breaking news
Siddipet District Latest News
-
పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) దేవకీ దేవి హెచ్చరించారు. ‘మంచం పట్టిన తండా.. ఇంటింటా జ్వరపీడితులే..’ అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆమెతోపాటు జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా మండలంలోని మైసమ్మవాగుతండాలో వైద్యాధికారి వినోద్రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంటింటా జ్వర సర్వే చేసి దాదాపు 100 మందికి జ్వరం టాబ్లెట్లు అందజేశారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి రక్తపరీక్షలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ ధన్రాజ్ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. డీపీఓ దేవకీ దేవి మాట్లాడారు. మారుమూల పల్లెలు, తండాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టిసారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆమె స్వయంగా తండాలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి తాగునీటిని పరిశీలించారు. వీధుల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ డీఈ రుహిన తస్కిన్, ఆరోగ్య డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆనంద్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్నాయక్, హెల్త్ అసిస్టెంట్ కొమురయ్య, ఏఎన్ఎం సునీత, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.డీపీఓ దేవకీదేవి -
రోడ్లు ధ్వంసం
19.64దెబ్బతిన్న కల్వర్టులు, వంతెనలు ● రూ.33 కోట్ల నిధులు అవసరం ● ప్రతిపాదనలు పంపిన అధికారులుసిద్దిపేట అర్బన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేశారు. జిల్లాలోని సిద్దిపేట ఆర్అండ్బీ ఈఈ పరిధిలో 25 ప్రాంతాలలో 18.80 కి.మీ మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనిలో ఇప్పటి వరకు 10 కి.మీ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. తొమ్మిది ప్రాంతాలలో రోడ్డుపై నుంచి వరద నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించారు. దెబ్బతిన్న రోడ్లు, ఓవర్ ఫ్లో అయ్యే రోడ్ల మరమ్మతులకు రూ.1.55 కోట్లు అవసరం అవుతాయని అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. అలాగే గజ్వేల్ ఆర్అండ్బీ ఈఈ పరిధిలో 29 ప్రాంతాలలో 0.84 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. 26 ప్రాంతాలలో ఓవర్ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. వీటి మరమ్మతుల కోసం రూ. 1.71 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా 54 ప్రాంతాలలో 19.64 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. తాత్కాలిక మరమ్మతుల కోసం 3.26 కోట్లు అవసరం అవుతాయని, శాశ్వత మరమ్మతుల కోసం రూ.29.82 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ శాఖ పరిధిలో సిద్దిపేట ఈఈ పరిధిలో 5 చోట్ల, గజ్వేల్ ఈఈ పరిధిలో 2 చోట్ల వంతెనలు దెబ్బతినగా మరమ్మతులకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా వంతెనలు నిర్మించడానికి దాదాపు రూ. 3 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.ప్రతిపాదనలు పంపాం ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పలు ప్రాంతాలలో రోడ్లు కొంత వరకు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేయించాం. మళ్లీ దెబ్బతినకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అవసరమైన నిధుల కోసం అంచనాలు రూపొందించి పై అధికారులకు ప్రతిపాదనలు పంపాం. –సారంగపాణి, ఎస్ఈ -
వంటేరును పరామర్శించిన హరీశ్
జగదేవ్పూర్(గజ్వేల్): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. వంటేరు మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీశ్రావు విషయం తెలుసుకుని దౌలాపూర్ చేరుకుని ప్రతాప్రెడ్డి స్వగృహంలో వజ్రమ్మ చిత్ర పటానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తిగుల్కు చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్యను, కాలు విరిగి ఇంట్లో ఉన్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్కు కూడా హరీశ్రావు పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఆంజిరెడ్డి, రంగారెడ్డి, కరుణకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు చదువుతో పాటు, క్రీడారంగంలో రాణించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్జీఎఫ్ మండలస్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడాలను ప్రారంభించారు. మండల పరిధిలోని 10 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమన్నారు. అనంతరం టీచర్స్ డే సందర్భంగా 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాజేందర్, ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చక్కని బోధనతోనే సత్ఫలితాలు: శ్రీనివాస్రెడ్డినంగునూరు(సిద్దిపేట): మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి సూచించారు. నంగునూరులో మండలస్థాయి టీఎల్ఎమ్ (టీచర్స్ లర్నింగ్ మెటీరియల్) బోధన అభ్యాసన ఉపకరణ మేళా శనివారం నిర్వహించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి సులభ బోధనకు ఎలా దోహదపడతాయో వివరించారు. స్టాళ్లను పరిశీలించిన ఆయన ప్రతిభ చూపిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఫిలితంగా సిద్దిపేట జిల్లా మూడు సంవత్సరాలుగా ముందంజలో ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ డీఈఓగా ఎంపికై న శ్రీనివాస్రెడ్డిని ఎంఈఓ దేశిరెడ్డి, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు సిద్దిపేటకమాన్: సిద్దిపేట డిపో నుంచి అరుణాచల గిరిప్రదక్షణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ను నడపనున్నట్లు డిపో మేనేజర్ రఘు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12న సిద్దిపేట నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, వేలూరు, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం తిరిగి 16న బస్సు సిద్దిపేటకు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.5,200, పిల్లలకు రూ.4 వేలు చార్జి ఉంటుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రైల్వేలైన్ పనులు అడ్డగింత
చిన్నకోడూరు(సిద్దిపేట): తమకు నష్ట పరిహారం చెల్లించాకే రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టాలని మండల పరిధిలోని గంగాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకుని శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తమ పట్టాభూములు కోల్పోయామన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని వాపోయారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తమ భూములకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని పనులను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సలీమ్, ఎస్ఐ సైఫ్అలీ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను కలెక్టర్కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు -
సారొస్తారంటేనే హడల్
సదరు అధికారి క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారంటేనే ఆ శాఖ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. తన శాఖకు చెందిన ఆస్పత్రుల్లో తనిఖీలకు వెళితే.. బిర్యానీ, సిగరేట్ డబ్బా, చేతిలో ఒక కవర్, మద్యం బాటిల్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు. ఏర్పాట్లు చేయకపోతే సార్ కోపానికి వస్తాడేమోనని.. చేసేదేమిలేక సర్దుబాటు చేస్తున్నారు. గొర్రెల పెంపకం అబివృద్ధి పథకం (ఎస్ఆర్డీఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసింది. ఈ పథకంపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిగింది, ఈడీకి ఈ కేసును అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయవద్దని ఇదివరకే ఉన్నతాధికారులు అదేశించారు. అయితే.. కార్యాలయంలో ఫర్నిచర్ కోసం ఎస్ఆర్డీఎస్ డబ్బులు రూ.2లక్షలు సెల్ఫ్ డ్రా చేసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా చెక్ రాయలేమని ఆ సెక్షన్ అధికారి తనకు ఈ బాధ్యతలు వద్దని రాసిచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో మరో సీనియర్ అసిస్టెంట్ ద్వారా చెక్ రాయించుకొని డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. కాగా, సదరు అధికారిని వివరణ కోరగా.. మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు చాపను ఏర్పాటు చేసుకున్నాని, కార్యాలయంలో ఉండటం లేదని సమాధానం ఇచ్చారు. -
టీచర్ కావాలనుకొని లీడరయ్యా
● ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది ● బడిబాటతో సత్ఫలితాలు ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ● విద్యతోనే వికాసం: కలెక్టర్సిద్దిపేటజోన్: ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, తనకు చిన్నతనంలోనే టీచర్ కావాలనే బలమైన కోరిక ఉండేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక టీటీసీ భవన్లో జరిగిన గురుపూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ అయి రాజకీయాల్లోకి వచ్చాక తనకు టీచర్ అయ్యే అవకాశం వచ్చిందని, అనివార్య కారణాల వల్ల కాలేకపోయానని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ 23కోట్ల సంబంధించి నిధులు విడుదల కాలేదన్నారు. రూ.100 కోట్లు మన ఊరు, మన బడి బకాయిలు ఉన్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి మూలాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. నూతన విద్యా సూచనలు పాటిస్తూ కొత్త కొత్త విషయాలు బోధించి పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కోమరయ్యలు, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దఫ్తర్లోనే బిస్తర్!
