breaking news
Revanth Reddy
-
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్ఎస్) 2023లో ఓడిపోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్) ఫాంహౌస్లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్రావులే.. తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాచపుండును పెట్టింది కేసీఆరే.. ‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్ చెప్పిండు. ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. -
ఎన్నడూ ఎరుగని ఘోరం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు జరగలేదు. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది పరిశ్రమలో ఉన్నారు. 58 మందిని అధికారులు గుర్తించారు.. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నారా?, ఎక్కడైనా చికిత్స పొందుతున్నారా? భయంతో ఎక్కడైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాలి. ఈ ఘటనలో చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రూ.కోటి నష్టపరిహారం ఇప్పించాలని మంత్రులు, అధికారులను ఆదేశించా. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇప్పించాలని సూచించా..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సోమవారం భారీ పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమను మంగళవారం ఉదయం మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డిలతో కలిసి సీఎం సందర్శించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదికకు ఆదేశం ప్రమాదం జరగడానికి కారణాలేంటి?, నివారణ చర్యలకు ఎలాంటి అవకాశం ఉండింది?, ప్రమాదం తర్వాత తక్షణ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి?, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సహాయం తదితర అంశాలపై రేవంత్ ఆరా తీశారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు (మంగళవారం ఉదయానికి) 36 మంది మరణించినట్లు తెలిసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్తి వైద్య సదుపాయాన్ని పరిశ్రమ యజమాన్యంతో కలిసి ప్రభుత్వం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని నియమిస్తున్నామని, వారిచ్చే నివేదిక ఆధారంగా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తామని తెలిపారు. పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన తనిఖీలను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కార్మీక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరిశ్రమలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేలా నివేదిక ఉండాలని సూచించారు. పరిశ్రమ యాజమాన్యం ఎక్కడ? పేలుడు సంభవించి 24 గంటలైనా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు, కార్మీకుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందించడానికి ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ (అ«దీకృత వ్యక్తి) ఉన్నారా? అని ప్రశ్నించారు. కార్మికులకు నష్టపరిహారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పరిశ్రమ అధికారి జాకబ్ను ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యం మానవతా దృక్పథంతో నష్టపరిహారం ఇవ్వాలని సీఎం అన్నారు. దీనిపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, అధికారులతో చర్చించాలని సూచించారు. ప్రమాద సమయంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవడానికి ఎవరైనా అధికారి ఉన్నారా అని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను ఆరా తీశారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. రసాయన పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని, వాటిల్లోని లోపాలను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. ప్రకృతి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఫైర్ సరీ్వసెస్ అడిషనల్ డీజీలతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ‘బాయిలర్స్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గతంలో పరిశ్రమల్లో తనిఖీలు చేసినప్పుడు ఏమైనా లోపాలు గుర్తించారా? గుర్తించిన వాటిని సరిచేసుకోవాలని పరిశ్రమ యాజమాన్యానికి చెప్పారా?’ అని సీఎం ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో కొన్ని లోపాలను గుర్తించామని, వాటిని సరిచేసుకోవాలని కూడా సూచించామని అధికారులు వివరించారు. దీంతో మీ సూచనలు అమలు చేశారా లేదా అనేది పర్యవేక్షించారా? అని అధికారులను తిరిగి సీఎం నిలదీశారు. మృతుల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు. చనిపోయిన కార్మికుని కుటుంబాలకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేలు అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. మరణించిన వారి పిల్లలకు పూర్తి విద్యనందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వారికి ప్రవేశాలు కల్పించే అంశం పరిశీలించాలని అధికారులకు సూచించారు. -
గోదావరి-బనకచర్ల.. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడమంటూ సీఎం రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాభవన్లో మంగళవారం.. గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణాలో 68 శాతం పరీవాహకం తెలంగాణలో ఉంది. 68 శాతం తెలంగాణకు ఇచ్చి.. మిగిలిన నీళ్లే ఏపీకి ఇవ్వాలి. కానీ 299 టీఎంసీలే చాలని రెండుసార్లు కేసీఆర్ సంతకం పెట్టారు. 299 టీఎంసీలున్నా 220కి మించి ఎప్పుడూ వినియోగించలేదు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘ధన దాహం తీర్చుకోవడం కోసమే కాళేశ్వరం రీ డిజైన్. 38 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు. మిగిలిన పనుల పూర్తికి మరో లక్ష కోట్లు కావాలి. వరద జలాలను తరలిస్తే ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోంది. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోంది. మాకు మొదటి పంటకే నీళ్లు లేవు. మా నీటివాటాలపై ఏపీ కూడా సహకరించాలి కదా?. ఇరు రాష్ట్రాల చర్చలకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి’ అంటూ రేవంత్రెడ్డి కోరారు. -
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
Pashamylaram Factory: ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
-
సిగాచి మృతులకు కోటి రూపాయల పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, సంగారెడ్డి: ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదని పటాన్చెరు పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలిని పరిశీలించి.. అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 57 మంది బయటపడ్డారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం. చనిపోయినవారి కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశించాను. ఈ విషయమై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించనున్నారు. అలాగే.. తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.10 లక్షల సాయం అందించాలని ఆదేశించాను. గాయపడి.. కోటుకుని తిరిగి పని చేయలేని స్థితిలో ఉన్నబాధితులకు సైతం రూ.10 లక్షలు కచ్చితంగా ఇప్పిస్తాం. తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు రూ.లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు అందిస్తాం. బాధితులను ఆదుకునేందుకు యాజమాన్యం ముందుకు రావాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాల ఆదుకుంటుంది. మృతుల్లో తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు అధికంగా ఉన్నారు. మృతదేహాల స్వస్థలాల తరలింపునకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. మృతుల కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది...ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటిదాకా జరగలేదు. యాజమాన్యాలు ఇక నుంచి భద్రతపై ఫోకస్ చేయాలి. ప్రమాదాలను నివారించాలి. ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటకే ప్రభుత్వం తరఫున అత్యున్నత దర్యాప్తు జరిపిస్తున్నాం అని సీఎం రేవంత్ అన్నారు. -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
రేవంత్ సర్కార్పై దర్యాప్తు ఎందుకు చేయించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కార్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐ, ఈడీలతో వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట రాహుల్–రేవంత్ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన ప్రధాని మోదీ, ఇప్పటి వరకు దర్యాప్తునకు ఆదేశించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. దేశ ప్రధాని హోదాలో మోదీ, కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా తెలంగాణకు వచ్చి సీఎంపై కేవలం అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన అమిత్షా, కేంద్ర హోంమంత్రి హోదాలో విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాల న్నారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నంబర్వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అమిత్షా బురద జల్లడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా, ఆఫీసుకు రిబ్బన్ కట్ చేస్తే నయాపైసా ప్రయోజనం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.పసుపు బోర్డు కార్యాలయా నికి సొంత భవనం నిర్మించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈ జనవరి 14న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తే, ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరోసారి అమిత్ షా ప్రారంభించడం బీజేపీ చేసే జుమ్లా పనులకు, చెప్పే జూఠా మాటలకు నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. నదుల అనుసంధానం ముసుగులో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమే అని కేటీఆర్ మండిపడ్డారు. -
కాంగ్రెస్కు ఏటీఎం: అమిత్షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. రేవంత్రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
భారత్కే ఫ్యూచర్: సీఎం రేవంత్
చందానగర్: హైదరాబాద్ను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని.. ప్రపంచమంతా మెచ్చేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా.. మూడు ప్రాంతాలుగా విభజించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్ర సమ్మిళిత, సమగ్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9లోగా విడుదల చేస్తామని వెల్లడించారు. గచ్చిబౌలిలో కొండాపూర్ నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు రూ. 182.72 కోట్ల వ్యయంతో, ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్దన్రెడ్డి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజనల్ రింగ్రోడ్డు వరకు సెమీ–అర్బన్గా, రీజనల్ రింగ్రోడ్డు అవతలి భాగాన్ని గ్రామీణ ప్రాంతంగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ ఆవలి వైపున 30 వేల ఎకరాల్లో ప్రపంచశ్రేణి భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించామని.. అందులో క్రీడలు, ఏఐ, ఐటీ, కాలుష్యరహిత ఫార్మా రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. వచ్చే వందేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దేలా.. ‘వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో బెంగళూరు, వరదలతో చెన్నై నగరాలు అతలాకుతలమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో కాలుష్యాన్ని నివారించాలన్న లక్ష్యంతోనే విద్యుత్ వాహనాలపై రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరుగుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో వచ్చే ఏడాదిలోగా 3 వేల విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మోదీ, కిషన్రెడ్డి రాష్ట్రానికి ఏం ఇచ్చారు, తెచ్చారు? రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చింది, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెచ్చింది ఏముందని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి యుమునా ఫ్రంట్, గుజరాత్కు నర్మదా రివర్ ఫ్రంట్ ఇచ్చారని.. తెలంగాణకు మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం ఎందుకివ్వరని నిలదీశారు. చెన్నై, బెంగళూరు, ఏపీకి మెట్రో ఇచ్చారని.. కానీ హైదరాబాద్ మెట్రో రెండో దశకు మాత్రం మొండిచేయి చూపారని మండిపడ్డారు. తెలంగాణపై ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపడితే దీన్ని కొందరు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. 2028 వరకు రాజకీయాలు వద్దని.. వచ్చే మూడేళ్లపాటు రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత అనంతరం సినీనటుడు నాగార్జున అభివృద్ధిలో భాగస్వామినవుతానని ముందుకొచ్చారని సీఎం గుర్తుచేశారు. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి చెరువును అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పారన్నారు. 1992లోనే ఐటీ రంగానికి పునాది హైదరాబాద్లో 1992లోనే హైటెక్ సిటీకి రాజీవ్గాంధీ టెక్నాలజీ పేరిట పునాది పడిందని.. అందుకోసం దివంగత పీజేఆర్ నాయకత్వంలో అప్పటి సీఎం నెదురుమల్లి జనార్దన్రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆ తర్వాత కాలంలో హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ అభివృద్ధి చెందాయన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే కారణమన్నారు. పేదల సమస్యలు తీరుస్తూ జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. పీజేఆర్ పేరును ఫ్లైఓవర్కు పెట్టుకోవడం సముచితమన్నారు. తగిన స్థలం గుర్తిస్తే పీజేఆర్ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాడు భయం.. నేడు కళకళ గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతంలో ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే జనసంచారం లేక అక్కడ నివసించే వారు భయపడే పరిస్థితి ఉండేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ఫార్చూన్ 500 కంపెనీలతో కళళలాడుతోందని చెప్పారు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అక్కడి భూముల అభివృద్ధికి ఏర్పడిన ఆటంకాలు తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. కొత్త కంపెనీల ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మరింత మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే రూ. 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తమ ప్రభుత్వం సాధించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, మేయర్ విజయలక్షి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు, పీజేఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 1.2 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్) ఫ్లైఓవర్ను శనివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఫ్లైఓవర్ విశిష్టతలు.. ఫైనాన్షియల్ డిస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనాఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు వెడల్పు 12 మీటర్లు ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా -
‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ బాస్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్ లేదా జవహర్గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025 -
బిగ్ ట్విస్ట్.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు
గాంధీభవన్లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి చిట్చాట్ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్చాట్లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్ను గౌరవిస్తాను. రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు. -
పీజేఆర్ ఫ్లైఓవర్పై.. రయ్ రయ్
గచ్చిబౌలి: ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ విశిష్టతలు.. ూ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ూ శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ూ ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా ూ ఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ూ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ూ ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు ూ త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు ూ క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ ూ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు ూ వెడల్పు 12 మీటర్లు ూ ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా ఫ్లైఓవర్ పరిశీలన.. శుక్రవారం పీజేఆర్ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాం«దీ, అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్రావు, ప్రాజెక్ట్ సీఈ భాస్కర్రెడ్డి, ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ, ఇతర అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్కు కృతజ్ఞతలు పీజేఆర్ సతీమణి ఇందిర శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లై ఓవర్కు దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి పేరు పెడుతున్నట్లు జీఓ విడుదల చేయడంతో ఆయన సతీమణి సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచి్చందన్నారు. ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవానికి వచ్చి సీఎం, మంత్రులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోతున్నానని ఆమె తెలిపారు. మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం హర్షణీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద మరో ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటం సంతోషంగా, గర్వంగానూ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం పీజేఆర్ (శిల్పా లే ఔట్ ఫేజ్–2) ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఫ్లై ఓవర్ వీడియోను శుక్రవారం ఆయన షేర్ చేశారు. ఎస్సార్డీపీలోని 42 ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. -
రాహుల్, రేవంత్ టార్గెట్గా పీకే ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే..
