Siddipet District Latest News
-
కార్యాలయంలో వినియోగిస్తున్నాం
మా కార్యాలయంలో రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తున్నాం. సాధారణ వైట్ పేపర్ మాదిరిగానే ఉన్నాయి. పర్యావరణ రక్షణలో మేము సైతం పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ఈ పేపర్ను వినియోగిస్తున్నాం. అందరూ వినియోగిస్తే బాగుంటుంది. – జయదేవ్, డీఆర్డీఓ, సిద్దిపేట చెట్లను రక్షించవచ్చు కాగితాలను కలప గుజ్జు నుంచి తయారు చేస్తారు. ఇందుకు చెట్లను పెంచి కట్ చేస్తుంటారు. పేపర్లను రీసైక్లింగ్ చేయడంతో చెట్లను రక్షించిన వాళ్లం అవుతాం. టన్ను రీసైక్లింగ్ పేపర్లను వినియోగించడం వల్ల 24 చెట్లను కాపాడిన వాళ్లం అవుతాం. మిస్ వరల్డ్ పోటీలలో రీసైక్లింగ్ పేపర్ బుక్లెట్లను వినియోగిస్తున్నారు. –అక్షయ్ దేశ్పాండే, స్విచ్ ఎకో సంస్థ -
సారూ.. మా ఊరు పేరు మార్చండి
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025● ప్రభుత్వ రికార్డుల నుంచి దొంగల ధర్మారం పేరును తొలగించండి ● పేరు చెప్పుకోవాలంటేనే బాధగా ఉంది ● ధర్మారం పేరుగా మార్చాలంటూ గ్రామస్తుల విన్నపాలు హుస్నాబాద్: కొన్ని ఊర్ల పేర్లు వింటేనే వినసొంపుగా ఉంటాయి. ఊరు పేరు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు ఇట్టే తెలిసిపోతాయి. అయితే ఈ గ్రామం పేరు చెప్పగానే చెప్పుకోలేని బాధగా ఉంటోంది. ఆ గ్రామమే అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం. గ్రామానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ దొంగల ధర్మారం పేరిటనే జారీ అవుతున్నాయి. ఏదైన శుభకార్యాలకు వెళ్లినప్పుడు మీది ఏ ఊరు అని అడిగితే ఊరు చెప్పుకునేందుకు అవమానకరంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. పాలకులు గ్రామం పేరు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోతున్నారు. కరవు కాటకాలతో.. అదొక మారుమూల గ్రామం. ఒకప్పుడు కరువుకు నిలయంగా ఉండేది. రవాణా సౌకర్యం ఉండేది కాదు. సైకిళ్లు, ఎండ్లబండ్లు వెళ్లేందుకు కనీసం రహదారులు లేని దుస్థితి. పేదరికంలో జీవనం గడిపేవారు. సౌడు భూముల్లో వ్యవసాయం చేయలేక రైతులు ఆకలితో అలమటించే వారు. తినటానికి తిండి లేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిన పరిస్థితి. కరువు కాటకాలు ఇక్కడి ప్రజలను మానసికంగా కుంగదీశాయి. వేరే మార్గం లేక తిండి కోసం ఇక్కడి ప్రజలు పరిసర గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఇలా ఆ ఊరుకు దొంగల ధర్మారం పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ రోజుల్లో ఎక్కడ దొంగతనాలు జరిగినా దొంగల ధర్మారం గ్రామం వారే చేసినట్లుగా నానుడి ప్రచారంలో ఉంది. పేరు మార్చి గౌరవం కల్పించండి మా ఊరు పేరును గౌరవంగా చెప్పుకునేలా ధర్మారంగా మార్చాలి. మేము ఎక్కడికి వెళ్లినా గ్రామం పేరు చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నాం. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ దొంగల ధర్మారం గానే ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని గ్రామం పేరును మార్చాలి. – మాలోతు బీలు నాయక్, మాజీ జెడ్పీటీసీ, అక్కన్నపేట న్యూస్రీల్ప్రభుత్వానికి వినతులు గతంలో గ్రామ సర్పంచ్ సర్పంచ్ మాశెట్టి కనకమ్మ, ఎంపీటీసీ మాలోతు నాను నాయక్లు ప్రభుత్వ రికార్డుల నుంచి దొంగల ధర్మారం పేరును తొలగించాలని తీర్మానం చేశారు. రికార్డుల్లో ధర్మారం పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి పెద్దపెల్లి ఎంపీ సుగుణ కుమారి, అప్పటి ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు, అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
● భక్తజన సంద్రం.. కొమురవెల్లి క్షేత్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేకపూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అలాగే కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టి పూజలు చేశారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
● అయిల్పామ్ టార్గెట్ 6,500 ఎకరాలు ● కొత్త సాగుతో విస్తీర్ణం 19 వేల ఎకరాలకు చేరుకునే అవకాశం ● నర్మెట్ట ఫ్యాక్టరీలో త్వరలో క్రషింగ్ ● ఉత్పత్తులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఆయిల్పామ్ లక్ష్యం ఈసారి ప్రతిష్టాత్మకంగా మారింది. నర్మెట్ట ఫ్యాక్టరీలో త్వరలోనే క్రషింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాగు లక్ష్యం పెరిగింది. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అందుకు తగ్గట్టు ఉత్పత్తులను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాగును కొత్తగా 6,500ఎకరాల్లో పెంచడానికి కార్యాచరణ సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే 12,500 ఎకరాలకుపైగా సాగులోకి రాగా, కొత్త చేపట్టబోతున్న సాగుతో మొత్తం విస్తీర్ణం19వేల ఎకరాలకుపైగా పెంచాలనే లక్ష్యంతో సంబంధిత యంత్రాంగం ముందుకు సాగుతోంది. గజ్వేల్: జిల్లాలో ఆయిల్పామ్ ఫలాలు ప్రారంభమయ్యాయి. 2021–22లో ప్రారంభమైన సాగు ప్రస్తు తం 12,500ఎకరాలకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే 600టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. నర్మెట్ట ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ ప్రారంభం కాకపోవడంతో.. ఆశ్వరావుపేటలోని ఫ్యాక్టరీకి ఇక్కడి ఉత్పత్తులను తరలిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తులను పెంచడానికి అధికార యంత్రాంగం సాగు లక్ష్యాన్ని పెంచింది. ఈ సీజన్లో 6,500ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి మూస పద్ధతుల్లో సాగు కొనసాగడం వల్ల రైతులకు వ్యవసాయం పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్పామ్ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఆయిల్పామ్ సాగు పట్ల ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, సాధారణ రైతులకు 80శాతం సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నారు. మొక్కలతోపాటు ఆయిల్పామ్ తోటల యాజమాన్యానికి అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. ఆయిల్పామ్ గెలల తరలింపుత్వరలోనే క్రషింగ్ ఆయిల్పామ్ పండించిన రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి నర్మెటలో రూ.300కోట్లతో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఇక్కడ క్రషింగ్ను ప్రారంభించి జిల్లా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో గంటకు 30టన్నుల ఆయిల్పామ్ క్రషింగ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రాబోవు రోజుల్లో దీని సామర్థ్యం పెరగనున్నట్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సిద్దిపేటతోపాటు ఈ ప్యాక్టరీ వల్ల ప్రయోజనం పొందే జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లోనూ సాగు పెంపుపై ఫోకస్ పెట్టారు.రైతులను చైతన్యపరుస్తున్నాం జిల్లాలో ఈసారి ఆయిల్పామ్ సాగు లక్ష్యం 6,500 ఎకరాలను సాధించడానికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తాం. ఫ్యాక్టరీలో త్వరలోనే క్రషింగ్ ప్రారంభంకానుండటంతో రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు తీరుతాయి. టన్నుకు రూ.20వేల వరకు ధర పొందే అవకాశం ఉంది. లాభాలిచ్చే ఈ పంట వైపు మళ్లాలని రైతులను చైతన్యపరుస్తున్నాం. – సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
పర్యావరణ హితమే..
రీసైక్లింగ్ పేపర్లను ఒక టన్ను వినియోగించడం వల్ల ఇరవై నాలుగు చెట్లను రక్షించ గలుగుతాం. అలాగే నీళ్లు, విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. చెట్టు కాండం నుంచి గుజ్జును చేసి దాని నుంచి కాగితాన్ని తయారు చేస్తారు. ఇలా తొలిసారిగా వచ్చిన కాగితాన్ని ఐదుసార్లు రీసైక్లింగ్ చేసే వీలుంది. ఇలా దాదాపు 100 చెట్లను నరకకుండా రక్షించవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రీసైక్లింగ్ పేపర్ను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
కాగితం.. కొంగొత్తగా
రీ సైక్లింగ్తో తిరిగి వినియోగం ● ప్రయోగాత్మకంగా సిద్దిపేట డీఆర్డీఏలో అమలు ● మిస్ వరల్డ్ పోటీల బుక్లెట్లకూ ఈ పేపరే.. ● పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు ప్రింటెడ్ పేపర్ అవసరాలు తీరిన తర్వాత పడేస్తుంటాం.. చెత్త వ్యర్థాలు పెరిగిపోతుంటాయి.. అలాంటి వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వైట్ పేపర్గా తయారు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) కార్యాలయంలో రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తూ పర్యావరణ హితంగా నిలుస్తున్నారు. అలాగే హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల బుక్లెట్ల కోసం రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: రీసైక్లింగ్ కాగితం అచ్చం సాధారణ పేపర్ మాదిరిగానే ఉంటుంది. సాధారణ కాగితాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారో అలాగే వినియోగించవచ్చు. ప్రస్తుతం ఏ4 సైజు పేపర్లను సరఫరా చేస్తున్నారు. వీటిని బెండల్ (వెయ్యి) ఏ4సైజు పేపర్లు రూ. 250 నుంచి రూ.270 వరకు విక్రయిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మొత్తం ఇవే పేపర్లను వినియో గిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు సైతం రీసైక్లింగ్ పేపర్లతో తయారు చేసిన నోట్బుక్లనే వినియోగిస్తుండటం విశేషం. -
రంగనాయక సాగర్కు హైకోర్టు న్యాయమూర్తి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధా ఆదివారం మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల అతిథి గృహానికి విశ్రాంతి కోసం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన న్యాయయూర్తి శ్రీసుధా తిరుగు ప్రయాణంలో రంగనాయక సాగర్ అతిథి గృహంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గురించి కాసేపు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీఓ సదానందం, ఏసీపీ మధు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 23న జహీరాబాద్కు ముఖ్యమంత్రి రాక!సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్ లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదగిరి వర్గల్(గజ్వేల్): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన దుండిగల్ యాదగిరి నియమితులయ్యారు. మండలంలో సీఆర్పీగా పనిచేస్తున్న యాదగిరి ప్రస్తుతం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకం చేసినట్లు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్ల ఐక్యత, అభివృద్ధి కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు. వ్రత శోభితం.. భక్తజన సందోహంవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు, వారాంతపు సెలవు కలిసి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, నృసింహుని కల్యాణం, నిజాభిషేకాలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తరించారు. క్షేత్రంలో 20 సత్యనారాయణ వ్రతాలు, 16 కల్యాణాలు, 10 అభిషేకాలు జరిగినట్లు ఆలయ పర్యవేక్షకులు సుధాకర్గౌడ్ తెలిపారు. -
సంగారెడ్డి వాసికి ప్రధాని మోదీ అభినందనలు
జహీరాబాద్: భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లావాసి పట్లోళ్ల లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. కోహీర్ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల లక్ష్మీకాంత్రెడ్డి నాలుగేళ్ల క్రితం భారత వైమానిక దళంలో చేరి ప్రస్తుతం ఫ్లైట్ లెఫ్టినెంట్ ర్యాంక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన అప్రకటిత యుద్ధం నేపథ్యంలో మిగ్ యుద్ధ విమానం, గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శనచక్ర ఎస్–400ను ధ్వంసం చేశామని పాక్ చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపించేందుకు ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లి దాని ఎదుటే నిల్చుని ప్రసంగించారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా భారత జవాన్లనుద్దేశించి ‘మీ మెరుపు వేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసిందని, భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగి పోయార’ని ప్రధాని అభినందించారు. ప్రధానితో కరచాలనం చేసి, అభినందనలు పొందడం తమకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని లక్ష్మీకాంత్రెడ్డి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పేర్కొన్నారు. -
డ్రై డే పాటిద్దాం
పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ సిద్దిపేటకమాన్: ప్రతి శుక్ర, మంగళవారాల్లో డ్రై డే పాటించాలని పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో వైద్య సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వినియోగంలో లేని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సు
ిసిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో త్వరలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఓయూ వైస్ చాన్స్లర్ మొలుగురం కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓయూ పీజీ కళాశాలను ఓయూ బృందం పతినిధులు సందర్శించారు. కళాశాలలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఓయూ ప్రతినిధుల బృందం కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఓయూ పీజీ కళాశాలలోని సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెందర్ కుమార్ నాయక్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, మౌలికసదుపాయాల డైరెక్టర్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి, యూనివర్సిటీ పీజీ (ఓయూ) కళాశాల సమన్వయకర్త డాక్టర్ రవినాథ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మొలుగురం కుమార్ -
నాణ్యమైన విద్యను అందిద్దాం
పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిద్దామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం, ఏఐ శిక్షణ తరగతులు, స్కూల్ యూనిపామ్ల తయారీ, ఉపాధ్యాయ శిక్షణ తరగతులను, కేజీబీవీ సమ్మర్ క్యాంప్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి యూనిపామ్లు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమ్మర్ క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు తమ బోధనను మరింత మెరుగుపర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు దోహదపడుతాయన్నారు. కార్యక్రమాలలో జిల్లా కమ్యూనిటిటీ మోబిలైజింగ్ అధికారి రంగనాథ్, శిక్షణ తరగతుల నిర్వహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
తనిఖీలు సరే.. రికవరీ ఏదీ?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రతీ ఏటా ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలను వెల్లడిస్తారు. కానీ బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడం లేదు. 2018 నుంచి 2025 మార్చి వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో రూ.6.71కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కానీ రికవరీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. దీంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ●● మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉపాధిహామీ పథకంలో రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహించారు. జనవరి 9న మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీలో లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. పని జరగకపోయినా పని జరిగినట్లు రికార్డుల్లో పొందుపర్చడం, మస్టర్లో సంతకాలు లేకుండా చెల్లింపులు చేయడం, తక్కువ పనికి ఎక్కువ చెల్లింపులు జరిగినట్లు తనిఖీ బృందం నిర్ధారించింది. కానీ రికవరీ జాడలేదు. ● మిరుదొడ్డి మండలంలో మార్చి 17న ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. 2024–25లో రూ.2.03,463 అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నా రికవరీ కాలేదు. సాక్షి, సిద్దిపేట: గ్రామీణ పేదలకు పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీ పనులలో భాగంగా గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తీయడం, కల్లాల నిర్మాణం చేపడుతున్నారు. పనుల్లో పారదర్శకత పాటించేందుకు సామాజిక తనిఖీ విధానాన్ని తీసుకవచ్చారు. ఏ స్థాయిలో అవినీతి జరిగినా ప్రజావేదికలో తెలిపోనుంది. పనుల్లో నాణ్యత లేకపోయినా అడిగేవారు కరవయ్యారు. అవకతకలు గుర్తిస్తున్నా మార్పు కనిపించడం లేదు.ఈ పథకంలో ఎక్కువగా కాంట్రాక్ట్ సిబ్బంది ఉండటంతోనే నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. రూ.5.36 కోట్లు పెండింగ్ జిల్లా వ్యాప్తంగా 1.97లక్షల జాబ్ కార్డులుండగా 3.94 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తుంటారు. 2018– 25 వరకు 38,722 పనుల్లో జరిగిన అవకతవకల్లో రూ.6,71,42,134 అక్రమార్కులు సొంతానికి వాడుకున్నట్లు తనిఖీల ద్వారా బయటపడింది. వీటిలో ఇప్పటి వరకు కేవలం రూ.1,34,86,250 మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5,36,55,884 రికవరీ పెండింగ్లో ఉంది. సామాజిక తనిఖీలపై పెట్టిన దృష్టి మండల స్థాయి అధికారులు రికవరీపై పెట్టకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికవరీ లేకపోవడంతో ఉత్తుత్తి సామాజిక తనిఖీలుగానే మిగిలిపోతున్నాయి. నో ఫీల్డ్ విజిట్.. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్లు చేయకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. కూలీలు పనులు చేయకున్నా... చేసినట్లు రికార్డు చేస్తున్నారు. అంతేకాకుండా పనులు ఎక్కడ చేస్తున్నారనేది అధికారులకు తెలియడం లేదు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపడతాం ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. వాటిలో తేలిన అవకతవకలను బహిర్గతం చేస్తున్నాం. గోల్మాల్ జరిగిన డబ్బులను రివకరీ కోసం ప్రత్యేక డ్రైవ్ను త్వరలో ఏర్పాటు చేస్తాం. రెండు నుంచి మూడు నెలల్లో దాదాపు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. –జయదేవ్, డీఆర్డీఓ ఉపాధిలో అక్రమాలు వెలుగు చూస్తున్నా చర్యలు అంతంతే 2018–25 వరకు 38వేల పనుల్లో అవకతవకలు రూ.6.71 కోట్ల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారణ అయినా ఇప్పటి వరకు రూ.1.34కోట్లే స్వాధీనం ఇంకా పెండింగ్లోనే రూ.5.36కోట్లు -
విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి
సిద్దిపేటరూరల్: ‘విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలి. విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 16, 17వ ఎంపీ నిధుల ద్వారా మంజూరై పూర్తికాని పనులు, నిధుల వివరాలను అందించాలన్నారు. తొగుట మండలంలో ఇరిగేషన్ కాలువల తవ్వకం వల్ల వచ్చిన మట్టి, రాళ్లను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుంతో ఇవ్వాలన్నారు. ఎన్సాన్పల్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామన్నారు. దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ కల్పించాలన్నారు. దుబ్బాకలో న్యాక్ వారి సహకారంతో ప్రజలు విదేశాలలో కూడా ఉపాధి పొందేలా వివిధ కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే టెన్త్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన చేయాలన్నారు.కమిషనర్ గైర్హాజర్పై ఆగ్రహం సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ దిశా సమావేశానికి రాకపోవడంపై ఎంపీ రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అండర్గ్రౌండ్ నిర్మాణానికి అందించిన నిధులు, పనుల వివరాలను చర్చించేందుకు కమిషనర్ రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ను సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి దిశా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ -
నేత్రపర్వం.. మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శుక్రవారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. చదువుల తల్లికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. సామూహిక లక్షపుష్పార్చన చేశారు. చండీ హోమం నిర్వహించారు. పలువురు చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేశారు. భక్తులు వేడుకలు తిలకించి తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
మూడెకరాల భూమి ఏమాయె
అక్కన్నపేట(హుస్నాబాద్): నిరుపేదలకు మూడెకరాల సాగు భూమి హామీ నేటికీ అమలు కావడంలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి అన్నారు. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో మండల మహసభ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు కోసం సీపీఐ నిరంతర అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం కాదని, గిట్టుబాటు ధరను రైతులే ప్రకటించేలా హక్కులు కల్పించాలన్నారు. ఉద్యమాలు, ఎర్రజెండాలకు కేరాఫ్ హుస్నాబాద్ నియోజకవర్గమన్నారు. ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి.. తాగు, సాగు నీరు కోసం ఎర్రజెండా నీడలో అనేక ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులని చాడ అన్నారు. కానీ నేటి పాలకులు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాలువల నిర్మాణానికి సుమారుగా రూ.431కోట్లు మంజూరైనట్లు చెప్పి ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం చేపట్టకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతానికి సాగు నీరు రాలేదని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సీపీఐ సత్తాచాటాలని, ఆదిశగా ప్రతి కార్యకర్తలు సైనికులా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు జాగిరి సత్యనారాయణ, ఎడల వనేష్, జనార్దన్, కోయ్యడ కోమురయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు నీరు రాలే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాల్సిందేహుస్నాబాద్: చట్ట సభలకు ఎన్నికై పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వాదులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండాలన్నారు. అధికారుల్లో అవినీతి పెరుకుపోయిందన్నారు. గౌరవెల్లి. గండిపెల్లి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని అనవసరంగా పెంచారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: ఇంటర్ అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం గరిమా అగర్వాల్ అధ్యక్షతన పరీక్షల నిర్వాహణపై సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 29వ తేది వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయన్నారు. సమావేశంలో రెవెన్యూ, వైద్య, మిషన్ భగీరథ, పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
రాయపోల్లో చిరుత కలకలం
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వరుస దాడులతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల పొలాల వద్ద రెండు కుక్కలపై దాడి చేసి చంపడంతో ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 4 నెలల వ్యవధిలో చిరుత మూడు సార్లు కనిపించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రివేళల్లో, వేకువజామున పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరిన్ని దాడులు జరగకుండా చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు. ఆచూకి కోసం.. దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చిరుత పులి ఆచూకి కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత పులిని చూసిన రైతుల నుంచి వివరాలు సేకరించారు. కనబడిన ప్రదేశాన్ని పరిశీలించి పాద ముద్రలను పరిశీలించి చిరుత పులేనని నిర్ధారించారు. చిరుత పులి జాడ కోసం అడవిలో అనుమానిత ప్రదేశాల్లో అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కదలికలను సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఒకే చోట ఉండదు చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఎప్పుడూ ఒకే చోట ఉండదు. రైతులు రాత్రి వేళ పొలాల వద్ద ఉండవద్దు. పశువులను సైతం ఇంటి వద్దే ఉంచాలి. పశువుల మేత కోసం ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – సందీప్ కుమార్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, దుబ్బాక గ్రామ సమీప పొలాల్లో సంచారం వరుస దాడులతో ప్రజల్లో భయాందోళన జాడ కోసం చర్యలు ముమ్మరం ట్రాప్ కెమెరాల ఏర్పాటుఅధికారుల సూచనలు వ్యవసాయ పొలాలు అడవికి దగ్గరగా ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వాలి. పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయవద్దు. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి దగ్గరగా ఉన్న పాలాల్లో ఒంటరిగా తిరుగవద్దు. రాత్రి వేళ రైతులు పొలాల వద్ద ఉండవద్దు. -
మా భూములకు హక్కులు కల్పించండి
అక్కన్నపేట(హుస్నాబాద్): మా భూములకు హక్కులు కల్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. మండల పరిధిలోని నందారంలో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 930 ఎకరాల వరకు పచ్చని పంట పొలాలన్నీ సీలింగ్ భూములుగా ఉండడంతో అమ్మకాలు, కొనుగోలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడంలేదన్నారు. తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న కొహెడ మండల తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు.భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల నిరసన -
ప్రగతి బాటలో కీలక అడుగు
ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రాజెక్ట్ ప్రగతి బాటలో మరో కీలక అడుగు పడింది. ట్రిపుల్ఆర్, జాతీయ రహదారుల సమాహారం, రైల్వేలైన్ ఇతర సానుకూల అంశాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996కోట్ల వ్యయంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి కేంద్రం టెండర్లను పిలిచింది. ఇందుకోసం సుమారు 350ఎకరాల భూసేకరణ కూడా పూర్తయ్యింది. గజ్వేల్: మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు(బహుళవిధ సరుకు రవాణా సేవల సముదాయం) నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం 16 లాజిసిక్స్ పార్కులను మంజూరు చేసింది. అందులో మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో నిర్మించనున్న పార్కు ఒకటి. రూ.996కోట్ల అంచనాల వ్యయంతో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ అయిన నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎల్ఎమ్ఎల్) టెండర్లను పిలిచింది. ఈమేరకు పత్రికల్లో ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడానికి నిర్ణయించారు. వేల కోట్ల పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టుకు నేరుగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ సరుకు రవాణా, సమీకరణ, పంపిణీ లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం త్వరలోనే నిర్మించనున్న ట్రిపుల్ఆర్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మచిలీపట్నం వరకు రోడ్డు కనెక్టివిటీ అవకాశాలు ఉండటంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందడానికి అవకాశం కలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ లాజిస్టిక్ పార్కు నిర్మాణం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ జిల్లా వస్తు రవాణా రంగంలో హబ్గా మారితే.. దీనికి అనుబంధంగా మరెన్నో పరిశ్రమలకు ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ కారణంగా గజ్వేల్లో ఇప్పటికే గూడ్స్ రైళ్లు నడుస్తుండగా, ఎరువుల రేక్ పాయింట్ విజయవంతంగా నడుస్తోంది. లాజిస్టిక్ పార్కు ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనునుంది. దీని ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఎన్నో అనుకూలతలు.. ఎన్నో అనుకూలతల కారణంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి పరికిబండ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే.. ఈ ప్రాంతానికి 44వ నంబర్ ఆరువరుసల జాతీయ రహదారి, కొత్తగా నిర్మాణం కానున్న ట్రిపుల్ఆర్కు సమీపంలో ఉండటం, ఇక్కడి నుంచి హైదరాబాద్, కొత్తపల్లి రైల్వేలైన్లు అనుసంధానం కావడం, హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం కూడా చేరువలో ఉండటం కలిసి వచ్చింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కునిర్మాణానికి సన్నాహాలు పరికిబండ శివారులో350ఎకరాల భూసేకరణ రూ.996కోట్లతో టెండర్లకు ఆహ్వానం లక్షలాదిమందికి ఉపాధి కల్పనే లక్ష్యం -
సరికొత్త సాగుపై దృష్టి సారించండి
నేత్రపర్వం.. తెప్పోత్సవం మిన్నంటిన శ్రీరామ నామస్మరణతో గురువారం రాత్రి కోమటిచెరువులో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. గంగమ్మ ఒడిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా అలంకరించిన బోటులో హనుమంతుని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చెరువు అంతా తిప్పారు. అంతకుముందు రావిచెట్టు హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా కోమటిచెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులో తెప్పోత్సవం వైభోవంగా చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్రావు, పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ, మాలధారులు పెద్ద ఎత్తున పొల్గొని తరించారు. – సిద్దిపేటజోన్ ● పంట మార్పిడితోనే అధిక లాభాలు ● నేపియర్ గడ్డి సాగుతో45 రోజుల్లోనే కోత ● ఎకరం పంటకు రూ.70వేల వరకు ఆదాయం : కలెక్టర్ మనుచౌదరిఅక్కన్నపేట(హుస్నాబాద్): వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగు కాకుండా సరికొత్తగా సాగు చేసేలా ప్రతి రైతు ఆలోచించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మండల పరిధిలోని కుందనవానిపల్లిలో గురువారం ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కృషికల్ప సహకారంతో గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయన్నారు. అందులో అక్కన్నపేట మండలంలోని ప్రసిద్ధ, సహస్ర సంఘాల ద్వారా సరికొత్త పంట సాగు వైపు దృష్టిసారించామన్నారు. పంట మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కృషికల్ప సహకారంతో నేపియర్ గడ్డి సాగుకు రైతులందరూ ఆలోచించుకోవాలన్నారు. ఈ గడ్డి సాగు కేవలం 45రోజులోనే కోతకు వస్తుందన్నారు. నేపియర్ గడ్డి ఒక ఎకరంలో సాగు చేస్తే దాదాపు రూ.70వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ గడ్డితో బయోగ్యాస్ తయారు చేస్తారన్నారు. గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల్లో సుమారు 300ఎకరాల్లో ఈ గడ్డి సాగు చేసేలా రైతులు ముందుకు రావాలన్నారు. ఈ ప్రాంతంలోనే రూ.50కోట్ల వ్యయంతో బయోగ్యాస్ తయారీ కంపనీ ఏర్పాటు చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, హార్టికల్చర్ అధికారి సువర్ణ, కృషికల్ప వ్యవస్థాపకులు పాటిల్, బయోగ్యాస్ కంపెనీ సీఈఓ గుప్తా, హుస్నాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఏలేటి స్వామిరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. నాణ్యమైన ఉచిత విద్యసిద్దిపేటరూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్య అందుతోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో 6 మైనారిటీ గురుకులాలకు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, 2025– 26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో మైనార్టీ గురుకులాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రవేశం పొందాలన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ కో ఆర్డినేటర్ సుధారాణి, జిల్లాలోని మైనార్టీ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శం
ములుగు(గజ్వేల్): అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ములుగు మండలం బస్వాపూర్లో గురువారం ఎంపీ రఘునందన్ రావుతో కలసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఎంపీ రఘునందన్ రావు మట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు అంబేడ్కర్ వల్లే వచ్చాయన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అంబేడ్కర్పై పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరీ శంకర్ ముదిరాజ్, బీజెపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్గౌడ్, శ్రీనివాస్గుప్తా, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంతోనే దళితులకు హక్కులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
వారంలో సీఎం రేవంత్ పర్యటన!
