Siddipet District Latest News
-
బీఆర్ఎస్ రక్షణ కవచం
తెలంగాణకు శ్రీరామరక్షరజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన●● పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం ● ‘సాక్షి’తో ఎమ్మెల్సీ, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తెలంగాణ ప్రజల రక్షణ కవచమని ఎమ్మెల్సీ, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ తెలంగాణను పునఃనిర్మాణం చేసిందని, కాంగ్రెస్కు అధికారం తప్ప.. ప్రజల గురించి ఆలోచించడంలేదని తెలిపారు. రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోందని, మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశపతి శ్రీనివాస్ను రజతోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక అనాథ.. తెలంగాణకు అన్యాయం జరిగితే అడిగే దిక్కులేదు. వివక్షకు గురవుతుంటే అడిగే వారేలేరు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు తెలంగాణను ఒక అంగడి సరుకు చేసి తమకు పదవి రానప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను ఎత్తు కోవడం పదవి రాగానే దించడం చేశారు. దీంతో ప్రజల్లో ఉద్యమంపై, ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఆశ లేకుండా పోయింది. 1969లో 369 బలిదానాలు జరిగినా కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రంపై ప్రజల్లో కేసీఆర్ ఆశలు చిగురింపజేశారు. గులాబీ జెండాను ఎత్తి 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మూగబోయిన తెలంగాణ ఉద్యమం సింహగర్జన చేసింది. నిర్జీవమైన ఉద్యమం మళ్లీ ప్రాణం పోసుకుంది. అనేక ఉద్యమాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట. తెలంగాణను పునఃనిర్మాణం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పదేళ్ల పరిపాలనలో చల్లగా బతికింది. కేసీఆర్ పరిపాలనలో భూమి మీద నీళ్లు పారాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి, కొత్తగా కాళేశ్వరం నిర్మించి, పాలమూరు ఎత్తిపోతల పథకంను 80శాతం, సీతారామను 90శాతం, అనేక చెక్ డ్యాంలు నిర్మాణాలయ్యాయి. దీంతో చెరువులు బాగుపడ్డాయి. జలాలు.. ధాన్యం రాశులు ఆనాడు నీటి కోసం అలమటించిన తెలంగాణ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏటు చూసినా జల రాశులు, పంట రాశులు దర్శినమిచ్చాయి. కరోనా వచ్చినా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆగలేదు. పదేళ్లలో ఆర్థిక వృద్ధి పెరగడంతోపాటు 1.60లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకవచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు దుష్ప్రచారాలు చేశాయి. గోరంతను కొండంతగా చూపించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ లేని రాజకీయాలను ఊహించలేం. కొంత ఆత్మపరిశీలన చేసుకున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉండేవి అన్న ఆలోచన ప్రజలు చేస్తున్నారు. కాంగ్రెస్ తీరు అర్థమైంది.. కాంగ్రెస్ నేతలకు అధికారం అనుభవించాలనే కోరిక తప్ప.. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీతో అన్ని కోల్పోతున్నామని ప్రజలకు అర్థమవుతోంది. కాళేశ్వరం నీటితో చెరువులు నింపుతున్న పరిస్థితి లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మళ్లీ కరువు వచ్చేస్తోంది. కరెంట్ సమస్యలు వస్తున్నాయి. పదేళ్లలో ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంవత్సరం నుంచి క్షీణత మొదలైంది. రియల్ రంగం కుదేలైంది. దీంతో తెలంగాణ తిరోగమన దిశ ప్రారంభమైంది. కేసీఆర్ మాటలు వినాలని.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోంది. కేసీఆర్ను చూడాలని.. ఆయన మాటలు వినాలని గులాబీ దండు కదిలివస్తోంది. బండ్లు కట్టుకుని.. నడచుకుంటూ వరంగల్కు చేరుకుంటున్నారు. రజతోత్సవం బీఆర్ఎస్ పండుగే కాదు.. ప్రజల ఆత్మగౌరవం. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నా.. రైతు బంధు రావాలన్నా.. బడుగులకు భరోసా దొరకాలన్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎదైన భూ సమస్య ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వయిరీ, ఇరువర్గాలను పిలిచి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్ పరిశీలనచేసి నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో జరగుతాయని వివరించారు. అలాగే అన్ని వివరాలతో కూడిని భూఆధార్ కార్డును రైతులకు అందించన్నుట్లు తెలిపారు. దీంతో భూఅక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు అనంతరం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అధికారులతో కలసి సందర్శించారు. కొంత కాలంగా మూసి ఉన్న వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహానికి కావల్సిన మౌలిక వసతులు వెంటనే కల్పించి వచ్చే విద్యాసంవత్సరం అరంభం నాటికి వసతి గృహాన్ని పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా అమలు కలెక్టర్ మనుచౌదరి -
బీఎస్ఎన్ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఏజీఎం లక్ష్మణ్ బానోత్ సిద్దిపేటకమాన్: బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) లక్ష్మణ్ బానోత్ తెలిపారు. సిద్దిపేటలో శుక్రవారం వినియోగదారుల మేళా కార్యక్రమం నిర్వహించారు. మేళాలో పలువురు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు పలు సమస్యలపై సంప్రదించగా సిబ్బంది పరిష్కరించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏస్డీఈలు మోహన్రెడ్డి, రవీందర్, రాజేంద్రప్రసాద్, రాజ్కుమార్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి సివిల్ సప్లై సీఆర్ఓ ఫణిందర్ కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని సివిల్ సప్లై సీఆర్ఓ (ఐఏఎస్) ఫణిందర్ అన్నారు. దుద్దెడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, నీడ నిచ్చే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ కొనుగోళ్ల కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న వేళ కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉరుములు.. పిడుగులు ● పలు ప్రాంతాల్లో గాలివాన ● భయాందోళనకు గురైన ప్రజలు దుబ్బాక/దుబ్బాకరూరల్: మండల పరిధిలోని బల్వంతాపూర్, తొగుట మండలం గుడికందుల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బల్వంతాపూర్లో ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టు, గుడికందులలో ఇళ్లసమీపంలోని తాటిచెట్టుపై పిడుగులు పడి మంటలు ఎగసిపడ్డాయి. వరదరాజుపల్లిలో పాడిగేదెలు మృతి తొగుట(దుబ్బాక): పిడుగుపాటుకు పాడిగేదెలు మృతిచెందాయి. ఈ ఘటన వరదరాజుపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేపాక పరశురాములు తన వ్యవసాయ పొలం వద్ద పాడిగేదెలను కట్టేసిన చెట్టుపై పిడుగుపడింది. దీంతో గేదెలు మృతిచెందాయి. నిలిచిన రాకపోకలు.. మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనదారుల రాకపోకలు నిలిచి పోయాయి. గంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
ట్రిపుల్ఆర్ భూబాధితుల ఆక్రోశం
రూ.కోట్లు పలికే భూములకు అత్తెసరు పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారంటూ ట్రిపుల్ఆర్ భూ బాధితుల్లో ఆక్రోశం వ్యక్తమవుతోంది. భూముల ప్రభుత్వ విలువపై పట్టణ ప్రాంతాల్లో రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడింతలు ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 4,832ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. మే లేదా జూన్ నెలలో భూముల స్వాధీనానికి రంగం కూడా సిద్ధమైంది. పరిహారం తేల్చకుండానే అధికారుల కార్యాచరణ వేగవంతం చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గజ్వేల్: ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం భూబాధితుల పరిహారం లెక్కల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రూ.కోట్ల విలువైన భూములకు పొంతన లేని పరిహారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుండటమే కారణం. ట్రిపుల్ఆర్ భూసేకరణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి పరిధిలో మూడు కాలాలతోపాటు గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4832.5ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో దాదాపుగా సేకరించారు. ఇందులో 180 ఎకరాల అటవీ భూమి, మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. పొంతనలేని లెక్కలు సేకరిస్తున్న భూమికి ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలు మాత్రమే పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తర భాగంలో ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే సంగారెడ్డి ప్రాంతంలోని కొన్ని సర్వే నంబర్లల్లోని భూమి అత్యధికంగా రూ.75లక్షలు పలుకుతోంది. ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే రూ.1.5కోట్ల పరిహారం అందే అవకాశం ఉంది. నిజానికి ఈ భూమికి బహిరంగ మార్కెట్లో ధరను పరిశీలిస్తే.. రూ.10కోట్లకుపైనే ఉంటుంది. ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే చౌటుప్పల్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు అత్యధికంగా రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువ కలిగిన భూములు ఉన్నాయి. నిజానికి బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.5నుంచి 7కోట్ల వరకు పలికే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల గరిష్టంగా రూ.10లక్షలకుపైగా ప్రభుత్వ విలువ కలిగిన భూములు ఉన్నాయి. కానీ భూములకు మార్కెట్ ధరతో పోలిస్తే పొంతన లేని పరిహారం పొందే అవకాశముంది. ముఖ్యమైన విషయమేటంటే భూముల ప్రభుత్వ విలువల పెంపు శాసీ్త్రయంగా జరగకపోవడం కూడా బాధితుల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సామలపల్లిలో ట్రిపుల్ఆర్ నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలే.. ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం ముందుకు ఉత్తర భాగంలో 4,832 ఎకరాల భూసేకరణ పూర్తి భూముల స్వాధీనానికి రంగం సిద్ధం అదనపు భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 11చోట్ల ఇంటర్ఛేంజ్ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వీటి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుత హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు కంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్ఛేంజ్ల వద్ద అదనపు భూసేకరణ అవసరమవుతోంది. దీంతో ఇంటర్చేంజ్ ప్రదేశాల్లోనూ బాధిత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం
●నిబంధనల మేరకే భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతోంది. ఎన్హెచ్ 1956 చట్టం ప్రకారం ఈ భూసేకరణ జరుగుతుంది. పరిహారం పంపిణీ కూడా మే లేదా జూన్ నెలలో పూర్తి కానుంది. దీని తర్వాత భూముల స్వాధీనానికి చర్యలుంటాయి. – తోసిఫ్, డిప్యూటీ మేనేజర్, ఎన్హెచ్ఏఐ ● పాదయాత్ర విజయయాత్ర కావడం ఖాయం ● గెలిచినా ఓడినా ప్రజల పక్షమే ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూంపం వద్ద అమరవీరులకు, పహల్గామ్లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం వరంగల్కు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మిట్టపల్లి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాలు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర.. పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్ర కాబోతుందన్నారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించిందన్నారు. కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ తెలంగాణ పక్షం వైపే ఉండి పోరాడుతుందన్నారు. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా 1500 మంది యువత పాదయాత్రగా రజతోత్సవ సభకు బయలుదేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్.. గాంధీ చూపిన బాటలో ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, అభివృద్ధి సంక్షేమాల్లో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. పాదయాత్ర పొడుగునా కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని, రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.యువకులకు దిశా నిర్దేశం చేస్తున్న హరీష్రావునంగునూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం పాలమాకులకు చేరుకుంది. భోజనాల అనంతరం ఎమ్మెల్యే హరీష్రావు యవకులకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మీతో కలసి పాదయాత్ర చేస్తా.. మిమ్ములను గుండెలో పెట్టుకొంటా’ అని అన్నారు. యువకులు క్రమశిక్షణతో వరంగల్ వరకు పాదయాత్ర చేయాలన్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన యువకులు రాత్రి బద్దిపడగలో బస చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం నంగునూరు(సిద్దిపేట): వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ధాన్యం దళారుల పాలు అవుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పాలమాకులలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్మి వారం రోజులు గడుస్తున్నా డబ్బులు రాలేదని రైతులు తెలిపారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని అన్నారు. గత యేడాది లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించిందన్నారు. -
సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సిద్దిపేటఅర్బన్: వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సూచించారు. గురువారం సాయంత్రం రాజీవ్ రహదారి పొన్నాల దాబాల వద్ద పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించడం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ప్రాణాపాయం నుంచి బయటపడేస్తాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 42వేల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. -
మే నెలంతా సెలవులివ్వండి
సిద్దిపేటరూరల్: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన చేపట్టారు. అనంతరం యూనియర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ రెహమన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమానంగా అంగన్వాడీలకు సైతం ఒక్కపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యలర్ జారీ చేయడం మంచి విషయమన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన పోషన్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మేనెల మొత్తం సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపారన్నారు. 40 డగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సెలవులపై ప్రకటన చేయాలన్నారు. తమకు స్పష్టమైన హమీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వీరమని, శారద, కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమలహాసన్, ప్రకాశ్రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర మెదక్ ఎంపీ రఘునందన్ రావు -
భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో భూములు కబ్జాలకు గురైతే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వారు ఎంతటి వారైన సహించబోమన్నారు. రైతులకు వరం భూమి అంటేనే ఆత్మగౌరవం అని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం.. తదితర అంశాల పరిష్కారానికి ‘భూ భారతి’ రైతులకు వరంలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల జరిగిన అవకతవకల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. 30 ఏళ్ల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని... తద్వారా గొడవలు నెలకొన్నాయన్నారు. భూముల మీద పంచాయితీలు జరగకుండా ఉండాలన్నదే మా లక్ష్యమన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవతుందని, ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. అలాగే నష్టపోయిన రైతులను అందుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి దృష్టికి భూ సమస్యలు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ముగిసిన తరువాత పలువురు రైతులు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కన్నపేట మండలంలోని నందారం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 935ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఓ ముస్లిం పేరుపై ఉండటంతో ధరణీ పోర్టల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని భానోతు భాస్కర్నాయక్ చెప్పారు. మోత్కులపల్లి పరిధిలో సుమారు 120ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులకు పశువులు, మేకలు మేపుటకు అప్పటి దొరలు ఇస్తే ఇతరులు పట్టాలు చేసుకున్నారని గుగులోతు రాంబాబు నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేగొండలో ఏళ్లతరబడి కాస్తులో ఉంటే ధరణిలో మరొకరి పేరు ఉందని ఎడల వనేష్ చెప్పారు. ఇలా పలువురు భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్ను ప్రస్తుతం బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. జూన్ 2 నుంచి క్షేత్ర స్థాయిలో అమలుహుస్నాబాద్: వచ్చే జూన్ 2 నుంచి భూ భారతి చట్టం క్షేత్ర స్థాయిలో అమలు అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండలంలోని పొతారం (ఎస్)లో గురువారం భూ భారతి చట్టం అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాతే భూముల పంచాయితీ పెరిగిందన్నారు. భూమి ఎవరిదో తెలిపేలా సమగ్ర వివరాలతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. భూ భారతితో కష్టాలు తొలగిస్తాం భూముల పేరిట పంచాయితీలు వద్దు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు
గాలివాన బీభత్సంగజ్వేల్రూరల్: గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అగ్ని గుండాలు, గరుడ వాహనసేవ నిర్వహించారు. అలాగే గరుడ వాహనంపై స్వామివార్ల విగ్రహాలను ఉంచి పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ● బెజ్జంకిలో పిడుగుపడి వృద్ధురాలు మృతి ● కూలిన విద్యుత్ స్తంభాలు ● నేలరాలిన మామిడికాయలు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వాన బీభత్సం సృష్టించింది. లక్ష్మీపూర్లో విద్యుత్ స్తంభాలు కూలాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. బెజ్జంకిలోని ఎడ్ల బొమ్మ సమీపంలో పిడుగు పడి టేకు రంగవ్వ (63) అనే వృద్ధురాలు మృతిచెందగా టేకు ప్రవీణ్ అనే 13 ఏళ్ల బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. వీరిని మొదట బెజ్జంకి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రంగవ్వను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ను అంబులెన్సులో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇంటర్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంటర్లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట శాఖా గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికార భాష హోదా దక్కినా తెలుగును కళాశాల విద్యలో తొలగించడం ఎంతవరకు సమంజమన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నంతవరకు మనకు గౌరవం దక్కుతుందని, ఇతర భాషల వల్ల వెనుకబడి పోతున్నామన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ భాషకు గౌరవం దక్కాలంటే ప్రతి ఒక్కరూ తెలుగు చదవాలన్నారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి బస్వరాజు కుమార్, చీకోటి రాములు, వంగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే చర్యలు దుబ్బాకరూరల్: ఆలయాల భూములు కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి హెచ్చరించారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మండలంలోని హబ్సిపూర్లో భూములను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ దేవాదాయ పరిధిలో 1417, 1418 సర్వే నంబర్లో 11ఎకరాల భూమి ఉందన్నారు. భూమిని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కొందరు ఏకంగా భవనాలు నిర్మించేందుకు పనులు చేపడుతున్నారని, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ సేవామేళా సిద్దిపేటకమాన్: సిద్దిపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం వినియోగదారుల సేవామేళా నిర్వహించనున్నట్లు ఏజీఎం లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందన్నారు. వినియోగదారులు మొబైల్ తదితర సేవలు, సమస్యల పరిష్కారం కోసం మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు తెలిపారు. సిద్దిపేట డిపోలో నిర్వహించిన ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో గత రెండు నెలల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 92మంది సిబ్బందిని గురువారం అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించి సిద్దిపేట, దుబ్బాక డిపోలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరి, అసిస్టెంట్ ఇంజనీరు రంజిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పటాన్చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. -
దుకాణాల వేలానికి స్పందన కరువు
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలోని మున్సిపల్ దుకాణ సముదాయాల వేలానికి స్పందన కరువైంది. మున్సిపల్ పరిధిలోని మూడు ప్రదేశాల్లోని దుకాణ సముదాయాల్లో 26 షెట్టర్లు ఉన్నాయి. ఇందులో పోచమ్మ దేవాలయ వద్ద ఉన్న 16 షెట్టర్లలో గతంలో దక్కించుకున్న 11 మంది వ్యాపారస్తులు రెన్యూవల్ చేయించుకున్నారు. కాగా 5 షెట్టర్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బహిరంగ వేలం పాట నిర్వహించగా అందులో కేవలం మూడు షెట్టర్లకు మాత్రమే వేలం పూర్తయింది. షెట్టర్ నం.3కి దరఖాస్తులే రాకపోవడంతో రెండు షెట్టర్లకు వేలం వాయిదా వేశారు. షెట్టర్ నం.7ను మహ్మద్ నజీర్ రూ.12500, షెట్టర్ నం.14ను గంట రాజు రూ.7500, షెట్టర్ నం.17ను సోమ వినయ్ రూ. 9300 నెలసరి అద్దె ప్రాతిపదికన దక్కించుకున్నారు. ఆసక్తి చూపని వ్యాపారస్తులు లాల్ బహదూర్ శాస్త్రి సమీపంలోని 6 షెట్టర్లకు కేవలం ఒకే దరఖాస్తు రావడంతో అధికారులు వేలం వాయిదా వేశారు. అలాగే డబుల్ బెడ్రూం సమీపంలోని 4 షెట్టర్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ ప్రదేశాల్లో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. 15 షెట్టర్లకు కేవలం మూడింటికి మాత్రమే వేలం ఆసక్తి చూపని వ్యాపారస్తులు -
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. -
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు. ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు.. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.జిల్లాకు కొత్త వాటర్షెడ్ పథకం పిచెర్యాగడి ప్రాజెక్టు కింద 8 గ్రామాల ఎంపిక భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాలకు చోటు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు 4,733 హెక్టార్లలో పనులు మూడు శాతం మాత్రమే జరిగిన పనులు -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు లారీని ఢీకొట్టిన మహిళా ఆర్ఎంపీ.. చేగుంట(తూప్రాన్): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్ స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. ఆమె కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న తన కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. హవేళిఘణాపూర్(మెదక్): ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్లకు మెదక్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టిన యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు డివైడర్ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్పేట –భూపంల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్కు, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి.. సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోలు పోసుకొని ఆత్మహత్య -
చీటింగ్ కేసులో అఘోరీ రిమాండ్
● లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ ● తిరిగి కోర్టుకు పంపిన అధికారులు సంగారెడ్డి టౌన్: ఓ చీటింగ్ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్ రాయ్ తెలిపారు. పుస్తక పఠనంతో మేధో సంపత్తిగజ్వేల్రూరల్: పుస్తక పఠనంతోనే మేధో సంపత్తి పెరుగుతుందని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ పుస్తక కాపీరైట్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, వర్తమాన రచయిత డాక్టర్ మహేందర్రెడ్డి, వెస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. బొంతపల్లిలో ఇరు వర్గాల ఘర్షణజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి ఆయిల్ చోరీ దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్, ఆయిల్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త ఆచూకీ తెలుపండిహవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె భర్త మహేశ్తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందుబాబులకు జరిమానాసంగారెడ్డి క్రైమ్: డ్రంకన్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్వద్ద, జాతీయ రహదారి, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్లో తనిఖీల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. -
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ర్యాలీ
కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం రాత్రి గజ్వేల్ పట్టణంలో పార్టీల కతీతంగా కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులగుండా జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్ర స్థాయిలో ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, యువజన, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. – గజ్వేల్రూరల్ -
ఉగ్రదాడి పాశవిక చర్య
దిష్టి బొమ్మ దహనం చేసిన న్యాయవాదులు హుస్నాబాద్: కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదులు భారత్కు రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దేశానికి రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదానందం, న్యాయవాదులు చిత్తారి రవీందర్, మురళీమోహన్, కన్నోజు రామకృష్ణ, రాజశేఖర్, సంపత్ పాల్గొన్నారు. పేద రోగులకు సేవలందిస్తా ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాయి దీప్తి చేర్యాల(సిద్దిపేట):పేద రోగులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని ఇంటర్మీడియెట్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తి అన్నారు. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తిని ‘సాక్షి’ పలకరించగా పై విధంగా అన్నారు. ‘ఆ లక్ష్యంతోనే చేర్యాల కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కష్టపడి చదివి, ఉపాధ్యాయుల సహకారంతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి పేద రోగులకు సేవలందిస్తా’నని అన్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కారణంగా రెండేళ్లు చదువు ఆపేసినట్లు తెలిపారు. కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో చేరి స్టేట్ ఫస్ట్ర్యాంక్ సాధించడంపై బాలికను అధ్యాపకులతో పాటు పలువురు అభినందించారు. అదనపు సెషన్స్ జడ్జిగా ప్రసాద్ సిద్దిపేటకమాన్: ఫస్ట్ క్లాస్ అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా వైజే ప్రసాద్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 42 ఏళ్లకు కలుసుకున్న అపూర్వ మిత్రులు ఒకరు ఏసీపీ.. మరొకరు హెడ్మాస్టర్ హోదాలో.. మిరుదొడ్డి(దుబ్బాక): వారిద్దరు ఒకేచోట చదువుకున్న మిత్రులు. ఉన్నత చదువుల రీత్యా ఎవరికి వారు విడిపోయారు. ఒకరేమో ఏసీపీగా, మరొకరేమో హెడ్మాస్టర్గా స్థిరపడ్డారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత ఇద్దరు విధి నిర్వహణలో అనుకోని రీతితో తారాసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఆనంద భావోధ్వేగం చూపరుల మనసును కట్టిపడేసింది. శాంతి భద్రతల సమీక్షలో భాగంగా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామాన్ని ఏసీపీ మధు బుధవారం సందర్శించారు. ఇదే గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లో హెడ్మాస్టర్గా విధులను నిర్వహిస్తున్న చిన్ననాటి మిత్రుడు కూరపాటి జగన్మోహన్ రాజు ఏసీపీకి అకస్మాత్తుగా ఎదురుపడ్డారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి గురై ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి విద్యనభ్యసించిన జ్ఞాపకాలను, సంఘటనలను ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు దుబ్బాకటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తాయని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడిబాట వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