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ స్పీడ్ పెంచారు. అధికార నితీష్ కుమార్, కాంగ్రెస్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. బీహార్ పట్ల రాహుల్కు ఉన్న నిబద్ధతను పీకే ప్రశ్నించారు.జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘బీహార్లో అట్టడుగు వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు. బీహార్లోని గ్రామంలో ఒక్క రాత్రి రాహుల్ ఉండాలని సవాల్ చేస్తున్నాను. రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారు.. పోతున్నారు. కానీ, ఎలాంటి యాత్రలు చేపట్టడం లేదు. రాహుల్ ఏదైనా ఒక గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగితే.. ఆయన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. మీరు ఢిల్లీలో కూర్చుని.. బీహారీలను చూసి నవ్వండి. మాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ఇక్కడి రండి అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా పీకే టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీతో సంబంధాలున్నాయి. చివరకు కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. సీఎం అయిన తర్వాత ఆయన బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రమ చేయడం బీహారీల డీఎన్ఏలోనే ఉంది. బీహారీలు శ్రమ చేయడం కోసమే పుట్టారు అంటూ ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు అలా అన్నారు?. బీహారీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. బీహారీల ప్రజల పట్ల సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.Action Should Be Taken Against Revanth Reddy for Insulting Bihar People: Prashant Kishor#RevanthReddy #PrashantKishor #BiharCommentsControversy #RahulGandhi #BiharPolitics #TelanganaCM #PoliticalControversy #BiharElections #RevanthControversy #TeluguNews pic.twitter.com/bWUdcOMxuo— Telangana Ahead (@telanganaahead) June 27, 20251989లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీహార్ను అభివృద్ధి కేంద్రంగా మారుస్తానని చెప్పారు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది?. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి మీరు బీహార్కు ఏం చేశారో మాకు చెప్పండి? అని ప్రశ్నించారు. సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ క్షమాపణ చెబితే.. రాహుల్ గాంధీ బీహార్లో ప్రచారం చేసే ముందు బీహారీలకు కూడా క్షమాపణ చెప్పాలి. బీహారీలు శ్రమ కోసమే పుట్టినట్లయితే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ప్రచారం చేసి అక్కడ మీ ఓట్లు పొందండి. బీహార్లో కాంగ్రెస్కు ఉనికి లేదు. రాహుల్ గాంధీకి నిజంగా రాజకీయ బలం ఉంటే, ఆయన బీహార్లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. లాలూ పార్టీలో పొత్తు లేకుండా బరిలో దిగాలి అని సవాల్ విసిరారు. Jan Suraaj Party chief Prashant Kishor said Rahul Gandhi doesn't undertake any yatra in Bihar. pic.twitter.com/rAqPTvDEFO— The Brief (@thebriefworld) June 27, 2025 -
యువత డ్రగ్స్ కు బానిస అయితే.. దేశ మనుగడ కష్టం
-
మత్తు ముఠాలూ.. ఈగల్ ఉంది జాగ్రత్త: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు ‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’ ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా. కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ఎవరికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్గా ఎదిగారు. రామ్చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను. విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్రెడ్డి కోరారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు. కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్ ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది.. స్కూళ్ల వద్ద ఐస్క్రీమ్లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం. – రామ్చరణ్ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే.. సినిమాలు, షూటింగ్లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. – విజయ్ దేవరకొండ -
హైదరాబాద్లో యాంటీ డ్రగ్ డే ప్రోగ్రామ్ (ఫొటోలు)
-
డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: యువత డ్రగ్స్కు బానిస అయితే దేశ మనుగడ కష్టమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్నారు. ఈరోజు(గురువారం, జూన్ 26) యాంటీ డ్రగ్ డేలో భాగంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. మరి అటువంటి తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.సే నో టు డ్రగ్స్.. సే యస్ టు స్పోర్ట్స్ : పుల్లెల గోపీచంద్సే నో టు డ్రగ్స్కు స్వస్థి చెప్పి.. సే యస్ టు స్పోర్ట్స్కి నాంది పలికాలన్నారు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్. ‘తెలంగాణలో స్పోర్ట్స్ కి చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి అనే ట్రైల్ ఎప్పుడూ వేయకండి. నా జీవితంలో ఒక్కసారి కూడా తప్పు బాటలో లేను’ అని తెలిపారు.ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే చట్ట రీత్యా నేరమే..డ్రగ్స్ను సేవించడమే కాదు.. డ్రగ్స్ను తీసుకున్నా నేరమేనన్నారు టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఒక్క గోవా లోనే ఒక్కో హవాలా ఆపరేటర్ 2 రోజుల్లో 50 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను అమ్ముతున్నారు. గతం లో డ్రగ్స్ కన్స్యూమర్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వాళ్ళం, కానీ పాలసీ లో మార్పులు తెస్తున్నామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కస్టడీకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాము. కన్స్యూమర్లును డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తాం’ అని తెలిపారు.రైజింగ్ తెలంగాణ స్పూర్తినిస్తుంది: రామ్ చరణ్కొన్ని సంవత్సరాలు క్రితం స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారనీ విన్నాను. 2014 లో 3, 4 క్లాస్ చదివే పిల్లలకు ఐస్ క్రీమ్ లలో డ్రగ్స్ ఇచ్చారని తెలిసి పేరెంట్స్ ధర్నాలు చేశారు. డ్రగ్స్ అంత డీప్ గా వెళ్లిపోయాయి. ఫిజికల్ వర్క్ అవుట్, ఒక షూటింగ్, కుటుంబంతో క్వాలిటీ టైమ్, స్పోర్ట్స్ ఒక రోజుకి ఇది చాలు. పిల్లలని స్కూల్స్ కు పంపాలంటే భయమేసే పరిస్థితులు ఉండకూడదు.. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బావున్నాయి. ప్రభుత్వానికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మా తోడ్పాటు ఉంటుంది’ అని రామ్చరణ్ తెలిపారు.ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదు: విజయ్ దేవరకొండఒక దేశాని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిషత్ నీ నాశనం చేయాలి అనుకుంటున్నారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే కోలుకోవడం కష్టం. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండండి. డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండండిడ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం: దిల్రాజుఇక మీదట ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న సినిమా రంగానికి చెందిన వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తున్నారని, ఇక్కడ కూడా త్వరలో అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
CM రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల నిర్వహణ రావడం లేదు : కేటీఆర్
-
ముఖ్యమంత్రి స్థానంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ కూతురు మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించారు.తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కోసం ఇప్పటకే తన అప్పీల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచారు. వచ్చే తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావాలనే టార్గెట్తో నేను పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ దిగిపోయాక.. నేను ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నిస్తాను. ప్రజల దగ్గర అప్లికేషన్ పెడతాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్తోనే నడిచింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాప్ అయిందని చాలా సార్లు చెప్పారు.. పోలీసులే మాకు చెప్పేవారు. గత పదేళ్లు బీఆర్ఎస్.. పరిపాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ మీదే పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్యాపింగ్తోనే పరిపాలన చేశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు రికార్డు చేశారు.కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. కవిత ఓవరాక్షన్ చేస్తున్నారు.. అంత అవసరం లేదు. కేసీఆర్ కూతురు మినహా మీకు ఉన్న అర్హత ఏంటి. కేసీఆర్, కేటీఆర్ రిజెక్ట్ చేసినా పొలిటికల్ ఇమేజ్ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ స్థాయి ఒక్కటే. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే ఆర్థం ఉంది.. కవిత స్థాయి ఏంటి?. కవిత ఒక మాఫియా డాన్ అయిపోయింది. ఆమె వల్ల కేజ్రీవాల్, సిసోడియా ఖతమైపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు 5,6 నెలలకు వేసేవారు. మా ప్రభుత్వంలో 9 రోజుల్లోనే 9వేల కోట్లు జమ చేసాం. వారు చేయలేని పని కాంగ్రెస్ చేసిందనే అసూయతో హరీష్ రావు మాపై విమర్శలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.‘‘అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు.‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. -
సీఎం రేవంత్రెడ్డికి టోనీ బ్లెయిర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ తయారీ పట్ల సీఎం ఎ.రేవంత్రెడ్డిని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ విజన్ను ప్రశంసిస్తూ తాజాగా టోనీ బ్లెయిర్ ఆయనకు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో టోనీ బ్లెయిర్తో సమావేశమైన సీఎం రేవంత్.. ఆయనకు రైజింగ్ తెలంగాణ విజన్ ఉద్దేశాలను వివరించారు. విజన్లో భాగంగా 2024 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. విజన్ రూపకల్పన, అమలుకి సహకారం అందించడం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐజీసీ) సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం, టీబీఐజీసీలు పరస్పర అవగాహన లేఖలు (లెటర్ ఆఫ్ ఇంటెంట్)ను మార్పిడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రైజింగ్ తెలంగాణ విజన్ లక్ష్యాల సాధనకు టీబీఐజీసీ ప్రభుత్వానికి సహకరిస్తుందని టోనీ బ్లెయిర్ తెలిపారు. విజన్–2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. -
అంతా మీ ఇష్టమేనా..?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు అధికారులే అడ్డు పడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయలోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని ఆయన అన్నట్టు సమాచారం. అసలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను ఎందుకు ఆపుతున్నారో చెప్పా లని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా సాంకేతిక విద్యామండలి, విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్వార్పై సీఎం సీరియస్ అవ్వడంపై అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం... సమావేశంవివరాలు ఇలా ఉన్నాయి. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఉన్నతవిద్య అధికారులు అడ్డుపడటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఉన్నత విద్యామండలిపై నిందలెందుకు ? ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఇప్పటి వరకూ అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా నిర్వహించారని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు. కేవలం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ‘మండలి అధికారులు ఇష్టానుసారం చేస్తున్నారు’అంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించేలా చేయడం సరికాదని అన్నట్టు సమాచారం. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానని, ఆయన సంస్కరణలపై పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది. సాంకేతిక విద్య అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సెలింగ్ చేపడతామని ఉన్నత విద్యామండలి చెప్పడమే నేరంగా భావించడం సరికాదని సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై కమిటీ వేయాలనే ప్రభుత్వ ఆలోచన కూడా కౌన్సెలింగ్ జాప్యానికి కారణమన్న అధికారుల వాదనతో సీఎం ఏకీభవించలేదని తెలిసింది. అధికారులంతా ఒకసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడిబాటపై అసంతృప్తి బడిబాటపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మందిని చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాట ఆశించిన పురోగతి సాధించలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులే ఈ కార్యక్రమాన్ని లైట్గా తీసుకున్నారని, ఇక క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందన ఉంటుందని సీఎం అన్నట్టు సమాచారం. ప్రభుత్వ బడులను అదనపు కలెక్టర్లు సందర్శించాలి : సీఎం ప్రతీజిల్లా అదనపు కలెక్టర్ వారంలో రెండుసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సమావేశ వివరాలపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 48 వేల మంది చేరినట్టు సీఎం తెలిపారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గదులను నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల వంట చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా ఇంటర్లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు. -
మోదీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీపై మాట్లాడాలి: డీకే అరుణ
సాక్షి, నల్లగొండ: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్కు లేదు అని ఎద్దేవా చేశారు.నల్లగొండలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి అందరికీ తెలియాలి. ఆర్టికల్-352ను ఇందిరా గాంధీ దుర్వినియోగం చేశారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. ఎంతో మంది ప్రతిపక్ష నేతలను, లక్షల మందిని జైలుకు పంపించారు. కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ నేతలను జైళ్లలో వేసి హింసించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.విదేశాల్లో దేశం, ప్రధాని మోదీ గురించి అవహేళనగా మాట్లాడటం రాహుల్ అవివేకం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏంటో చూపించాం. ప్రధానిని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్కు లేదు. రైతు భరోసా పేరుతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా రాలేదు. ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ నాయకులందరూ బాధితులే. ఫోన్ ట్యాపింగ్పై ఇంత వరకు ఎందుకు చర్యలు లేవు?. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. -
2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. ‘1994–2004 వరకు పదేళ్లు టీడీపీ, 2004–2014 వరకు పదేళ్లు కాంగ్రెస్, 2014–23 వరకు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇక 2023–33 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా. పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకునే బాధ్యత నాది.మీరు భవిష్యత్తు నాయకులను తయారు చేయండి..’అని సీఎం కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలిచ్చే కార్యక్రమం మంగళవారం గాం«దీభవన్లో జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీ పదవులు పొందిన వారికి అభినందనలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పదవులకు న్యాయం చేయాలి..లేదంటే తప్పిస్తారు ‘పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వంలో మీరూ భాగస్వాములవుతారు. రాజకీయంగా ఎదగడానికి ఈ పదవులు, వేదికలే ఉపయోగపడతాయి. ప్రభుత్వ బాధ్యతల కంటే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వేలాది మంది పోటీ పడినా ఈ పదవులు మీకే దక్కినందుకు వాటికి న్యాయం చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు అంగీకరించలేదు. అంగీకరించి బాధ్యతలు తీసుకున్నవారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయినంత మాత్రాన ఇక రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అవుతుందని అనుకోవద్దు. మీరు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే రాజకీయంగా ముందుకెళతారు. లేదంటే ఎన్నికల ముందు తప్పిస్తారు..’అని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో చాలా అవకాశాలు ‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి, కష్టపడి కార్యకర్తలను గెలిపించిన వారికి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా పరిణామాలు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. 2029లో మీలో చాలామందికి అవకాశాలు వస్తాయి. అప్పటికల్లా సిద్ధంగా ఉండండి..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలా చేస్తే పార్టీకి తిరుగుండదు: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కా లంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్క సంక్షేమ పథకాల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నేతలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అవును..అంతా అక్క కష్టమే..జగ్గారెడ్డి దంపతులపై సీఎం చలోక్తి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క, మహేశ్గౌడ్, సంపత్కుమార్, షబ్బీర్ అలీ, నాయిని రాజేందర్రెడ్డిలు పార్టీలో ఎలా ఎదిగారో సీఎం వివరించారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డికి కీలకమైన టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. జగ్గారెడ్డి అందులో తనదేమీ లేదని అనడంతో.. ‘అవును.. నిర్మలక్కకు పదవి రావడంలో జగ్గారెడ్డికి సంబంధం లేదు. ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కష్టపడ్డారు.. అందుకే పెద్ద కార్పొరేషన్కు చైర్మన్ అయ్యారు. అంతా అక్క కష్టమే..’అంటూ సీఎం చలోక్తి విసిరారు. -
ఇదేం పద్ధతి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అటు రాష్ట్ర మంత్రులు, ఇటు పార్టీ నేతలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశ పరచడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ పదవులను కార్యకర్తలకు ఇప్పించడంలో జాప్యం జరిగితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన రేవంత్.. దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీలు లాంటి పదవులు నేరుగా తాను ఇవ్వలేనని, ఇన్చార్జి మంత్రులు షార్ట్లిస్ట్ చేసి పంపితే తాను ఫైనల్ మాత్రమే చేయగలనని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ పదవులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని, ఇలాంటి చర్యల ద్వారా కార్యకర్తలను నిరాశకు గురిచేయవద్దని చెప్పారు.వీలున్నంత త్వరగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలని, పార్టీ నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నామినేటెడ్ పదవులను ఫైనల్ చేద్దామని అన్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ పీఏసీ భేటీ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్తో పాటు పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్ని కలు, బీసీల కులగణన, ఎస్సీల వర్గీకరణ, సంస్థాగత నిర్మాణం గురించి చర్చించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్.. తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. వాళ్లను చూసి ఇంకొకరొస్తారు ఎవరంటే వాళ్లు వచ్చి గాం«దీభవన్లో ధర్నాలు చేస్తే ఆఫీసు నిర్వాహకులు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందంటూ కొందరు యాదవ సంఘాల ప్రతినిధులు గొర్రెలను తీసుకొచ్చి ధర్నా చేయడంపై సీరియస్గా స్పందించారు. పార్టీలో ప్రాధాన్యం కావాలని, మంత్రి పదవులు ఇవ్వాలని ఏ సామాజికవర్గానికి చెందిన వారయినా అడగొచ్చని, తనతో పాటు పార్టీ అధ్యక్షుడికి వినతిపత్రాలు ఇవ్వొచ్చని, డిమాండ్ చేయవచ్చని, కానీ ఓ సామాజిక వర్గం పేరుతో వచ్చి గాం«దీభవన్లో ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షాల చేతికి తామే ఆయుధాలిచ్చినట్టు అవుతుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన వారిని చూసి రేపు ఇంకొకరు వచ్చి ధర్నా చేస్తారని, ఇలాంటి ధర్నాలకు గాం«దీభవన్లో అవకాశం ఇవ్వకూడదని అన్నట్టు తెలిసింది. ఇన్చార్జి మంత్రులు గ్రామాలకు వెళ్లాలి క్షేత్రస్థాయిలో ఇన్చార్జి మంత్రులు చేయాల్సిన పనులు చేయాలని, లేదంటే గ్రామాలకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే తాను వెళ్లడం వల్ల ఉపయోగం లేదని, గ్రామాలకు వెళ్లాల్సింది ఇన్చార్జి మంత్రులేనని స్పష్టం చేశారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంస్థాగత నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని చెప్పారు. ‘జూబ్లీహిల్స్’పై చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఎన్నిక చాలా కీలకమని, ఈ అంశంపై పార్టీ ఫోకస్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. అయితే కీలకమే కాదని, ఖచ్చితంగా గెలిచి తీరాలని మీనాక్షి స్పష్టం చేశా రు. ఉప ఎన్నికకు పార్టీ సిద్ధం కావాలని, ఆ నియోజకవర్గంలో చేయాల్సిన అన్ని కార్యక్రమాల రోడ్మ్యాప్ను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తయారు చేయాలని సీఎం సూచించారు. అభ్యరి్థని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తామంటే తాము అభ్యర్థులమని ఎవరూ చెప్పకూడదని పీసీసీ అధ్యక్షుడు ఆదేశించారు.మేనిఫెస్టోలో పెట్టలేదు: భట్టి.. కాదు పెట్టాం: శ్రీధర్బాబు రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా తాము అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో పెట్టామంటూ పుస్తకం చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నాయి కానీ, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేసే పథకాలు కూడా రూపొందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు.పదవులు, ప్రాధాన్యతలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తదితరులు మాట్లాడారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’అనే పుస్తకాన్ని రేవంత్, మీనాక్షి ఆవిష్కరించారు. ‘వైఎస్ రచ్చబండ’లాంటి కార్యక్రమం కావాలి ప్రభుత్వ పరంగా చేసింది చెప్పుకోలేకపోతున్నామని సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్ పీఏసీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కారణంగా ఎవరికి లబ్ధి కలుగుతుంది, ఎవరికి కలగడం లేదనే అంశాలపై గ్రామాల్లోనే చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. కాగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని అభినందించారు. రాష్ట్రంలో గోల్డెన్ పాలన సాగుతోందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మహేశ్గౌడ్ అన్నారు.ఏఐసీసీ కూడా తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గణాంకాలతో సహా భట్టి వివరించారు. సమావేశం అనంతరం పీఏసీ నిర్ణయాలను మంత్రి వాకిటి శ్రీ«హరి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి భట్టి వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో చేసిన కార్యక్రమాలను పీఏసీ అభినందించిందని, గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించిందని చెప్పారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని కూడా పీఏసీ నిర్ణయించినట్లు తెలిపారు. -
చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్ విసిరారు. ‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. కేసీఆర్ సూచనలతో హరీశ్రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్ మాట్లాడారు. నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం ‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 2018లో వ్యాప్కోస్ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ‘బీఆర్ఎస్ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్ అన్నారు. మీకు ఫామ్హౌస్లు ఎట్లా వచ్చినయ్? ‘కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్లో హరీశ్రావుకు, జన్వాడలో కేటీఆర్కు, గజ్వేల్లో కేసీఆర్కు ఫామ్హౌస్లు ఎట్లా వచ్చినయ్? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా తొలి ప్రాధాన్యత రైతులే ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. కేసీఆర్ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్ సీరియస్