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం న్యాల్కల్(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్థానిక ఎంపీపీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో సీఎం జహీరాబాద్కు వస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజల నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. న్యామతాబాద్, శంశల్లాపూర్, టేకూర్, హుస్సేన్ నగర్, మల్గి, కాకిజన్వాడ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. డప్పూర్, న్యామతాబాద్, వడ్డి, హద్నూర్, రుక్మాపూర్, రాంతీర్థ్ తదితర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య గురించి విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, రాజీవ్ వికాస్ తదితర పథకాలను గూర్చి సమావేశంలో చర్చించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, డీఈఈ సుజాన్, డీపీఓ సాయిబాబా, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, ఆర్డీవో రాంరెడ్డి, ఎంపీఓ సౌజన్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
దండిగా ధాన్యం
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు ● సకాలంలోనే ఖాతాలో డబ్బులు నంగునూరు(సిద్దిపేట): గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు కేంద్రాలు కళకళ లాడుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నా ఆకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నంగునూరు మండలంలో ఐకేపీ ద్వారా ఏడు, పాలమాకుల పీఏసీఎస్ నుంచి 12, నంగునూరు పీఏసీఎస్ ఆద్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని గ్రామాల రైతులు ప్రస్తుత సీజన్లో దొడ్డు రకం వరితో పాటు సన్న వడ్లను సాగు చేశారు. వరి కోతలు ప్రారంభం కాగానే ఇప్పటి వరకు అన్ని సెంటర్లలో ఆశించిన స్థాయికి మించి ధాన్యం కొనుగోలు చేశారు.23 సెంటర్ల ద్వారా .. నెల రోజుల కిందట అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారుల ప్రారంభించారు. 23 సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 2,809 మంది రైతుల నుంచి 1,19,808 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఇందులో ఐకేపీ ద్వారా 1,130 మంది రైతుల నుంచి 41,630 క్వింటాళ్లు, పాలమాకుల పీఏసీఎస్ ద్వారా 1,127 మంది రైతుల నుంచి 54,238 క్వింటాళ్లు, నంగునూరు పీఏసీస్ ద్వారా 552 మంది రైతుల నుంచి 23,940 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పడు ట్యాబ్లో ఎంట్రి చేసి వడ్లను మిల్లుకు తరలిస్తుండడంతో సకాలంలోనే తమ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని రైతులు తెలిపారు. -
నిబంధనలు పక్కాగా పాటించాలి
కండీషన్ లేని స్కూల్ బస్సులనుసీజ్ చేస్తాం: డీటీఓ క్రిస్టోఫర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సుల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ సూచించారు. బుధవారం జిల్లా కార్యాలయంలో స్కూల్ బస్సు యజమానులు, ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల ఫిట్ నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్కూల్ యజమానులు పక్కన పెట్టాలని, రవాణా శాఖ నిబంధనల మేరకు నిర్ణీత గడువు దాటినా వాటిని స్క్రాప్ పరిధిలో చేర్చడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సు ను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కండిషన్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బస్సులో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉండేలా బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందులో అవసరమైన అత్యవసర మందులు ఉంచాలని సూచించారు. ప్రతి బస్సులో అత్యవసర ద్వారం ఉండాలన్నారు. త్వరలో స్కూల్ బస్సుల ఫిట్ నెస్, నిబంధనలపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. -
భక్తులకు ఇబ్బందులు రావొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం స్థానిక పోలీసులకు సూచించారు. బుధవారం ఆలయంలోని గంగిరేణిచెట్టు ప్రాంగణం, సాధారణ, వీవీఐపీ దర్శనం తదితర ప్రదేశాలతో పాటు కొమురవెల్లి పోలీస్స్టేషన్ను చేర్యాల సీఐ శ్రీనుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జేబుదొంగలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ మమ్మురం చేయాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డుప్రమాదాల వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేస్తూ ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని అన్నారు. అనంతరం చేర్యాల మండలం గురిజకుంట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలిమద్దూరు(హుస్నాబాద్): అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. బుధవారం మద్దూరు పోలీస్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్లు ఏసీపీకి పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలన్నారు. అనతంరం ఏసీపీని జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపకులు కొత్తపల్లి సతీష్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ సదానందం కొమురవెల్లి మల్లన్న ఆలయ సందర్శన శాంతిభద్రతలపై సిబ్బందికి సూచనలు -
ఎల్లమ్మ తల్లి సన్నిధిలో జిల్లా జడ్జి
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం జిల్లా జడ్జి సాయి రమాదేవి, ఏసీపీ సదానందంలు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేడు హనుమాన్ తెప్పోత్సవం సిద్దిపేటకమాన్: పట్టణంలోని కోమటిచెరువులో గురువారం హనుమాన్ తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో మాలధారులకు అన్నప్రసాదం 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి కోమటి చెరువు వద్ద తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్య, ట్రస్ట్ సభ్యులు నేతి కై లాసం, గ్యాదరి పరమేశ్వర్, నందిని శ్రీనివాస్, కుమ్మరికుంట రమేష్, తిప్పరాజు మధుసూదన్, చింత శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ హైదరాబాద్లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంతరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు, తల్లి లేదా తండ్రి లేని బాలికలు టెన్త్ పాసై ఉన్న వారు అర్హులన్నారు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్ రెండో అంతస్తు, రూమ్ నంబర్ 528లో సంప్రదించాలని సూచించారు. రేపు క్రికెట్ జట్టు ఎంపిక సిద్దిపేటజోన్: అండర్ –25 విభాగంలో జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 16న నిర్వహించనున్నట్లు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జట్టును ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 31అగస్టు 2000వ సంవత్సరం తర్వాత జన్మించిన వారు జట్టు ఎంపికకు అర్హులని పేర్కొన్నారు. -
తీరుతున్న వేళ
ఏళ్ల కల..హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాలఈ ప్రాంత విద్యార్థుల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతోంది. ఇంజనీరింగ్ విద్య చదివే విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. హుస్నాబాద్ ప్రాంతంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మాపూర్ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంగళవారం భూమిని చదును చేసే పనులను కలెక్టర్ పరిశీలించారు. హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచే కళాశాల స్థాసనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాల నిర్మాణానికి రూ.44.12 కోట్ల నిధులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి చదును చేసే పనులు ప్రారంభించారు. కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి పనులను పరిశీలించారు. జిల్లాలోనే మొదటి కళాశాల జిల్లాలోనే హుస్నాబాద్లో మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) ప్రతి ప్రోగ్రాంలో 60 సీట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో కళాశాలలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. కళాశాల నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా హుస్నాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాల పై అంతస్తులో తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పొన్నం ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ చూపి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయించారు. కరీంనగర్కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్కు తరలించడంపై కరీంనగర్లోని కొందరు నేతలు అభ్యంతరం చెప్పి వివాదానికి తెర లేపారు. ఎవరు ఎమన్నా మంత్రి పొన్నం తనను గెలిపించిన హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడంలో విజయం సాధించారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి.. పొతారం (ఎస్) నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు రహదారి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.11 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇంజనీరింగ్ కళాశాలతో హుస్నాబాద్ ప్రాంతం రవాణా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిర్మాణానికి చర్యలు ముమ్మరం 30 ఎకరాల్లో భూమి కేటాయింపు చదును చేసే పనులను పరిశీలించిన కలెక్టర్ విద్యాభివృద్ధికి కృషి హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్యాపరంగా మరింత అభివృద్ధి చేస్తా. ఇంజనీరింగ్ కళాశాలతో పేద విద్యార్థులకు ఎంతో మేలు. ఇంజనీరింగ్ విద్య కోసం పట్టణాలకు వెళ్లకుండా విద్యార్థుల ముంగిటకే కళాశాలను తెచ్చాను. భవిష్యత్లో విద్యాపరంగా మరిన్ని సదుపాయాలు కల్పిస్తా. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలి. – పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్
హుస్నాబాద్రూరల్: జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్ (న్యాక్) భవనం నిర్మించేందుకు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని సర్వే నంబర్ 265లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామీణ భవన నిర్మాణ రంగ కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి న్యాక్ భవనం ఉపయోగపడుతుందన్నారు. భూమిని న్యాక్ అధికారులకు అప్పగిస్తే భవన నిర్మాణ శంకుస్థాపనకు సిద్ధం చేస్తారన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు చూపిన స్థలంలో ఆర్అండ్బీ గెస్టు హౌస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. హుస్నాబాద్కు 150 పడకల అస్పత్రి మంజూరు అయిందని, దీనిని పాత ఆస్పత్రి భవనాలను కూల్చి అదే స్థలంలో నిర్మించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఎల్లమ్మ చెరువు పర్యటక పనులను పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. ఎండల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులను వర్షం, గాలి దుమారం ఆగమం చేసింది. రోజుల తరబడి మార్కెట్లోనే ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కుప్పలన్నీ నీటి కాలువల్లో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కుప్పలపై కప్పిన ప్లాస్టిక్ కవర్లు సైతం కొట్టుకుపోయి ధాన్యమంతా నీటి పాలైంది. భారీ నష్టం జరగడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగు చేసేందుకు ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. అక్కెనపల్లి లోని ఆయిల్పామ్ తోటను మంగళవారం డీపీఓ దేవకీదేవి, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. 11 నెలల్లో 26 టన్నుల దిగుబడి రావడంతో రూ.4 లక్షల 60 వేల ఆదాయం వచ్చిందని రైతు నాగేంద్రం చెప్పడంతో ఆయనను అభినందించారు. మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు. నర్మేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల రికార్డులను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా చేపట్టాలని అధికారులను సూచించారు. పాలమాకుల ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. ఆమె వెంట హౌసింగ్ డిప్యూటీ ఈఈ శంకర్, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప, గీత, భాస్కర్రెడ్డి, ప్రభాకర్రావు, మౌని, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై వేణుగోపాలుడు
వర్గల్(గజ్వేల్): పురాతన వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు గర్భగుడిలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి మూల విగ్రహాలకు అభిషేకం నిర్వహించి విశేషాలంకరణ చేశారు. రాత్రి స్వామివారి గరుడోత్సవసేవ నేత్రపర్వం చేసింది. సర్వాలంకారశోభితులైన వేణుగోపాలస్వామివారు, రుక్మిణి సత్యభామ సమేతులై గరుడవాహనం అధిష్ఠించారు. పురవీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సేవలో భక్తులు పాల్గొని తరించారు. నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు -
బెజ్జంకి తహసీల్దార్గా వెంకట్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): మండల తహసీల్దార్గా వెంకట్రెడ్డి మంగళవారం బదిలీపై వచ్చారు. ఇక్కడి తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి మిరుదొడ్డి మండలానికి బదిలీ అయ్యారు. సిద్దిపేట రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకట్రెడ్డిని బెజ్జంకి బదిలీ చేశారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటీ గోపాల్, ఆర్ఐ సంతోష్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. కాళేశ్వరంతో చెరువులు నింపండి చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటితో మండల పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అనంతసాగర్లోని అప్పలాయ చెరువు, లింగాయకుంట కలుపుతూ కాలువ నిర్మించాలని, దీంతో చెరువు, కుంటల్లో నీరు నిండి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అధికారులు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా నాయకులు మడిపల్లి బాపయ్యలు పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్ నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లోమా, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం మంగళవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట ఐదు, గజ్వేల్లో మూడు కలిపి మొత్తం ఎనమిది సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా సిద్దిపేటలో 2,606 మందికి 2,467 మంది విద్యార్థులు హాజరయ్యారు. గజ్వేల్లో 1,195 మందికి 1,129 మంది పరీక్ష రాశారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల కన్వీనర్, రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, రెండు వారాల్లో ఫలితాలు వెళ్లడి అవుతాయన్నారు. అన్ని సెంటర్ల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లను సీజ్ చేసి మూల్యాంకన కేంద్రాలకు పంపించామని చెప్పారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం ములుగు(గజ్వేల్): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి, అచ్చాయిపల్లి, కొత్తూరు గ్రామాల్లో మంగళవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రెడ్డి, ప్రశాంత, వాణిశ్రీ, మధుబాబు, పల్లవి, లతీఫ్లు రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సాంకేతిక విషయాలను అవలంబిస్తూ కొత్త వంగడాలను సాగు చేయాలని సూచించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. -
పులకించిన భక్త జనం..