2024–25లో రూ.26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్ఎస్టేట్ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్ఆర్ఓ కార్యాలయాలురియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్ సేల్ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం. అనధికారిక లే అవుట్ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో.. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు.రియల్ రంగం కుదేలే కారణం! -
రజతోత్సవం.. సమాయత్తం
బీఆర్ఎస్ సభకు భారీ సన్నాహాలు ● గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ● ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2లక్షల మందిని తరలించేందుకు కసరత్తు ● సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న హరీశ్రావు ● సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు మెతుకుసీమ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ నెల 27న 25వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా భారీ సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తరలించేందుకు సమాయత్తం మవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సమీక్షలను, టెలికాన్ఫరెన్స్లను నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డగా మరోమారు సత్తా చాటేందుకు స్థానిక గులాబీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముమ్మరంగా ఏర్పాట్లు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు పలు బాధ్యతలను అప్పగించారు. గజ్వేల్ నుంచి గులాబీ దండును తరలించే పనిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్లు దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు తరలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోనే సభ జరుగుతుండటంతో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నుంచి సైతం జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకుల కూలి పనులు సభకు వెళ్లేందుకు తోవ ఖర్చుల (భోజనం, వాటర్ ప్యాకెట్ల) కోసం గులాబీ నాయకులు కూలీ పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్ యువజన, బీఆర్ఎస్వీ నాయకులు పలు చోట్ల కూలీ పనులు చేసి డబ్బులను సమకూరుస్తున్నారు. అలాగే పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు వెళ్లేందుకు ఖర్చుల కోసం డబ్బులను విరాళంగా ఇస్తున్నారు. రేపు పాదయాత్ర ప్రారంభంఎల్కతుర్తిలో జరగనున్న సభకు శుక్రవారం పాదయాత్రగా బయలు దేరి వెళ్లనున్నారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం నుంచి దాదాపు వెయ్యి మంది యువత, విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరనున్నారు. 27న సాయంత్రం ఎల్కతుర్తిలో జరిగే సభకు చేరుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని హరీశ్రావు నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే హాల్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 15 మంది పాదయాత్రగా వెళ్లేందుకు యువత ముందుకు వచ్చారు. ఇప్పటికే జాబితాను రూపొందించారు. తరలివెళ్దాం రండీ..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. కనీవిని ఎరుగని స్థాయిలో జరుగనున్న రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 15 వేలకు పైగా క్రీయాశీలక కార్యకర్తలు హాజరవుతారన్నారు. సభకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లపై చర్చించామన్నారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోరుగా వాల్ రైటింగ్ ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రధాన రహదారుల వెంట వాల్రైటింగ్ రాయించారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు వాల్ పోస్టర్లను రూపొందించి అతికించారు. స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నాయకుల సభను విజయవంతం చేయాలని వాల్రైటింగ్లు, వాల్ పోస్టర్లు అంటించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. -
భూ భారతి రైతులకు వరం
కోహెడ(హుస్నాబాద్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరం కానుందన్నారు. దీంతో కోర్టుకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కారం కానున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితోనే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. సాదాబైనామాలు సైతం భూ భారతి ద్వారా పరిష్కారం కానున్నట్లు తెలిపారు. నాలుగు దిక్కులా హద్దులతో వ్యవసాయ మ్యాప్తో రిజిస్టేషన్లు అయ్యేలా భూ భారతి చట్టంలో ఉందన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కరం కోసం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవాలని కోరారు. కాగా సదస్సుకు వచ్చిన పలువురి రైతుల సమస్యలకు కలెక్టర్ మనుచౌదరి సలహాలు, సూచనలు చేశారు. అలాగే తొమ్మిది మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. అంతకు ముందు సన్నబియ్యం లబ్ధిదారులు తలారి మల్లవ్వ, చంద్రయ్య ఇంట్లో మంత్రి భోజనం చేశారు. అనంతరం వింజపల్లి చౌరస్తా కురుమ వాడలో సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంత్రి అవిష్కరించారు. అనంతరం కురుమ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్రెడ్డి ముందుగా రాంనగర్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డివెంకట్రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కీలక భూ సమస్యలన్నీ ఇక పరిష్కారం మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడలో అవగాహన సదస్సు -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
డీపీఓ దేవకిదేవి కొమురవెల్లి(సిద్దిపేట): పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని డీపీఓ దేవకిదేవి అన్నారు. సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీడీఓ శ్రీనివాస వర్మతో కలిసి ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యం నుంచి భూమిని కాపాడుకోవాలని అన్నారు. మనిషి జీవితం పూర్తిగా భూమిపై ఆధారపడి ఉందని, మనం తీసుకునే ఆహారం, తాగునీరు వంటి ప్రధాన అవసరాలన్ని భూమియే సమకూరుస్తోందని అన్నారు. భూమిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడమే మార్గమన్నారు. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిళ్లు, బ్యాగులు మాత్రమే వాడాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్పై సమీక్షించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారలోపాన్ని నివారించాలి
డీప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ గజ్వేల్: మహిళలు, చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని సరిచేయడానికి కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఆశావర్కర్లు, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసి పోషకాహారలోపం తలెత్తకుండా చూడాలన్నారు. పోషణ పక్వాడలో భాగంగా మొదటి వెయ్యి రోజులు గర్భిణులు, పిల్లలకు క్రమపద్ధతిలో పోషకాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సరిత, తహసీల్దార్ శ్రావన్కుమార్, వైద్యాధికారులు బల్బీర్సింగ్, ప్రణయ్, సత్యప్రకాశ్, పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కిరణ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, శ్రీలక్ష్మీ, రజిత, అనురాధ, దెబోర రాణి, రాణి, సునీత తదితరులు పాల్గొన్నారు. కల్యాణం.. కమనీయం గజ్వేల్రూరల్: పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివార్ల ఎదుర్కోలు కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ నిర్వహించి, పట్టణ పుర వీధుల గుండా మంటపం వరకు విగ్రహాలను తీసుకువచ్చారు. అనంతరం వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం ములుగు(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలే తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. మంగళవారం ములుగులోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే హామీలను తుంగలో తొక్కి, ఆరు గ్యారంటీలను విస్మరించిందన్నారు. అనంతరం వారు నాయకులు, కార్యకర్తలతో కలసి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువత భాగస్వాములు కావాలి గజ్వేల్రూరల్: దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ జవాన్గా ఎంపికై న వరుణ్ను మంగళవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీలో చేరి దేశ ప్రజలకు సేవలందించే సైనికుల సేవలు వెలకట్టలేనివని, యువత దేశ రక్షణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్న ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు భూ భారతి వరం
దుబ్బాక: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరమని ఆర్డీఓ సదానందం అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీలో భూ భారతిపై రైతులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు కలిగే లాభాలను వివరించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఆర్ఐ నరేందర్, మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. సమస్యలు ఇక సత్వర పరిష్కారం మిరుదొడ్డి(దుబ్బాక): భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆర్ఓఆర్ 2025 చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూ భారతి ద్వారా చేకూరే ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీఓ జైపాల్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి నాగేశ్వర్రావు, ఆర్ఐ వెంకట్ నర్సయ్య, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
యూజీడీ కోసం వినతి
సిద్దిపేటజోన్: పట్టణంలోని సంతోష్నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంగళవారం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో యూజీడీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున వర్ష కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సెక్రటరీ కనకరాజు, ప్రతినిధులు కనకయ్య, కొండల్రెడ్డి, శ్రీనివాస్, నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు గ్యారంటీలకు ససేమిరా
● బీజీలు ఇవ్వని మూడింట రెండోవంతు రైసు మిల్లర్లు ● 94 మిల్లులకుగాను ఇచ్చింది కేవలం 33 మిల్లులే ● వారికే సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామంటున్న అధికారులు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కస్టం మిల్లింగ్ పేరుతో సర్కారు ధాన్యాన్ని తీసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైసుమిల్లర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనలు మెదక్ జిల్లాలో అమలు కావడం లేదు. బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇస్తేనే కస్టం మిల్లింగ్ కోసం ధాన్యం కేటాయించాలనే నిబంధనను మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఈ యాసంగి కొనుగోలు సీజనులో మిల్లర్లు తీసుకునే ధాన్యానికి బీజీలు ఇచ్చేందుకు ససేమిరా అంటు న్నారు. మూడింట రెండోవంతు మిల్లర్లు ఈ బీజీలు ఇవ్వలేదు. జిల్లాలో మొత్తం 94 రైసుమిల్లులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 33 రైసుమిల్లుల యాజమాన్యాలు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చాయి. మిగిలిన 61 మిల్లర్లు బీజీలు ఇవ్వాలనే నిబంధనను పెడచెవిన పెడుతున్నారు. దీంతో వీరికి ఈ సీజనులో ధాన్యం కేటాయింపులు ఉంటా యా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మిల్ల ర్లు తాము తీసుకునే ధాన్యానికి సంబంధించి బ్యాంకుల నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ తీసుకున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా ప్రభుత్వం రాబట్టుకుంటుంది. ఈ నిబంధన జిల్లా లో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఊపందుకుంటున్న సేకరణ సీజను... మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ సీజను ప్రారంభమైంది. ఈ యాసంగి సీజనులో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 2.01 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, సుమారు 43 వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్కించారు. రైతులు తమ సొంత అవసరాలు పోగా, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మినహాయిస్తే...సుమారు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (సన్న, దొడ్డురకాలు కలిపి) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఈ కేంద్రాల్లో సేకరణ షురువైంది. ఈ నెల 19 నాటికి 312 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇలా ఈ సేకరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. కానీ, మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు.. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మిల్లర్లకు మాత్రమే ఈ సీజనులో సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదని చెబుతున్నారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లు వస్తే...సర్కారు ధాన్యాన్ని మిల్లర్లకు కట్టబెట్టడం అధికారులకు పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అక్రమార్కులకు అక్షరాల రూ.214 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టారు. ఈ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్లో విక్రయించి ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుని రూ.కోట్లకు పడగలెత్తారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తమకు అందే మామూళ్లను తీసుకుని సర్కారు ధాన్యాన్ని అప్పనంగా అక్రమ మిల్లర్లకు అప్పగించారనేది బహిరంగ రహస్యమే. ఈ యాసంగి సీజనులోనైనా ప్రభుత్వం పెట్టిన బ్యాంకు గ్యారెంటీల నిబంధనను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తారా...లేదంటే అక్రమ మిల్లర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని బ్యాంకు గ్యారెంటీలు లేకుండా సర్కారు ధాన్యాన్ని కేటాయిస్తారా..? అనేది వేచి చూడాల్సిందే. సాధారణంగా రైతుల సమస్యను సాకుగా చూపి ఏటా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టడం పరిపాటైపోయింది. బీజీలు ఇచ్చిన వారికే కేటాయింపులు ఈ బ్యాంకు గ్యారెంటీల విషయమై ‘సాక్షి’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేశ్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ను సంప్రదించగా.. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీలు ఇవ్వని వారి వద్ద కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. –మెంచు నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్ -
మెరిసిన కవలలు
తల్లి స్వీపర్.. కూతురు టాపర్సత్తాచాటిన గురుకుల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యడీఈఓ శ్రీనివాస్రెడ్డి హుస్నాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలు అత్యుత్తమ మార్కులతో మెరిశారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అశాడపు శ్రీనిజ, ఆశాడపు శ్రీనిత్యలు అక్కా చెల్లెల్లు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) పూర్తి చేశారు. వెలువడిన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో శ్రీనిత్య 981/1000, శ్రీనిజ 968/1000 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలోనూ శ్రీనిత్య 461/470, శ్రీనిజ 438/470 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వారు తెలిపారు. తొగుట(దుబ్బాక): తండ్రి లేకపోయినా.. తల్లి సహకారంతో పేదింట విద్యాకుసుమం మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని భార్గవి 971 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. పడిగె మల్లేశం, మాధవి దంపతులకు కూతురు భార్గవి, కుమారుడు స్వామి (9వ తరగతి) ఉన్నారు. వారు తమ రెక్కల కష్టంతో పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో 8నెలల క్రితం మల్లేశం గుండెపోటుతో మృత్యువాతపడ్డారు. భర్త మరణించినా గుండైధెర్యంతో ఇద్దరు పిల్లలను రెక్కల కష్టంతో చదివిస్తోంది. మాధవి గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నారు. తొగుటలోని బాలికల గురుకుల పాఠశాలలో చదివిన భార్గవి టెన్త్లోనూ 9.8జీపీఏ సాధించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 971 మార్కులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంది. కష్టపడి చదివి తల్లి కష్టానికి ప్రతిఫలం అందించి పేదింట సంతోషాలను పూయించింది.సిద్దిపేటఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఎన్సాన్పల్లిలోని గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 39 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. అమూల్య, వైష్ణవిలు 468 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీ ఫస్టియర్లోనూ 37 మందికి 37 మంది ఉత్తీర్ణత కాగా, భూమిక 436 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 40 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంద్రజ, అశ్విని 990 మార్కులు వచ్చాయి. బైపీసీ సెకండియర్లో 38 మందికి 35 మంది ఉత్తీర్ణత సాధించగా దీపిక 993 మార్కులు సాధించింది. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జగదేవ్పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి ఏఐ ద్వారా పాఠాలు ఉంటాయని వివరించారు. విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని కోరారు. అంతకు ముందు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఎంపీడీఓ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ అయూబ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పేదింట విద్యాకుసుమం ఇంటర్లో 971 మార్కులు సాధించిన భార్గవి -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
విశ్వనాథస్వామి ఆలయఆవరణలో భారీ గొయ్యి ● చైర్మన్పై భక్తుల ఆగ్రహం ● ఎమ్మెల్యే, పోలీసుల పరిశీలన ● పోలీసుల అదుపులో చైర్మన్గొయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకొని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు అశోక్రెడ్డి గొయ్యిని పరిశీలించారు. ఆలయం ఆవరణలో అపారమైన నిధి ఉందని చైర్మన్ హన్మాండ్లు చెప్పేవారని కొందరు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త ఆలయ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఘటన జరగడం, పరిస్థితులను బట్టి గుప్తనిధుల కోసమే తవ్వినట్లు ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. తవ్వకాల విషయంలో కేసు నమోదు చేసి సమగ్రవిచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని విశిష్ట చరిత్రగల ప్రాచీన కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఆవరణలో గొయ్యి తవ్వకం కలకలం సృష్టించింది. గుప్త నిధుల కోసమేనని భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీ విశ్వనాథస్వామి ఆలయ ముఖద్వారం ఎదుట ఉన్న మండపానికి ఆనుకొని దాదాపు ఐదు అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యిని తవ్వారు. దానిపై పాత గేటు గ్రిల్ వేసి, గొయ్యి కనిపించకుండా ఉండేందుకు గడ్డి, చెట్ల పొదలతో కప్పి ఉన్న విషయాన్ని సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మాండ్లును పిలిపించగా పూజకు వాడిన పూలను వేసేందుకు ఆదివారం తానే అడ్డా కూలీలతో తవ్వించినట్లు తెలపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా, కమిటీలోని ఇతర బాధ్యులకు తెలపకుండా ఎలా తవ్వించారని భక్తులు ప్రశ్నించారు. పూలను వేసేందుకై తే అంత పెద్ద గొయ్యి, అదీ మండపానికి ఆనుకొని దాని పునాదులు కూలే అవకాశం ఉండేలా తవ్వించడం.. పైగా కనపడకుండా పైన గ్రిల్పెట్టి పొదలతో కప్పిఉంచడంలో ఆంతర్యం ఏంటని భక్తులు నిలదీశారు. ఇద్దరు కూలీలతో తవ్వించినట్లు చెబుతుండగా నలుగురితోపాటు ఓ బాబా సైతం ఉన్నట్లు అక్కడున్న వారు చెప్పడంతో గుప్త నిధుల కోసమే తవ్వించారని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకొని ఎస్సై–2 మెగులయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. విచారణ నిమిత్తం చైర్మన్ హన్మాండ్లును స్టేషన్కు తరలించారు. -
ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో నివాసముంటున్న వీ. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొనిల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్రికార్డులో సిద్దిపేట చిన్నోడు
మద్దూరు(హుస్నాబాద్): ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో సిద్దిపేట జిల్లా దూల్మి ట్ట మండలం హనుమ తండాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు జాటోత్ విహాన్రామ్కు చోటు దక్కింది. ఈ విషయం తండ్రి తిరుపతినాయక్ తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును జాటోత్ విహాన్రామ్ అందుకున్నట్లు తిరుపతి తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్లోని పాతాల్ పర్వతాన్ని అధిరోహించినందుకు గాను అందించినట్లు తెలిపారు. తన కుమారుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన కోచ్ లెంకల మహిపాల్కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహాన్ మంచిర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వారెవ్వా .. వైష్ణవి ● అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్లో దామరకుంట విద్యార్థిని మర్కూక్(గజ్వేల్): అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్ వారు నిర్వహించిన పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట విద్యార్థిని లింగ వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దామరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి ఆదివారం పంజాబ్లో నిర్వహించిన పోటీల్లో వైష్ణవి పాల్గొని భౌతిక రసాయన శాస్త్రంలో అత్యంత వేగంగా నిమిషం 59 సెంకడ్లలో ఆవర్తన పట్టిక క్రమ రూపం ఏర్పాటు చేసి బుక్ ఆఫ్ అవార్డ్స్లో స్థానం దక్కించుకుంది. సోమవారం ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోఫీ, బహుమతిని అందుకుందని మండల విధ్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. వెంకట్రాములు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి పెద్దశంకరంపేట(మెదక్): సనాతన ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతిస్వామి, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు డాక్టర్ సీఎస్. రంగరాజన్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయ ఉత్సవాల్లో వారు పాల్గొని భక్తులకు ప్రవచనాలందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతీ ఇంటి నుంచి కులమతాలకు అతీతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండి ధర్మ పరిరక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి జహీరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని వికారాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సెల్ 84669 38351ను సంప్రదించాలని సూచించారు. కులం పేరుతో దూషణ ● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మద్దూరు(హుస్నాబాద్) : కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేసిన వారిపై సోమవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన సోలిపురం బాబు శనివారం మిత్రులు సురేశ్, రాజుతో కలిసి ధూల్మిట్టలో వ్యవసాయ పనులకు కూలీ పనికి వెళ్లారు. తిరిగి వస్తూ బాబు, సురేశ్ వైన్స్ వద్ద గల పర్మిట్ రూంలో మద్యం తాగుతుండగా మహిపాల్రెడ్డి కులం పేరుతో బాబును దూషించాడు. కర్రతో దాడి చేయగా తలకు గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రంకై న్ డ్రైవ్లో జైలు గజ్వేల్రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష పడినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ పేర్కొన్నారు. ఆయన కథనం మేరకు.. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 21 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక ఎదుట హాజరు పర్చగా విచారణ అనంతరం 21మందికి రూ. 15 వేల జరిమానా విధించగా, ఇందులో ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
లింగయ్యను స్వదేశానికి రప్పించేందుకు కృషి
హుస్నాబాద్: దుబాయిలో చిక్కుకుపోయిన చొప్పరి లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తామని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో సోమవారం లింగయ్య ఇంటికి వెళ్లి అతడి భార్య రజితను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని ఏజెంట్లు మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం లింగయ్య వద్ద వైద్య చేయించుకోవడానికి చిల్లి గవ్వ లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. సామాజిక సేవకులు సత్యం పటేల్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి ఆదివారం లింగయ్యతోపాటు కంపెనీ యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. తప్పకుండా లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించి ఆయనకు ఉపాధి కల్పించేలా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని సంపత్ కుమార్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో పంట దగ్ధం
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుదాఘాతంతో మొక్కజొన్న కంకులు బుగ్గిపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సయ్యద్ అనే రైతు పట్టా భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయింది. విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేశారు. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.80 వేల విలువ చేసే పంట కాలిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు. పిడుగుపాటుకుఇల్లు ధ్వంసం ములుగు(గజ్వేల్): పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం బస్వాపూర్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కురుమ వసంత రామాంజనేయులు దంపతులు నివాసముంటున్న ఇంటిపై ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు నమ్మొద్దు
ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని వాపోయారు. కొండాపూర్ మండలం సైదాపూర్లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండేతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న సాగుపై ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని హరిదాసుపూర్లో సోమవారం సౌదీ అరేబియా రైతులు పర్యటించారు. గ్రామంలోని రైతులను కలిసి జొన్న పంట సాగు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాల్లో జొన్న సాగుచేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ జొన్న పంటకు డిమాండ్ ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. జొన్న సాగు చేయడానికి ఒక ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి వస్తుందని, ఒక ఎకరాలో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. నీటి సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతంలో ఎలాంటి పంటలను సాగు చేయాలనే పరిశోధనతో క్షేత్ర స్థాయిలో సాగు వివరాలను తెలుసుకునేందుకు సౌదీ అరేబియా రైతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ఏడీఏ వెంకట లక్ష్మీ, మండల వ్యవసాయాధికారి గణేశ్, ప్రతిభ, ఏఈఓ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.హరిదాసుపూర్లో సౌదీ అరేబియ్యా రైతులు -
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రం కొల్చారంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రజలు, యువత సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలంను వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ను, శివాజీ మహారాజ్ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదట పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేయాలనడం సబబు కాదన్నారు. ముందస్తుగానే గ్రామస్తులు ఈ విషయమై చర్చించుకోవాల్సి ఉండేదన్నారు. విగ్రహం ఎదుట మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించడమేనని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్ ఈ విషయంలో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్,దళిత సంఘాల నాయకులు ఉన్నారు. ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారంలో విగ్రహ ఏర్పాట్ల స్థల పరిశీలన -
కరెంట్ ఫెన్సింగ్ తీగే మృత్యుపాశమై..
