది. దీని ద్వారా సుమారు 2 వేల పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొంది. మీడియా సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు గారి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.… pic.twitter.com/5O36f706om— Telangana CMO (@TelanganaCMO) February 26, 2026 -
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
సాక్షి, హైదరాబాద్: పపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూని వర్సిటీ హైదరాబాద్కు రానుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ప్రత్యేకంగా స్టడీ సెంటర్ను తెరవనుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎంసీఆర్హెచ్ఆర్డీతో హార్వర్డ్ యూనివర్సిటీ త్వరలో అవగాహన కుదుర్చుకోనుందని వివరించారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన గ్రూప్–1, గ్రూప్–2 అధికా రుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రకరకాల కోర్సులు..సర్టిఫికెట్లు‘అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థిగా చేరి ఒక కోర్సు పూర్తి చేశా. రోజుకు 12 గంటల పాటు తరగతులకు హాజరయ్యా. ఆ గొప్ప విశ్వవిద్యాల యాన్ని హైదరాబాద్కు తీసుకురావాలని సంకల్పించా. వర్సిటీ యాజమాన్యంతో చర్చించా. ఎంసీఆర్హెచ్ఆర్డీతో అవగాహన తర్వాత ఇక్కడే ఒక స్టడీ సెంటర్ను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాం. వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ కోర్సులు ఇక్కడ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చేరవచ్చు. ఇక్కడే తరగతులకు హాజరు కావొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన మీరు కూడా ఈ కోర్సులు చేయవచ్చు..’ అని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆధిపత్యం సహించలేరు..‘మీరు ఎంతో కష్టపడి, లక్షలాది మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు. మీరు మొన్నటివరకు విద్యార్థులు..నిన్నటివరకు నిరుద్యోగులు..ఈ రోజు అధికా రులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రజాపాలనలో మీరంతా ప్రజలకు నేరుగా సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని సహించలేరు. రాంజీ గోండ్, కుమ్రుంభీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపై తిరు గుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క, సారల మ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వన దేవతలుగా గౌరవించబడుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులయ్యారు. బాధ్యత మరవొద్దు.. పతనం కావొద్దుఅధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మీరంతా ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తిని ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలి. 2011 తర్వాత 14 ఏళ్ల పాటు గ్రూప్–1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్–1 నిర్వహించి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. తొలుత టీజీపీఎస్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. డీజీపీగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్గా నియమించాం. రిజిస్ట్రార్, ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించాం. ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. కొందరు గిట్టనివాళ్లు కోర్టులకెక్కి ఉద్యోగాలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అన్ని కోర్టుల్లో అభ్యర్థుల తరఫున బలంగా వాదించి కోర్టులను ఒప్పించి ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాం. అధికారులుగా మారిన తర్వాత బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావొద్దు..’ అని రేవంత్ చెప్పారు. తల్లిదండ్రులకు అండగా ఉండండి..‘సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీపైనే ఉంది. మీరంతా ఆఫీసుకు వెళ్ళేముందు ఎస్ఆర్ శంకరన్ను తలుచుకోవాలి. పేదవారికి సాయం చేసే విషయంలో మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవండి. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా త్వరలో చట్టం చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు కొత్త అధికారుల శిక్షణకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను రేవంత్ తిలకించారు. -
100 పబ్లిక్ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను (టీపీఎస్లు) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యా కమిషన్ చేసిన సిఫారసులపై స్పందించారు. టీపీఎస్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. సాంకేతికతతో ‘క్యూర్’ స్కూళ్లు ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. ఏడాదిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలి. నగరంలోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలి.క్యూర్లో అప్గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వ సతులు కల్పించనున్న 164 పాఠశాలలకు సంబంధించిన పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదు. ప్రభుత్వఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారంరోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతు ల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2026–2027 నుంచి బ్రేక్ ఫాస్ట్, పాలు ‘ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలి. ఏఐపై బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలి. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలి. (ఈ పథకం అమలుకు సంబంధించి హరేకృష్ణ మిషన్ ప్రతినిధులకు సీఎం పలు సూచనలు చేశారు). బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యారి్థకి పాలు అందజేయాలి. పాలను విజయ డెయిరీ నుంచి సేకరించాలి. విద్యార్థులకు ఎన్ని కేలరీలు అందజేస్తున్నామో తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు కిట్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి ఒక కిట్ అందజేయాలి. అందులో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపర్చేలా చూడాలి. అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయిస్తాం..’ అని సీఎం తెలిపారు. అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని సీఎం ఆదేశించారు. ఫీజులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల విధానం, తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమరి్పంచాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను ప్రజలకు అందుబాటులో (పబ్లిక్ డొమైన్లో) ఉంచాలని సూచించారు. కేకే కమిటీ కమిషన్ నివేదిక పరిశీలించాలి తెలంగాణ విద్యా విధానంపై రాష్ట్ర విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. నివేదికలోని చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మిడియెట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సరీ నుంచే ఇంగ్లిష్ మీడియం ఉండాలి: తెలంగాణ విద్యా కమిషన్
హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ కీలక సిఫారుసులు చేసింది. సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా విద్యా కమిషన్ పలు సిఫారుసులు చేసింది.తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు:1. ఉపాధ్యాయుల పదోన్నతులు: ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు, పని తీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి.2. బోధనా మాధ్యమం: ఇంగ్లీష్ ఉండాలి, నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు.3. త్రిభాషా విధానం: ఒకటో తరగతి నుంచే తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.4. విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం: విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలి.5. EAPCET రద్దు: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి.6. D.EI.ED రద్దు: బీఎడ్ను పునర్వ్యవస్థీకరించాలి.7. పాఠశాలల్లో వంట వండే మహిళలకు చెల్లింపులు: వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.8. IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు: నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.9. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్: వేరు చేయాలి.10. విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణం: వైస్ ఛాన్సలర్ ఛైర్మన్గా ఉండాలి -
ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు: సీఎం రేవంత్
హైదరాబాద్: గ్రూప్ 1,గ్రూప్ 2 నూతన ఆఫీసర్ల శిక్షణకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్రెడ్డి తిలకించారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రూప్-1, గ్రూప్- 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘మీరు మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు,ఈ రోజు అధికారులు. ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. రాంజీ గోండు,కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపైన తిరుగుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యం పైన సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌర్వించబడుతున్నారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు,అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలి. మొదటి ఎన్నికల్లో దేశంలోనే అత్యదిక మెజార్టీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి తెలంగాణ బిడ్డ. 6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది. టీజీపీఎస్ని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షల పైన అవగాహన ఉన్న వాళ్ళని చైర్మన్ గా,సభ్యులుగా నియమించాం. ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడింది. అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదే..ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు. నేను మెకానికల్గా మిమ్మల్ని కలవలేదు. ఎమోషనల్,అటాచ్మెంట్తో కలిసి పని చేశాను. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లి తండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం’ అని స్సష్టం చేశారు. -
బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు
-
భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్
-
తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స
-
మ్యాన్యుఫాక్చరింగ్ పవర్గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని మ్యాన్యుఫాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్–2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ బుధవారం సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ టెక్నాలజీ విప్లవ ప్రభావం, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం కోరారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను సీఎంకు శంతను నారాయణ్ వివరించారు. గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రిస్కిల్లింగ్కు సంబంధించిన అంశాలను తెలిపారు. సీఎం రేవంత్ చండీయాగం !రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా యాగం జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నిర్వహించిన చండీయాగం బుధవారం ముగిసినట్టు సమాచారం. అయితే, ఈ యాగం నిర్వహణ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే రేవంత్రెడ్డి యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
రైతు భరోసా లేనట్టేనా?
మోర్తాడ్(బాల్కొండ): అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తోంది. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు మధ్య దశకు చేరుకున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడకపోవడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో భరోసాపై నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు. అయితే పెట్టుబడిసాయం విడుదలపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈసారి రైతు భరోసా లేనట్లేనా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.షెడ్యూల్ దాటినా..గడిచిన వానాకాలం సీజన్లో జిల్లాలోని 2,98,472 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.326.03 కోట్లు జమ చేశారు. యాసంగి సీజన్ కోసం షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున సాయం సొమ్ము జమ చేయాల్సి ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిధుల విడుదల ఆలస్యమైందని రైతులు భావించారు. ఎన్నికల తంతు ముగియడంతో పెట్టుబడి సాయం వస్తుందని నిరీక్షించినా నిరాశే మిగిలిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసాకు నిధులు విడుదల చేస్తే ఊరట లభిస్తుందని అంటున్నారు.


