Revanth Reddy
-
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి (kancha gachibowli)లో వివాదం నెలకొన్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hcu) భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు.హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అక్కడ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మంగళవారం హెచ్సీయూలో పర్యటించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో హెచ్సీయూ భూములపై బండి సంజయ్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిది. అటవీ శాఖ పరిధికి చెందిన భూముల్లో మొక్కల్ని నరకాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలి. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండు కోవాలనుకోవడం దుర్మార్గం.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ హెచ్చరించారు. -
సన్న బువ్వ సంబురం
ఉగాది పండగ పూట, పేదల ఆకలి తీర్చాలని ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నుండి ప్రజా పంపిణీ విధానంలో ఇకనుండి పేద ప్రజలందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించే చరిత్రాత్మక పథకానికి స్వీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ మొత్తం జనాభాలో 3.10 కోట్ల (84%) మంది ప్రజలకు, శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే సంక ల్పానికి యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రూ. 1.90 లకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తే, తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. గతంలో దొడ్డు – నాసిరకం బియ్యం పంపిణీ చేయడంతో పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రజాపంపిణీ వ్యవస్థ లక్ష్యం నీరుగారింది. నెలకురూ. 10,600 కోట్లు ఈ బియ్యం పంపిణీపై ఖర్చు చేసినా ఫలితం పేదలకు అందలేదు. రైసు మిల్లర్లకు, దళారులకు, అవినీతి పరులకు మంచి ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారి పోయాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తిరిగి ప్రభుత్వానికి లాభకరమైన ధరకు అమ్మి మిల్లర్లు గత ప్రభుత్వ కాలంలో దోపిడీకి పాల్పడి నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్ 10ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. వెంటనే అందుకు సంబంధించిన కార్యా చరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో సన్న వడ్ల సాగును ప్రోత్సహించి, సన్న వాటిని సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్గా అందించింది. తద్వారా, సన్న బియ్యాన్ని సమీకరించి తెలుగువారి నూతన సంవత్సరం (ఉగాది పండుగ) పర్వదినాన అశేష ప్రజానీకం సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యం అందించే బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టినం. ఇప్పుడున్న 90.42 లక్షల రేషన్ కార్డులకు అదనంగా పది లక్షల రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తూ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా పక్కా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ మంచి పని చేస్తే మమ్మల్ని అభినందించాల్సింది పోయి, బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం మొదలుపెట్టింది. పండుగ రోజు కూడా పచ్చి అబద్ధాలతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించారు. రేషన్ షాపులలో మోదీ ఫోటో పెట్టాలని ఆయన వితండవాదం చేస్తున్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పక్క రాష్ట్రంలోనూ కేవలం ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఉంది కాని ప్రధాని మోదీది లేదనే విషయం తెలియనిది కాదు. మరి తెలంగాణలో మోదీ ఫోటో ఎందుకు పెట్టాలో వారే చెప్పాలి. కాంగ్రెస్ తన పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అయితే తమ పార్టీని ప్రజలు దూరంగా పెడతారని బీజేపీవారు భావించడం వల్లనే ఇటువంటి అర్థం పర్థం లేని డిమాండ్లతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: మనిషిని మార్చే సాన్నిధ్యంఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటికీ నెల నెలా సన్నబియ్యం అందించే యజ్ఞానికి సబ్బండ వర్గాలు సహక రిస్తాయి. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారు. సమాజంలోని మేధా వులు, కవులు, కళాకారులు ప్రజా సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తూ అండగా నిలబడాలని కోరుతున్నాం.-డా. కొనగాల మహేష్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి) -
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
హైదరాబాద్, సాక్షి: హెచ్సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. -
40 వేల ఎకరాలు అమ్ముతున్నావు.. ఆ 400 ఎకరాలు వదిలేయ్
సాక్షి, హైదరాబాద్: 40 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టిన సీఎం రేవంత్రెడ్డి...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను వదిలేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను విక్రయించొద్దంటూ విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్లో కేటీఆర్ హెచ్సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేలకూల్చడంతోపాటు, నెమళ్లు, దుప్పులు, జింకలు, అరుదైన పక్షిజాతులను అక్కడ నుంచి తరలించే యత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాల ఫలితమే సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పారు. యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్గా మారిందని అక్కడున్న ఈ లంగ్స్పేస్ లేకుండా చేయడంతో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి భూములు అమ్మడం, అప్పులు తేవడమే ఎజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. ముంబైలో 2,500 చెట్లు కొడితేనే.. పర్యావరణం నాశనమైందని గొంతు చించుకున్న రాహుల్గాంధీ హెచ్సీయూ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిల్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవులున్న తరుణంలో రాత్రికిరాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారని, కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. రేవంత్రెడ్డి ఎన్నికలయ్యాక సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడే ఆ భూములపై కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను జైలుకు పంపించినట్టు చెబుతున్నారని, వారికి ఏ విధంగా న్యాయ సహాయం చేయాలో ఆలోచిస్తామన్నారు. గుంట నక్కలు అంటూ... ఆయన కామెంట్లు చేశారని, తాము ప్రవేశిస్తే ఇదంతా బీఆర్ఎస్ చేయిస్తుందని ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారనే ఆగామని చెప్పారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు అయినా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తాం: విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని భయకంపితం చేస్తోందని, విద్యార్థులపై తీవ్ర బలప్రయోగం చేస్తోందని, అడ్డుకుంటున్నవారిని అదుపులోకి తీసుకుంటోందని విద్యార్థి సంఘం నాయకులు ఉమేష్ అంబేడ్కర్, శరణ్య, నిహార్ సులేమాన్, త్రివేణి వాపోయారు. న్యాయపరమైన అంశాలు తర్వాత చర్చించొచ్చని ముందు పర్యావరణాన్ని కాపాడాలని, నెమళ్లు, జింకలు చేస్తున్న రోదనలు పాలకులకు వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఆ భూములను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
హైదరాబాద్లో వాన్గార్డ్ తొలి జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘వాన్గార్డ్’ తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు.. రానున్న నాలుగేళ్లలో 2,300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది, వాన్గార్డ్ దాదాపు ఐదు కోట్ల మంది పెట్టుబడిదారులతో సుమారు 10.4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా కొనసాగుతోంది. వాన్గార్డ్ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఈవో, ఎండీ నితిన్ టాండన్, మానవ వనరుల ప్రధానాధికారి జాన్ కౌచర్, జీసీసీ–ఇండియా వాన్గార్డ్ హెడ్ వెంకటేశ్ నటరాజన్లు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం వాన్గార్డ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఈ సంవత్సరం చివరి నాటికి నగరంలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఈ జీసీసీ ఇన్నోవేషన్ హబ్గా పనిచేస్తుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్లో వాన్గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా హైదరాబాద్ను ప్రపంచస్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాన్గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం భరోసా ఇచ్చారు. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందని సలీం రాంజీ తెలిపారు. -
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్రైజర్స్ ప్రతినిథి హెచ్సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్గా ఉన్న విషయం తెలిసిందే. -
‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే అరాచకత్వం ఎక్కువైందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. హెచ్సీయూలో విద్యార్థులను కొట్టడం ఎంత వరకు కరెక్ట్?. అమ్మాయిలను మెడలు పట్టుకుని లాక్కెళ్లడం దారుణం. వర్సిటీలో 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? అని ప్రశ్నించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో విద్యార్థుల అరెస్ట్, అక్కడ ఉద్రిక్తతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్సీయూ ఘటన వీడియోలు చూసి తెలంగాణ సమాజం బాధ పడుతుంది. దొంగతనంగా రాత్రికి రాత్రికి చెట్లు కొట్టేశారు. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. వర్సిటీలో భూములు అమ్మితే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. గజం తావు కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోంది.ఎబీవీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ లోపల వేసి కొట్టారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్ చేస్తోంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యా కమిషన్ పదవులు తీసుకున్న అర్బన్ నక్సల్స్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. భూములు అమ్మి పాలించమంటే ఎవరైనా పాలించగలరు. రేషన్ బియ్యానికి ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తుంది. కిలోకు 40 రూపాయలు ఇస్తున్నది మోదీ ప్రభుత్వం. కిలోకి పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హంగామా చేస్తుంది. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలి. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో పెట్టాలి.Telangana was promised Mohabbat ki Dukaan but got Loot aur Lathi ki Sarkar.Rahul Gandhi speaks of Mohabbat, but show Lathi on students to Loot land. ABVP students are protesting against the auction of HCU lands, and I fully support them. Instead of addressing their concerns,… pic.twitter.com/LRoF0DDizh— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2025హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎంఐఎంకు మద్దతు చెబుతున్నారు. బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఉన్నా ఎందుకు పోటీ చేయడం లేదు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని ఎంఐఎంకు అప్పగించాలని చూస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.Green Murder in Telangana - BRS cut, Congress cuts deeper.BRS axed 25 lakh trees for Kaleshwaram, gifted Conocarpus mess in the guise of Haritha Haram.Congress joins the green destruction at Kancha Gachibowli.Same axe, new hands.Telangana isn’t governed, but held hostage by…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 31, 2025 -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
సన్నబియ్యం చారిత్రాత్మకం
-
నా సంకల్పమేదీ విఫలం కాలేదు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ ‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు. -
సన్నబియ్యం చరిత్రాత్మకం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, ఆ చరిత్రకు హుజూర్నగర్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ రోటీ, కప్డా, మకాన్ అనే నినాదంతో పేద వారికి కడుపు నిండా అన్నం, గుడ్డ, ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు. దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించారని, నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు పేదలు.. పండుగ నాడే కాకుండా ప్రతిరోజూ తెల్ల బువ్వ తినాలనే ఉద్దేశంతో కోట్ల విజయభాస్కర్రెడ్డి రూ.1.90కు కిలో బియ్యం పథకం తెచ్చారని, అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకాన్ని 1983లో ప్రారంభించారని..ఆనాడు మొదలు పెట్టిన దొడ్డు బియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు. అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఇక నుంచి 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజూ పండుగలా పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహరంగ సభలో మాట్లాడారు. నల్లగొండ గడ్డకు ఎంతో చరిత్ర ‘ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన, పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం హర్షించదగిన విషయం. ఈ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం ఇక్కడి నుంచే పోరాటాలు చేశారు. రావి నారాయణరెడ్డిని నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించిన చరిత్ర కూడా నల్లగొండ గడ్డకే ఉంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నల్లగొండ ఎంపీని గెలిపించింది కూడా నల్లగొండ బిడ్డలే. ఇలాంటి చోట ప్రారంభించిన ఈ సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మిల్లర్లు, దళారుల చేతుల్లోకి దొడ్డు బియ్యం ‘ప్రభుత్వం 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తుంటే, ఆ పథకం మిల్లర్ల మాఫియా, దళారుల చేతిలోకి వెళ్లిపోయి, రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. పేదలు దొడ్డు బియ్యం తినలేక, రూ.10కు కిలో అమ్ముకుంటుంటే మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే కిలో రూ.30కి అమ్ముతున్నారు. పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగ పడటం లేదనే సన్న బియ్యం ఇస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు. రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్హౌస్లో పండించారు ‘రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన, 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్.. ఏనాడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీరు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని, మేం వడ్లు కొనమని చెప్పిన ఆయన.. ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌస్లో వడ్లనే పండించారు. ఆ వడ్లను క్వింటాల్కు రూ.4,500 చొప్పున చెల్లించి కావేరీ సీడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.2 వేలకు కొనేవారు దిక్కులేక వాళ్లు ఉరేసుకుంటుంటే, ఆయన పండించిన ధాన్యాన్ని క్వింటాల్కు అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా లేదా బంగారమా? చెప్పాలి..’ అని సీఎం అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పక్కనబెట్టారు ‘నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాగార్జునసాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు పోరాటం చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి పథకాలు సాధించుకున్నారు. కానీ కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు. 44 కిలోమీటర్ల సొరంగం అప్పట్లోనే 34 కిలోమీటర్లు పూర్తయింది. ఏటా ఒక్క కిలోమీటర్ తవ్వినా బీఆర్ఎస్ కాలంలోనే సొరంగం పూర్తయ్యేది. 3.5 లక్షల ఎకరాలకు నీరు పారేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి టన్నెల్ పనులు ప్రారంభించాం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. ఈ విషయంలో కేసీఆర్కు ఉరేసినా తప్పులేదు..’ అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు నాకు పోలికేంటి..? ‘2006లో జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యా. 2018లో కేసీఆర్ నాపై కక్షగట్టి ఎమ్మెల్యేగా ఓడించినా ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీకి వెళితే సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అదే నన్ను సీఎంను చేసింది. కేసీఆర్కు నాకు పోలికేంటి? మా ఇద్దరికి నందికి, పందికి ఉన్నంత తేడా ఉంది. నేను రుణమాఫీ చేశా. రైతుబంధును పెంచా. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు..మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. 15 నెలల కాలంలో రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు భరోసా కింద రూ.12 వేల కోట్లు వేశాం. సన్న వడ్లకు రూ.1,200 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతులకు పంగనామం పెట్టిన కేసీఆర్ నన్ను పోల్చుకోవడమేంటి? మేం రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా కార్యక్రమాలు చేశాం. ఒకరోజు వెనుకా ముందూ అయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యంఅందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులేఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడుసన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉందినాకు కేసీఆర్తో పోలిక ఏంటి?నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాంపదేళ్లలో తెలంగాణను నంబర్ వన్ చేస్తారైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. -
ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. -
ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయి: సీఎం రేవంత్
కొడంగల్: ‘ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయి. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంచి చెడుల్లో ఎల్లప్పుడూ కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే ఇచ్చారని వ్యాఖ్యానించారు. కొడంగల్లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయదని అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దుఃఖం ఉందని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నేనేం చేస్తానో.. ఏం చేశానో నాకంటే మీకే ఎక్కువగా తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ పాల్గొన్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి ముందుగా పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. -
‘తెలంగాణ రైజింగ్’కు ఆ దేశాలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు ‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు. ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే? ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు. -
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్వర్క్లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్లైన్లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. న్యాయ వ్యవస్థకు సవాలే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.తొలి ఎన్నికలలో టీఆర్ఎస్కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.2014 టర్మ్లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది. 2014-2023 వరకు బీఆర్ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
KSR Live Show: ఫిలిం సిటీ పేదల భూములపై రేవంత్ మౌనం ఎందుకు ?