వర్గల్(గజ్వేల్): పందుల బెడద నుంచి పైరును కాపాడేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ ఫెన్సింగ్ తీగే ఆ రైతు పాలిట మృత్యుపాశమైంది. విద్యుదాఘాతంతో పైరుకు నీరు పారిస్తున్న కౌలు రైతు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లిలో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్గల్ మండలం దండుపల్లికి చెందిన నీల స్వామి(40) మజీద్పల్లిలో కొంత పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పందుల బెడద నుంచి పంట కాపాడుకునేందుకు చుట్టూరా కరెంట్ ఫెన్సింగ్ తీగ ఏర్పాటు చేశాడు. సోమవారం ఉదయం పొలంలో నీరు పారించేందుకు వెళ్తున్నట్లు భార్య శ్యామలకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. కుమారుడు రాజు పలుమార్లు తండ్రికి ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో పొలం వద్దకు వెళ్లి వెతికాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ ఫెన్సింగ్ తీగను తగిలి విద్యుత్ షాక్కు గురై పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కౌలు రైతు దుర్మరణం వర్గల్ మండలం మజీద్పల్లిలో ఘటన -
కాలుష్యం
కమ్మేస్తున్న కాలుష్యం నుంచి కాపాడండి పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న వాయు కాలుష్యంతో జీవన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆందోళన పడుతున్నాం. పిల్లలు మహిళలు ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. మా ప్రాణాలను రక్షించండి. – ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ నాయకులు పీసీబీ అధికారుల చర్యలు శూన్యం సా్థనికంగా వెలువడుతున్న విష వాయువులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేరు. సమస్య తీవ్రతరంగా మారుతున్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మద్దూరి పెంటేశ్, బీఆర్ఎస్ నాయకులుజిన్నారం (పటాన్చెరు): వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకరంగా మారుతోంది. బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే జల కాలుష్యం పెద్ద ఎత్తున ఉండగా దానికి తోడు వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశాలను సైతం విష వాయువులను విడుదల చేస్తూ హరించేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన విధానం పైనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం రసాయన పరిశ్రమలు విగాధం కలిగిస్తున్నాయి. రసాయన విష వాయువులు గాలిలోకి.. పారిశ్రామిక వాడకు చెందిన పలు పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరిశ్రమల పొగ గొట్టాల ద్వారా పెద్ద ఎత్తున రసాయన విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తూ సామాన్య ప్రజలను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసిన పీసీబీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిర్యాదులను పెడచెవిన పెట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు విషవాయువులు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక విషవాయువులు కళ్లలో మంటలు పుట్టిస్తూ, ముక్కుపుట్టలు అదిరేలా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమలను గుర్తించి విషవాయువులను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా బొల్లారంపారిశ్రామిక వాడ విచ్చలవిడిగా వాతావరణంలోకివిష వాయువులు ఘాటైన వాసనలతో జనాల్లోఅనారోగ్య సమస్యలు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొల్చారం(నర్సాపూర్):ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. వై ద్యం కోసం వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు అసౌకర్యం కలిగించొద్దని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి అంశాన్ పల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ సెంటర్ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి సజన, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్, ఎంపీహెచ్ఓ మదన్ మోహన్, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ కొల్చారం పీహెచ్సీ తనిఖీ -
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.5కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు మొనగారి రాజులు, నక్క రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ధర్నా కార్యక్రమానికి హమాలీ కార్మికులు తరలిరావాలని కోరారు. అలాగే మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, ఎల్లం, స్వామి, నాగేందర్, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలు అవసరం కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్ సిద్దిపేట ఎడ్యుకేషన్: ఆవిష్కరణలు కొత్తవి సృష్టించడమే కాకుండా మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్ అన్నారు. ప్రపంచ ఇన్నోవేషన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సోమవారం ఇన్నోవేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీఐసీ ఆతిథ్య సంస్థగా పని చేస్తున్న స్వయంప్రతిపత్తి కళాశాలలో ఇన్నోవేటర్లను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునిత, వైస్ ప్రిన్సిపల్, ఇన్నోవేషన్ కోఆర్డినేటర్ అయోద్యరెడ్డి, గురుచరణ్దాస్, ఎంఎస్సీ, ఫిషరీస్, బోటనీ, జువాలజీ, బీబీఏ విబాగాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు
● పైరవీలకు తావులేదు ● రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి కొండపాక(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పైరవీలకు తావులేదని, అర్హులకే మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. కుకునూరుపల్లి మండలం మేదినీపూర్లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం చూపిన కొలతల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఇళ్లకు సైతం పథకం వర్తించేలా చూడాలని గ్రామస్తులు ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు వేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గ్రామంలో 75 ఇళ్లు మంజూరు కాగా 11 మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. ఇళ్ల మంజూరు కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎంపీడీఓలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. స్థలం ఉండి పూర్తిగా ఇల్లు కట్టుకునే స్తోమత లేని నిరుపేదలను మాత్రమే గుర్తించాలని అన్నారు. ఆర్థిక సహకారం కోరుకునే వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించేలా అధికారులు చొరవ చూపించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యే ఇంటి నిర్మాణ పనులను పంచాయతీ సెక్రటరీ పోర్టల్లో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారుడే తన స్మార్ట్ ఫోన్లో ఇంటి నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పడు అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా బిల్లుల్లో ఆలస్యం జరగదన్నారు. అసంపూర్తిగా, చివరిస్థాయిలో ఉన్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులపై మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో ఒక్క అనర్హుడు ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డిఓలు చంద్రకళ, రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులతో సమావేశం మండల పరిధిలోని వెంకటాపూర్ను గౌతమ్ సందర్శించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 183 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించామన్నారు. వారిలో 21 మంది మార్కింగ్ చేసుకోవడంతో పాటు 11 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నారన్నారు. నిర్మాణానికి సంబంధించి సామగ్రి ధరలు పెరిగాయని లబ్ధిదారులు చెప్పడంతో ఇసుకను ఉచితంగా అందించడంతో పాటుగా ధరల నియంత్రణపై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
ముంచెత్తిన వాన..
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లాలో అకాల వర్షం తీరని నష్టాన్ని కలిగించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. కాంటా కోసం ధాన్యం ఆరబెట్టి, తాలు లేకుండా శుభ్రం చేసుకున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటిపాలైంది. మార్కెట్లోకి వరద వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరద ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ధాన్యమంతా నీటిలో మునిగిపోయింది. మునిగిన ధాన్యాన్ని గంపల్లో ఎత్తుకుంటూ రైతులు అవస్థలు పడ్డారు. కాంటా పెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించకపోవడంతో ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. పది రోజుల నుంచి పడిగాపులు కాసి ధాన్యానికి కాపలాగా ఉంటే ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటి పాలైందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే జగదేవ్పూర్ మండలంలో ఈదురు గాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. చెట్లు నేలకొరిగాయి. హోల్సెల్ చెప్పుల దుకాణం పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. అలాగే నిరుపేదకు చెందిన పూరి గుడిసె ధ్వంసమైంది. పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం జరిగింది. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మద్దూరు మండల కేంద్రంతో పాటు జాలపల్లి, తోర్నాల, లింగాపూర్ గ్రామాల్లో ఉరుములు, మెరుపులులతో వర్షం కురిసింది. గాలి దుమారానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. –హుస్నాబాద్/మద్దూరు/జగదేవ్పూర్(గజ్వేల్) వరదనీటిలో ధాన్యం.. రైతన్న శోకం అకాల వర్షంతో తీరని నష్టం నోటికాడికూడు వర్షార్పణం -
అర్జీలు సత్వరం పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మొత్తం 44 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కార్డుల్లో పేర్లు గజిబిజి
సాక్షి, సిద్దిపేట: కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు.. దరఖాస్తు చేసిన వారి పేర్లు అమ్మమ్మ, నానమ్మ రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు అయ్యాయి. దీంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్ల నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రజలు సంతోషించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలలో జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం, చేర్పులు కోసం 74,272 మంది దరఖాస్తు చేశారు. 52వేల మంది దరఖాస్తు ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం 52,742, పేర్లు చేర్చుటకు 21,530 మంది దరఖాస్తు చేశారు. వీటి ఆధారంగా ప్రాథమిక స్థాయిలో అర్హులను గుర్తించి వారి జాబితాలను గ్రామ పంచాయతీ, పట్టణాల్లో వార్డు సభలలో ప్రకటించారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవద్దని అధికారులు చెప్పడంతో నూతన కార్డులు వచ్చినట్లే అని సంతోషపడ్డారు. వీరికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆనందంతో రేషన్ షాప్లకు వెళ్తే కొత్త కార్డు రాలేదు.. పిల్లల పేర్లు అమ్మమ్మ, నానమ్మ కార్డులలో నమోదు కావడంతో అయోమయానికి గురవుతున్నారు. గందరగోళంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అమ్మమ్మ, నానమ్మ కార్డుల్లోనే మనవళ్లు, మనవరాళ్ల పేర్లు కొత్త కార్డుల కోసం 43 వేల మంది దరఖాస్తు పేర్లు సరి చేయాలని కోరుతున్న దరఖాస్తు దారులుఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నంగనూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గాండ్ల రాజు. ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. తీరా.. రాజు సతీమణి హేమ పేరుతోపాటు కుమారులు గాండ్ల విశాల్, విహాన్ పేర్లు సైతం అత్తంటి వారి కార్డులోనే ఉన్నాయి. అధికారులను అడిగితే మాకు తెలియదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులుస్పందించి మా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇలా వీరి ఒక్కరిదే కాదు.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో పలువురి పరిస్థితి ఇలాగే ఉంది.విచిత్ర పరిస్థితి పెళ్లయిన మహిళలు భర్తతో నూతన రేషన్ కార్డు కావాలని తమ చిన్నారులతో సహా దరఖాస్తు చేశారు. అలాగే కొత్త కార్డుల కోసం పెళ్లయిన యువకులు సైతం తమ పేర్లను తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగించుకుని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి పేర్లు అత్తగారి రేషన్ కార్డులో తమ చిన్నారులతో సహా నమోదయ్యాయి. ఇలా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఆన్లైన్లో సిబ్బంది చేసిన తప్పా? లేక టెక్నికల్ సమస్యతో ఇలా నమోదు అయ్యాయా? అని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పులను సరి చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కోరుతున్నారు. -
దూరంగా ఉండటంతో నిరుపయోగం
● రోడ్డుపక్కన కూరగాయల విక్రయాలు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● చిన్నతిమ్మాపూర్లో వ్యాపారుల అగచాట్లు కూరగాయలు అమ్ముకునే వారి జీవనానికి ఉపయోగపడాల్సిన ‘విలేజ్ మార్కెట్’లు అలంకార ప్రాయాలుగా మారుతున్నాయి. సరైన స్థలంలో నిర్మిస్తే అమ్మకందారులకు, కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. కాని ములుగు మండలం చిన్నతిమ్మాపూర్(వంటిమామిడి)లో మార్కెట్ను ఓ మూలన నిర్మించారు. దీంతో ఆ విలేజ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. ములుగు(గజ్వేల్): ములుగు మండలం వంటి మామిడి నుంచి తున్కిబొల్లారం మార్గంలో చిన్నతిమ్మాపూర్ వద్ద రోడ్డుపక్కనే కూరగాయల విక్రయాలు నిర్వహిస్తారు. నిత్యం వాహనాల రద్దీ ఉండటంతో వారంతా ప్రమాదాల నీడలోనే కూర గాయలు అమ్ముకొనేవారు. అయితే వారి కోసం రూ.15లక్షల ఈజీఎస్, పంచాయతీ నిధులు వెచ్చించి యేడాదిన్నర క్రితం ‘విలేజ్ మార్కెట్’ నిర్మించారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో అంతర్గత రోడ్డులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా మార్కెట్ షెడ్డు నిర్మించారు. గ్రామపంచాయతీకి ఆదాయం, కూరగాయల విక్రేతలకు ప్రయోజనం కలిగించే ఈ మార్కెట్ సముదాయంలో దుకాణాలను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. దీంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.ఆవరణంతా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. శిథిలావస్థకు చేరుకుంటోందని స్థానికులు వాపోతున్నారు. చిన్నతిమ్మాపూర్లో వృథాగా ఉన్న విలేజ్ మార్కెట్ ప్రాంగణం బస్షెల్టర్లో కూరగాయల సామగ్రి గ్రామానికి చెందిన కూరగాయల అమ్మకందారులకు ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో రోడ్డుపక్కనే వారు విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వారు ప్రయాణికుల కోసం నిర్మించిన బస్షెల్టర్ను కూరగాయల అడ్డాగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన తీర్మానం రోడ్డుపక్క కూరగాయలు విక్రయించుకునే వారికోసం ఈజీఎస్, జీపీ నిధులతో విలేజ్ మార్కెట్ నిర్మింపజేశాం. అందులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకుగాను నెల వారీ అద్దె ప్రాతిపదికన దుకాణాలు కేటాయించాలని తీర్మానం కూడా చేశాం. – హంస మహేశ్, మాజీ సర్పంచ్ వినియోగంలోకి తెస్తాం.. చిన్నతిమ్మాపూర్లో విలేజ్ మార్కెట్ వృథాగా ఉన్న విషయం వాస్తవమే. 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సౌల భ్యం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి మార్కెట్ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చూస్తాం. – మేరీ స్వర్ణకుమారి, ఎంపీడీఓ, ములుగు -
బారులుతీరిన వాహనాలు
హుస్నాబాద్రూరల్: యాసంగి కోతలు మొదలు కావడం.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లులకు ధాన్యం వాహనాలు బారులు తీరుతున్నాయి. పందిల్ల మిల్లు వద్ద ఆదివారం ఆధిక సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు దర్శనమిచ్చాయి. దిగుమతి చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి చేరిన ట్రాక్టర్ల యజమానులు క్యూలో నిరీక్షించారు. ఒక ట్రాక్టర్ ధాన్యం దిగుమతి చేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టడంతో ట్రాక్టర్ యాజమానులు మిల్లుల వద్దనే పడిగాపులు కాచారు. హమాలీల సంఖ్యను పెంచి దిగుమతి వేగంగా చేయాలని వారు కోరుతున్నారు. ట్రాక్టర్ యజమానుల పడిగాపులు -
ఐటీఐ.. అందుబాటులోకి
ఫలించనున్న ఏడేళ్ల కల ● నత్తనడకన సాగిన పనులు ● ఆగస్టు నుంచి ప్రారంభం ● నూతనంగా ఏటీసీ సెంటర్ ● ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆరు కోర్సులు దుబ్బాకటౌన్: పదో తరగతి పూర్తయిన విద్యార్థులను పారిశ్రామిక రంగంలో వృత్తి శిక్షణ కలిగిన నిపుణులుగా తయారుచేసి, వారికి ఉపాధి చూపించేలా ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్)ను ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2012లో దుబ్బాకలోని ఒక అద్దె భవనంలో ఐటీఐని ప్రారంభించారు. రూ.5 కోట్లతో.. ఐటీఐ భవన నిర్మాణానికి దుబ్బాక 16వ వార్డు పరిధిలో నాలుగెకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.5 కోట్లతో 2018లో మాజీ మంత్రి హరిశ్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాఽధి, కార్మికశాఖకు చెందిన నిధులతో జీ ప్లస్ఒన్ తరహాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. నత్తనడకన సాగుతూ.. ఆ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఏడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరాయి. దీని పక్కనే టాటాగ్రూపు సహకారంతో ఐటీఐ విద్యార్థులకు ఏటీసీ(అడ్వాన్డ్ టెక్నికల్ సెంట ర్– అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రం)ని నిర్మిస్తున్నారు. ఇది కూడా పూర్తయితే ఐటీఐ మరింత అప్గ్రేడ్ కానుంది. కాంట్రాక్టర్ జాప్యంతో పనులు నత్తనడకన సాగాయని, ఇప్పటికి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అంటే ఆగస్టు నాటికి ఐటీఐని అందుబాటులోకి తీసుకురావడానికి కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులు కృషిచేస్తున్నారు.ఆరు రకాల కోర్సులు ఐటీఐ భవనం, ఏటీసీ కేంద్రం అందుబాటులోకి వస్తే.. యేడాది వ్యవధిగల వివిధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. మ్యానుప్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్లో 20 సీట్లు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 20 సీట్లు, ఆర్టీయస్యన్ యూజింగ్ అడ్వాన్స్డ్లో 10 సీట్లు కొత్తగా రానున్నాయి. అలాగే రెండేళ్ల వ్యవధి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్(మెకానికల్)లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్లో 24 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్స్లోను సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఐటీఐ ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు. -
సీఎంకు పీపీ జీవన్రెడ్డి కృతజ్ఞతలు
సిద్దిపేటకమాన్: తనకు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అడ్వకేట్ జీవన్రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కోర్టుకు మొట్టమొదటి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాష్ట్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడడంతో పాటు నిందితులకు శిక్షలు పడే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ పత్రి ప్రకాశ్, ఖలిమొద్దీన్ పాల్గొన్నారు. -
నూతనోత్సాహం నింపిన వేడుకలు
● డీఈఓ శ్రీనివాస్రెడ్డి ● ఘనంగా జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవంవర్గల్(గజ్వేల్): ఉన్నత పాఠశాల వార్షిక వేడుకలు అందరిలో నూతనోత్సాహం నింపాయని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించిన స్థానిక జెడ్పీ హైస్కూల్ వార్షి కోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంగ్రా, లంబాడి, హర్యాన, కేరళ నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా వినియోగించుకున్నపుడే అద్భుత ఫలితా లొస్తాయన్నారు. పీఎం శ్రీ పథకం ద్వారా వర్గల్ స్కూల్కు అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వొకేషనల్ కోర్సులు, ఆధునిక వసతులు సమకూరాయని చెప్పారు. పాఠశాల రూపొందించిన ఈ–మేగజైన్, త్రైమాసిక ఆన్లైన్ ప్రగతి పుస్తకం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సునీత, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సూర్యరాజు, అమర్నాథ్, ఏఏపీసీ చైర్మన్ భవాని తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి వచ్చేలా కృషి
ఐటీఐ భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాంట్రాక్టర్ పనులలో జాప్యం వహించడం వల్ల ఆలస్యమైంది. ఈ ఆగస్టు నాటికి ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కేంద్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – వెంకటేశం, ఆర్అండ్బీ డీఈ, దుబ్బాక పెరగనున్న విద్యార్థుల సంఖ్య ఐటీఐ, ఏటీసీ భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించే కోర్సులు నేర్చుకొనే వీలుంటుంది. దీంతో వారు జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – కనకయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్, దుబ్బాక -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షం వల్ల నేలరాలిన మామిడి, పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్చెర్వుతుండా, రేగొండ గ్రామా ల్లో ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న మామిడితోటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంత రం మాట్లాడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి చెట్లు నేలకొరగడం తీరని నష్టమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతీసుకొని నష్టపరిహారం త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు. -
ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లి లోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠ, పల్లకిసేవ నిర్వహించారు. అనంతరం స్వామి కల్యాణాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్, హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామ మధిర కొండెంగలకుంట గ్రామ శివారులోని కుమ్మరికుంట గోదావరి జలాలతో నిండి మత్తడి దూకడంతో ఆదివారం గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. హరీశ్రావు ప్రత్యేక చొరవతోనే రంగనాయకసాగర్ నుంచి కాలువల ద్వారా కుమ్మరికుంట నిండిందని సంతో షం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా బీడుగా ఉన్న కుంట ప్రస్తుతం మండుటెండలో కూడా నిండు కుండలా మారడంతో హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాల్వ ఎల్లయ్య, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘనంగా ఆలయ వార్షికోత్సవం మిరుదొడ్డి(దుబ్బాక): అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లి ఆలయ రెండో వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాల జాతర, మంగళహారతులతో సామూహిక పూజలు చేశారు. ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం భక్తులు అన్నదానం చేశారు. చలివేంద్రం ప్రారంభం బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లెలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ సుజాత మాట్లా డుతూ తీవ్రమైన ఎండలతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దే శ్యంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటి ఏర్పాటుకు ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు గజ్వేల్రూరల్: భద్రాచల సీతారాముల కల్యా ణోత్సవంలో వినియోగించిన ముత్యాల తలంబ్రాలను గజ్వేల్ ప్రాంత భక్తులకు పంపిణీ చేసేందుకు ఆ ఆలయ అధికారులు రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామ కోటి రామరాజుకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ ఏఈఓ శ్రావణ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో రామకోటి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని, మూడేళ్లుగా తలంబ్రాలను గోటితో వలిచి అందించడం ఆనందంగా ఉందన్నారు. గజ్వేల్ ప్రాంత భక్తులకు అందించేందుకు 100 కిలోల తలంబ్రాలను అందజేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డికొమురవెల్లి(సిద్దిపేట): మండలంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆది వారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలోని పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక సాయం అందిండటం, అలాగే క్రీడాకారులకు ప్రో త్సాహకాలు అందించడం సంతోషంగా ఉంద న్నారు. అదే విధంగా మండలంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించడం గొప్పవిషయమని కొనియాడారు. భవిష్యత్లో ఫౌండేషన్ సేవలు మరింత ఎక్కువ మంది కి అందేలా చూడలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్రెడ్డి, కిషన్, మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, శ్రీధర్, నర్సింహులు, స్వామి, వంశీధర్రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘వక్ఫ్’పై బీఆర్ఎస్ వైఖరి ప్రకటించాలి
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్ఎస్ వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో తెలపాలన్నారు. దేశంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన 4 శాతం రిజర్వేషన్ ఇప్పటికీ అమలు అవుతోందని చెప్పారు. కేవలం ఎన్నికలప్పుడు ముస్లింల ఓట్లు దండుకునేందుకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ పదేళ్లపాటు కాలయాపన చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్ ముస్లింలపై ప్రేమ కురిపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో బీఆర్ఎస్ సహకరిస్తోందని, ఆ రెండు పార్టీలు తోడుదొంగలేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజొద్దీన్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సలీం, ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కార్యకర్తల కూలి పనులు
నంగునూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం గట్లమల్యాలలో కూలి పనులు చేశారు. గ్రామానికి చెందిన బుద్ది తిరుపతి చేనులో బస్తాలు మోయగా రూ.5వేలు, అలాగే పుట్ట మధు రూ.5వేలు అందజేశారు. కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రకాశ్రెడ్డి, బాబు, వెంకటయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, భిక్షపతి, పరశురాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిడిశెట్టి రాజు కొమురవెల్లి మల్లన్న ఆయలంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లిబెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గుగ్గిల్ల, దాచారం, కల్లెపెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. అంతరం మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5.56 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీ డీఓ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, చేప్యాల శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్, కుమార్, నర్సయ్య, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
వైభవం.. బొడ్రాయి వార్షికోత్సవం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరులో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా దూసకంటి రాజేశ్శర్మ, నవీన్శర్మ, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇండ్ల వద్ద నుంచి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో తరలివెళ్లి బొడ్రాయి, పోచమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
‘విశ్వావసు’ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వవాసు తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో దేవాదాయశాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి శనివారం ఆవిష్కరించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగులు, అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈఓ విశ్వనాఽథ్శర్మ, బుగ్గ రాజేశ్వరిస్వామి ఆలయ ఈఓ శ్రీధర్రెడ్డి, చైర్మన్ అమరేశ్ విష్ణు, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, చంద్రకుమార్, రాంరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత గజ్వేల్రూరల్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుజాత, దేవదాసు అన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు శంషాబాద్ పరిధిలోని కర్తల్లో శనివారం జరిగిన ‘యూత్ లీడర్స్ కాన్ల్కెవ్ ఫర్ బెటర్ ఎర్త్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు పోస్టర్ ప్రెజంటేషన్ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై వివరించారు. ప్రొఫెసర్లు పురుషోత్తంరెడ్డి, బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. జంతు జాలాన్ని రక్షించుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీనష్టం దుబ్బాకటౌన్: అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పదని అగ్నిమాపకశాఖ అధికారి కమలాకర్ హెచ్చరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం సినిమా థియేటర్లో ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్కంచారు. లీడింగ్ ఫైర్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్కు దారేది? హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేదారి లేకుండా అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన మున్సిపల్ భవనం వద్ద అధికారులు బ్యారి కేడ్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీని వల్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను ఎండలోనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్రెడ్డి, నవీన్, జగ్జీవన్, వికాస్, అరవింద్ పాల్గొన్నారు. హరీశ్రావు పరామర్శ సిద్దిపేటరూరల్: మండలంలోని చింతమడక గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త వాతపు సత్యనారాయణ భార్య రామలక్ష్మి ఇటీవల క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ తదితరులు ఉన్నారు. -
సిబ్బందిని నియమిస్తాం..