హైదరాబాద్: ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంచార్జ్ మంత్రులకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్.. ఫండ్స్ను సైతం ఇంచార్జ్ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు.ఈరోజు(మంగళవారం, జూలై 24) పీసీసీ రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలo గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి.. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లు,జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. -
2047కి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ’ డాక్యుమెంట్ను రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి రాత్రి 9.20 గంటల వరకు సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకునేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశిస్తున్న వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్ దిశా నిర్దేశం చేసింది. రైతుల సమక్షంలో సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.400 కోట్లను మంగళవారం జమ చేయనుంది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించింది. ఈ ఘనత సాధించిన శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహం వద్ద.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్తో పాటు మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ అలైన్మెంట్కు ఓకే హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను పరిశీలించింది. అనంతరం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ.ల పొడవు ఉండే ఈ అలైన్మెంట్కు ఆమోదం తెలిపింది. జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఒక చుక్క గోదావరి జలాలను కూడా నష్టపోకుండా చిత్తశుద్ధితో పోరాడాలని నిర్ణయించింది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించగా, దాని ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ రూపొందించిందని మంత్రివర్గం పేర్కొంది. ఈ విషయాన్ని మరిచిపోయిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సిద్ధంచేసేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. విభజన వివాదాలపై మళ్లీ చర్చలు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయిన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీల ఆధ్వర్యంలో మళ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాయనుంది. ‘కాళేశ్వరం’ సమాచారాన్ని కమిషన్కు ఇవ్వనున్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తెలియజేయాలనుకున్నా, సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెల 30 లోగా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని గడువులోగా కమిషన్కు అందజేయాలని నిర్ణయించింది. సీఎస్ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మేరకే బరాజ్లను నిర్మించినట్టు కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. నాటి మంత్రి హరీశ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బరాజ్ల నిర్మాణంపై నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాతే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈటల, హరీశ్రావు కమిషన్కు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు మంత్రివర్గ సమావేశాల్లో అలాంటి నిర్ణయాలు ఏమీ జరగలేదని రుజువు చేసేందుకు గాను వాటికి సంబంధించిన మినిట్స్ కాపీలను కమిషన్కు ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలను పెంపొందించి 2036 ఒలంపిక్స్లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలపై త్రైమాసిక సమీక్ష పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించనుంది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించడానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు, క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆయన సేవలను వాడుకోనుంది. ఎంఎన్జే ఆస్పత్రి అప్గ్రేడేషన్, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. బాసర ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీ కింద మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఏటా 180 మంది విద్యార్థులు చొప్పున 6 ఏళ్లలో 1080 మందికి అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్లో శాతవాహన వర్సిటీ కింద ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి 240 మందికి అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. శాతావహన వర్సిటీలో ఈ ఏడాది నుంచి చెరో 60 సీట్లతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. -
‘పరిపాలన చేతకాక, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు’
హైదరాబాద్: ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే.. ఒక కుటుంబం బారినపడి బలి అయ్యిందని మండిపడ్డారు. అవినీతి పాలనతో, దోపిడితో,, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బ తీశారని ద్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా పని చేసిందో మనం చూశామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అప్పులు ఇచ్చే వారు లేరని, తనను నమ్మే వాడు లేడని సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశాడన్నారు. పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్ పోయేది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని.. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క స్కాంలో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.‘‘కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారింది. నిజాయితీగా పదకొండేళ్ల నుంచి పాలన చేస్తోన్న మోదీ నుంచి అమిత్ షా అందరూ అదే చెప్పారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులే వందల కోట్లు సంపాదించుకున్నారు. ఈ అవినీతిపై విచారణను రేవంత్ సర్కార్ అధికారులకే పరిమితం చేయొద్దు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నీటి లభ్యత ఎందుకు కనిపించలేదు..?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.‘‘ఈ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో ప్రాజెక్టు కడితే.. ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం ఇజ్జత్ పోయేది. ఇంకా సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదు.. చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ. క్యాబినెట్లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించారో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు..?. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి. రేవంత్ సర్కార్ వచ్చాక వారు విచారణ చేయరు.. సీబీఐకి అప్పగించరు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
‘తెలంగాణతో చర్చించకుండా.. ఢిల్లీ నుంచి అనుమతులు కోరడం సరైంది కాదు’
ఢిల్లీ: పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఏపీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే చంద్రబాబుతో చర్చలకు తామే ముందడుగు వేస్తామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీ నుంచి అనుమతులు కోరతామని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైనది కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, జూన్ 20వ తేదీ) ఢిల్లీ నుంచి బయల్దేరి క్రమంలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ‘టిఆర్ఎస్ వల్లే తెలంగాణకు కృష్ణా నీటి పంపకాల్లో అన్యాయం జరిగింది. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావే. కృష్ణానదిలో మేము 500 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నాం. బిజెపికి టిఆర్ఎస్ అవయవ దానం చేసింది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను బీజేపీ గెలిపించడంలో బీఆర్ఎస్ సహాయం చేసింది. టీఆర్ఎస్ చరిత్రలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండటం ఇదే తొలిసారి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
‘సీఎం కుర్చీలో రేవంత్ను చూడలేకపోతున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్రావుకు కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాళ్ల మామ కేసీఆర్ను హరీస్రావు విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్లు సంగతి పూర్తిగా అర్థమైంది. కేసీఆర్కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. హరీష్ వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు..గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరు?, హరీష్ రావుకి కంటెంట్ కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ. సీఎం కుర్చీలో రేవంత్ను బీఆర్ఎస్ నేతలుచూడలేకపోతున్నారు. నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైంది. బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారు’ అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు. -
రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నదుల బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ (కనీస అవగాహన) లేకుండా మాట్లాడారు. బేసిన్ (పరివాహక ప్రాంతం)ల కంటే కూడా బ్యాగుల మీదే నాలెడ్జి బాగా ఉన్నట్లు ఉంది. నదీ పరివాహాక ప్రదేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ రాష్ట్రం పరువు తీశారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్లపై ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కేంద్ర మంత్రులను కలుస్తూ అనుమతులు కోరుతుంటే, కనీసం ఆ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో కూడా సీఎం రేవంత్రెడ్డి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.‘రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు. అంతులేని అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా సీఎం ఏం చేస్తున్నట్లు..?’ అంటూ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలా?‘తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్కు అవగాహన, చిత్తశుద్ధి లేదని బుధవారం ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తేలిపోయింది. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కూడా బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. బనకచర్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తే, సీఎం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో.. ‘ఈ భేటీని రాజకీయ వేదికగా మార్చకు..బనకచర్ల ఆపాలి’ అని మా రవిచంద్ర అంటే సీఎం అబద్ధాలకు వేదికగా మార్చారు. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం చేతకాని సీఎం చెప్తున్న అబద్ధాలకు అంతు ఉండటం లేదు. రేవంత్రెడ్డి కుసంస్కారి.. వదరుబోతు. ఆయన నల్లమల పులిబిడ్డ కాదు..వెకిలి మాటల వెర్రిబిడ్డ. మేం ఉద్యమాల నుంచి వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు..’ అంటూ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రేవంత్ దాసోహం అవుతున్నారు..‘గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, మిగిలిన జలాలను ఏపీకి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ఆయన జాగీరు కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతకడాన్ని రేవంత్ మానుకోలేక పోతున్నారు. ఏపీకి దాసోహం అవుతూ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రేవంత్ చేసిన ద్రోహానికి ఆయనను ఉరి తీసినా తప్పులేదు. నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రబాబుకు రేవంత్కు మధ్య ఆదిత్యనాథ్ దాస్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి దోచి పెట్టేందుకు అవి రేవంత్ అయ్య సొమ్ము కాదు. ఆయన కేవలం తెలంగాణకు కాపలాదారు మాత్రమే..’ అని మాజీమంత్రి అన్నారు. మేం అంగీకరించామనడం శుద్ధ అబద్ధం‘తెలంగాణకు సాగునీటి కోసం పరితపించిన కేసీఆర్ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. పోలవరం ద్వారా పెన్నా బేసిన్కు నీరు తరలిస్తే కృష్ణా బేసిన్లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని గతంలో అఫిడవిట్ ఫైల్ చేశాం. గోదావరిలో సగటున ఏటా 3 వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా కేసీఆర్ అంచనా వేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ప్రస్తావించారు. కానీ రేవంత్రెడ్డి వాస్తవాలను వక్రీకరించి బనకచర్లకు గత ప్రభుత్వం అంగీకరించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణను సంప్రదించకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపడితే అంగీకరించేది లేదని గతంలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. కానీ రేవంత్ మాత్రం 1,000 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి, మీరు ఎన్ని జలాలు అయినా తరలించుకోండి అని ఏపీకి చెప్తున్నారు..’ అని హరీశ్రావు ఆరోపించారు.ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం..‘కృష్ణా–గోదావరి నదీ జలాల అనుసంధానం గురించి కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు గతంలో ఏపీ సీఎం జగన్ అంగీకరించక పోవడంతో అది ముందుకు సాగలేదు. తెలంగాణతో సంబంధం లేకుండా కృష్ణా–గోదావరి అనుసంధానికి అంగీకరించే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. అవసరమైతే రైతుల పక్షాన కోర్టులను ఆశ్రయిస్తాం..’ అని హరీశ్రావు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ కోసం ‘ఆర్ఆర్ మాడ్యూల్’!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ‘ఆర్ఆర్ మాడ్యుల్’పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్కు (ఎస్ఓటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్రావు దీనిని పర్యవేక్షించారని వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్రావు హయాంలో అనేకమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వీరి కోసం మాడ్యూల్స్ రూపొందించారు. ఒక్కో మాడ్యుల్లో సదరు వ్యక్తితోపాటు ఆయనకు సంబంధించి ఇంకా ఎవరెవరివి ఫోన్లు ట్యాప్ చేయాలో ఆ నంబర్లు చేర్చేవారు. ఈ మాడ్యూల్ను అనునిత్యం పర్యవేక్షిస్తూ వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను పర్యవేక్షించడానికి కొందరు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డికి సంబంధించిన మాడ్యుల్కు ప్రభాకర్రావు ‘ఆర్ఆర్ మాడ్యూల్’అనే పేరు పెట్టారు. ఈ మాడ్యూల్లో ఉన్న వారి ఫోన్లను పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. ప్రభాకర్రావు ఎస్ఐబీ చీఫ్గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. దీనివల్ల ఒనగూరుతున్న లాభాలు తెలిసిన తర్వాత ప్రభాకర్రావు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. ఎస్ఐబీ అధికారులు చాలా కాలం కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారు. 2018 తర్వాత మారిన ట్యాపింగ్ పంథా2018 ఎన్నికల సందర్భం నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్రావు, తిరుపతన్న తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్రావు ట్యాపింగ్ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. దీన్ని ప్రణీత్రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్రావు బృందం రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న వార్రూమ్లో ఏర్పాటు చేసి ‘ఆర్ఆర్ మాడ్యూల్’ను కొన్నాళ్లు పర్యవేక్షించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాలుగోసారి హాజరైన ప్రభాకర్రావుప్రభాకర్రావు గురువారం నాలుగోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ విచారణకు ప్రభాకర్రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడానికి ఉన్న అవకాశాలను న్యాయ నిపుణులతో పరిశీలిస్తోంది. -
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డీపీఆర్లో..ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. బరాజ్ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్ఎల్బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో సాగర్ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలుగోదావరిలో వరద ఉండే జూన్–అక్టోబర్ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. -
Harish Rao: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
-
‘సీఎం రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’
హైదరాబాద్ బనకచర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు విమర్శించారు. రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం, జూన్ 19) తెలంగాణ భవన్లో హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్ పెట్టిన తర్వాతే.. మీరు మీటింగ్ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్ను హరీష్ ప్రశ్నించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 TMC లు, గోదావరి బేసిన్ లో 1000 TMC నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండి...అని రేవంత్ అంటున్నారు.. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అంటై హరీష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్ -
ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ
-
డిజిటల్ భద్రతతోనే అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ సేవల సంస్థ గూగుల్ ప్రారంభంతో ప్రపంచమే మారిపోయి మానవ జీవితం డిజిటల్మయంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అయితే, గోప్యత, భద్రతకు డిజిటలైజేషన్ సవాలు విసురుతోందని, డిజిటల్గా సురక్షితంగా ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్ దివ్యశ్రీ భవన్లో కొత్తగా ఏర్పాటైన ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’(జీసెక్)ను సీఎం రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. జీసెక్ నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని, దేశ సైబర్ భద్రత ప్రమాణాలను పెంచుతుందని చెప్పారు. ‘చెడు చేయొద్దనే గూగుల్ సంస్థ విధానాన్ని నేను ఇష్టపడతాను. గూగుల్ తరహాలోనే మా ప్రభుత్వం కూడా మంచి పనులు మాత్రమే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చేదిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మహిళలు, రైతులు, యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గూగుల్ మద్దతును కోరుతున్నా. తెలంగాణతో గూగుల్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆరోగ్యం.. ఇలా అనేక రంగాలలో గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం. గూగుల్ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం’అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐ యుగంలో సైబర్ సెక్యూరిటీ సవాలు: శ్రీధర్బాబు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేకొద్దీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ హైదరాబాద్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటి జీసెక్ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. ‘సేఫ్ డిజిటల్ తెలంగాణ 2.0’లక్ష్యానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్లు అరిజీత్ సర్కార్, హీతర్ అడ్కిన్స్, విల్సన్ వైట్, గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లబానా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.భారత్లో తొలి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినది నాలుగోది. ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ హెడ్ ఆఫీసును సందర్శించిన సమయంలో హైదరాబాద్లో జీసెక్ ఏర్పాటు కోసం చొరవ చూపారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’సదస్సులో భారత్లో జీసెక్ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీని ఏర్పాటుకు గత ఏడాది డిసెంబర్ 4న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ సెక్యూరిటీ హబ్గా జీసెక్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రతా ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన రంగంలో పనిచేస్తున్న నిపుణులకు ఇది సహకార వేదికగా ఉపయోగపడుతుంది. జీసెక్ ద్వారా ఐటీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. -
కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో కేసీఆర్ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్పై ఆరోపణలు చేశారు. గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం ‘చంద్రబాబు, కేసీఆర్ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్తో ప్రగతిభవన్లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్ అన్నారు. కేసీఆర్, జగన్లు ప్రగతిభవన్లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్ చెప్పారు. ఆ మినట్స్నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను 2015లో నాటి సీఎం కేసీఆర్ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్ పాటిల్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్ దాస్లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. -
బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని.. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఎంపీలకు వివరించామని తెలిపారు.‘‘రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నాం. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి, సుదీర్ఘంగా వివరించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దురుద్దేశంతో బీఆర్ఎస్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘2016 అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ 3 వేల టీఎంసీ నీళ్లు అనే పదం నుంచి బనకచర్ల పుట్టింది. 3 వందల టీఎంసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు వందల టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీలు అన్నారు. అందుకే చంద్రబాబు ప్లాన్ మొదలు పెట్టారు. చంద్రబాబు బనకచర్ల అనగానే కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు చేశాం...బనకచర్ల పై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరి తీయ్యాల్సింది కేసీఆర్, హరీష్ రావునే. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. చేసిందంతా కేసీఆర్, హరీష్ రావు చేసి.. నింద మాపై మోపుతారా?. కమీషన్లకు కకుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్రావు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టు పై 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు.ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం 500 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనుషులు చనిపోతే హరీష్రావు కళ్లలో పైశాచిక ఆనందం వెళ్లబుచ్చుతారు. పేదలు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. హరీష్ రావు చిల్లర ప్రయత్నాలు మానాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి.. మీరు చేసిన తప్పులు మేము సెట్రేట్ చేస్తున్నాం. పది పైసల మిత్తికి 50వేల మిత్తికి హరీష్ రావు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా టార్గెట్.తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. బనకచర్ల పై అవసరం అయితే ప్రధాన మంత్రిని కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కోర్టుకు సైతం వెళ్తాం. చంద్రబాబుకు నేను సూచన చేస్తునా!. కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు.. ప్రధాని ఏదైనా వినొచ్చు అనుకుంటే మీ భ్రమ. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తాం. మేము తెలంగాణ ప్రజల కోసం కోర్టుకు అయినా వెళ్తాం. 968 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకోవడానికి బ్లాంకెట్గా అనుమతి ఇవ్వాలి’’ అని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?
