seven years old boy
-
చిత్తూరు జిల్లా చిగుళ్లపల్లిలో దారుణం
-
వయసు ఏడేళ్లు... సంపాదన రూ.150 కోట్లు!
వాషింగ్టన్ : మిలియనీర్గా ఎదగడానికి ఒక వ్యక్తికి కనీసంలో కనీసం ముప్పై ఏళ్లైనా పడుతుంది. కానీ అమెరికాకు చెందిన ర్యాన్ అనే ఏడేళ్ల కుర్రాడు మాత్రం కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.150 కోట్లుతో పాటు, సోషల్ మీడియాలో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. యూట్యూబ్ చానల్తో... ప్రస్తుతం ఎంతో మంది ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న యూట్యూబ్నే ర్యాన్ సైతం తన సంపాదనకు ఉపయోగించుకున్నాడు. 2015లో ఈ చిన్నోడు.. ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్లోడ్ చేసేవాడు. కొద్దిరోజుల్లో ఈ వీడియోలకు అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడవే వీడియోలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ర్యాన్ చానల్ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం.. యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో ర్యాన్ తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ వివరాలు ప్రకటించింది. ఈ జాబితాలో గతేడాది 8వ స్థానంలో నిలిచిన ర్యాన్.. ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకున్నాడు. బొమ్మలతో వీడియోలు... అందరు చిన్నారుల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే ర్యాన్ కోటీశ్వరుడయ్యాడు. అయితే ర్యాన్ ఆ బొమ్మలతో వీడియో కెమెరాల ముందు ఆడుకుంటాడు. కొత్తగా వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. అవి ఎలా పనిచేస్తాయో అందులో వివరిస్తాడు. ఆ వీడియోల్ని తన చానెల్లో పోస్ట్ చేయగా వాటిని కొన్ని లక్షల మంది చూడటం వల్ల లెక్కలేనన్ని యాడ్స్ వచ్చాయి. దీంతో ర్యాన్ ఖాతాలోకి ఆదాయం వచ్చి చేరింది. -
ఏడేళ్ల బాలుడిపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : క్షణికావేశంలో ఇతరులపై దాడులు చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుంది. తాజాగా ఓ షాపు యాజమాని తన షాపు ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై యాసిడ్ దాడి చేశాడు. మంగళవారం షహదర ప్రాంతంలోని గాంధీనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. బాలుడు అల్లరి చేస్తున్నాడనే కారణంతోనే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గత ఏడాది వాయువ్య ఢిల్లీలోని భరత్నగర్లో 70 ఏళ్ల వృద్దుడు ఇదే తరహాలో ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలపై యాసిడ్ దాడి చేశాడు. పిల్లలు తన ఇంటి ముందు అల్లరి చేస్తుడటంతో వారిని పక్కకి వెళ్లి ఆడుకోవాల్సిందిగా కోరానని, వారు వినకపోవడంతో దాడి చేశానని అతడు పోలీసులకు తెలిపాడు. చిన్నపిల్లలపై ఈ తరహ దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
గోనెసంచిలో బాలుడి మృతదేహం