వైభవంగా దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవందుబ్బాక: చౌదర్పల్లిలో స్వయంభువుగా వెలిసిన పార్వతి దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిఏటా వైశాఖ పౌర్ణమిరోజున స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దుబ్బరాజంశర్మ తెలిపారు. సోమవారం రెండోరోజు ఉత్సవ మూర్తులకు స్నపన తిరువంజన కార్యక్రమం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్య కల్యాణోత్సవం అశేషంగా హాజరైన భక్తుల జయజయ ధ్యానాల మధ్య కనులపండువగా జరిగింది. మంగళవారం స్వామివారి రథోత్సవం జరుగుతుంది. -
ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా ఫుల్
●ఇప్పటికే రూ.30కోట్లకుపైగా రాబడి ●అవగాహన కొరవడటంతో కొందరు దూరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకం జిల్లాలో కాసుల వర్షం కురిపించింది. 25శాతం రాయితీ జిల్లాలో సానుకూల ఫలితాలు అందించింది. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణతో రూ.30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వ ఖాజానాలో జమ అయ్యింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినప్పటికీ మరో 70 వేల దరఖాస్తులు పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ప్రక్రియపై మరింత అవగాహన, చైతన్యం కల్పించినట్లయితే కాసులవరద పారేదే. సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో, సుడా పరిధిలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు 2020లో ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 1,01,276 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో వివిధ కారణాలతో అధికారులు 475 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ క్రమంలో 91,159 దరఖాస్తులను రివైజ్డ్ చేసి ఫీజు చెల్లింపు కోసం అనుమతించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ సానుకూల ఫలితాల కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుదారులకు 25 శాతం ఫీజులో రాయితీ ప్రకటించింది. దీంతో ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చి ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 3తో 25 శాతం రాయితీ గడువు ముగియడంతో అధికారిక లెక్కల ప్రకారం రూ.30 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. 91,159 అనుమతించిన దరఖాస్తులలో కేవలం 17,880మంది మాత్రమే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించి సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా 73,279 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించకుండా ప్రక్రియకు దూరంగా ఉన్నారు. వారందరికీ అవగాహన కల్పించి పథకం సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చైతన్యం తప్పనిసరి క్రమబద్ధీకరణ వందశాతం అమలు అయ్యేందుకు ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో స్పందన రావడం లేదు. రాయితీలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లో కొంత కదలిక వస్తోంది. క్రమబద్ధీకరణ ఉద్దేశం.. దాని ప్రయోజనం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం సమయంలో క్రమబద్ధీకరణ చేసుకోవచ్చనే ధీమాతో దరఖాస్తుదారులు ఉండడంతో ప్రక్రియ వందశాతం అమలుకు అడ్డంకిగా మారుతోంది. ప్రజల్లో చైతన్యం ద్వారానే క్రమబద్ధీకరణ లక్ష్యం అధిగమించేందుకు దోహదపడుతుందని చెప్పాలి. -
భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి
మంత్రి ఉత్తమ్కు చాడ వినతి హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 931 కుటుంబాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు, వ్యవసాయ భూములు సర్వం కోల్పోయారని, ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కన్నపేట మండలం, గుడాటిపల్లి గ్రామస్తులు పెట్టుకున్న అర్జీని సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం కావాలి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోమటిబండ సమీపంలోగల పాండవకృష్ణ ధ్యానక్షేత్రంలో గజ్వేల్ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు. బుద్దుడు సూచించిన అష్టాంగ మార్గాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం లభించిందని, సంపూర్ణ ఆరోగ్య జీవితానికి యోగాసనాలు, ధాన్యం దివ్యౌషధంలా పనిచేస్తాయన్నారు. ఈ సందర్భంగా ధ్యాన క్షేత్రం ఆవరణలోని బుద్దుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నర్సింహులు, బాల్రెడ్డి, రాజిరెడ్డి, ప్రభాకర్, సభ్యులు వేణు, ప్రశాంత్, హరి, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల డబ్బులు స్వాహా చేస్తుండ్రు సీఏల చేతివాటంపై కలెక్టర్కు మహిళల ఫిర్యాదు బెజ్జంకి(సిద్దిపేట): మహిళా సంఘాల సభ్యులకు రావాల్సిన రుణాల్లో సీఏలు చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బేగంపేటలోని వర్ధిని గ్రూపు సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి, బేగంపేటలతో పాటు పలు గ్రామాలలో మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండానే లక్షలాది రూపాయల రుణాలు సంఘం బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించిన అనంతరం సీఏలు తమ సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ ఆర్థిక నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సభ్యులు చెల్లించిన నెలసరి వాయిదా కిస్తీల డబ్బులను సైతం అకౌంట్లలో వేయకుండా సొంతానికి వాడుకుంటున్నారని తెలిపారు. ఇటీవల బేగంపేటకు చెందిన బాధిత సంఘం సభ్యులు మండల ఐకేపీ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని వాపోయారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మహిళా సంఘాల సభ్యులకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదుకొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూంల నుంచి వస్తున్న మురుగు బయటకు వెళ్లేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. అలాగే ఏడాది కాలంగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగు అంతా ఇళ్ల మధ్య నిలుస్తోందన్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోందని తెలిపారు. ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలంటూ మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి గ్రామ చెర్వులోకి సాగు నీరు వచ్చేందుకు ఆగిపోయిన కాలువ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామంలో వీధిలైట్లు, మంచి నీటి సరఫరా విషయాల్లో సమస్యలు తలెత్తినప్పడు కార్యదర్శిని సంప్రదించాలంటే అందుబాటులో ఉండటంలేదన్నారు. సమస్యలు పట్టించుకోని కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ వేడుకున్నారు. సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణం పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తంగా 49 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాలువపై బ్రిడ్జి నిర్మించండి చెల్లాపూర్లో కాలువపై బ్రిడ్జి నిర్మించాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో మిషన్ కాకతీయ కాలువ నిర్మించారని, దీంతో దారిలేక 300 మంది రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు. పశువులను తోలుకెళ్లడానికి కూడా తిప్పలు తప్పడంలేదన్నారు. వేరే దారి గుండా వెళ్లాలంటే 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా స్పందించడంలేదని వాపోయారు. కాలువపై బ్రిడ్జి నిర్మించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 49 -
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో పాఠ్యాంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. 208 ప్రాథమిక మండల స్థాయి ఉపాధ్యాయులకు స్థానిక ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో, 438 మంది గణిత, 352 మంది ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 57 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇర్కోడ్లో, 410 మంది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటలో, 22 మంది ఉర్దూ ఉపాధ్యాయులకు నాసర్పుర పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రెండు విడతలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో శిక్షణ పొందిన మండల రిసోర్స్ పర్సన్ లు ఈనెల 20నుంచి మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ విధిగా హాజరు కావాలి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి -
సైన్యానికి మద్దతుగా నిలుద్దాం
ఎంపీ రఘునందన్రావుదుబ్బాక: ఆపరేషన్ సిందూర్తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పహల్గామ్లో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు పాక్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి అండగా ఉందామన్నారు. పహల్గామ్ కన్నీటికి బదులు తీర్చుకున్న దేశం నంగునూరు(సిద్దిపేట): నాడు సీతమ్మ కన్నీరు పెడితే రామ, రావణ యుద్ధం జరిగితే.. నేడు పహల్గామ్లో మహిళలు కన్నీరు పెడితే పాకిస్తాన్తో యుద్ధం జరిగిందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. నర్మేటలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. -
కార్మిక, కర్షకుల పక్షపాతి సీపీఐ
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. మండల పరిధిలోని ఆకునూరులో ఆదివారం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ నిర్వహించారు. అనంతరం ఆయన జెండా ఆవిష్కరించారు. స్థానిక గౌడ కమిటీ హాలులో మండల కార్యదర్శి అందె అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ కార్మిక, కర్షకుల పక్షపాతిగా ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి పిలుపునిచ్చి దున్నేవాడికే భూమి అన్న లక్ష్యంతో సుమారు 10లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిందన్నారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమంలో సైతం కీలకపాత్ర పోషించి ఎందరో కమ్యూనిస్టు నాయకులు అమరులైన విషయం గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ జాతీయ స్థాయిలో ఒకే మాట ఒకే బాటగా నిలిచిన పార్టీ సీపీఐ అన్నారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 4 కోడ్లుగా చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను శ్రామిక వర్గం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భాస్కర్రెడ్డి, కనకయ్య, సత్తయ్య, సత్యనారాయణ, రాజు, పరమశేఖర్, పుల్లారెడ్డి, మల్లేశం, బాలరాజు, నర్సింహులు, వీరయ్య, వెంకటేష్యాదవ్, వినయ్, అశోక్, అనిల్, రాములు, సీతారాములు, యాదయ్య, మహేందర్, ప్రకాశం, భాస్కర్, మహేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలలో కీలక పాత్ర పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ -
నేత్రపర్వంగా ధ్వజారోహణం
వర్గల్(గజ్వేల్): పురాతన ప్రాశస్త్యం కలిగిన వర్గల్ వేణుగోపాలుని కోవెల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఉత్సవాలలో రెండోరోజు ఆదివారం గరుడ ధ్వజారోహణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. సకల దేవతలకు నవాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వానం చేరింది. మొదట విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద పతాకానికి రుత్వికులు షడ్రషోపచార పూజలు చేశారు. భక్తుల కరతాళ ధ్వనులు, మంగళవాయిద్యాల మధ్య గరుడ పతాకం ధ్వజస్తంభ శిఖరాగ్రానికి చేరింది. యాగశాలలో సంప్రోక్షణ జరిపి హోమం నిర్వహించారు.హ్యూమన్రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మహేందర్మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్పల్లికి చెందిన మెడిచెల్మి మహేందర్ జిల్లా హ్యూమన్రైట్స్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. నేషనల్ హ్యూమన్రైట్స్ చైర్మన్ రాజేష్కన్నా ఆచార్య నియామకపత్రాని అందించారు. మహేందర్ మాట్లాడుతూ త్వరాలో జిల్లాల్లో పర్యటించి మానవ హక్కుల గురించి అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.కట్టపై నిఘా నేత్రాలేవీ?దుబ్బాకటౌన్: పట్టణంలోని రామసముద్రం కట్ట సుందరీకరణలో భాగంగా 2019లో స్వర్గీయ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేతుల మీదుగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిఘా నేత్రాల జాడ లేకుండా పోయింది. కట్టపై చిల్డ్రన్స్ పార్కు వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టాండ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఈఏపీసెట్లో 22వ ర్యాంకుకొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఈఏపీసెట్ ఫలితాలలో మండల విద్యార్థి ఉత్తమ ర్యాంక్ సాధించారు. అయినపూర్కు చెందిన తాళ్లపల్లి పాండురంగం కుమారుడు తాళ్లపల్లి వెంకటేష్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ 22వ ర్యాంక్ సాధించారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు అతనిని అభినందించారు. -
దేవుడా.. ఎన్నాళ్లీ వెతలు
ఇన్చార్జి ఈఓలతో ఆలయాల నిర్వహణ ● సమస్యలతో భక్తులు సతమతం ● 30 పోస్టులు ఖాళీ.. గ్రూప్– 2 పైనే ఆశలు సంగారెడ్డి జోన్: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకా ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలు న్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బీ) కేటగిరీలో 12, 6(సీ) కేటగిరీలో 10, 6 (డీ) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర, మెదక్లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని కోటిలింగాల, వెంకటేశ్వర తదితర ఆలయాలున్నాయి. ఒక్కో అధికారికి పదికి పైగా బాధ్యతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓకు సుమారు 10కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నా రు. అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదా లు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది. నియామకం కానీ రెగ్యులర్ అధికారులు ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఈఓగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. -
నేడు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్
● డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ గణేశ్ సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఐఏంఏ హాల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి జనరల్ ఫిజీషియన్ వైద్యుల కాన్ఫరెన్స్ జరుగనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియా సిద్దిపేట శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ క్రాంతికుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వెనిశెట్టి గణేశ్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరల్ ఫీజిషియన్ వైద్యులు పాల్గొంటారని తెలిపారు. చైర్ పర్సన్ డాక్టర్ పెంటాచారి అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో ఇటీవల వైద్య రంగంలో వచ్చిన మార్పులు, రీసెంట్ అప్డేట్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ పైన చర్చించడం జరుగుతుందన్నారు. సిద్దిపేటలో ఏపీఐ మొట్టమొదటి సారిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రెజరర్ డా.ఎన్ గణేశ్, జాయింట్ సెక్రటరీ డా.ఫణిందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు దౌల్తాబాద్ (దుబ్బాక ): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జయదేవ్ ఆర్య సూచించారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ గ్రామంలో గల ఐకేపీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, సీసీ సునీత, వీఏఓ కవిత కమిటీ సభ్యులు గాయత్రీ, రైతులు పాల్గొన్నారు. కలశ ప్రతిష్ట మహోత్సవం ములుగు(గజ్వేల్): మండలంలోని పాత మా మిడ్యాల మెట్టు చింత వద్ద రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవసాయ క్షేత్రంలో కొలువైన అభయాంజనేయస్వామి ఆలయ శి ఖర కలశ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో రేణుకాచౌదరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు, పూజగర్త సంస్కారం, కుంబాభిషేకం, పూర్ణాహుతి మార్జనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవంలో పాల్గొ న్న భక్తులందరికీ అన్నదానం చేశారు. 83 డ్రంకై న్ డ్రైవ్ కేసులు సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి శనివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వాహనాల తనిఖీ నిర్వహించి 83 డ్రంకై న్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 380 కేసులు నమోదు అయ్యాయన్నారు. వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్ పోలీ సు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమర జవాన్కు ఘన నివాళి
సిద్దిపేట జోన్ : భారత్–పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్ర పటానికి శనివారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. జవాన్ మురళీ నాయక్ త్యాగం వృథా కాదని, మన దేశం కచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి, జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజనర్స్, వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 108 హోమ కుండాలతో హనుమాన్ హోమం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో శనివారం 108 హోమ కుండాలతో సామూహిక నవగ్రహ హనుమాన్ హోమం, ఏకాదశ హనుమాన్ మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామి, ఎమ్మెల్యే హరీశ్రావులు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణార్థం విశ్వశాంత్యర్థం, 160వ ఆష్టోత్తర శతకండాత్మక, 108 కుండాలతో హవనం, పూర్ణాహుతి, హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. దుర్గా ప్రసాద్ స్వామి చేతుల మీదుగా ఏ కార్యక్రమం నిర్వహించిన విజయవంతం అవుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాంకాల నవీన్ కుమార్, రామకృష్ణ, వీరేశం, కై లాసం, హరి, పరమేశ్వర్, విశ్వనాథఽశర్మ, కాశీనాద్, రమేశ్, రాము, సంతోష్ కుమార్, సత్యం పాల్గొన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. ఫ్యాక్టరీని అందుబాటులోకి తేవాలి నంగునూరు(సిద్దిపేట): రిఫైనరీ పనులను త్వరగా పూర్తి చేసి జూలై నాటికి ఆయిల్పామ్ ప్యాక్టరీని అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులకు సూచించారు. నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఆయిల్ఫెడ్ కమిషనర్కు ఫోన్ చేసి యుద్ధ ప్రతిపాదికన రిఫైనరీ పనులను చేపట్టాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేయగా మంచి దిగుబడి వస్తోందన్నారు. కొత్త పంట అయినప్పటికీ రైతులు ముందుకు రావడంతో వారి మేలు కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్రెడ్డి, సోమిరెడ్డి, సారయ్య, రమేశ్ గౌడ్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీగా ఇవ్వాలి
● సీఎంఆర్ ఆలస్యం, అక్రమాలకుచెక్ పెట్టేందుకు బ్యాంక్ గ్యారంటీలు ● ముందుకొచ్చింది 93 మిల్లులు,ఇంకా ఇవ్వనివి 30 ● కేటాయించే ధాన్యంకు 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ● 3.5 లక్షల టన్నుల ధాన్యం సేకరణ దాటితే ఇబ్బందే ● ఇప్పటి వరకు 1.9 లక్షలమెట్రిక్ టన్నులు కొనుగోలుసాక్షి, సిద్దిపేట : మిల్లర్లు సీఎంఆర్ ఆలస్యం.. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీని తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా 123 రైస్ మిల్లులుండగా ఇప్పటి వరకు బ్యాంక్ గ్యారంటీ 93 మిల్లులు సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు అందించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ.. ఆకాల వర్షాలతో కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దాటితే ధాన్యం నిల్వ పెట్టేందుకు ఇబ్బందికర పరిస్థితులు రానున్నాయి. 10 శాతం బ్యాంక్ గ్యారంటీలు నిర్దేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, ధాన్యం మాయం కావడం లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు జరగడంతో మిల్లర్ల దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో హుస్నాబాద్ ఏఆర్ఎం ఆగ్రో ఇండ్రస్టీస్ మిల్లులో రూ.27.76 కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యంను అక్రమంగా మిల్లు యజమాని విక్రయించారని తేలింది. ఇలా జరిగినప్పుడు ధాన్యం రికవరీ కష్టంగా మారుతోంది. బకాయిల్లేని మిల్లర్లు కేటాయించిన ధాన్యంలో 10 శాతం, బకాయిపడి తీర్చని వారు 20 శాతం, బకాయి తీర్చి పెనాల్టీ కట్టని వారు 25 శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలని నిర్ణయించారు. వెనుకడుగు వేస్తున్న మిల్లుల యజమానులు జిల్లాలో పలు రైస్ మిల్లులు బ్యాంక్ గ్యారంటీ అంటే వెనుకడుగు వేస్తున్నారు. ఆయా మిల్లులపై బ్యాంక్లకు నమ్మకం లేకనా..? బ్యాంక్ గ్యారంటీ ఎందుకు ఇవ్వాలనినా..? రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆయా మిల్లుల్లో ఇప్పటికే గత వానాకాలం, యాసంగికి సంబంధించిన ధా న్యం నిల్వలున్నాయి. బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోవడంతో గతంలో కేటాయించిన ధాన్యం నిల్వలు ఉన్నాయా లేదా అని అధికారుల్లో ఆందోళన మొదలైంది. బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వని మిల్లులను తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3.5 లక్షల టన్నులు దాటితే ఇబ్బందే.. జిల్లా వ్యాప్తంగా 417 కొనుగోలు కేంద్రాల్లో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేశారు. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దాటితే నిల్వ పెట్టేందుకు ఇబ్బందులు తప్పవు. నిల్వలకు స్థలం ఉన్నప్పటికీ మళ్లీ ఆయా మిల్లుల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి. 3.5 లక్షల టన్నుల ధాన్యం దాటితే ఎలా అని అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికై నా జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి ధాన్యం సేకరణ ఎక్కువైనా సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి పెడితేనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవు.గోదాంలలో భద్రపరుస్తాం మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీకి అనుగుణంగా 3.5 లక్ష టన్నుల ధాన్యంను కేటాయిస్తాం. మిగిలిన ధాన్యంను గోదాంలకు, ఇతర జిల్లాలకు పంపిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
వైభవంగా శనిత్రయోదశి మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాసరస్వతీ శనీశ్వర క్షేత్రం శనిత్రయోదశి మహోత్సవంతో అలరారింది. భక్తజన సామూహిక తైలాభిషేకాలతో శనీశ్వరుని సన్నిదానం కిటకిటలాడింది. శనివారం ఉదయం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేడుకలకు అంకరార్పణ జరిగింది. ఆలయ మహామండపంలో భక్తులు బారులుతీరి కూర్చుని భక్తి శ్రద్ధలతో శనీశ్వర పూజ నిర్వహించారు. అనంతరం శని భగవానుడి మూల విగ్రహానికి తిల, తైలం సమర్పించారు. దోషాలు తొలగించి శుభాలు చేకూర్చాలని ప్రార్థించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. శనీశ్వర పూజ అనంతరం సరస్వతీ అమ్మవారిని, ఉప ఆలయాల్లో దేవతామూర్తులను దర్శించుకొని మహా ప్రసాదం స్వీకరించారు. క్షేత్రాన్ని గజ్వేల్ కోర్టు న్యాయమూర్తి స్వాతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. క్షేత్రంలో 1,000 వరకు సామూహిక తైలాభిషేకాలు జరిగినట్లు ఆలయ మేనేజర్ రఘుపవన్ పేర్కొన్నారు. భక్తజన సామూహిక తైలాభిషేకం -
ఓపెన్ జిమ్.. కొందరికే పరిమితం
● మున్సిపాలిటీ శివారులో ఏర్పాటు ● పక్కనే చెరువు, ప్రమాదకరంగా కాల్వ ● 19 వేల జనాభాకు ఒక్కటే జిమ్ ● వినియోగించుకోలేకపోతున్నమహిళలు, చిన్నారులు ● మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని వినతిచేర్యాల(సిద్దిపేట): పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ శివారులోని పెద్ద చెరువుకట్టపై గత పాలకవర్గం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసింది. పట్టణానికి దూరంగా చెరువుకట్టపై ఉండటంతో అది కొంత మందికి మాత్రమే పరిమితమవుతోంది. పట్టణ పరిధిలో 12 వార్డులు ఉండగా, 19 వేల జనాభా ఉంది. కానీ పట్టణంలో ఒకే ఒక్క ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అది చెరువు కట్టపై ఏర్పాటు చేయడంతో మహిళలు, చిన్న పిల్లలు రావడానికి జంకుతున్నారు. కట్ట మీద వాకింగ్ చేసే వారికి సరిపోక వ్యాయామం చేయలేకపోతున్నామని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిమ్ పక్కనే చెరువు, కాల్వ పట్టణ శివారులోని చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో కేవలం కొంత మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. జిమ్కు ఒక పక్క చెరువు, మరో పక్క చెరువు అలుగునీరు వెళ్లేందుకు తీసిన కాల్వ, కట్ట ప్రారంభంలో మార్చురీ ఉన్నాయి. దీంతో మహిళలు, చిన్నారులు ఓపెన్ జిమ్కు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని కుడి చెరువు, పెద్దమ్మగడ్డ, శ్రీనగర్ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా వంటి ముఖ్య కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం, మున్సిపల్ అదికారులు స్పందించి పట్టణ పరిధిలో మరికొన్ని ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మిలింద్ కాంబ్లీ సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ అన్నారు. సిద్దిపేట జిల్లా జైలును శనివారం పరిశీలించారు. జైలులోని వంట గది, టాయిలెట్స్ను తనిఖీ చేశారు. భోజన వసతుల గురించి జైలు సూపరింటెండెంట్ వికాస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఖైదీల అందరికీ అడ్వకేట్స్ ఉండాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వికాస్, బాలయ్య, జైలు సిబ్బంది పాల్గొన్నారు. బాల సదనం సందర్శన సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సాయిరమాదేవి ఆదేశాల మేరకు శనివారం ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ స ర్వీసెస్ అథారిటీ ఇన్చార్జి సెక్రటరీ మిలింద్ కాంబ్లీ సందర్శించారు. బాల సదనం పిల్లల ఆరోగ్యం, యోగ క్షేమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల సదనం సిబ్బంది రిజిస్టర్ పరిశీలించారు. భోజనం నాణ్యత, వంటగది. పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో బాల సదనం సూపరింటెండెంట్ మమత, న్యాయవాది నాగపూజ, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడి ప్రాణం తీసిన అతివేగం
రోడ్డుపై తాతతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టిన కారు జగదేవ్పూర్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని చాట్లపల్లిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిలుముల కృష్ణ–మమత దంపతుల కుమారుడు హర్షవర్ధన్(5) తాతతో కలిసి రోడ్డుపైకి వచ్చాడు. ఈ క్రమంలో జగదేవ్పూర్ నుంచి వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోగా గ్రామస్తులు సుమారు 10 కిలోమీటర్ల మేర వెంబడించి నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. శుభకార్యానికి వచ్చి వాగులో పడి మిరుదొడ్డి(దుబ్బాక): వాగులో పడి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అల్వాల శివారులోని కూడవెల్లి వాగు లో శనివారం జరిగింది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన చామంతి మహేశ్(30) మండల పరిధిలోని అల్వాలకు చెందిన బంధువు బాబూరావు ఇంట్లో శుభకార్యానికి శుక్రవారం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసొచ్చాడు. అదే రోజు బైక్పై బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. శనివారం అల్వాల శివారులోని కూడవెల్లి వాగులో మహేశ్ మృతదేహమై తేలుతూ కనిపించాడు. మద్యం సేవించి వాగులో స్నానం చేయడానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు నిర్ధారించారు. మృతుడి భార్య కనకలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బంగారం కోసమే మహిళ హత్య
● నిందితురాలి అరెస్ట్ ● వివరాలు వెల్లడించినగజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి గజ్వేల్రూరల్: మహిళను హత్యచేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితురాలిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. శనివారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల ఏసీపీ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రహమత్నగర్కు చెందిన గడియారం బాలమణి(62)కి ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. కుమారులకు వివాహం కావడంతో బాలమణి ఒక్కతే నివసిస్తుంది. ఈమెకు పట్టణంలోని సంగాపూర్ మార్గంలో ఉండే రజియా అలియాస్ హసీనాతో ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. రజియా తనకు డబ్బులు అవసరమైనప్పుడు బాలమణి వద్ద తీసుకునేది. పలుమార్లు బాలమణి ఇంటి వద్ద ఇద్దరూ కలిసి కల్లు తాగారు. ఈ క్రమంలో బాలమణి వద్ద చెవి కమ్మలు, వెండి కాళ్ల కడియాలు, డబ్బులు ఉండడాన్ని గుర్తించిన రజియా ఆమెను చంపి వాటిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంది. 8వ తేదీన రజియా బాలమణి ఇంటికెళ్లి ఆమెకు మాయమాటలు చెబుతూ మెడలో ఉన్న పసుపుదారంతో వెనుక నుంచి గట్టిగా బిగించి చంపేసింది. అనంతరం బంగారు చెవి పోగులు, వెండి కాళ్ల కడియాలు ఎత్తుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమరాలు, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి రజియాను అదుపులోకి తీసుకొని దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకొని జ్యుడీ షియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. -
కడుపునిండా కమ్మని భోజనం
● ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం ● పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ ● రోజూ సుమారు 125 మందికి వితరణ ● 365 రోజులూ భోజనం అందించాలని సంకల్పంస్టీల్ ప్లేట్ల వినియోగం అన్నదాన కార్యక్రమంలో పేపర్ ప్లేట్ కాకుండా స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. సేవతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు వాడకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్లు వాడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా శుచి, శుభ్రత పాటిస్తున్నారు.హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెడుతోంది ఆర్యవైశ్య ట్రస్ట్. 365 రోజులూ అన్నదానం చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టింది. హుస్నాబాద్కు చెందిన ఆర్యవైశ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు భోజనం అందించేందుకు ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 20 మందితో ఏర్పడిన ట్రస్ట్లో ప్రస్తుతం 170 మంది సభ్యులున్నారు. ప్రతి సభ్యుడు రూ.5వేలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వ ఆస్పత్రిలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 100 నుంచి 125 మందికి భోజనం పెడుతున్నారు. 365 రోజులూ అన్నదానం చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 47 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే సభ్యత్వం తీసుకోని ఆర్యవైశ్యుల్లో ఎవరైనా పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకల సందర్భంగా ట్రస్ట్కు రూ.5వేలు చెల్లిస్తే వారి పేరిట కూడా అన్నదానంతో పాటు అరటి పండ్లు, ఏదైనా స్వీటు ఇచ్చి ఈ మహాకార్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత రేకుల షేడ్లోనే అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగుతోంది. రెండు రకాల కూరలు, సాంబారు, చెట్ని, మజ్జిగ, అరటి పండ్లతో భోజనం పెడుతున్నారు. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు కాకుండా వారి సహాయకులుగా వచ్చిన వారికే ఈ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. పేషంట్లకు ఆస్పత్రి వర్గాలే డాక్టర్ల సూచన మేరకు భోజనం కల్పిస్తున్నారు. పేషంట్లకు తోడుగా వచ్చే కుటుంబ సభ్యులు ఆకలికి ఇబ్బంది పడకుండా భోజనం పెట్టి కడుపు నింపుతున్నారు. వీరితో పాటుగా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కూడా భోజనం చేసి ఆకలిని తీర్చుకుంటూ అన్నదాత సుఖీభవ అని దీవిస్తున్నారు. ఈ మహా కార్యాన్ని రాష్ట్రంలోనే కరీంనగర్లో ఆర్యవైశ్యులు మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీకారం చుట్టారు. రెండోవది హుస్నాబాద్ ఆర్యవైశ్యులే. ఈ ట్రస్ట్లో కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.భవిష్యత్లో నిరంతరం ఆర్యవైశ్యుల సహకారంతో వారానికి నాలుగు రోజులు మాత్రమే భోజనం అందిస్తున్నాం. భవిష్యత్లో నిధిని బట్టి నిరంతరం భోజన సౌకర్యం కల్పిస్తాం. ప్రస్తుతం 365 రోజులు అనుకున్నాం. ట్రస్ట్లో చేరేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. పేదలకు అన్నదానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. – చందా శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యుడు, హుస్నాబాద్ -
పోస్టాఫీస్లో ‘ఆధార్’ సేవలు