పిల్లల పార్కులు, ఉద్యాన వనాలను మెరుగుపరిచేందుకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటాం. నిధుల లభ్యతను బట్టి సౌకర్యాలు కల్పిస్తాం. వాటి నిర్వహణకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక మరమ్మతులు చేపట్టాలి పట్టణంలో రామసముద్రం చెరువు కట్టపై పార్కులో ఆట వస్తువులు విరిగి పోవడంతో చిన్నారులు నిరాశ చెందు తున్నారు. విరిగిన ఆట వస్తువులకు మరమ్మతులు చేయించాలి. అలాగే ఉయ్యాలలను తిరిగి ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, దుబ్బాక -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీడీపీఓ శారదచిన్నకోడూరు(సిద్దిపేట): గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టడంతోపాటు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలన్నారు. గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలోనే ఒక పూట భోజనం తినాలని, పిల్లలకు బాలామృతం తినిపించాలని సూచించారు. పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, సామూహిక సీమంతాలు చేశారు. ఎంపీడీఓ జనార్దన్, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.. హుస్నాబాద్రూరల్: గర్భిణులు పోషకాహారం తీసు కుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారి తిరుమల అన్నారు. పందిల్లలో నిర్వహించిన పోషక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని పోషకాలు కలిగిన ఆహారం గురించి అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకొంటే పిల్లల ఎదుగలలో లోపాలు ఉండవని, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యుడు అశోక్, అంగన్వాడీ టీచర్లు శారద తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఎదుగుదల బెజ్జంకి(సిద్దిపేట): పౌష్టికాహారాన్ని అందించినపుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని హుస్నాబాద్ సీడీపీఓ జయమ్మ అన్నారు. మండలంలోని బేగంపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సూపర్వైజర్ నాగరాజు, తోటపెల్లి వైద్యాధికారి కృష్ణతేజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ముండ్రాయి సెక్టార్లో.. నంగునూరు(సిద్దిపేట): గర్భిణులు వైద్యులు సూచించిన వాక్సిన్లు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సీడీపీఓ శారద సూచించారు. ముండ్రాయి సెక్టార్లో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో వండిన పదార్థాలను ప్రదర్శించి వాటి లాభాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, సూపర్ వైజర్ స్వరూప, హెచ్ఓ స్వామి, అనురాధ, సౌమ్య, రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకమని డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్లో శనివారం నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు బోధనల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, కార్యక్రమ నిర్వాహకులు రూబెన్, బాపురెడ్డి, ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సమీర్, మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లో ర్యాలీ హుస్నాబాద్: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో క్రైస్తవులు, పాస్టర్లు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ల కమిటీ అధ్యక్షుడు సాల్మన్ రాజ్, మలాకీ, రత్నకుమార్, ఇస్సాక్, తిమోతి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం
● విరిగిన పరికరాలు, పాడైన సామగ్రి ● పట్టించుకోని అధికారులు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులు, ఉద్యానవనాల నిర్వహణ కరువైంది. దుబ్బాకలో పార్కులను అభివృద్ధి చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై కన్నెత్తి చూడకపోవడంతో అధ్వానంగా మారాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆట పరికరాలు, ఇతర సామగ్రి పాడవుతోంది. దుబ్బాకటౌన్: పట్టణ కేంద్రంలో ప్రజలు సేద తీరేందుకు రామసముద్రం చెరువుకట్ట మీద చిల్డ్రన్ పార్క్ను, 18వ వార్డులో ఉద్యానవనం, దుంపలపల్లి 4వ వార్డులో ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశారు. నిర్వహణ శూన్యం లక్షల రూపాయల నిధులతో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్కుల్లో ఆహ్లాదం లేకుండా పోయింది. పార్కు చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో కట్టపై ఓపెన్ జిమ్ వద్ద ప్లాట్ఫామ్ ధ్వంసమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలుమండిపడుతున్నారు. విరిగిన ఆట వస్తువులు పట్టణ సుందరీకరణలో భాగంగా రామసముద్రం చెరువు కట్టపై 2019లో రూ.50 లక్షల ఎస్ఓఎఫ్ నిధులతో నిర్మించిన పిల్లల పార్కు విరిగిన ఆట వస్తువులతో దర్శనమిస్తోంది. గుర్రపు బొమ్మలు, జారుడు బల్లలు, ఉయ్యాలలు విరిగిపోయాయి. కొన్నింటిని మందుబాబులు చెరువులో పడేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబులకు అడ్డాగా మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డులో 2022లో రూ.4 లక్షలు వెచ్చించి ఫ్రీడమ్ పార్కు నిర్మించారు. అందులో వివిధ రకాల మొక్కలు నాటి, జాతీయజెండా రంగులో టైర్లతో కుర్చీలు, ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోవడంతో పశువులకు మేతగా మారాయి. పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ విరిగిపోయి, సిమెంటు దిమ్మెలు ధ్వంసమయ్యాయి. పార్కులో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమిస్తున్నాయి. రామసముద్రం కట్టపై పిల్లల పార్కు -
పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాకటౌన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. రాయపోల్ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 27న జరిగే సభకు ప్రజలు చీమల దండులా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొండపాక(గజ్వేల్): రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఎద్దేవా చేశారు. కుకునూరుపల్లి, దుద్దెడలోని ప్రైవేటు పంక్షన్ హాళ్లలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ నిర్వహణ కోసం శనివారం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంలా ప్రజలు కొలుస్తున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నిర్వహించినది రాజ్యాంగ పరిరక్షణ పోరుయాత్ర కాదని ముఖ్య నేతల పదవులను కాపాడుకునేందుకు నిర్వహించిన పోరుబాట అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీరు విడుదల చేయకుండా లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొట్టి రైతులను ఆగం చేసిందని వాపోయారు. ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కోరారు. అనంతరం బహిరంగసభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్రెడ్డి, రవీందదర్, అమరేందర్, దుర్గయ్య, కుమార్, శ్రీనివాస్, కనకయ్య, భగవాన్, శ్రీనివాస్, కిరణ్కుమార్చారి, శ్రీనివాస్, ఐలయ్య, ఎల్లం, లక్ష్మణ్రాజ్, హైమద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నీరజ్కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్సుఖ్నగర్లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్సింగ్లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీ ఘటనలు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో సైతం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థులకు ఏఐ బోధన
మిరుదొడ్డి (దుబ్బాక): విద్యలో వెనుకబడిన విద్యార్థుల స్థాయి పెంపునకు ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ బోధన దోహద పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి, విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్, గణితంపై అసెస్మెంటన్లు ప్రాక్టీస్ చేయించారు. అనంతరం పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. అలాగే లింగుపల్లి ప్రాథమిక పాఠశాల, చెప్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి డైట్ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ ఫిజికల్ వెరిఫికేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ బాబు, ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు బాలకిషన్ , శ్రీనివాస్ పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దు బెజ్జంకి(సిద్దిపేట): వరి ధాన్యం విక్రయాల కోసం దళారులను ఆశ్రయించవద్దని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య రైతులకు సూచించారు. బెజ్జంకి ఏఎంసీ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ, తాలు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. వడ్లను తూర్పార బట్టే మిషన్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం కుడుతున్న యూనిఫామ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఎం నర్సయ్య, సీసీలు సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనర్సింహ స్వామి ఆదాయం 4.80 లక్షలు బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.4 లక్షల 80 వేల 276 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ తెలిపారు. ఎండోమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం హుండీ తెరిచారు. మార్చి 23 తేదీ నుంచి నేటి వరకు హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ఆదాయంతో కలుపుకొని మొత్తం జాతర ఆదాయం రూ.14 లక్షల 9వేల 990 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శర్మ, పూజారి మధుసూదనాచారి, ఏఎస్ఐ శంకర్రావు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ డయాలసిస్ సెంటర్కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు దుబ్బాక: ఉత్తమ సేవలు అందించినందుకు గాను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు లభించింది. అపెక్స్ కిడ్నీ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై దుబ్బాక కిడ్నీ సెంటర్కు అవార్డును అందించింది. 2023 మార్చ్ 5న దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఐదు బెడ్స్తో డయాలసిస్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సెంటర్లో 8200 డయాలసిస్ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, డయాలసిస్ ఇన్చార్జ్ శేఖర్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఎండు గంజాయి స్వాధీనం
● నలుగురు రిమాండ్ మునిపల్లి(అందోల్): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. బీదర్ నుంచి హైద్రాబాద్కు వెళ్తున్న కారులో 130 గ్రాముల ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వత్సల్ రామ్శెట్టి, ఆకాశ్, అజయ్ దేశ్ముఖ, సోహెల్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్నాయక్, పోలీస్ సిబ్బందిని కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. అలాగే కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై రియాజ్ పాషా, రేహాన్, సోఫి యాన్, ఆసిఫ్ 110 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించాం. రియాజ్ పాషా, రేహాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. కంది శివారులో ఐదు కిలోలు కంది(సంగారెడ్డి): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. మండల కేంద్రమైన కంది శివారులో సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో 5 కిలోల ఎండు గంజాయి దొరికింది. కాశీపురం ఆంజనేయులుగా గుర్తించి కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐపేర్కొన్నారు. విషపు ఆహారం తిని.. ● మూడు ఆవులు మృతి హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మున్సిపాలిటీ వద్దు జిన్నారం(పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీ చేయొద్దని డిమాండ్ చేస్తూ జిన్నారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం మందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిన్నారంను మున్సిపల్ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతులు నష్టపోతారని వివరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు. శబ్ద గ్రంథాలయాలు దివ్యాంగులకు ఉపయోగం కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: శబ్ద గ్రంథాలయాల్లో ఆడియో పుస్తకాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో కంటిచూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధులు,ట్రాన్స్జెండర్స్ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...దివ్యాంగులు కూడా మిగతా వారితో సమానంగా విద్యను సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. ఈ లైబ్రరీ ద్వారా చదువును వినిపించి, దివ్యాంగులకు విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డీసీపీఓ రత్నం, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ ప్రసాద్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1న జహీరాబాద్ నుంచి రైలులో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఇప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి వృద్ధుడు మిరుదొడ్డి (దుబ్బాక ): వృద్ధుడు అదృశ్యమైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై బోయిని పరశురామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వనం యాదయ్య(55) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. 14న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లపల్లిలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధి గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుల్ల మల్లేశం 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. తిరుపతికని వెళ్లి వ్యక్తి -
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు ● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పంట నష్ట పరిహారం ఏది? వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే! మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు.2 ఎకరాలు ఎండింది వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే. – దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా రూ.5 లక్షల వరకు నష్టం గాంధీనగర్లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది. – మాదాడి రాజేశ్వర్రావు, గాంధీనగర్ హుస్నాబాద్ -
బాలసదనంలో లీగల్ అవేర్నెస్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాలసదనంలో గురువారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతి రెడ్డి హాజరై పిల్లలకు చట్టాలు, చదువు విలువ గూర్చి వివరించారు. సమస్యలు ఉంటే 15100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. బాలసదనంలో ఉన్న పిల్లల యోగ క్షేమాల గూర్చి ఆరా తీశారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటగది, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆమె శిశు కేంద్రాన్ని సందర్శించారు. -
5.33 గంటలు.. 40 కిలో మీటర్లు
మొక్కు చెల్లించడానికి పరుగెత్తారు దుబ్బాకటౌన్: అనుకున్న లక్ష్యానికి, దైవ భక్తికి ఏ ఆటంకం ఎదురు రాదని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కమ్మరి సాయి వర్ధన్, దుంపలపల్లికి చెందిన దొందడి రాకేశ్ నిరూపించారు. ఇటీవల భారత ఆర్మీ (అగ్నివీర్)కి సాయి వర్ధన్, రాకేశ్ ఎంపికయ్యారు. గురువారం ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించడానికి స్వగ్రామం నుంచి 40 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 33 నిమిషాల్లో పరుగెత్తి ఆలయాన్ని చేరుకున్నా రు. కాగా సాయివర్ధన్ గతంలో ఆర్మీ సెలక్షన్లో రెండు సార్లు విఫలమయ్యాడు. దీంతో ఈసారి ఎంపిక కావాలని పట్టువదలని విక్రమార్కుడిలా రోజు ఉదయం గ్రౌండ్లో చెమటోడ్చి అనుకున్న లక్ష్యం సాధించాడు. -
ఆర్ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి అరుదైన గౌరవం ● వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలు సాగు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లోని పీజేటీఏయూలో గురువారం ఆర్ఈఏసీ సమావేశం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. -
అప్పుల బాధ తాళలేకవ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జహీరాబాద్ మండలంలోని అల్గోల్కు చెందిన ఉప్పరి వెంకట్(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం పనులు చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో అప్పు బారిన పడ్డాడు. భూమి తాకట్టుపెట్టి కొంత అప్పులు తీర్చాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బాధ భరించలేక గురువారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో వలస కూలీ రామచంద్రాపురం(పటాన్చెరు): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అసోం రాష్ట్రానికి చెందిన బిషాల్(30) జీవనోపాధికి తెల్లాపూర్ మున్సిపల్కు వలసొచ్చాడు. ఆరు నెలలుగా కొల్లూరులోని కారు వాషింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. గురువారం తెల్లావారుజామున కారు వాషింగ్ షెడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు షెడ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..
● ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్ మండలంలో ఘటననారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్ మండలం శాఖాపూర్కు చెందిన గడ్డమీది అశోక్ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేశాడు. ట్రాక్టర్ను తోలుకుంటూ అశోక్ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న రైతు అశోక్ ట్రాక్టర్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్ శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి చిన్నశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గజ్వేల్రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్(26) బైక్పై ప్రజ్ఞాపూర్ నుంచి తీగుల్ వైపు వస్తున్నాడు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
స్వాతంత్య్రోద్యమం కోసమే ఆ పత్రిక
సంగారెడ్డి: స్వాతంత్య్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్ అని అటువంటి పత్రికపై విషం గక్కుతున్న బీజేపీని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని టీపీసీసీ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హెరాల్డ్ పుట్టినప్పుడు నరేంద్రమోదీ, అమిత్షా పుట్టనేలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీలది క్షమించే గుణమని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలది కుట్రల గుణమని చెప్పారు. రాహుల్ గాంధీకి, అమిత్షాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిగా చేయలేదో ఆర్ఎస్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద ధర్నాలో టీపీసీసీ జగ్గారెడ్డి సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ... -
పామాయిల్ సాగు అంతంతే!
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలుత సిద్దిపేటలో సాగు ● ఇప్పటి వరకు 4,515 మంది రైతులు.. 15వేల ఎకరాల్లో సాగు ● గతేడాది 10వేల ఎకరాల లక్ష్యానికి సాగైంది 3వేలు మాత్రమే ● ఈ ఏడాదైనా సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలి సాక్షి, సిద్దిపేట: పామాయిల్ను అంతంత మాత్రంగానే సాగు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సాగు చేస్తే వచ్చే లాభాలపై అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించి.. రైతులను అటు వైపు మళ్లించారు. ఏడాదిన్నర నుంచి అఽధికారులు , ప్రజాప్రతినిఽధులు అవగాహన కల్పించకపోవడంతో పాటు నీటి ఇబ్బందులతో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 15వేల ఎకరాల్లో సాగు.. తొలుత సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల తర్వాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్ సాగును ప్రారంభించారు. ఉమ్మడి మెదక్లో 4,515 మంది రైతులు, 15,134 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్, మెదక్, సంగారెడ్డిలలో ప్రైవేట్ కంపెనీలు అందజేస్తున్నాయి. గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉద్యాన శాఖ 10వేల ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించగా 3,110 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఇటీవల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సందర్శించిన అనంతరం అధికారులతో సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగు తక్కువగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అధికారులు సమన్వయంతో సాగుతూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో పామాయిల్ సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద రైతులను గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారిని పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడే విక్రయించుకొనే అవకాశం ఇప్పటికే సిద్దిపేటలో పామాయిల్ సాగవుతున్న పలు చోట్ల దిగుబడి ప్రారంభమైంది. గెలలు కోసి సిద్దిపేటలోనే విక్రయించి రైతులు ఆదాయం పొందారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులను పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తే ఎంతో మేలు జరగనుంది. ఎకరానికి రూ.50 వేల రాయితీ రైతులను ప్రోత్సహించేందుకు పలు రకాల సబ్సిడీని అందిస్తోంది. ఎకరం ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రూ. 50,600 రాయితీ ఇస్తున్నది. మొక్కలకు 80 శాతం సబ్సిడీ, అలాగే డ్రిప్ సిస్టమ్ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇలా 12.5ఎకరాల వరకు రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంది. అలాగే మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు కాత రాదు. ఈ సమయంలో మొక్కల సంరక్షణతో పాటు ఆయిల్ పామ్ అంతర పంట సాగు కోసం ప్రభుత్వం రూ.4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. ఈ సాగుతో నాలుగేండ్ల తర్వాత నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంటాలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద -
రాజకీయంగా ఎదుర్కోలేకే కక్ష సాధింపు
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేకే గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, ఆరపల్లె జంక్షన్ల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీబీఐ, ఈడీలపై ఆధారపడి బీజేపీ సర్కార్ను నడుపుతోందన్నారు. బీజేపీ బలహీనపడే సందర్భంలో పార్లమెంట్లో, బయట నరేంద్రమోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నార న్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండి, ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచి పద్ధతి కాదన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందన.. హుస్నాబాద్రూరల్: గ్రామీణ క్రీడల్లో రాణించి హుస్నాబాద్కు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ ట్రోఫీని గెలుపొందిన పోతారం(ఎస్) కృష్ణ కబడ్డీ క్లబ్ జట్టును గురువారం మంత్రి అభినందించారు. ఈ నెల 11, 12, 13న గజ్వేల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ట్రోఫీని పోతారం జట్టు గెలువడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలని కోచ్ కృష్ణకు సూచించారు. -
రైతులను ఆదుకుంటాం
● అకాల వర్షంతో తీరని నష్టం ● ఎకరాకు రూ.10వేల పరిహారం ● మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ కుటుంబాన్ని కేంద్రం వేధిస్తోంది● విచారణ పేరిట రాక్షసత్వం తగదు ● మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలం పంతుల్తండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి బుధవారం పరిశీలించారు. అలాగే అక్కన్నపేట, గొల్లకుంట, అంతక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎకరాకు రూ.10వేల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన వల్ల కూరగాయాల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తోందన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులందరూ ఆయిల్పామ్ తోటలు పెట్టాలని, పంట సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే కూరగాయాల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు అయిలయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కరంటోతు రవీ, నాయకులు పాల్గొన్నారు.హుస్నాబాద్: సోనియా గాంధీని విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంఽధీలపై ఈడీ చార్జిషీట్లను నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ధర్నా చేపట్టారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్య్రం కోసం పని చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దేశంలో అనేక మంది నిరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు ఎల్ఐసీ, ఎయిర్పోర్ట్, రైల్వేలు, అన్ని ఆర్థిక సంస్థలను అదాని, అంబానీలకు అప్పగిస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంట ప్రజలు ఉన్నారని, దేశమంతా ముక్తకంఠంతో మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ధర లేదని పొగాకు పారబోత
దుబ్బాకరూరల్: పొగాకుకు మద్దతు ధర లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు రోడ్డుపై పారబోశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అప్పనపల్లి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు పొగాకును తీసుకు వచ్చి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తారు. గత ఏడాది పొగాకు ధర క్వింటాలుకు రూ.15వేలు ఉండేది. ప్రస్తుతం రూ.6వేలుకు పడిపోయింది. తేమ, రకం బట్టి పొగాకుకు మద్దతు ధర కేటాయిస్తున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుతం భారీగా ధర పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకును విక్రయించడానికి వచ్చిన ఓ రైతు కనీస మద్దతు ధర లేక పోవడంతో ఆవేదన చెందాడు. కనీసం మద్దతు ధర లేక పోవడంతో ఆగ్రహంతో తాను తెచ్చిన పొగాకును రోడ్డుపై పారబోశాడు. పంటకు పెట్టిన పెట్టుబడి రావడం లేదని కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దళారుల బారిన పడకుండా పొగాకుకు మద్దతు ధర కేటాయించాలని రైతులు కోరారు. -
ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలి
గజ్వేల్రూరల్: మండల పరిధిలోని పలు ఆయిల్పామ్ తోటలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండలంలోని బూర్గుపల్లి, అక్కారం గ్రామాల్లోని ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 66,546 మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగవుతున్నట్లు తెలిపారు. 329 మంది రైతులు 322.83టన్నుల ఆయిల్పామ్ దిగుబడి సాధించారన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాలలో, మర్కూక్ మండలాల్లో ఆయిల్పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో నంగునూరు, నర్మెట్టలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.21000 వరకు ఉందని, రైతులు పంట సాగుచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, అదనపు డైరెక్టర్(హార్టికల్చర్) సరోజినిదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వేసవిలో ఎక్కువ నీరు అందించాలి కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో ఆయిల్పామ్ మొక్కలకు ఎక్కువ నీరు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డాక్టర్ పొన్నుస్వామి సూచించారు. బుధవారం మండలంలోని గురువన్నపేటలో పలు అయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్లో అంతరపంటగా అరటి, మునగ వేసుకోవడం వల్ల మొదటి మూడేళ్లు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని దేవి, జిల్లా అధికారి సువర్ణ, అయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో తోటలను సందర్శించిన కేంద్ర బృందం -
జీవనోపాధికి చేయూత
డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడంతో పాటు పేదలకు జీవనోపాధి కల్పించడమే వాటర్ షెడ్ పథకం లక్ష్య మని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. బుధవారం చౌడారంలో వాటర్ షెడ్ యాత్ర నిర్వహించారు. అలాగే జీవనోపాధి కింద నెలకొల్పిన పలు యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వర్షపు నీరు వృథాకాకుండా ఈ పథకం ద్వారా కందకాలు, రాతికట్టడాలు, చెక్డ్యామ్లు నిర్మించుకోవచ్చన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వృథా నీటిని భూమిలో ఇంకేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 311 మందికి రూ.1.54 కోట్ల రుణాలు వీఓల ద్వారా మహిళల జీవనోపాధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రాధిక, అదనపు పీడీ బాలకిషన్, డీపీఎం కరుణాకర్, ఏడీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ జనార్దన్, వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ నూరొద్దిన్, ఎంపీఓ సోమిరెడ్డి, ఏపీఓ స్రవంతి, ఏపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. సామర్థ్యాలను పెంచేందుకే ఏఐ బోధన: డీఈఓచిన్నకోడూరు(సిద్దిపేట): విద్యలో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ బోధన ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం రామంచ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు చేస్తున్న ఏఐ టూల్స్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంతో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లో నెట్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలల రికార్డులు, మధ్యాహ్న భోజనంతో పాటు ఆవరణలో నాటిన పండ్ల మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, హెచ్ఎంలు సత్తవ్వ, అబ్దుల్ షరీఫ్, ఉపాధ్యక్షు లు భాస్కర్, సురేష్కుమార్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గజ్వేల్రూరల్: లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండల పరిధిలోని గిరిపల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి ఆటంకంలేకుండా ఇళ్లకు ఇసుక సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ చంద్రకళను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, పంచాయతీరాజ్శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 23న మున్సిపల్ షెటర్లకు వేలందుబ్బాకటౌన్: పట్టణంలో మూడు చోట్ల ఉన్న 26 మున్సిపల్ షెటర్లకు ఈనెల 23న అద్దె ప్రాతిపాదికన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న 16 షెటర్లకు, శాస్త్రి విగ్రహ సమీపంలో ఉన్న ఆరు షెటర్లకు, డబుల్ బెడ్రూం సమీపంలో ఉన్న 4 షెటర్లకు వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు పోచమ్మ సమీపంలో ఉన్న షెటర్లకు రూ. 50 వేలు, మిగతా రెండు చోట్ల ఉన్న షెటర్లకు రూ.25వేల డీడీ తీసి దరఖాస్తు ఫారంతో ఈ నెల 22న కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
గజ్వేల్.. మరో టెర్మినల్!
రైల్వేస్టేషనే ప్రత్యామ్నాయం ● హైదరాబాద్లోని స్టేషన్లలో పెరిగిన రద్దీ ● ఈ ప్రాంతంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ● మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి.. ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే మహర్దశే గజ్వేల్ రైలు మార్గంరాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రత్యామ్నాయం కాబోతున్నది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరగడం, అభివృద్ధి పనుల పేరిట తరుచూ రైళ్లను మళ్లించాల్సి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గజ్వేల్ రైల్వేస్టేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయి, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది. గజ్వేల్: మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవునా ఈ న్యూ బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారుతోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 75కిలోమీటర్లకుపైగా పనులు పూర్తికాగా ప్యాసింజర్ రైలు కూడా నడుస్తోంది. గజ్వేల్ వరకు గూడ్స్ రైలు విజయవంతంగా నడుపుతున్నారు. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జోరుగా సాగుతున్నాయి. ‘గ్రాండ్ టంక్ లైన్’తో అనుసంధానం ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్లైన్కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్లాట్ఫామ్లను మూసేశారు. అంతేకాకుండా పలు రైళ్లను చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. కొన్ని నెలలపాటు ప్రయాణికులకు ఈ అసౌకర్యం తప్పేలా లేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేద్దామనే ఆలోచన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారుల్లో మొదలైంది. ఇలాంటి తరుణంలో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రాంతమే ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా స్టేషన్లలో రద్దీ పెరగటం వల్ల, మరిన్ని కొత్త రైళ్లను నడపడానికి అవకాశంలేని సందర్భాల్లో నగరానికి సుమారుగా 50కిలోమీటర్ల దూరంలోపే ఉన్న గజ్వేల్ నుంచి ప్రధాన రైళ్లు నడిపితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. ఇక్కడి నుంచే కొన్ని ప్రధాన రైళ్లు అంటే తిరుపతి, బెంగళూరు, ముంబై, షిర్డీకి రైళ్లను నడపవచ్చని సమాచారం. నగరంలో రద్దీ పెరగడం.. రైల్వే స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కొత్త రైళ్ల పయనం విజయవంతంగా సాగితే హైదరాబాద్ నగరవాసులేకాకుండా, ఇతర ప్రధాన ప్రాంతాలకు చెందిన వారు గజ్వేల్కు వచ్చి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ లెక్కన సహజంగానే గజ్వేల్ ప్రాంత ప్రాధాన్యం ఒక్కసారిగా పెరగనుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి, ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ పనులు మొదలైతే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది. అంతేకాకుడా ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి బాటలు పడే అవకాశముంది. భారీ, చిన్న తరహ పరిశ్రమలకు సంబంధించిన వస్తు ఎగుమతులు, దిగుమతులకు అవకాశం కలిగిన వ్యాపార రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. వీటన్నంటితోపాటు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి పర్యాటకం రంగం కూడా అభివృద్ధి చెందనుంది. గజ్వేల్ స్టేషన్ అభివృద్ధి అంశాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. -
అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు
డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ సిద్దిపేటకమాన్: కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో అవసరమైన వారికి రోజూ 20మందికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సర్జరీలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గర్భిణులకు ఆరోగ్య వైద్య సేవల నిమిత్తం 102 వాహనం ద్వారా ఇంటి నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, సైకియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, ఆర్ఏంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు మెదక్ జిల్లా డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్లో 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆలస్యమైతే నో ఎంట్రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రంలోని చేరుకోవాలన్నారు. పదికి 3.. ఇంటర్కు 5 కేంద్రాలు: జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షలకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం మెదక్(2), నర్సాపూర్(2), తూప్రాన్(1) చొప్పున మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారి పై చట్టం 25/1997 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వా డ్, ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారన్నారు. 5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఆయన ముందు చూపు వల్లే తెలంగాణ ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): అంబేడ్కర్ గొప్ప ఆదర్శనీయుడని, ఆయన ముందు చూపు వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్, పెద్దకోడూరులో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టారన్నారు. అందుకే కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారన్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేశారన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానాయకుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యరెడ్డి, కనకరాజు, సుభాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అదనపు సాయం మాటేమిటీ? గజ్వేల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనంగా సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్రావు మండిపడ్డారు. మండల పరిధిలోని గిరిపల్లిలో సోమవారం రాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడుతూ ఏ పథకం చేపట్టినా సమగ్రంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనపు సాయం అందిస్తామని గొప్పగా ప్రకటించగా... ఈ విషయాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు దళితబంధు సాయాన్ని రూ.12లక్షలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో వేడుకలు సిద్దిపేటజోన్: బోధించు.. సమీకరించు... పోరాడు అనే నినాదాలతో సంఘటితం చేసిన అంబేడ్కర్ చూపిన బాటలో మనమంతా పయనించాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం జరగాలంటే మహాత్మా గాంధీ, జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్రాం, బీఆర్ అంబేడ్కర్ వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడవాలన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయండి
గజ్వేల్: భారత దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్రం చేపట్టిన శ్రీఆపరేషన్ కగార్శ్రీను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గజ్వేల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతృత్వంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శ్రీఆపరేషన్ కగార్శ్రీవల్ల జరుగుతున్న నష్టాలను పోస్టుకార్డులో వివరిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అడవులను, అందులోని విలువైన ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీ ప్రజలు నక్సలైట్లకు అండగా నిలుస్తున్నారని సాకుగా చూపి వారిని ఏరివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వందల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ, అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తూ..అడవులను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామికవాదులు, ప్రకృతి ప్రేమికులను కేంద్ర ప్రభుత్వ చర్యలను గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగానే తాము దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఏ.రాంచంద్రం, గజ్వేల్ జోన్ కన్వీనర్ జే.శ్రీనివాస్, ఆ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల పోస్టుకార్డు ఉద్యమం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన నాయకులు -
అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీలో మంటలు
గోదాం దగ్ధం ● భయంతో పరుగులు తీసిన కూలీలు, రైతులు ● రూ. 1.50 కోట్ల నష్టం కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున దట్టమైన పొగలు, మంటలు ఎగసి పడటంతో గోదాంలో పని చేసే కూలీలు, సమీప వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మండల పరిధిలోని మర్పడ్గ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పడ్గ నుంచి ఖమ్మపల్లికి వెళ్లే దారిలో అర ఎకరం భూమిలో సుమారు రూ.2 కోట్లతో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీ అరటి పండ్ల గోదాం నిర్వహిస్తున్నారు. అరటి తోటల నుంచి కాయలను తీసుకువచ్చి కోల్డ్ స్టోరేజీలో పండ్లుగా మార్చుతారు. వీటిని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాలకు సరఫరా చేస్తుంటారు. సాయంత్రం వేళ గోదాంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు వచ్చాయి. బావుల నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు రూ.1.50 కోట్ల వరకు నష్టం జరిగిందంటూ గోదాం నిర్వాహకులు పేర్కొన్నారు. -
మల్లన్న సన్నిధిలో కాత్యాయనిదేవి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని ఐఏఎస్ అధికారి, స్టేట్ ఫైనాన్షియల్ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని దేవి కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదం, శేష వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలుమల్లన్న ఆలయ ఈఓ అన్నపూర్ణ కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడమేకాక, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. సోమవారం ఆమె ఆలయ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 50 వసతి గదుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. స్వామి వారి కల్యాణం నాటికి మేడలమ్మ, కేతలమ్మలకు స్వర్ణ కిరీటా లు అలంకరిస్తామని తెలిపారు. ఐదు అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ ఆలయ నిధులతో.. మిగతా అంతస్తులు దాత ల సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులుహుస్నాబాద్: నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను సోమవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్రెడ్డి, ఏజీపీ ఒగ్గోజు సదానందం, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధి లోని మందూరు, రాయపోల్, రామారం, గొల్లపల్లి, టెంకంపేటతో పాటు పలు గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం కిషన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీలు రాజేశ్వర్రావు, కిష్టయ్య, ప్రవీణ్, రవీందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు పాల్గొన్నారు. -
ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!
ఫోన్ నెట్ సాయంతో.. పక్క చిత్రంలో కనిపిస్తున్నది తొగుట మండల పరిధి.. కాన్గల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్. ఫోన్ నెట్తో ఏఐ క్లాస్లను విద్యార్థులు వింటున్నారు. ఒక్కో సారి ఫోన్ సిగ్నల్ రాకపోవడం.. ఇంటర్నెట్ లేకపోవడంతో క్లాస్లకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో సీ గ్రేడ్లో 3వ తరగతిలో ఆరుగురు, నాల్గవ తరగతిలో ఇద్దరు, ఐదవ తరగతిలో నలుగురు ఉన్నారు. విద్యార్థులకు అందని క్లాసులు ● చదువులో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు ● పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా 47 పాఠశాలలో అమలు ● నెట్ సౌకర్యం లేకపోవడంతో తప్పని ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు ఇంటర్నెట్ అడ్డంకిగా మారింది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ఏఐ సాయంతో మెరుగైన సాధన కోసం చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కింద 47 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పలు చాలా వరకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో క్లాస్ అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వారానికి నాలుగు రోజులు.. 3 నుంచి 5వ తరగతిలో వెనకబడిన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాథ్స్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన క్లాస్లు వారానికి నాలుగు రోజులు ఏఐ ద్వారా చెప్పిస్తున్నారు. ఒక్కో క్లాస్ 20 నిమిషాల పాటు కంప్యూటర్లో ఆన్లైన్లో ఏఐ క్లాస్లు చెబుతున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్ను ఉపయోగించుకొని స్వయంగా వారే తెలుగు, ఇంగ్లిష్ భాషలో అక్షరాల గుర్తించే విధంగా కృషి చేస్తుంది. సరళ పదాలు, వారి స్థాయి మేరకు పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి ఏఐ దోహపడుతుంది. ఏఐ ద్వారా విద్యార్థులో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతంత మాత్రంగానే.. పలు పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని కారణంగా మొబైల్ నెట్ కనెక్షన్తో క్లాస్లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సెల్ ఫోన్ల సిగ్నల్ లేక కొన్ని పాఠశాలలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొదటి విడతలో ఏఐ క్లాస్ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తేనే సత్ఫాలితాలు వస్తాయి. అన్ని పాఠశాలలో ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేసి చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు మరింతగా చదివే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.స్కూల్ గ్రాంట్స్తో తీసుకోవాలి ఏఐ ద్వారా బోధనకు ఎంపికై న పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను స్కూల్ గ్రాంట్ నిధులతో తీసుకోవాలని ఆదేశించాం. పాఠశాలలను పరిశీలించి అన్నింటికీ ఇంటర్నెట్ ఉండేలా కృషి చేస్తాం. –శ్రీనివాస్ రెడ్డి, డీఈఓఫోన్ డేటా సాయంతోనే.. మా పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మా ఫోన్లతోనే ఇంటర్నెట్ను కనెక్ట్ చేసి విద్యార్థులకు ఏఐ ద్వారా బోధనను అందిస్తున్నాం. ఒక డెస్క్ టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లను వినియోగిస్తున్నాం. మరో మూడు డెస్క్ టాప్లను వినియోగించడం లేదు. పలు ప్రైవేట్ కంపెనీల ఇంటర్నెట్ వారిని నెట్ కోసం సంప్రదించాం. చాలా దూరం ఉండటంతో ఇవ్వలే మని చెబుతున్నారు. అయినా ప్రయత్నిస్తున్నాం. – మధు, హెచ్ఎం, కాన్గల్, ప్రాథమిక పాఠశాల -
విద్వేషకర పోస్టులుపెడితే కేసులు: సీపీ
సిద్దిపేటకమాన్: సోషల్ మీడియాలో విద్వేషకర, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ అలాగే మార్ఫింగ్ ఫొటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ పెడితే చర్యలు తప్పవన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించవద్దన్నారు. విద్వేషకర పోస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు కమిషనర్ కంట్రోల్ రూంనంబర్ 87126 67100కు సమాచారం అందించాలన్నారు. నిధులు మంజూరు చేయండికేంద్రమంత్రికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి బెజ్జంకి(సిద్దిపేట): పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహిపాల్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 24 గ్రామాలలో మౌలిక వసతుల కోసం రూ.2కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలిపాక రాజు, నాయకులు బుర్ర మల్లేశం, సతీష్రెడ్డి, అమర్ పాల్గొన్నారు. టెన్త్ మూల్యాంకనాన్ని పక్కాగా చేపట్టాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పక్కాగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు సలహాలు, సూచనలు అందించారు. మూల్యాంక కేంద్రం వద్ద విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరీక్షల సహాయ అధికారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గంగిరేణి చెట్టు, ఆలయ ముఖ మండపాలలో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు గుట్టపైన కొలువుతీరిన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాస్థానం ఈఓ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ఏ.భాస్కర్రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ది శ్రీనివాస్ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో వరంగల్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు.. రాహుల్ గాంధీని అశోక్ నగర్కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగపోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనబడడం లేదా వినబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన నిరుద్యోగ భృతి వట్టి మాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి యువత కీలకమని, రజతోత్సవ సభకు వరంగల్ వరకు వెయ్యి మంది యువత పాదయాత్ర చేయనున్నారని అన్నారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి వట్టిమాటేనా? ప్రభుత్వ తీరుపై హరీశ్ ఫైర్ -
సరికొత్తగా విత్తనోత్పత్తి
నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా.. విత్తనోత్పత్తి పథకాన్ని సరికొత్తగా చేపట్టడానికి రంగం సిద్ధమైంది. గతంలో చేపట్టిన పథకం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా, పథకం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ ఆగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో ముగ్గురు లేదా ఆపైన అభ్యుదయ రైతులను ఎంపిక చేసి విత్తనోత్పత్తి చేపట్టనున్నారు. వచ్చే జూన్లో ఈ పథకం అమలుచేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.వివరాలు పంపించాం కొత్తగా చేపట్టబోతున్న విత్తనోత్పత్తి పథకానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలు, రైతుల వివరాలు పంపించాం. పూర్తి సమాచారంతో కూడిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉన్నది. వస్తే దాని ప్రకారం ముందుకు సాగుతాం. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారిగజ్వేల్: వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో వానా కాలానికి సంబంధించి 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలే కీలకం. అదేవిధంగా యాసంగికి సంబంధించి 4లక్షల ఎకరాల మేర పంటలు సాగవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకం(సీడ్ విలేజ్) అమలు చేసిన సంగతి తెల్సిందే. వరి, మొక్కజొన్న, కంది, శనగ పంటల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా రైతులకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) 50శాతం సబ్సిడీపై అందించేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవాలి. కానీ దీని ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదు. ఫలితంగా పథకం అమలు నిలిచిపోయింది. నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యంగా.. ఈసారి పకడ్బందీగా పథకం అమలు చేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు మూల విత్తనం(ఫౌండేషన్ సీడ్) అందించి విత్తనోత్పత్తి చేపట్టనున్నది. ప్రతి గ్రామంలో ముగ్గురికిపైగా రైతులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన రైతు సుమారు ఎకరా విస్తీర్ణంలో విత్తనోత్పత్తి చేపడతారు. వ్యవసాయశాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. రైతులకు నాణ్యమైన మూల విత్తనం అందించడమేకాకుండా, ఎరువులు, క్రిమిసంహారకాలపై సబ్సిడీపై అందించే అవకాశముంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా ఒప్పందం జరగనుంది. రైతులకు లాభం చేకూరేలా ఈ ఒప్పందం ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ విధంగా నాణ్యమైన విత్తనాలను రాష్ట్రంలో పంపిణీ చేయనున్నారు. దీనిద్వారా ప్రైవేటు రంగంలో జోరుగా సాగుతున్న విత్తనోత్పత్తికి పోటీగా నిలవాలని భావిస్తున్నారు. మరో ముఖ్యవిషయమేమీటంటే విత్తనోత్పత్తి చేపడుతున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు విత్తనం వేసింది మొదలు.. ఉత్పత్తులు చేతికందేవరకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించి నాణ్యమైన విత్తనోత్పత్తికి బాటలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్పష్టతతో కూడా మార్గదర్శకాలు విడుదల కోసం వ్యవసాయశాఖ ఎదురుచూస్తోంది.ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతుల ఎంపిక వరి, కంది, పెసర తదితర రకాల ఉత్పత్తి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణ వచ్చే జూన్లో అమలుకు అవకాశం -
వడగళ్ల వాన బీభత్సం
అక్కన్నపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసి ముద్దయింది. చాలా వరకు ధాన్యం కొట్టుకుపోయింది. ఐదు రోజుల కిందటే అమ్మకానికి ధాన్యం తీసుకొచ్చినా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేయడంతో చేసిన కష్టం అంతా వర్షార్పణమైందని రైతులు వాపోయారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో చేతికందే వరి పంటలు సైతం నేలకొరిగాయి. అక్కన్నపేట, పంతుల్తండా, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో వడగళ్ల వానతో పలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
సోలార్!
విద్యుత్ చార్జీల మోతకు చెక్ ● సిద్దిపేటలో ప్రయోగాత్మకం వాటర్ పంపింగ్ కేంద్రాలే లక్ష్యంగా.. ప్లాంట్ల ఏర్పాటుకు సర్వే డీపీఆర్ రూపకల్పనలో అధికారులు ● 18న ఏజెన్సీ బృందం రాకబల్దియాల్లో విద్యుత్ వినియోగ చార్జీల బిల్లు గుదిబండగా మారుతోంది. ప్రతి నెలా పెద్ద పద్దు కింద రూ.లక్షలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ వినియోగం అనివార్యంగా మారడంతో చార్జీల మోత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం సౌరశక్తిపై దృష్టి సారించింది. జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సర్వే ప్రక్రియ చేపట్టి డీపీఆర్ను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేటలో సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. సిద్దిపేటజోన్: జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించే క్రమంలో పంప్ హౌస్, హై లెవల్ వాటర్, లో లెవల్ వాటర్ ట్యాంక్లు నిర్మించారు. అలాగే వీధి దీపాలు, ప్రధాన రహదారులపై వివిధ రకాల దీపాలు, కార్యాలయం నిర్వహణ నిమిత్తం ఇతర అవసరాలకు విద్యుత్ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం అవసరం కావడంతో దానికి అనుగుణంగా విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రతీసారి కష్టంగానే.. బల్దియా చెల్లింపు ప్రక్రియలో విద్యుత్ చార్జీల అంశం ప్రతి నెల పెద్ద సమస్యగా మారుతోంది. గతంలో కొన్ని మున్సిపాలిటీలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో సంబంధించిన శాఖ విద్యుత్ సరఫరాను తొలగించిన సంఘటనలు అనేకం. మున్సిపల్ ఆదాయ వనరులకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. సిబ్బంది, కార్మికుల వేతనాల చెల్లింపులు చిన్నపాటి మున్సిపాలిటీల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇలాంటి స్థితిలో విద్యుత్ చార్జీల అంశం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో సోలార్ ద్వారా అవసరమైన విద్యుత్ ఉత్పత్తితో కొంతమేరకు చార్జీల భారం తగ్గించే అవకాశం ఉందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సిద్దిపేటలో ప్రయోగాత్మకం.. జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసి దాని ఫలితాల మేరకు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలుకు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని సుమారు లక్షన్నర జనాభాకు అవసరమైన తాగునీరు సరఫరా కోసం పెద్ద ఎత్తున విద్యుత్ వాడకం చేస్తున్నట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి మానేరు నీటిని పంపింగ్ విధానం ద్వారా తరలించి ఆయా వార్డులకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు మంగోల్ నుంచి మిషన్ భగీరథ నీటిని పంపింగ్ జరుగుతోంది. ఈ లెక్కన పట్టణంలో 63 నీటి ట్యాంక్లు, కమ్మర్లపల్లి, ఇల్లంతకుంట పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ఫిల్టర్ బెడ్స్ లాంటి వాటి వినియోగం కోసం పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. కేవలం తాగునీటికి విద్యుత్ వాడకం కింద బల్దియా ప్రతి ఏటా రూ.5కోట్లు చెల్లించాల్సి వస్తోంది. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాలకు కోసం ప్రతి నెలా సుమారు రూ.80లక్షల కరెంట్ బిల్లు వస్తుంది. దీనిని అధిగమించేందుకు జిల్లా కేంద్రంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేట మున్సిపాలిటీలో సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.విద్యుత్ బిల్లులు ఇలా.. (రూ.లలో) మున్సిపాలిటీ ఏడాదికి.. సిద్దిపేట 9.60కోట్లు గజ్వేల్ 1.20 కోట్లు దుబ్బాక 60లక్షలు హుస్నాబాద్ 38లక్షలు చేర్యాల 36లక్షలు ప్రక్రియ వేగవంతం.. సిద్దిపేట మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సర్వే, డీపీఆర్ ప్రక్రియ వేగవంతం చేసేలా అడుగులు వేస్తున్నారు. కమ్మర్లపల్లి, ఇల్లంతకుంటలోని పెద్ద పంప్ హౌస్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో, అదేవిధంగా సిద్దిపేట నాసర్ పూర ఫిల్టర్ బెడ్, చింతల్ చెరువు, నర్సాపూర్ చెరువు ఎస్టీపీ ప్లాంట్లు, పట్టణంలోని 11 హై లెవల్ వాటర్,లో లెవల్ వాటర్, లో లెవల్ వాటర్ ట్యాంక్ ల వద్ద ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.జీరో పవర్ బిల్లే లక్ష్యం సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రతి నెల రూ.80లక్షల కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సోలార్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టి జీరో పవర్ బిల్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం డీపీఆర్ తయారీలో నిమగ్నమయ్యాం. సర్వే అనంతరం క్లారిటీ వస్తుంది. అవసరమైన విద్యుత్ను సోలార్ ద్వారా ఉత్పత్తి చేసే ఆలోచన ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. –ఆశ్రిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
వైద్య వృత్తి మహోన్నతమైనది
జ్యోతిప్రజ్వలన చేస్తున్న మంత్రి పొన్నంసిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సురభి స్నాతకోత్సవంలో మంత్రి పొన్నం -
అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు
గజ్వేల్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో మిషన్ భగీరథ నీటి కొరత తలెత్తడంతో సమస్య పరిష్కారానికి మినీ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారి విమర్శలను ఎక్కడికక్కడా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నేతలు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి -
అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్
సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్ /ప్రశాంత్నగర్(సిద్దిపేట): సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ సభ సందర్భంగా జనసమీకరణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ 25ఏండ్ల రజతోత్సవ కీర్తి, ఉద్యమానికి పురుడు పోసింది సిద్దిపేటేనని పేర్కొన్నారు. 27న పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వల్ల ఎంత వేగంగా అధికారంలోకి వచ్చిందో.. అంతే వేగంగా హామీల ఎగవేతతో ప్రజల్లో ఆదరణ పడిపోయిందన్నారు. సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం 40శాతం నూకలను ప్రజలకు ఇస్తోందని ఆరోపించారు. సిద్దిపేట పై ప్రభుత్వం కక్ష గట్టి నిధులను ఆపేసిందని ఆరోపించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, నాయ కులు రాజనర్స్, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ రాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని, హనుమాన్ మాలధారులతో కలిసి భిక్ష చేశారు. నెలాఖరులోగా న్యాక్ భవనం.. సిద్దిపేట అర్బన్: న్యాక్ భవనం పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మె ల్యే హరీశ్రావు ఆదేశించారు. మందపల్లి గ్రామ శివారులో నిర్మితమవుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) భవనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం అందుబాటులోకి వస్తే ఎల్అండ్టీ సంస యేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. -
కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు
జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. జాతర ఉత్సవాలకు సంబంధించిన 59 రోజుల అమ్మవారి హుండీని లెక్కించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్ నరేశ్, సిబ్బంది మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, హరి, చందు, చిన్నా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గింజకూ మద్దతు ధర డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి కొండపాక(గజ్వేల్): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్రావు, నాయకులు వెంకటేశంగౌడ్, సుదర్శన్, పర్శరాములు, ప్రభాస్, నరేందర్ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సాగు నీరు అందిస్తాం మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్, బెక్కల్ గ్రామాల రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. గండిమావరం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటిని గ్రామంలోని బయ్యన చెరువులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. కాలువ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన వెంటనే చేపట్టాలని శనివారం జిల్లా ఇరిగేషన్ డీఈ శ్రవణ్కు సూచించారు. అంతకుముందు కొండాపూర్ గ్రామంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి, కమలాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్బోర్డు బిల్లు రద్దు చేయాలి చేర్యాల(సిద్దిపేట): వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై యుద్ధం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి అందె అశోక్ అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని జనగామ–సిద్దిపేట రహదారిపై ముస్లింలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్బోర్డు బిల్లు తీసుకురావడం దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం విభజించి పాలన చేస్తున్నదని ఆరోపించారు. మతాల, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వక్ఫ్బోర్డు బిల్లును రద్దు చేయకుంటే భవిష్యత్తులో తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మజీద్, ముఖీమ్, భూమయ్య, యాదగిరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎంపీ రఘునందన్రావునంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముడ్రాయి, రాజగోపాల్పేట, వెంకటాపూర్, మైసంపల్లి, పాలమాకులలో వడగళ్ల వానతో దెబ్బ తిన్న రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాళ్ల వాన పడితే తాలు తప్ప గింజ మిగలదని తెలియని ఓ మంత్రి.. పొలంలో వరిని చూసి తాలు పండిస్తారా అని అవమానకర రీతిలో మాట్లాడడం బాధాకరమన్నారు. పంటలను పరిశీలించిన మంత్రి పరిహారం ఇమ్మంటే సొళ్లు కబురు చెప్పారని, ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. ఏఓ, ఏఈఓలు గ్రామాల్లో తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకొని నివేదిక పంపాలన్నారు. అలాగే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండలశాఖ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తిరుపతిరెడ్డి, రజినీకర్రెడ్డి, యాదమల్లు, శ్రీనివాస్, కృష్ణమూర్తి ఉన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి సిద్దిపేటజోన్ : సిద్దిపేట పట్టణంలోని 16, 31, 32 వార్డుల్లో గావ్ ఛలో, బస్టీ ఛలో కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల పై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సమయంలో ఉచితంగా టీకా, బియ్యం ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. -
స్కాన్ చెయ్.. టికెట్ తీయ్
సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు ప్రారంభమయ్యాయి. నగదు రహిత సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు జేబులో డబ్బు లేకున్నా ఆన్లైన్ (గూగుల్ పే, ఫోన్ పే) ద్వారా డబ్బులు చెల్లించి తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. ఇక నుంచి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య చిల్లర విషయంపై గొడవలు తలెత్తకుండా సమస్య పరిష్కారం కానుంది. సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం టి.రఘు తెలిపారు. ప్రస్తుతం పది డీలక్స్ బస్సుల్లో ప్రారంభం సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు ఉన్నాయి. వీటిలో పది డీలక్స్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజు సుమారు 39వేల కిలో మీటర్లు తిరుగుతూ ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. గతంలో టికెట్ చార్జీల చెల్లింపులకు సంబంధించి చిల్లర విషయంలో బస్ కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సులలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట ఆర్టీసీ డిపోలోని 10 డీలక్స్ బస్సులలో గురువారం డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించారు. టిమ్ యంత్రాల ద్వారా ప్రయాణికుల నుంచి ఆన్లైన్ (పోన్ పే, గూగుల్ పే) ద్వారా టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ప్రయాణం సులభతరం అవుతుందని పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీలక్స్ బస్సులు ప్రతి రోజు సిద్దిపేట నుంచి జేబీఎస్కు 20 ట్రిప్పుల ద్వారా 5వేల కిలోమీటర్లు తిప్పుతున్నారు. త్వరలో దశల వారీగా అన్ని బస్సులకు డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయనున్నామని, డిపోకు ఇప్పటికే 90 డిజిటల్ టిమ్ యంత్రాలు వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.డీలక్స్ బస్సుల్లో ప్రారంభమైన ఆన్లైన్ సేవలు సిద్దిపేట డిపోకు చేరుకున్న 90 డిజిటల్ టిమ్ యంత్రాలు దశల వారీగా అన్ని బస్సుల్లో ఏర్పాటు తీరనున్న చిల్లర కష్టాలు ఇక ప్రయాణం సులభతరంఆన్లైన్ పేమెంట్స్తో సులభం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ జేబీఎస్కు వెళుతున్నాను. టికెట్ చార్జీలు ఆన్లైన్ చెల్లింపులు చేయడం బాగుంది. గతంలో చిల్లర సమస్య తలెత్తేది. ప్రస్తుతం నగదు రహిత సేవల వల్ల టికెట్ తీసుకోవడం సులభమైంది. ఆన్లైన్ సేవలు బాగున్నాయి. – రాజు, ప్రయాణికుడుసద్వినియోగం చేసుకోవాలి సిద్దిపేట డిపోలోని డీలక్స్ బస్సులలో డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేశాం. ఈ బస్సులు సిద్దిపేట నుంచి జేబీఎస్ రూట్లో తిప్పుతున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించి సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు, సేవల ద్వారా చిల్లర సమస్య పరిష్కారం కానుంది. నగదు రహిత ఆన్లైన్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – టి.రఘు, సిద్దిపేట డిపో మేనేజర్ -
పామాయిల్ రైతుకు భరోసా
రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ పరిశ్రమసాక్షి, సిద్దిపేట: ఆయిల్ గెలల నుంచి ముడి నూనె తీయడంతోపాటు శుద్ధి చేసిన తరువాత ఆయిల్ ప్యాకెట్స్ రూపంలో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉండగా తాజాగా మూడోది తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి రానుంది. సాగుకు అనుగుణంగా ఫ్యాక్టరీ.. ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోంది. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్లను సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ ఫామ్లను ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో 64,325 మంది రైతులు 2,42,627 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీకి 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కాబోతున్న ఫ్యాక్టరీలో గంటకు 30టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభించనున్నారు. ఆయిల్ ఫామ్ గింజల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి ఫ్యాక్టరీ ఇది. వ్యర్థాలతో విద్యుత్ ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక్క యూనిట్కు రూ1.5 ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. కాలుష్య రహితంగా.. కాలుష్య రహితంగా ఉండేవిధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీ యూజ్ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. దీంతో భూగర్భజలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ఈ పరిశ్రమ దోహదపడనుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిశీలించారు. గెలల వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సిద్దిపేట జిల్లా నర్మెటలో 62 ఎకరాల్లో.. రూ. 300 కోట్లతో నిర్మాణం 64వేల మంది రైతులు 2.42 లక్షల్లో సాగు జూన్ చివరికి అందుబాటులోకి ఇక్కడే రిఫైన్డ్ ప్రస్తుతం అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, అప్పారావురావుపేటలో 90టన్నుల సామర్థ్యంతో పరిశ్రమలున్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ను హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఆయిల్ ఫెడ్కు పంపి అక్కడ రిఫైన్డ్ చేసి ప్యాకింగ్లో మార్కెట్లోకి పంపించేవారు. సిద్దిపేటలో ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ను తీసి అక్కడే రిఫైన్డ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ గంటకు 250 టన్నుల పామాయిల్ను ప్యాకింగ్ చేయనున్నారు. జూన్ చివరికి అందుబాటులోకి.. సిద్దిపేటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి వచ్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని జిల్లాలకు దగ్గరగా ఈ పరిశ్రమ ఉండటంతో రైతులకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న రెండు పరిశ్రమలలో టన్నుకు 19.4శాతం ఆయిల్ వస్తుంది. ఆయిల్ శాతం పెరిగితే రైతుకు మరింత ఆదాయం పెరగనుంది. – సుధాకర్ రెడ్డి, జీఎం, తెలంగాణ ఆయిల్ ఫెడ్ -
పనిమంతులు
అతివలే ‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువ● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు ● కూలీలు 11.29లక్షలు ● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు. నైపుణ్య శిక్షణ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.ఉపాధి పనులు చేస్తున్న కార్మికులు -
గొప్ప దార్శనికుడు పూలే
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సిద్దిపేటజోన్: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనులకు దశదిశగా నిలిచిన దార్శనికుడు జ్యోతిరావు పూలే అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను సమాజానికి తెలపాలని సూచించారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్ హమీద్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ రఘునందన్ రావు ఫొటో లేదని, ప్రొటోకాల్ ఉల్లంఘన అంటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. -
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం
కొండపాక(గజ్వేల్): పేదలు కడుపు నిండా అన్నం తినేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని చేపట్టిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో రేషన్కార్డు ద్వారా సన్న బియ్యం పొందిన లబ్ధిదారుడి ఇంట్లో శుక్రవారం భోజనం చేశారు. సన్న బియ్యం పథకం ఎలా ఉందంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా రేషన్ దుకాణాల ద్వారా 5,775 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కాయ కష్టం చేసే పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడంలో డీలర్లు అలసత్వం చూపితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ దోహదపడుతుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారుడి కుటుంబీకులు తలపాన శ్రీనివాస్, పుష్ప, అదనపు కలెక్టర్ హమీద్, డీఎస్ఓ తనూజ, డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ దిలీఫ్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం -
అభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హుస్నాబాద్రూరల్: అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు పల్లె సోల్జర్స్గా నిలవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) శుభం గార్డెన్లో అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, సీఏలకు యుడీఐడీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత, సదరం పింఛన్ల కోసం వృద్ధులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. సదరం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండానే మన ఇంటి నుంచే యుడీఐడీలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దీనిపై అవగాహన కల్పించాలని వివరించాలన్నారు. -
చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి
వర్గల్(గజ్వేల్): సామలు, అరికెలు తదితర చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం మాతాశిశువులకు ఎంతో ప్రయోజనకరమని సీడీపీఓ సరిత అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం నెంటూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హరితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువులకు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8లక్షలు
జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.8 లక్షలు వచ్చినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి 59 రోజుల హుండీలోని కానుకలను శుక్రవారం లెక్కించినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ నరేష్, సిబ్బంది మహేందర్ రెడ్డి, వెంకట్రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, హరి, చందు, చిన్నా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీపీని కలిసిన నూతన డీటీఓ సిద్దిపేటకమాన్: జిల్లా నూతన ట్రాన్స్పోర్ట్ ఆఫీ సర్గా బాధ్యతలు చేపట్టిన కిష్టఫర్.. సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సంయుక్తంగా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటజోన్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు 14 ఏళ్లలోపు బాల, బాలికలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు శిక్షణ ఇచ్చే క్రీడల వివరాలు తదితర అంశాలపై ఈనెల 19లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్టేడియంలోని జిల్లా క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని, క్రీడలు నిర్వహించే వారికి గౌరవ వేతనం, క్రీడా సామగ్రి అందించనునట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9014580816 నంబర్లో సంప్రదించాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో సిర్సనగండ్ల, మర్పడ్గ, దుద్దెడ, వెలికట్ట గ్రామాల్లో, ఐకేపీ ఆధ్వర్యంలో బొబ్బాయిపల్లి, తిప్పారం, మాత్పల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరను పొందాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు అదనంగా రూ. 500 బోనస్ను చెల్లించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగులో మోడల్గా నిలపాలి
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, సామర్థ్యం, జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంట, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాఖరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్గదర్శకంగా నిలిచిన తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు 200 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసి గుజరాత్లో క్షీర విప్లవం తెచ్చిన కురియన్లా అందరికీ మార్గదర్శకంగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో అధికంగా ఆయిల్పామ్ సాగు చేసేలా ప్రోత్సహిస్తామని, పదెకరాల భూమి కొని నేను కూడా అయిల్పామ్ సాగు చేస్తానన్నారు. కలెక్టర్ మనూ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో, 230 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరగుతోందని అధిక లాభాలు గడించే పంటను రైతులు సాగు చేయాలన్నారు. ఉద్యాన అధికారిపై మంత్రి ఆగ్రహం ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించకుండా అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఉద్యాన శాఖ జిల్లా అధికారి సువర్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సాగుపై అధికారులు ఆవగాహన కల్పించడం లేదని, ఆయిల్ గింజలు అమ్మి వారం రోజులు గడిచినా బిల్లు రాలేదని రైతు చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, డీఏఓ రాధిక, అఽధికారులు పాల్గొన్నారు.జిల్లా ఆదర్శం కావాలి జూన్ నెలాఖరులోగా నర్మెట ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
బడి.. భయపెడుతోంది
ఊడిపడుతున్న పెచ్చులు.. కూలుతున్న చెట్లు బడి భయపెడుతోంది. పైకప్పు ఊచలు తేలి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలు బీటలు వారాయి. వానొస్తే ఉరిసి తడిసిముద్దవుతోంది. శిథిల భవన సముదాయం ఎప్పుడు కూలుతుందోనన్న భయం నెలకొంది. ఆవరణలో భారీ వృక్షాలు సైతం నేలకూలుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వారం క్రితం స్కూల్ వదలిన తరువాత ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలింది. పిల్లలు లేని సమయం కావడంతో ముప్పుతప్పింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి వర్గల్ మండలం జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాలలో నెలకొనగా.. తక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారగణం ఏమీపట్టనట్లు చోద్యం చూస్తుండటం గమనార్హం. శిథిలావస్థలో.. పాత బురుజు పక్కన జబ్బాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. ఐదు తరగతులు, నాలుగు గదులు, 71 మంది విద్యార్థులతో కూడిన ఈ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందులోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. దశాబ్దాల క్రితం ఈ భవన సముదాయం నిర్మితమైంది. భవనాలకు పగుళ్లు, పైకప్పునకు తేలిన ఊచలు దర్శనమిస్తాయి. –వర్గల్(గజ్వేల్)మందుబాబులు ధ్వంసం చేసిన టాయ్లెట్ టైల్స్మందు బాబులకు అడ్డాగా సర్కారు బడులుకొండాపూర్లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి. సరస్వతీ నిలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు ఆవరణాలుసిట్టింగులుగా మార్చేస్తున్నారు. అంతటితో ఆగక తాగిన మద్యం బాటిళ్లను పగులగొడుతున్నారు. దీంతో ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. మరోవైపు టాయిలెట్స్ను సైతం ధ్వంసం చేయడంతో అవసరాలను తీర్చుకోవడానికి విద్యార్థులు ఇంటి దారి పట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు శృతి మించుతున్నాయని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేయాలని వారు కోరుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్రెడ్డి, నియోజకవర్గ శాఖ అధ్యక్షులు అజహర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకుడు అభిలాష్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్లో ర్యాలీ, ప్రధాని దిష్టిబొమ్మ దహనం -
పాఠశాల.. కాదు పానశాల
సరస్వతీ నిలయమైన పాఠశాల ఏకంగా పానశాలగా మార్చేశారు. రాత్రి అయ్యిందంటే చాలు మోత్కులపల్లిలోని ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ పడేసిన బీరు, కల్లు సీసాలు దర్శనమిస్తున్నాయి. కొన్నింటిని అక్కడే ధ్వంసం చేస్తుండటంతో ప్రాంగణంలోకి రావాలంటేనే జంకుతున్నారు. ప్రహరీ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
అన్నదాత.. గుండె కోత
బాధిత రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్య వసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ●వడగళ్ల బీభత్సం ●ఆరు నెలల కష్టం వర్షార్పణం ●వేల ఎకరాల్లో పంట నష్టం ఇంటిల్లిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. పంట చేతికొచ్చే తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన అన్నదాతను నిండా ముంచింది. ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, వడగళ్ల వానకు మామిడి కాయలు సైతం నేలరాలాయి. అలాగే మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయ పంటలు నేలకొరిగాయి. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో 3,869 ఎకరాలు, చిన్నకోడూరు మండలంలో 2,100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏడీఏ పద్మ, ఏఓ గీత తెలిపారు. – నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట)30 ఏళ్లలో ఎన్నడూ చూడలే రెండు ఎకరాల్లో వరి పంట కోసి ఐకేపీ సెంటర్కు తెచ్చి ఆరబెట్టాను. రాత్రి కురిసిన వడగళ్ల దెబ్బకు వడ్లన్నీ బియ్యంగా మారాయి. ఇంత రాళ్లవాన, నష్టం 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. – చంద్రయ్య, రైతు, పాలమాకుల -
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయి, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజు రాష్ట్ర నాయకులు గీస భిక్షపతి, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే ఆరోగ్యం చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు పోషక విలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. గురువారం ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు మంచి పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు. రక్త హీనతకు గురి కాకుండా పల్లి పట్టీలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరీశుభ్రత, ఆరోగ్య సమస్యలపై వివరించారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
చేర్యాల(సిద్దిపేట): అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పద్మశ్రీ , ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని శభాష్గూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ కుల వ్యవస్థ కారణంగానే దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి ఉన్నత వర్గాల వారే ప్రధానులు అయ్యారని, ప్రస్తుతం మోదీ మాత్రమే బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చారన్నారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులతోనే నేడు దళితులు రాజకీయంగా ఎదుగుతున్నారన్నారు. దళితుల ఉన్నతి కి పాటు పడిన మహనీయుల్లో జ్యోతిరావుపూలే, సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ ఉన్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి జగదేవ్పూర్(గజ్వేల్): మహానీయుల అడుగు జాడల్లో నేటి యువత నడువాలని మందకృష్ణ మాదిగ కోరారు. కుకునూర్పల్లి మండలం చిన్నకిష్టాపూర్లో జైభీమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం లేన్నందున మీ గ్రామానికి మరోసారి వస్తానని, ఇక్కడే నిద్ర చేసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు రాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగ శభాష్ గూడెంలో విగ్రహావిష్కరణ -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● దొడ్డు, సన్నాలు వేర్వేరుగా లోడ్ చేయాలి ● కలెక్టర్ మనుచౌదరి మద్దూరు(హుస్నాబాద్): కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసే అవకాశం ఉందని టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోనస్ కూడా ప్రకటించిందన్నారు. అందువల్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరతో పాటు, బోనస్ సైతం పొందాలని రైతులకు తెలిపారు. సెంటర్ చుట్టుపక్కల హార్వెస్టింగ్ అవుతున్న వరిధాన్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని లోడ్ చేసేటప్పుడు వేరువేరుగా చేయాలని సూచించారు. మిల్లర్ల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తూకం లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల ప్రాథమిక వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు. వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి ● నాణ్యమైన భోజనం అందించాలి ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ప్రకటించిన మెనూను విఽధిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వసతి గృహ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మెనూలో ఉన్న మిల్లెట్ బిస్కెట్, నెయ్యి తప్పని సరిగా వినియోగించాలన్నారు. విద్యార్థినుల వ్యాయామానికి జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లా కనెక్షన్, లైబ్రరీలో బుక్స్ కావాలని విద్యార్థులు కోరగా వెంటనే మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి హమీద్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
రథోత్సవం.. భక్తి పారవశ్యం
కొండపాక(గజ్వెల్): మండలంలోని కుకునూరుపల్లిలో వెలసిన సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడ సేవా రథోత్సం కనుల పండువగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ పొల్కంపల్లి నరేందర్ సేన ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ సంకల్ప బలంతోనే రఽథోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు. మాజీ సర్పంచ్ ఐలం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అమరేందర్, ఉప్పల రాజు, కొంతం రాజు, కనకయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కనుల పండువగా గరుడ సేవా రథోత్సవం -
సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు
ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్ మార్కులుసాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్రన్నర్గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి. తొమ్మిది అంశాల ఆధారంగా... కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్రన్నర్గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్లో నిలిచిన పటేల్గూడ, సుల్తానాపూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.ఫ్రంట్ రన్నర్స్గా నిలిచిన గ్రామ పంచాయతీలు ఇవేగ్రేడ్ మార్కులు పంచాయతీలు ఏ(అచీవర్స్) 90 నుంచి 100 0 బీ(ఫ్రంట్ రన్నర్స్) 75 – 89 24 సీ(పెర్ఫార్మర్) 60 – 74 1,419 డీ(యాస్పిరెంట్) 40 – 59 171 ఈ(బిగినర్) 39 01 ఉమ్మడిజిల్లాలో బీ గ్రేడ్లో 24, సీ గ్రేడ్లో 1,419, డీ గ్రేడ్లో 171 జీపీలు ఏ పంచాయతీకి దక్కని అచీవర్స్ హోదామెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.– సిద్దిపేట జిల్లాలో... మిట్టపల్లి(77.59), చెక్కల్(77.24), అంగడి కిష్టాపూర్(77.5), బుస్సాపూర్(77.05), కట్కూర్(76.58) గురువన్నపేట(75.94), మల్లంపల్లి(75.9), రాఘవాపూర్(75.55), బైరాన్పల్లి(75.38), పొన్నాల(75.36), కురేళ్ల(75.24) – మెదక్లో... వల్లూర్(77.9), నారాయణపూర్(77.67), మనోహరాబాద్(75.2)– సంగారెడ్డిలో పటేల్గుడా(79.67 మార్కులు), సూల్తానాపూర్(78.87), మైకోడ్(78.63), మల్చల్స్(78.3), చిటుకుల్(77.48), ఎద్దుమల్లారం(77.3),కొత్తాపూర్ (75.89), ఇలాపూర్(75.77), జనకంపేట్(75.18)ఏ గ్రేడ్లో నిలిచేందుకు కృషి సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగి ఉన్న గ్యాప్లను పూర్తి చేసి త్వరలో ఏ గ్రేడ్లో నిలిచేందుకు కృషి చేస్తాం. – దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేటసిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
దుబ్బాక: విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం హబ్షీపూర్లోని జ్యోతి బాపులే తెలంగాణ బీసీ బాలుర గురుకులాన్ని సందర్శించారు. వంట గదిలో అన్నం, కూరలను పరిశీలించి రుచి చూశారు. తాజా కూరగాయలను వాడాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. సదుపాయాలు బాగున్నాయా అని అడిగారు. స్టడీ అవర్స్లో గణితం సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ భూపాల్రెడ్డి గురుకులంలో 391 మంది విద్యార్థులు ఉంటున్నారని ఇందుకు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మ తదితరులు ఉన్నారు.కలెక్టర్ మను చౌదరి -
బాబోయ్ బర్డ్ ఫ్లూ
ప్రజలకు వైద్య పరీక్షలు బర్డ్ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫాం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కోళ్ల నుంచి వ్యాధి ప్రజలకు సోకే అవకాశం ఉండటం వల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాల్ట్రీ ఫాం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా అక్కడ పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు.సామూహికంగా కోళ్ల పూడ్చివేత కాన్గల్ గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో ఆ పౌల్ట్రీ ఫాంలోని 1.45లక్షల కోళ్లను అధికారులు చంపి పూడ్చిపెడుతున్నారు. బుధవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగనుంది. బర్డ్ఫ్లూ సోకిన పౌల్ట్రీఫాంకు కిలోమీటర్ దూరంలో చికెన్, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. దీంతో పాటు వ్యాధి సోకిన ఫామ్కు కిలోమీటర్ సమీపంలోని పౌల్ట్రీ ఫాంలపై దృష్టి సారించారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): బర్డ్ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా ప్రజలు జంకుతున్నారు. తొగుట మండల పరిధిలోని కాన్గల్ గ్రామంలోని లేయర్ ఫౌల్ట్రీలో మరణించిన కోళ్ల శాంపిల్ను ఈ నెల 4న మధ్యప్రదేశ్లోని భోపాల్కు పరీక్షల నిమిత్తం పంపించగా, 7న బర్డ్ఫ్లూ ఉందని రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు కాన్గల్ పౌల్ట్రీఫాంలో బర్డ్ఫ్లూ ఉన్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి పౌల్ట్రీ ఫాంలో కోళ్లను సామూహికంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు. జిల్లాలో 235 వరకు పౌల్ట్రీ ఫాంలు ఉండగా 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను, పౌల్ట్రీ నిర్వాహకులను వణికిస్తోంది. కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు, వినియోగం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.● కలకలం సృష్టిస్తున్న వైరస్ ● కాన్గల్లో నిర్ధారించిన పశుసంవర్ధకశాఖ ● బెంబేలెత్తుతున్న పౌల్ట్రీ నిర్వాహకులుటోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు జిల్లాలో బర్డ్ఫ్లూ నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 85004 04016ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ సంబంధిత ఆనవాళ్లు ఉంటే ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. సందేహం ఉన్న పౌల్ట్రీ ఫామ్లో కోళ్ల శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపించడంతో పాటు, సలహాలు, సందేహాలను నివృత్తి చేయనున్నారు. బర్డ్ఫ్లూ నిర్ధారణ అయింది జిల్లాలో కాన్గల్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ఫ్లూ నిర్థారణ అయింది. ఆ ఫాంలోని కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఇతర పౌల్ట్రీ ఫాంలలో కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలి. వైరస్ సోకకుండా పౌల్ట్రీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. –అశోక్కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ -
కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనులు నిర్వహించే స్థలంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు 150 మందకి మించకుండా కూలీలను ఏర్పాటు చేసుకొని పనులు చేయించాలన్నారు. పనులు చేయించే స్థలంలో వర్క్షెడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫాస్టెయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీపీఓ లక్ష్మణప్ప, టీఏ, ఎఫ్ఏలు పాల్గొన్నారు. -
మొదటి వెయ్యి రోజులే ముఖ్యం
చేర్యాల(సిద్దిపేట): గర్భిణిలకు మొదటి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమని సీడీపీఓ రమాదేవి అన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం–6లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీ్త్ర తాను గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పుట్టిన బిడ్డ రెండేళ్ల వయస్సు వచ్చే సమయాన్ని మొదటి 1000 రోజులు అంటారన్నారు. ఈ సమయంలో గర్భిణిలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఒక పూట పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ రమాదేవి పోషణ పక్వాడ అవగాహన సదస్సు -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మున్సిపాలిటీలోని చేర్వాపూర్, చెల్లాపూర్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు కై లాసం, నరేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి, ఏఓ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ‘జై బాపు జై భీమ్, జై సంవిధాన్’కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంవిధాన్ పాదయాత్ర సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు సమీర్, మొనగారి రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట సీపీ అనురాధ హెచ్చరించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత బెట్టింగ్ యాప్ల మోజులో పడి బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. అప్పుల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బెట్టింగ్పై సమాచారం తెలిస్తే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712667100కు సమాచారం అందించాలని సూచించారు. వాటర్ షెడ్ పథకం వినియోగించుకోవాలి డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): వాటర్ షెడ్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని చౌడారం గ్రామంలో పర్యటించి వాటర్ షెడ్ పథకం గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకంపై 16న గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పనుల పరిశీలన, కొత్త పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. చౌడారంతోపాటు సమీప గ్రామాల ప్రజలు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తాం
దుబ్బాక: ‘చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం.. అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు’పేరిట ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఇతర అధికారులతో కలిసి పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా పలు బ్లాక్లలో డబుల్ బెడ్రూంలు అసంపూర్తిగా ఉండటంపై సంబంధిత కాంట్రాక్టర్తో పీడీ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయిస్తామని, అలాగే అలాట్మెంట్ చేయకున్నా డబుల్ బెడ్రూంలలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అధికారులు వచ్చిన విషయం తెలుసుకొని ‘సాక్షి’ప్రతినిధి అక్కడికి వెళ్లగా అప్పటికే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా బ్లాక్లలోకి రాలేరని రోడ్డు వైపు మంచిగా ఉన్న వాటినే అధికారులు చూసి పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే అడ్వాన్స్గా కాంట్రాక్టర్కు అధిక పేమెంట్ చేయడంపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే త్వరలో కలెక్టర్ను కలిసి విన్నవిస్తామన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్రావు -
ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. జిల్లా జైలును న్యాయమూర్తి మంగళవారం సందర్శించి, న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జైలులోని వంట గది, స్టోర్ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు అడ్వకేట్స్ ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, జైలు, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం: డీపీఓ దేవకీదేవి అక్కన్నపేట(హుస్నాబాద్): మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. అక్కన్నపేట మండలం కట్కూర్లో మంగళవారం రుతు ప్రేమపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకర సమాజం దిశగా సాగాలన్నారు. రుతుస్రావం సమయంలో మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్స్ డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానోతు జయరాం, ఎంపీఓ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, మహిళలు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు గుంటుకు శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యం–సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక.. ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొనగారి రాజు, సుఖేందర్రెడ్డి, గుంటుకు ఆంజనేయులు, మల్లేశం, మహేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ గజ్వేల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబునాయక్ హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్లోని రైతువేదికలో విత్తన డీలర్ల సమావేశం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ లైసెన్సులు కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నకిలీ విత్తనాలను అమ్మినా సహించేదిలేదన్నారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు. -
సాగు పెంపునకు ఏం చేద్దాం?
గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్పిల్లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలను తొలగించి తమ భూములను ప్లాట్లుగా మార్చారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ, సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలుచేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ములుగు యూనివర్సిటీ పరిధి రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఇటీవల గ్రేప్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్హెచ్యూ మాజీ ఛాన్స్లర్ డాక్టర్ శిఖామణి, ద్రాక్ష సాగులో తనకుంటూ ప్రత్యేకతను చాటుకున్న మేడ్చల్ జిల్లా శామీర్పేటకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగుపై తగ్గడానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్కు సమీపంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలోని భూములన్నీ రియల్ వ్యాపారం కారణంగా బడా బాబులు చేతులకు వెళ్లిపోవడం, ద్రాక్ష సాగుకు కూలీలు సమస్యగా మారడం, పెట్టుబడి లక్షల్లో ఉండటం, ఎరువులు, క్రిమిసంహారకాల నిర్వహణ కష్టతరంగా మారడం వంటి కారణాల వల్ల క్రమంగా సాగు పడిపోతోంది. ఈ క్రమంలోనే ఏటా కొత్తగా ద్రాక్ష సాగు పెరిగేలా ఏంచేయాలనే అంశంపైనా కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఈ నేలలకు అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. -
ఇళ్ల పనులు వేగిరం చేయండి
బర్డ్ఫ్లూ వ్యాప్తిని తక్షణం అరికట్టాలికొమురవెల్లి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు పోసాన్పల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను వెంటనే అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనులు వేగవంతమైతే బిల్లులు వెంటనే చెల్లిస్తామని లబ్ధిదారుకుల భరోసా ఇచ్చారు. అంతకు ముందు కేజీబీవీ పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందు ఉండాలని అన్నారు. అనంతరం పోసాన్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, హౌసింగ్ పీడీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేటరూరల్: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో బర్డ్ఫ్లూతో 15వేల కోళ్లు మృత్యువాత పడటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అత్యవసర సమావేశమయ్యారు. బర్డ్ఫ్లూ నిర్ధారణ అయిన క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ సోకిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో భూమిలో పూడ్చి వేయాలన్నారు. ఫారంలో పనిచేసే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కిలోమీటరు లోపు కోడిగుడ్లు అమ్మకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్కుమార్, డీఎంహెచ్ఓ పల్వాన్కుమార్, సీఐ మల్లేశ్గౌడ్, డీపీఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోళ్ల మృత్యువాతపై అదనపు కలెక్టర్ అత్యవసర సమావేశం అధికారులకు దిశా నిర్దేశం -
బందారం కథలలో తెలంగాణ జీవితం
సిద్దిపేటకమాన్: బందారం కథలలో తెలంగాణ జీవితం ఉన్నదని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన సిద్దారెడ్డి ‘బందారం కథలు’ పుస్తకావిష్కరణ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కథలు వస్తే పల్లె బతుకుల గుండె ఆవిష్కరణ అవుతుందన్నారు. సిదారెడ్డి పీడిత పక్షపాతి అన్నారు. సాహిత్యంలో మానవీయ సంబంధాలు ఉండాలని అన్నారు. ఈ పుస్తకం ద్వారా సాహిత్య చరిత్రలో బందారం గ్రామం నిలబడుతుందన్నారు. సభలో సిద్దారెడ్డి, మరసం అధ్యక్షుడు రంగాచారి, ప్రముఖ కవులు పొన్నాల బాలయ్య, అంజయ్య, యాదగిరి, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. మల్లన్న ఆలయ ఉద్యోగిపై కేసుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్కుమార్పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు. గత నెల 26న ఆలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆరెళ్ల మహేష్, ప్లంబర్ విజయ్కుమార్ గొడపడ్డారు. దీంతో సార్ల విజయ్కుమార్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తనకు అన్యాయం జరిగిందంటూ.. ముందుగా విజయ్కుమార్ తనపై దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు విన్నపించారు. విషయాన్ని విచారించిన పోలీసులు విజయ్కుమార్పై కేసు నమోదు చేశారు.ఈ విషయం కొమురవెల్లిలో చర్చనీయాంశగా మారింది. -
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వైన్ టూరిజం..
ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోటల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్కు వైన్ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు. -
పేదల నడ్డివిరుస్తున్న మోదీ సర్కార్
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేటలోని గాంధీ చౌరస్తా వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్పై ఏకంగా రూ.50 పెంచడం, పెట్రోల్, డీజిల్పై రూ.2 పెంచి ఆయిల్ కంపెనీలు భరించాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ప్రదాని మోదీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బన్సీలాల్, మల్లేశం, జనార్ధన్, చంద్రం, నరేష్, నాయకులు సంపత్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాల్సిందే సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం -
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బందారం కవితల పుస్తకావిష్కరణ సిద్దిపేటకమాన్: తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకావిష్కరణ మంగళవారం సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించనున్నట్లు మంజీర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగాచారి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కవులు, సాహితీ వేత్తలు హాజరై విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, భగవాన్రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేర్యాల(సిద్దిపేట): వేసవి కాలం దృష్ట్యా బస్సులో ప్రయాణం చేస్తూ బస్టాండ్లో వేచి చూసే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు అన్నారు. సోమవారం స్థానిక బస్టాండ్లో రూ.80వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన చల్లని నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు. జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి సిద్దిపేటరూరల్: మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ మహనీయుల జయంతి ఉత్సవాలు జరిపేందుకు బడ్జెట్లో కనీసం నిధులు కూడా నామమాత్రంగానే కేటాయిస్తున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం లేదన్నారు. తమతో కలెక్టర్ స్పందిస్తూ పూలే జయంతి నిర్వహణకు బడ్జెట్ లేదన్నారన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ కలెక్టర్ నామమాత్రంగా స్పందించారన్నారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్గౌడ్ , జిల్లా ఇన్చార్జి మంత్రిగా బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీ మహానీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో శ్రీహరియాదవ్, ప్రభాకర్వర్మ, నవీన్గౌడ్, మామిండ్ల ఐలయ్య, ప్రశాంత్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. -
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
దుబ్బాక డబుల్ బెడ్రూంల వ్యూ అసంపూర్తిగా డబుల్ బెడ్రూంల నిర్మాణాలు ● పనులు పూర్తికాకుండానే అధిక పేమెంట్ ● అధికారుల పర్యవేక్షణ లోపం ● కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ● దుబ్బాక పట్టణంలో పేదల ఇళ్ల దుస్థితిదక్కించుకున్న పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రీవర్స్.. కాంట్రాక్టర్కు అడ్వాన్స్ పేమెంట్ల పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా చెల్లించారు. ఓ వైపు పనులు వంద శాతం పూర్తికాకున్నా.. చెల్లించాల్సిన వాటి కంటే ఎక్కువే పేమెంట్ చేశారు. దుబ్బాక పట్టణంలో 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను రెండు ఏజెన్సీలకు అప్పగించారు. అందులో 876 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు జరగగా అందులో పది శాతం వరకు మైనర్ పనులు మిగిలే ఉన్నాయి. రెండేళ్ల కిత్రం పేమెంట్లు పూర్తి చేసినా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడం గమనార్హం.రూ. 5.30లక్షల చొప్పున.. ఒక్కో డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.30లక్షల చొప్పున చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు అడ్వాన్స్ పేమెంట్లు చేయించి నిర్మాణాలు ప్రారంభించారు. 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను సదరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కొంత స్థలం తక్కువగా ఉండటంతో 876 డబుల్ బెడ్రూంల పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణాలకు రూ.46,42,80,000 అవుతుంది. అయితే రెండేళ్ల కిత్రం రూ.46,47,22,256 చెల్లించారు. ఒక వైపు వంద శాతం పనులు పూర్తి కానప్పటికీ రూ.4,42,256 అధికంగా చెల్లించారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికంగా చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూంలలో పెండింగ్లో ఉన్న మైనర్ పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి, సిద్దిపేట: దుబ్బాక పట్టణం బల్వంతపూర్ రోడ్లో మోడల్ కాలనీగా 2017లో జీ ప్లస్ టూ తో డబుల్ బెడ్రూంల నిర్మాణాలను ప్రారంభించారు. వెయ్యి డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 948 నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. అందులో బల్వంతపూర్ రోడ్లో జీ ప్లస్ టూతో ఒక్కో బ్లాక్లో 12 చొప్పున 66 బ్లాక్లు, మల్లయిపల్లి రోడ్లో ఏడు బ్లాక్లు ఇలా మొత్తంగా 876 డబూల్ బెడ్రూంల నిర్మాణాలు జరిగాయి. వీటిలో 588 డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు అందించారు. ఇంకా 288 డబుల్ బెడ్రూంలలో పలు మైనర్ పనులు మిగిలిపోయాయి. డోర్లు, కిటికీలు, పెయింటింగ్, మరుగుదొడ్లు, కరెంట్ వైరింగ్ పనులు మిగిలిపోయాయి. మిగిలిన వాటికి లబ్ధిదారుల పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. దీంతో నిరుపేదలు ఇంటి అద్దెను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్కువ పేమెంట్ జరగలేదు దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూంల విషయమై కాంట్రాక్టర్కు ఎక్కువ పేమెంట్ చేయలేదు. రికార్డ్ చేసిన విధంగా బిల్లులను అందించాం. బెడ్రూంలలో అసంపూర్తిగా పనులు ఉంటే పరిశీలించి చేయిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జ్ ఈఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ -
నెత్తిన ‘బండ’
నేటి నుంచి ఒక్కో సిలిండర్పై రూ.50 పెంపు● రూ.855 నుంచి రూ.905లకు చేరిన ధర ● జిల్లా వ్యాప్తంగా 3.23లక్షల కనెక్షన్లు ● ప్రతి నెలా రూ.సుమారు 75లక్షల భారం సాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్ పై ఏకంగా రూ.50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 3,23,500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రతి నెలా ఒక్కో సిలిండర్ చొప్పున 1.5లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో కుటుంబాలపై ప్రతి నెలా దాదాపుగా రూ.75లక్షల భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్ను అందజేస్తోంది. జిల్లాలో 1,62,257 మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్ను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ. 500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పెంచుతుందా? అనే నిర్ణయం తేలాల్సి ఉంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా పడనుంది. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం కావాలి
గజ్వేల్: సంపూర్ణ ఆరోగ్యమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, ఇందుకోసం వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గజ్వేల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఆస్పత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం, నీరు, గాలికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహను పెంచడమే లక్ష్యంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యరావు, డాక్టర్ తర్జనితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో?
సాక్షి, వరంగల్: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప ఆడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో చివరగా సిరొంచ కమాండర్గా పనిచేస్తూ 2012లో పోలీసులకు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్మెంట్ చేయలేదు. ఆమె కుటుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవన స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్కు వచ్చి మరోసారి కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసా ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు. -
వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటకమాన్: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మన హక్కుగా సిబ్బంది భావించి వైద్య సేవలు అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందించాలన్నారు. గర్బిణులకు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ -
రాజ్యాంగం మార్చే కుట్ర
వర్గల్(గజ్వేల్): దేశంలో రాజ్యాంగం మార్చే కుట్ర జరుగుతోందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడదామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో గ్రామస్థాయి పాదయాత్రను సోమవారం మండల కేంద్రం వర్గల్తోపాటు గౌరారంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తే ప్రజలు తరిమికొడతారని, మెల్లమెల్లగా వాటిని తీసే ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అక్కడ చెట్లు నరకలేదని, జింకలు, నెమళ్లను చంపలేదని స్పష్టం చేశారు. పదేళ్లు దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంలో కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గురుకులం అందరిది ఒకే కులం అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనన్నారు. పేదవారికి సన్నబియ్యం పంచిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మన డబ్బు తింటూ ఫామ్హౌస్లో పడుకున్న వాళ్లను నిద్రలేపాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వర్గల్లో సన్నబియ్యం లబ్ధిదారుడు అయ్యగల్ల యాదగిరి ఇంట్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులతో కలిసి కుటుంబీకులతో సహపంక్తి భోజనం చేశారు. పాదయాత్ర కార్యక్రమంలో ఆయనతోపాటు యూత్కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర యూత్కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు సందీప్రెడ్డి, ప్రభుదాస్గౌడ్, భానుప్రసాద్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం సన్నబియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్దే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ -
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత సృష్టించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కాలువలు నిర్మించే వరకు పోరాడుతాం
దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతారం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం దుబ్బాక: క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్లో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు నియోజక వర్గం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు హాజరుకావాలన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పనిచేయాలన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, నాయకులు ఉన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
● రుక్మాభట్ల గేయ రామాయణం అద్భుతం ● ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పాత తరం వాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట ఎందరో గొప్ప వారిని అందించిందని కళలకు కాణాచిగా అభివర్ణించారు. ఆధునిక యుగంలో మరుగున పడిపోయిన కళలు, సంప్రదాయాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల గేయ రామాయణ గానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. అన్నదాతలకు ఇబ్బందులు రావొద్దు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సేకరణకు ఒక్క పైసా ఇవ్వలేచిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లాలోని ప్రాజెక్టుల కింద చిన్న కాలువల కోసం భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారం మీదుగా బిక్కబండకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఎడాదిన్నర కాలంలో ఒక్క ఎకరా కూడా ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేదన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇది కేసీఆర్ ఘనత అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘నెక్లెస్’ సుందరం.. నడక భయానకం
కోమటి చెరువు (నెక్లెస్ రోడ్డు)పై నడక భయానకంగా మారుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్పై మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడే మకాం వేస్తున్నారు. అంతేకాక తాగిన సీసాలను పగులగొట్టి విచ్చలవిడిగా పారేస్తున్నారు. రోజూ తెల్లవారుజామునే సుమారు 500 మందికిపైగా వాకర్స్ నెక్లెస్ రోడ్డుపై నడక సాగిస్తుంటారు. గాజు సీసాలను కొందరు గమనించక గాయాలపాలవుతున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాలని వాకర్స్ కోరుతున్నారు. –సిద్దిపేటజోన్ -
పీసీసీ చీఫ్ను కలిసిన సూర్యవర్మ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా ఆర్టీఏ (రీజినల్ ట్రాన్స్పోర్ట్ అఽథారిటీ) సభ్యు డు డాక్టర్ సూర్యవర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారన్నా రు. యువతకు ప్రతినెలా తప్పకుండా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పోలీసు వ్యవస్థకి ప్రజలకి వారధిలా ఉండాలని సూచించారన్నారు. ట్రైకార్ రుణాలువిడుదల చేయండి హుస్నాబాద్: బకాయి పడిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలు వెంటనే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతు సత్యం నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా గిరిజన యువతి, యువకుల నుంచి వేలాదిగా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. అందులో నుంచి కొంత మందికి రుణాలు మంజూరు చేస్తూ లబ్ధిదారులను గుర్తించిందన్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి చెక్లను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. ప్రస్తుతం వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్లుగా చూపిస్తోందన్నారు. పెండింగ్లో ఉన్న రుణాలను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో గిరిజన సంక్షేమ భవన్ను ముట్టడిస్తామని సత్యం నాయక్ హెచ్చరించారు. సమావేశంలో లంబాడి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భూక్యా కృష్ణ నాయక్, నాయకులు ఉన్నారు. దుర్గమ్మా.. దండాలమ్మాపాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
చెత్త.. నో చింత!
తిలకించి.. పులకించిరాములోరి కల్యాణంకమనీయం.. వైభవంగా శ్రీరామనవమి వేడుకలుఎక్కడికక్కడే శుద్ధి ● సిద్దిపేట బల్దియా వినూత్న ఆలోచన ● స్వచ్ఛత లక్ష్యంగా అడుగులు ● మరిన్ని కంపోస్టు యార్డులఏర్పాటుకు చర్యలుస్మార్ట్ సిటీ లక్ష్యంగా సిద్దిపేట బల్దియా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. చెత్త సేకరణ ప్రక్రియ సత్ఫలితాలు అందిస్తున్న క్రమంలో మరింత స్వచ్ఛత కోసం పారిశుద్ధ్య విభాగం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది. వార్డుల్లో సేకరించిన తడి చెత్తను సుదూరంలో ఉన్న కంపోస్టు యార్డులకు తరలించడం పారిశుద్ధ్య విభాగానికి సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి చెత్తను అక్కడే పునర్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణంలో పలుచోట్ల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం అందించారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో రికార్డుల ప్రకారం ప్రతి రోజు 25మెట్రిక్ టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. సేకరించిన తడి చెత్తను ప్రస్తుతం మందపల్లి, పశువుల ఆస్పత్రిలో, లింగారెడ్డిపల్లి, స్వచ్ఛబడిలోని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. బల్దియాలో 43 వార్డులు ఉండడం, విలీన వార్డులు పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న నేపథ్యంలో తడి చెత్త తరలింపు అంశం బల్దియాకు వ్యయ ప్రయసాలతో కూడుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుల మీద వత్తిడి పడకుండా అదనంగా కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మున్సిపాలిటీ గుర్తించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వేసవిలో మరో చిక్కు.. వేసవిలో పారిశుద్ధ్య విభాగానికి కొత్త చిక్కు ఏర్పడుతోంది. హరిత సిద్దిపేట దిశగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. దీంతో వేసవిలో ఎండు ఆకుల సమస్య ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున రోజూ ఎండిన ఆకులను ట్రాక్టర్ల కొద్దీ సేకరించి కంపోస్టు యార్డులకు తరలించాల్సి వస్తోంది. తరలించిన ఎండు ఆకులను సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికక్కడే కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయడమే మేలని బల్దియా భావిస్తోంది. రెండు లక్షల కిలోల విక్రయాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల 30 వేల కిలోల సేంద్రియ ఎరువును విక్రయించారు. వర్మీ కంపోస్టు ఎరువు కిలో రూ.10కాగా, సెమి వర్మీ కంపోస్టు ధర 3 నుంచి 4 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై ఫోకస్ పెట్టడం విశేషం.పార్కుల్లో ప్రాసెసింగ్ యూనిట్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్కుల్లో తడి చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డ్, మైత్రి వనం, నెహ్రు పార్కు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎర్ర చెరువు, కోమటి చెరువు, నర్సాపూర్ చెరువు ప్రాంతాల్లో పార్కుల్లో కంపోస్టు యార్డుల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ప్రక్రియ పనులను మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. సౌలభ్యం కోసమే.. ఎక్కడి చెత్తను అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే 4చోట్ల యూనిట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – ఆశ్రిత్ మున్సిపల్ కమిషనర్ -
సన్ఫ్లవర్ రైతులను ఆదుకోండి
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తిసిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్ఫ్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కంటే బాధ్యత గొప్పద న్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాల న్నది సీతాతత్వం అన్నారు. శ్రీరాముడు కష్టా ల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారన్నారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. శ్రీరాముని అనుగ్రహంతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. -
జగ్జీవన్రాంకు ఘన నివాళి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్రాం 118వ జయంతి ఉత్సవాలను సిద్దిపేటలో శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్రాం విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సుభాష్ చంద్రబోస్, అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, కులసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జగ్జీవన్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి హమీద్, పెర్క పర్శరాములు, లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకుల నిరసన డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఇతర జిల్లా స్థా యి నాయకులు పాల్గొనలేదని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. -
జూన్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ
● ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం ● ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్లోని ఆయిల్పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూములు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. చిన్న, చిన్న పనులను పూర్తి చేసి జూన్ నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో uపంట నష్టానికి పరిహారమేదీ?అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు గజ్వేల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోంది. ఈనెల 3న కురిసిన వర్షాలకు జిల్లాలోని వందలాది ఎకరాల్లో ప్రధాన పంటలకు నష్టం జరిగింది. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికలు పంపినా.. పరిహారం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం పంటల బీమా పథకం అమలై ఉంటే రైతులకు కొంత ఉపశమనం కలిగేది. కానీ ప్రభుత్వం నుంచి పరిహారం రాక, బీమా సౌకర్యం అమలుకు నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి 3.52 లక్షల ఎకరాల్లో వరి, 22వేల ఎకరాల్లో మొక్కజొన్న, 11వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మరో 5వేల ఎకరాల్లో ఇంతర పంటలు సాగులోకి వచ్చాయి. పంటలు చేతికొచ్చే సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వరి, మొక్కజొన్న పంటలకు వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్షం ధాటికి గెలలు కట్టిన వరి నేలవాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. చేతికందే దశలో మొక్కజొన్న పంట సైతం నేలవాలి కంకులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో రైతుకు లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నివేదికలకే పరిమితం అకాల వర్షాలు కురిసిన సందర్భంలో వ్యవసాయాధికారులు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి పరిమితమవుతున్నారనే తప్పా.. పరిహారం మాత్రం అందటం లేదు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం కూడా పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. న్యూస్రీల్ బీమా లేక ఏటా తప్పని ఇబ్బందులు రైతన్నను నిండా ముంచిన వర్షాలు -
నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లూరుకు చెందిన కర్రె సంజీవ్(18) వారం రోజుల కిందట స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో తండ్రి బాలయ్యతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి సంజీవ్ ఉన్నాడా.. అని తండ్రిని అడిగాడు. ఇంట్లో పడుకున్నాడని చెబుతూ గది తలుపులు తెరిచి చూడగా సంజీవ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. సంజీవ్ దొంగతనం చేసిన విషయం చిన్న కుమారుడు తండ్రికి చెప్పాడు. నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానం లేదని బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇక ఆస్తుల విస్తీర్ణం డిజిటలైజేషన్
ఇళ్లు, స్ధలాల వివాదాలకు చెక్ ● సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డు ● మాస్టర్ ప్లాన్కు సులభతరం ● పారదర్శకంగా ఇంటి పన్నుల కుదింపు ● మున్సిపాలిటీకి పెరగనున్న ఆదాయంహుస్నాబాద్: ఇక ముందు రెవెన్యూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు, వివాద స్ధలాలకు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్షా) కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి, విస్తీర్ణాన్ని నక్షా సర్వేతో జల్లెడ పట్టి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతి ఇంటి యజమానికి ఆస్తి హక్కును కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఉంది. హుస్నాబాద్లో మున్సిపల్ రికార్డుల ప్రకారం 7,343 ఇళ్లు ఉన్నాయి. నక్షా ఏరియల్ సర్వేతో ఆస్తుల విస్తీర్ణాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉండే పట్టణాలు, ఇరుకుగా ఉండే చోట్ల హెలికాప్టర్ను ఉపయోగించి వాటికి ప్రత్యేకమైన కెమెరాలను బిగించి సర్వే పూర్తి చేశారు. పట్టణంలో 48 చోట్ల సర్వే సరిహద్దులను ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పట్టణ విస్తీర్ణాన్ని నిర్ధారించి కచ్చిమైన పట్టణ మ్యాప్ను తయారు చేయనున్నారు. ప్రతి ఇంటికి త్రీడీ కెమెరాతో మ్యాపింగ్ చేస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్కు సులభతరం మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మంచి నీటి సౌకర్యం, ఇలా పలు అంశాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ అవసరం. ప్రస్తుత నక్ష ప్రకారం ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్ధలాల ఆస్తుల లెక్కలు పక్కాగా తెలుస్తోంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సర్వే కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఇంటింటికి తిరిగి ఇంటి ఆస్తుల వివరాలను పూర్తి స్ధాయిలో సేకరించనున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నారు. ఆస్తి పన్నుల లెక్కా పక్కా నక్షా సర్వే ద్వారా ప్రతి ఇంటి ఆస్తి వివరాలు గుర్తిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటి (గ్రౌండ్ ఫ్లోర్)అనుమతితో రెండు, నుంచి మూడు ఫ్లోర్లు వేస్తున్నారు. మున్సిపల్ రికార్డులో ఎన్ని అంతస్తులు ఉన్న ఒక ఇంటికే పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం ఏడాది ఇంటి పన్నుల వసూళ్లు రూ.1.72 కోట్లు ఉండగా, ఈ సర్వేతో ఆదాయం రెట్టింపు కానుంది. ఈ సర్వే ద్వారా బహుళ అంతస్తుల లెక్క తేలుతుంది. ఆస్తి పన్నును మదింపు చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ తరహాలోనే ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వబోతున్నారు. ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పూర్తి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్నుల వివరాలు, విస్తీర్ణం, భూముల సర్వే నంబర్లు, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా పూర్తి స్ధాయి వివరాలు ప్రాపర్టీ కార్డులో ఉంటుంది.సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళికనక్షా సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళిక రూపొందుతుంది. ప్రతి ఇంటి ఆస్తి హద్ధు లు నిర్ణయిస్తాం. యజమానికి ఆస్తి హక్కును కల్పిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుంది. ఆస్తి పన్నుల నిర్ణయంతో పారదర్శకంగా ఆదాయాన్ని పెంచుకునే వీలు ఉంటుంది. ప్రతి ఇంటికి ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నాం. ఈ కార్డుతో రుణాలు పొందవచ్చు. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
● భూభారతితో రైతులకు మెరుగైన సేవలు ● త్వరలో అవుట్ సోర్సింగ్కు శుభవార్త ● ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ● ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభు త్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపాల న అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రత కు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని ఆయన వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రెటరీ పూల్సింగ్, టీ జీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీసీఎల్ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.