-
కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
-
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని మఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టరాదంటూ సీఎం గురువారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం ప్రసంగం అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. తీర్మానంపై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఇందిరాగాందీ, వాజ్పేయి జనాభా లెక్కన కాకుండా, ఉన్న 543 పార్లమెంటు సీట్లనే కొనసాగిస్తూ పునర్విభజన చేశారని గుర్తుచేశారు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్పై పలు వివరాలను సీఎం సభ ముందుంచారు. సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్లాలి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఇష్టారీతిగా డీలిమిటేషన్ను చేపట్టడం మంచిది కాదని సీఎం అన్నారు. ‘లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండా జరుగుతున్న తీరుపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఈ సభ కోరుతోంది. కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణను సమర్ధంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన ప్రక్రియ శాపంగా మారకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేపట్టాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు 119 అసెంబ్లీ స్థానాలను 153కు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తోంది. అందుకే అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ఈ సభ కేంద్రాన్ని కోరుతోంది’అని సీఎం తెలిపారు. గత విధానాలకు విరుద్ధంగా మోదీ చర్యలు గతంలో నాలుగుమార్లు పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగినప్పుడు అనుసరించిన విధివిధానాలనే రాజ్యాంగంలో పొందుపర్చారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని విమర్శించారు. ‘1971 జనాభా లెక్కల తర్వాత పునర్విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాం«దీ.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం చెడిపోతుందని భావించి.. 25 ఏళ్లపాటు పాతవాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ఆ సంఖ్య ప్రకారమే వాటి పునర్విభజన చేయాలని చట్టాన్ని సవరించారు. 543 స్థానాలకుగాను దక్షిణాది 6 రాష్ట్రాల్లో ఉన్న 130 నియోజకవర్గాలను పునర్విభజించారు. 2006 తర్వాత జరిగిన పునర్విభజనలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 42 నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మొత్తం సంఖ్య పెరగకుండా పునర్వి భజించారు. 2002 జనాభా లెక్కల తర్వాత నాటి ప్రధాని వాజ్పేయి కూడా ఇందిరాగాంధీ విధానాన్నే అనుసరించి మరో 25 ఏళ్లపాటు అదే సంఖ్య కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తెలిపేందుకు ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రజా ప్రతినిధులతో చెన్నైలో సమావేశం నిర్వహించారు. కానీ, కేంద్రం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారు. వారి మాటలు అర్ధసత్యమేనని నేను చెప్తున్నా’అని పేర్కొన్నారు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం విధించిన జనాభా లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలుచేస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ‘దక్షిణాదిలో జనన మరణాల మధ్య అంతరం 1.8 శాతం మాత్రమే ఉంది. 543 ఎంపీ సీట్లలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే అది 19 శాతానికి తగ్గుతుంది. అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడుతుంది. ఇది దక్షిణాదికి క్షేమకరం కాదు. అందుకే రాజకీయాలకు అతీతంగా మనం గళం విప్పాలి. రాష్ట్రంలో భట్టి విక్రమార్క, కేకే, జానారెడ్డిల ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, ఉమ్మడి మాటగా కేంద్రానికి వినిపించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సభలో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తెలుగు రాష్ట్రాలపై వివక్ష తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కు, ఏపీలో 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం దాన్ని అమలు చేయలేదు. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు 2026లో జనాభా లెక్కల తర్వాతే అది సాధ్యమని బదులిచ్చింది. కానీ, కేంద్రంలోని ప్రధాన పార్టీ తన ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, సిక్కింలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఇది ద్వంద్వ వైఖరి కాదా? పార్లమెంటులో 24 శాతం ప్రాతినిథ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు.. పన్నుల రూపంలో జీడీపీకి 36 శాతం సమకూరుస్తున్నాయి. కానీ తిరిగి కేంద్రం నుంచి మనకు వస్తోంది చాలా తక్కువ. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. తిరిగి వస్తోంది 42 పైసలు మాత్రమే. అదే బిహార్ ఒక రూపాయి చెల్లిస్తే.. తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.6.06 అందిస్తోంది. ఉత్తరప్రదేశ్కు రూ.2.73, మధ్యప్రదేశ్కు రూ.1.70 చొప్పున అందిస్తోంది. ఇంతకాలం ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని వదులుకునేందుకు మనం సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా పోరాట ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో హైదరాబాద్లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందులో భాగస్వాములు కావాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ఈ తీర్మానంపై సీఎం మాట్లాడిన తర్వాత ఇతర పక్షాల అభిప్రాయాన్ని తీసుకోకుండానే, సభ ఏకగ్రీవంగా ఆమో దించిందని స్పీకర్ ప్రకటించారు. -
ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్ ‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం. ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్హౌస్ల్లో పండిన వడ్లను క్వింటాల్కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు. ఫాంహౌస్ల కోసం ప్రాజెక్టులు కట్టారు.. ‘బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు. పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు.. ‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు – తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారు: రేవంత్ ‘కేటీఆర్ ఫాంహౌస్ను ఎవరో డ్రోన్తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్రూమ్. బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్ను తీసుకునివచ్చి వాదించారు. కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా – మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్ ‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్రెడ్డి రేవంత్రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు -
BRS హయాంలో నన్ను జైల్లో చిత్రహింసలకు గురిచేశారు
-
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
నన్ను జైల్లో పెట్టి హింసించినా.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్లో తొలుత కేటీఆర్ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు. కానీ, డ్రోన్ ఎగరేశానని బీఆర్ఎస్ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్ సెల్లో పార్లమెంట్ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. .. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ.. కేసీఆర్ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్ -
డీలిమిటేషన్ కు జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు: సీఎం రేవంత్ రెడ్డి
-
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ భూముల అమ్మకం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్రెడ్డి ప్రస్తావించారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖలో..‘ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో మీరు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడిన ఈ భూమి నగరానికి ఊపిరులూదే ఒక ఆక్సిజన్ వనరుగా ఉంది. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది.ముఖ్యంగా ఈ భూమి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్ళకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ IV కింద భారతీయ నక్షత్ర తాబేళ్ళు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయి. ఈ చట్టం కింద ఆయా జీవజాతుల సంరక్షణతోపాటు, వాటి ఆవాసాలను కూడా సంరక్షించాలి. ఈ నక్షత్ర తాబేళ్ళు 2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) లో దుర్బలమైన జాబితాలో చేర్చబడి ఉన్నాయి. అంటే, ఇది అంతరించిపోతున్న వాటి జీవజాతిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర తాబేళ్ళు 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం (CITES - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా & ఫానా) కన్వెన్షన్ యొక్క అపెండిక్స్-I లో కూడా చేర్చబడి ఉన్నాయి.అంటే ఆయా జీవజాతులకు అంతర్జాతీయ వాణిజ్యం నుంచి అత్యున్నత స్థాయిలో రక్షణ కూడా కల్పించబడి ఉంది. కాబట్టి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. ఇవి చాలవన్నట్లు ఆర్థిక వనరుల పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్ అడవులుగా మార్చడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికీ కూడా ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతైనా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
మాదిగ.. లంబాడా.. రెండు బెర్తులు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇప్పుడు కేబినెట్ బెర్తుల ఫీవర్ పట్టుకుంది. మాదిగ, లంబాడా వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే నెల మూడో తేదీన జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గం విస్తరణలో స్థానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఫలానా ఎమ్మెల్యేలు మంత్రులయ్యే అవకాశాలున్నాయనే వార్తలు రావడం, తమ వర్గాలకు చెందిన పేర్ల ప్రస్తావన లేకపోవడంతో వారు అప్రమత్తమయ్యారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు కచి్చతంగా అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు లేఖలు రాయగా, గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు మాదిగ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు..? ‘రాష్ట్రంలో 32.33 లక్షల మంది మాదిగ కులస్తులున్నారని 2011 జనగణనలో వెల్లడైంది. ఆ తర్వాత మరో 15 లక్షల మంది జత కలిశారు. మేమంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, అండగా ఉంటున్నాం. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు అయిన నాగర్కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగ కులస్తులకు ఇవ్వలేదు. ఆయా జిల్లాల్లో మాదిగ జనాభానే ఎక్కువ ఉంటుంది. అందువల్ల త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మాకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టవుతుంది. మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్లో మరో అవకాశం ఇవ్వండి..’అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు రాసిన లేఖలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డిని కలిసిన వీరు లేఖ ప్రతిని అందజేశారు. మంత్రి పదవితో బంధం మరింత బలోపేతం మాదిగ ఎమ్మెల్యేల బాటలోనే లంబాడా ఎమ్మెల్యేలు కూడా లేఖాస్త్రం సంధించారు. తమ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎన్. బాలూనాయక్, జె.రామచంద్రునాయక్, ఎం.రాందాస్నాయక్, బి.మురళీనాయక్లు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇటు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేలోనే తెలంగాణలో లంబాడాల జనాభా 32.20 లక్షలుగా వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 శాతానికి పైగా లంబాడా ఓటర్లున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లంబాడా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా లంబాడాల ఆకాంక్షను గుర్తించాలి. కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా మా వర్గ ప్రాధాన్యతలను అసెంబ్లీలో, ప్రభుత్వంలో వినిపించే అవకాశం ఉంటుంది. లంబాడాలు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమవుతుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీతో పాటు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయన్ను కలిసి అందజేశారు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్బుక్ వాళ్లే రాశారు. రూల్బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో మరోసారి రచ్చ రచ్చ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్బాబు అన్నారు.మాజీ మంత్రి హరీష్రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్ను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
KSR Comments: చంద్రబాబు దారిలో రేవంత్
-
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి..
భద్రాచలం: భద్రాచల క్షేత్ర అభివృద్ధికి తొలి అడుగు పడింది. దేవస్థానం అభివృద్ధిలో భాగoగా మాడ వీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం రూ.60 కోట్లను మంజూరు చేసింది. మాడ వీధుల విస్తరణలో భా గంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించగా.. 45 మందికి రూ.34 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. ఈక్రమంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అధికారులు గత ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం భూసేకరణ, సర్వే వివరాలు ఆరా తీయడంతో.. నష్టపరిహారం విడుదల కావలసి ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇటీవల భద్రా చలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి సెతం.. రెండు, మూడు రోజుల్లో భూ నిర్వా సితుల పరిహారం అందుతుందని ప్రకటించారు. మంగళవారం రూ.34 కోట్లు విడుదల చేయగా.. ఏళ్ల తరబడి స్థానికులు, భక్తులు ఎదురుచూస్తున్న భద్రగిరి అభివృద్ధికి తొలి అడుగు పడినట్లయింది. ఈమేరకు 45 మంది నిర్వాసితులతో మంగళవారం ఆర్డీవో దామోదర్రావు సమావేశమై నిరభ్యంతర పత్రాలు స్వీకరించారు.వీరికి బుధవారం నష్టపరిహారం చెక్కులను ఇచ్చే అవకాశముండగా, శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డితో ఆలయ అభివృద్ధి పనులకు శంకు స్థాపన జరిపించేలా సన్నాహాలు చేస్తు న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యాన భద్రగిరి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆనంద్సాయి కొన్ని డిజైన్లను రూపొందించారు. మంగళవారం ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై కొత్త డిజైన్లను విడుదల చేసింది. ఈ డిజైన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంతోపాటు, అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి సత్వర అనుమతులకు ప్రయత్నించాలని నీటిపారుదల శాఖను ఆదే శించింది. ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 43.93 కి.మీల సొరంగ మార్గంలో తరలించి లింక్ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి పోయాల్సి ఉంది. సొరంగాన్ని రెండు టన్నెల్ బోర్ మెషీన్ల (టీబీఎం) సహాయంతో రెండు వైపులా (ఇన్లెట్, అవుట్లెట్) నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. శ్రీశైలం జలాశయ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీల పనులు పూర్తి కాగా,అవతలి వైపు నుంచి మరో 20.43 కి.మీల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మధ్యలో 9.55 కి.మీల మేర సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ఇకపై టీబీఎంతో రెండు వైపులా తవ్వకాలను విరమించుకొని ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. రెండు వైపుల నుంచి సొరంగాన్ని నేరుగా అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు తవ్వకాలు జరిగాయి. ఇకపై నేరుగా తవ్వకాలను కొనసాగించరు. రెండు వైపులా తవ్వకాలు ఆగిపోయిన చివర పక్కభాగం నుంచి డ్రిలింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరుపుకుంటూపోయి రెండు చివరలను అనుసంధానం చేస్తారు దీంతో కిలోమీటర్ వరకు సొరంగం పొడవు పెరిగే అవకాశముంది. రెండు టీబీఎంలను సొరంగంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే సమాధి చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంతి రేవంత్రెడ్డి సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగించండి కార్మికులను వెలికితీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను ఏప్రిల్ 10లోగా ముగించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్ను ఆదేశించారు. నెలరోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టేలా ప్రమాదం జరిగిన రోజు నుంచి, ఇప్పుడున్న పరిస్థితులపై ఫొటోలతో సహా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం..అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వీరిలో గుర్ప్రీత్సింగ్ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వారిలో గుర్ప్రీత్సింగ్ మృతదేహాన్నిమార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సీఎం చెప్పారు. తెలంగాణ,ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాదికి అటు ఇటుగా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన ప్రస్తుతం ఆరు కేబినెట్ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు పలుమార్లు హైకమాండ్తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్గౌడ్లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లతో ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. గుర్తించిన నేతలపై విస్తృత చర్చ సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి. అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమ్సాగర్ వైపు భట్టి మొగ్గు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది. మదన్మోహన్కు పార్టీ పెద్దలు, రోహిత్కు సీఎం ఆశీస్సులు! మదన్మోహన్ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్నాయక్ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్ను కేబినెట్లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. త్వరలో కార్యవర్గం! పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు?కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం’
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడంటూ విమర్శించారు కవిత. ఈరోజు(సోమవారం) కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. ‘బాన్సువాడ బీఆర్ఎస్ గడ్డ. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం ఉంటుంది. నేను, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి లాంటి వారం బాన్సువాడకు అండగా ఉంటాం. సీఎం రేవంత్ ది ఎప్పుడూ ఫ్లైట్ మోడే. అందుకే 15 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ చెప్పినట్లు వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు పండుగ బహుమతులు ఎత్తేశారు’ అంటూ విమర్శించారు.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్ఎస్ వ్యతిరేకం‘తులం బంగారం అన్నారు.. అదీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. వీటిన్నంటిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. మీ పక్షాన నిలబడుతుంది.. మేము ఎప్పటికీ మీ వెంటనే ఉంటాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా., ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలే. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారు. అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసింది.. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు కవిత. -
TG: క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..!
ఢిల్లీ : తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఉగాదిలోపే క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన పలువురు ముఖ్యనేతలు ఢిల్లీకి పయనమై వెళ్లారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ లు ఢిల్లీకి వెళ్లారు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఈరోజు(సోమవారం జరిగే సమావేశం అనంతరం క్యాబినెట్ విస్తరణ అనేది ఓ కొలిక్కే వచ్చే అవకాశం ఉంది. నేడో, రేపో క్యాబినెట్ మంత్రులపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్
-
ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం!
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోటా కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ, తర్వాత హుజూర్నగర్ను ఖరారు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ గోడౌన్ (స్టేజ్–1 స్టాక్ పాయింట్)ల నుంచి మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ఒక్కో యూనిట్కు (ఒక్కరికి) 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. ఏటా 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు దొడ్డు బియ్యమే అందుతు న్నాయి. రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రతా కార్డులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు (ఐఎఫ్ఎస్సీ) 54.48 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.62 లక్షల కార్డులు ఉండగా, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 90.14 లక్షల కార్డుల్లోని 2.83 కోట్ల యూనిట్లకు (మందికి) ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి 90.14 లక్షల కార్డులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. వీటికి తోడు ఇప్పటికే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, విద్యా సంస్థలకు కేటాయిస్తున్న బియ్యం కూడా కలిపి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) చొప్పున సన్నబియ్యం అవసరం ఉంది. అంటే సంవత్సరానికి 24 ఎల్ఎంటీలు అవసరమన్నమాట. వానాకాలం సీఎంఆర్ సిద్ధం వానాకాలంలో సేకరించిన సుమారు 55 ఎల్ఎంటీల ధాన్యంలో 24 ఎల్ఎంటీల మేర సన్న ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిన ప్రభుత్వం గత నవంబర్ నెలాఖరు నుంచే సన్న బియ్యాన్ని సేకరించే పనిలో ఉంది. తొలుత జనవరి (సంక్రాంతి) నుంచే సన్న బియ్యం ఇవ్వాలని భావించినప్పటికీ, కొత్తగా వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తే అన్నం ముద్దగా అవడం, అడుగంటడం వంటి పరిణామాలు ఉంటాయనే భావనతో రెండు మూడు నెలలు మాగపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లలో భద్రపరుస్తూ కొత్త బియ్యం పాతబడేలా చూశారు. ఈ నేపథ్యంలో జనవరి వరకు మిల్లింగ్ చేసి సేకరించిన సుమారు 5 ఎల్ఎంటీల బియ్యాన్ని ఉగాది నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ కోటా కింద సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని పేర్కొంటూ మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బియ్యం అక్రమ దందాకు కళ్లెం! రేషన్ షాపుల ద్వారా ఇప్పటివరకు అందుకుంటున్న దొడ్డు బియ్యంలో 60 నుంచి 70 శాతం వరకు దురి్వనియోగం అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని ఉచితంగా తీసుకుంటూ రూ.10కి కిలో చొప్పున రేషన్షాపుల్లోనే విక్రయించే పద్ధతి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది. ఇక ఇంటికి తీసుకెళ్లినా వంటకు వినియోగించకుండా దళారులకు కిలో రూ.10 నుంచి రూ.13 చొప్పున విక్రయించడం, దాన్ని దళారులు రాష్ట్రాలు దాటించడమో లేక రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు విక్రయించడమో చేయడం పరిపాటిగా మారింది. అయితే పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
సొ‘రంగం’ వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు. ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలరోజులు గడిచినా.. ఎమ్మార్పి–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు. భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్ బెల్ట్ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి. కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు! కేరళ నుంచి రప్పించిన కడావర్ డాగ్స్ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్ సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్ సెగ్మెంట్కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్ కూలిపోకుండా ఉంది. ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్జీఆర్ఐ నివేదిక కోసం నిరీక్షణ సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్ హోల్ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్పై హరీష్రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్రావు పేర్కొన్నారు. -
SLBC సహాయక చర్యలపై రేవంత్ ఆరా.. ఐదు కోట్లు విడుదల!