గజ్వేల్రూరల్: పోస్టాఫీస్లో ఆధార్ సేవలను అందిస్తున్నామని మెదక్ డివిజన్ పోస్టల్ ఎస్పీ శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐఓసీ) ఆవరణలోని సబ్ పోస్టాఫీస్లో ఆధార్ సేవలు ప్రారంభించామన్నారు. కొత్తగా ఆధార్కార్డు నమోదు, మార్పులు, చేర్పులు, ఫొటో ఐడెంటిటీ, బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా ఆధార్ సేవలను సులభంగా పొందవచ్చన్నారు. మున్సిపాలిటీతో పాటు సమీప గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైభవంగా రథోత్సవందుబ్బాక: పట్టణంలో శుక్రవారం కాశీవిశ్వనాథ స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే మొదలైన స్వామివారి రథోత్సవం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కనులపండువగా జరిగింది. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ మాలధారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12 నుంచి స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్లు సిద్దిపేటకమాన్: రిజిస్ట్రేషన్, స్టాంపుల కార్యాలయాల్లో 12వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగనున్నట్లు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ గంట శ్రీలత, రూరల్ సబ్ రిజిస్ట్రార్ మహేశ్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ.. అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఆస్తులను స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఒక రోజులో 48 స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇకపై స్లాట్ బుకింగ్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. మంచి నడవడిక నేర్పించండి నారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ప్రభుత్వం మినీఅంగన్వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ చేస్తూ వేతనాన్ని రూ.7,800 నుంచి రూ.13,650లకు పెంచిన నేపథ్యంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తుకు కేంద్రాలు దోహదపడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త విద్యాసంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించనున్నందున టీచర్లు పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి బంగారు బాటలు వేయాలన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులుండొద్దు
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మండలంలోని జప్తినాచారంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. అలాగే వెలికట్టలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సదుపాయం లేదని హమాలీలు చెప్పడంతో వెంటనే ఆమె ఐకేపీ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఐకేపీ అధికారుల రిజిస్టర్లను పరిశీలించారు. వెలికట్ట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించి అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓ, ఏపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎపీఓ మల్లికా ఐకేపీ ఏపీఎం మగ్దుం అలీ, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
ఆధునిక పద్ధతులే సాగుకు ఊతం
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతి రైతు ఆధునిక సాగు పద్ధతులను అవలబిస్తేనే మంచి దిగుబడులు వస్తాయని జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు రమాదేవి, సరిత అన్నారు. శుక్రవారం మిరుదొడ్డిలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం తోర్నాల, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. యూరియా వాడకం, అవసరాల మేరకు రసాయన ఎరువుల వినియోగం, నేల సంరక్షణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూస పంటల సాగుకు స్వస్తి పలకాలన్నారు. కాలానుగుణంగా పంటల సాగులో నీటిని ఆదా చేసుకుంటూ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను గుర్తించి యాంత్రిక సాగు విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం ఆయిల్పామ్ తోటలు కోత దశకు వచ్చిన నేపథ్యంలో మార్కెటింగ్ చేయడానికి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ శంకర్, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఉద్యాన శాఖ అధికారి రమేష్, ఏఈఓలు రూఖ, అఖిల్, ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
గజ్వేల్: మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. శుక్రవారం గజ్వేల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు 350నుంచి 400 ప్రసవాలు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్.. ఇందులో ఎక్కువగా నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది పేషంట్లతో ఆత్మీయంగా మెలుగుతూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం మరింతగా బలపడేలా కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, పేషంట్లు కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు, అదనపు మరుగుదొడ్లు కావాలని, మెటర్నల్ ఐసీయూ సేవల కోసం మత్తుమందు డాక్టర్ ఒకరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యులు కలెక్టర్ను కోరారు. వారి విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల కో–ఆర్డనే టర్ డాక్టర్ అన్నపూర్ణ, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ శ్రావన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల భూములు పరిశీలనజగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని మునిగడప రెవెన్యూ పరిధిలో పలుగుగడ్డ, మందాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను గతంలో టీజీఐఐసీకి అప్పగించారు. శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి పలుగుగడ్డ గ్రామంలోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయిలో భూమి వివరాలపై నివేదిక తయారు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే భూముల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, డీసీహెచ్ఓ అన్నపూర్ణ, తహసీల్దార్ నిర్మల, డిప్యూటీ తహసీల్దార్ రఘువీరారెడ్డి, టీజీఐఐసీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి గజ్వేల్లోని మాతాశిశుసంరక్షణ ఆస్పత్రి సందర్శన -
డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం
సిద్దిపేటరూరల్: చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించి అందిస్తామని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు, చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి వేగంగా పూర్తి చేయాలని అధికారును ఆదేశించారు. లబ్ధిదారులు ఎవరు కూడా అధైర్య పడవద్దని అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన పుల్లూరులోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
అదనపు కలెక్టర్ హమీద్ ములుగు(గజ్వేల్): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ హమీద్ సూచించారు. గురువారం మండలంలోని నర్సాపూర్, సింగన్నగూడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించిన రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఆన్లైన్ పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ ఆరీఫా, ఆర్ఐ హరీష్, ఏఈఓ అనూజ్ణ, నాయకులు పాల్గొన్నారు. -
స్కానింగ్లు.. పరీక్షలు
ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి పరీక్షలు, స్కానింగ్లు చేస్తూ రోగుల నుంచి వేలాది రూపాయలు గుంజుతున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అర్హత, అనుభవం లేని కొంతమంది చేస్తున్న వైద్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు రోగి ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులెవరూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రైవేట్ ఆస్పత్రుల పై ప్రత్యేక నిఘా పెట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
చేతికొచ్చింది
ఆయిల్పామ్..సాగు అత్యంత లాభదాయకంజిల్లా వ్యాప్తంగా 12,339 ఎకరాల్లో సాగు ● నర్మేట ఫ్యాక్టరీలో ప్రారంభమైన కొనుగోళ్లు ● లాభాలు గడిస్తున్న రైతులు సిద్దిపేటరూరల్: ఆయిల్పామ్ సాగు అత్యంత లాభదాయకమని, సాగు వైపు రైతులను మళ్లించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సాగు లక్ష్యం చేరుకునేలా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయిల్ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో గరిమా అగర్వాల్ సమావేశం నిర్వహించారు. ముందుగా ఉద్యానశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12,339 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు అవుతుందన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 6500 ఎకరాల లక్ష్యం పెట్టుకుని ఇప్పటివరకు 665 ఎకరాలు 188 మంది రైతులను గుర్తించామన్నారు. అలాగే 209 మంది రైతుల నుంచి ఉత్పత్తులను ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. 6,500 ఎకరాల జిల్లా లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ అధికారులందరి సమన్వయంతో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉద్యానశాఖ జారీ చేసిన ఆయిల్పామ్ సాగు కరపత్రాన్ని అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఏఓ రాధిక, ఉద్యానశాఖ అధికారి సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.నంగునూరు(సిద్దిపేట): అన్నదాతలకు ఆయిల్పామ్ సాగు వరంలా మారింది. నాలుగేళ్ల కిందట సాగు చేసిన ఆయిల్పామ్ పంట దిగుబడులు చేతికొస్తుండటంతో అన్నదాతలను లాభాల బాట పట్టిస్తోంది. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నర్మేటలో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండలం నర్మేటలో ప్రభుత్వం ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ నెలకొల్పడంతో జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది. 2022లో 2,774 ఎకరాల్లో సాగు చేయగా 2025లో 12,339 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రంగనాయకసాగర్, ములుగు, ఎల్లాయిగూడ గ్రామాల్లో మూడు చోట్ల నర్సరీలను ఏర్పాటు చేసి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా డ్రిప్పును అందజేసింది. కొనుగోళ్లు ప్రారంభం మొదటి సంవత్సరం ఆయిల్పామ్ సాగు చేసిన మొక్కలు 2024లో మొదటి క్రాఫ్ చేతికి రావడంతో నర్మేటలో కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల నుంచి ఇప్పటి వరకు 492.9 టన్నుల ఆయిల్పామ్ గింజలను సేకరించి అప్పరావుపేట, అశ్వరావ్పేట లోని ఆయిల్ కర్మాగారానికి తరలించారు. పంటను అమ్మిన మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో క్వింటాలుకు రూ.1,330 ధర ఉండగా ప్రస్తుతం రూ. 2,100 మద్దతు ధర లభిస్తోంది. రూ.4లక్షలు సంపాదించా నాలుగేళ్ల కిందట ఆయిల్పామ్ సాగు చేశా. చెట్లు ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. ప్రతి 15 రోజులకోమారు గెలలను తెంపుతూ ఇప్పటి వరకు 13 సార్లు నర్మేటకు తరలించి రూ.4 లక్షలు సంపాదించా. అంతర పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చు. – నాగేంద్రం, అక్కెనపల్లి రైతు రైతులను ప్రోత్సహించాలి ఆయిల్పామ్ సాగులక్ష్యం చేరుకోవాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆయిల్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ఏపీ పోలీసుల తీరు దారుణం ● సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు ● నల్ల బ్యాడ్జీలతో నిరసన సిద్దిపేటకమాన్: ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను బాహ్య ప్రపంచానికి తెలుపుతున్న సాక్షి మీడియాపై కక్షతో తనిఖీల పేరిట ఏపీ పోలీసుల తీరు.. ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నామని జిల్లా జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు. విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డి ఇంటిపైన పోలీసుల దాడిని ఖండిస్తూ గురువారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (143) జిల్లా ఇన్చార్జి గందే నాగరాజు, టీయూడబ్ల్యూజే(ఐజేయూ)నాయకులు రమణరావు, అంబటి యాదగిరిగౌడ్ లు మాట్లాడుతూ.. ఎలాంటి సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టుల స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాలు ఏపీలో జరగడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా జర్నలిస్టుల గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టులు పనిచేస్తుంటారని, దాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజు, బాల్ నర్సయ్య, చంద్రమౌళి, దయానంద్, ఇంద్రసేనారెడ్డి, మురళి చారి, నరేష్, సాయి, సంతోష్, చందు, శ్రీనివాస్రెడ్డి, కుమార్, శ్రీకాంత్, గిరి, నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి పోలీసు కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించబోమని తెలిపారు. అక్రమార్కులపై పీడీ యాక్టు అమలు చేస్తామన్నారు. అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షించాలని తెలిపారు. నకిలీ విత్తనాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా పోలీసు కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100కు సమాచారం అందించాలని తెలిపారు. నాచగిరిలో ఉత్సవాలకు అంకురార్పణ వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలో గురువారం రాత్రి స్వామివారి జయంత్యుత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ముఖ్యఅర్చకులు జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామివారి సన్నిధిలో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పగిలిన భగీరథ పైపు లైన్ మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం మిషన్ భగీరథ పైపు లైన్ పగిలిపోయింది. గంటల తరబడి నీరు ఎగసిపడ్డా యి. నీరంతా వృథాగా పోయింది. అధికారుల కు స్థానికులు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపి వేశారు. అనంతరం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. రైతులకు రూ.9కోట్ల రుణాలు సిద్దిపేటకమాన్: వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రైతులకు రూ.9కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు తెలిపారు. సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో రైతులతో గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్డీఎం హరిబాబు, రీజినల్ హెడ్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి రాధిక, డీడీఎం నిఖిల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ వ్యవసాయ పథకాలు, నాబార్డ్ సబ్సిడీ వివరాల గురించి అవగహన కల్పించినట్లు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. కార్యక్రమంలో సెరికల్చర్ అధికారి ఇంద్రసేనారెడ్డి, బ్రాంచ్ మేనేజర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి జిల్లా కోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు బెజ్జంకి(సిద్దిపేట): గుగ్గిల్ల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన భూగర్భజలాలు అడుగంటడమే కాకుండా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళనలు చేశామన్నారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో చేపట్టవలిసిన ఫ్యాక్టరీలు గ్రామాల మధ్య నిర్మించడాన్ని తప్పుబట్టారు. 2023లో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు నిర్మాణం పనులు, ఉత్పత్తులు నిలిపేయాలని తాత్కాలిక స్టే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఆగయ్య, రంజిత్, నరేందర్, శంకర్బాబు, ధర్మారెడ్డి, సురేష్, కిరణ్ పాల్గొన్నారు. -
పాక్వి కవ్వింపు చర్యలు
విజయం మనదే.. ● పొన్నం ప్రభాకర్ ● మంత్రికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ హుస్నాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాతాప పడకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి జన్మదిన సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు. పలు శాఖల అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ భారత ప్రభుత్వం సరైన విధంగా స్పందించి జరిపిన దాడులకు, ఆ పాత్ర పోషించిన త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ చర్యలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఎవరైనా సున్నితమైన అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసులకు చెప్పాలని సూచించారు. సైనికులు ఉండే కంటోన్మెంట్ ఏరియాలకు అండగా ఉంటూ సహకరించాలని కోరారు. ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం మనదే.. ఆపరేషన్ సిందూర్లో భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించవద్దని.. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని, భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని గురువారం చిన్నకోడూరులోని శేరుపల్లి ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు పలు ఆలయాల్లో పూజలు చేశారు. హనుమాన్ మాలధారులు, యువత పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
చిట్యాల వాసికి డాక్టరేట్
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని చిట్యాలకు చెందిన యాసరేణి కిష్టయ్య(కృష్ణ)కు అర్థశాస్త్ర విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎం.రాములు పర్యవేక్షణలో ‘గ్రామీణాభివృద్ధిలో స్వయంసహాయక బృందాల పాత్ర సిద్దిపేట జిల్లా’ అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువు చదివి డాక్టరేట్ పొందిన కృష్ణను గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. డాక్టరేట్ పొందడానికి సహాయసహకారాలు అందించిన ఓయూ అర్థశాస్త్ర ప్రొఫెసర్లు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పచ్చిరొట్ట ప్రాధాన్యత మరవొద్దు
వర్గల్(గజ్వేల్): సస్యరక్షణలో రసాయన, పురుగు మందులను అవసరం మేరకే వాడాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీజయ, రమాదేవి అన్నారు. మంగళవారం వర్గల్ మండలం తున్కిఖాల్సా రైతువేదికలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయన పురుగుమందులు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని సూచించారు. సస్యరక్షణలో జీవనియంత్రణ, సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలన్నారు. పచ్చిరొట్ట ప్రాధాన్యత విస్మరించొద్దన్నారు. పంట మార్పిడి, వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, మినుములు, పెసర్లు, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవాలన్నారు. ఏఓ శేషశయన మాట్లాడుతూ రైతులు విశిష్ఠ గుర్తింపు సంఖ్య కోసం ఏఈఓలను సంప్రదించి నమోదుచేయించుకోవాలన్నారు. ఉద్యానఅధికారి రమేష్ కూరగాయ, పండ్లతోటల యాజమాన్యం గురించి వివరించారు. అవసరం మేరకే రసాయన ఎరువులు వాడాలి తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
మార్కెట్ యార్డును సందర్శించిన అదనపు కలెక్టర్సిద్దిపేటజోన్: స్థానిక మార్కెట్ యార్డును మంగళవారం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు అదనపు కలెక్టర్ యార్డులోని రైతుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం పరిస్థితిని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం లిఫ్ట్ చేయకపోవడం తదితర సమస్యల వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని వివరించారు. ఇప్పటికే మార్కెట్లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో ధాన్యం నీటిపాలు అయిందన్నారు.హుస్నాబాద్రూరల్/మద్దూరు: హుస్నాబాద్, మద్దూరు మండలాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. అలాగే వరి పంట నేలవాలి వడ్లు రాలిపోవడంతో రైతులకు తీరని నష్టం జరిగింది. గాంధీనగర్లో పోలు స్వామి ఇంటి పైకప్పు గాలికి కొట్టుకపోవడంతో కుటుంబానికి నీడ లేకుండా పోయింది. అలాగే మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. కూటిగల్లో తూకం వేసేందుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం అకాల వర్షానికి పక్కనే ఉన్న చెరువులోకి కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన -
దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ షురూ
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మంగళవారం దోస్త్ జిల్లా సహాయక కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిందని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కళాశాలలోని జిల్లా సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. దోస్త్ కోఆర్డినేటర్ డా.భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు రూ.225 చెల్లించి ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. 29న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ పిట్ల దాసు, డా.శ్రద్ధానందం, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో... సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజిక్స్లో 60, లైఫ్సైన్స్లో 60, బీకాంలో 60, బీఏలో 60 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు అప్రెంటిస్ అధారిత కోర్సులైన బీకాం రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 9441136224, 9440571832 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఈ నెల 21వరకు రిజిస్ట్రేషన్లు -
పంట నష్టాలపై నివేదిక ఇస్తాం
కొండపాక(గజ్వేల్): గాలివాన బీభత్సానికి దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి అందజేసి పరిహారం అందేలాచూస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం కొండపాక మండలం వెలికట్టలో వరి పొలాలు, విశ్వనాథపల్లి, రవీంద్రనగర్లో దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు. ఎంత మేర పంట నష్టం జరిగిందని, ఆర్థికంగా ఎంత నష్టపోయారని రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రాస్థాయిలో పరిశీలన చేసి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్య పడొద్దని నష్టం జరిగిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామన్నారు. ఆయన వెంట ఉద్యాన అధికారి సువర్ణ, తహసీల్దార్ దిలీప్కుమార్, ఏడీ బాబునాయక్, ఏఓ శివరామకృష్ణ, విస్తరణ అధికారులు పాల్గొన్నారు. పరిహారం అందేలా చర్యలు కలెక్టర్ మనుచౌదరి -
నేటి మాక్డ్రిల్లో ఉత్సాహంగా పాల్గొనండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ‘సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్’లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మంగళవారం తెలిపారు. ఇటీవల కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, సైబర్ దాడులు, శత్రు చర్యల వంటి సరిహద్దు భద్రతాపరమైన ముప్పు పెరిగిపోతోందన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్, పౌరుల, వివిధ సంస్థల సన్నద్ధతను బలోపేతం చేయడంలో ఒక కీలకమైన చర్య అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మాక్ డ్రిల్లో పాల్గొనాలన్నారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించండి డీపీఎం రాజయ్య మిరుదొడ్డి(దుబ్బాక): కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించాలని డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్) రాజయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అందె, అక్బర్పేట– భూంపల్లి మండల కేంద్రంతో పాటు, ఖాజీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల జాప్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని సూచించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం డాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తు
మార్కెట్లోకి..గుట్టుగా బీటీ–3 పత్తి విత్తన విక్రయాలు!చాపకింద నీరులా.. బీటీ–3 పత్తి విత్తనాలు గుజరాత్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నో ప్రాంతాలతో పాటు ఏపీలోని నంద్యాల నుంచే కాకుండా, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి ఈ సరుకు వస్తోంది. కాగా సాధారణ బీటీ–2 విత్తనాల పంపిణీకి అధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విత్తనాల విక్రయం అధికారికంగా ప్రారంభం కాగానే బీటీ– 3 విత్తనాన్ని సైతం చాపకింద నీరులా గుట్టుగా రైతులకు పంపిణీ చేయడానికి దళారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రత్యేకించి గజ్వేల్, వర్గల్, ములుగు, రాయపోల్, జగదేవ్పూర్, చేర్యాల, బెజ్జంకి తదితర ప్రాంతాల్లో రైతుల వద్ద బీటీ–3 విత్తనాల కోసం రైతుల నుంచి రూ.1500 నుంచి రూ.2వేలు అడ్వాన్స్లు వసూలు చేస్తున్నారు. అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాల అమ్మకంపై వరుసగా కేసులు నమోదవుతున్నా.. తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అనుమతిలేని బీటీ– 3 పత్తి విత్తనం అమ్మకాలకు ఈసారి కూడా రంగం సిద్ధమైంది. ఏటా కేసులు నమోదవుతున్నా తీరు మారడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సరుకు దిగుమతి చేసుకొని రైతులకు అంటగట్టడానికి దళారులు గ్రామాల్లో అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుంటున్నారు. తెగుళ్లను తట్టుకొంటుందని, కలుపు రాకుండా నివారిస్తుందని, అధిక దిగుబడులనిస్తుందని నమ్మబలుకుతున్నారు. దీంతో అమాయక రైతులు ఈ రకం విత్తనాలు వాడటానికి ఆసక్తి చూపుతుండటంతో దళారులకు వరంగా మారుతోంది. గజ్వేల్: జిల్లాలో ఏటా వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో వరి 3.50లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుండగా మరో 1.50లక్షల సాగుతో పత్తి రెండోస్థానాన్ని ఆక్రమిస్తోంది. కాలం కలిసోస్తే...తెల్ల‘బంగారం’గా చెప్పుకునే పత్తి పంటతో జిల్లా రైతులకు విడదీయరాని బంధం ఉంది. కానీ ఏటా ఈ పంట సాగులో నకిలీ విత్తన మకిలీ కలవరపరుస్తోంది. ఇతర పంటలతో పోలీస్తే...బెట్టకు తట్టుకుందని, కష్ట కాలంలో తమను ఆదుకుంటుందని రైతులు ఈ పంట సాగుపై ‘మమకారం’ ప్రదర్శిస్తు వస్తున్నారు. రైతుల అమాయకత్వమే వ్యాపారులకు పెట్టుబడిగా మారుతోంది. అక్రమాలకు అలవాటుపడిన వ్యాపారులు, దళారులు...ఇదే అదనుగా అనుమతిలేని ‘బీటీ–3’ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ విత్తనాలను వేస్తే ‘బీటీ–2’ కంటే తెగుళ్లను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా కలుపు ఉండదని.. దీని ద్వారా అధిక దిగుబడులు వస్తాయని నమ్మబలుకుతున్నారు. పంటల సాగులో కలుపు నివారణకు కూలీలు సకాలంలో దొరక్క ప్రతి ఏటా భారీఎత్తున నష్టాలు అంటూ వ్యాపారుల ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. బీటీ–2 విత్తన ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ. 901 కానీ.. బీటీ–3 అనుమతిలేని విత్తనాలను ఇందుకు రెట్టింపు, అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతేడాది జిల్లాలో 1.04లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకి వస్తే ఇందులో 20శాతానికిపైగా ‘బీటీ–3’వేసినట్లు అంచనా. క్యాన్సర్ కారకమే కాకుంగా నేలలకు అతి ప్రమాదకారిగా బీటీ–3 విత్తనాన్ని పరిగణిస్తారు. అయినా ఈ విత్త నం ఏటా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు అమాయక రైతుల నుంచి అడ్వాన్సులు అధిక దిగుబడుల పేరుతో మాయ వరుసగా కేసులు నమోదవుతున్నా మారని తీరుగతంలో ఇలా... గతేడాది హుస్నాబాద్ ప్రాంతంలో బీటీ–3 విత్తనాల పట్టివేత. వర్గల్ మండలంలో గోప్యంగా అనుమతిలేని బీటీ విత్తన విక్రయాలు కొనసాగుతున్నాయనే సమాచారం మేరకు 2019 ఏప్రిల్ నెలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మాదారం, అంబర్పేట, దండుపల్లికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఏడేళ్ల క్రితం వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు భారీగా అనుమతిలేని బీటీ–3 విత్తనాలను పట్టుకొని అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లోనూ నాలుగేళ్ల కిత్రం కేసులు నమోదయ్యాయి.నిషేధిత విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు అనుమతి లేని బీటీ–3 విత్తనాల విక్రయిస్తే సహించేది లేదు. ఈ అక్రమ ‘దందా’ను అరికట్టడానికి టాస్క్ఫోర్స్ టీమ్లను వేస్తున్నాం. మండలస్థాయిలో ఈ టీమ్ బీటీ పత్తి విత్తనాల విక్రయాలపై నిరంతరం నిఘా పెడుతోంది. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారి -
కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి పొన్నం లేఖ
హుస్నాబాద్: కేంద్ర జాతీయ రహదారులు, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. హుస్నాబాద్ నుంచి జనగామ వరకు డబుల్ లేన్ రోడ్డుగా ఉన్న 52 కి.మీ. రహదారిని నాలుగు లేన్లుగా అప్గ్రేడేషన్ చేయాలని లేఖలో కోరారు. జిల్లా రోడ్ను అప్గ్రేడ్ చేస్తూ నేషనల్ హైవే రోడ్డుగా మార్చడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి పొన్నం లేఖలో పేర్కొన్నారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్ మనుచౌదరికోహెడరూరల్(హుస్నాబాద్): కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వెయిట్ మిషీన్లు, ప్యాడిక్లీనర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం తడవకుండా టార్పాలిన్ షీట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సివిల్ స్లప్లై డీఎం ప్రవీన్ తదితరులు ఉన్నారు.ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంమద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించన్నుట్లు ప్రిన్సిపాల్ అందె గణేశ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని అన్నారు.నేరుగా ప్రవేశాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, గురుకులాల్లో ఇంటర్ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నారు. మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో నేరుగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ జిల్లా కన్వీనర్ మహాదేవుని శివప్రసాద్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈనెల 12లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.నేల తల్లి ఆరోగ్యం కాపాడండి : శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవిహుస్నాబాద్: యూరియా వాడకాన్ని తగ్గించి నేత తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీదేవి పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సాగు పద్ధతులు, వారిని వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తోర్నాల ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులను రైతులు భద్రపర్చుకోవాలన్నారు. సాగునీటిని ఆదాచేసే పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పంటల వివరాలు, చెట్ల పెంపకంపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు సాగు ఖర్చును తగ్గించుకొని వ్యవసాయంలో శాసీ్త్రయ మెలకువలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, డివిజన్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్, శాస్త్రవేత్త పల్లవి, వ్యవసాయ పాలిటెక్నిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
భూ సమస్యలుంటే దరఖాస్తు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): భూ సమస్యలు ఉంటే అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ మనుచౌదరి రైతులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు చౌటపల్లి, బొడిగెపల్లి గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంలో సాదాబైనామా, ఆర్ఎస్ఆర్లో విస్తీర్ణం ఎక్కువ తక్కువ, మ్యుటేషన్, సీలింగ్, ఈనామ్, రికార్డు సవరణ, కౌవులుదారుల సమస్యలు ఇతరత్రా వాటికి పరిష్కారం ఈ చట్టంలో ఉందన్నారు. భూ సమస్యలుంటే తప్పకుండా అర్జీలు పెట్టుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో సంజీవ్రెడ్డి అనే రైతు మామిడి తోటను పరిశీలించారు.అకాల వర్షానికి నేలపాలైన మామిడి కాయలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను, వాటి నష్టపరిహారం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు పైలట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తులను స్వీకరించి, రశీదులు అందజేస్తున్నారు. మొదటి రోజు అక్కన్నపేటలో 105, చౌటపల్లిలో 58, బొడిగేపల్లిలో 29 మొత్తం192 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ భానోతు జయరాం, ఆర్ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవ్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ మనుచౌదరి -
అర్జీలు సత్వరం పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజలు అందించిన అర్జీలు సత్వర పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి గరిమా అగర్వాల్.. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధించిన పురోగతిపై తనకు తెలియజేయాలన్నారు. పరిష్కారం కోరుతూ భూ సంబంధిత, హౌసింగ్, పింఛన్లు తదితర వాటిపై మొత్తం 75దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మా పేర్లపై నమోదు చేయండి మేము మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు చెందిన భూ భాధితులం. గజ్వేల్ మండలం మిస్నామిరాపల్లి లోని వక్ఫ్బోర్డు లో 70 మంది కలిసి సుమారు 250 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. ఈ భూమి ఇంకా మా పేరు మీద నమోదు కాలేదు. ఇప్పటికై నా అధికారులు ఆ భూమిని మా పేర్లపై మార్చాలి. ఆన్లైన్లో నమోదు చేయాలి. – మల్లన్నసాగర్ భూ బాధితులు -
పంట నష్టం వివరాలు అందించండి
ఆర్డీఓ సదానందం మిరుదొడ్డి(దుబ్బాక): అకాల వర్షాలతో నష్టపోయిన పంటల పూర్తి వివరాలను అధికారులకు అందించాలని సిద్దిపేట ఆర్డీఓ సదానందం రైతులను కోరారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో నష్టపోయిన వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను సిద్దిపేట ఆర్డీఓ సదానందం సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి పరీవాహక పరిధిలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలతో 574 మంది రైతులకు సంబంధించిన 1600 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. కలెక్టర్కు నివేదికను అందించి నష్ట పరిహారం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయా కార్యక్రమంలో తహసీల్దార్లు ఉదయశ్రీ, మల్లిఖార్జున్రెడ్డి, మిరుదొడ్డి మండల వ్యవసాయ అధికారులు మల్లేశం, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
కార్ల వివరాలివ్వండి
సిద్దిపేటరూరల్: సాక్షి పత్రికలో ఈనెల 3న ప్రచురితమైన ‘‘అధికార్ల దందా’’ కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. అధికారులు వినియోగిస్తున్న కార్ల వివరాలను అందించాలని కోరినట్లు కలెక్టరేట్ ఏఓ రెహమన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని జిల్లా అధికారుల్లో కొందరు వారి సొంతవాహనాలతో పాటు, కుటుంబ సభ్యుల కార్లను వినియోగిస్తూ రూ. వేలల్లో బిల్లులు డండుకుంటున్న క్రమంలో సాక్షి పత్రికలో వివరంగా ప్రచురితమైంది. ఈమేరకు స్పందించిన జిల్లా యంత్రాంగం వారి వాహనాల పూర్తి వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కాంగ్రెసోళ్లకేనా ఇందిరమ్మ ఇళ్లు?
దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని బ్రోకర్ల జేబులు తడిపితేనే ఇళ్లు మంజూరు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దుబ్బాకలోని క్యాంపుకార్యాలయంలో నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీలో కాంగ్రెస్ వారే ఉన్నారని, వారి పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ దళారులు విచ్చలవిడిగా పేదలనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని తెలిపారు. పోలీస్వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని.. దుబ్బాక, మిరుదొడ్డిలలో ఎస్ఐలు లంచాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
కాంగ్రెస్ సమావేశం రచ్చ రచ్చ
ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్ఎస్ నేతల ఆధిపత్యమేంటని నిలదీత ● పార్టీ పరిశీలకుడిని అడ్డుకున్నపటాన్చెరు కాంగ్రెస్ నాయకులు ● మంత్రి దామోదర ఎదుటేనిలదీసిన శ్రేణులు ● కాంగ్రెస్ జిల్లా ముఖ్య నేతలసమావేశం రసాభాససాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. అంతర్గత పోరు మరోమారు రచ్చకెక్కింది. మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం నేతలు రచ్చ రచ్చ చేశారు. సమావేశం వేదిక వద్దకు దూసుకొచ్చి.. రామ్మోహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ముఖ్యనాయకులు సముదాయించినా నాయకులు పట్టించుకోలేదు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యా ప్తంగా ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతుండగా నాయకులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో గూడెం పెత్తనంపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రామ్మోహన్రెడ్డి వివరిస్తున్న క్రమంలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పెత్తనం ఏంటని రామ్మోహన్ను ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఈ కమిటీలోఅసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నేతలను నిలదీశారు. రామ్మోహన్రెడ్డి ఎంత వారించినా వినలేదు. పోలీసులు సైతం నిలువరించే ప్రయత్నం చేశారు. వేదికపై ఉన్న ఎంపీ సురేష్షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కలుగచేసుకుని సముదాయించడంతో కొంత మేర శాంతించారు. స్వేచ్ఛే కాంగ్రెస్కు బలం.. బలహీనత : మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛే బలం, బలహీనత అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు.. నాయకుడు లేడు అన్నారు. పార్టీలో వర్గ విభేదాలు ఉండటం సహజమేనన్నారు. కానీ సమన్వయం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, తాలుకా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే నాయకులకు బలమని, వారి కృషితోనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నారు. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు. గూడెం ఫొటోపై మరో నేత ఫొటో అతికించి.. సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్యనేతల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో ఏర్పాటు చేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఫ్లెక్సీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఫొటోను అతికించారు. హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ గూడెం మహిపాల్రెడ్డి ఫొటోపై మరోనాయకుడి ఫొటోను అతికించడం చర్చనీయాంశంగా మారింది. -
దరువు అంజన్నకు, బుర్ర సతీష్కు అవార్డులు
దుబ్బాకటౌన్/బెజ్జంకి(సిద్దిపేట): ఉద్యమ కారులు, గాయకులకు గద్దర్ అవార్డులు వరించాయి. సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో గద్దర్ ఐకాన్– 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయపోల్ మండలం కేంద్రానికి చెందిన కళాకారుడు దరువు అంజన్న, బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన బుర్ర సతీష్కు చేసిన సేవలకు గుర్తుగా అవార్డులు దక్కాయి. అవార్డులను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, టూరిజం శాఖ చైర్మన్ రమేష్రెడ్డి, ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా అందించారు.పండుగలు సంస్కృతికి ప్రతీకలుమిరుదొడ్డి(దుబ్బాక): లోక కల్యాణార్థం పల్లెల్లో నిర్వహించే పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొండాపూర్లో నిర్వహించిన నల్ల పోచమ్మ తల్లి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి కలశంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని కలిగి ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.భగీరథ మహర్షికి నివాళిసంగారెడ్డి జోన్: భగీరథ మహర్షి దీక్షకు, సహనానికి ప్రతిరూపమని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుకున్నది సాధించేంతవరకు ఎంతటి కష్టన్నైనా ఎదుర్కోవడంతో ఆయనను భగీరథుడిగా పిలుస్తారని తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ బస్టాండ్ను సందర్శించి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ నెల 5, 6వ తేదీల్లో తాను హైదరాబాద్లోనే ఉంటానని, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా వచ్చి సమస్యలపై చర్చించవచ్చన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్త బస్సులు, నియామకాలు, కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. గత పదేళ్లుగా సమ్మెతో అనేక మంది చనిపోయినా పట్టించుకోలేదన్నారు. ఒక్క బస్సు కొనుగొలు చేయకుండా, ఒక్క నియామకం చేపట్టకుండా ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుండటంతో సమ్మె చేస్తే మూలిగే నక్కపై తాటి పండు పడిన విధంగా చేయవద్దన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్న సందర్భంలో పాత అప్పులు, పాత పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ రిటైర్మెంట్ రోజున వారి నిధులు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డిపో మేనేజర్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంస్థ నిర్వీర్యం మంత్రి పొన్నం ప్రభాకర్ -
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయండి
గజ్వేల్రూరల్: ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ సూచించారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక నాయకుల సమావేశాన్ని పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లు రాంరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ -
కూలిన టోల్గేట్ పైకప్పు
కొండపాక(గజ్వేల్): మండల కేంద్రమైన కొండపాకతో పాటు మర్పడగ, సిర్సనగండ్ల, దమ్మకపల్లి, దుద్దెడ, బందారం గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ గేట్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. టోల్ ప్లాజా పైకప్పు షీట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బందారంలో బాలవికాస నీటి శుద్ధీకరణ గది పూర్తిగా ధ్వంసం కాగా, పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఇదే క్రమంలో రాజీవ్ రహదారి వెంబడి ఉన్న చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇదిలా ఉంటే వర్షానికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. -
7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని కరీంనగర్ రీజినల్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు. కారుణ్య నియామకాలు చేపట్టిన వారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్ధకు అప్పజెప్పాలన్నారు. న్యాయవాదుల సహకార సంఘం డైరెక్టర్గా సంజీవరెడ్డి దుబ్బాక: న్యాయవాదుల పరస్పర సహకార సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్గా దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరిపెద్ది సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్గా ఎన్నుకోవడంపై సహచర న్యాయవాదులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు డీఐఈఓ రవీందర్రెడ్డి బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిద్దిపేట డీఐఈఓ రవీందర్రెడ్డి శనివారం సందర్శించారు. అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాలకు వెళ్లి 10 పాసైన విద్యార్థులను, తల్లిదండ్రులను కలువాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, సరిత, ప్రవీణ్రెడ్డి, సంజీవ్, శేషశయన తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి చిన్నకోడూరు(సిద్దిపేట): క్రమ శిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతోపాటు విధులు నిర్వర్తించాలని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దకోడూరు శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని సివిల్, రిజర్వ్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మతం ముసుగులో దాడులు చేయొద్దు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య చేర్యాల(సిద్దిపేట): దళితులపై మతం ముసుగులో దాడులకు దిగడం సరైనదికాదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని వేచరేణిలో దళిత యువకుడిపై దాడిజరిగిన విషయంమై శనివారం గ్రామానికి వచ్చిన ఆయన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మతం ముసుగులో దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. -
శిక్షణ శిబిరాలు
పిల్లలను ప్రోత్సహించేందుకే● సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ● సాక్షి, అంబిటస్ పాఠశాల ఆధ్వర్యంలో.. ● ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభంసిద్దిపేటకమాన్: వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెర్గు మంజుల రాజనర్సు అన్నారు. శనివారం సాక్షి, అంబిటస్ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని అంబిటస్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై, అంబిటస్ పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించి, భవిష్యత్లో వారు ఏమి కావాలనుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. శిక్షణ శిబిరంలో కరాటే, యోగా, మ్యూజిక్, హ్యాండ్ రైటింగ్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పిల్లలు బయట తిరగడం వల్ల వడదెబ్బ భారిన పడి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా ఏదో ఒక అంశంపై పట్టు సాధించాలన్నారు. 15రోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్న సాక్షి మీడియా, అంబిటస్ పాఠశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. సుమారు వంద మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్రెడ్డి, డ్యాన్స్ మాస్టర్ వాసుదేవ్, కరాటే మాస్టర్ భాగ్యరాజ్, చిన్నా, టీచర్లు అపర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో ఇబ్బందులుండొద్దు
కోహెడరూరల్(హుస్నాబాద్)/హుస్నాబాద్: ధాన్యం తరలింపులో వాహనాల ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో అధునాతన పాడి క్లీనర్ అండ్ డ్రయ్యర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయాల జాతర ఉత్సవాలపై అధికారుల సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.180కోట్లతో మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. శనిగరం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని అడిగారని, త్వరలో కల్పిస్తామన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలను స్థపతి ప్రకారమే అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు జరిగే జాతరకు ఏర్పా ట్లు చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు మత్తడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.9 కోట్లతో ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి ప్రతిపాదనలు -
భూ భారతిపైనే రైతుల ఆశలు
అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట మండలాన్ని’ ఎంపిక చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలంలో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యమవుతుందని లెక్కలు వేసుకొని చట్టం ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత భూ భారతి పోర్టల్లో కూడా వాటికి సంబంధించిన మాడ్యూల్స్ను సిద్ధం చేస్తారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తారు. అయితే భూ భారతి పైలట్ ప్రాజెక్టు కింద అక్కన్నపేట మండలాన్ని ఎంపిక చేయడానికి తన వంతు కృషి చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఈ ప్రాంత రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలే అధికంగా ఉన్నాయి. సాదాబైనామాలు, అసైన్డ్ భూముల కేసులే అధికం పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట’ ఎంపిక హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుషెడ్యూల్ వివరాలు భూ భారతి చట్టం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో తహసీల్దార్ అనంతరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడినట్లు తెలిపారు. ఈ బృందాల్లో మొదటి టీంలో అక్కన్నపేట తహసీల్దార్ అనంతరెడ్డి, రెండో టీంలో హుస్నాబాద్ తహసీల్దార్ జీ.రవీందర్రెడ్డి, మూడో టీంలో కోహెడ తహసీల్దార్ కె.సురేఖ ఉన్నారు. -
పోలీసులకు అండగా భద్రత స్కీమ్
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ అనురాధ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డీవీఆర్ రాజుకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రూ.8లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు సీపీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ సు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా భద్రత స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, పోలీసు సంఘం ఉపాధ్యక్షు డు రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిపై విమర్శలు సరికాదు
హుస్నాబాద్: వెనుకబడిన హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శిస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. హుస్నాబాద్కు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే కరీంనగర్ కాంగ్రెస్ నాయకులకు కడుపు నొప్పి ఎందుకని ఆయన ప్రశ్నించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శించారన్నారు. గతంలో కరీంనగర్కు వచ్చిన కళాశాలలను అప్పటి మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్బాబు కొండగట్టు, మంథని ప్రాంతాలకు తీసుకెళితే పొన్నం వ్యతిరేకించలేదన్నారు. త్వరలో శ్రీనివాస్పై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్, ఎండీ హుస్సేన్, శ్రీనివాస్, భిక్యా నాయక్, కిష్టస్వామి, వీరన్న పాల్గొన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి -
సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీట్ పరీక్ష రాసే విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్),బాలికల ఉన్నత పాఠశాలలోని నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాలుకు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తదితర ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తె లిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ సూర్య ప్రకాశ్, పరీక్ష నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు సిద్దిపేటఅర్బన్: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతాన్ని కొలిచి తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదనపు కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ సలీం, మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన -
వడదెబ్బ బారిన పడొద్దు
● వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి ● వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిసిద్దిపేటరూరల్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండలతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సి వచ్చినా తలకు టోపీ ధరించడం, తువ్వాల చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని, చల్లని ప్రదేశాలలో ఉండాలని అన్నారు. ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకుంటూ, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వేసవి తీవ్రత వల్ల వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. అన్ని ఆసుపత్రులు, పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. -
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందే
సిద్దిపేటజోన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందేనని సిద్దిపేట ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రద్దు చేసేవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నమాజ్ అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు అబ్దుల్ సమి, ఉబెదుర్ రహమాన్ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొత్త చట్టం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కఠినంగా శిక్షించాలి.. కశ్మీర్ లోయల్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నిరసన -
వడగళ్ల బీభత్సం
● దుబ్బాక మండలంలో దంచికొట్టిన వాన ● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యందుబ్బాక: మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన వానతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి. కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు. కొమురవెల్లిలో వాన కొమురవెల్లి(సిద్దిపేట)/జగదేవ్పూర్(గజ్వేల్): కొమురవెల్లి, జగదేవ్పూర్ మండలాల్లోనూ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆర బోసిన ధాన్యం తడిసిపోయింది. తపాస్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు కల్లాలో ఆరబెట్టిన ధాన్యం ప్లాస్టిక్ కవర్లను కప్పారు. జగదేవ్పూర్ మండలంలో పలుచోట్ల పంటలకు నష్టంజరిగింది. అలాగే తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. -
గోపవ్వ గోస
● సొంత ఇల్లు ఉందంటూ ‘ఇందిరమ్మ’లో పేరు తొలగింపు ● కూలిపోయిన గుడిసెలోనే వృద్ధురాలి నివాసంమేము అర్హులం కాదా.. ఇందిరమ్మ ఇంటి కోసం దివ్యాంగ దంపతుల వేడుకోలు మద్దూరు(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇల్లుకు మేము అర్హులం కాదా అని దివ్యాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపల్లికి చెందిన బొడికే మల్లేశం, రేణుక దంపతులకు పుట్టుక నుంచే కాళ్లు లేవు. ఇద్దరూ దివ్యాంగులే. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్తోనే ఇంటి అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు మంజూరైన లిస్టులో వీరి పేరు రాకపొవడంతో ఆందోళన చెందారు. కొన్నేళ్లుగా కిరాయి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నామని వారు పోయారు. నంగునూరు(సిద్దిపేట): భర్త మరణించడంతో కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది వృద్ధ మహిళ. వర్షాలకు గుడిసె కూలిపోవడంతో మిగిలిన భాగంలో కవర్లు కప్పి అందులోనే నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు సొంత బిల్డింగ్ ఉందని అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆర్హుల జాబితా నుంచి తొలగించారు. ఈవిషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని వృద్ధురాలు వాపోతోంది. నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన కందారం గోపవ్వ భర్త సిద్ధయ్య వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. సంవత్సరం కిందట అనారోగ్యంతో మరణించడంతో అతని కుమారుడు శేషాద్రి జీవనోపాధి కోసం కరీంనగర్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో గోపవ్వ కూలిపోయిన గుడిసెలోనే నివాసం ఉంటూ ప్రభుత్వం అందించే పింఛన్తో బతుకీడుస్తోంది. కలెక్టర్కు ఫిర్యాదు ఇల్లు మంజూరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురైన గోపవ్వ ఐదు రోజుల కిందట కలెక్టరేట్లో ఫిర్యాదు చేసింది. తాను నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆధారాలను జత చేసింది. అధికారులు స్పందించి నిరుపేదనైన తనకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటోంది. -
నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బెజ్జంకి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలో దత్తత గ్రామమైన వీరాపూర్లో ఇండ్ల లబ్ధిదారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకుంటే సర్కారు ఇచ్చే డబ్బులతో ఇల్లు పూర్తి చేయవచ్చని తెలిపారు. ఎక్కువ ఎస్ఎఫ్టీతో నిర్మించిన లబ్ధిదారుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు మంజూరు కాని వారికి త్వరలోనే వస్తాయన్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ మంజుల, పీఆర్ ఏఈ సమ్మయ్య, ఏపీఎం నర్సయ్య, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వకర్మలకు రూ.4కే యూనిట్ విద్యుత్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అర్హత కలిగిన విశ్వకర్మ వృత్తుల వారికి రూ.4కే యూనిట్ విద్యుత్ను అందించనున్నట్లు, జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రమోహన్, అఖిలభారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నరసింహచారి తెలిపారు. నాలుగవ కేటగిరి విద్యుత్ను రూ.4కే యూనిట్ను అందించనున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజేషన్ కమిషన్ గురువారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లా విద్యుత్శాఖ కార్యాలయంలో ఎస్ఈ చంద్రమోహన్కు పథకాన్ని వెంటనే అమలు చేయాలని విశ్వకర్మలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ చంద్రమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని మండలాల్లో అర్హత కలిగిన విశ్వకర్మలకు వివరాలు సేకరించి నాలుగో కేటగిరి మీటర్ ద్వారా 25 హెచ్పీ కెపాసిటీతో విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు బాలయ్య, యాదగిరి, రామచంద్రం, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం దుమారం
● రేషన్ డీలర్లతో లబ్ధిదారుల వాగ్వాదం ● పరిశీలించిన డీఎం, ఉన్నతాధికారులు ● ఆ బ్యాగులు గోదాంలకు తరలింపు ● తిరిగి సన్నబియ్యం పంపిణీ ● చర్యలు తీసుకుంటాం: డీఎస్వోదుబ్బాక: పేదలకు సన్నబువ్వ అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారుల నిర్లక్ష్యంతో ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. పలు రేషన్షాపుల్లో సన్నబియ్యంతో పాటు దొడ్డుబియ్యం సంచులు రావడం గమనార్హం. గురువారం దుబ్బాక పట్టణంలోని 46వ రేషన్ దుకాణంషాపులో బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు వచ్చారు. పంపిణీ చేసేందుకు తీరా సంచులు విప్పి చూడగా దొడ్డుబియ్యం ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు సన్నబియ్యం ఇవ్వకుండా ఇవి ఎందుకు ఇస్తున్నారంటూ రేషన్డీలర్తో గొడవకు దిగారు. అనంతరం ఆ బ్యాగును పక్కన పెట్టి వేరే బ్యాగు విప్పి చూడగా అందులో కూడా దొడ్డుబియ్యమే ప్రత్యక్షమయ్యాయి. అలాగే 45వ నంబర్ షాపులో సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారుల ఆందోళనతో రేషన్డీలర్ వెంటనే పంపిణీని నిలిపివేసి సంబంధిత అధికారులకు విషయం తెలిపారు. వారి సూచన మేరకు దొడ్డు బియ్యం సంచులను పక్కన బెట్టి సన్నబియ్యం పంపిణీ చేశారు. డీఎం, అధికారుల పరిశీలన విషయం తెలుసుకున్న వెంటనే సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్కుమార్, టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్రావు, డీటీ రవికుమార్, ఆర్ఐ నరేందర్ రేషన్ షాపునకు చేరుకొని 46, 45వ నంబర్ షాపులను పరిశీలించారు. కొన్ని బ్యాగుల్లో దొడ్డు బియ్యం ఉండటం గుర్తించారు. వెంటనే ఆ బ్యాగులను కుమ్మరించి, బియ్యం పంపిణీ చేయవద్దని డీలర్లకు సూచించారు. దొడ్డు బియ్యం సంచులను గోదాంకు తరలించి సన్నబియ్యంను రిప్లేస్ చేసే చర్యలు చేపట్టారు. ఈ విషయంపై డీఏస్ఓ తనూజ సంబంధిత రేషన్ డీలర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తాం దుబ్బాక పట్టణంలోని రేషన్షాపుల్లో దొడ్డుబియ్యం రావడంపై తగు చర్యలు తీసుకుంటాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తాం. రేషన్ షాపులకు వచ్చిన దొడ్డుబియ్యంను గోదాంకు తరలించి సన్న బియ్యాన్ని రిప్లేస్ చేస్తాం.పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అన్ని కోణాల్లో ఆరా తీసి చర్యలు తీసుకుంటా. –డీఎస్ఓ తనూజ -
మహిళల రక్షణకు పెద్దపీట
సీపీ అనురాధసిద్దిపేటకమాన్: మహిళలు, పిల్లల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో 47 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 45మంది ఈవ్టీజర్లను పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి, పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు ఫోన్ చేయాలని సూచించారు. కేతకీలో భక్తుల సందడిఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం గర్భగుడిలోని పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డీలక్స్ బస్సుల్లో రాయితీనారాయణఖేడ్: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి చార్జీల్లో 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. నెలవారీ సీజన్ టికెట్పై 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఖేడ్ నుంచి జేబీఎస్కు రూ.230 చార్జీకి రాయితీతో రూ. 210 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఖేడ్ నుంచి లింగంపల్లికి రూ.210 గాను రూ. 190, ఖేడ్ నుంచి సంగారెడ్డికి రూ. 160కి గాను రూ.140 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు గల వివిధ స్టేజీలకు మంత్లీ సీజన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. -
బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతారా?