సాక్షి,తెలంగాణ: రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్ ఏసీబీ విచారణ అంతా టైంపాస్నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా.. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే .. సచ్చిందాక సాకుతా అన్నాడట. ఏస్తున్న రైతు భరోసా సరే మరి.. ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది?. ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది?ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి?ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి?శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిలోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్లేసిఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది.మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద - తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని కామెంట్స్ చేశారు. -
రాష్ట్రంలో నాలుగు అత్యాధునిక గోశాలలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోసంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, రఘునందన్రావుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో గోసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. రేవంత్రెడ్డి మంగళవారం తన నివాసంలో గోసంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యంతోపాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోసంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.భక్తులు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నా స్థలాభావం, ఇతర సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయని, కొన్నిసార్లు గోవులు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు గోవుల సంరక్షణే ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని చెప్పారు.వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని, గో సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను అధికారులు సీఎంకు అందజేశారు. ఈ సమీక్షలో పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం ముఖ్యకార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్, 9 రోజుల్లో 9వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
-
వైద్య కళాశాలల్లో ఏ వసతులు కల్పించాలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని జాతీయ వైద్యమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2025–26 సంవత్సరానికి ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ చేయాలంటే.. ఈనెల 18న వైద్యశాఖ కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలోనే కళాశాలల్లోని వసతులు, జాతీయ వైద్యమండలి పేర్కొంటున్న నియమ, నిబంధనలు వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే వైద్యారోగ్యశాఖపై ఐసీసీసీలో సోమవారం సీఎం సమీక్షించారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమరి్పంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంతమేర నిధులు కావాలనే దానిపై నివేదిక ఇవ్వాలన్నారు. జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి పదోన్నతులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్గా జపనీస్ సబ్టెక్ట్ ఉండాలి నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష)ను ఒక ఆప్ష నల్గా నేర్పించాలని, జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతినెలా మూడోవారంలో ఈ రెండు శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: జూలైలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మంత్రులతో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎం 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు.జరగని నిర్ణయాలను ముందుగానే ప్రకటించడం వల్ల ప్రజల్లో పలుచన అవుతామని స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సుతిమెత్తగా మందలించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మంత్రులు టార్గెట్లు పెట్టుకుని మరీ పని చేయాలని, స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న కొండా సురేఖ మినహా మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్ని ఎకరాలున్నా రైతుభరోసా!: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులతో రేవంత్ చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెలాఖరు వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.రైతు భరోసా విషయంలో రాజీ పడేది లేదని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతున్నందున ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా వేద్దామని ఆయన అన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల గురించి బయట మాట్లాడేదాని కంటే, ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించడంపైనే దృష్టి పెట్టాలని అన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని, బీఆర్ఎస్ బలం కొద్దో గొప్పో ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేయాలని సూచించారని సమాచారం. బనకచర్లపై కేంద్రంతో తేల్చుకుందాం.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంతోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ నివేదికను సమర్పించడం, దానికి డీపీఆర్ను సమర్పించాలని కేంద్రం కోరడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బనకచర్లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వద్దామని అన్నట్లు తెలిసింది. -
తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు ఇస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1.49 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేస్తూ కంప్యూటర్ బటన్ నొక్కారు. కేవలం 9 రోజుల్లో రైతులందరికీ మొత్తం రూ.9 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం 2 ఎకరాల లోపు 41,25,289 మంది రైతులకు రూ.2,349.83 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 39.16 లక్షల ఎకరాలకు గాను ఈ డబ్బులు జమయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రంలోని 1,034 వేదికల్లో కొత్తగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో వర్చువల్గా సంభాషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు భరోసా గురించిన ప్రకటన చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పదేళ్లలో వ్యవసాయాన్ని నీరుగార్చారు.. గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. వరి వేస్తే ఉరే అని, వడ్లు కొనలేం అని పెద్దాయన చెప్పాడు. మేం పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దొడ్డు ధాన్యంకు బదులు సన్న ధాన్యం పండించమని రైతులను కోరాం. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించాం. ఈ మేరకు రైతులు సన్న వడ్లు పండిస్తే, సన్న బియ్యం పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్ర రైతులు ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా 2.80 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు. రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు సర్పంచులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చే నాటికే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. కాంట్రాక్టర్లకు మరో రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తంగా రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంటు డబ్బులు వాడుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ రూ.12 వేల కోట్లు బకాయి పెట్టి పోయారు. పదేళ్లలో రూ.8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి పోయినా, ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. మంత్రులందరితో చర్చించి రైతులందరికీ 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించాం. రైతు ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యం వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చివరకు ముఖ్యమంత్రి అయినా రైతు ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యపడుతుంది. కుర్చీ బలంగా ఉంటుంది. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. రైతును రాజును చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నాం. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రెండు విడతలుగా రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17 వేల కోట్ల లోపే. ఊళ్లళ్ల పెళ్లిళ్లలో ఎక్కువ కటా్నల కోసం పిలగాని తండ్రులు కార్లు, మేడలు చూపించినట్లు..పెద్దాయన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఆనాటి గాయాలు మానలేదు. అయినా రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతుబీమా, బోనస్ కింద 18 నెలల్లోనే రూ.1,01,720 కోట్లు ఖర్చు చేశాం. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దీనిపై గ్రామ సభలు పెట్టి చర్చిద్దాం. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చాం. రైతులకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే..మొన్ననే వచ్చాడు పిలగాడు కుదురుకోనిద్దాం అని లేకుండా రాజకీయం చేస్తున్నారు. విద్యార్థులు, రైతులు చనిపోతే సంతోíÙస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనందం పొందుతున్నారు. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవకుండా ఫాం హౌస్లో లేను. అయినా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు జొన్న రొట్టెలు తినాలి చిన్నప్పుడు మా ప్రాంతంలో కందులు, బుడమ కాయలు (దోసకాయలు) పండేవి. దోసకాయ కందిపప్పు కూరను జొన్నరొట్టెతో తింటే ఎంతో కమ్మగా ఉండేది. మటన్, చికెన్ కూడా పనికిరాదు. విద్యార్థులు జొన్నరొట్టెలు తినండి. మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఏ సిక్స్ ప్యాక్ ఎక్సర్సైజ్లు పనికిరావు. వరి ఒక్కటే కాదు. కూరగాయలు, కందులు, పెసర్లు వంటి మిల్లెట్లు పండించాలి. రైతులకు సబ్సిడీతో పనిముట్లు ఇస్తాం. అధునాతన పంటలు కాదు.. తాతలు, తండ్రులు పండించిన పంటలను మళ్లీ పండించాలి. కూరగాయలు పండిస్తే హైదరాబాద్లో అమ్ముకోవచ్చు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు అనుభవజ్ఞులైన రైతులతో రైతు వేదికల వద్ద పాఠాలు చెప్పించండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
‘మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం’
సాక్షి,హైదరాబాద్: మరో పదేళ్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ రైతునేస్తం వేదిక నుంచి బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమచేశారు.9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు.పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు.వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం.మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్న బియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారుఒక్కొక్కటిగా సరి దిద్దుకుంటూ..ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది.కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా?. భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం.రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
KTR: రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను
-
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’
సాక్షి,హైదరాబాద్: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఇవాళ కేసీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా
-
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్రావు
హైదరాబాద్: చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీచ డీఎంఈలు ఎన్ఎమ్సీ ముందు హాజరు కావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శమన్నారు హరీష్రావు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం.. ఈరోజు కమిటీ వేయడం హాస్యస్పదమన్నాఆరు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్కు ఎవరు భరోసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన.. మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థుల జీవితాలు నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
Minister Seethakka: ఆ మాట నేను అనలేదు
-
అక్రమ కేసులకు భయపడం: కేటీఆర్
-
భయపడను.. అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్పాలిటిక్స్లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు. ‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్(KTR) అన్నారు.అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్కు బయల్దేరారు. అంతకు ముందు.. ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్.. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణహెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారుల ప్రశ్నలుఏడుగంటల పాటు సాగిన విచారణఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలుకేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారని విచారణ కేటీఆర్ స్టేట్మెంట్ణు రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులుఅవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్కు సూచన కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత ఆసక్తిర వ్యాఖ్యలు కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.ఏసీబీ విచారణపై కవిత స్పందించారు‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజంచెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదుమా పార్టీలో లోపాలు సవరించుకుంటాంమా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోంప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడిమా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. గంటలకు పైగా కేటీఆర్పై ప్రశ్నం వర్షం. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్ఎస్ శ్రేణులు.ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ. కేటీఆర్తో నలుగురి బృందం.. కేటీఆర్తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్రావుఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ను విచారించనున్న ఏసీబీతెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కు బయల్దేరిన కేటీఆర్కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎఫ్ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తుఅక్రమ కేసులకు భయపడం: కేటీఆర్అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారుఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చుచట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందిమూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తాఅక్రమ కేసులకు భయపడంఅరెస్ట్ చేసినా వెనక్కి తగ్గంజైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాంలై డిటెక్టర్కు కూడా నేను సిద్ధం కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలుడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ కేసులురైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరుతెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.తెలంగాణభవన్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలుతెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.కేసీఆర్తో కేటీఆర్ భేటీ..నందిని నగర్ నివాసంలో కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..తాజా పరిస్థితులపై చర్చ..మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు.. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్.. కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్కు బయలుదేరిన కేటీఆర్..మరికాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోనున్న కేటీఆర్..10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..భారీగా మోహరించి పోలీసులు..ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.👉మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.I will never be deterred by your enquiries, commissions and political vendettaWe @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు
-
నేడు 1,034 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో అధికారులతో కలసి సమీక్షించారు. రైతు వేదికలలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లకు మంత్రి తుమ్మల పలు ఆదేశాలు జారీ చేశారు.రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలలో ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని, విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది రైతులు పాల్గొంటారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించామని, ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు ఇతర రైతుల అనుభవాలను తెలుసుకొన్నారని చెప్పారు. తాజాగా ఈ ‘వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని’, మరొక 1,034 రైతు వేదికలకు కల్పించబోతున్నామని, వీటిని ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానించామని తెలిపారు. కాగా, రైతు వేదికలకు హాజరైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు తుమ్మల తెలిపారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు. -
ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాణిజ్యవేత్త నందన్ నీలేకని సారథ్యంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలు అందించే సేవలివీ.. –ఎక్స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు మ్యాథ్స్పై బేసిక్స్ను అందిస్తుంది. –ఫిజిక్స్వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. –ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్పై శిక్షణ ఇస్తుంది. –ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. –పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణ ఇస్తుంది. –ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది. -
జూలై రెండో వారంలో..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల చివరి వారంలోనే వస్తుందని సమాచారం. కాగా స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో ముగిసిన పాలకవర్గాల గడువు రాష్ట్రంలోని స్థానిక సంస్థల గడువు ఎప్పుడో ముగిసింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు 2024, జనవరిలోనే అయిపోయింది. జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు గత ఏడాది జూన్లో పూర్తయింది. ఇక పురపాలక సంఘాలకు ఈ ఏడాది జనవరిలో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. మరోవైపు కేంద్రం ప్రతి ఏటా స్థానిక సంస్థలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే పాలకవర్గాలు లేని కారణంగా ఈ నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ముందే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. దీంతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ ఇచ్చే ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది. ఈ రెండు పథకాల నిధులను జమ చేసిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులు మాత్రమే సమయం ఉందని ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమాచారాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఇస్తారని, ఈ ఎన్నికల అనంతరం వారం రోజుల వ్యవధిలోనే సర్పంచ్లు, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల నగారా మోగించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అధికార పార్టీలో ‘కమిటీల’ హడావుడి స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయనే సమాచారం నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హడావుడి పెరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయనున్న గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకానికి గడువు విధించారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 25వ తేదీకల్లా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలని, గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలకు నియామక ఉత్తర్వులను కూడా ఇచ్చేయాలని ఆమె ఈ సమావేశంలో ఆదేశించారు. దీంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురు ముఖ్య నాయకుల పేర్లను పీసీసీకి పంపాలని, వీరికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో కేడర్ ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలనే వ్యూహంతోనే మీనాక్షి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపు లేకుండానే..! ఈ నెల చివరి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పక్షంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అవకాశం లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. అందువల్ల బీసీలకు పాత రిజర్వేషన్లనే కొనసాగించవలసి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో..కేంద్రం అనుమతితో నిమిత్తం లేకుండా పార్టీ పరంగా బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. నేడు మంత్రులతో సీఎం కీలక చర్చలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాస్తవానికి ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. -
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఎన్నికల షెడ్యూల్పై చర్చ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సోమవారం(రేపు) మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.మరోవైపు.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే గడువుందని.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పారు. -
సినీ పరిశ్రమకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
-
కోటి తారల వీణ... సినీ తెలంగాణ
తారలు తళుకులీనాయి... నింగిలోని నక్షత్రాలు కూడా తొంగి చూశాయి. అశ్వత్థామలు, లక్కీ భాస్కర్లు, పుష్పరాజ్లు, ఇది చిన్న కథ కాదు అన్నట్టుగా మాదాపూర్ హైటెక్స్కు అరుదెంచారు. అలనాడు ఇంటింటా వెలిగిన జయప్రద, జయసుధ, సుహాసినిలను వేదిక మీద చూసి గృహిణిలు తెగ ముచ్చటపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఈ వేడుకకు కర్త, కర్మలై శోభ తెచ్చారు. ఆటలు, పాటలు, కళాప్రదర్శనలు...చూడ్డానికి వెండితెర చాలదు! అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి...చుక్కల్లో చందమామలుగా అభిమానులను అలరించారు. ఇంతకాలం ఎదురుచూసిన సినీ అవార్డుల వేడుకకు తెలంగాణ ప్రభుత్వం పదింతలు అట్టహాసం కలిపి నభూతో అన్నట్టుగా నిర్వహించింది. చిత్రమాలికను చిత్తగించండి...ఇది సినిమా అవార్డ్స్ గనక సరదాగా ఓ డైలాగ్ చెబుతా అంటూ... ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలోని డైలాగ్ చెప్పి, అల్లు అర్జున్ అలరించారు. ‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి భట్టిగారికి, ‘దిల్’ రాజుగారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్గారు లేక పోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్... ఐ లవ్ యూ. ఈ అవార్డు ప్యూర్గా మీ విజన్. ‘పుష్ప’ నిర్మాతలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు టీమ్ అందరికీ ధన్యవాదాలు. రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే... మీరు ఆ రోజు ‘పుష్ప 1’ సినిమాను హిందీలో రిలీజ్ చేయమని చెప్పక పోయి ఉంటే, ఈ రోజు ఇంతటి రేంజ్ ఉండేది కాదు. ధన్యవాదాలు సార్. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డు. ‘పుష్ప 2’ గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ (ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ..)కి థ్యాంక్స్.– నటుడు అల్లు అర్జున్కళామతల్లి ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా గౌరవించి అవార్డులివ్వడం సంతోషం. ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సం పాదించుకున్నారు గద్దర్ అన్న. ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా అవార్డులిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ప్రారంభించాం. ఎంతోమంది ఈ అవార్డుని పొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ కొడుకుగా నాన్నగారి అవార్డుని తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా నాకు ఇచ్చిన పది లక్షల నగదును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పతిక్రి ఇచ్చినట్లు భావిస్తున్నాను. ఇందుకు రేవంత్ అన్నకి థ్యాంక్స్. – నటుడు నందమూరి బాలకృష్ణ (ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు) గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు ప్రారంభించడం, సినిమా ఇండస్ట్రీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ అవార్డులివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వకారణమైన మూమెంట్. మహబూబ్నగర్లో పుట్టిన పిల్లోణ్ని.. కాంతారావుగారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆయనకు నిజమైన నివాళి. ఈ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేను అయినందుకు చాలా బాధ్యతగా భావిస్తున్నాను.. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కగారికి, ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్’’.– నటుడు విజయ్ దేవరకొండ (కాంతారావు ఫిల్మ్ అవార్డు)పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ జ్యూరీ వారు సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఫిల్మ్ను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ అన్ని సినిమాలు చూసింది. నేషనల్ అవార్డ్ పొందిన సినిమాలు, రివ్యూస్ వచ్చిన సినిమాలు, కమర్షియల్గా బాగా ఆడిన సినిమాలు... ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా జ్యూరీ సెలెక్ట్ చేసింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకి నాలుగు అవార్డులు ఇవ్వడానికి జ్యూరీ కమిటీ అడగడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈరోజు ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే 2024లో అద్భుతంగా, కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలను జ్యూరీ సెలెక్ట్ చేయడం, వారికి కూడా ఈ రోజు అవార్డులు ఇచ్చుకోవడం ఆనందకరం.– ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజుఎన్ని అవార్డులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిగారు, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. మమ్మల్ని ప్రోత్సహించడానికి గద్దర్గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది. – దర్శకుడు సుకుమార్ (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు)గద్దర్గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీ దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. – సంగీత దర్శకుడు కీరవాణిఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేల మీద, మన వాళ్ల మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మరచి పోలేని విషయం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. – రచయిత చంద్రబోస్గద్దర్ పేరుపై ఫిల్మ్ అవార్డ్స్ను ఇవ్వడంతో పాటు గద్దర్ ఫౌండేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల రూ పాయలను మంజూరు చేశారు. గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ గద్దర్ ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్ను స్వీకరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ గద్దర్ మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కగారికి, రాష్ట్ర మంత్రులు, అవార్డులు స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ అభినందనలు. రేవంత్ అన్నగారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024న గద్దర్ ఫౌండేషన్ ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డిగారు ప్రామిస్ చేసినట్లుగానే ఈ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాన్నగారి సాహిత్యం, నాన్నగారి విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్ కి రూ. 3 కోట్లు కేటాయించడాన్ని ఫౌండేషన్ తరఫున మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు సార్... ప్రతి సంవత్సరం మీరు చేపడుతున్న కల్చరల్‡అండ్ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్కి స్థలం కేటాయిస్తున్నట్లుగా నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్.. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు (గద్దర్), సినిమా వేడుకలు కూడా అక్కడే చేసుకుందామని కోరుతూ, మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు, భట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు.‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు సాధించిన సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్లను ప్రత్యేకంగా సన్మానించారు -
హాలీవుడ్కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. -
KTRపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు
-
కేటీఆర్పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యంతర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కూడా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే, కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో పాటు, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇక, ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదుతో పోలీసులు.. కేటీఆర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో, సీసీఎస్ పోలీసులు.. కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో నోటీసులు..ఇదిలా ఉండగా.. ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్ఎన్రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా విచారించారు. తాజాగా కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. -
ఇక అసెంబ్లీ పదవులు!
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్ల బదిలీలు, జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అసెంబ్లీ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశముందని, ఒకవేళ మండలిలో అదే సామాజిక వర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఉందని సీఎం భావించిన పక్షంలో బీసీ నేతకు కేటాయించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇక మొన్నటివరకు విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మంత్రిగా, మరో విప్ రాంచంద్రు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను కూడా భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సమీకరణలను బట్టి విప్ల సంఖ్యను 4 నుంచి 5 లేదా 6కు పెంచే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. చీఫ్ విప్ ఎవరికి?ప్రస్తుతం అసెంబ్లీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ వర్గాలకు చెందిన రాంచంద్రునాయక్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు బీసీలు.. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య, మున్నూరుకాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్లు విప్లుగా ఉన్నారు. మరో రెండు విప్ పదవులు (అడ్లూరి, రాంచంద్రు నాయక్) ఇటీవల ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు చీఫ్ విప్ను నియమించకపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇలావుండగా ఇప్పటివరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ పోస్టులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆ వర్గం నేతలకు చాన్స్ దక్కలేదు.ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డికి కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానిపక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి నియామకం ద్వారా అటు సామాజిక సమీకరణలను పాటించడంతో పాటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శకు కొంతవరకు చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకపోతే మాత్రం ప్రస్తుతం విప్లుగా ఉన్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరికి పదోన్నతి లభించవచ్చని, బీర్ల అయిలయ్య లేదంటే ఆది శ్రీనివాస్లను చీఫ్ విప్లుగా నియమిస్తారని, తద్వారా మంత్రి పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్న వాదనకు తెరపడినట్టవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ల భర్తీకీ సమీకరణాలుఅసెంబ్లీలో ప్రభుత్వ విప్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సీఎం రేవంత్ అంచనా వేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, మాల సామాజిక వర్గం నుంచి మేడిపల్లి సత్యం శ్రీగణేష్, ఎస్టీ కోటాలో మురళీ నాయక్, వెడ్మ బొజ్జుల పేర్లను పరిశీలిస్తున్నారని, సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల సమీకరణల్లో ఒక్కో వర్గానికి ఒకరిని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు విప్గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే విషయాన్ని కూడా సీఎం రేవంత్ సీరియస్గా పరిశీలిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ పదవుల పందేరం అధికారికంగా ఉండే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు కాలేజీల జమా ఖర్చుల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా? అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.పాఠశాలల నిర్వహణ, ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సెలింగ్ షెడ్యూల్, టీచర్ల సమస్యలు, ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, గురుకుల హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల విషయమై సీఎం.. అధికారులను అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రైవేటు కాలేజీలపై గతంలో వేసిన టాస్క్ఫోర్స్ నివేదికలోని అంశాలేంటి? అని నిలదీశారు.ఫ్యాకల్టీ లేకపోవడం, ఇష్టానుసారం సీట్లు పెంచుకోవడం, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేంటని ప్రశ్నించారు. అయితే, అధికారులు ఇందుకు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా?’అంటూ ప్రశ్నించారు. ఫీజులకు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు.. కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దాం అని అన్నారు. తాళాలపై తీవ్ర ఆగ్రహం.. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు బిల్లులు విడుదల చేయలేదని యజమానులు తాళం వేయడంపై సీఎం సీరియస్గా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతుంటే కనీసం ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు రీ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను అధికారులు వివరించలేకపోవడం కూడా సీఎంను ఆగ్రహానికి గురి చేసింది.బడిబాట కార్యక్రమం ఎక్కడా సజావుగా సాగడం లేదని, టీచర్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదని, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలాచోట్ల పుస్తకాలు, దుస్తులు అందడం లేదని విమర్శలు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు ఇచ్చిన వివరణపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళల్లో 25 శాతం ఉచిత సీట్లు ఇచ్చే అంశంపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం ప్రస్తావించారు. కొత్తగా 571 పాఠశాలలు: సీఎం ఇరవై మందికన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖపై సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబదీ్ధకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం పెంచాలి విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మౌలికవసతుల కల్పన, టీచర్లకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది -
విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(శుక్రవారం. జూన్ 13) విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్లో వారు తమకు ఇష్టమైన రంలగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. -
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025 -
కేటీఆర్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .హైదరాబాద్ సీసీఎస్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేలా తెలంగాణ విద్యాశాఖ అనుమతులిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. -
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ దగ్గర’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందని, సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలనుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఒకవేళ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే 25–30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ కాంగ్రెస్ను వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, త్వరలో ఇది జరగబోతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో పాల్ విలేకరులతో మాట్లాడారు. -
రేవంత్ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్కు జాబితా
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక, సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
సీఎం శాఖలు సీనియర్లకు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం. -
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్నాథ్ కోవింద్ ఉత్తర్ప్రదేశ్లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఆ శాఖలతోనే సర్దుబాటు?
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేప థ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది.కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్ణాటక తరహాలో పురపాలికల విభజన కర్ణాటకలో బెంగళూరు, పరిసర పట్టణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రిగా ఉండగా, మిగిలిన కర్ణాటక రాష్ట్రానికి మరో మంత్రి ఉన్నారు. కర్ణాటకలో ఉన్న తరహాలోనే కోర్ ఏరియాకు ఒకరు, మిగిలిన మున్సిపాలిటీ లకు మరొకరిని మంత్రులుగా నియమిస్తారని సమాచారం. అయితే, కోర్ ఏరియాను తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మూసీ పునరి్నర్మాణం, ఫోర్త్ సిటీ ఏర్పాటు తదితర కీలకాంశాలు చేపట్టాల్సి ఉన్నందున, హెచ్ఎండీఏ తోపాటు తాను నిర్మించతలపెట్టిన ఫోర్త్సిటీ పరిధిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలను ఒక మంత్రికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పురపాలక శాఖ కార్యదర్శులకు కూడా ఇదే తరహాలో పని విభజన చేయడం గమనార్హం.ఎవరికి.. ఏ శాఖ!సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణల నేపథ్యంలో కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై చర్చ జరుగుతోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్థక శాఖతో మరో ముఖ్యమైన శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇవ్వొచ్చని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కూడా సింగరేణి బెల్ట్ కావడం, గతంలోనూ ఈ శాఖను ఆయన సోదరుడు వినోద్ చూసిన నేపథ్యంలో కార్మిక శాఖ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు మరో ముఖ్యమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. -
నా స్కూల్ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
-
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముగ్గురి పేర్లు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు.కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఇక, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు చేయగా.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ,వివేక్ ,అడ్లూరి లక్ష్మణ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ముగ్గురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు.. హైదరాబాద్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించిన ప్రభుత్వం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు. ఆదివారం ఉదయమే ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ప్రోటోకాల్ అధికారులు రాజ్భవన్ చేరుకున్నారు. హైకమాండ్ కసరత్తు..ఇక, మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టంచేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.చర్చల అనంతరం..గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించింది. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరెవరికి చోటు కల్పించాలో నిర్ణయం చెబుతామన్న అధిష్ఠానం శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి కలిసి అటు ఆలంపూర్లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
ముగ్గురా? నలుగురా?
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు) పేర్లు ఖరారయ్యాయి. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని సమాచారం. అడ్లూరివైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. రోజంతా ఉత్కంఠ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే విస్తరణ ఉంటుందని, కాదుకాదు మధ్యాహ్నం అంటూ విస్తృతంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, విస్తరణపై ఏఐసీసీ కానీ, టీపీసీసీ కానీ శనివారం అర్ధరాత్రి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం ఢిల్లీలోనే ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో జరిగే హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మక«థ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం మినహా మరో కార్యక్రమం గవర్నర్ షెడ్యూల్లో లేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీంతో ఈ కార్యక్రమం అనంతరం రాజ్భవన్లో మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి కానీ, రాజ్భవన్కు కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు విస్తరణ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎన్ని బెర్తులు భర్తీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. శనివారం అర్ధరాత్రి ఈ అంశంపై స్పష్టత వచ్చింది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో నేటి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందుబాటులో ఉండండి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు రేగిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, కాలె యాదయ్య, వేముల వీరేశంలు సీఎం రేవంత్ను కలిసి తమ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్.. కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, ఆదివారం ఐదుగురు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు అధిష్టానానికి తాను ప్రతిపాదనలు మాత్రమే పంపగలనని, తుది నిర్ణయం ఢిల్లీ పెద్దలదేనని ఆ ఎమ్మెల్యేలతో సీఎం చెప్పినట్టు సమాచారం. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’
సాక్షి, తెలంగాణభవన్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైలాగ్ చెబుతున్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. కానీ, బనకచర్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్తో కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు. -
పదేళ్లు పగ్గాలివ్వండి
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్ఎస్ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్ఎస్)గా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్లైన్ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఒక నోటీస్కే ఆగమాగం.. జైల్లో ఉన్న నాకేం అనిపించాలి?: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: బీఆర్ఎస్పై మరోసారి ద్వజమెత్తారు సీఎం రేవంత్రెడ్డి,. బీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అంటూ విమర్శించారు. తమ పార్టీ బీఆర్ఎస్లో దెయ్యాలు చేరినయి అని సొంతింటి బిడ్డనే అంటోందని సీఎం రేవంత్ ఇక్కడ ఉదహరించారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లలో మొదటి తారీఖే జీతాలు పడ్డాయా అని ఉద్యోగుల కుటుంబాలని అడుగుతున్నా. ఇన్ స్టాల్ మెంట్లలో జీతాలు ఇచ్చినోడు నన్ను ప్రశ్నిస్తాడా?, బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణగా మార్చినోళ్లు నన్ను విమర్శిస్తారా?,కల్వకుంట పాలన చేసినోళ్ల కల్వకుంట్ల కుటుంబమోళ్లు. వాసాలమర్రిలో ఆకుల ఆదవ్వకు అల్లనేరేడు పళ్లు ఇచ్చాడు. ఆమె ఆస్పత్రిలో పడింది. వాసాలమర్రిని స్మశానంగా మార్చాడుపనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లు వాసాలమర్రిని కేసీఆర్ అలా చేశాడు. యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చారు. దాన్ని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాం. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజ్, విద్యా సంస్థలను యూనివర్సిటీగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. తాటిచెట్టు అంత ఎదిగి మోకాళ్లలో మెదడు ఉన్న ఒకాయన గంధమల్ల రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాడు. రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయింస్తే నల్లగొండలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదు. ఎవరు అడ్డం వచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తాంగుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా ప్రక్షాళన చేసుకున్నారు. కానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?,మూసీ మురికిలోనే మేం చావాలో బీజేపీ నేతలు చెప్పాలి. పుట్టబోయే బిడ్డలు కాళ్లు, కన్నులు వంకరపోతే బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా?, మేం మీ ఎర్రవెల్లి, జన్వాడ ఫాంహౌస్ను గుంజుకుంటామని అనలేదు కదా?, మూసీ కట్టొద్దనే, ప్రక్షాళన చేయద్దనే ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయి. పదేళ్లలో ఎస్సెల్బీసీ, గంధమల్ల, పిల్లాయిపల్లిని ఎందుకు పూర్తిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఎందుకు నిర్మించలేదు’ అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమాగం అవుతుండని, నెలల తరబడి జైల్లో ఉన్న తనకు ఇంకేం అనిపించాలని రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
బాబుకు సీఎం రేవంత్ రెడ్డి దాసోహం: హరీష్ రావు ఫైర్
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ సమావేశం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా, తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా మరచిపోయిందని, రాష్టంలోని కాంగ్రెస్ నేతలు గాలి మోటార్పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రెవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబు ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ పాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెబుతున్న సీఎం రెవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
-
పేదలను కొట్టి పెద్దలకు భూములు
సాక్షి, హైదరాబాద్: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్కు పంపారని తెలిపారు. రైతులపై దాడి చేయించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం హరితహారంమాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్రావు అన్నారు. -
40 శాతం వైకల్యమున్నామెజారిటీ కేటగిరీల్లో అర్హత
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) ద్వారా పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ పరికరాల పంపిణీలో గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన ప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు అనుగుణంగా టీవీసీసీ పాలకమండలి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీవీసీసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ జీవో 89 జారీ చేశారు. ఈ నేప థ్యంలో గురువారం టీవీసీసీ చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఉత్త ర్వుల కాపీలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మలక్పేటలోని టీవీసీసీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీ డియాతో మాట్లాడారు. వినతు లను పరిగణించి పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు లబ్ధి జరిగే విధంగా మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బెంచ్మా ర్క్ డిజేబిలిటీ ఉన్న ప్రతి దివ్యాంగుడికి తాజా నిబంధనలు వర్తిస్తాయని, గతంలో 80% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత కల్పించగా... ప్రస్తుత ప్రజాప్రభుత్వం కుదించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ఉదార నిర్ణయం తీసుకోలేదని వీరయ్య వ్యాఖ్యానించారు. 40 శాతం వైకల్యం ఉంటే...తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు, విద్యార్థి నేస్తం కార్యక్రమం ద్వారా ట్యాబ్లు, లూయిస్ బ్రెయిలె అండ్ హెలెన్ కిల్లర్ గిఫ్ట్గా 5జీ స్మార్ట్ ఫోన్లు, లెప్రసి బాధిత దివ్యాంగులకు మైక్రో సెల్యూలర్ రబ్బర్ (ఎంసీఆర్), అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్లు, కుర్చీకే పరిమితమైన దివ్యాంగులకు ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్, స్వయం ఉపాధి కింద వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్ అందిస్తున్నారు. వీటిలో మెజార్టీ కేటగిరీల్లో కేవలం 40 శాతం వైకల్యం ఉన్నా అర్హత సాధిస్తారని టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. -
ఉద్యోగులకు 2 డీఏలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు (కరువు భత్యం) చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనుంది. ఇక మరో డీఏను 6 నెలల తర్వాత చెల్లించనుంది. వచ్చే ఏప్రిల్లో దీనిపై ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు 5 పెండింగ్ డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి రెండు డీఏలపైనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలపై విస్తృతంగా చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సచివాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించి మిగిలిన వాటిని పరిశీలనకు స్వీకరించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లించనుంది. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి నుంచి నెలకు రూ. 500 వసూలు చేయడంతోపాటు సమాన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ట్రస్ట్కు చెల్లించనుంది. ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా ఇతర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ట్రస్ట్ ద్వారా వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏటా సెప్టెంబర్లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్ స్టేట్ కౌన్సిల్, అసోసియేషన్లను గుర్తించేందుకు ఒప్పుకుంది. ౖజీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రస్తుతం పూర్తిగా సెక్రటరియేట్ సర్వీసెస్ ఉద్యోగులే పనిచేస్తుండగా ఇకపై 12.5 శాతం నాన్ సెక్రటరియేట్ సరీ్వసెస్ కోటాను అమలు చేయాలనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ కార్యదర్శి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు తిరిగి పంపించేందుకు అంగీకరించింది. జిల్లా పరిషత్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల పూర్తితోపాటు నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు డిమాండ్లకు సైతం సమ్మతి తెలిపింది. అంగన్వాడీల పదవీవిరమణ ప్రయోజనాలను రూ. 2 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల చెల్లింపుతోపాటు వాహనాల అద్దెల పెంపునకు ఆమోదం తెలిపింది. మరికొన్ని నిర్ణయాలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. – స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 385 మంది మరణించగా రూ. 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. – హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హామ్) కింద రాష్ట్రంలోని అన్ని (పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ) రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 7,947 కి.మీ. పంచాయతీరాజ్, 5,190 కి.మీ. ఆర్ అండ్ బీ రోడ్లు కలిపి మొత్తం 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 16,780 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 16,414 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. వచ్చే రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనుండగా 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకే ప్రభుత్వం అప్పగించనుంది. పార్లమెంట్ స్థానాన్ని ఒక యూనిట్గా లేదా ఉమ్మడి జిల్లాలవారీగా ఒక్కో జిల్లాను ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం. – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 19,579 కోట్లతో అంచనాలతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్–1లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ., కారిడార్–2లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ., కారిడార్–3లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీ. కలిపి మొత్తం 86.1 కి.మీ. కారిడార్ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి పొంగులేటి కోరారు. – రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహాన్ని కొనసాగించాలని.. ప్రజలకు మేలు చేసే కార్యాక్రమాలకు గ్రీన్ చానల్లో చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. – ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది. -
TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ
-
రేపు కేబినెట్.. పలు కీలక అంశాల చర్చ
సాక్షి, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యామ్ల భద్రతా ప్రాధికార సంస్థ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారీస్థాయిలో ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలతోపాటు రికవరీ చేయాలని కమిషన్ సూచించిన విషయం విదితమే. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్చార్జ్లుగా నియమించి, భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి అ«దీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతోపాటు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ గతవారంలోనే తన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే ఐదు కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. వానాకాలం పంటల అంశం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న తీరుపై కూడా చర్చించే అవకాశముంది. వాస్తవంగా జూన్ 2వ తేదీన కనీసం వంద ఇళ్లను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేసినా, అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చోటుచేసుకోని విషయం విదితమే. -