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలపై తాజాగా అక్కడ జరుగుతున్న సహాయకచర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ఆలస్యం కావడానికి గల కారణాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇదే సమయంలో సహాయక చర్యల కోసం రూ.5కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం ఫిబ్రవరి 22వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది. మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్ప్రీత్సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. మిగతా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారు. దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు, బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
‘ఎస్ఎల్బీసీ’పై రేపు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నెల రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వ్యూహం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలిచింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాలను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ భేటీకి రప్పిస్తోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత పురోగతి సాధించారు? ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమిటి? గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు ఇంకేం చేయాలి? అనే అంశాలపై ఆయా శాఖలు/సంస్థల అధికారులు ఈ సమీక్షలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అవసరమైతే సహాయక చర్యలను సోమవారం ఒక రోజు నిలుపుదల చేసి ఈ కీలక సమావేశానికి హాజరు కావాలని వారిని ప్రభుత్వం కోరింది. గత నెల రోజులుగా 650 మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.సొరంగం కుప్పకూలిన ఫాల్ట్ జోన్లోని మట్టి, బండ రాళ్ల శిథిలాల కింద మిగిలిన ఏడుగురు నలిగిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు. సహాయక చర్యలకు రూ.5 కోట్లు విడుదల ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సహా యక చర్యలకు రూ. 5 కోట్లను మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జీరో పాయింట్ వద్ద 40 మీటర్ల పరిధిలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరమని అధికారులు తేల్చారు. ఆ ప్రాంతంలో సిమెంట్ సెగ్మెంట్స్ కుంగినట్లు నిర్ధారణ కు వచ్చి ‘డీ1’వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక అక్కడ సహాయక చర్యలు కష్టమేన ని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచూకీ లభించని ఏడుగురి గుర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట.. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ (ఏపీలో) మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా? అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీరిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. ‘గోదావరి కన్నీటి గోస’పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎనిమిదేసి మంది ఎంపీలను గెలిపించినా ఏకాణా పని జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునేవాళ్లం. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’అని సూచించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది? రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశమున్నా మౌనంగా ఉంటే ఏమనాలి? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగు పారితే ఇప్పడు చెరువులు, కుంటలు అడుగంటాయి. కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వానికి తెచ్చుకున్నారు. అది వాళ్లిష్టం అయినా ఫలితాన్ని లోకం చూస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారు. తెలంగాణలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందే’అని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చుతున్నారు ‘పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు మనం అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు.. ‘కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు.. రావే’అని పిలుస్తున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణలో సమస్యలకు నాటి ప్రధాని నెహ్రూ మొదలుకొని సోనియాగాంధీ వరకు ప్రధాన శతృవు కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను బాగుచేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బెల్లం ఉన్న దగ్గరకు ఈగలు వస్తాయి. అధికారం పోగానే కొందరు పార్టీకి దూరమవుతారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ పార్టీదే. సింగిల్గా అధికారంలోకి వస్తాం. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్త కేసీఆర్లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్కు పార్టీ నేత బొడ్డు రవీందర్ నాగలి బహూకరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పుట్ట మధు, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, నారాయణదాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు
సాక్షి, చెన్నై: జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది. స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కేంద్రం చేపట్టే ఎలాంటి డీలిమిటేషన్ ప్రక్రియపై అయినా ముందుగా భాగస్వామ్య పక్షాలన్నింటితోనూ చర్చించాల్సిందేనని జేఏసీ సభ్యులు కుండబద్దలు కొట్టారు. ‘‘అందరి భాగస్వామ్యంతో మాత్రమే డీలిమిటేషన్ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో కచ్చితంగా సంప్రదింపులు జరపాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. లోక్సభ స్థానాల పునర్విభజన మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచేలా ఉండాలి’’అని పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన తీర్మానాన్ని జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని 42, 84, 87వ రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా విషయంలో స్థిరీకరణ సాధించాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అందుకే 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ధారించిన లోక్సభ నియోజకవర్గాల సంఖ్యపై పరిమితిని మరో 25 ఏళ్లపాటు పొడిగించాలి. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకూడదు. జనాభా నియంత్రణ చర్యలతో జనాభాను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి’’అని తీర్మానంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను లెక్కచేయకుండా కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే కలిసికట్టుగా అడ్డుకోవడానికి ఎంపీలతో కూడిన కోర్ కమిటీ ద్వారా సమన్వయం చేసుకోవాలని, ఆ మేరకు వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్’కు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయానికొచ్చారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియల చరిత్ర, వాటి ఉద్దేశం, ప్రతిపాదిత పునర్విభజన వల్ల తలెత్తే విపరిణామాలపై తమ రాష్ట్రాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. సమావేశంలో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్రెడ్డి, భగవంత్మాన్, కేటీఆర్, డీకే శివకుమార్, సురేశ్రెడ్డి, వద్దిరాజు, వినోద్కుమార్, మహేశ్గౌడ్, మల్లు రవి తదితరులు దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు: విజయన్ ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిదేనని విజయన్ తేల్చిచెప్పారు. జనాభా తగ్గించినందుకు ఇస్తున్న బహుమానం ఇదేనా అని మండిపడ్డారు. పునర్విభజనపై ముందుకెళ్లే ముందు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు. ‘‘ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే లోక్సభ సీట్లు ఉత్తరాదిన పెరిగి దక్షిణాదిన తగ్గుతాయి. తద్వారా బీజేపీ లాభపడుతుంది. స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే బీజేపీ ఆలోచన’’అని మండిపడ్డారు. జేఏసీ సమావేశం అనంతరం విజయన్ ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. దేశ సమాఖ్య వ్యవస్థపై సంఘ్ పరివార్ బహిరంగ యుద్ధం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య ప్రజాస్వామ్యానికి ముప్పు: డీకే కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దేశ సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంచేస్తున్న రాజకీయ దాడిగా అభివరి్ణంచారు. ‘‘సమాఖ్య నిర్మాణం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అంబేడ్కర్తో పాటు రాజ్యాంగ రూపకర్తలు నిర్మించిన సమాఖ్య ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేయొద్దు’’అని కేంద్రానికి సూచించారు. ‘‘ఆధిపత్యాన్ని అంగీకరించడమా? తిరుగుబాటు చేయడమా? ప్రగతిశీల రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రెండే అవకాశాలున్నాయి. మేం తిరుగుబాటునే ఎంచుకున్నాం’’అని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. జాతీయ వేదికపై దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో చర్చించాలి: నవీన్ పట్నాయక్ పార్లమెంట్లో, అసెంబ్లీల్లో ఎన్ని స్థానాలు ఉండాలో నిర్ణయించడానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జేఏసీ భేటీని ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. డీమిలిటేషన్పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, ప్రజల హక్కులను కేంద్రం కాపాడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అనేది అత్యంత కీలకమైన జాతీయ అజెండా అని నవీన్ వివరించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. బీజేడీ తరఫున మాజీ మంత్రి సంజయ్ దాస్, మాజీ ఎంపీ అమర్ పట్నాయక్ భేటీలో పాల్గొన్నారు.మన ఆమోదం లేకుండానే చట్టాలు: స్టాలిన్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్ చెప్పారు. పునర్విభజన పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే పలు రాష్ట్రాలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గరాదు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంట్లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. మన ఆమోదం లేకుండానే చట్టాలు రూపొందితే మన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది’’అని ఉద్ఘాటించారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు. ఈ జేఏసీ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ఈ భేటీని ‘జేఏసీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’గా పిలుద్దామని ప్రతిపాదించారు. జేఏసీ రెండో భేటీ హైదరాబాద్లో జరుగుతుందని చెప్పారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండో భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నేతలు ఏకాభిప్రాయానికి వచి్చనట్లు సమాచారం. -
ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని అడ్డుకుందాం
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి. అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి. అలా పునర్విభజనను ఒప్పుకోం.. మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి. వాజ్పేయి విధానాన్ని అనుసరించండి.. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు. -
న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్ కవితాత్మక ట్వీట్
హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో… డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి…విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం.ఉత్తరాదిని గౌరవిస్తాం… దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. అది డీ లిమిటేషన్ ఐనా… విద్యా వ్యవస్థపై పెత్తనమైనా… అంగీకరించేది లేదు…ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది… ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది… న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు’ అంటూ ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన…— Revanth Reddy (@revanth_anumula) March 22, 2025 -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశం
-
సీఎం రేవంత్రెడ్డితో హరీష్రావు భేటీ
-
సీఎం రేవంత్రెడ్డితో హరీష్రావు భేటీ.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు. -
దేశ నేతలను కులాలకు పరిమితం చేస్తారా?
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అద్యక్షుడు బండి సంజయ్కు సడన్గా ఆంధ్ర ప్రాంత పూర్వ నేతలపై అభిమానం పుట్టుకువచ్చినట్ల అనిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, 1953లో అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో 58 రోజులపాటు దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంత చిత్తశుద్దితో చేసినట్లు కనిపించడం లేదు.. .. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిన నేపథ్యంలో సంజయ్ ఈ అవకాశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనుమానం కలుగుతోంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో యూనివర్శిటీ ఉందని, విభజన కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్కు ఈయన పేరు పెడితే ఇంకా సమున్నతంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు. అదే టైమ్ లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరును ప్రకృతి వైద్యశాలకు పెడుతున్నామని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని, ఆర్యవైశ్యుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని అన్నారు. 👉పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్శిటీ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టవలసిన అవసరం ఏముందని సంజయ్ ప్రశ్నిస్తున్నారు. శ్రీరాములు గొప్ప దేశ భక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడని, ఆర్యవైశ్యులకు ఆరాధ్య నాయకుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఈ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణలో ఆయా చోట్ల వైశ్య సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష అభివృద్దికి కృషి చేశారని, దీనికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టవచ్చని బండి సలహా ఇచ్చారు. బాగానే ఉంది. అక్కడితో ఆగి ఉంటే అదో తరహా అనిపించేది. .. ఇక్కడే సంజయ్ తన రాజకీయ ఆలోచనను అమలు చేసే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక ఆరోపణ చేస్తూ, తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరు తొలగించి, ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదించారని అన్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది ఒక ప్రశ్న. పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ఉండాలని కోరవచ్చు. అంతవరకు ఓకే. కారణం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చాలని ప్రతిపాదించింది. దీనిని శాసనసభలో కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఇందులో కూడా కులం కోణమే ఉందన్న భావన కలుగుతుంది. 👉ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కులం ఆపాదించడం ఏమిటి? రేవంత్ ను విమర్శించే క్రమంలో సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుడిని కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! అంతేకాదు.. ముఖ్యమంత్రి తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమర యోధులతోపాటు, ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అనడం ద్వారా బండి సంజయ్(Bandi Sanjay) ఎజెండా ఏమిటో తెలిసిపోతుంది కదా! అంటే ఆర్యవైశ్యుల ఓట్లు తనవైపు ఉండేందుకు, కాంగ్రెస్కు నష్టం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. అదే టైమ్ లో పొట్టి శ్రీరాములును కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! ఇది దురదృష్టకరం. శ్రీరాములు అయినా, ప్రతాపరెడ్డి అయినా కులాలకు అతీతం అన్న సంగతిని విస్మరించరాదు. నేతలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుండనిపిస్తుంది. వర్తమాన సమాజంలో అలాంటి ఆశించడం అత్యాశే కావచ్చు. ఈ అంశాన్ని తొలుత చేపట్టి, అక్కడ నుంచి ఆయన తన విమర్శలను కాంగ్రెస్ పై ఎక్కుపెట్టారు.మహనీయులను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించిందని సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ ను ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 👉అంబేద్కర్ పై అంత అభిమానం ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని బీజేపీ నేతలు ఎన్నిసార్లు సందర్శించారో తెలియదు. అదే టైంలో.. సంజయ్ మరో వివాదాస్పద ప్రశ్న సంధించారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ పార్కు పేరు మార్చే దమ్ముందా? అని ఆయన అంటున్నారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించగలరా? కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరుతో ఉన్న స్టేడియంకు కొత్త పేరు పెట్టే దమ్ము ఉందా? అని ఆయన అడగడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. 👉పొట్టి శ్రీరాములు మీద గౌరవం ప్రకటిస్తూనే, ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తొలగించగలరా అని అడగడంలో అర్థం ఏమైనా ఉందా? సంజయ్కు తెలుసో లేదో కాని.. కాసు, నీలం, కోట్ల వంటివారు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లే.. జైళ్లకూ వెళ్లొచ్చిన వాళ్లే. మరి వారి పేర్లు మార్చగలరా అని అనడంలో ఆయనలో కుల కోణం కనిపిస్తుందే తప్ప సహేతుకత కనిపించదు. ఎన్టీఆర్ ప్రముఖ నటుడు , రాజకీయాలలోకి వచ్చి ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నారు. ఆయన పేరు మార్చగలరా? అని అడగడం ఏమిటి. పరోక్షంగా వారి పేర్లు తీసివేయాలని సూచించడమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. లేదంటే.. వీరు రెడ్డి,కమ్మ వర్గానికి చెందినవారు కనుక వాటి జోలికి వెళ్లడం లేదని పరోక్షంగా చెప్పదలిచారా! టాంక్ బండ్ పై అనేకమంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయని ,వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించడం కూడా రాజకీయ ప్రేరితంగానే కనిపిస్తుంది.తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్నిచోట్ల కాసు, నీలం ఎన్టీఆర్ విగ్రహాలను కొంతమంది ధ్వంసం చేసినప్పుడు బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పినట్లు కనిపించదు. అలాగే టాంక్ బండ్పై ఉన్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను ఉద్యమ సమయంలో ఇప్పటికే ఒకసారి కూల్చారు. ఆ రోజుల్లో కూడా ఈ అంశంపై బీజేపీ గట్టిగా స్పందించినట్లు కనబడలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహాలను వెంటనే పునరుద్దరించారు. బండి సంజయ్ కులపరమైన ఆలోచనలతో కాకుండా చిత్తశుద్దితో పేర్ల మార్పుపై మాట్లాడితే స్వాగతించవచ్చు. కాని ఆర్యవైశ్యులకు, దేశభక్తులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంలోని ఆంతర్యం తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 👉అసలు పేర్లు మార్చడంలో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికి ఉండకపోవచ్చు. పేర్ల మార్పిడి అన్నది కొత్త విషయం కాదు. కాని బీజేపీ కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో పవర్లోకి వచ్చాక అవసరం ఉన్నా, లేకపోయినా తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిందన్న విమర్శలు ఉంది.ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) కొన్ని ప్రాజెక్టులకు రెడ్డి ప్రముఖుల పేర్లు ఉంటే వాటిని తొలగించింది. మాజీ మంత్రులు గౌతం రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి పేర్లను తొలగించారు. అంటే దాని అర్థం అక్కడ ప్రభుత్వం రెడ్లకు వ్యతిరేకమని.. ఆ విధానానికి బీజేపీ సమర్థిస్తోందన్న భావన కలగదా?. కొంతమంది తెలుగుదేశం వారు విశాఖలోని స్టేడియంకు ఉన్న వైఎస్ పేరును తీసివేసే యత్నం చేశారు. వారిది కుల జాఢ్యమని బీజేపీ చెబుతుందా! సంజయ్ తెలంగాణలో కులపరమైన ఆరోపణలు చేస్తే, బీజేపీ దేశంలో మతపరమైన విమర్శలు ఎదుర్కుంటోంది. మతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీలో పలు రోడ్ల పేర్లు మార్చింది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఇందులో ఒక రికార్డు ఉంది. ఏకంగా 24 నగరాలు, పట్టణాల పేర్లను మార్చడానికి ప్రతిపాదించింది. వాటిలో పలు నగరాల పేర్లను మార్పు కూడా చేసింది.వీటికి ఉన్న గత ముస్లిం పాలకుల పేర్లను తొలగించి హిందూ పేర్లను పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.సెక్యులర్ దేశంగా ఉన్న భారత్ లో ఇలా చేయడం సరైనదేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. వీటిలో కొన్నిటికి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చారు. అంటే బీజేపీ ఎక్కడ అవసరం అయితే అక్కడ మతం లేదంటే కులం ప్రాతిపదికన రాజకీయం చేయడానికి వెనుకాడడం లేదని అనిపించదా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్మెంట్పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్గా క్యాలెండర్గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్నగర్లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
బడే భాయ్.. చోటే భాయ్ ఇద్దరూ ఒక్కటే!
సూర్యాపేట: కేంద్రంలో బడేభాయ్ మోదీ, రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, రేవంత్ అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు.ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్కు పర్సంటేజీలపైనే దృష్టి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. రైతులకు రావాల్సిన రూ.37 వేల కోట్లు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఖాతాల్లో టింగు టింగు అంటూ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని చెప్పారు.చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది.. అలాగే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. సమావేశానికి ముందు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు గొప్పగుంది.. అప్పు పుట్టకుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘గత పాలకులు రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.8 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారు. నెలకు కొంతమందికి అవసరానికి అనుగుణంగా సర్దుతున్నాం. మరోవైపు కొత్తగా నెలకు వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు. వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు. ఎక్కడా అప్పు పుడ్తలేదు.. ఎవ్వడు మనల్ని నమ్మడం లేదు. పేరు చూస్తే గొప్పగ ఉంది.. అప్పు పుట్టకొచ్చింది (పుట్టడం లేదు). ఎన్నిరోజులు దాచిపెట్టుకోను. క్యాన్సర్ ఉంటే సిక్స్ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతరా? ఉన్నదున్నట్లు చెపుతున్న..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం సాయంత్రం ‘ప్రజాపాలన..కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో.. పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు ఆయన అందజేశారు. అలాగే రాష్ట్రంలో కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి ‘బిల్డ్ నౌ’ పోర్టల్ను ఆవిష్కరించారు. ఇందుకోసం ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి అనుమతి పత్రాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు. ఆ డబ్బే ఉండుంటే అద్భుతాలు చేసేవాణ్ణి.. ‘ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ ఇచ్చి, పద్ధతి ప్రకారం అప్పు తీసుకుంటే 4 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ గుట్టుగా కమీషన్ల కోసం కాళేశ్వరానికి 11 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. దాన్ని 5 శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పటి పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే నేను సీఎం అయ్యాక రూ.1.53 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన. ఇందులో రూ.88వేల కోట్లు అసలు, రూ.66 వేల కోట్లు మిత్తి కింద కట్టిన. ఈ డబ్బు నాదగ్గర ఉండుంటే గంటలోనే రుణమాఫీ చేసేవాడిని. 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చేవాడిని. ఎన్నో అద్భుతాలు చేసేవాణ్ణి. అప్పట్లో రోజుకు లక్ష టన్నుల చొప్పున ఇసుక దోచుకున్నరు. రూ.7 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో రైతుబజార్ల తరహాలో ఇసుక బజార్లు పెట్టి మూడు ప్రాంతాల్లో అమ్ముతున్నం. అంతా ఆన్లైన్లోనే..’ అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి ‘ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాపై కోపం?. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకా..? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకా? రేవంత్రెడ్డికి పాలనపై పట్టు రాలేదని మాట్లాడుతున్నారుం. రాజయ్య, ఈటల లాంటి బలహీనవర్గాల వారిని సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టాం? మేం గడీలలో పెరగలేదు. నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాంం. అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు లేదు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలిం. మేం విజ్ఞత ప్రదర్శిస్తున్నాం. ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలతో వందల కోట్ల ఆదాయం ‘మిస్ వరల్డ్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పర్యాటక రంగానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతోంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. వేలాది మంది విదేశీయులు రాబోతున్నారు. వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. 3 వేల విదేశీ ఛానెల్స్, పత్రికలు రాబోతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. భవిష్యత్లో వందల కోట్ల ఆదాయం రాబోతోంది. ఫార్ములా–ఈ రేస్ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. మీకు, మాకూ పోలికా? పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీదిం. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది. త్వరలోనే యాదగిరిగుట్టను వైటీడీ బోర్డు ద్వారా విశ్వవ్యాప్తం చేయబోతున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ ఉద్యోగాలు మీ హక్కు ‘ఈ కారుణ్య నియామకాలు మీ హక్కు. మీ కుటుంబసభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి. గత పాలకులు ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3లలో 2 వేల పైచిలుకు ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నాం..’ అని రేవంత్ తెలిపారు. అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ‘హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్ను తీసుకొచ్చాం. ఎంతటివారైనా సరే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందే. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించాలన్నదే మా ఉద్దేశం.. అదే గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యేలు వీర్ల శంకర్, కాలె యాదయ్య, సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, డీటీసీపీ దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదంతా దుష్ప్రచారం.. నా మీద ప్రజలకు కోపమా?
సాక్షి,హైదరాబాద్: నా మీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అభివృద్ది చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించింది. పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలో కార్యుణ నియామకాల్ని చేపట్టింది. ఎంపికైన 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాల్ని చేపట్టింది. నామీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారు? మహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకా? నాపై కోపం..? ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపం? రుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకా? నాపై కోపం అని ప్రశ్నించారు. అనంతరం, తెలిపారు. అనంతరం,బిల్డ్ నౌ పోర్టల్ను ఆవిష్కరించారు. -
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. -
6 గ్యారంటీల అమల్లో ఏపీ కంటే తెలంగాణ బెటరా ?
-
మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు హైదరాబాద్లో..
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన మెక్ డొనా ల్డ్స్ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం (జీసీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బుధవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో జీసీసీ విభాగం చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెస్స్కెతోపాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఒప్పందంపై సంతకాలు చేశారు. సుమారు 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్స్ ఇండియా సంస్థ గ్లోబల్ ఆఫీసును నెలకొల్పనుంది. ఈ కేంద్రాన్ని తమతమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ. మెక్డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమున్న ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్సిటీని స్కిల్ జోన్గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ప్రతిభావంతులు: సీఈవో బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్స్ సీఈవో క్రిస్ కెంప్కెజెస్స్కె అన్నారు. అందుకే హైదరాబాద్ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లు ఉన్నాయని, ప్రతి ఏటా 3, 4 కొత్త ఔట్లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. తమ ప్రాథమ్యాలని, ఈ మూడు అంశాలతో కూడిన తమ పాలన నమూనా యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన పర్యవసానాలను మార్చుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురైందని, అయినా ‘చేతి’లో ఉన్న మిగతా కాలంలో పాలనను పరుగుపెట్టిస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రం పురోగమించేందుకు వేస్తున్న అడుగుల్లో మాకు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ మా పాలన సత్తా చాటుతున్నాం. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం. తెలంగాణ రైజింగ్–2050 ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు అని.. పదేళ్లలో దీనిని వెయ్యి బిలియన్ డాలర్ (ట్రిలియన్ డాలర్) వ్యవస్థగా మార్చే దిశలో సాగుతున్నామని తెలిపారు. భట్టి విక్రమార్క బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ను రూ.3,04,965 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తించే కార్యాచరణతో ముందుకొచ్చామ ని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం భట్టి మాటల్లోనే.. ‘‘ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యాం. ‘భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకుంటున్నా’అని నాడు అంబేడ్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నైతికతను పదే పదే నొక్కిచెప్పారు. ఆ నైతిక విలువలనే పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నాం. దశాబ్దకాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో ఛిద్రమైన తెలంగాణ పాలనా, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు సాగుతున్నాం. స్వార్థపరుల అబద్ధపు ప్రచారం.. నిజం కూడా ప్రతి రోజూ ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధమే నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధార విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడం మా బాధ్యత. ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే.. ఆ స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. కేవలం కేటాయింపులకే పరిమితం కాదు.. మేం బడ్జెట్లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు. అవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిరి్వరామంగా కృషి చేస్తోంది. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీలు, ఐటీ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ఈ పథకాలు బలోపేతం చేస్తాయి. సమష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ సగటు కంటే మన వృద్ధి రేటు ఎక్కువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొంటూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024–25లో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం రూ.16,12,579 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.9 శాతంగానే ఉంది. 2024–25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751, వృద్ధిరేటు 9.6 శాతం అయితే.. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, వృద్ధి రేటు 8.8 శాతం మాత్రమే. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 (1.8 రెట్లు) మేర ఎక్కువగా ఉంది. రాష్ట్ర పన్నుల వాటా 50శాతానికి పెంచాలని కోరాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన భాగం దక్కాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమరి్పంచిన సమగ్ర నివేదికలో కోరింది. కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్రం తరఫున వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని కోరాం. తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే.. 15వ ఆర్థిక సంఘం కాలంలో 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయం. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నది మా వాదన. ధరణి కష్టాలకు చెక్ పెట్టాం.. భూమి కేవలం స్థిరాస్తి కాదు. ఒక భావోద్వేగం. భూమితో బంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. గత ప్రభుత్వ హయాంలో ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల భూసంబంధిత సమస్యలు ప్రజలకు వేదన మిగిల్చాయి. ఆ సమస్యలకు చెక్ పెడుతూ మా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. ఇందులో నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా.. భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి వీలుగా ఉన్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో కులగణన అసమానతలను రూపుమాపే లక్ష్యంతో.. గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబి్ధదారులకు చేరేందుకు, సమర్థవంతమైన పాలన కోసం ఈ సర్వే కీలక డేటా అందించింది. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సమగ్ర ఆర్థిక పురోగతి విధానాల రూపకల్పనకు ఇది ఆధారంగా మారనుంది. ‘ఫ్యూచర్’లో ఏఐ సిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తాం. అది ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఏఐ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది’’ అని భట్టి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా.. ‘‘గత దశాబ్దంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరుడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కలి్పంచే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే మా లక్ష్యం.’’ ఇంటి దగ్గర గుడిలో పూజలు చేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం తమ ఇంటి దగ్గరున్న దేవాలయంలో భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టికి ఆర్థిక శాఖ అధికారులు, శాసనసభ అధికారులు స్వాగతం పలికారు. తోటి మంత్రులతో కలసి అల్పాహార విందు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బడ్జెట్ పుస్తకాలున్న బ్యాగ్ను అందచేశారు. తర్వాత మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుకు బడ్జెట్ ప్రతులను అందచేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లకు కూడా బడ్జెట్ ప్రతులతో కూడిన బ్యాగును అందించారు. ఈ క్రమంలో మంత్రి మండలి భేటీ అయి బడ్జెట్ను ఆమోదించింది. ఈ సందర్భంగా సహచర మంత్రులంతా భట్టిని అభినందించారు. కాగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఏకంగా 14వ సారి బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకోవడం విశేషం. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బడ్జెట్ రూపకల్పనలో భాగమవుతూ వచ్చారు. -
‘ ప్రపంచ మీడియా హైదరాబాద్కు రావడం ఇష్టం లేదా?’
హైదరాబాద్: తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ వంటి నగరంలో అందాలు పోటీలు నిర్వహించాలని భావిస్తుంటే, దానికి కేటీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటన్నారు. అందాల పోటీలు నిర్వహించే సత్తా తెలంగాణకు లేదని కేటీఆర్ భావిస్తున్నాడా? అని ప్రశ్నించారు.‘ప్రపంచ మీడియా హైదరాబాద్ కు రావడం కేటీఆర్ కు ఇష్టం లేదా?, అందాల పోటీ లకు ప్రభుత్వం నామినల్ గా ఖర్చు పెడుతుంది. : ఈ కార్ రేసింగ్ వేరు...అందాల పోటీలు వేరు. ప్రభుత్వం డబ్బులు ఎలా ఉపయోగించామనేదే ఇంపార్టెంట్. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది.ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు.అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని పొన్నం తెలిపారు. -
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ ను కాంగ్రెస్ మించిపోయిందంటూ ధ్వజమెత్తారు. అంతా ‘ఓం భూం.. బుష్’ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.ఆరు గ్యారెంటీలపై ఆశలు వదలుకునేలా బడ్జెట్ తీరు. గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణం. అభయ హస్తం కాదు....మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు. వృద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేసిన బడ్జెట్. విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది. రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి.. గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్ తో గోబెల్స్ ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ కు పోలికా?, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే...డొల్ల అని తేలిపోయింది’ అన్నారు... ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే..కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు..ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.... అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు.ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే... అబద్దాలు...అంకెల గారడీ...6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం... అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.హమీలను పూర్తిగా గాలికొదిలేశారు..అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్ తో తేటతెల్లమైంది. మహిళలకు నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. వ్రుద్దుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసింది. నేటి బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే...కాంగ్రెస్ తిరోగమమన పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్ అని తేలిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదు.కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదుబడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా....ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెటట్ లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.వైద్య రంగం అస్తవ్యస్తం..గత ఆర్ధిక సంవత్సరంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే.... తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకపోవడం సిగ్గు చేటు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.బీసీ కులాల సంక్షేమం ఏది?కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ... బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. ఎన్నికల్లో విద్యకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కేటాయింపులను చూస్తే పొంతనే లేదు. వ్యవసాయ రంగాన్ని విస్మరించారు..వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. రైతు సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు... రైతు రాబందు రాజ్యంగా మార్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం దుర్మార్గం. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం.... వాటికి కేటాయింపులు జరపకపోగా సిగ్గు లేకుండా అబద్దాలను వల్లించడం దారణం.అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడంబడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది. ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకురావడాన్ని చూస్తుంటే..... అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాళా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో, అవినీతి, దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది.కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
KTR: కేటీఆర్కు ఊరట
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎంపై చేసిన వ్యాఖ్యల కేసును కొట్టేస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడారంటూ ఎంపీ అనిల్ సైఫాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్పై కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు కేసును కొట్టేస్తూ కేటీఆర్కు ఊరట ఇచ్చింది. -
చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీళ్లు వదిలారు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ వేళ.. బీఆర్ఎస్ పార్టీ అనూహ్య నిరసనకు దిగింది. ఎండిన వరికంకులతో ఆ పార్టీ సభ్యులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు.ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు. ముందుచూపు లేని దున్నపోతు ప్రభుత్వం ఇది. ప్రాజెక్టులలో నీరు ఉన్నా వదలడం లేదు. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీరు వదిలారు. కేసీఆర్పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోచేస్తున్నారు. 400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండబెట్టారు. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? అని కేటీఆర్ అన్నారు. అని కేటీఆర్ మండిపడ్డారు. -
ఆ రెండేళ్ల కథ ఏంది రేవంత్?
ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుకోవడానికి రెండేళ్లు పడుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ఆయనకు పెద్దగా ఉపకరించేదిగా కనిపించడం లేదు. పైగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుళ్ల పాలన గురించి అనవసరంగా ప్రస్తావించారు. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించి ఉండాల్సింది. బీఆర్ఎస్ పాలనను(BRS Party Rule) తుప్పుతో వర్ణించిన రేవంత్ వదిలిచేందుకు పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్లు పడుతుందని, వైఎస్సార్, చంద్రబాబుల పాలనల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే రేవంత్ చంద్రబాబుకు సన్నిహితుడన్న ముద్ర కలిగి ఉండటం. కాబట్టి ఆయన ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించాలని అనుకుని వైఎస్సార్ పేరును కలిపారా? అనే ప్రశ్న తలెత్తకమానదు. 👉చంద్రబాబు నాయుడు 1994లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి. ఆ తరువాత ఎన్టీఆర్ను కూలదోసి సీఎం అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్కు రెండేళ్లు పట్టిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పదలిచారా?. చంద్రబాబు పాలన అంత అధ్వాన్నంగా ఉందని బహిరంగంగా చెప్పడానికి ఆయన ఇష్టపడతారా?. ముఖ్యమంత్రలు తమ అధికార అవధిలో కొన్ని కొన్ని విధానాలు పాటించడం సహజం. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనో, లేక మరో రకంగానో వైఎస్ పాలన సాగలేదు. వైఎస్ అధికారం దక్కిన వెంటనే చంద్రబాబు పట్టించుకోని జలయజ్ఞం పనులు చేపటారు. హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తోసహా పలు అభివృద్ది పనులు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు అందులో అత్యంత కీలకమైంది. అంతేతప్ప చంద్రబాబు ప్రభుత్వ తీరుతెన్నులపై మాట్లాడుతూ కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ సాధ్యపడదని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేవారు. రాజశేఖరరెడ్డి మాత్రం సీఎం అయిన వెంటనే అమలు చేసి చూపించారు. 👉గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వ్యవస్థ ఎటూ టేకప్ చేస్తుంటుంది. అది వేరే విషయం. వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekar Reddy) టైమ్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఎక్కువగా ఇచ్చింది. దాని వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. దానివల్లే 2009లో కూడా ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే ఆయన అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. వీరెప్పుడూ వైఎస్ పాలనను తప్పు పట్టలేదు. ఈలోగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, దాని వల్ల ఎదురైన పరిణామాలు ప్రధానంగా రాజకీయాలను ఆక్రమించాయి. 2014లో విభజన జరిగిపోయింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యారు. విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 👉కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అప్పట్లో అనేవారు. కేసీఆర్ కూడా అరవై ఏళ్ల సమైక్య పాలనలో లోపాలు అంటూ ఎత్తి చూపుతుండేవారు. వీరిద్దరూ ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఎక్కువ వాటిని అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అందువల్ల ఆయన రెండోసారి పెద్దగా ఇబ్బంది లేకుండా గెలవగలిగారు. ఏపీలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన రెండేళ్లు ఏమిఖర్మ.. ఐదేళ్లపాటు అదే పాట పాడేవారు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్ను తిట్టడానికి ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ఇంతలో ఓటుకు నోటు కేసు రావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదలి హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోయారు. అది అప్పటి కథ. చంద్రబాబు హామీలు నెరవేర్చక పోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైనా ఒకటి, రెండు సందర్భాలలో గత ప్రభుత్వం అంటూ మాట్లాడారేమో కాని, ఎక్కువ భాగం తను ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకోవల్సిన చర్యలపైనే దృష్టిపెట్టారు. తద్వారా ఆరు నెలలలోనే అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారు. వాగ్దానాలు అమలుకు రెండేళ్లు తీసుకోలేదు. మధ్యలో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ ఏపీని నిలబెట్టారు. కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులకు రెండో టర్మ్లో పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది పనులు చేశారు. ఈ ప్రభుత్వాలలో ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని వాటిని సరిదిద్దడానికి రెండేళ్లు పడుతుందని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. కేసీఆర్ రెండో టర్మ్ కూడా గెలిచి 2023లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నిటిని ఏడాది లోపు అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, రైతు బంధు, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి వంటివి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర అమలు చేసే యత్నం చేశారు.. ఇంకా అనేకం పెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలకు ఏడాదికి రూ.2500, స్కూటీల పంపిణీ, పెన్షన్ను రూ.నాలుగు వేలు చేయడం, దళితులకు రూ.పది లక్షల స్కీమ్ మదలైనవి ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి నిధులు అవసరం. మరీ ఎక్కువగా హమీలు ఇచ్చామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తుప్పు వదలించుకోవడానికి పదేళ్లు పడుతుందని చెప్పడం ద్వారా సమస్యను డైవర్ట్ చేయడం ఒక లక్ష్యం అయితే, మరో టర్మ్ కూడా తనను ఎన్నుకోవాలని చెప్పడం మరో లక్ష్యంగా కనిపిస్తుంంది. 👉2024లో ఎన్నికైన చంద్రబాబు కూడా నిత్యం జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతుండడం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెబితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్(Super Six Promises) అంటూ ఊదరగొట్టింది. వాటిని అమలు చేయకుండా ఏవేవో కథలు చెబుతూ, జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను వాస్తవాల నుంచి మళ్లించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని రేవంత్ చెప్పడం లేదు. ఇందులో చంద్రబాబు కూడా కష్టపడుతున్నారని చెప్పదలిచారో, లేక రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం చేయదలిచారో తెలియదు. పరిపాలనపై పట్టు రావడానికి ఇంకా సమయం కావాలని రేవంత్ చెబుతున్నారు. పదిహేను నెలల పాలన తర్వాత ఆయన ఆ మాట అనడం ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అసలు సమస్య పాలనపై పట్టు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోవడం, నిధులు లేకపోవడం , ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వస్తున్నదేమోనన్న భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన వాగ్దానాలకు ఎగనామం పెడుతూ, వాటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అంటూ అరాచకాలు సృష్టించడానికి, గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విద్వంసకర పాత్ర పోషిస్తోంది. హామీల అమలు యత్నంలో చంద్రబాబు కన్నా రేవంత్ కాస్త బెటర్. కానీ ఇద్దరూ గతం తవ్వుతూ కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం. -
కరువు రైతులను ఆదుకొనే పూర్తి బాధ్యత సీఎందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు కాంగ్రెస్ తెచ్చిందని.. రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండిన ప్రతీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా, తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెవికి ఎక్కలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చని పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ జరగక, పెట్టుబడి సాయం అందక ఇప్పటికే అల్లాడుతున్న రైతులకు పంటలు ఎండిపోవడం గోరు చుట్టు మీద రోకటి పోటులా ఉందన్నారు. ఆర్థిక శక్తిని ఆగం చేస్తున్నారు ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని, రాష్ట్రంలో పాలనకు బదులుగా పీడన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరిట వసూళ్లు, మూసీ సుందరీకరణ పేరిట పేదలపై పగ, ఫార్మాసిటీ పేరిట భూముల దందా జరుగుతోందన్నారు. ఫోర్త్సిటీ పేరిట ముఖ్యమంత్రి కుటుంబం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ట్రిపుల్ఆర్ పేరిట పేదల భూముల ఆక్రమణ జరుగుతోందన్నారు. గతంలో మద్యం వద్దు అంటూ నినదించిన రేవంత్...ఇప్పుడు ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
ఇల్లెందుకు ‘సీతారామ’ నీళ్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు నియోజకవర్గానికి తరలించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, బోడు, కొమరారం మండలాల ఏర్పాటు, ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. సీఎం రేవంత్రెడ్డిని కోరారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, అఖిలపక్షాలతో భేటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, రాంచంద్రునాయక్, మురళీ నాయక్, రాందాసు నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులున్నారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు ఎస్సీల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, మందుల శామ్యేల్ ఉన్నారు.నల్లగొండ జిల్లాకు చెందిన గిరిజన నేత కె.శంకర్నాయక్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించినందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