మున్సిపల్ కమిషనర్పై కలెక్టరేట్ ఏవోకు ఫిర్యాదుసిద్దిపేటరూరల్: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మారుస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంపై గురువారం కలెక్టరేట్ ఏఓకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హాజరవుతున్న విషయం మున్సిపల్ కమిషనర్ తమకు తెలియజేయలేదన్నారు. సమావేశానికి విలేకరులను అనుమతించాలని కోరితే గత ప్రభుత్వ జీఓ ప్రకారం అనుమతి లేదని చెప్పిన కమిషనర్ ఎమ్మెల్యే వచ్చాక అనుమతించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సమస్యల పరిష్కారంపై ఇచ్చిన వినతులపై స్పందించడం లేదన్నారు. ప్రతిపక్ష మహిళా కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడుతుంటే దుర్భాషలాడుతూ మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మెప్మా సాయికృష్ణ, రమ్య, ఇద్దరు సిబ్బందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారిపై తక్షణమే విచారణ చేపట్టి శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు పనుల టౌన్ప్లానింగ్, శానిటేషన్, మిషన్ భగీరథ, గ్రీన్ సిద్దిపేట, యూజీడీ, ఇంజినీరింగ్, కోమటిచెరువు వంటి పనుల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సీబీఐ విచారణ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిఆనంద్, బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్, కవిత, రవితేజ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సుడాపై రియల్ పిడుగు
తగ్గిన ఆదాయం ● ఏడాదిన్నరగా నిలిచిన అభివృద్ధి పనులు ● ప్రభుత్వం నిధులు కేటాయించాలి సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)పై రియల్ ఎస్టేట్ ప్రభావం పడింది. దీంతో రోజు రోజుకు ఆదాయం పడిపోతోంది. 2017లో సుడాను ఏర్పాటు చేశారు. కాగా గత ఏడాదిన్నరగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినా.. నిధులు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. సుడాకు తగ్గిన ఆదాయం గతంలో సుడాకు సంవత్సరానికి రూ.6 నుంచి రూ.8కోట్ల ఆదాయం వచ్చేది. 2024–25లో రూ.5.4 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనిలో రూ.2.5 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా డబ్బులను ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం నిల్వ ఉంచారు. సుడా వెంచర్లో అభివృద్ధి అంతంత మాత్రమే మిట్టపల్లి శివారులో సుడా ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. 2023లో సుడా ఆధ్వర్యంలో 14 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. రైతులకు ఇవ్వగా మిగిలిన 101 ప్లాంట్లను మూడు మార్లు ఓపెన్ యాక్షన్ పెట్టగా 27 ప్లాట్లు మాత్రమే సేల్ అయ్యాయి. వెంచర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్స్ సేల్ అయితే వచ్చే ఆదాయంతో సుడా పరిధిలో పలు అభివృద్ధి పనులు చేయాలనుకున్నారు. కానీ అవి సేల్ కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు రియల్ రంగం కుదేలు కావడంతో ప్రైవేట్ వ్యాపారులు కొత్త వెంచర్లు ఏర్పాటు చేయలేదు. కొత్త భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం సుడాకు ఎవరు రాకపోవడంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం ప్రత్యేకంగా సుడా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.ఆదాయం పెంచేందుకు కృషి కొత్త వెంచర్లు ఏర్పాటు కాకపోవడం, నూతన ఇంటి నిర్మాణ పనులు యజమానులు చేపట్టడం లేదు. రియల్ ఎస్టేట్ అంతగా లేకపోవడంతో ఆదాయం ఎక్కువగా రావడం లేదు. సుడా ఆదాయం పెంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. – అశ్రీత్ కుమార్, వైస్ చైర్మన్, సుడామూడేళ్లుగా సాగుతున్న రిసార్ట్ పనులు రంగనాయకసాగర్ రిజర్వాయర్ను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. కానీ సమీపంలో ఎలాంటి వసతి లేకపోవడంతో భోజనం, నైట్ హాల్ట్కు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సుడా ఆధ్వర్యంలో రిసార్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో 2022లో సుడా రిసార్ట్ పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారుగా రూ.1.5 కోట్లతో కాటేజీలు, రెస్టారెంట్ హాల్స్ను నిర్మించారు. నిధులు లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటేన్ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వినియోగంలోకి రాలేదు. -
లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు
దుబ్బాక పట్టణానికి చెందిన ఐఎన్టీయూిసీ నేత, తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం నాయకుడు తుమ్మ లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా, విద్యార్థులు, బీడీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్న లక్ష్మీనారాయణపై పోలీసులు గతంలో కక్షగట్టి విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ అతడిపై దాడిచేసిన పోలీసు అధికారులపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి కార్మికుల పక్షపాతిగా పోరాడుతున్న ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. – దుబ్బాక -
యోగాతో మహిళల ఆరోగ్యం పదిలం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి రోజు యోగా చేయడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సెంటర్లో ఉచిత మహిళ యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మహిళల మానసిక, శారీరక దృఢత్వానికి యోగా చక్కటి సాధనమన్నారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ తోట సంధ్య, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సతీష్, కౌన్సిలర్ నాగరాజురెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజేశం, ప్రధానోపాధ్యాయులు మంజు భార్గవి, సభ్యులు విదిష, నందిని, విజయ, వాణి పాల్గొన్నారు. -
త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
గజ్వేల్: నియోజకవర్గంలో కొత్తగా నియమించిన వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈనెల 10లోపు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గాలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెహన్, శ్రీనివాస్రెడ్డి, సాజిద్బేగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. గురువారం రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పల్వన్ కుమార్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడంతో పాటు క్షయ, లెప్రసీ, హైపర్ టెన్షన్, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి, శ్రీనివాస్, పీఆర్ఓ ఆనంద్, నారాయణ్రావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ గజ్వేల్రూరల్: గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎం.స్వాతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండరి, సభ్యులు కలిసి మంథని కోర్టు నుంచి గజ్వేల్కు బదిలీపై వచ్చిన జడ్జి స్వాతికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు నరేశ్చారి, కరుణాకర్, భాస్కర్, ప్రశాంత్, భాస్కర్, అంజలి తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణించాలి హుస్నాబాద్: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. వేసవి క్రీడా శిక్షణలో భాగంగా మినిస్టేడియంలో గురువారం కబడ్డీ, వాలీబాల్ శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ వెంకట్, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్, కోచ్లు కృష్ణ, రాకేష్, సీనియర్ క్రీడాకారులు హుస్సేన్, రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు బెజ్జంకిలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం హాజరుకానున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బెజ్జంకి(సిద్దిపేట): ప్రజలకు మరింత చేరువై సమస్యలను పరిష్కరించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్నంగా చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రానికి వస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే చేపట్టిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. -
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
ఘనంగా మేడే వేడుకలు ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’డే ను గురువారం జిల్లాలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, పలు కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల ఎదుట జెండాలను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ర్యాలీలు తీశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాల్లో పార్టీల, పలు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. – చేర్యాల(సిద్దిపేట) -
దార్శనికుడు బసవేశ్వరుడు
సిద్దిపేటఅర్బన్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం పొన్నాల వై జంక్షన్ వద్ద బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుడి జయంతి వేడుకలలో హరీశ్రావు పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హరీశ్రావు మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ వివక్షత లేకుండా సమసమాజం, సమన్యాయం కోసం పోరాడిన మహానీయుడని అన్నారు. బసవేశ్వరుడి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి నాగరాజమ్మ, లింగాయత్ సంఘాల జిల్లా అధ్యక్షుడు, పట్టణ గౌరవ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు -
అధికారుల తీరు మారాలి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి ● తాగునీటి సమస్య రానివ్వొద్దు ● స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం కావాలి ● మున్సిపల్ సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘మున్సిపాలిటీకి మీరే కీలకం.. వార్డు ఆఫీసర్ పనితీరు బాగుంటే వార్డు బాగుంటుంది. వార్డు బాగుంటే పట్టణం బాగుంటుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రగతి పనులపై అధికారులతో ఆరా తీశారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రోజూ క్షేత్ర స్థాయిలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పర్యటించాలని, చెత్త బండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నుల వసూలులో మున్సిపాలిటీ ఎప్పుడూ ముందు ఉండాలని సూచించారు. వార్డు అధికారులు ప్రతి పనిలో భాగస్వామ్యం కావాలన్నారు. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మంచి నీటి వాటర్ ట్యాంక్ ను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు గుండా ఏర్పాటు చేసిన రింగ్ మెయిన్ పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. పాత బస్టాండ్ నుంచి మెదక్ రోడ్డు, కరీంనగర్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లైటింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని హరీశ్రావు చెప్పారు. ఇందిరమ్మ కాలనీ, బీటీ రోడ్డు పనులు, లింగారెడ్డిపల్లి బ్రిడ్జి పనుల జాప్యంపై అరా తీశారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పట్టణంలో విద్యుత్, మున్సిపల్ సిబ్బంది ఇష్టానుసారంగా చెట్లను నరకడం సరికాదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో చెత్త పేరుకుపోయిందని, బ్లాక్ స్పాట్స్ తొలగించాలని సూచించారు. దేశ స్థాయిలో సిద్దిపేట కు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం 32 వార్డుల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి ప్రతి వార్డు అధికారి చెత్త బండితో తిరగాలని సూచించారు. అంతకుముందు చైర్పర్సన్ మంజుల అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
భూభారతితో సత్వర న్యాయం
దౌల్తాబాద్(దుబ్బాక): భూ భారతి చట్టంతో రైతాంగానికి సత్వర న్యాయం అందుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ చట్టంలోని ప్రతి అంశాన్ని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని అన్నారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామాలకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. వారసత్వ భూముల సమస్యలను మ్యుటేషన్ పద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మండల, గ్రామ స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతే దేశానికి రాజు అని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, పీఎసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగ మూర్తి, తహసీల్దార్ చంద్ర శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు జగదేవ్పూర్(గజ్వేల్): రైతుల సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మేధావులు, లాయర్లు, రైతు సంఘాలు, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూ భారతి చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకుపైగా సాదా బైనామాలు పెండింగ్లో ఉన్నాయని, జిల్లాలో 44 వేలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి దౌల్తాబాద్లో అవగాహన సదస్సు -
సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు
ఒక్క రోజే రూ.కోటి వసూలు సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటి పన్ను రాయితీలో ఒక్క రోజే రూ.కోటి వసూలు అయ్యింది. పన్ను రాయితీలో భాగంగా బుధవారం ఒక్క రోజే రూ.కోటి 5లక్షలు చెల్లించి ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను రూ.17కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 6కోట్ల 27లక్షలు వసూలయ్యాయి. మానవ మనుగడకు వేదాలు దోహదం పీఠాధిపతి మాధవానంద సరస్వతి వర్గల్(గజ్వేల్): మానవ మనుగడకు వేదాలు దోహదపడతాయని, వేదవిద్య సమాజాన్ని జాగృతం చేస్తుందని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. బుధవారం అక్షయ తృతీయ విశేష పర్వదినం రోజు వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం సందర్శించిన పీఠాధిపతికి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పరివారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేదపాఠశాలలో స్మార్తం పూర్తిచేసుకున్న తొమ్మిది మంది విద్యార్థులకు జయపట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తూ వేదం అనేది విద్య మాత్రమే కాకుండా జీవన విధానమని అభివర్ణించారు. వేద విద్యార్థులు సామాజిక శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదుగుతూ వేదపాఠశాల లక్ష్యాలు సిద్ధింపజేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. నేలవాలిన మునగ తోట తొగుట(దుబ్బాక): మండలంలోని వెంకట్రావుపేటలో ఈదురుగాలులకు మునగ తోట నేలవాలింది. గ్రామానికి చెందిన రైతు సుతారి ఆంజనేయులు వ్యవసాయంతో పాటు ఎకరం మునగ తోట సాగుచేశారు. బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు కాపు దశకు వచ్చిన చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశారు. బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గొప్ప పరివర్తనకు బసవేశ్వరుడు నాంది పలికారని కొనియాడారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, లింగాయత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ పోరాట ఫలితమే సంగారెడ్డి : సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు వచ్చాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు వేసవి సెలవుల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ సిబ్బంది సిద్ధం కావాలని కోరారు. -
అలైన్మెంట్ మార్పునకు కేంద్రం అంగీకారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్సిద్దిపేటకమాన్: జాతీయ రహదారి (365బీ) అలైన్మెంట్ మార్పునకు కేంద్రం అంగీకరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలైన్మెంట్ మార్పు ఎంపీ రఘునందన్రావు విశేష కృషి ఫలితమేనని అన్నారు. పాత అలైన్మెంట్ ద్వారా దుద్దెడ, ఎన్సాన్పల్లి, తడకపల్లి, చిన్నగుండవెళ్లి, పుల్లూరు, మల్యాల గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. దీంతో ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకుని జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమాశంకర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. స్పందించిన ఉమాశంకర్ ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతుల భూములకు ఎలాంటి నష్టం లేకుండా రాజీవ్రహదారి, సిద్దిపేట ఔటర్రింగ్రోడ్డుతో అనుసంధానం చేసే మార్గాన్ని ప్రతిపాదించారని తెలిపారు. కార్యక్రమంలో బాసంగారి వెంకట్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన పేదింటి కుసుమాలు
మోడల్లో మెరిసిన విద్యార్థులుఆటో డ్రైవర్ కుమారుడు టాపర్ దుబ్బాకటౌన్: ఆటో డ్రైవర్ కుమారుడు మండల టాపర్గా నిలిచారు. బుధవారం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో హరీశ్ సత్తా చాటాడు. అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు చెందిన ఆటో డ్రైవర్ పుస్కూరి లక్ష్మణ్, లావణ్య దంపతుల కుమారుడు హరీశ్ దుబ్బాక ప్రభుత్వ మైనార్టీ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. ఫలితాల్లో 573 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తనని మండల టాపర్గా నిలిపిందని హరీష్ చెప్పారు. పేదింటి చేనేత విద్యార్థి ప్రతిభ దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వార్డు చేనేత కుటుంబానికి చెందిన సబ్బాని దీపక్ టెన్త్ ఫలితాల్లో సత్తాచాటాడు. తండ్రి సబ్బాని శ్రీరాం ప్రసాద్ దర్జీగా, తల్లి మాధవి బీడీలు చుడుతూ.. ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. దీపక్ లచ్చపేట మోడల్ స్కూల్లో 10వ తరగతి చదివాడు. 562 మార్కులు సాధించి మండల ద్వితీయ టాపర్గా నిలిచాడు. దీంతో పలువురు దీపక్ను అభినందించారు.చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని పలు ప్రభుత్వ బడులతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలు టెన్త్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. మండల వ్యాప్తంగా అర్జునపట్ల, కడవేర్గు, తాడూరు, వీరన్నపేట, గుర్జకుంట, పెద్దరాజుపేట పోతిరెడ్డిపల్లి పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మోడల్ స్కూల్కు చెందిన కొల్పుల భానుతేజ అనే విద్యార్థిని 564 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే అదే పాఠశాలకు చెందిన రంగు రాహుల్ 555, పుట్ట అమూల్య 555 మార్కులు సాధించారు. -
కన్నీటిపాలు
అకాల వర్షాలతో ఆగమాగం రైతు కష్టం..నోటికాడికూడు వర్షార్పణందుబ్బాక: ధాన్యాన్ని కాపాడుకునేందుకు పాట్లు జిల్లాలో భారీగా నష్టం ● 6,557 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ● ఫసల్ బీమా లేక అవస్థలు ● ప్రభుత్వం వైపు దీనంగా రైతన్న చూపు అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నేలపాలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 3.47లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేశారు. అయితే మార్చి 22 నుంచి ఈ నెల 26 వరకు కురిసిన అకాల వర్షాలు రైతులను కన్నీటిపాలు చేశాయి. ఇప్పటి వరకు జిల్లాలో 6,557 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా వరి 4,498 ఎకరాలు, మొక్కజొన్న 496, మామిడి 1,505ఎకరాలు, ఇతర పంటలు 58 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచుతున్నాయి. చిన్నకోడూరు, నంగునూరు, జగదేవ్పూర్, ధూళ్మిట్ట, చేర్యాల, బెజ్జంకి, అక్కన్నపేట, గజ్వేల్, దౌల్తాబాద్ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. సాగు పెట్టుబడి కోసం చేసిన అప్పులు.. ఈ అకాల వర్షాలతో వచ్చిన నష్టంతో రైతులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. ఫసల్ బీమా లేక.. కొన్నేళ్లుగా ఫసల్బీమా పథకాన్ని పాలకులు అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఎకరా వరికి రూ.450 ప్రీమియం చెల్లిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకు చెదోడు వాదోడుగా ఫసల్బీమా నిలిచేది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బతిన్న పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అందించారు. ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం అందించనుంది. కానీ నష్టపరిహారం ఎపుడు వస్తుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నేలరాలిన మామిడి... జిల్లాలో 16 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజులుగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో మామిడి రైతులు బెంబేలెత్తుతున్నారు. మామిడి కోతకు వచ్చిన సమయంలో వరుణుడు భయపెడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,505 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. దుబ్బాక: అకాల వర్షంతో దుబ్బాక మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చాలా వరకు కొట్టుకుపోయింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోటికాడికూడు వర్షార్పణం కావడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వాన ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి నెలకొందని, మళ్లీ వాన పడితే ధాన్యం చేతికిరాని పరిస్థితి నెలకొందన్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఈదురుగాలులతో బీభత్సం తొగుట(దుబ్బాక): మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కురిసిన అకాల వర్షానికి తొగుట, చందాపూర్, తుక్కాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. గజ్వేల్–సిద్దిపేట రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. కోళ్లఫారం ధ్వంసం గజ్వేల్రూరల్/మర్కూక్: మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రజ్ఞాపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న కోళ్లఫారం ఈదురు గాలులకు ధ్వంసమైంది. రూ.70వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అలాగే మర్కూక్ మండలంలో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.పరిహారం అందిస్తాం ఈ యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 6,557 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. –రాధిక, జిల్లా వ్యవసాయశాఖ ఆధికారి -
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
హుస్నాబాద్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్సాన్పల్లిలోని రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీఎస్ గ్రూప్లో 468/470 మార్కులతో హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవి రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి వైష్ణవి నివాసానికి వెళ్లి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైష్ణవి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థులకు సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ కౌన్సిలర్లు మ్యాదరబోయిన శ్రీనివాస్. చిత్తారి పద్మ తదితరులు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ రాష్ట్ర టాపర్కు సన్మానం -
భూభారతితో భూసమస్యలకు చెక్
ములుగు(గజ్వేల్): జిల్లాస్థాయిలోనే భూసమస్యలు పరిష్కారమయ్యేలా భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరిగా, భూమికి భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్చైర్మన్ ప్రభాకర్, తహసీల్దార్ ఆరిఫా, ఏడీఏ అనీల్కుమార్, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా అమలు మర్కూక్(గజ్వేల్): భూభారతిని పటిష్టంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన మర్కూక్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషికి ఆధార్ కార్డు మాదిరి భూమికి భూధార్ కార్డు అని, భూమి హద్దులు జీపీఆర్ఎస్లో పొందుపరిచి పటిష్టంగా ఉంచడంలో భూదార్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. మార్కెట్ నిర్మాణం చేపడతాంవంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద రాజీవ్రహదారిపై క్రయవిక్రయాల రద్దీని అధిగమించేందుకు యార్డు ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మార్కెట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం వంటిమామిడి ఏఎంసీని ఆయన సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. మార్కెట్ యార్డు ఎదుట ఉన్న రాజీవ్రహదారిపై వ్యాపారస్తులు, రైతులు, క్రయవిక్రయాలు కొనసాగిస్తుండటంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్యార్డు ముందర మార్కెట్యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపి అతి త్వరలో మార్కెట్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులకు భూధార్ కార్డులు కలెక్టర్ మనుచౌదరి ములుగులో చట్టంపై అవగాహన -
ప్రజాసౌకర్యాలకు ప్రాధాన్యం
‘సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తాం. అవసరమైతే సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రాధాన్యత క్రమంలో రహదారులనూ నిర్మిస్తాం’ అని కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్తో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణ వాసులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరారు. ఫోన్ ఇన్ ద్వారా వచ్చిన సమస్యలు, ఫిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ.. ఆయా విభాగాల అధికారులు తక్షణం క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో మిషన్ భగీరథ నీళ్లు, యూజీడి వ్యవస్థ అమలు, రహదారుల నిర్మాణానికి అత్యధికంగా వినతులు వచ్చాయి. – సాక్షి సిద్దిపేట/సిద్దిపేటజోన్ కొత్త కాలనీలకు నీళ్లివ్వండి మా కాలనీలో 20 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచి నీళ్లు ఇవ్వాలి. – భూషణం, సాజిద్ అలీ(సద్గురు నగర్, సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: మున్సిపాలిటీ పరిధిలో కొత్త కాలనీలు వెలిశాయి. అప్పటి నివాసాలకు అనుగుణంగా మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెరిగిన నివాసాలకు అనుగుణంగా పైప్ లైన్ పనులు చేపట్టాలని నిర్ణయించాం. త్వరితగతిన భగీరథ నీళ్లు అందిస్తాం తాగునీటికి ఇబ్బందులు పలు కాలనీల్లో నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తక్షణం పరిష్కరించండి –కోటమ్మ(శివాజీ నగర్), వెంకట్ రమణారెడ్డి (మైత్రి వనం), వెంకయ్య (మోహిన్ పూర)మున్సిపల్ కమిషనర్: మిషన్ భగీరథ, మానేరు పథకం ద్వారా పట్టణంలో నీటి సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరాలో సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే సత్వరం పరిష్కరిస్తాం. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నాం. సంబంధిత అధికారి, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరిస్తారు. రోడ్డు మధ్యలో ఆర్చ్ కట్టారు.. రోడ్డు మధ్యలో ప్రయివేటు వ్యక్తులు కమాన్ (ఆర్చ్) నిర్మించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉంది, చర్యలు తీసుకోండి. –శ్రీనివాస్ రెడ్డి(మైత్రి వనం) మున్సిపల్ కమిషనర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తే ఉపేక్షించేది లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. వసతులు కల్పించండి మౌలిక వసతులు కల్పించాలి. వి మార్ట్ వెనుక భాగంలో రహదారులు లేవు, యూజీడి వ్యవస్థ అసలే లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. –సంజీవ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లత శేఖర్గౌడ్ (మారుతి నగర్) మున్సిపల్ కమిషనర్: రహదారి. యూజీడి వ్యవస్థ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లను పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. యూజీడికి అక్కడ ఔట్ లెట్ లేదు. అయినప్పటికీ సమస్య లేకుండా చూస్తాం. కాలువలు శుభ్రం చేయాలి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురికి కాలువలను సరిగ్గా శుభ్రం చేయడం లేదు. రోజు క్లీనింగ్ ఉండేలా చూడాలి. చెత్త బండి సరిగ్గా రావడం లేదు –వంశీకష్ణ (అంబేడ్కర్ నగర్), శేఖర్(మారుతీ నగర్), లక్ష్మీనారాయణ(చార్వాదాన్ వీధి) మున్సిపల్ కమిషనర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు సరిగ్గా జరిగేలా చూస్తాం. సిబ్బంది కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. రోజూ చెత్త బండి వచ్చేలా చూస్తాం. సంబంధించిన విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి సమస్యలు లేకుండా చూస్తారు. మ్యుటేషన్ చేస్తలేరు నోటరీ ద్వారా మ్యుటేషన్ చేస్తాలేరు. ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. –శ్రీకాంత్(గాంధీనగర్) మున్సిపల్ కమిషనర్: నోటరీ ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ జరగదు. నిబంధనల ప్రకారమే మ్యుటేషన్ చేస్తాం. సంబంధించిన పత్రాలు తీసుకుని నేరుగా కలవండి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పన్ను విధింపులో తేడాలు ఆస్తి పన్ను విధింపు విషయంలో తేడాలు తలెత్తుతున్నాయి. ఒకే వార్డులో ఒకే ప్రాంతంలో వేరువేరుగా ట్యాక్స్ విధిస్తున్నారు. (ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: భవనం పరిస్థితులు, నిర్మాణం మేరకు మున్సిపల్ ఆస్తి పన్ను విధింపు ఉంటుంది. ట్యాక్స్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా కొలతల ప్రకారమే పన్నులు అమలు చేస్తున్నాం. అధ్వానంగా మ్యాన్హోల్స్ మ్యాన్ హోల్స్పై కవర్లు లేవు. మైత్రి వనంలో యూజీడీ మ్యాన్ హోల్పై కవర్లు లేనందున ఇబ్బందులు పడుతున్నాం. అందులో చెత్త చెదారం పడుతోంది. దుర్వాసన వస్తోంది. రాత్రి వేళల్లో అందులో పడే ప్రమాదం ఉంది. –నాగరాజు(మైత్రి వనం) మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. త్వరితగతిన మ్యాన్ హోల్స్ మీద కవర్లు ఏర్పాటు చేస్తాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. యూజీడి అధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తా. దుర్వాసన వస్తోంది నర్సాపూర్ చెరువు వద్ద మాంసం వ్యర్థాలు బహిరంగంగా పారబోస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. –బాబు(సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూస్తాం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. ఫోన్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ ఆశ్రిత్కుమార్పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి రోడ్ల మరమ్మతులను వేగవంతం చేస్తాం యూజీడి, భగీరథ సమస్యలపై ఫోకస్ మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు అనూహ్య స్పందన -