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. ‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతన్న సంక్షేమానికి పెద్దపీట రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. యువతే మన భవిష్యత్తు.. యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. కులగణనతో దేశానికి ఆదర్శంగా.. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్లో ఇదొక తొలి మెట్టు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు. పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారంతెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ జరిపిన కవాతు ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు. అవార్డు అందుకున్న గద్దర్ సతీమణి.. దివంగత ప్రజాకవి గద్దర్ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. -
మిల్లా మాగిపై అసభ్య ప్రవర్తన ఆ ముగ్గురి పనేనా? ఇంతకీ ఎవరా ముగ్గురు?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై హరీష్ రావు తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందిస్తూ.. అందాల పోటీలు నిర్వహించడం రాక కాంగ్రెస్ నేతలు తెలంగాణ పరువు తీశారని అన్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఎంపీ, కార్పొరేషన్ ఛైర్మన్, ఐఏఎస్ అధికారి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పట్ల అసభ్యకరంగా,అభ్యంతరకరంగా ప్రవర్తించారని వార్తలొస్తున్నాయని అన్నారు. ఆ ముగ్గురు కారణంగా మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్కు చిత్త శుద్ది ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజీ భయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకున్న సీఎం రేవంత్
-
Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం
హైదరాబాద్, సాక్షి: దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని.. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day Celebrations) పాల్గొని ఆయన ప్రసంగించారు.‘‘దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. ఇది సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2 లక్షల రైతురుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంగా బతికేలా చేశాం. తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. రైతులు దళారుల బారిన పడకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8వేల కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చాం. భూభారతి చట్టం తీసుకొచ్చాం. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ. ఒలింపిక్స్లో మన దేశానికి అనుకున్నంత స్థాయిలో పథకాలు రాలేదు. మట్టిలో మాణిక్యాలను తయారు చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ తీసుకొచ్చాం. వచ్చే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి బంగారు పతకం తేవడమే మా లక్ష్యం. పేదల ఆరోగ్యం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గానికి యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శ్రీకారం చుట్టాం. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు.. భవిష్యత్ పెట్టుబడి’’ అని సీఎం రేవంత్ ప్రసంగించారు.ప్రసంగానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకు ముందు..గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. -
యువ వికాసం అర్హుల లెక్క తేలాకే..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం(Rajiv Youth Development) మంజూరు పత్రాల జారీ వాయిదా పడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తొలి రెండు కేటగిరీల వారికి యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఇందులో రాజీవ్ యువ వికాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, ఉద్యోగుల సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జిల్లాల్లో మంత్రులు చేసిన పరిశీలన, రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.యువ వికాసానికి అనూహ్య స్పందన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో..మొత్తం నాలుగు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హుల ఎంపిక జరపాలని, ఈ పథకం కింద అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో చోటు దక్కకుండా, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని మంత్రులు సూచించారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి అత్యంత పారదర్శకంగా పరిశీలన జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాకే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఇందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి: సీఎం రాష్ట్రంలో ధాన్యం కొనుకోలుకు సంబంధించిన అంశాలపై మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు. కాగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటు ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. రాష్ట్రానికి ముందస్తు రుతుపవనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చించారు. ఈ సీజన్కు సంబంధించి పంటల సాగును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగాన్ని ఈ దిశగా అప్రమత్తం చేయాలని రేవంత్ చెప్పారు. ఆర్థికేతర అంశాలను పరిష్కరిద్దాం! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక సమరి్పంచింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎం రేవంత్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తే వారికి కొంతమేర ఊరటగా ఉంటుందని, ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా ఇదేనని భట్టి చెప్పారు.దీంతో ఆర్థికేతర అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపైనా, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు, భూభారతి ద్వారా సమస్యల పరిష్కారం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రుతుపవనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. -
సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు.ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారుఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి. ఆ షోరూమ్ల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూమ్ల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.ఇప్పటి వరకు జీహెచ్ ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు.. ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోంది. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారు.అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుంది. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. -
గోశాలల విస్తీర్ణం 50 ఎకరాలకు తగ్గొద్దు
సాక్షి, హైదరాబాద్: గోవుల సంరక్షణ సులువుగా ఉండేలా గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోశా లల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాటి అనుబంధ కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. గోశాలల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, నిర్ణీత గడువులోగా ఈ కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధం కావాలని కోరారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. గోవులు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలిఇరుకు స్థలాల్లో బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలల్లో మార్పులు తేవాలని సీఎం సూచించారు. గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సమీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. ఈ గోశాల తుది డిజైన్ను నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనుంది. సమావేశంలో సీఎం కార్యాలయ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్రాజ్, అజిత్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు?
బంజారాహిల్స్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో శనివారం ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో 200 టీఎంసీల నీటి హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని తెలిపారు. ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా?’అని ప్రశ్నించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారని, సీఎం రేవంత్రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అననివారికి, అమర వీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చి అమరులు శ్రీకాంతాచారి, యాది రెడ్డి, కాళోజీ, పీవీ నరసింహారావులలో ఎవరిదో ఒకరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడరు?ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ నీటిని తరలించుకుపోయే ప్రణాళిక వేస్తుంటే సీఎం రేవంత్ కనీసం స్పందించడం లేదని కవిత విమర్శించారు. జూన్ 2న సీఎం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును డీప్ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తా మన్నారు. జాగృతిలో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభా గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విభా గాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని వెల్ల డించారు. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అనాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్.. జై తెలంగాణ అనే నినాదాన్నే పలకలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని నినదించాలి అని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రజలపై రేవంత్ అక్కసు ఎందుకని ప్రశ్నించారు కవిత. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ తెలంగాణ నినాదాన్ని ఇప్పటివరకూ పలకలేదన్నారు.గోదావరి జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్.. కాళేశ్వర కమిషనా.. లేక కాంగ్రెస్ కమిషనా అనే అనుమానం ఉందన్నారు.తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి సంస్థ భాగమైందని, 18 ఏళ్ల క్రితమే జాగృతి సంస్థను స్థాపించామన్నారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థను ఏర్పాటు చేశామన్నారు కవిత. కవిత ఏమన్నారంటే..తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. మన కర్మ ఇప్పుడు జై తెలంగాణ అనని సీఎం పరిపాలనలో ఉంది. జూన్2 న అయిన సీఎం జై తెలంగాణ అనాలి. అమర వీరులకు నివాళులు అర్పించాలి..అని డిమాండ్ చేస్తున్న. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు. రాజీవ్ తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలి. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత చారి లాంటి వారి పేరు పెట్టాలి. గోదావరి కావేరీ లింక్ పేరుతో గోదావరి నీరు తెలంగాణ కు దూరం కాబోతున్నాయి. 200 TMC నీళ్ల హక్కు కోసం cm మాట్లాడారు. నీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి..Kcr కు ఎందుకు నోటీసు లు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషనా?, జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జూన్ 4 న మహా ధర్నా చేపడుతున్నాం..కాంగ్రెస్ కాళేశ్వరం పై కుట్రలను ఎండగడుతున్నాం.. బిజెపి బీసీ బిల్లును డీ ఫ్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరుపున మళ్ళీ పోరాటం చేస్తాం. విద్యార్థులు, మహిళల కోసం, మైనార్టీల కోసం ఇచిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. కెసిఆర్కి బీఆర్ఎస్ ఒక కన్న అయితే మరో కన్ను జాగృతి.. బిజెపికి 8 ఎంపీల ఉంటే ఒక్క అంశం గురించి మాట్లాడారు.. బిజెపికి కాంగ్రెస్కి జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం’ అని కవిత హెచ్చరించారు. -
బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది : బండి
-
కవిత రగడ.. సీజ్ ఫైర్ రచ్చ..
-
అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు
-
కవిత లేఖ, రేవంత్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా? అని ప్రశ్నంచారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్ చర్చ అంతా ఒక డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు.వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి చెందుతున్నాయి. శుక్రవారం ఎనిమిది కోడెలు, శనివారం ఐదు కోడెలు మరణించాయి. ఈ అంశమై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కోడెలను రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానానిదే. కోడెలను రక్షించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి. కోడెల గదుల సంఖ్య పెంచాలన్నారు.మరోవైపు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా?. పెహల్గాం ఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులను చంపాం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. పీవోకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?.కవిత లెటర్పై చర్చ అంతా కాంగ్రెస్ డ్రామా. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ప్రసక్తే లేదు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినప్పుడే దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ ప్రొడక్షన్లో జరిగిందే కవిత లేఖ. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మేము. మేము వారిని దగ్గరికి రానివ్వం. ఎంపీ ఈటల రాజేందర్, హరీష్రావు కలిశారన్న విషయం నేను వినలేదు. దీనిపై ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు. -
ఈ దఫా మొత్తం రేవంతే సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ దఫా పూర్తికాలం రేవంత్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్కు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని.. కాంగ్రెస్ సీఎంలతో రాహుల్ నిత్యం హాట్లైన్లో అందుబాటులోనే ఉంటారని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సీఎంకు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని కొందరంటున్నారు.కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల రాహుల్గాం«దీని రేవంత్ కలవలేకపోవచ్చు. అంతమాత్రాన కొంపలేం అంటుకుపోవు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ అంశానికి కలర్ పూయాల్సిన అవసరం లేదు. రాహుల్గాం«దీని అర్ధరాత్రి అయినా రేవంత్రెడ్డి కలవగలరు. అయినా, సీఎంలు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్గాంధీ హాట్లైన్లో మాట్లాడుతుంటారు’అని చెప్పారు. తప్పుచేసి దొరికినా దబాయింపా? కాళేశ్వరం విషయంలో అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి విమర్శించారు. తాము తలుచుకుంటే కేసీఆర్ను మొదటి ముద్దాయిగా ఎప్పుడో విచారణకు పిలిపించేవారమని అన్నారు. తప్పు చేసి రెడ్హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా దబాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క తప్పు చేస్తే వెంటనే శిక్ష వేయవచ్చని, కానీ కేసీఆర్ తప్పులు శిశుపాలుడి తరహాలో 99 వరకు వచ్చాయని.. ఇంకొక్కటి మాత్రమే మిగిలిందని అన్నారు.ఎనిమిదో వింతను కట్టానని చెప్పుకునే వ్యక్తి మేడిగడ్డ బరాజ్పై ఓ నివేదిక ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. కమిషన్ ముందుకు వచ్చి తాను శిల్పినని కేసీఆర్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిలో ఎంత పెద్దవారున్నా తీవ్ర కఠిన తీసుకుంటామని స్పష్టం చేశారు. 2.10 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత దఫాలోనే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి స్పష్టంచేశారు. ‘ఈ పథకంలో భాగంగా తొలి విడత కింద 2.10 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాం. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న గ్రామాల్లో 42 వేల ఇళ్లను మంజూరు చేస్తే, అందులో 24 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. వాటికి రూ.135 కోట్లు చెల్లించాం. ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. 33 గృహాలకు 15 – 20 రోజుల్లో గృహ ప్రవేశాలు జరుగుతాయి. ఇంకా 1.15 లక్షల మంది జాబితాను తయారు చేయాల్సి ఉంది. జూన్10 లోపు అది కూడా పూర్తి చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల 40 శాతం ఇండ్లకు వారి సిఫారసులు తీసుకుంటున్నాం. ఆ సిఫారసులను గెజిటెడ్ అధికారి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు’అని మంత్రి తెలిపారు. అసైన్డ్ భూముల్లో పేదలకు పట్టాలు భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నాలుగు మండలాల్లో ఉన్న 625 ఎకరాల అసైన్డ్ భూముల్లో వ్యవసాయ యోగ్యమైనవాటికి పేదలకు పట్టాలు ఇస్తామని పొంగులేటి చెప్పారు. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయగానే సాదా బైనామాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 700 మంది ప్రభుత్వ సర్వేయర్లను నియమిస్తున్నామని వెల్లడించారు. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించిన చర్చలు పూర్తికావచ్చాయని, మరో వారంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులిచ్చి ఆగస్టు 15లోపు భూబకాసురుల చిట్టా తేలుస్తామని చెప్పారు. కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్లాంటిది బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్ లాంటిదని పొంగులేటి అన్నారు. ‘కొందరు ఆడమంటే మరికొందరు ఆడుతుంటారు. అది కుటుంబ పంచాయితీ. కవిత బీజేపీలోకి వెళ్తారని ఒకరు.. కాంగ్రెస్లోకి వస్తారని మరికొందరు అంటున్నారు. దెయ్యాలు, భూతాలు, దేవుళ్లంటూ మాట్లాడుతున్నారు. దెయ్యాలెవరో కవిత చెప్పొచ్చు కదా?’అని ప్రశ్నించారు. తన ఇంటికి ఈడీ అధికారులెవ్వరూ రాలేదని పొంగులేటి స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒకరోజు ముందో.. వెనుకో జరుగుతుందని పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తారకరామం పుస్తకం బహుకరణ
మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి 'తారకరామం' పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్ రచయిత జి. భగీరథ తెలిపారు. ఎన్టీఆర్ రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఆధ్వర్యంలో 'శకపురుషుడు ' , 'తారకరామం' అనే రెండు పుస్తకాలు తన సంపాదకత్వంలో వెలువడ్డాయని భగీరథ చెప్పారు.ఈనెల 28 వ తేదీన ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలసి పుస్తకాన్ని అందించినట్లు భగీరథ వెల్లడించారు. 1950 నుంచి 1995 మధ్యకాలంలో రామారావు ఇచ్చిన ఇంటర్వ్యూలతో ఈ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు. ఆయన జయంతి రోజున 'తారకరామం ' ప్రత్యేక గ్రంథాన్ని కానుకగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
‘రాహుల్కు వయసు పెరిగినా.. మెచ్యూరిటీ మాత్రం రాలేదు’
ఢిల్లీ : పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భాగంగా భారత సైన్యం సామర్ధ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు.. దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం నిజంగా సిగ్గచేటన్నారు. ఈరోజు(శుక్రవారం) ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘రాహుల్ అడగాల్సింది.. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి అని కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని.. రాహుల్ రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏళ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడే మియా మాటలకు వత్తాసుగా, చోటే మియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల బృందాలు .. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారు. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియచేస్తున్నారు. రాహుల్, రేవంత్ ల మాటలను దేశ ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో రేవంత్ మూడు రోజులు ఉన్నా.. రాహుల్ దర్శనం దక్కలేదు.. అవమానానికి గురై వెనక్కి పోయారు. భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గందేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. రాహుల్ ప్రధాని అయి ఉంటే.. పీఓకేను స్వాధీనం చేసుకుంటారు అని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జన్మలో రాహుల్కు ప్రధాని అయ్యే అవకాశం రాదు. పాక్ ఎటువంటి దాడులు చేసినా, మోదీ సర్కార్ ఊరుకోలేదు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాంకాంగ్రెస్ హయంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయి. రాహుల్ దుర్బుద్ధి తో మాట్లాడుతున్నారు. మనదేశం పాక్, చైనాలతో యుద్ధం వచ్చినా.. ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ప్రజలందరూ రాజకీయాలు.. కులాలు.. మతాలు పక్కన పెట్టీ ఒక్కటిగా నిలబడ్డారుపహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలంతా ఆకాక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం,. ఆపరేషన్ సింధూర్ ఎవరికి తెలియని సంఘటన కాదు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ లో 23 నిమిషాల్లో.. పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. పాక్ ప్రదానితో కూడా ఒప్పుకున్నారు. పాక్ పై చేసిన దాడుల వీడియోలు ప్రపంచం ముందు సైన్యం పెట్టింది’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్బేస్లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా! -
భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ప్రధాని మోదీ పాకిస్తాన్తో యుద్ధం విరమించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ‘అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేస్తారా? భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా? యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? పాకిస్తాన్తో యుద్ధంలో రఫేల్ విమానాలు ఎన్ని నేలకూలాయో లెక్క చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లి వీఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకూ జైహింద్ యాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోని యుద్ధ విమానాలే పాకిస్తాన్తో యుద్ధంలో దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడాయని, మోదీ కొనుగోలు చేసిన రఫేల్ విమానాలు మాత్రం యుద్ధంలో నేలకూలాయని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధంపై ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరను స్ఫూర్తిగా తీసుకోవాలి పాకిస్తాన్తో యుద్ధంలో అపరకాళీ ఇందిరా గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుంటే బాగుండేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఆపాలని ఇందిరా గాం«దీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారని, కానీ ఆమె అమెరికా బెదిరింపులకు లొంగలేదన్నారు. భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మదన్నారు. భారత ఆర్మీ కల్నల్ సంతోష్ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరా గాంధీ నిర్మొహమాటంగా చెపారని, యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసి చూపారన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో పాక్ను రెండు ముక్కలు చేయాలని.. తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్ కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలుపుకొనేందుకు పాక్పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని చెప్పామన్నారు. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని, ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. రాహుల్ గాంధీపై విమర్శలా? అమెరికాకు తలొగ్గి యుద్ధం విరమించిన బీజేపీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీపై విమర్శలు చేయడం విడ్దురంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్ 1967లో చైనాను, 1971లో పాకిస్తాన్ను ఓడించినందుకు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారా ఎద్దేవాచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిదన్నారు. మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్తాన్పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, మీ సొంత వ్యవహారం కాదని ధ్వజమెత్తారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందని చెప్పారు. రాహుల్ గాందీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దని పార్టీ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
‘గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’
మేడ్చల్ జిల్లా: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్కు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తే, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.‘ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.పాక్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని కోరాం. భారత్ను బెదిరించడానికి ట్రంప్ ప్రకటన చేయడం బాధాకరం. యుద్ధాన్ని విరమించినప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు. గతంలో అమెరికా బెదిరింపులను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. అప్పట్లో పాక్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు. పాక్ను ఓడించాలంటే ఇందిరాగాంధీ బాటలో మోదీ నడవాలి. ఇదే విషయాన్ని రాహుల్గాంధీ చెప్తే విమర్శిస్తున్నారు’ అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది చదవండి: ‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’ -
రేవంతన్నా కామారెడ్డి వైపు సూడన్నా!
ముఖ్యమంత్రులుగా గెలుపొందిన వారు తమ నియోజకవర్గాలకు కాస్త ఎక్కువగా నిధులు కేటాయించుకోవడం పరిపాటే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కొడంగల్లో గెలిచి కామారెడ్డిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి సీఎం కేసీఆర్ను ఓడించి తీరుతా అన్న రేవంత్ రెడ్డి శపథం మాత్రం నెరవేరింది. కామారెడ్డిలో ప్రభావిత ఓట్లు ఇచ్చిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొడంగల్ మాదిరిగా కామారెడ్డిని సొంత నియోజకవర్గంగా భావించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ను ఓడించి తీరుత. కేసీఆర్ను ఓడించేందుకే ఇక్కడ పోటీ చేస్తున్న’ అని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి తన లక్ష్యాన్ని సాధించారు. తాను గెలవలేకపోయినా, కేసీఆర్ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కొడంగల్ నుంచి వచ్చిన రేవంత్రెడ్డిని ఇక్కడి ఓటర్లు ఆదరించిన నేపథ్యంలో సీఎం హోదాలో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నియోజకవర్గంలో ఐదారు పర్యాయాలు పర్యటించిన రేవంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అవగాహన ఉందని, అలాగే ఇక్కడి వివిధ వర్గాల ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్కు నిధులిచ్చినట్టే కామారెడ్డిపై కరుణ చూపాలని కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాలకు వచ్చినా, కామారెడ్డికి మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇరుకు రోడ్లతో ఇబ్బందులు.. జిల్లాకేంద్రంలో ప్రధాన రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రోడ్లను విస్తరించడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన అవస రం ఉంది. పట్టణాన్ని రెండుగా విభజించే రైల్వే లైనుపై వంతెనలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఉన్న ఒక్క వంతెన ఇరుకుగా మారింది. అశోక్నగర్లో రైల్వే గేటు మాటిమాటికీ వేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.జిల్లాకు మూడు సమీకృత గురుకులాలువిద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున మంజూరు చేస్తోంది. తొలి విడతలో జుక్కల్కు మంజూరవగా.. మద్నూర్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా బాన్సువాడ, ఎల్లారెడ్డిలకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడకు మంజూరైన పాఠశాలను పొతంగల్లో ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. అలాగే ఎల్లారెడ్డికి స్కూల్ మంజూరైనట్టు ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ తెలిపారు. రూ.200 కోట్లు విడుదలయ్యాయని, టెండర్లు మిగిలాయని పేర్కొన్నారు. కానీ కామారెడ్డికి గతంలో మోడల్ స్కూల్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయకుండా హ్యాండిచ్చారని స్థానిక నేతలు, విద్యార్థులు వాపోతున్నారు.సాగునీరే పెద్ద సమస్య.. కామారెడ్డి నియోజక వర్గంలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతాంగం భూగర్భజలాలపైనే ఆధారపడి సేద్యం చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి సంబంధించి 22వ ప్యాకేజీ పనుల కోసం కామారెడ్డిలో శంకుస్థాపన చేశారు. ఆయన మరణంతో పనులు ఆగిపోయాయి. 22వ ప్యాకేజీ పనులకు సంబంధించి భూసేకరణకు ఇటీవల కేవలం రూ.23 కోట్లు మంజూరయ్యాయి. అవి ఏమాత్రం సరిపోవు. దాదాపు మూడు వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయి. అలాగే ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంటున్నారు. 22వ ప్యాకేజీ పనులపై సీఎం రివ్యూ చేసి అవసరమైన నిధులు కేటాయిస్తేగానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు.విద్యారంగంలో వెనకడుగే.. నాలుగైదు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి పట్టణంలో ఐదు దశాబ్దాల కిందటే డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఎక్కడాలేని బీటె క్ డెయిరీ, బీఎస్సీ ఫిషరీ బీఎస్సీ ఫారెస్ట్రీ వంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానా ల్లో ఉన్నారు. అయితే మారిన పరిస్థితులకు అ నుగుణంగా ఉన్నత విద్య అవకాశాలు మెరుగపడలేదు. ము ఖ్యంగా డెయిరీ కోర్సుకు సంబంధించి పీజీ కో ర్సులు రాష్ట్రంలో కూడా ఎక్క డా లేవు. ఇక్కడ ఎంటెక్ డెయిరీ కోర్సులు ప్రా రంభించడానికి కావల్సిన సౌకర్యాలన్నీ ఉన్నా యి. పీజీ కోర్సులు తీసుకురావలసిన అవసరముంది. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇక్కడ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. భిక్కనూరు సౌత్ క్యాంపస్లో మరిన్ని కోర్సు లు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆదరించిన ప్రజలకు మేలు చేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి వచ్చి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరించారు. తక్కువ సమయంలో కూడా మంచి ఓట్లు వచ్చాయి. నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. ఇక్కడి డిగ్రీ కాలేజీకి వందల ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఈ నియోజకవర్గం నాలుగైదు జిల్లాలకు కూడలి. – క్యాతం సిద్దరాములు, న్యాయవాది, కామారెడ్డియూనివర్సిటీ కావాలి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కావలసినంత భూమి ఉంది. అన్ని సౌకర్యాలున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అప్పటి సీఎం కేసీఆర్ ఎడ్యుకేషన్ హబ్ చేస్తాననన్నారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, లా, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డి గురించి ఆలోచించాలి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. –ఎల్ఎన్ ఆజాద్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
యంగ్ ఇండియా నా బ్రాండ్.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని బాబూ జగ్జీవన్రామ్ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. కులవృత్తుల పేరుతో బీఆర్ఎస్ మోసం కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు. దళితులకు సముచిత స్థానం ఇచ్చాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్ చాన్స్లర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్ చైర్మన్గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్గా, అసెంబ్లీ స్పీకర్గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు. వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్ చేసినట్లు వివరించారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
అందరి అభిప్రాయాలు తీసుకోండి
సాక్షి హైదరాబాద్: కేబినెట్ సహచరులకు సీఎం రేవంత్రెడ్డి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ మంత్రులకు విందు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. గురువారం నుంచి మంత్రుల జిల్లాల పర్యటన, ఈ నెల 30న మరోమారు ఢిల్లీ పర్యటన, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు, రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ నేపథ్యంతోపాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉండటంతో బుధవారం సాయంత్రం తన నివాసంలో రేవంత్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రులు ఇష్టాగోష్టి మాట్లాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుగా చేయాల్సిన కసరత్తు గురించి మంత్రులు మాట్లాడుకున్నట్లు తెలిసింది. పథకం అమలుకుముందే అందరితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటే మంచిదని, ఫలానా పథకం అమలు చేసే అవకాశం ఉందన్న ఫీలర్ను ముందుగా ప్రజల్లోకి పంపి.. విస్తృత చర్చ జరిగిన తర్వాత శ్రీకారం చుడితే బాగుంటుందని మంత్రులు సూచించినట్లు తెలిసింది. అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, భవిష్యత్తులో కలిసికట్టుగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కోవాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో మంత్రులందరూ ఆచితూచి మాట్లాడాలని, ఆర్థిక పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్ణయానికి వచి్చనట్లు తెలిసింది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క మినహా హైదరాబాద్లో ఉన్న అందరు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విందుకు హాజరయ్యారు.ఆపరేషన్ సిందూర్ హడావిడి విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీకి తగ్గిన గ్రాఫ్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి సమావేశంలో భాగంగా వచ్చిన అంశాలు, బీఆర్ఎస్ పంచాయతీ ఎపిసోడ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై మంత్రులు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిసింది. రెండు రోజులు జిల్లాల్లో మంత్రులు రాష్ట్ర మంత్రివర్గం గురువారం నుంచి రెండు రోజులపాటు జిల్లాల్లోనే ఉండనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అంశంపై కూడా విందు సమావేశంలో చర్చకు వచి్చందని, జిల్లాల్లో జరిగే సమీక్షలకు సంబంధించి జూన్ ఒకటికల్లా తనకు నివేదిక ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. -
సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చేసిన వాదనలు తప్పులతడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించాలన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం ప్రాజెక్టులో కాదని, కాంగ్రెస్, బీజేపీలే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కనీస నాణ్యత పరీక్షలు చేయకుండా, శాస్త్రీయడేటాను సేకరించకుండా ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తిరస్కరించడమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు, పార్టీని దెబ్బతీసేందుకు ఎన్డీఎస్ఏ ఈ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం ఎల్అండ్టీ తాజా ప్రకటనతో మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ ఇచి్చన నివేదిక బూటకమని బయట పడిందని కేటీఆర్ అన్నారు. ఊహాజనితమైన నివేదికను క్రూర రాజకీయ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో తయారు చేశారని మండిపడ్డారు. పనికిరాని ఆ నివేదిక తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట ఎండి, 500మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్అండ్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్ఎస్కు చెందిన ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోనూ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో త్వరలో యూకేలోను సంబరాలు నిర్వహిస్తామని, ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ ప్రశంసించారు. ఇంగ్లండ్లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాషీ్టకాలను ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనిల్ కూర్మాచలంకు పరామర్శ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకుని లండన్లో కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. -
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: సీఎం రేవంత్
హైదరాబాద్: సమ సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్సష్టం చేశారు. తమ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు. దళితులు చెప్పులు కుట్టుకోవాలా?, యాదవులు గొర్రెలు కాసుకోవాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరైనా బాగా చదవుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు సీఎం రేవంత్.హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 59 వేల ఉద్యోగాలిచ్చిందని, గత ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ల ఇవ్వలేదని సీఎం రేవంత్ నిలదీశారు. 2011 తర్వాత గ్రూప్౧ పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతిని సీఎం రేవంత్ గుర్తు చేశారు.‘ఇవాళ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలి. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారు. కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు?, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా?, కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోంది. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండి. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. కష్టపడండి… సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం. వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు. చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ఎన్ని కుట్రలు సృష్టించినా వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే అంటూ విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే.నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం.కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు.మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందికనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని…— KTR (@KTRBRS) May 28, 2025పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారు.ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’ అంటూ హెచ్చరించారు. -
ఎందుకీ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం నడుస్తుండడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పార్టీ పెద్దలతో చర్చల కోసం వెళ్లడం, నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన సీఎం రేవంత్ ఆ తర్వాత ఒకరోజంతా అక్కడే వేచి ఉండడం, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమైన అధిష్టానం పెద్దలు ఈనెల 30న మరోమారు రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారమిచ్చిన నేపథ్యంలో అసలేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా, అధిష్టానం ఈసారైనా అనుమతిస్తుందా..లేదా? అన్న సంశయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక అంశాలు బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం లేనిపోని తలనొప్పులు ఇప్పుడెందుకనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నెల 30 తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటనతోనే సరిపెడుతుందని, మరికొన్ని రోజుల తర్వాతే కేబినెట్ విస్తరణ ఫైల్ను కదిలిస్తుందనే అభిప్రాయం గాం«దీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ పీటముడులు వీడవా?రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో పడిన పీటముడులు వీడేవి కావనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. జనగణనలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చాలని, ఎవరి వాటా ఎంతో తేల్చాలని కోరుతున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతలకు ఎన్ని బెర్తులిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడున్న రెండింటికి తోడు మరొకటి వస్తుందని అనుకుంటున్నా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.ఇక జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కుదరని పొంతన, టీపీసీసీ కార్యవర్గానికి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు, అసెంబ్లీలో ఇచ్చే పదవులకు మంత్రివర్గ విస్తరణతో లింకు పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం పక్షాన ఇచి్చన హామీలను నెరవేర్చడం, సీఎం అభిప్రాయం, ఇతర సీనియర్ల ప్రతిపాదనలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు... ఇలా కావాల్సినన్ని పీటముడులు ఉన్న ఈ అంశం అసలు పరిష్కారమయ్యే మార్గం కూడా దొరకడం లేదనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు కూడా ఈ సాగదీతకు కారణమని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలనుకుంటే ఇంకో ఆరు నెలల సమయమిచి్చ, పనితీరు సరిగా లేని వారిని కూడా పక్కనపెట్టి, వారి సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి విస్తరణ పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో కాంగ్రెస్ పెద్దలున్నట్టు సమాచారం.ఏకాభిప్రాయమెలా సాధ్యం? మంత్రివర్గ విస్తరణ కోసం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు పలుమార్లు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పటి నుంచే ఇటు సీఎం నివాసం, అటు ఏఐసీసీ కార్యాలయం వేదికగా చాలాసార్లు సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాందీతో కూడా చర్చోపచర్చలు జరిపారు.చివరకు మార్చి నెలలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా ఇక అన్ని చర్చలు అయిపోయాయని, తమ ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం ముందుంచామని, విస్తరణ బంతి అధిష్టానం కోర్టులో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని (స్తంభించిందని), ఈ వ్యవహారాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుందని అధికారికంగానే చెప్పారు. అయితే ఇంతా జరిగి, ఇన్ని చెప్పిన తర్వాత మళ్లీ ఢిల్లీ వేదికగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు దేనికి సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు.గతంలో కుదరని ఏకాభిప్రాయం ఇప్పుడెలా సాధ్యమవుతుందని, ఏకాభిప్రాయం పేరుతో ఈ సాగదీత ఎందుకనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారీ్టలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జాప్యం అంశంలో అసహనంతో ఉన్నారని, వీలున్నంత త్వరలో తమకు కేబినెట్ హోదా ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకునే పని ప్రారంభిస్తామని తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.అయితే.. అనూహ్యమేప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ తర్వాత కూడా పీసీసీ కార్యవర్గ ప్రకటన మాత్రమే ఉంటుందని, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మరికొంత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ వస్తే అది అనూహ్యమేనని, అలా జరిగినా రెండు లేదా మూడు బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం. మరికొంత సమయం తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలను ఇచ్చి ఈ బెర్తులను భర్తీ చేసే అవకాశముంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. -
ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. మరింత ప్రో యాక్టివ్గా (చురుగ్గా) ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా చూడాలి. లబ్ధిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా సరఫరా చేయాలి. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు కూడా విస్తృత ప్రచారంలోకి వస్తున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లనే అని దుష్ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘటనలూ జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎంవో నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయ శాఖ తదితర అంశాలపై.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పరిహారం ప్రతిపాదనలు పంపండి ‘పౌరసరఫరాల శాఖ గతసారి కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) అధికంగా ధాన్యాన్ని, అదీ తక్కువ సమయంలోనే కొనుగోలు చేయడం అభినందనీయం. 10.50 లక్షల మంది రైతుల దగ్గర్నుంచి 64 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశాం. ఇప్పటివరకు రూ.12,184 కోట్లు చెల్లించాం. 90 శాతానికి పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి రుతుపవనాలు ముందే రావడంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంతమంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలి. రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయి. వీటిని తిప్పికోట్టాలి. జిల్లాల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు వెల్లడించాలి. రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 1 నాటికి నివేదిక ఇవ్వాలి ‘వర్షాలు ముందే వచ్చినందున వ్యవసాయ శాఖ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచాలి. విత్తనాల, ఎరువులు అక్రమ నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రులు ఈ నెల 29, 30 తేదీలలో క్షేత్రస్థాయిలో వానాకాలం సాగు ఏర్పాట్లు పర్యవేక్షించాలి. నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై నివేదిక తయారు చేసి జూన్ 1 నాటికి సమర్పిచాలి. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి..’ అని రేవంత్ ఆదేశించారు పేదలకు చుట్టంలా భూ భారతి చట్టం ‘గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడిస్తే, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుంది. భూ భారతి చట్టం కోసం తొలుత 4 మండలాలనే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నాం. తర్వాత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా ఎంపిక చేసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలి. పైలట్ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూ భారతి సదస్సులు అన్ని మండలాల్లో నిర్వహించాలి. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. ధరల నియంత్రణ కమిటీలు నియమించండి ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో ప్రభుత్వ పనితీరు ఏంటో తెలుస్తుంది. కలెక్టర్లు ఈ కీలకమైన పథకం అమలు పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను నియమించాలి. మేస్త్రీ చార్జీలు, నిర్మాణ పరికరాల ధరలపై నియంత్రణ ఉండాలి. అడ్డుగోలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలి. మహిళా సంఘాలు, రాజీవ్ యువ వికాసం ద్వారా ఇటుక, సెంట్రింగ్ యూనిట్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరతో నాణ్యమైన ఇళ్లు నిర్మించేందుకు సాంకేతికంగా అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలి. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలి..’ అని రేవంత్ చెప్పారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త ‘ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. ముందుగా వచ్చే వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సీజన్కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పారు. ముందస్తు సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. -
సుదీర్ఘ నిరీక్షణ.. ఫలించిన వేళ
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ కుటుంబం కల ఫలించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ సీఎం రేవంత్రెడ్డి ఆ కుటుంబంలోని మహిళకు నియామక పత్రాన్ని అందించారు. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఆ మహిళకు ఉత్తర్వులను అందించి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. వరంగల్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్సింగ్ సర్వీస్లో ఉండగా సెప్టెంబర్, 1996లో మర ణించారు. తండ్రి మరణంతో కారుణ్య నియామ కం కోసం ఆయన కూతురు బి.రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు. కానీ వివిధ కారణాలు చూపుతూ అధికారులు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరా కరించారు. రాజశ్రీ అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజశ్రీ సమస్యను తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ రాజు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా సరే ఉద్యోగం ఇవ్వాలని సీఎంవో అధికారులకు సూచించారు. దీంతో హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. రాజశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘భూభారతి పేద రైతులకు చుట్టం’
హైదరాబాద్: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఈ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. ఈరోజు(మంగళవారం) అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నా. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి.. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి’ అనిముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. -
కుదరని ఏకాభిప్రాయం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. ఆశావహుల తుది జాబితాపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. సామాజిక సమీకరణాల మేరకు తుది జాబితాను ఖరారు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై మరోసారి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ విస్తరణపై ఏదో ఒకటి తేల్చుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీలోనే వేచి ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాం«దీతో కూడా భేటీ కాకుండానే ఆయన తిరుగు పయనమయ్యారు. కాగా ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం సమావేశం కానుంది. శుక్రవారం మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అధిష్టానం సూచించింది. ముఖ్యమంత్రి వేచి చూసినా.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఆదివారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు జరిపిన చర్చలకు కొనసాగింపుగా.. సోమవారం కూడా చర్చలు ఉంటాయని భావించారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకే ముఖ్యమంత్రి సోమవారమంతా ఢిల్లీలో ఎవరినీ కలవకుండా వేచిచూశారు. అయితే సోమవారం సాయంత్రం 5 గంటలకు రాహుల్గాంధీతో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. ఆదివారం రాత్రి సీఎం, పీసీసీ అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు. ముఖ్యమంత్రి అభిప్రాయాలను సైతం వెల్లడించారు. ఈ భేటీ కొనసాగుతున్న సమయంలోనే రాహుల్ కార్యాలయం నుంచి మహేశ్గౌడ్కు పిలుపు రావడంతో ఆయన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ని కలిశారు. ఈ సందర్భంగానే మహేశ్గౌడ్ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి వివరాలను, పార్టీతో వారికి ఉన్న అనుబంధం, సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో కూడిన ఒక నివేదికను రాహుల్ గాం«దీకి అందజేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పులో ప్రాధాన్యత ఇస్తున్న వారికి సంబంధించిన వివరాలతో మరో నివేదిక ఇచ్చారు. ఈ అన్ని అంశాలపై కేసీ వేణుగోపాల్, మహేశ్గౌడ్లతో సుమారు గంటపాటు రాహుల్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రికి కూడా పిలుపు వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఈ మేరకు రేవంత్రెడ్డికి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే రాహుల్తో భేటీ అనంతరం మహేశ్గౌడ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాహుల్తో చర్చల సారాంశాన్ని వివరించారు. ఆ తర్వాత రేవంత్రెడ్డి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న చివరిసారిగా రాహుల్గాందీతో వ్యక్తిగతంగా సమావేశమైన రేవంత్రెడ్డి రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇప్పటివరకు వారి మధ్య భేటీ జరగలేదు. ఆ పేర్లపైనే మరోసారి చర్చ సోమవారం రాహుల్తో జరిగిన సమావేశంలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపైనే మరోమారు చర్చ జరిగినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేïÙల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్టు సమాచారం. కాగా వీరి విషయంలో ఏఐసీసీ ఆలోచనలకు, పీసీసీ ప్రతిపాదనలకు, ముఖ్యమంత్రి ఉద్దేశాలకు మధ్య వైరుధ్యం ఉందని అంటున్నారు. సామాజికవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆశావహుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఒకరిద్దరు ఆశావహులకు మంత్రి పదవులు ఖచి్చతంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉండడం చర్చలు అసంపూర్తిగా ముగియడానికి ఒక కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగే ఒకరిద్దరి విషయంలో ఏఐసీసీ కూడా తీవ్ర పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మహేశ్గౌడ్ కోరుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. -
సిరిసిల్లలో హైటెన్షన్ కేటీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ గొడవ
-
నలుగురా.. ఐదుగురా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా చర్చోపచర్చలకు తావిస్తున్న మంత్రివర్గ విస్తరణపై హస్తిన వేదికగా మరోమారు కసరత్తు మొదలైంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆదివారం గంటపాటు చర్చించారు. ఆశావహుల సామాజిక వర్గాలు,స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకొని చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో సోమవారం కూడా భేటీ కొనసాగనుంది. సామాజిక వర్గాలవారీగా విశ్లేషణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే తీసుకొనేది నలుగురినా లేక ఐదుగురినా? అనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆదిశ్రీనివాస్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి. వారితోపాటే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్లు సమాచారం. ఇందులో ఓసీల నుంచి రెడ్డి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సుదర్శన్రెడ్డిలతోపాటు వెలమ అయితే ప్రేమ్సాగర్రావు, ఎస్సీ అయితే గడ్డం వివేక్, ఎస్టీ అయితే బాలూనాయక్, శంకర్ నాయక్, ఓబీసీ నుంచి వాకాటి శ్రీహరి, విజయశాంతిల పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేïÙల పేర్లు ఉన్నాయి. నేడు రాహుల్ సమక్షంలో చర్చలు.. మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రాకపోవడంతో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సోమవారం మరోసారి భేటీ కానున్నారు. కేసీ వేణుగోపాల్తోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాం«దీని వారిద్దరూ కలిసి మంత్రివర్గ అంశం, పీసీసీ కార్యవర్గంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం వాయిదా పడింది. మంత్రివర్గ అంశంలో అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ లభించాక సీఎం హైదరాబాద్ బయలుదేరనున్నారు. కాగా, కేసీ వేణుగోపాల్తో భేటీ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగింది. -
మెట్రో విస్తరణకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, ప్రాంతీయ రింగ్రోడ్డు, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లిన అంశాలు హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 మెట్రో రైలు ఫేజ్–1లో 69 కిలోమీటర్ల నిడివితో మూడు కారిడార్లు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఫేజ్–2 కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాం. ఇందులో 76.4 కిలోమీటర్ల నిడివితో 5 కారిడార్లు ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ఈ జాయింట్ వెంచర్ మొత్తం ఖర్చు రూ.24,269 కోట్లు. ఇందులో కేంద్రం వాటా 18 శాతం (రూ.4,230 కోట్లు).రాష్ట్ర వాటా 30 శాతం (రూ.7,313 కోట్లు). రుణం 48 శాతం (రూ.11,693 కోట్లు). 2024 అక్టోబర్లో చెన్నై మెట్రో ఫేజ్–2కు రూ.63,246 కోట్లు, 2021 ఏప్రిల్లో బెంగళూరు మెట్రో ఫేజ్–2 కు రూ.14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూరు మెట్రో ఫేజ్–3కి రూ.15,611 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2పై కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటికి సమాధానాలిచ్చాం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రాంతీయ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో కలిపి ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ మధ్య 161వ నంబర్ జాతీయ రహదారి ఉండగా.. దక్షిణ భాగం చౌటుప్పల్ – ఆమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి మధ్య ఎన్హెచ్ 65 ఉంది. ఉత్తర భాగం కోసం భూసేకరణ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది.90 శాతం భూముల ప్రపోజల్స్ ఎన్హెచ్ఏఐకి పంపించాం. ఎన్హెచ్ఏఐ టెండర్లు కూడా పిలిచింది. అయితే, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం ఇవ్వాలి. దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేయాలి. ఉత్తరభాగంలాగే దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రింగ్ రైల్వే ప్రాజెక్టు.. గ్రీన్ఫీల్డ్ హైవే రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కి.మీ. పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించాం. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుంది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయండి. దేశం మొత్తం ఔషధాలలో తెలంగాణే 35 శాతం ఉత్పత్తి చేస్తోంది. బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుంది. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుంది. సెమీకండక్టర్ రంగానికి మద్దతివ్వండి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోంది. హైదరాబాద్లో ఏఎండీ, క్వాల్కాం, ఎన్విడియా వంటి ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుంది. రక్షణరంగ ప్రాజెక్టులకు తోడ్పాటునివ్వండి హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి. హైదరాబాద్లోని డీఆర్డీఓ, డిఫెన్స్ పీఎస్యూ లు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయి. వాటి పరిధిలో వె య్యికి పైగా ఎంఎస్ఎంఈలు, స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయి. లాక్హీడ్ మారి్టన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్పై ఆసక్తి చూపుతున్నాయి. రక్షణ రంగంలోని జేవీలు, ఆఫ్సెట్లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరం. వీటికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ రక్షణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్కు లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలి.మరో 800 ఎలక్ట్రిక్ బస్సులివ్వండి కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్కు మరో 800 ఎలక్ట్రిక్ బ స్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్కు రెండువేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు చేపట్టిన రెట్రోఫిట్టెడ్ సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
తెలంగాణకు రేవంత్, ఉత్తమ్ తెల్ల ఏనుగులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు) అని విమర్శిస్తూ.. మరోవైపు అవే ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్లను ప్రభుత్వం వాడుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీమళ్లీ చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దు్రష్పచారం చేయడమే సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ఏకైక ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్, ఉత్తమ్ తెలంగాణ పాలిట నిజమైన తెల్ల ఏనుగులు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర ఆదాయానికి, మంత్రి ఉత్తమ్ నీటి వాటాకు గండి కొడుతున్నారని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిన్నర అయినా తట్టెడు మట్టి తీయలేదు గతంలో ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతో పాటు కేంద్రంలోనూ ఏకకాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని హరీశ్రావు విమర్శించారు. ‘తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2,328 కోట్లు స్వాహా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భూ సేకరణ, ఇతర పనుల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,780 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మీరు ఆనాడు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి ఉంటే ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరగా తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్రావు మండిపడ్డారు. గోదావరి జలాలు ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు? తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేసున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తూ, మిగతా 50 శాతం నిధులకోసం ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వడం అన్యాయం, అనైతికం అని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ, ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్ను తప్పించాలి.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు. యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ బ్యాగ్మ్యాన్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చటంతో ఆయన అవినీతి బండారం బయట పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని అన్నారు. ఈడీ చార్జిషిట్లో పేరు రావడంతో ‘తెలంగాణ బ్యాగ్ మ్యాన్’రేవంత్రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు మొదలు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకు రేవంత్ రోజుకో కొత్త నాటకం వేస్తున్నారని ఆరోపించారు.ఈడీ చార్జిషిట్లో రేవంత్ పేరు నమోదైనందున కేంద్రం ఆయనపై చర్యలు తీసుకుంటున్నదీ లేనిదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ కుంభకోణం, పౌర సరఫరాల స్కామ్ వంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన రీతిలోనే కేంద్రం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలోనూ వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. అధికారం కోసం వందల కోట్లు సీఎం పదవి చేపట్టకముందే అధికారం కోసం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహరం ఈడీ చార్జిషిట్లో బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్రెడ్డి ప్రలోభపెట్టిన విషయం ఈడీ చార్జిషిటులో బయట పడిందని తెలిపారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం ఏడాదిన్నరలోనే సీఎం పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తరహాలోనే రేవంత్ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.కేవలం చార్జిషిట్లో రేవంత్ పేరు నమోదుతో సరిపెట్టకుండా విచారణకు పిలిచి అవినీతిని కక్కించాలని డిమాండ్ చేశారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ కకావికలమైందని, తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు దిగాల్సి వస్తుందో అనే భయం రేవంత్ను అడుగడుగునా వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. కమిషన్లు లేనిదే ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పారని, 30 శాతం పర్సంటేజీపై ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం పాపం పండిందని, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. -
యాభై సార్లయినా మోదీని కలుస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఎన్నికలయ్యాక అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కేంద్రం సహకారాన్ని తీసుకుంటాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం..రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం..కావాల్సిన అనుమతులు తీసుకుంటాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసి మెలసి పనిచేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.చెరువు మీద అలిగి కడుక్కోకుంటే ఎలా?..దిగిపోయిన ఆయన (కేసీఆర్) చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో పడుకుంటే ఏమైంది?.. ప్రజలు ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది.. నేను అలాంటి తప్పులు చేయను.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరా బాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం ‘రాష్ట్ర ప్రజలు మాపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు రావ డం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. ప్రజలు మాకు అండగా నిలిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా అబివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో, ఫార్మాసిటీ అన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోను..’ అని రేవంత్ అన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అవకాశాలు ‘రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం కోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ శాఖతో ఒప్పందాల ద్వారా తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు ఇచ్చాం. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని.. సోనియాగాంధీ నాయకత్వంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..’ అని సీఎం చెప్పారు. యువత నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం.. ‘తెలంగాణ ఉద్యమంలో ముందున్న లక్షలాది మంది యువతకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నేను సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి యువతలో మాపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.వీటన్నింటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఆశ్విర్వదిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 25.55 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుబరోసా ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి ‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. రండి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. ఎక్కడైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం..అలా కాకుండా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేకపోతే ఫాంహౌస్లో పడుకుంటానంటే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. నేను 20 ఏళ్లు ప్రజల గొంతుకై నిలిచా నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీగా.. ఇలా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ప్రజల సమస్యలకు గొంతుకనై పనిచేశా. నేను 20 ఏళ్లుగా ప్రజల పక్షాన పనిచేశాను కాబట్టే ప్రజలు నాకు సీఎంగా అవకాశం కల్పించారు. నా వద్దకు చిన్నోడు వచి్చనా.. పెద్దోడు వచి్చనా.. ఉన్నోడు వచి్చనా.. పేదోడు వచ్చినా.. అందరినీ కలిసి.. చేతనైన సాయం చేస్తున్నా..’ అని రేవంత్ చెప్పారు. సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్
-
సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్
-
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు
-
ఈడీ కేసులో రేవంత్.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా,యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్కుమార్కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే. -
సీఎం రేవంత్లో అపరిచితుడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అభిప్రాయభేదాలు సహజంరాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
KTR: నీ కేసులకు భయపడేది లేదు
-
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు.