breaking news
Saanvi
-
శాన్వీ ఆత్మకు శాంతి!
చిన్నారితోపాటు నానమ్మ హత్యకేసు తీర్పుపై స్వగ్రామంలో హర్షం రఘునందన్కు ఉరి ‘అకలిగొన్నవారి మొఖం చూడలేకపోయేది సత్యవతి. గ్రామంలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేది. మా గ్రామంలో అలాంటివారు ఇంకా పుట్టరు కూడా. బంగారం లాంటి కాపురం.. సత్యవతి మృతితోనే నాశనం అయింది. చిట్టిపొట్టి చిన్నారి శాన్విని కూడా పొట్టనపెట్టుకున్నాడు. అందుకే ఆ రఘు ఇప్పుడు శిక్ష అనుభవించాడు’ ఈ మాటలు ఇప్పుడు కుడుములకుంటలో వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా : శాన్వి ఆత్మకు శాంతి లభించింది.. ఆమె నాన్నమ్మకు కూడా! అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. నేరస్తులు తప్పించుకోలేరని హంతకుడు రఘునందన్కు విధించిన మరణశిక్షతో తేలింది. అమెరికాలో 2012లో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సత్యవతి స్వగ్రామం అయిన హనుమంతునిపాడు మండలం కుడుముల కుంట వాస్తవ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నాభిన్నం అయిన కుటుంబం.. సత్యవతి భర్త వెన్నా కొండారెడ్డి చాలా కాలం గ్రామంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడంలేదు. వచ్చిన రోజు అన్నం వండుకొని.. కూరలను కనిగిరి నుంచి తెచ్చుకుని మళ్లీ కనపడకుండా వెళ్లిపోతారు. ఇద్దరు కుమారులు అమెరికా లోనే ఉన్నారు. కుమార్తె సుజాత గుంటూరులో ఉంటోంది. సత్యవతి లోకం విడిచాక ఇక్కడి ఇంటిలో దీపం వెలిగించేవారు లేకుండా పోయారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. అందరి తలలో నాల్కలా ఉన్న సత్యవతి మరణాన్ని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదు. వారి నిమ్మ తోటలు, ఆస్తిపాస్తులు అన్నీ నాశనం అయ్యాయి. నిందితునికి సరైన శిక్ష పడిందని అంతా అంటున్నారు. సత్యవతి ఇంటిలో దీపం పెట్టేవారే లేరు: చిన్నారి శాన్విని చూసుకోనేందుకు కుమారుడు ప్రసాదు రెడ్డి వద్దకు సత్యవతి వెళ్లింది. ఫోను చేసి గ్రామంలో అందరి కష్ట సుఖాలను తెలుసుకొనేది. ఆమె మరణంతో ఇంటిలో దీపం వెలిగించే వారు లేకుండా పోయారు. కొండారెడ్డి..కుమారులు, కుమార్తె వద్ద కాలం కడుపుతున్నాడు. – సానికొమ్ము వెంకటసుబ్బమ్మ ఎప్పుడో ఉరి శిక్ష వేసి ఉండాల్సింది: డబ్బుకు ఆశపడి చిన్నారి శాన్విని, నానామ్మ వెన్నా సత్యవతిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకుడు రఘునందన్కు వెంటనే ఉరివేసి ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మరణ శిక్షను విధించి మంచి పని చేసింది. – వీరాచారి -
నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత
అమెంటే నాకు ప్రత్యేకం... ఆమెకే నా మొదటి ప్రాధాన్యం ... ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను ... అని 11 ఏళ్ల తన గారాల పట్టి, కుమార్తె శాన్వీ గురించి ప్రముఖ నటుడు సుదీప్ తెలిపారు. ప్రియా, తనకు విడాకులు తీసుకున్నా శాన్వీతో తన అనుబంధంలో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సుదీప్, కేరళకు చెందిన ప్రియా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. సుదీప్ చిత్రాల్లో నటిస్తుంటే ... ప్రియా బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలోపడ్డారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రియను సుదీప్ వివాహం చేసుకున్నాడు. 2004లో వీరికి శాన్వీ జన్మించింది. మొదట్లో సుదీప్ ఇబ్బందులు పడ్డా... ఆ తర్వాత పుంజుకున్నారు. ఇటీవల వరుస సినిమాల ఆఫర్లు వస్తుండటంతో సుదీప్ తెగ బిజీ అయ్యారు. అయితే 2009 - 10లో సుదీప్పై వుకార్లు వెల్లువెత్తాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రియా కుమార్తె శాన్వీతో కలసి బెంగుళూరులోని జేపీ నగర్లో సర్జాపుర్ రహదారి సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సుదీప్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ప్రియా ఈ ఏడాది ఆగస్టులో కోర్టును ఆశ్రయించింది. ఇద్దరి అంగీకారంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. శాన్వీ మైనర్ కాబట్టి ఆమె బాధ్యతులు తల్లి ప్రియా చూసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే విడాకులు నేపథ్యంలో ప్రియకు రూ. 19 కోట్ల రూపాయిలు భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ ఒప్పుకున్నాడని సమాచారం. భరణంపై సుదీప్ను విలేకర్లు ప్రశ్నించారు. నేను చేస్తున్నదంతా నా కుమార్తె... నా భార్య కోసమే కాదా అని సింపుల్గా సుదీప్ చెప్పేశాడు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం ద్వారా సుదీప్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న విషయం విదితమే.