మీ మద్దతు లేకుండా అధికారం కష్టం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ప్రజ ల మద్దతు లేకుండా తెలంగాణలో ఎవరూ అ ధికారంలో కొనసాగలేరని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని చెప్పా రు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు పెట్టి పనిచేశానని, పక్కాగా బీసీ జనా భా లెక్కలతో డాక్యుమెంట్ తయారు చేసి, చట్టం చేసి రక్షణ కల్పించామని వెల్లడించారు. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్లో పడి కులగణన విషయంలో విమర్శలు చేయవద్దన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పలు బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంను బీసీ సంఘాల నేతలు శాలు వాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మీరు నాకు అభినందనలు చెబుతున్నా రు. ఈ అభినందనలన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి రాహుల్గాం«దీకిస్తా. భారత్జోడో యాత్ర సందర్భంగా కృష్ణా మండలం మీదుగా తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చార్మినార్ వరకు రాహుల్గాంధీ ఒకటే మాట చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్రాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీ య స్థాయిలో కులగణన చేస్తామన్నారు. మీ సహకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనసు పెట్టి పని చేశా. నిబద్ధతతో ముందుకు వెళ్లాం.. కులగణన చేసేందుకు ఉత్తమ్కుమార్రెడ్డిని సబ్కమిటీ చైర్మన్గా నియమించాం. కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లగలిగిన నిబద్ధత, అధికారులతో పని చేయించగలిగిన నైపుణ్యం ఉన్న నాయకుడు కనుకనే ఆయనకు బాధ్యత ఇచ్చాం. బీసీల జనాభాకు సంబంధించి ఏ పరీక్షకైనా, ఎలాంటి స్రూ్కటినీలో అయినా నిలబడేలా పక్కా డాక్యుమెంట్ రూపొందించాం. దాన్ని లాకర్లో దాచిపెట్టదల్చుకోలేదు. డాక్యుమెంట్ను బిల్లు పెట్టి చట్టం చేశాం. అందుకే బీసీల కులగణన విషయంలో నేను చరిత్రలో ఉండిపోతా. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరిగినా తెలంగాణకు వచ్చి నేర్చుకుని పోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇంతటి కీర్తిని ఊహించి ఉండరు. అదే తరహాలో తెలంగాణలో బీసీల గణన గురించి ఇప్పటికిప్పుడు చర్చ జరగకపోవచ్చుగానీ మున్ముందు మాత్రం కచి్చతంగా తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిందే. తప్పు ఉందంటే.. నష్టం చేసుకున్నట్టే.. బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. కులగణన లో తప్పు ఉందని అంటే.. మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, అందరినీ భాగస్వాములను చేశాను కాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. వాయిదా వేయాలనుకుంటే పదేళ్లకు కూడా వీడని విధంగా చిక్కుముళ్లు వేయొచ్చు. ఓబీసీలతో కాంగ్రె స్ పార్టీకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బీసీల మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు. అడగాలి కొట్లాడాలే తప్ప మమ్మల్ని అనుమానించి అవమానిస్తే లాభం లేదు. బీసీల గణన విషయంలో తెలంగాణ ఇచి్చన డాక్యుమెంట్ ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. అలాగే ఈ డాక్యుమెంట్ను కూడా భవిష్యత్తులో అవసరమైతే సవరించుకుంటాం. 10 లక్షల మందితో సభ పెట్టండి బీసీ కుల గణన ప్రక్రియలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొన్నా. అవన్నీ బయటకు చెప్పను. రిస్క్ చేసి బీసీల జనాభా లెక్కలు తేల్చా. మీరు అభినందనలు ఇక్కడే తెలపడం కాదు. పరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షల మందితో సభ పెట్టండి. రాహుల్గాందీని పిలిపిస్తా. అభినందించండి. ఆయనకూ బలం వస్తుంది. దేశం మొత్తం కుల గణన జరపాలని పోరాడే శక్తి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి, వీహెచ్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్ల శంకరయ్య, రాజ్ఠాకూర్, వాకిటి శ్రీహరి, ప్రకాశ్గౌడ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్గౌడ్, టి. చిరంజీవులు, దాసు సురేశ్ పాల్గొన్నారు. సీఎం చెప్పిన ఏడంతస్తుల కథ బీసీల కులగణన విషయంలో రాజకీయ నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోనుగానీ బీసీ సంఘాలు మాత్రం విమర్శలు చేయవద్దని, తమను బాధ పెట్టవద్దని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘బీసీల గణనకు నేను పునాదులు వేశా. స్లాబ్ వేసి ఓ అంతస్తు కట్టా. ఆ ఇంట్లోకి రండి. వచ్చి కాపురం చేయండి. అన్నం వండుకుని తినండి. మీకు వీలున్నప్పుడు రెండో అంతస్తు, మూడో కట్టుకోండి. అలా కాకుండా మాకు ఏడంతస్తుల భవనం కట్టివ్వలేదు. మేం ఆ ఇంట్లోకి రామంటే మీకే నష్టం. ఏడంతస్తులు కట్టేలోపు పునాదులు శిథిలమై స్లాబ్ కూలిపోతుంది. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్లో పడొద్దు. నేనిచ్చిన డేటా మీకు లంకెబిందెల్లాంటిది. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచి్చంది. కొట్లాడితే జనగణనలో కులగణన జరగదా? ఒక్కసారి జనగణనలో కులగణన ప్రారంభమైతే ప్రతి పదేళ్లకోసారి బీసీల జనాభా ఎంత ఉందో తేలిపోతుంది’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్రెడ్డి రీట్వీట్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అంతకు ముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనగణన తర్వాత ఎస్సీల సంఖ్య ఆధారంగా వారి రిజర్వేషన్లను మరింత పెంచుతామని ప్రకటించారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేయడంలో చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ దళితుల పక్షపాతి అని, రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. అనేక మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు ఇచ్చి పైకి తెచ్చిందని.. దళిత బిడ్డ మల్లిఖార్జున ఖర్గేకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. అందరి అభీష్టం మేరకే.. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన మరుక్షణమే తమ ప్రభుత్వం స్పందించిందని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం. వారి సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ వేశాం. వర్గీకరణపై కమిషన్ విస్తృతంగా సమాచారం సేకరించింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. 8,681 విజ్ఞప్తులను కూలంకషంగా పరిశీలించింది. 59 ఎస్సీ ఉప కులాలకు సంబంధించిన స్థితిగతులతో నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. 59 ఉపకులాలను మూడు కేటగిరీలు చేశాం. అత్యంత వెనుకబడిన 15 ఉప కులాలకు ఒక్క శాతం, మధ్యస్తంగా వెనుకబడిన 18 ఉప కులాలకు 9శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలకు 5 శాతం మేర విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించాం..’’ అని రేవంత్ తెలిపారు. ఆ దళిత కుటుంబాలకు సాయం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.4 లక్షల సాయం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు జనాభా లెక్కలే కీలమని చెప్పారు. 2026లో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టే వీలుందని, అది పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు మరింత పెంచుతామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్నిపక్షాలకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక దినం: ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించుకున్న ఈ రోజు ఇది చరిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభివర్ణించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి శాసనసభ సమావేశంలో, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గొంతెత్తేవని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినా చట్టబద్దత రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ నాయకత్వంలో చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామన్నారు. వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 15శాతంగా ఉన్న రిజర్వేషన్లు త్వరలో పెరుగుతాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా దాదాపు 18శాతంగా ఉన్నట్టు వెల్లడైందని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని కమిషన్ సిఫార్సు చేసిందని.. కానీ వర్గీకరణ ఫలాలు ఎస్సీల్లోని అన్ని కులాలకు దక్కాలన్న ఉద్దేశంతో దానిని మంత్రివర్గం ఆమోదించలేదని ఉత్తమ్ చెప్పారు. ఎస్సీలను కూరలో కరివేపాకులా వాడుకున్నారు గత ప్రభుత్వం ఎస్సీలను కూరలో కరివేపాకు మాదిరిగా చూసిందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. వర్గీకరణపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే మాజీ సీఎం, మాజీ మంత్రులంతా గైర్హాజరు కావడం బాధాకరమన్నారు. మాలలపై కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికనే మాలలకు ఫలాలు దక్కాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెప్పారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో ఎక్కువగా మాదిగలకు దక్కాయని, ఆ తర్వాతే మాలలు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న ఎస్సీ జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను కేంద్రంలో కూడా అమలు చేయాలని, కేంద్ర ఉద్యోగాల్లోనూ వర్గీకరణ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు పార్లమెంటులోనూ చట్టం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను గ్రూప్–1, 2, 3లుగా విభజించారని.. అలాగాకుండా గ్రూప్–ఏ, బీ, సీ కేటగిరీలుగా చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు. చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది.దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాంవన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’అని అన్నారు. బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపుఅంతకుముందు..కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా.రాహుల్ గాంధీకి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో కృతజ్ఞత సభ పెట్టండి’అంటూ బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ కులగణన సర్వేపై రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీని. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి.ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం.పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం.పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్న మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం.దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే.కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాంలెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది.పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు.కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటు చేయండి’అని సూచించారు. -
పాలనపై పట్టుకు మరికొంత సమయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘అందరినీ సమన్వయం చేసుకుంటూ.. సుపరిపాలన అందిస్తే పాలనపై పట్టు సాధించినట్లు.. నేను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. దీనికి మరికొంత సమయం పడుతుంది. పాలనపై నాకు ఇంకా పట్టురా లేదని కొందరు అంటున్నారు. పాలనపై పట్టు అంటే ఏంటి? ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, ఓ ఇద్దరు అధికారులపై కేసులు పెట్టి జైలుకు పంపించడమా?’’ అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.యువతకు భవిష్యత్తు ఇవ్వడానికే..రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథ కాన్ని తీసుకువచ్చినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన యువత.. ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిస లుగా మారుతున్నారు. ఇదో పంజాబ్, కేరళ మాదిరిగా మారుతోంది. అలాకాకుండా యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. రూ.6 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రాయితీ పద్ధతిలో ఆర్థిక సహకారం అందిస్తాం. ఇది పార్టీ పథకం కాదు.. పూర్తిగా ప్రజలు, అర్హులైన నిరుద్యోగులకు అమలు చేసే పథకం. పూర్తిగా ప్రజల పథకం’’ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు అమలు చేశామని, పథకాలు, సంస్కరణలు తీసుకువచ్చాని రేవంత్ చెప్పారు.అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపం..రాష్ట్రంలో బీసీ జనాభా 56.36శాతం ఉందని కుల సర్వే ద్వారా తేల్చామని, వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గినా, అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించం. దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇసుక విక్రయంతో రోజువారీ ఆదాయం రూ.3 కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 నుంచి 6.6శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి..’’ అని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుంచి రూ. 4లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని.. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది వరకు లబ్ధి కలిగిస్తామని, నిజమైన నిరుద్యోగులకే పథకం అందిస్తామని వివరించారు.నిరుద్యోగ యువత కాళ్లపై నిలబడేలా..: భట్టిగత ప్రభుత్వం దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా గ్రూప్–1 నియామకాలు చేపట్టలేదని.. తాము కేవలం ఏడాదిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడేలా, సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేలా స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రాజీవ్ యువ వికాసాన్ని తీసుకువచ్చారని భట్టి పేర్కొన్నారు. లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించి, సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు. -
కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘నైతిక విలువలపై అసెంబ్లీలో చిలుక పలుకులు పలికిన సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో బజారు భాష మాట్లాడారు. రాజ కీయాల్లో హద్దు దాటకూడదని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించాం. మేం కూడా రేవంత్ బట్టలు విప్పితే.. ఆయన బయట తిరగలేడు. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల సంగతులు, సాగర్ సొసైటీలు, మైహోమ్ భుజ వ్యవహారాలను మేం మాట్లాడగలం. ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలం. రేవంత్ దాటిన ‘రేఖలు, వాణిలు, తార’ల గురించి.. ఎక్కువగా మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెట్టగలం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి తాము నోరు విప్పితే ఆయనకు ఇంట్లో తిండి కూడా పెట్టరని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లాబీలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం అప్పుడు గుర్తుకురాలేదా? తనపై 15 కేసులు పెట్టిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజాస్వామ్య విలువలు, కుటుంబం ఇప్పుడు గుర్తుకువస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మాపై అసహ్యకరమైన ఆరోపణలు చేసి సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లలను రాజకీయాల్లోకి లాగిన రోజు మాకు కుటుంబాలు లేవా? మీకు విలువలు లేవా? ప్రస్తుతం తన భార్యాబిడ్డల గురించి మాట్లాడుతున్న రేవంత్కు.. మాకు కూడా కుటుంబాలు ఉంటాయనే విషయం గుర్తుకురాలేదా?’’అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేమిటో తెలుసని, బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో మూటల లెక్కలూ ఉన్నాయేమో! ‘‘ఈ ఏడాది రూ.70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ అప్రూవర్గా మారి నిజం ఒప్పుకున్నారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం, కోవిడ్ సంక్షోభం వంటివేవీ ఇప్పుడు లేకున్నా సీఎం రేవంత్ విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్. రాష్ట్ర అప్పులపై రేవంత్ చెప్తున్న కాకి లెక్కల్లో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్లకు ఇచి్చన మూటల లెక్కలు కూడా ఉన్నాయేమో’’అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్కు గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదని మండిపడ్డారు. భూముల అమ్మకంపై సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాలన చేతకాదనే మాటలను నిజం చేస్తున్నారు.. ‘‘తెలంగాణకు నాయకత్వ లక్షణాలు లేవు, పాలన చేతకాదనే సమైక్యాంధ్ర పాలకుల మాటలను రేవంత్ నిజం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు విచక్షణతో మాకు పగ్గాలు అప్పగించారు. కాబట్టే పునాదులు గట్టిగా పడ్డాయి. లేదంటే తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయేది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య మీటింగ్లపై కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని.. ఆ ఆరోపణలు అవాస్తవమైతే రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ రద్దుపై విచారణ జరిపిస్తాం.. ఫార్ములా–ఈ రేసును తప్పుబడుతున్న రేవంత్ ప్రభుత్వం.. రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు పెడుతోందని కేటీఆర్ నిలదీశారు. ‘‘ఫార్ములా–ఈ’ను ఏకపక్షంగా రద్దు చేయడంతో ప్రభుత్వానికి జరిగిన నష్టంపై మా ప్రభుత్వం వచి్చన తర్వాత విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడితే.. వారు జర్నలిస్టులే కాదంటూ, బట్టలు విప్పుతానంటూ సీఎం దూషణకు దిగుతున్నారు. గాడ్సే మూలాలు కలిగిన రేవంత్ జాతిపిత లాంటి కేసీఆర్పై చిల్లరగా మాట్లాడుతూ అభినవ గాడ్సేలా తయారయ్యారు’’అని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎంఐఎం విషయంలో తమ వైఖరిపై పునరాలోచించుకుంటామని చెప్పారు. -
అపాయింట్మెంట్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశంలో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ సోమవారం రాత్రి లేఖ రాశారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించాం. ఆ సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో రెండు బిల్లులను పెట్టి చర్చించాం. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకారం కోరాలని రాజకీయ పక్షాలు సూచించాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల తరఫున మిమ్మల్ని కలసి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వగలరు’’అని ఆ లేఖలో సీఎం కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి రైల్వేశాఖ ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు సీఎం సోమవారం రాత్రి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ లాజిస్టిక్ హబ్గా మరో కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఈ టెర్మినల్కు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. -
TG: ‘బీసీ’ బిల్లులు ఏకగ్రీవం
బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.-సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు ఆమోదం పొందాయి. అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ రెండు బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. తర్వాత సాయంత్రం వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదాం.. బీసీ బిల్లులపై చర్చ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీలకు 37శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును గతంలో అసెంబ్లీ ఆమోదించింది. దానికి సంబంధించిన తీర్మానం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సాంకేతిక కారణాల రీత్యా గతంలో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని, కొత్తగా అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని మా నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదామన్నారు. ఏకాభిప్రాయంతో వెళదాం.. నాయకత్వం వహిస్తా.. బీసీల లెక్క తెలియకపోవడం వల్లే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రం కులగణన సర్వే చేపట్టామన్నారు. ‘‘బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా. అఖిలపక్ష నాయకులంతా సమైక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలుద్దాం. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. మేం రాహుల్ గాం«దీని కలసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతాం. ఆయనను కలిసే బాధ్యత, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేలా చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అప్పగిస్తాం..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చేసే బాధ్యత ప్రతి పార్టీపైనా ఉందన్నారు. చట్టబద్ధత లభించేలా శాస్త్రీయంగా చేశాం: భట్టి విక్రమార్క బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కసరత్తు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. శాస్త్రీయంగా, పకడ్బందీగా 50రోజుల్లో దీనిని పూర్తి చేశామని చెప్పారు. ‘‘దేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను మోడల్గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేశాం..’’ అని భట్టి వివరించారు. కుల గణనలో బీసీలు 50.36 శాతం ఉన్నట్టు తేలిందని.. దీని ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సభలో తీర్మానం పెట్టామన్నారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: పొన్నం ప్రభాకర్ తమిళనాడులో మొత్తం 68శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన కూడా ఈడబ్ల్యూఎస్కు 10శాతం రిజర్వేషన్లతో తొలగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయన్న సంకేతం పంపిద్దామని.. ఎవరేం చేశారన్నది మరోసారి చర్చించుకుందామని చెప్పారు. బీసీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీకి ఇది శీలపరీక్ష లాంటిదని, ఆ పార్టీ వ్యాపారుల పార్టీనా, బీసీల పార్టీనా తేలిపోతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులకు అవకాశం: కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ల పేర్లతో శాస్త్రీయత లేకుండా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరిపారని పేర్కొన్నారు. అయితే వివేకానంద చెప్పిన అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లును ఆమోదిస్తుందని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ప్రసంగించారు. స్వీట్లు తినిపించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందడం మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి, బీసీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించుకున్నారు. -
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
అప్పుల భారం, ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్బీఐ నుంచి రూ.4,000 కోట్ల లోన్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, నగదు కొరత దృష్ట్యా డియర్నెస్ అలవెన్స్ (డీఏ), ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులదేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అన్ని వాస్తవాలు, గణాంకాలను వారి ముందు ఉంచుతామని, తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. డీఏ, ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు అన్నారు.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరవుఈ నెల 12న ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ప్రతినెలా జీతాలు, పింఛన్లు, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులను తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరో రూ.6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వద్ద రూ.5,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సుమారు 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతినెలా నిధులు అవసరమవుతాయని, వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పులు ఇలా..దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రుణాలు పొందవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలను నిర్వహించడంలో ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) ద్వారా స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. ఈ అడ్వాన్సులు రాష్ట్ర ఆదాయ, వ్యయ నమూనాల ఆధారంగా పరిమితులకు లోబడి ఉంటాయి.ఇదీ చదవండి: ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..బాండ్ల జారీతో మార్కెట్ రుణాలు..ఒక రాష్ట్రం తన డబ్ల్యూఎంఏ పరిమితిని దాటితే, అది ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీనికి కఠినమైన షరతులు ఉంటాయి. ఆర్బీఐ ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తూ బాండ్ల జారీ వంటి మార్కెట్ రుణాల ద్వారా కూడా రాష్ట్రాలు నిధులను సమీకరించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకోవాలంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితితో సహా నిర్దిష్ట రీపేమెంట్ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. -
రాజీవ్ యువ వికాసం పథకం.. దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్.: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారలు హాజరయ్యారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ రాయితీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తులను ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఆహ్వానించనున్నారు. ఆపై అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 వతేదీన రాయితీ రుణాలను మంజూరు చేయనుంది ప్రభుత్వం. -
రేవంత్.. నువ్వు దాటిన రేఖలు బయట పెట్టాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాసిప్స్ బంద్ చేసి.. గవర్నరెన్స్పై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు. కుటుంబాలు మాకు లేవా? అని ప్రశ్నించారు. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది. రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు. 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి. పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?.నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు. మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు. కేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మల్లికార్జునఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు?.బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించటం లేదు. రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి.గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి. కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా?. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా?. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న మాకు ఎవరు ఏంటో అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాం’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది: కవిత
-
తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..
Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వం ఫోకస్పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్ గంగుల.. 👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు. -
కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం, లిక్కర్ దోపిడీ, అక్రమ భూముల వ్యవహారం, భూముల అమ్మకాలు, అప్పులు చేయడం, అహంకారపూరిత వ్యవహారశైలి గత బీఆర్ఎస్ పాలన తరహాలోనే ఇప్పుడూ ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలుచేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రూ.152 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేయటంలో గత బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్కు తేడా లేదని విమర్శించారు.నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్ పారీ్టల వైఖరి వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, డీలిమిటేషన్ను బూచిగా చూపించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
నేడు అసెంబ్లీలో కీలక బిల్లులు
సాక్షి, హైదరాబాద్: మూడు కీలక బిల్లులు సోమవారం శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం రాత్రి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం..దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధారి్మక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు. కాగా బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించనుంది. నేడు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలుసోమవారం శాసనసభ, శాసనమండలి ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నాయి. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల పెంపు, హెచ్ఎండీఏ భూముల తాకట్టు తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక మండలిలో కూడా సోమవారం కీలక ప్రశ్నలు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వనుంది. నేడు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బ్రేక్ఫాస్ట్: చరిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి చాంబర్లో వారి కోసం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పుల్లోనే పథకాల అమలు ‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం. ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి ‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి. 300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు.. ‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్హౌస్లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్హౌస్లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్పల్లిలో ఫామ్హౌస్లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని హరీశ్రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్రావు చెప్పే జాతిపిత ఫామ్హౌస్లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు. మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది... ‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి ‘గత బీఆర్ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది’
సాక్షి, నిజామాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫీవర్ పట్టుకుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఇఫ్తార్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణ అంటే గంగా జమునా తహిజిబ్.ఇతరులకు తెలంగాణ ఇక రాజకీయం. బీఅర్ఎస్కు తెలంగాణ ఒక టాస్క్. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది..గౌరవం,అభిమానం అనేది కొంటే రాదు.ముఖ్యమంత్రి మాటలు గౌరవ ప్రదంగా లేవు. తెలంగాణ హిస్టరీ కేసీఆర్ .. ఆయనతో రేవంత్కు అస్సలు పోలిక లేదు. కాంగ్రెస్ పార్టీ రంజాన్ తోఫా నిలిపివేయటం బాధాకరం. సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఎవరు ఎంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. -
‘సీఎం రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. -
‘అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం’
సాక్షి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్,హరీష్ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు. సభలో రేవంత్ అసహనంజనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పు లపాలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
-
‘దోచుకున్న డబ్బుతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు’
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటికాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయంఅసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు. -
అది YS జగన్ చిత్తశుద్ధి.. సభలో సీఎం రేవంత్ పొగడ్తలు
-
OUలో ఆంక్షలు విధించడంపై కేటీఆర్ మండిపాటు
-
కేసీఆర్పై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్కు హరీష్రావు సవాల్
సాక్షి, తెలంగాణభవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్రావు కౌంటరిచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్కు సంస్కారం ఉందా?. కేసీఆర్ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరువుపోతుంది.అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలని పేదలను వేధిస్తోంది. ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారు. ఫోర్త్ సిటీ అని మరో 15వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలి. ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా నిన్న రేవంత్ సభలో మాట్లాడారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డ వ్యక్తి అని రేవంత్ అంటాడు. అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్ను బండకేసి కొట్టారు. 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైంది.రేవంత్కు సవాల్..రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్రెడ్డి
-
స్టేచర్ సరే.. స్టేట్ ఫ్యూచర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ నేతలు మాటకు ముందు, మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. ఆ స్టేచర్ విషయంలో ఉన్న ఆసక్తి, పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ విషయంలో ఏదీ? ఒకప్పుడు మీకు అధికార పార్టీ స్టేచర్ ఉండేది, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని జనం మార్చురీకి పంపారు. స్టేచర్ గుండుసున్నా అయింది. నేను ఇదే చెప్పా, అందులో తప్పేముంది. నేను కేసీఆర్ను ఏదో అంటున్నానని కేటీఆర్, హరీశ్రావు అంటున్నారు.కేసీఆర్ నుంచి తీసుకునేందుకు ఇక ఏమీ లేదు. ఆయనది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే.. కేటీఆర్, హరీశ్రావు దానికోసం పోటీపడతారేమో. దాన్ని నేనైనే కోరుకోను కదా! కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అదే ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది మా భవిష్యత్తు కార్యాచరణ..’’అని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు శనివారం ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే.. ‘‘పార్టీలో పెద్ద మనిషి హోదాలో కేసీఆర్.. తాడు బొంగరం లేనట్టు వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీశ్రావులను సరిదిద్దాలి. ఇకనుంచి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. నా రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నేను మంత్రి కాకుండా నేరుగా సీఎం అయ్యా. గతంలో ఎన్టీఆర్, నరేంద్ర మోదీ డైరెక్ట్గా సీఎం అయి పాలన అందించలేదా? 40ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కదా.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే.. అందులో మంచిని గుర్తించి నేర్చుకునేందుకు నేను సిద్ధం.. రైతులకు సంబంధించిన ఏ విషయంపై అయినా చర్చ జరగాలని కేసీఆర్ కోరితే నేను రెడీ. సభకు వచ్చి చర్చించాలి. పూర్తి చిట్టా విప్పుతా. ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా.. భూకంపం కూడా ఒక్కసారి రాదు, రెండుమూడు సార్లు కదిలి కంపిస్తుంది. తుఫాన్ ముందు కొంత ప్రశాంతత ఉంటుంది. కొన్నేళ్లు అలాంటి ప్రశాంతత చూపిన ప్రజలు చివరికి ఎన్నికల్లో ప్రభావం చూపారు. అసెంబ్లీ ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా వచ్చినా కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. వారి అధికారాన్ని దూరం చేసినందుకు నామీద కోపం ఉండొచ్చు. కానీ సీఎం కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా.. ఇంకా కుల దురహంకారాన్ని వీడలేదు. ఇట్లానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నా ఖాయం. గవర్నర్ ప్రసంగం అలానే ఉంటుంది.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అవును.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలానే ఉంటుంది. ఎందుకంటే మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో కూడిన విధానాలనే పథకాలుగా అమల్లోకి తెచ్చాం. మా ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రూపొందిన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాలనే గవర్నర్ ప్రస్తావించారు. అలాంటప్పుడు విమర్శించడం ఏమిటి? ప్రతిపక్ష నేతలు అజ్ఞానమే విజ్ఞానంగా, అడ్డగోలుతనమే గొప్పతనంగా భావిస్తున్నట్టున్నారు’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గింది.. ‘‘అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యువతకు 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరోటి లేదు. నేను సవాల్ విసురుతున్నా.. ఉంటే చెప్పండి. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉంటే.. 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 18.1 శాతానికి తగ్గింది. కేంద్ర కార్మిక శాఖ ఆదేశం మేరకు లేబర్ఫోర్స్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక చెప్పిన వాస్తవమిది. నిరుద్యోగ సమస్యను తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.’’ఔను.. మోదీ బడే భాయే.. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బడే భాయే (పెద్దన్న). ఈ మాటను మరోసారి చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తరచూ ప్రధానిని కలుస్తూనే ఉంటాను. పార్టీపరంగా ఆయనతో విభేదించొచ్చు. కానీ ప్రధానిగా గౌరవిస్తా. గత 15 నెలల్లో ఢిల్లీకి 32 సార్లు వెళ్లా, మూడు పర్యాయాలు ప్రధానిని కలిశా. నేను కలవని కేంద్రమంత్రి అంటూ ఎవరూ లేరు. అవసరమైతే మరో 300సార్లు వెళ్తా. మీరు ప్రధానిని గౌరవించరు. గవర్నర్ను గౌరవించరు. ప్రజలను పట్టించుకోరు.’’ -
హద్దు మీరితే ఖబడ్దార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్గానే చూస్తాం. క్రిమినల్స్కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’ -
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం శ్రమించిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమన్నారు. కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు. ఉత్తమ్వి పచ్చి అబద్ధాలు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని హరీశ్రావు విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించి ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేశారు. నాడు కృష్ణా జలాల్లో తెలంగాణకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఇటీవల తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుని వచ్చారు’అని హరీశ్ అన్నారు. ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో జరిగే అన్యాయంపై నాడు కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్రెడ్డి ఒక్కరే కొట్లాడారు. నాడు నాతోపాటు ఆరుగురు కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాం. కానీ ఉత్తమ్కుమార్ రెడ్డి.. కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం నోరు మూసుకున్నారు. ఆయనది ద్రోహ చరిత్ర అయితే బీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాకు కేసీఆర్ నీళ్లు ఇస్తే.. హుజూర్నగర్ను ముంచి పులిచింతల ద్వారా ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చిన ఘనులు కాంగ్రెస్ నాయకులు’అని హరీశ్రావు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ మార్చురీకి పోతారని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శనివారం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ను కించపరచడం తప్ప సీఎం 3 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. రాజముద్ర నుండి చార్మినార్, కాకతీయుల కళాతోరణం తీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్తో భేటీ అయ్యారు. సీనియర్ సభ్యుడైన జగదీశ్రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదనే విషయాన్ని హరీశ్రావు ప్రస్తావించారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసే అంశంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కోరలేదన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై పునఃసమీక్షించి ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. సభ ప్రారంభమైన తర్వాత హరీశ్రావు ఇదే విషయాన్ని మరోమారు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు. -
నేడు స్టేషన్ఘన్పూర్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చేరుకుంటారు. స్టేషన్ఘన్పూర్లో ఇందిర మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు.ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేస్తారు. రూ.700 కోట్ల విలువైన పనులను సీఎం వర్చువల్గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించే కృతజ్ఞత సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఐదు రోజులుగా స్టేషన్ఘన్పూర్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు శనివారం బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. » మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. » 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. » మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లె హెలిప్యాడ్కు చేరుకుంటారు. » 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళాశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ సంఘాలకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు. » 1.25 నుంచి 3 గంట లవరకు శివుని పల్లె లో ప్రజాపాలన కా ర్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. » 3.10 గంటలకు శివునిపల్లె హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలి కాప్టర్లో హైదరా బాద్ చేరుకుంటారు. -
యస్.. రెండోసారి నేనే సీఎం!
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఏమో కానీ.. తెలంగాణ సీఎంగా ఎవరైనా ఆశలు పెట్టుకుంటే మాత్రం వదులకోవాల్సిందేననే సంకేతాలిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్.. రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ, రేవంత్ మాత్రం స్పష్టమైన ధీమాతో సీఎంగా రెండోసారి కూడా తానే అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సంగతిని పక్కన పెడితే, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వస్తుంది. దీనిపై తెలంగాణ బీజేపీ కూడా డిమాండ్ చేస్తూనే ఉంది. బీసీలను వాడుకోవడం, వదిలేయడమే కానీ వారిని ఎప్పుడు సీఎంగా అందలం కాకపోయినా కనీసం సీఎం అభ్యర్థిగా అయినా ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్.. ఒక బీసీని సీఎంగా చేస్తుందా? అని ఎద్దేవా చేస్తోంది.సీఎం రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా..?మరి ఈ విమర్శల నేపథ్యమో ఏమో కానీ రేవంత్ రెడ్డి.. తానే రెండోసారి సీఎం అంటూ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీలో సందర్భం వచ్చిన ప్రతీసారి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తన సీఎం పీఠానికి కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి పోటీ లేకుండా రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.అయితే సీఎం రేవంత్ మాత్రం తాను రెండోసారి సీఎంను అని తరచు వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యాన్ని చూస్తే ఆయనలో కాస్త ఆందోళన అనేది కన్పిస్తోంది. ఒకవేళ బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల సమయంలో ప్రకటిస్తే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ లాంటి నేతలకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. మరొకవైపు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలకు కూడా సీఎం పదవిపై ఆశ ఉందని చర్చ నడుస్తోంది. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తాను కూడా ముందు వరుసలోను ఉంటారు. ఇలా కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగానే ఉంది.. ఆ క్రమంలోనే రేవంత్ సీఎం పోస్ట్ అంశాన్ని సమయం వచ్చినప్పుడల్లా లేవనెత్తుతున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుంది. సీఎంగా తన సహజ ధోరణిలో ముందుకు సాగుతున్న రేవంత్.. అత్యంత ధీమాగా ‘రెండోసారి అధికారం.. రెండోసారి సీఎం’ అని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.రేవంత్ నోట.. ‘మళ్లీ సీఎం’ మాటతెలంగాణ అసెంబ్లీ సమాఏశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్.. ప్రస్తుతమే కాదు.. రెండోసారి కూడా తానే సీఎం అంటున్నారు. ‘రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా. మొదటిసారి బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్న. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం. రూ. 25 లక్షల పైచీలుకు రుణమాఫీ జరిగింది ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తా. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పిందే జరిగింది. భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మా ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతం: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్పీచ్లో అప్పులు, వడ్డీలు లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘ఈ 15 నెలల్లో మేము చేసిన అప్పు 4500కోట్లే. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయింది. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నన్ను ట్రోల్ చేశారు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.తప్పులు, అప్పులు చేసి మీరే ముంచేశారు..ఈరోజు సీఎం రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రూ. 8. 19 లక్షల కోట్లు అప్పులు చేశారని, తాము వచ్చాక రూ. రూ. 1.53 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామన్నారు సీఎం రేవంత్,. ప్రస్తుత తెలంగాణ అప్పు రూ. రూ. 7. 38 లక్షల కోట్లు అని చెప్పారు. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్ -
Revanth Reddy: గతంలో యూనివర్సిటీలను కేసీఆర్ పట్టించుకోలేదు
-
బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి చురకలు
-
కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్(KCR) మొహం చాటేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తూ.. మాజీ సీఎంతో పాటు హరీష్, కేటీఆర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాటకు ముందు స్టేచర్.. మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. మరి మీకు స్టేట్ ఫ్యూచర్ వద్దా.. మీ స్టేచరే మీకు ముఖ్యమా? అని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు.కేసీఆర్ దగ్గర ఇప్పుడు మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమే. ఆ సీటుతో నేనేం చేసుకుంటాం. అది హరీశ్కో, కేటీఆర్కో కావాలి మాకు కాదు. కేసీఆర్ను ఉద్దేశించి నేను ‘స్ట్రెచర్’ వ్యాఖ్యలు చేశానని హరీష్, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నాను.. అందులో తప్పేం ఉంది. కేసీఆర్ చెడును నేను ఎందుకు కోరుకుంటా?. ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే అధికారంలో ఉండాలి. కేసీఆర్ సభకు రావాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించం. ఆయన సభకు వచ్చిననాడే కృష్ణా జలాల అంశం చర్చ పెడతాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంంలో మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో తమతో చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గవర్నర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీనవర్గాలకు చెందిన మహిళ గవర్నర్గా ఉంటే.. ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్పూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం.. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణం. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించాం. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం. గతంలో ఎన్నికప్పుడే రైతుబంధు అన్నదాత అకౌంట్లలో పడేది. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా అందిస్తామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారు. మా తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్కు, బీఆర్ఎస్ నేతలకు క్షమాపణ చెబుతాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతాం. లెక్కలతో సహా నిరూపిస్తాను.. చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీటి కోసం పోరాటం చేస్తున్నాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా?. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్న పెంచితే తెలంగాణ ఎడారి అవుతుందని పీజేఆర్ అడ్డుకున్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు.. సంతోష్కు రాజ్యసభ ఇవ్వలేదా?. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలిచ్చారు.. పదేళ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు?. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు తక్కువ, పెట్టిన పరీక్షలు ఎక్కువ. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లా అమ్మేశారు. గత ప్రభుత్వంలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మేసింది. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దిగజారిస్తే మేం ప్రక్షాళన చేశాం. ఒక్క ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చాం. 19 శాతం నిరుద్యోగాన్ని తగ్గించిన ఘనత మాది. విద్యాశాఖను మేం ప్రక్షాళన చేశాం. 20 ఏళ్లు ప్రమోషన్, 10 ఏళ్లు ట్రాన్స్ఫర్ లేని వారికి శుభవార్త అందించాం. చిన్న వివాదం కూడా లేకుండా 36వేల మంది టీచర్లను బదిలీ చేశాం. గ్రూప్-2,3,4 పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశాం’ అని తెలిపారు. -
బీజేపీ నేతలతో రేవంత్ రహస్య భేటీల మర్మమేమి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025మరో ట్వీట్లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
-
పాత సామాను ఎవరు? రేవంత్ కేసీఆర్ ఒక్కటేనా !
-
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై హరీష్ రావు కామెంట్స్
-
తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి
ఢిల్లీ : తెలంగాణ రైజింగ్ కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ మేనరకు వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ కార్యక్రమాలకు సహకరించాలని విన్నవించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ రైజింగ్ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
సీఎం రేవంత్ సర్కార్ పై కపిల్ సిబల్ ఫైర్
-
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోంది: సీఎం రేవంత్
-
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
1,532మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేత (ఫొటోలు)
-
మాటకు మాట.. తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొక్కుబడిగా హాజరవడం కాదు.. కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు. నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు ‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్లను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. చెప్పేది సీరియస్గా తీసుకోండి.. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్గా ప్రయత్నించాలి. నాన్సీరియస్గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం. -
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రొటేషన్ మాత్రమే చేస్తోంది.. ‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్ చేసే పని మాత్రమే చేస్తోంది. గత సీఎం క్యాన్సర్ ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు. అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి ‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఇంజనీరింగ్లో నాణ్యత ఉండటం లేదు..‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్ లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
-
తొలిసారి కాదు .. రెండో సారి ఎన్నికల్లో గెలవడం గొప్ప .. సీఎల్పీలో రేవంత్
సాక్షి,హైదరాబాద్ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా. వచ్చే నెల 6 నుండి జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్లో ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు. -
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ గరం వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో(Governor Budget Speech) కొత్త విషయాలేవీ లేవని.. మరోసారి అబద్ధాలే చెప్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) గరం అయ్యారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. గాంధీ భవన్ ప్రెస్మీట్లా ఉంది. రైతు సమస్యలతో పాటు దేనని ప్రస్తావించలేదు. గవర్నర్తో అన్నీ అబద్ధాలే చెప్పించారు. తద్వారా గవర్నర్ హోదాను దిగజార్చింది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది.... గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. -
ఈనెల 19న బడ్జెట్.. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ
Assembly Session Updates..👉బీఏసీ సమావేశం ముగిసింది.. 👉ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం. 👉19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క👉హోలీ రోజున, ఆదివారం అసెంబ్లీకి సెలవు. గవర్నర్ను అబద్దాల ప్రచారానికి వాడుకున్నారు: హరీష్గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రకటనగవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదుగవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదుసీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదుప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలుఏడాదిన్నర పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగంఅబద్దాల ప్రచారానికి గవర్నర్ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది.గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.👉 స్పీకర్ ఛాంబర్లో ప్రారంభమైన BAC సమావేశం. బీఆర్ఎస్ నుంచి సమావేశానికి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిముగిసిన ప్రసంగం.. 👉తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసింది. 👉36 నిమిషాలకు పాటు సాగిన గవర్నర్ ప్రసంగం👉జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన గవర్నర్ 👉తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.👉ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు..తెలంగాణలో రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై గవర్నర్ ప్రసంగం..రుణమాఫీ జరిగింది, రైతులకు బోనస్ లభించింది అంటూ గవర్నర్ ప్రసంగంఆరు గ్యారెంటీల అమలు జరిగింది, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అమలు అంటూ గవర్నర్ ప్రసంగం.కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు.గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ నిరసన 👉అసెంబ్లీకి ముఖ్యమంత్రి రేవంత్ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..👉బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.👉అసెంబ్లీ లాబీలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పఠాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన తమ్ముడి కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చిన మహిపాల్ రెడ్డి. పెళ్లికి రావాలనిక కేసీఆర్ను కోరిన ఎమ్మెల్యే, 👉మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు.👉రెండో రోజు(13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.👉మూడో రోజు(14న) హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకూ సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల్లో, విద్య-ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులకు ఆమోదం తెలపనుంది.👉అనంతరం, ఈ నెల 18 లేదా 19న 2025-26 రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ఉంటుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సభ జరగవచ్చని తెలుస్తోంది. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
కాంగ్రెస్ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్.. రేవంత్పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘రేవతి అరెస్ట్ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ను అరెస్టు చేయడం దారుణం. ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo— KTR (@KTRBRS) March 12, 2025మరోవైపు.. జర్నలిస్ట్ రేవతి అరెస్ట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత ట్విట్టర్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు..జర్నలిస్టు రేవతి @revathitweets గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025 -
కొత్త సార్లు, క్రమబర్థికరణలు.. అయినా ఖాళీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా 1,292 మంది లెక్చరర్లు చేరబోతున్నారు. వారితోపాటు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతి వేదికగా నియామక ఉత్తర్వులు అందజేస్తారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే కొత్తగా నియామకాలు చేపట్టినా కూడా.. జూనియర్ కాలేజీల్లో గణనీయంగానే లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉండే పరిస్థితి నెలకొంది. రెండున్నరేళ్ల కిందే నోటిఫికేషన్.. ఇంటర్ బోర్డ్ మూడేళ్ల క్రితమే జూనియర్ కాలేజీల్లో ఖాళీలను గుర్తించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వివరాలు అందజేసింది. టీజీపీఎస్సీ 2022 డిసెంబర్లో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. చివరికి అర్హులను ఎంపిక చేసిన కమిషన్.. ఇటీవలే జాబితాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. ప్రస్తుతం ఇంటర్ విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో.. కొత్త వారికి శిక్షణ ఇచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా గణనీయంగానే ఖాళీలు రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల లెక్చరర్ల కొరతతో బోధనకు ఇబ్బంది నెలకొంది. నిజానికి జూనియర్ కాలేజీల్లో మొత్తం 6,008 పోస్టులు ఉండగా.. ఏడాది క్రితం వరకు 900 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టింది. అది ఇంకా పూర్తవలేదు. వీరిని, ఇప్పుడు కొత్తగా నియమించబోతున్న వారిని కలిపితే.. 5,692 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉంటారు. ఇంకా 316 ఖాళీలుంటాయి. ఇవన్నీ రెండేళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడీ ఖాళీల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.కొత్త కాలేజీల మాటేంటి?గత రెండేళ్లలో రాష్ట్రంలో 24 జూనియర్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ అందులో 19 కాలేజీలకు ఇప్పటికీ పోస్టులు మంజూరు చేయలేదు. గెస్ట్ ఫ్యాకల్టీ, ఇతర కాలేజీల లెక్చరర్లతో బోధిస్తున్నారు. కొత్త కాలేజీలకు కనీసం 480 పోస్టులు అవసరమని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అంటే ఇప్పటికే ఉన్న 316 ఖాళీలను కలుపుకుంటే.. మొత్తం ఖాళీల సంఖ్య 796కు చేరుతుంది. పైగా గత రెండేళ్లలో ఖాళీ అయిన పోస్టులు అదనం.దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్చి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. దానికోసం మరికొన్ని అధ్యాపక పోస్టులు అవసరం. ఇక ఇంగ్లి‹Ùలో ప్రాక్టికల్స్ను కొత్తగా తీసుకొచ్చారు. మాట్లాడే స్కిల్, గ్రామర్ స్థాయిని పెంచారు.గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి, విద్యార్థి రాతను పరిశీలించి ప్రాక్టికల్స్లో మార్కులు వేస్తున్నారు. వీటి ప్రామాణికత పెరగాలంటే ఆంగ్ల భాషా నిపుణుల పోస్టులు మరో 129 అవసరమని అంచనా వేశారు. రసాయన శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాలు చేయగలగాలని బోర్డ్ తీర్మానించింది. ఆ ప్రాక్టికల్స్కు నిపుణులు అవసరం. ఇలా ప్రతీ విభాగంలోనూ అధ్యాపకుల కొరత ఏర్పడుతోంది. -
అనుభవం, జ్ఞానం లేదు.. కామన్సెన్స్ వాడరు
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రికి అనుభవం, జ్ఞానం లేకున్నా కనీసం కామన్ సెన్స్ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవజు్ఞలు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం, మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. హామీలు, పథకాల అమలును పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలైన సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అసెంబ్లీలో ఎత్తిచూపడమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలు, వేస్తున్న నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అప్పులు సహా.. అన్నీ అబద్ధాలే! ‘‘రాష్ట్ర అప్పుల లెక్కలపై రేవంత్, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గత ఏడాదికాలంలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైంది. బడ్జెట్తోపాటు సవరించిన అంచనాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెడుతుంది. ఆదాయ లోటు కూడా భారీగా ఉండబోతోంది. అందువల్ల బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులుగా పనిచేసినవారు మన పార్టీ తరఫున ఉభయ సభల్లోనూ ఉన్నారు. వారు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించి పద్దులపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగునీటి కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ కోతలు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతుండటం, ఎండుతున్న పంటలు వంటి రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వివిధ రంగాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎత్తిచూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు సోషల్ మీడియా అద్దం పడుతోందని, నిజానికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నెలకొందని పేర్కొన్నారు. నలుగురు సభ్యులు గైర్హాజరు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీకి నలుగురు సభ్యులు ముందస్తు సమాచారం ఇచ్చి గైర్హాజరు అయ్యారు. వ్యక్తిగత పనులతో తాము సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిపారు. గైర్హాజరైన వారిలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, అనిల్జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు ఉన్నారు. దాదాపు 25 అంశాలపై దిశానిర్దేశం సుమారు మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దాదాపు 25 అంశాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ తదితరాలపై గొంతు వినిపించాలని సూచించారు. మహిళలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, వైద్యరంగంలో దిగజారిన ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేత, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వంటి అంశాలు ప్రస్తావించాలన్నారు. ఏపీ నదీ జలాల చౌర్యం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో 20శాతం కమిషన్ల ఆరోపణలు, పరిశ్రమల ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధన, కులగణనలో తప్పులు, బెల్ట్షాపుల తొలగింపు, ఎల్ఆర్ఎస్, మేడిగడ్డ పునరుద్ధరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి వచ్చి తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో పాల్గొన్నారు. అనంతరం నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లేదా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు డిప్యూటీ లీడర్లు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో బీఆర్ఎస్ విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో విప్గా సత్యవతి రాథోడ్ను కేసీఆర్ నియమించారు. తాజాగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, మండలిలో ఎల్.రమణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీశ్రావు డిప్యూటీ లీడర్గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమల్లో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్నారు. సభ్యులు మొక్కుబడిగా కాకుండా, సమావేశాలు జరిగే రోజుల్లో ఉదయం 9.30కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. -
కేసీఆర్ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య
-
రియల్ బ్రోకర్లతో రేవంత్ స్కాం
సాక్షి, హైదరాబాద్: నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) రూ. వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు(KTR) ఆరోపించారు. త్వరలో హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై పరిమితులు విధించడం ద్వారా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)కు కృత్రిమ డిమాండ్ పెంచే కుట్ర జరుగుతోందన్నారు.హైదరాబాద్లో టీడీఆర్లను ఎవరు అడ్డగోలుగా కొన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘త్వరలో ఎఫ్ఎస్ఐపై పరిమితులను బూచిగా చూపి టీడీఆర్లను తిరిగి బిల్డర్లకు అడ్డగోలు ధరలకు అమ్మేందుకు రేవంత్ ముఠా సిద్ధంగా ఉంది. ఎఫ్ఎస్ఐపై ఉమ్మడి ఏపీలో వై.ఎస్. ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది.గతంలో టీడీఆర్ పద్ధతిలో రూ. వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలను జీహెచ్ఎంసీ ప్రజావసరాల కోసం సేకరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవినీతి మార్గాలు తెలిసింది రేవంత్కే.. ‘దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బు సంపాదనకు అత్యధిక మార్గాలు తెలిసింది రేవంత్కే. ఆయన పాలనలో ప్రైవేటు దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికే రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్తున్నాడు. రేవంత్, కిషన్రెడ్డి దొంగాట ఆడుతూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు. రేవంత్ను ఉద్దేశించే కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘స్థానికం’, ఉపఎన్నికల ఉద్దేశంతోనే మండలి ఎన్నికకు దూరం స్థానికసంస్థల ఎన్నికలు, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే శాసనమండలి పట్టభద్రుల స్థానం ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రెండో అభ్యరి్థని మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలపలేదని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు గవర్నర్ ప్రసంగంతోపాటు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడే పిచ్చిమాటలు, పనికిరాని మాటలు, బూతులు వినాల్సిన అవసరం కేసీఆర్కు లేదని ఒక కొడుకుగా, పార్టీ కార్యకర్తగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు, రేవంత్ ఆవగింజంత కూడా సరిపోరని వ్యాఖ్యానించారు. మళ్లీ ఫార్ములా–ఈ నోటీసులు రావచ్చు.. ఈ నెల 16 నుంచి 27లోగా మళ్లీ తనకు ఫార్ములా–ఈ కేసు పేరిట విచారణ నోటీసులు రావచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఫార్ములా–ఈ’ని ప్రశ్నిస్తున్న వారు రూ. 200 కోట్లతో రేవంత్ ప్రభుత్వం నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్కు ఏం ఒరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బయటి దేశాల్లో జరుగుతున్న మరణాలను రేవంత్ తనకు అంటగట్టడం విడ్డూరమని.. తాను కేసీఆర్ అంత మంచివాడిని కానని వ్యాఖ్యానించారు. బీసీలకు రిజర్వేషన్లపై రేవంత్కు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కేసీఆర్ను కొట్టింది నేనే.. గద్దె దింపిందీ నేనే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్(KCR)ను బండకేసి కొట్టింది నేనే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఓడగొట్టిందీ నేనే. గద్దె దింపింది నేనే..ఆ కుర్చిలో కూర్చుందీ నేనే. సీఎంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చింది నేనే. ప్రస్తుతం నాది ముఖ్యమంత్రి స్థాయి. ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి..’ అని సీఎం ఎ.రేవంత్రెడ్డి(Revanth Reddy) అన్నారు.స్థాయి అంటే ఏంటని, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? డ్రగ్స్ పెట్టుకుని పార్టీలు చేసుకుంటే వస్తుందా?..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్ తదితరులతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్లో ఎవరూ సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు. కేసీఆర్కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ‘కేసీఆర్కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు. ఆయనకు, కొడుకు కేటీఆర్కు బలుపు తప్ప ఏమీ లేవు. ఆ కుటుంబానికి ఎందుకంత బరితెగింపో అర్థం కావడం లేదు. అయినా కేసీఆర్ చెల్లని రూపాయి. ఆయన గురించి మాట్లాడడం వృ«థా. బీఆర్ఎస్ చేసిన అప్పులు, తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. అయినా బీఆర్ఎస్కు తెలంగాణతో సంబంధం లేదు. అందుకే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. స్పైడర్ సినిమాలో విలన్ తరహాలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు సంబరపడుతూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు. యూజ్లెస్ ఫెలో మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులు మేము 14 నెలల్లో చేశాం. కాళేశ్వరం, మేడిగడ్డలు లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించాం. అయినా రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి రొయ్యల పులుసు తిన్నోళ్లు ఎవరు? యూజ్లెస్ ఫెలో, హౌలేగాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి హరీశ్రావు లొంగిపోయాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పని చేయాలని, కాంగ్రెస్ను ఓడించాలనే ఉద్దేశంతోనే డబ్బులు పంచి మరీ బీజేపీకి హరీశ్రావు ఓట్లు వేయించాడు..’ అని రేవంత్ ఆరోపించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా లెక్కబెడదాం ‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. 2014 జూన్ 2 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్లాయి? మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి? ఏ రూపంలో వచ్చినా సరే లెక్కపెడదాం. నేను, మా ఉప ముఖ్యమంత్రి భట్టి వస్తాం. కిషన్రెడ్డితో పాటు ఎవరినైనా రమ్మనండి. చర్చిద్దాం. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా అక్కడే కిషన్రెడ్డికి సన్మానం చేస్తా..’ అని సీఎం సవాల్ చేశారు. ఎక్కువ సాగుతోనే నీటికి ఇబ్బందులు ‘గత పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎప్పుడైనా యాసంగిలో 35–40 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో ఏకంగా 55 లక్షల ఎకరాలు సాగయింది. అందుకే అక్కడక్కడా నీటికి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఏ రిజర్వాయర్ నుంచి ఏ మేరకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలన్న దానిపై అధికారులు ఎప్పుడో షెడ్యూల్ సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే అనుమతులను బట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పనులు ఉంటాయి. రిజల్ట్స్ వేరు..రిజర్వేషన్లు వేరు కృష్ణమాదిగ బీజేపీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ వేరు, రిజర్వేషన్లు వేరు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ల మేరకు ఇప్పుడు ఫలితాలు ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలను మేము మార్చలేం. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ న్యాయం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కిషన్రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ? ‘రీజనల్ రింగు రోడ్డు ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. నేను మెట్రో తెచ్చానని కిషన్రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్లో జైపాల్రెడ్డి తెచ్చిన మెట్రో కనపడుతోంది కానీ కిషన్రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి నిర్వహించిన సమావేశానికి రమ్మంటే సమయం లేదని కిషన్రెడ్డి చెప్పారు. మరి కేంద్రమంత్రి ఖట్టర్ సికింద్రాబాద్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేంద్రమంత్రి ఖట్టర్ కూడా కిషన్రెడ్డిని హడావుడిగా పిలిచాడా? కేసీఆర్ ఫీలవుతాడనే ఆ సమావేశానికి కిషన్రెడ్డి వెళ్లలేదు. కేసీఆర్ చెప్పిన చదువు మా దగ్గర చెపితే ఎలా?..’ అని రేవంత్ అన్నారు. -
తెలంగాణలో భారీ స్కామ్ కు తెరలేపారు: కేటీఆర్
-
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. బడ్జెట్పై మాట్లాడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడాలన్నారు. అలాగే, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.ఎమ్మెల్సీ కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్ వచ్చారు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్ నామినేట్ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్ బీఆర్ఎస్ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్ఎస్పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.రెండు జాతీయ పార్టీలదీ ఒకటే ధోరణి. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు టీడీఆర్ ల్యాండ్ కొనే పనిలో తిరుగుతున్నారు. టీడీఆర్ అతి పెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారు. రేవంత్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల ద్వారా శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే యోచనలో రేవంత్ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం లేని అప్పులు చూపించి.. ఎక్కువ మిత్తి చూపిస్తున్నారు. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న రేవంత్.. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒక్క పోరాటమైనా చేసిందా?. బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్గా ఉంది. అందుకే అటెన్షన్ కోసం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. ఈ-కారు రేసును ముందుకు తెచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం ఏం సాధిస్తారు?. 200 కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది?. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని ప్రశ్నించారు. -
సామాజిక కోణంలోనే ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతిఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్నాయక్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఓసీ కోటా మినహాయింపుఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్పక్ష నేత టి.జీవన్రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటాఅసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
బీసీలు ఎదగకుండా అడ్డుకునే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలు ఎదగకుండా, వారికి 42 శాతం రిజర్వేషన్లు అందకుండా ఆదిలోనే అడ్డుకునే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని.. దానితో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్లే ఆయా పార్టీల నేతలు లేనిపోని అపోహలు సృష్టించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను బీసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఆదివారం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సమాచారమంతా అధికారికంగా సేకరించినదే. ఇంటి యజమాని ధ్రువీకరణ కూడా తీసుకున్నాం. ఈ సర్వేలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్టు తేలింది. గతంలో కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో బీసీల జనాభా 51శాతమే లెక్కించారు. ఇప్పుడు 5.33 శాతం పెరిగింది. కేసీఆర్ సర్వేలో అగ్రకులాల జనాభా శాతం 21శాతం ఉన్నట్టు చెబితే.. మా సర్వేలో 15.28 శాతమేనని తేలింది. ప్రతి కోణంలో సర్వే చేసి గణాంకాలను క్రోడీకరించాం.అసెంబ్లీలో బిల్లు పెడతాం..: బీసీలకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి ఇవ్వడమంటే మోదీ మెడ మీద కత్తిపెట్టినట్టే. కచ్చితంగా మన డిమాండ్ను ఆమోదించాల్సిందే.బీసీల కోసం ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారనే భయం ప్రతిపక్ష పార్టీలకు పట్టుకుంది. బీసీలు ఎదిగితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే బీసీ రిజర్వేషన్లను ఆ రెండు పార్టీలు ఆదిలోనే అడ్డుకునే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితులను బీసీలంతా గుర్తించాలి.నన్ను ఎప్పుడైనా కలవచ్చు..: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యాను. ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా కర్తవ్యం. అందుకోసం 24గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వంలో సీఎంను కలవాలంటే పెద్ద సాహసంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడైనా నన్ను కలవచ్చు. మీ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చి.. వాటిని పరిష్కరింపజేసుకునే బాధ్యత మీదే. తెలంగాణ సాధన కోసం పోరాడిన పద్మశాలి ముద్దు బిడ్డ కొండాలక్ష్మణ్ బాపూజీని పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే.. కేంద్రంతో మాట్లాడి ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం. టైగర్ నరేంద్రకు యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇస్తే... ధృతరాష్ట్రుడి కౌగిలి మాదిరిగా కేసీఆర్ ఆయనను ఖతం చేశారు. కులవృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను మహిళలు కట్టుకోలేదు. అవి పొలాల దగ్గర కట్టడానికే పనికి వచ్చాయి.అందుకే అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపివేశాం. మహిళా సంఘాల్లోని వారికి మంచి చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.600 కోట్ల విలువైన 1.30 కోట్ల చీరల ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నాం. తెలంగాణ పద్మశాలీలు ఇతర రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోటితో షోలాపూర్లో పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం..’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేస్తున్నాం: మంత్రి తుమ్మలరాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్లోనే వారి రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల కష్టాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పద్మశాలీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.మగ్గంపై చీర నేసిన సీఎంసీఎం రేవంత్ తొలుత ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అక్కడ సిద్ధం చేసిన చేనేత మగ్గంపై చీర నేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, మినరల్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధా రాణి, అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం ప్రతినిధులు అంబటి శ్రీనివాస్, మురళీధర్, గడ్డం జగన్నా థం, కన్నెగట్ల స్వామి, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్, మచ్చ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ధ్వజం
-
‘సమాజానికి సేవ చేయడం తప్ప నాకు మరో ఆలోచనలేదు’
సాక్షి,హైదరాబాద్ : నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో మీరు నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా’నంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ను ఖతం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా.ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు.. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నాం. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నా.మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ.600 కోట్ల విలువైన 1 కోటి 30 లక్షల చీరల ఆర్డర్ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం. మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం.. ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ప్రధాని మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయి. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది.కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందిఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి.ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలతో షోలాపూర్లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం. ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా’అని వ్యాఖ్యానించారు. -
అప్పుల సాకుతో హామీలకు పాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. అప్పుల సాకు చూపి ఎన్నికల హామీలను ఎగ్గొట్టే పథకం వేశారని ఆరోపించారు. కిషన్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.7.50 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం గతంలో అనేకమార్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను సీఎం అయ్యాక కూడా రూ.3.5 లక్షల కోట్ల అప్పే ఉందని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలుపై చేతులెత్తేశారు’అని ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కానందువల్లే గ్యారంటీలు అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన హామీనిచ్చా, పథకాలు ప్రకటించి.. వాటిని కేంద్రం పూర్తిచేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై మాకేమీ తొందరలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’అని ప్రకటించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.జాతీయ రహదారిగా ట్రిపుల్ఆర్ ప్రతిపాదిత రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్)ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కిషన్రెడ్డి తెలిపారు. ‘తెలంగాణలో రూ.6,280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని పార్లమెంటు సమావేశాల తర్వాత గడ్కరీ ప్రారంభిస్తారు. రూ.961 కోట్లతో 51 కి.మీ. రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంపై గడ్కరీతో చర్చించాను. రూ.18,772 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రోడ్డు విషయంలో ఇంకా మూడు పనులు జరగాల్సి ఉంది.పీపీపీ అప్రయిజల్ కమిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం నోట్, నిధులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది’అని కిషన్రెడ్డి వివరించారు. పెండింగ్ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ సేకరణ జరిపి అప్పగించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొత్తం భూమి ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. జనాభా తగ్గినా తెలంగాణలో కానీ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో కానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టంచేశారు. ఒక దేశం–ఒక ఎన్నిక దేశ భవిష్యత్ ఎజెండా తెలంగాణలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై రాజకీయాలకు అతీతంగా చర్చలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ నిర్వహించాలని తీర్మానించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.ఒకదేశం–ఒక ఎన్నిక అనేది బీజేపీ ఎజెండా కాదని దేశ భవిష్యత్ ఎజెండా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు మరో సారి జరగడం వల్ల రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజల సమయం వృథా అవుతోందని.. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించడానికి వీలులేకుండా పోతోందని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్నేషన్ – వన్ ఎలక్షన్పై నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు వస్తాయి
సుల్తాన్బజార్ (హైదరాబాద్): అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రోజు త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మహిళలు అంటే వంటింటి కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తామని తెలిపారు. రూ.535 కోట్లతో చేపడుతున్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలను చేస్తాం.. ‘‘మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేశాం. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించాం. చట్టసభల్లో మహిళలు అడుగుపెడతారు. అసెంబ్లీలో 33శాతం సీట్లు మహిళలకు వచ్చే రోజు వస్తుంది. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు. వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తాం. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్పకీర్తి అని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ యూనివర్సిటీ భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణాన్ని నేనే పర్యవేక్షిస్తా.. రెండున్నరేళ్లలో మహిళా యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని, తాను స్వయంగా నిర్మాణ పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీపడాలని.. మహిళల కోసం రిజర్వేషన్లు తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీ కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించండి: అసదుద్దీన్ పాఠశాలలు, కాలేజీల్లో ముస్లిం విద్యారి్థనులు తక్కువగా ఉన్నారని, వారి సంఖ్య పెరగాల్సి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్రెడ్డి డైనమిక్ సీఎం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రిలియన్ డాలర్ల శక్తి మహిళలే!
ఎప్పుడైనా కూడా మహిళలకు అండగా నిలిచింది ఇందిరమ్మ రాజ్యమే. ప్రజలు ఇందిరాగాందీని అమ్మ అని పిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ను అన్నా అన్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నా అని పిలుస్తున్నారు. తోబుట్టువు మాదిరిగా ఆదరిస్తున్నారు. అలాంటి తోబుట్టువుల కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్లండి. ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధే. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చిదిద్దుతా.సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తి మహిళలేనని.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి(Mahila Shakthi)’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు చంద్రగ్రహణంతో మహిళలు చీకటిలోకి నెట్టబడ్డారు.వారు కనీసం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పదేళ్ల పాటు మహిళాభివృద్ధి జాడలేదు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంతో మహిళలు మళ్లీ వెలుగులోకి వచ్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటే పరిస్థితికి వచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు వడ్డీలేకుండా రుణాలు ఇవ్వడం మొదలు వివిధ ఆర్థిక పురోగతి కార్యక్రమాలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థుల కోసం 1.30 కోట్ల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళలు విజయవంతం చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీలో మహిళా బజార్ ఏర్పాటు చేశాం. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.25 కోట్లతో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం అదానీ, అంబానీలే కాదు.. తెలంగాణ మహిళలు విద్యుత్ వ్యాపారాన్ని చేయగలరనే ధీమాతో వారికి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. వారిని పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. ఆరీ్టసీకి బస్సులు అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నాం.వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను వారి ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఎంఓయూ కుదిర్చాం. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటా. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం. ప్రభుత్వమే మహిళలకు స్థలం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది, గోడౌన్స్ నిర్మించండి, వ్యాపారవేత్తలుగా మారండి. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా మహిళలు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి. మహిళా సంఘాల్లో వయసు సడలింపు.. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీల్లో) 65 లక్షల మంది ఉన్నారు. మేం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఎస్హెచ్జీలలో చేరే నిబంధనలు సడలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మహిళలందరికీ అవకాశం కల్పించేలా నిబంధనలు తెస్తాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. ఎస్హెచ్జీలకు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం, జూపల్లి తదితరులు వడ్డీ లేకుండా రూ.21 వేల కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేకుండా రూ.21వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాటు మహిళా సంఘాలకు పైసా సాయం చేయని గత ప్రభుత్వ నేతలు.. ఈరోజు ఎస్హెచ్జీలకు వడ్డీలేని రుణాలంటే వెకిలిగా నవ్వుతున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలను తీసుకువస్తోందన్నారు.రాష్ట్రంలో మహిళలు తలెత్తుకుని మహాలక్ష్మిలా గౌరవంగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్రావు బడితె మాదిరి పెరిగారే తప్ప మహిళలకు కనీసం రుణాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల సంపద పెరిగేందుకు కృషి చేస్తోందని.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద ప్రజాప్రభుత్వం 20 రకాల అద్భుత కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ విశేషాలివీ.. ⇒ మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్న బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ⇒ కార్యక్రమంలో 2,82,552 స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు రూ.22,794.22 కోట్ల రుణాల చెక్కులను సీఎం అందించారు. ⇒ ఎస్హెచ్జీ సభ్యులకు రుణబీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందించారు. ⇒ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ⇒ ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీని సీఎం ఆవిష్కరించారు. ⇒ సభకు ముందు సీఎం రేవంత్, మంత్రులు వివి ధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుటీర పరిశ్రమల స్టాళ్లను, మహిళా పెట్రోల్ బంకు నమూనాను పరిశీలించారు.బీఆర్ఎస్ నేతలది పైశాచిక ఆనందం రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నన్ను తిడుతూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్ కూలి కార్మికులు మరణిస్తే సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే నవ్వుతున్నారు. పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయతి్నంచాలి. పదేళ్ల పాలన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. అలాంటివారు బాగుపడరు. -
సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటన చేసింది. ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుంది’’ అని లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.‘‘ఇంతకుముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలుసు. దయ చేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండి’’ అంటూ లేఖలో మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. -
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ(Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,. దొరలపై, నిజాములపై పోరాడిన చాకలి ఐలమ్మ.. చరిత్రలో తనకంటూ పేజీ లిఖించుకున్నారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు(శనివారం) అక్కడకు విచ్చేసిన సీఎం రేవంత్(Revanth Reddy).. నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు. వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్. మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అలానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడ బిడ్డలు వంటిళ్లు కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించాలనేది తన ఆశయమన్నారు. -
Revanth Reddy: వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి వరాల జల్లు
-
రేవంత్కు ఝలక్.. బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. -
కలసి వస్తే.. కలదు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా.. రానున్న లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల లోక్సభ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. సమావేశానికి హాజరు కావాలంటూ కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర ఎంపీలందరికీ శుక్రవారం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వనించారు.అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై సమావేశంలో ఎంపీలతో సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసిన సందర్భంగా.. మోదీ ఇచ్చనా వినతిపత్రంలోని అంశాలకు ఎలాంటి సహకారం అందిస్తామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు విధివిధానాలు, రాష్ట్ర రుణ భారం తగ్గించుకునేందుకు గల వెసులుబాటు, కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్పై చర్చించి కేంద్రంపై సమష్టిగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించనున్నారు. -
మహిళకు శక్తి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను, ఈ ఏడాది మహిళలు సాధించిన విజయాలను మిషన్లో పొందుపరిచారు. కోటి మంది మహిళలను ఎస్హేచ్జీల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లను విలీనం చేయనున్నారు.ఈ మిషన్కు సబంధించిన పాలసీకి గురువారం రాత్రి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పరేడ్ గ్రౌండ్స్ సభకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు పాల్గొననున్నారు. ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి సీతక్క మంత్రి సీతక్క శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మహిళలకు సైతం సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణకు నిదర్శనం. అందుకే 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల్లో చేర్చుకుంటున్నాం.మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదనలకు గురైన సందర్భాలు ఉన్నందున..15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కూడా సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించాం. సభ్యుల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు రూ.1200 గ్యాస్ సిలిండర్ను రూ.500కే అందిస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్లు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా రైస్ మిల్లులు నడిపేలా శిక్షణ ఇవ్వబోతున్నాం. సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగిస్తున్నాం. సీఎం రేవంత్రెడ్డి అందరి సోదరుడిలా అండగా ఉంటున్నా రు. ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలి’ అని కోరారు. మహిళా సమాఖ్యలకు ఆహ్వనం పరేడ్ గ్రౌండ్స్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరా మహిళా శక్తి మిషన్–2025 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క ఇప్పటికే ఆహ్వనాలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) 600కు పైగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా అరగంట ముందే సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తుండడంతో ఏడున్నర గంటల లోపే సభను ముగించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం నుంచి జిల్లా డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులతో వీడియో కాన్ఫరె¯న్స్ నిర్వహించారు. నేటి కార్యక్రమాలివీ.. ⇒ మండల మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభిస్తారు. ⇒ 31 జిల్లా సమాఖ్యల ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ⇒ మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేస్తారు ⇒ మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులకు అందజేస్తారు. ⇒ జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులకు యునిఫాం చీరలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం, మంత్రులు సందర్శిస్తారు. ఈ ఏడాది సాధించిన విజయాలు ⇒ మహిళా సంఘాలకు రూ.21,632 కోట్ల రుణాలు ⇒ 2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు ⇒ రూ.110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం ⇒ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ⇒ హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో రూ.9 కోట్లతో మహిళా శక్తి బజార్ ⇒ విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పని ద్వారా మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం ⇒ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్కు, తెలంగాణ మోడల్కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తి పన్ను చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గతేడాది బకాయిదారులకు బల్దియా వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని కల్పిచ్చింది.తాజాగా, మరోసారి ఆ అవకాశాన్ని కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తద్వారా 2024-25 సంవత్సరానికి కేవలం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఈ ఓటీఎస్ ద్వారా పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సుమారు రెండు వేల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈ ని ర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో 21 మంది ఐపీఎస్లు బదిలీ
-
మోదీ జీ.. ఇదెక్కడి న్యాయం?: సీఎం రేవంత్
ఢిల్లీ: ఉచిత పథకాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా టుడే కాంక్లెవ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉచిత పథకాలపై దేశ వ్యాప్త చర్చ జరగాలన్నారు. ఇక పెట్టుబడులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారన్న సీఎం రేవంత్.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.‘నెలకు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వస్తే...అందులో 13 వేల కోట్ల రూపాయలు జీతాలు అప్పుల చెల్లింపులకే పోతుంది. మిగిలిన 5000 కోట్ల రూపాయలలోనే అభివృద్ధి, సంక్షేమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక వసతుల ప్రాజెక్టులపై కనీసం 500 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ జరగాలి. డిలిమిటేషన్ పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాం. హైదరాబాదులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులున్నాయి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
హస్తిన పర్యటనలతో సెంచరీ కొట్టడం ఖాయం.. రేవంత్పై లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 38వ సారి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు.