శంషాబాద్లో 22 మంది తెలుగు విద్యార్థుల అవస్థలు
హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో 22 మంది తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 8 గంటల పాటు వారిని ఎయిర్ ఇండియా అధికారులు బంధించడంతో ఇబ్బందులు పడ్డారు.
ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం మహముద్ అలీని విద్యార్థులు తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎయిర్ ఇండియా అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఎయిర్ ఇండియా అధికారుల నుంచి తెలుగు విద్యార్థులను మహముద్ అలీ విడిపించారు.