మా భూములు మాకివ్వండి
మంత్రి పొన్నంకు రైతుల విన్నపంతోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం రాంచంద్రాపూర్కు చెందిన పలువురు రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారమన్నారు. సుమారు 600ఎకరాల సాగు భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా చేసేదిలేక సాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆ భూములన్నీ తిరిగి మాకే అప్పజెప్పాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో రైతులు వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, బత్తుల రాజు, బినవేణి రామస్వామి, లక్ష్మణు, మైలు మల్లేశం, బోలుమల్ల దేవమ్మ, భారతవ్వ తదితరులు ఉన్నారు. –కోహెడరూరల్(హుస్నాబాద్) -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్ష పుష్పార్చన
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన విద్యాసరస్వతి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక నక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వేదపండితులు స్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. స్వామివారి నామాలు పఠిస్తూ సామూహిక లక్షపుష్పార్చన చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. భూసార పరీక్షలు తప్పనిసరి గజ్వేల్: మండల పరిధి జాలిగామ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భూసారపరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం వల్ల నేలసారం దెబ్బతింటుందని చెప్పారు. నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం ఇతర పోషకాల శాతాన్ని తెలుసుకోవడానికి ఏటా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షల ఫలితాల తర్వాత పోషకాలను సరిచేసుకొని, అందుకనుగుణంగా పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్కు సంబంధించిన సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. మా భూముల్లో కాల్వలు తవ్వొద్దు హుస్నాబాద్రూరల్: మా భూముల్లో కెనాల్ కాల్వలు తవ్వొద్దని కూచనపెల్లి రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే చెరువు, కుంటల నుంచి నీటి కాల్వలు పంట పొలాలకు ఉన్నాయని, మళ్లీ కొత్తగా కెనాల్ కాల్వల కోసం భూములు తీసుకోవడం తగదని అన్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి నీటి కాల్వలు కూచనపెల్లి వరకు ఉన్నాయన్నారు. శనకుంటకు నీరు వెళ్లేందుకు పాత కాల్వలు ఉన్నాయని వాటికి మరమ్మతులు చేస్తే సరిపోతుందన్నారు. భూ సేకరణతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మల్లికార్జున్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి దేశానికే ఆదర్శం
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ● వర్గల్ మండలం శాకారంలో చట్టంపై అవగాహన సదస్సు ● పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వర్గల్(గజ్వేల్): దేశంలోనే చరిత్రాత్మకంగా, రోల్మోడల్గా భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షతన వర్గల్ మండలం శాకారంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో జీవించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఒక వరమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా నిలిచిన భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు. మనిషికి ఆధార్ మాదిరిగా, భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కులు కల్పిస్తూ భూధార్ సంఖ్య కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్తో అనేక ప్రభుత్వ, అసైన్డ్ భూములు, వక్ఫ్, దేవాదాయ తదితర భూములు పక్కదారి పట్టాయన్నారు. వేలాది ఎకరాలు పార్ట్బీలో చేరాయని, సాదాబైనామాలు పెద్ద ఎత్తున ఆన్లైన్ దరఖాస్తులకే పరమితమయ్యాయన్నారు. రికార్డులో తప్పుల నమోదుతో అత్యవసర పరిస్థితులలో అర ఎకరం భూమి అమ్ముకుందామంటే అమ్మలేని దయనీయ స్థితిని ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. దీనిని చట్టబద్ధం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే తమ ఉనికికే ప్రమాదమని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నానా ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా నిలుస్తూ సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ప్రజల్లోనే ఉంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, గజ్వేల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రికార్డుల పరంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూసంబంధ సమస్యలను వేదికపై మంత్రికి నివేదించారు. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా ఇదే వేదికపై పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేటరూరల్: ప్రజలు అందజేసిన అర్జీలను సత్వర పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి గరిమా అగర్వాల్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల, వివిధ సమస్యలపై మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి దుబ్బాక: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి శ్రీనివాస్రెడ్డి నిర్వాహకులకు సూచించారు. సోమవారం మున్సిపల్ పరధిలోని చెల్లాపూర్ 2, 3 వార్డులలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ, తూకం విషయంలో ఏ మాత్రం పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. మండుతున్న ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తున్నందునా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇంటి పన్ను చెల్లించే వారికి అందించే ఎర్లీబర్డ్ పథకం మరో రెండు రోజుల్లో ముగుస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఈఓ సరిత, ఆర్పీలు, రైతులు తదితరులు ఉన్నారు. చేర్యాల మహిళకు సీ్త్ర శక్తి అవార్డు చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రానికి చెందిన పి.మంగ రాష్ట్ర స్థాయి సీ్త్ర శక్తి అవార్డు అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా డీఆర్డీఓ సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ఆధ్వర్యంలో అవార్డులు వరించాయి. జిల్లా తరఫున చేర్యాలకు చెందిన నకాషి కళాకారిని పి.మంగ రూపొందించిన చేర్యాల మాస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం కరుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై అనాసక్తి
● ముందుకు రాని రైతులు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 363 మంది దరఖాస్తు ● ఇప్పటి వరకు ఈఎండీ చెల్లించింది 94 మందే ● సబ్సిడీ అందించాలంటున్న అన్నదాతలు ● ‘పీఎం కుసుమ్’లో 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశంజిల్లా పేరు దరఖాస్తులు ఈఎండీ చెల్లించిన వారు సిద్దిపేట 179 37 మెదక్ 74 24 సంగారెడ్డి 110 33 దరఖాస్తు చేసిన రైతు భూమిని పరిశీలిస్తున్న రెడ్కో అధికారులు‘సౌర’ పంటకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. పీఎం– కుసుమ్ పథకం కింద పంట పొలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులను గత ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరించారు. రైతు కనీసం 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్న రైతులు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం. సాక్షి, సిద్దిపేట: సాగు, బీడు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులు ఆదాయం పొందాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పీఎం – కుసుమ్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 430 విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటి పరిధిలో 363 మంది రైతులు దరఖాస్తు చేయగా అందులో ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను 94 మంది రైతులు మాత్రమే చెల్లించారు. ఈ ఈఎండీలు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుంది. మెగావాట్కు రూ.3 కోట్లు ఒక్క మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏదైన బ్యాంక్ రుణం పొందితే మెగావాట్కు 30శాతం లెక్కన రైతులు దాదాపు రూ.85లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లాంటు నుంచి విద్యుత్తు సబ్స్టేషన్ వరకు వేసే విద్యుత్తు లైన్ కోసం కిలో మీటరుకు రూ. 5లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ముందుకు రావడం లేదని దరఖాస్తు చేసిన రైతులు అంటున్నారు. కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందజేయాలని రైతులు కోరుతున్నారు. భూముల్లో కరెంట్ ఉత్పత్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్ (టీజీఈఆర్సీ) ఒక్కో యూనిట్కు రూ.3.13లను నిర్ణయించిన టారిఫ్ ప్రకారం కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు ఆదాయం రానుంది. ఒక్క మెగావాట్ ప్లాంట్లో రోజుకు 4600 నుంచి 5వేల యూనిట్ల వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈలెక్కన యేడాదికి సుమారు రూ.60 లక్షల వరకు పొందవచ్చు. జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి దరఖాస్తు చేసి ఈఎండీ చెల్లించిన వారిచే డిసెంబర్ వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈ ప్లాంట్ జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఈ నెలాఖరు వరకు ఈఎండీ చెల్లించే గడువు ఉండటంతో మరి కొందరు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. –రవీందర్ చౌహాన్, డీఎం, రెడ్కో -
మున్సిపల్ కమిషనర్తో నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్తో ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పౌర సేవలు, నూతన ఇంటి అనుమతులు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, మ్యుటేషన్ తదితర అంశాలపై అనుమానాలు, సందేహాలు, ఫిర్యా దులను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు : 98668 98692, 98665 53321 -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి
సిద్దిపేటరూరల్: హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి హమాలీకి నెలకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఐకేపి, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రాలు హమాలీ కార్మికులతో నడుస్తున్నాయన్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ప్రభుత్వం వారికి రక్షణగా నిలవాలన్నారు. కార్మికులకు కొనుగోలు కేంద్రం ద్వారానే కూలిని చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన హమాలీకి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. సాధారణ మరణం పొందితే రూ.5లక్షలు అందించాలన్నారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ , కమిటి సభ్యులు అమ్ముల బాలనర్సయ్య, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడాల కనకయ్య, నాయకులు ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్ -
ఐడియా అదిరింది.. ఆటో భలేగుంది
ఇంటి పెరట్లో.. మేడపైన మొక్కలు పెంచడం సహజం. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆటోపై మట్టికుండీలు అమర్చి వాటిలో మొక్కలు పెంచుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఓ ఆటోవాలా. అంతే కాదండోయ్ పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించేవారికి అవగాహన కల్పిస్తున్నారు. మండుతున్న వేసవిలోనూ ఈ ఆటోలో ప్రయాణిస్తే చాలా కూల్కూల్గా ఉంటోంది. వినూత్న పద్ధతిలో ఆటోను డిజైన్ చేసి నడుపుతున్న డ్రైవర్ అంజిని ‘సాక్షి’ సోమవారం పలకరించింది. మహబుబాబాద్ జిల్లా పూసపల్లికి చెందిన అంజి తన ఆటోకు పచ్చిగడ్డి, పూలమొక్కలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలంటూ వందల కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులు ఉపశమనం పొందేలా కూలర్ లాంటి ఫ్యాన్ను, చల్లని మంచినీటిని ఏర్పాటు చేశారు. వికలాంగులు, కంటి చూపు లేని వారిని ఉచితంగా తన ఆటోలో తమ తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నట్లు అంజి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని కోరుతున్నారు అంజి. – సిద్దిపేటకమాన్ -
కేసీఆర్ ఆరోపణలు అర్థరహితం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి సిద్దిపేటరూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేవలం సీఎం రేవంత్రెడ్డిపై నిందలు వేసేందుకు మాత్రమే నిర్వహించినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని ఇర్కోడ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సొంత గ్రామంలోనే ఇచ్చిన హామీ నెరవేర్చలేని కేసీఆర్.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెండింగ్ బిల్లులన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనని అన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ సదాశివారెడ్డి, కిష్టారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య, శ్రీనివాస్, బాలకిషన్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాదాబైనామాలకూ పరిష్కారం
● కలెక్టర్ మనుచౌదరి ● గజ్వేల్లో భూభారతిపై అవగాహన సదస్సు గజ్వేల్: పెండింగ్లో ఉన్న సాదాబైనామా సమస్యలను పరిష్కరించడానికి ‘భూభారతి’లో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. సోమవారం గజ్వేల్లోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా సదస్సుల నిర్వహణతోపాటు కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై అందించే దరఖాస్తులను భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్ వద్దకు, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారు చేసి, ప్రతి ఏటా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో రెనెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి సువర్ణ, తహశీల్ధార్ శ్రావన్కుమార్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి
వేసవికాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎండల వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒక వేళ వెళ్లాల్సివస్తే గొడుగు, నెత్తిన టోపీలు, చలువ అద్దాలు ధరించాలి. అధిక ఎండల వల్ల శరీరంలోని లవణాలు త్వరగా చెమట రూపంలో కోల్పోతాం. లవణాలను తిరిగి పొందేందుకు నీరు, చెరకు, నిమ్మ రసం, మజ్జిగ సేవించాలి. –డాక్టర్ రాజేశ్వర్, ఎండీ జనరల్ ఫిజీషియన్, సిద్దిపేట -
వాహనాలన్నీ ఓరుగల్లు వైపే
ప్రధాన చౌరస్తాగా మారిన రంగధాంపల్లి.. సిద్దిపేటజోన్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణలు భారీగా తరలివెళ్లారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, మెడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ రంగధాంపల్లి చౌరస్తా నుంచి ఓరుగుల్లు వైపు పయణమయ్యాయి. వేలల్లో వాహనాల రాకతో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, అంబులెన్స్లు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్టీ జెండాల ఆవిష్కరణ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న సర్కిళ్లను గులాబి తోరణాలతో అలంకరించారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే హరీఽశ్రావు నివాళులు అర్పించి ఎల్కతుర్తికి భారీ వాహనాలతో తరళివెళ్లారు. క్యాంపు కార్యాలయంలో సందడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది. సభ స్థలికి వెళ్లే మార్గం సిద్దిపేట గుండా కావడంతో సమీపంలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మార్గమధ్యంలో హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడే అల్పాహారం చేశారు. -
కేసీఆర్ ఇలాకాలో ఘనంగా రజతోత్సవం
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలను హోరెత్తించారు. ఆ తర్వాత వరంగల్ సభకు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్లో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు. -
పక్షులను కాపాడుకుందాం
మానవులతో సమానంగా ప్రకృతిలో జంతువులు, పక్షులకు జీవించే హక్కు ఉంది. వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పచ్చని చెట్లు ఉంటే మనం రక్షించుకోవడంతో పాటు, జంతువులు, పక్షులు సేదతీరుతాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పలువురు తమ ఇళ్లు, విద్యాసంస్థల వద్ద పక్షుల కోసం తాగునీటి తొట్టెలు, ధాన్యం ఏర్పాటు చేయడం సంతోషకరం. –డాక్టర్ నరసింహస్వామి, పర్యావరణ ప్రేమికుడు, సిద్దిపేట -
ఉగ్రవాదుల పిరికిపంద చర్య
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ చెరువంతా గుర్రపు డెక్కమిషన్ భగీరథ పైపులైన్ లీకేజీసంగారెడ్డి రూరల్: ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేకే భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు జరిపిన కాల్పులను ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల, రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేశంలో సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఆర్మీని నిఘా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతోపాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నాయకులు సాయి, శివ, ప్రశాంత్ శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, దేవదాస్, అమీర్ పాల్గొన్నారు.దుబ్బాక పట్టణంలోని రామ సముద్రం చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీంతో చెరువులోని నీరంతా కలుషితమవుతోంది. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. గుర్రపు డెక్కను తొలగించి చెరువును సుందరీకరించాలని వారు కోరుతున్నారు. – దుబ్బాకటౌన్ పాపన్నపేట(మెదక్): మిషన్ భగీరథ పైపులైన్ జాయింట్ విడిపోవడంతో ఆదివారం నీరు వృథాగా పోయింది. సుమారు 20 ఎకరాల పొలాల్లోకి నీరు చేరింది. మండల పరిధిలోని నార్సింగి గ్రామానికి చెందిన 70 కుటుంబాలతో పాటు పలు గ్రామాలకు తాగునీరు రావడంలేదు. ఎల్లమ్మ గుడి వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్కు కొత్తగా లింక్ లైన్ ఏర్పాటు చేసి, అర్కెల, దాని పరిధిలోని ఏడు గిరిజన తండాలు, నార్సింగిలోని ఒక ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి తాగునీరందిస్తున్నారు. మూడు రోజులుగా తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్లు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నార్సింగి గ్రామ శివారులో పైపులు పగిలి నీరు వృథాగా పోతోందని తెలిపారు. వృథాగా పోతున్న తాగునీరు మూడు రోజులుగా పలు గ్రామాలకు నీటి కష్టాలు పట్టించుకోని అధికారులు -
జడ్జి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జిని అర్చకుడు పరమేశ్వర్ సన్మానించారు. నీతికథలతో మంచి ఆలోచనలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీతి కథలు చెప్పడం వల్ల చిన్నారుల్లో మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని కథాశిల్పి ఐత చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ నీతి కథలు చెప్పి, విద్యార్థులను మంచివైపు నడిచేలా బాటలు వేస్తున్న కథల తాతయ్య రాజమౌళి అభినందనీయుడన్నారు. కథలు చెప్పడం ఒక కళ అని, అందులో చిన్నారులకు కథలు చెప్పడం అంటే గర్వించే విషయమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలకు కథలు వినిపించాలన్నారు. సన్మాన గ్రహిత రాజమౌళి మాట్లాడుతూ పిల్లల ప్రపంచంలో కథలు చెప్పడం సంతోషమనిపిస్తుందన్నారు. బాలల వికాసానికి కథలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో కవులు సింగీతం నరసింహరావు, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, ఉండ్రాళ్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక గజ్వేల్రూరల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ప్రజ్ఞాపూర్లోగల టీజీడబ్ల్యూఆర్ఎస్(వర్గల్) విద్యార్థి బి.ఆకాష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. టీజీడబ్ల్యూఆర్ఎస్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆకాష్ ఈనెల 30 నుంచి మే 5వరకు ఢిల్లీలో జరిగే అండర్ –19 జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను చాటి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆకాష్ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు పాతికేళ్లు
● కొనాయిపల్లిలో పూజలు చేసి ర్యాలీగా జలదృశ్యంకు ● నాడు నాటిన బీజం.. నేడు గులాబీవనంలా మారి.. ● ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ఏ ఎన్నికై నా అండగా నిలిచిన ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2001, 2004, 2008, 2010.. ఇలా జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఓటర్లు విజయాన్ని అందించారు. 2023లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు, 2018లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, ఆందోల్, మెదక్, నారాయణఖేడ్, 2014లో సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, ఆందోల్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2004లో సిద్దిపేట, సంగారెడ్డి, రామాయంపేట, దుబ్బాక, 2009లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాక్షి, సిద్దిపేట: గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ పురిటిగడ్డ మెతుకుసీమ మురిసిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, బీఆర్ఎస్కు మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా అండగా నిలిచింది. 2000 సంవత్సరం ఆరంభంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి గులాబీ జెండాను ఎత్తుకున్నారు. అప్పటి నుంచి 14 ఏళ్లు అన్నివర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఉప ఎన్నికల్లో బస్సు గుర్తు కేటాయింపు 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయింది. 2001 సెప్టెంబర్లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో ఎన్నికల కమిషన్ బస్సు గుర్తును కేటాయించింది. ఆ ఉపఎన్నికలో సమీప ప్రత్యర్థి శ్రీనివాస్రెడ్డి (టీడీపీ)పై 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ ఘనం విజయం సాధించారు. అధికార టీడీపీ ప్రభుత్వం కేసీఆర్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్దిపేట ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారు. మేమున్నాం తెలంగాణను సాధించి తీసుకురండి అని ఆశీర్వదించారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం 2005లో వరంగల్లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్పై బయలు దేరారు. సిద్దిపేట నుంచి వరంగల్కు ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించడంతో సక్సెస్ అయింది. అదే ఏడాదిలో రాజీవ్ రహదారిపై వంటా వార్పు, రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. 2008లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులను సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జన విజయవంతం అయింది. 2009 నవంబర్లో సిద్దిపేట అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో ‘‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఫ్రీ జోన్ రద్దు, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి సెంటర్ను వేదికగా ఎంచుకున్నారు. కరీంనగర్ నుంచి నవంబర్ 29న సిద్దిపేటలోని ఆమరణ దీక్ష శిబిరానికి బయలు దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో హరీశ్రావు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పద్మారెడ్డితో పలువురు నాయకులు దీక్షకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి మెదక్ నుంచి 2 లక్షల మంది వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత, అలాగే పటాన్చెరు నుంచి కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా నాయకులతో మాజీ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు.పోరాటం తప్పదని ప్రకటన 2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేడ్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. అంతకు ముందే పలువురు మేధావులతో రాష్ట్ర సాధన కోసం చర్చించారు. తర్వాత సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా హైదరాబాద్ జలదృశ్యం బయలుదేరారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.సిద్దిపేట నుంచి వరంగల్ సభకు సైకిల్పై వెళ్తున్న కేసీఆర్ (ఫైల్) -
ఇక భూధార్ కార్డులు
● భూ సమస్యలకు భూభారతితో చెక్ ● కలెక్టర్ మనుచౌదరీ కొండపాక(గజ్వేల్): భూముల గుర్తింపునకు భూదార్ కార్డులు ముఖ్యమని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని రైతు వేదికల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల తమ భూములపై పక్కాగా హక్కులు కలిగి ఉండేలా భూ భారతి చట్టం పని చేస్తుందన్నారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వం భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసకునేలా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదివరకు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చేదని, భూ భారతితో పారదర్శకంగా విచారణ జరిపి జిల్లా, రెవెన్యూ అధికారులు పరిష్కరించే అధికారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, డీసీఓ నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వి.శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఓలు శివరామకృష్ణ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా యూజీసీ నీట్ పరీక్ష నిర్వహించాలి సిద్దిపేటరూరల్: మే 4వ తేదీన జరిగే యూజీసీ నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్గల్ క్షేత్రం.. భక్తిపారవశ్యం
వర్గల్(గజ్వేల్): శనిత్రయోదశి మహోత్సవ వైభవంతో వర్గల్ శ్రీవిద్యాసరస్వతి శనేశ్వర క్షేత్రం అలరారింది. తైలాభిషేకాలకు తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున శనిత్రయోదశి వేడుకలకు అంకరార్పణ జరగగా, ఆలయ మహామండపంలో భక్తుల సామూహిక శనేశ్వర పూజలు కొనసాగాయి. అనంతరం భక్తులు ఒక్కొక్కరుగా మూలవిరాట్టుకు తిల తైలం సమర్పించి, శుభాలు చేకూర్చా లని ప్రార్థించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే క్షేత్రంలోని చంద్రమౌళీశ్వర స్వామికి మాస శివరాత్రి సందర్భంగా విశేషా భిషేకం అనంతరం అన్నపూజ నిర్వహించారు. శనిత్రయోదశి వైభవం శనేశ్వరునికి తిల, తైలాభిషేకం -
గల్ఫ్ బాధితుడికి విముక్తి
మంత్రి పొన్నం చొరవతో క్షేమంగా ఇంటికి.. హుస్నాబాద్: గల్ఫ్లో చిక్కుకున్న చొప్పరి లింగయ్య ఎట్టకేలకు సొంతూరుకు చేరుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు స్వదేశానికి రప్పించాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నంకు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే స్పందించిన మంత్రి.. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిలను సమన్వయం చేశారు. ఎన్నారై ప్రతినిధులు లింగయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. విమాన టికెట్ డబ్బులను మంత్రి పొన్నం భరించారు. దీంతో లింగయ్య హైదరాబాద్కు చేరుకున్నాడు. చొరవ చూపిన మంత్రి పొన్నంకు లింగయ్య, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం: సీపీసిద్దిపేటకమాన్: గంజాయి, మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. సిద్దిపే ట డివిజన్ పోలీసు అధికారులతో ఆమె సమీక్షించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. నూతన టెక్నాలజీపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రాబోవు రోజుల్లో సీసీటీఎన్ఎస్ డాటా ప్రకారమే దేశ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్లు ఎంపిక చేస్తారన్నారు. సైబర్ నేరాలు, గంజాయి తదితర అంశాలపై యవతకు అవగహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏసీపీ మధు, టాస్క్ఫోర్స్ ఏసీసీ రవీందర్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, ఎస్ఐలు అపూర్వరెడ్డి, బాలకృష్ణ, అసిఫ్, గంగరాజు, హరీశ్, రాజేష్, పరుశరామ్ తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ జగదేవ్పూర్(గజ్వేల్): చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజన్న అన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాలలో శనివారం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పది, ఇంటర్మీడియెట్ విద్యే భవితకు పునాదన్నారు. చదువతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లకు ఘన సన్మానం కొండపాక(గజ్వేల్): వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ పరశురాములును కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు మాట్లాడుతూ 15యేళ్లుగా మార్కెట్ కమిటీ పాలకవర్గ లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డార న్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకతలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. లింగారావు, గంగాధర్, సిద్దులు, ప్రభాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
సిద్దిపేటరూరల్: నీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా స్థాయిలో వాచ్డాగ్ కమిటీలు పనిచేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా కమిటీ పనిచేయాలని సూచించారు. వర్షపు నీటి హార్వెస్టింగ్పై సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడానికి ముందుగానే 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్లాట్ ఏరియా ఉన్న అన్ని భవనాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలన్నారు. 10 వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారీ భవనాలలో అలాగే వంద అంతకంటే ఎక్కువ యూనిట్లు ఉన్న గ్రూప్ హౌస్లకు వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్లను కలిగి ఉండేలా చూడాలన్నారు. విద్యా సంస్థలు, హాస్టళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
సమర్థ పాలనకు కార్యదర్శులే కీలకం
సిద్దిపేటఎడ్యుకేషన్: పాలన సమర్థవంతంగా ఉండేందుకు పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శనివారం పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించి పంచాయతీ పాలనను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించాలని సూచించారు. రిసోర్స్ పర్సన్లు రిటైర్డ్ ఎంపీడీఓ సమ్మిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాసరావు, విద్యావికాస్రెడ్డి తదితరులు పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సభ నిర్వహణలో కార్యదర్శి పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నినాదంతో దిగ్విజయంగా 25 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగడం ఒక్క గులాబి జెండాకే దక్కిందన్నారు. సమావేశంలో నాయకులు రాయిరెడ్డి రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, అన్వర్ పాష, వెంకట్, నవీన్, రజిత, అనిత, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో.. తొగుట(దుబ్బాక): ఉద్యమ స్ఫూర్తితో అధిక సంఖ్య లో కార్యకర్తలు తరలివచ్చి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, అరుణ్కుమార్, రమేశ్, నరేందర్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. హుస్నాబాద్కు చేరుకున్న పాదయాత్ర హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించునున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి హుస్నాబాద్కు చేరుకుంది. స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. డీజే సౌండ్, డప్పుల చప్ప్ళుళ్లతో నృత్యం చేస్తూ సందడి చేశారు. మండలంలోని పోతారం(ఎస్) శుభం గార్డెన్లో రాత్రి బసచేసి ఆదివారం ఉదయం పాదయాత్రగా ఎల్కతుర్తికి బయలుదేరనున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాయిరెడ్డి రాజిరెడ్డి, రజిత, అనిత, వెంకట్, తిరుపతిరెడ్డి, మంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ● కడవేర్గులో బడిబాట ప్రారంభంచేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని శనివారం మండల పరిధిలోని కడవేర్గు కాంప్లెక్స్ పరిధిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బు దుబారా చేయొద్దని కోరాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఉచిత సౌకర్యాలతో పాటు టెక్నాలజీతో కూడిన బోధన లభిస్తుందని చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ కిష్టయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్రావు, పాఠశాలల హెచ్ఎంలు ఐలయ్య, సంతోష్, మల్లికార్జున్రెడ్డి, కిషన్, రాజు, ఉపాధ్యాయులు కాంతికృష్ణ, బాలభాస్కర్, రామచంద్రమూర్తి, విజయ్ తదితరులు ఉన్నారు. -
బీఆర్ఎస్ రక్షణ కవచం
తెలంగాణకు శ్రీరామరక్షరజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన●● పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం ● ‘సాక్షి’తో ఎమ్మెల్సీ, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తెలంగాణ ప్రజల రక్షణ కవచమని ఎమ్మెల్సీ, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ తెలంగాణను పునఃనిర్మాణం చేసిందని, కాంగ్రెస్కు అధికారం తప్ప.. ప్రజల గురించి ఆలోచించడంలేదని తెలిపారు. రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోందని, మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశపతి శ్రీనివాస్ను రజతోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక అనాథ.. తెలంగాణకు అన్యాయం జరిగితే అడిగే దిక్కులేదు. వివక్షకు గురవుతుంటే అడిగే వారేలేరు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు తెలంగాణను ఒక అంగడి సరుకు చేసి తమకు పదవి రానప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను ఎత్తు కోవడం పదవి రాగానే దించడం చేశారు. దీంతో ప్రజల్లో ఉద్యమంపై, ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఆశ లేకుండా పోయింది. 1969లో 369 బలిదానాలు జరిగినా కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రంపై ప్రజల్లో కేసీఆర్ ఆశలు చిగురింపజేశారు. గులాబీ జెండాను ఎత్తి 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మూగబోయిన తెలంగాణ ఉద్యమం సింహగర్జన చేసింది. నిర్జీవమైన ఉద్యమం మళ్లీ ప్రాణం పోసుకుంది. అనేక ఉద్యమాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట. తెలంగాణను పునఃనిర్మాణం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పదేళ్ల పరిపాలనలో చల్లగా బతికింది. కేసీఆర్ పరిపాలనలో భూమి మీద నీళ్లు పారాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి, కొత్తగా కాళేశ్వరం నిర్మించి, పాలమూరు ఎత్తిపోతల పథకంను 80శాతం, సీతారామను 90శాతం, అనేక చెక్ డ్యాంలు నిర్మాణాలయ్యాయి. దీంతో చెరువులు బాగుపడ్డాయి. జలాలు.. ధాన్యం రాశులు ఆనాడు నీటి కోసం అలమటించిన తెలంగాణ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏటు చూసినా జల రాశులు, పంట రాశులు దర్శినమిచ్చాయి. కరోనా వచ్చినా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆగలేదు. పదేళ్లలో ఆర్థిక వృద్ధి పెరగడంతోపాటు 1.60లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకవచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు దుష్ప్రచారాలు చేశాయి. గోరంతను కొండంతగా చూపించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ లేని రాజకీయాలను ఊహించలేం. కొంత ఆత్మపరిశీలన చేసుకున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉండేవి అన్న ఆలోచన ప్రజలు చేస్తున్నారు. కాంగ్రెస్ తీరు అర్థమైంది.. కాంగ్రెస్ నేతలకు అధికారం అనుభవించాలనే కోరిక తప్ప.. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీతో అన్ని కోల్పోతున్నామని ప్రజలకు అర్థమవుతోంది. కాళేశ్వరం నీటితో చెరువులు నింపుతున్న పరిస్థితి లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మళ్లీ కరువు వచ్చేస్తోంది. కరెంట్ సమస్యలు వస్తున్నాయి. పదేళ్లలో ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంవత్సరం నుంచి క్షీణత మొదలైంది. రియల్ రంగం కుదేలైంది. దీంతో తెలంగాణ తిరోగమన దిశ ప్రారంభమైంది. కేసీఆర్ మాటలు వినాలని.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోంది. కేసీఆర్ను చూడాలని.. ఆయన మాటలు వినాలని గులాబీ దండు కదిలివస్తోంది. బండ్లు కట్టుకుని.. నడచుకుంటూ వరంగల్కు చేరుకుంటున్నారు. రజతోత్సవం బీఆర్ఎస్ పండుగే కాదు.. ప్రజల ఆత్మగౌరవం. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నా.. రైతు బంధు రావాలన్నా.. బడుగులకు భరోసా దొరకాలన్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎదైన భూ సమస్య ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వయిరీ, ఇరువర్గాలను పిలిచి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్ పరిశీలనచేసి నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో జరగుతాయని వివరించారు. అలాగే అన్ని వివరాలతో కూడిని భూఆధార్ కార్డును రైతులకు అందించన్నుట్లు తెలిపారు. దీంతో భూఅక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు అనంతరం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అధికారులతో కలసి సందర్శించారు. కొంత కాలంగా మూసి ఉన్న వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహానికి కావల్సిన మౌలిక వసతులు వెంటనే కల్పించి వచ్చే విద్యాసంవత్సరం అరంభం నాటికి వసతి గృహాన్ని పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా అమలు కలెక్టర్ మనుచౌదరి -
బీఎస్ఎన్ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఏజీఎం లక్ష్మణ్ బానోత్ సిద్దిపేటకమాన్: బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) లక్ష్మణ్ బానోత్ తెలిపారు. సిద్దిపేటలో శుక్రవారం వినియోగదారుల మేళా కార్యక్రమం నిర్వహించారు. మేళాలో పలువురు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు పలు సమస్యలపై సంప్రదించగా సిబ్బంది పరిష్కరించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏస్డీఈలు మోహన్రెడ్డి, రవీందర్, రాజేంద్రప్రసాద్, రాజ్కుమార్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి సివిల్ సప్లై సీఆర్ఓ ఫణిందర్ కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని సివిల్ సప్లై సీఆర్ఓ (ఐఏఎస్) ఫణిందర్ అన్నారు. దుద్దెడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, నీడ నిచ్చే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ కొనుగోళ్ల కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న వేళ కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉరుములు.. పిడుగులు ● పలు ప్రాంతాల్లో గాలివాన ● భయాందోళనకు గురైన ప్రజలు దుబ్బాక/దుబ్బాకరూరల్: మండల పరిధిలోని బల్వంతాపూర్, తొగుట మండలం గుడికందుల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బల్వంతాపూర్లో ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టు, గుడికందులలో ఇళ్లసమీపంలోని తాటిచెట్టుపై పిడుగులు పడి మంటలు ఎగసిపడ్డాయి. వరదరాజుపల్లిలో పాడిగేదెలు మృతి తొగుట(దుబ్బాక): పిడుగుపాటుకు పాడిగేదెలు మృతిచెందాయి. ఈ ఘటన వరదరాజుపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేపాక పరశురాములు తన వ్యవసాయ పొలం వద్ద పాడిగేదెలను కట్టేసిన చెట్టుపై పిడుగుపడింది. దీంతో గేదెలు మృతిచెందాయి. నిలిచిన రాకపోకలు.. మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనదారుల రాకపోకలు నిలిచి పోయాయి. గంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
ట్రిపుల్ఆర్ భూబాధితుల ఆక్రోశం
రూ.కోట్లు పలికే భూములకు అత్తెసరు పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారంటూ ట్రిపుల్ఆర్ భూ బాధితుల్లో ఆక్రోశం వ్యక్తమవుతోంది. భూముల ప్రభుత్వ విలువపై పట్టణ ప్రాంతాల్లో రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడింతలు ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 4,832ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. మే లేదా జూన్ నెలలో భూముల స్వాధీనానికి రంగం కూడా సిద్ధమైంది. పరిహారం తేల్చకుండానే అధికారుల కార్యాచరణ వేగవంతం చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గజ్వేల్: ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం భూబాధితుల పరిహారం లెక్కల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రూ.కోట్ల విలువైన భూములకు పొంతన లేని పరిహారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుండటమే కారణం. ట్రిపుల్ఆర్ భూసేకరణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి పరిధిలో మూడు కాలాలతోపాటు గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4832.5ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో దాదాపుగా సేకరించారు. ఇందులో 180 ఎకరాల అటవీ భూమి, మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. పొంతనలేని లెక్కలు సేకరిస్తున్న భూమికి ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలు మాత్రమే పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తర భాగంలో ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే సంగారెడ్డి ప్రాంతంలోని కొన్ని సర్వే నంబర్లల్లోని భూమి అత్యధికంగా రూ.75లక్షలు పలుకుతోంది. ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే రూ.1.5కోట్ల పరిహారం అందే అవకాశం ఉంది. నిజానికి ఈ భూమికి బహిరంగ మార్కెట్లో ధరను పరిశీలిస్తే.. రూ.10కోట్లకుపైనే ఉంటుంది. ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే చౌటుప్పల్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు అత్యధికంగా రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువ కలిగిన భూములు ఉన్నాయి. నిజానికి బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.5నుంచి 7కోట్ల వరకు పలికే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల గరిష్టంగా రూ.10లక్షలకుపైగా ప్రభుత్వ విలువ కలిగిన భూములు ఉన్నాయి. కానీ భూములకు మార్కెట్ ధరతో పోలిస్తే పొంతన లేని పరిహారం పొందే అవకాశముంది. ముఖ్యమైన విషయమేటంటే భూముల ప్రభుత్వ విలువల పెంపు శాసీ్త్రయంగా జరగకపోవడం కూడా బాధితుల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సామలపల్లిలో ట్రిపుల్ఆర్ నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలే.. ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం ముందుకు ఉత్తర భాగంలో 4,832 ఎకరాల భూసేకరణ పూర్తి భూముల స్వాధీనానికి రంగం సిద్ధం అదనపు భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 11చోట్ల ఇంటర్ఛేంజ్ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వీటి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుత హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు కంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్ఛేంజ్ల వద్ద అదనపు భూసేకరణ అవసరమవుతోంది. దీంతో ఇంటర్చేంజ్ ప్రదేశాల్లోనూ బాధిత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం
●నిబంధనల మేరకే భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతోంది. ఎన్హెచ్ 1956 చట్టం ప్రకారం ఈ భూసేకరణ జరుగుతుంది. పరిహారం పంపిణీ కూడా మే లేదా జూన్ నెలలో పూర్తి కానుంది. దీని తర్వాత భూముల స్వాధీనానికి చర్యలుంటాయి. – తోసిఫ్, డిప్యూటీ మేనేజర్, ఎన్హెచ్ఏఐ ● పాదయాత్ర విజయయాత్ర కావడం ఖాయం ● గెలిచినా ఓడినా ప్రజల పక్షమే ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూంపం వద్ద అమరవీరులకు, పహల్గామ్లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం వరంగల్కు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మిట్టపల్లి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాలు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర.. పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్ర కాబోతుందన్నారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించిందన్నారు. కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ తెలంగాణ పక్షం వైపే ఉండి పోరాడుతుందన్నారు. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా 1500 మంది యువత పాదయాత్రగా రజతోత్సవ సభకు బయలుదేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్.. గాంధీ చూపిన బాటలో ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, అభివృద్ధి సంక్షేమాల్లో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. పాదయాత్ర పొడుగునా కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని, రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.యువకులకు దిశా నిర్దేశం చేస్తున్న హరీష్రావునంగునూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం పాలమాకులకు చేరుకుంది. భోజనాల అనంతరం ఎమ్మెల్యే హరీష్రావు యవకులకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మీతో కలసి పాదయాత్ర చేస్తా.. మిమ్ములను గుండెలో పెట్టుకొంటా’ అని అన్నారు. యువకులు క్రమశిక్షణతో వరంగల్ వరకు పాదయాత్ర చేయాలన్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన యువకులు రాత్రి బద్దిపడగలో బస చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం నంగునూరు(సిద్దిపేట): వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ధాన్యం దళారుల పాలు అవుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పాలమాకులలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్మి వారం రోజులు గడుస్తున్నా డబ్బులు రాలేదని రైతులు తెలిపారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని అన్నారు. గత యేడాది లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించిందన్నారు. -
సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సిద్దిపేటఅర్బన్: వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సూచించారు. గురువారం సాయంత్రం రాజీవ్ రహదారి పొన్నాల దాబాల వద్ద పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించడం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ప్రాణాపాయం నుంచి బయటపడేస్తాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 42వేల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. -
మే నెలంతా సెలవులివ్వండి
సిద్దిపేటరూరల్: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన చేపట్టారు. అనంతరం యూనియర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ రెహమన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమానంగా అంగన్వాడీలకు సైతం ఒక్కపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యలర్ జారీ చేయడం మంచి విషయమన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన పోషన్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మేనెల మొత్తం సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపారన్నారు. 40 డగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సెలవులపై ప్రకటన చేయాలన్నారు. తమకు స్పష్టమైన హమీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వీరమని, శారద, కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమలహాసన్, ప్రకాశ్రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర మెదక్ ఎంపీ రఘునందన్ రావు -
భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో భూములు కబ్జాలకు గురైతే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వారు ఎంతటి వారైన సహించబోమన్నారు. రైతులకు వరం భూమి అంటేనే ఆత్మగౌరవం అని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం.. తదితర అంశాల పరిష్కారానికి ‘భూ భారతి’ రైతులకు వరంలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల జరిగిన అవకతవకల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. 30 ఏళ్ల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని... తద్వారా గొడవలు నెలకొన్నాయన్నారు. భూముల మీద పంచాయితీలు జరగకుండా ఉండాలన్నదే మా లక్ష్యమన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవతుందని, ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. అలాగే నష్టపోయిన రైతులను అందుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి దృష్టికి భూ సమస్యలు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ముగిసిన తరువాత పలువురు రైతులు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కన్నపేట మండలంలోని నందారం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 935ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఓ ముస్లిం పేరుపై ఉండటంతో ధరణీ పోర్టల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని భానోతు భాస్కర్నాయక్ చెప్పారు. మోత్కులపల్లి పరిధిలో సుమారు 120ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులకు పశువులు, మేకలు మేపుటకు అప్పటి దొరలు ఇస్తే ఇతరులు పట్టాలు చేసుకున్నారని గుగులోతు రాంబాబు నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేగొండలో ఏళ్లతరబడి కాస్తులో ఉంటే ధరణిలో మరొకరి పేరు ఉందని ఎడల వనేష్ చెప్పారు. ఇలా పలువురు భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్ను ప్రస్తుతం బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. జూన్ 2 నుంచి క్షేత్ర స్థాయిలో అమలుహుస్నాబాద్: వచ్చే జూన్ 2 నుంచి భూ భారతి చట్టం క్షేత్ర స్థాయిలో అమలు అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండలంలోని పొతారం (ఎస్)లో గురువారం భూ భారతి చట్టం అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాతే భూముల పంచాయితీ పెరిగిందన్నారు. భూమి ఎవరిదో తెలిపేలా సమగ్ర వివరాలతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. భూ భారతితో కష్టాలు తొలగిస్తాం భూముల పేరిట పంచాయితీలు వద్దు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు
గాలివాన బీభత్సంగజ్వేల్రూరల్: గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అగ్ని గుండాలు, గరుడ వాహనసేవ నిర్వహించారు. అలాగే గరుడ వాహనంపై స్వామివార్ల విగ్రహాలను ఉంచి పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ● బెజ్జంకిలో పిడుగుపడి వృద్ధురాలు మృతి ● కూలిన విద్యుత్ స్తంభాలు ● నేలరాలిన మామిడికాయలు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వాన బీభత్సం సృష్టించింది. లక్ష్మీపూర్లో విద్యుత్ స్తంభాలు కూలాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. బెజ్జంకిలోని ఎడ్ల బొమ్మ సమీపంలో పిడుగు పడి టేకు రంగవ్వ (63) అనే వృద్ధురాలు మృతిచెందగా టేకు ప్రవీణ్ అనే 13 ఏళ్ల బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. వీరిని మొదట బెజ్జంకి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రంగవ్వను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ను అంబులెన్సులో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇంటర్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంటర్లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట శాఖా గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికార భాష హోదా దక్కినా తెలుగును కళాశాల విద్యలో తొలగించడం ఎంతవరకు సమంజమన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నంతవరకు మనకు గౌరవం దక్కుతుందని, ఇతర భాషల వల్ల వెనుకబడి పోతున్నామన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ భాషకు గౌరవం దక్కాలంటే ప్రతి ఒక్కరూ తెలుగు చదవాలన్నారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి బస్వరాజు కుమార్, చీకోటి రాములు, వంగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే చర్యలు దుబ్బాకరూరల్: ఆలయాల భూములు కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి హెచ్చరించారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మండలంలోని హబ్సిపూర్లో భూములను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ దేవాదాయ పరిధిలో 1417, 1418 సర్వే నంబర్లో 11ఎకరాల భూమి ఉందన్నారు. భూమిని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కొందరు ఏకంగా భవనాలు నిర్మించేందుకు పనులు చేపడుతున్నారని, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ సేవామేళా సిద్దిపేటకమాన్: సిద్దిపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం వినియోగదారుల సేవామేళా నిర్వహించనున్నట్లు ఏజీఎం లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందన్నారు. వినియోగదారులు మొబైల్ తదితర సేవలు, సమస్యల పరిష్కారం కోసం మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు తెలిపారు. సిద్దిపేట డిపోలో నిర్వహించిన ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో గత రెండు నెలల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 92మంది సిబ్బందిని గురువారం అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించి సిద్దిపేట, దుబ్బాక డిపోలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరి, అసిస్టెంట్ ఇంజనీరు రంజిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పటాన్చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. -
దుకాణాల వేలానికి స్పందన కరువు
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలోని మున్సిపల్ దుకాణ సముదాయాల వేలానికి స్పందన కరువైంది. మున్సిపల్ పరిధిలోని మూడు ప్రదేశాల్లోని దుకాణ సముదాయాల్లో 26 షెట్టర్లు ఉన్నాయి. ఇందులో పోచమ్మ దేవాలయ వద్ద ఉన్న 16 షెట్టర్లలో గతంలో దక్కించుకున్న 11 మంది వ్యాపారస్తులు రెన్యూవల్ చేయించుకున్నారు. కాగా 5 షెట్టర్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బహిరంగ వేలం పాట నిర్వహించగా అందులో కేవలం మూడు షెట్టర్లకు మాత్రమే వేలం పూర్తయింది. షెట్టర్ నం.3కి దరఖాస్తులే రాకపోవడంతో రెండు షెట్టర్లకు వేలం వాయిదా వేశారు. షెట్టర్ నం.7ను మహ్మద్ నజీర్ రూ.12500, షెట్టర్ నం.14ను గంట రాజు రూ.7500, షెట్టర్ నం.17ను సోమ వినయ్ రూ. 9300 నెలసరి అద్దె ప్రాతిపదికన దక్కించుకున్నారు. ఆసక్తి చూపని వ్యాపారస్తులు లాల్ బహదూర్ శాస్త్రి సమీపంలోని 6 షెట్టర్లకు కేవలం ఒకే దరఖాస్తు రావడంతో అధికారులు వేలం వాయిదా వేశారు. అలాగే డబుల్ బెడ్రూం సమీపంలోని 4 షెట్టర్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ ప్రదేశాల్లో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. 15 షెట్టర్లకు కేవలం మూడింటికి మాత్రమే వేలం ఆసక్తి చూపని వ్యాపారస్తులు -
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. -
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు. ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు.. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.జిల్లాకు కొత్త వాటర్షెడ్ పథకం పిచెర్యాగడి ప్రాజెక్టు కింద 8 గ్రామాల ఎంపిక భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాలకు చోటు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు 4,733 హెక్టార్లలో పనులు మూడు శాతం మాత్రమే జరిగిన పనులు -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు లారీని ఢీకొట్టిన మహిళా ఆర్ఎంపీ.. చేగుంట(తూప్రాన్): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్ స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. ఆమె కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న తన కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. హవేళిఘణాపూర్(మెదక్): ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్లకు మెదక్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టిన యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు డివైడర్ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్పేట –భూపంల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్కు, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి.. సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోలు పోసుకొని ఆత్మహత్య