ఆయన జిల్లా స్థాయి అధికారి. అధికారం, దర్పం, ఆర్థిక వెసులుబాటులన్నీ ఉన్నాయి. దర్జాగా ఉండాల్సిన ఆ అధికారి ఎందుకో దైన్యంగా ఉంటున్నాడు. సమీకృత కలెక్టరేట్ రెండవ అంతస్తులోని తన కార్యాలయంలో మకాం పెట్టాడు. వికారాబాద్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన సదరు అధికారి.. ఆగస్టు ఒకటిన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దఫ్తర్లోనే అన్నీ కానిచ్చేస్తున్నాడు. ఉతికిన బట్టలను ఆరబెడుతున్నాడు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు చూసి ఔరా.. ఇదేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మకాం ● ఫైళ్లు ఉండాల్సిన బీరువాలో అధికారి బట్టలు ● ఉతికిన బట్టలను కుర్చీలపై ఆరబెట్టిన వైనం ● అధికారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలుసాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టరేట్లోని బీరువాలలో ఆఫీసు ఫైళ్లు ఉండాల్సింది పోయి బట్టలు, చాప, దుప్పట్లు దర్శనమిస్తున్నాయి. కార్యాలయంలోనే సదరు అధికారి సిగరెట్లు తాగుతుండటంతో దుర్వాసనకు ముక్కు మూసుకోవాల్సి వస్తుందని సిబ్బంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అధికారికి హోదాకు తగ్గట్టు ఇంటి అద్దెను వేతనంలో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అలవెన్స్ ఖర్చులు మిగిలించుకోవడం కోసం ఇలా కక్కుర్తిపడటం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఉత్తమ గురువులకు సన్మానం
విజయరేఖవెంకట్రామిరెడ్డిఉమారాణి జయప్రకాశ్రెడ్డిశ్రీనివాస్రెడ్డివరలక్ష్మికృష్ణారెడ్డివర్గల్(గజ్వేల్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్పూర్(గజ్వేల్)/గజ్వేల్రూరల్: ఉత్తమ ఉపాధ్యాయులు శనివారం సన్మానం పొందనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కొందరు ఎంపి కైన విషయం తలిసిందే. అందులో భాగంగా వర్గల్ కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంగ్లిష్ టీచర్ ఎల్.వరలక్ష్మి, చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ పి.కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. వారికి సిద్దిపేటలో అవార్డులు అందజేయనున్నారు. అలాగే కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి హైస్కూల్లో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి, సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న జయప్రకాశ్రెడ్డి, మర్పడ్గ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఉమారాణి ఎంపికయ్యారు. జగదేవ్పూర్ మండలం గొల్లపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి ఎంపికైనట్లు ఎంఈఓ మాధవరెడ్డి తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎన్.విజయరేఖ ఎంపి కై నట్లు ఎంఈఓ కృష్ణ తెలిపారు. ఆమెను ఉపాధ్యాయులు అభినందించారు. -
పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుదాం
రాష్ట్ర ఆర్యవైశ్య నేత శంకర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదవారికి చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థాయికి చేర్చాలని సూచించారు. మనకున్న సంపద, తెలివితేటలను పేదల శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట అధ్యక్షుడు గంప శ్రీనివాస్, నేతలు అయిత కిషోర్, యాసాల వెంకట లింగం, గరిపెల్లి సిద్దేశ్వర్, మాంకాల లింగమూర్తి ఆధ్వర్యంలో ఆ అసోషియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గెజిటెడ్ హెచ్ఎం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విఠల్, కోశాధికారిగా అడ్వకేట్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్, శివ, అడ్వకేట్ కొ మరవెల్లి మహేశ్, శ్రీనివాస్, కార్యదర్శులుగా శ్రీ కాంత్, సతీశ్కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. వైకుంఠం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుడిగా రంగులద్ది.. గురువుగా మెరుగులు దిద్ది
పాపన్నపేట(మెదక్): ఆటపాటలతో విద్యార్థులను అక్కున చేర్చుకుంటూ.. వినూత్న బోధనలతో ఆకట్టుకుంటూ.. చిన్నారుల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు ఉపాధ్యాయుడు ఆశన్నగారి మల్లేశం. ఇతను మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ పాఠశాలలో 2012లో టీచర్ వృత్తిలోకి ప్రవేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేఽశ్యంతో గ్రామ సర్పంచ్తో మాట్లాడి మీ పిల్లల బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చి వారి పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. దీంతో వెలవెలబోయిన పాఠశాల కొద్ది రోజుల్లోనే కళకళ లాడింది. కుర్తివాడ బడి రూపురేఖలు మార్చి.. బదిలీపై కుర్తివాడ వచ్చిన ఆయన కొద్ది రోజుల్లోనే బడి రూపం మార్చారు. పాఠశాలకు పెయింటింగ్లతో కొత్త కళను తెచ్చారు. చాలా మంది తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. ఆటల్లో.. చదువుల్లో.. సాంస్కృతిక కార్యక్రమాల్లో.. మాకెవరు లేరు పోటీ అనేలా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు మల్లేశం. -
రవిరాజ్ బోధనకు ప్రపంచస్థాయి ప్రశంసలు
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ వినూత్న రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తూ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. నర్సాపూర్ మండలం అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ బోధనలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. 2008 డీఎస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపికై ఉమ్మడి మెదక్ జిల్లా కంగిటి మండలం చౌకన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 43 మంది విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాలలో 104 మంది విద్యార్థుల సంఖ్యను పెంచి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందారు. 2004లో అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 53 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 70కి పైగా విద్యార్థుల సంఖ్యను పెంచి తన ప్రత్యేకతను చాటారు. నెల రోజుల క్రితం సొంతంగా లక్ష రూపాయలతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై బెల్టులు, ఆట వస్తువులు డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా అందజేశారు. -
ఆటో ఏర్పాటు చేసి.. హంగులు కల్పించి..
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మరోవైపు తన సొంత ఖర్చులతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ఆటో ఏర్పాటు చేశారు. క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, చదువు అర్థం అయ్యేలా ఐఎఫ్బి స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలు వెచ్చించారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సుమారు70 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతోంది. -
రైతు బాంధవుడు కేసీఆర్
● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ● కొండపోచమ్మ సాగర్పై బీఆర్ఎస్ నేతల ర్యాలీ మర్కూక్(గజ్వేల్): రైతును రాజుగా చూడాలనుకున్న ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద గురువారం బీఆర్ఎస్ నేతలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ గోదావరి జలాలను బీడు భూములకు పారించి రైతుల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను రైతుల పొలాలకు పారించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్పై కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాంచంద్రం యాదవ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
చిన్న బ్రమ్మయ్యరామకృష్ణ బద్దిపడగ రమేశ్ నంగునూరు(సిద్దిపేట)/వర్గల్/మర్కూక్(గజ్వేల్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ముగ్గురు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. నంగునూరు మండలం రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్న రామకృష్ణ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. అలాగే మర్కూక్ మండలం దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. బోధనలో నిబద్దత, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తుండటంతో ఈ ఆవార్డు లభించింది. వర్గల్ మండలం మజీద్పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దిపడగ రమేశ్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ‘ఇళ్లు.. గుడి.. బడి ప్రపంచం’ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ విద్యారంగ కార్యక్రమాలకు ఇతోధిక ప్రచారం కల్పించారు. జిల్లా స్థాయిలో 55 మంది ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ప్రశంస పత్రాలతో పాటు సన్మానించనున్నట్లు తెలిపారు. -
సార్ సేవలకు ఇరవై ఏళ్లు
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పిల్లల మధ్యే విశ్రాంత జీవితం జగదేవ్పూర్(గజ్వేల్): పదవీ విరమణ పొందిన చాలా మంది శేష జీవితం పొందుతారు. కానీ రిటైర్డు ఉపాధ్యాయుడు బాల్రెడ్డి మాత్రం పిల్లల మధ్యే జీవితం సాగిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన తొందూరు బాల్రెడ్డి ఉపాధ్యాయుడిగా 34 ఏళ్లు పనిచేశారు. 2004లో రిటైర్డు అయ్యారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఏడేళ్ల పాటు ప్రయివేట్ పాఠశాలలో పనిచేశారు. అనంతరం గజ్వేల్ మండలం దాచారం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో మూడేళ్లు, క్యాసారం పాఠశాలలో రెండేళ్లు, ప్రజ్ఞాపూర్ పాఠశాలలో ఏడాది, తిగుల్ ప్రాఽథమిక పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. తెలుగు, గణితం పిల్లలకు బోధిస్తున్నారు. బాల్రెడ్డి సేవలకు జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మంత్రి హరీశ్రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెబుతానని తెలిపారు. -
సృజనాత్మకంగా బోధిస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..
అందరి నేస్తం.. ఆపన్నహస్తం ఇటీవల వజ్ర అవార్డుతో ప్రశాంత్కు సన్మానం.. వర్గల్ (గజ్వేల్): ఆధునిక హంగులతో చదువులకు వన్నెలద్దడమేకాకుండా.. రక్తదానాలతో స్పందించే హృదయంగా పేరొందారు వర్గల్ మండలం చాంద్ఖాన్మక్త ప్రైమరీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వరాల ప్రశాంత్. 2002లో నాచారం స్కూల్ టీచర్గా, శాకారం హెచ్ఎంగా, ప్రస్తుతం చాంద్ఖాన్మక్త హెచ్ఎంగా కొనసాగుతున్న ప్రశాంత్ ఆయా పాఠశాలలపై తనదైన ముద్ర వేశారు. సొంతంగా డబ్బు వెచ్చిస్తూనే, మిత్రులు, దాతల సహకారంతో డిజిటల్ క్లాస్రూమ్స్, తరగతి గోడలకు బోధన సంబంధ అంశాలతో ఎనామిల్ పెయింటింగ్స్, ఆకట్టుకునే బొమ్మలతో బడి వాతావరణాన్ని చదువుల నెలవుగా తీర్చిదిద్దారు. విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందింపజేస్తూ.. శాకారం స్కూల్ను నందనవనంగా తీర్చిదిద్దారు. ఆయన కృషిని అభినందిస్తూ 2020–21 ‘రైస్ అండ్ షైన్’ ఎన్సీఈఆర్టీ జాతీయస్థాయి మ్యాగజైన్లో శాకారం పాఠశాల సక్సెస్స్టోరీ ప్రచురితం చేశారు. రేడియో పాఠాల రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూల్స్ తయారీ, పాఠ్యపుస్తకాల రచనలోనూ ప్రశాంత్ భాగస్వామిగా నిలిచారు. పిల్లల మానసిక అభివృద్ధికి.. గత వేసవి సెలవులలో మొబైల్ ఫోన్లకు పిల్లలు అతుక్కుపోకుండా ఉండడానికి పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి డిజిటల్ డీటాక్స్ పేరుతో 21రోజులు, 21 రకాల కార్యక్రమాలతో సమాజానికి సరికొత్త విధానం పరిచయం చేశారు. అతని సేవలకు గుర్తింపుగా 2021లో మండల స్థాయి, 2022లో జిల్లా స్థాయి, అదేసంవత్సరం రాష్ట్రస్థాయి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డు, 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. తాజాగా 2025 జూన్లో సేవారంగంలో వజ్ర పురస్కారం సొంతమైంది. కేవలం బోధనకే పరిమితం కాకుండా 74 సార్లు రక్తదానం, 3 సార్లు ప్లేట్లెట్లు దానం చేసి ఆపదలో స్పందించే హృదయంగా పేరొందారు. అటు చదువులకు, సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తూ అందరి నేస్తంగా అభినందనలు చూరగొంటున్నారు. డిజిటల్ హంగులు కల్పించి.. 74సార్లు రక్తదానం చేసి పాఠశాలలపై ‘ప్రశాంత్’ ముద్ర సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యార్థులతో కలిసి ఆడుతారు పాడుతారు.. వారి పక్కనే నేలపై కూర్చుంటారు.. వారిని అక్కున చేర్చుకొని పాఠాలు చెబుతారు.. అందుకే ఆయనంటే విద్యార్థులకు చాలా ఇష్టం. విద్యార్థులంటే ఆయనకు ప్రాణం. ఆయనే సదాశివపేట మండలం మెలగిరిపేట్, అంకేనపల్లి, చందాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో 28 ఏళ్లుగా విధులు నిర్వహించిన హెచ్ఎం బి.అశోక్ కుమార్. మరోవైపు రోటరీ క్లబ్ కార్యదర్శిగా, వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాను పని చేసే పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్ట్, గ్లాసులు, ప్లేట్స్తో పాటుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా తరగతి గదులను సొంత డబ్బుతో వాల్ పెయింటింగ్ తో అందంగా తీర్చిదిద్దారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను వినియోగిస్తూ విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా సృజనాత్మకంగా బోధిస్తున్నారు. హెచ్ఎం అశోక్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సైతం అందజేసింది. వచ్చే ఏడాది ఆగస్టులో అయన పదవీ విరమణ పొందనుండగా, ఇటీవల మునిపల్లికి బదిలీపై వెళ్లారు. -
వారిపై రాజద్రోహం కేసు నమోదు చేయండి
కేంద్ర మంత్రి బండి సంజయ్కి గిరిజనుల వినతి హుస్నాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావ్, సోయం బాపురావులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. భారత రాజ్యాంగం రిజర్వేషన్ 342 ప్రకారమే లంబాడి జాతిని ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న లంబాడి, కోయ జాతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. గజ్వేల్: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వజ్రమ్మ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వంటేరు ప్రతాప్రెడ్డి స్వగ్రామం జగదేవ్పూర్ మండలం దౌలాపూర్లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు నేతలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు సంతాపం తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్రెడ్డి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో గురువారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇంటర్ విద్య బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ అదిత్య ప్రత్యేక చొరవతో జూనియర్ కళాశాలలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేట్కు దీటుగా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుల సేవలను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులను సన్మానించారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ హైమావతి ● పలు శాఖల అధికారులతో సమావేశంసిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు 4, 5, 6వ తేదీల్లో జరుగుతున్నందున మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కోమటిచెరువు, చింతలచెరువు, నర్సాపూర్ చెరువు వద్ద నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేసి, అనంతరం క్లీన్ చేయాలన్నారు. గ్రామాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు చెరువులు, కుంటలు నిండిన క్రమంలో రాత్రి వేళల్లో కాకుండా పగటి వేళల్లో నిమజ్జనాలు చేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు డీసీసీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీ సదానందం, రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్శాఖ అధికారులు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోడ్డు భద్రతా కమిటీ, మత్తుపదార్థాల వినియోగ నివారణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. ప్రతీ గ్రామంలో రోడ్డు దాటేందుకు ఒకే డివైడర్ ఉండాలని, అనధికారికంగా రోడ్డు తొలగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయిస్తే వెంటనే 1908 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. జీపీఓలను నియమిస్తాం సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఎంపికై నా 150 మంది జీపీఓ (గ్రామ పరిపాలన అధికారి)లకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాలకు నియమిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) లోకేష్ కుమార్ జీపీఓల నియామకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీపీఓలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు. -
నిర్మాణాలు వేగిరం చేయాలి
కలెక్టర్ హైమావతితొగుట(దుబ్బాక): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని తుక్కాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఇంటిలో కాకుండా బయట నిర్మించుకోవాలన్నారు. అంతకు ముందు స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ శ్యామల పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈఓ ఆలయానికి ఉద యం రావడంతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ తన చాంబర్లో ఏఈఓ బుద్ది శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు నూతన ఈఓను మర్యాదపూర్వకంగా కలిశారు. మద్యం దుకాణాలు బంద్ సిద్దిపేటకమాన్: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపా రు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఈ నెల 7వ తేదీ ఉదయం వరకు మూసివేసి ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం హుస్నాబాద్: స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం లేకపోవడంతో సీట్లు నిండటం లేదని అధికారులు గుర్తించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అమ్మాయిలకు, టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో అబ్బాయిలకు హాస్టల్ వసతి కల్పించారు. హుస్నాబాద్ బస్టాండ్ నుంచి కిషన్నగర్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అభ్యసన సామగ్రితో ఉత్తమ ఫలితాలు: డీఈఓ కొమురవెల్లి(సిద్దిపేట): అభ్యసన సామగ్రి ఉపయోగించి బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈఓ శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించాలన్నారు. దీంతో విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రమేశ్, రాజమల్లయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం గజ్వేల్రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ. 8200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం
● అపర భగీరథుడు కేసీఆర్ ● దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ● మల్లన్న సాగర్ వద్ద మహాధర్నా ● కేసీఆర్, హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకంతొగుట(దుబ్బాక): గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్పై కాంగ్రెస్ సర్కార్ ఎన్నికుట్రలు చేసినా ప్రజలు తిప్పికొడతారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కేసీఆర్కు మద్దతుగా మల్లన్న సాగర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే సీబీఐ కేసు పెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కూలితే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మల్లన్న సాగర్ నుంచి మెదక్, సిరిసిల్లా, నల్గొండ జిల్లాల్లో పంటలకు సాగునీరు అందుతున్నది వాస్తవం కాదా అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు గోదావరి జలాలు పొంగిపొర్లుతుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లకు కనిపించడంలేదా అని నిలదీశారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతు చేయాలని ఎన్డీఏఎస్ రిపోర్టు ఇస్తే రేవంత్ సర్కార్ రిపోర్టును బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిన కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేకనే రేవంత్ సర్కార్ సీబీఐ కేసు పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధిచెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మనోహర్రావు, సతీష్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, ఎఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.రాజకీయ కుట్రలో భాగమే.. ఎమ్మెల్సీ దేశపతి ఆరోపణ సిద్దిపేటజోన్: రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మెడిగడ్డ కాదని, 20 రిజర్వాయర్ల సమూహమేనన్నారు. కేసీఆర్, హరీశ్రావు, ఇంజినీరింగ్ అధికారులు కష్టపడి రైతన్నల ముంగిట్లో సాగునీరు తెచ్చారని అన్నారు. -
సహకారం.. పొడిగింపు
పీఏసీఎస్ల పనితీరు ఆధారంగా నిర్ణయంప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్ల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 111పీఏసీఎస్లు ఉండగా.. పాలకవర్గాల పనితీరు మేరకు 89 వాటికే పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ఆయా జిల్లాల డీసీఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఏసీఎస్కు పర్సన్ ఇన్చార్జి కొనసాగుతుండగా మరో 21 సంఘాల పదవీకాలం పొడిగింపు సహకార శాఖ పెండింగ్లో పెట్టింది. సాక్షి, సిద్దిపేట: మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ పీఏసీఎస్లు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సంఘం పరిధిలోని రైతులు, డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగియగా మరో ఆరు నెలలు(ఆగస్టు 14వ తేదీ) వరకు ఇదివరకే పొడిగించారు. గత నెలలో మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగించేందుకు సహకార శాఖ పలు నిబంధనలు పెట్టింది. పనితీరుపై ఆరా.. తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంఘాల వారీగా పది అంశాలతో కూడిన సమాచారం అందించాల్సిందిగా జిల్లా సహకార శాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా? నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా? జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు? దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారా? సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా? తదితర ఆంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తర్వులు జారీ చేశాం జిల్లాలో 18 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. మరో మూడు సంఘాలు హుస్నాబాద్, అల్లిపూర్, దుబ్బాక పదవీకాలం పొడిగింపు పెండింగ్లో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. –నాగేశ్వర్రావు, డీసీఓ, సిద్దిపేట -
కవిత సస్పెన్షన్ సబబే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ విషయంలో తమ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిన్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కొద్దిరోజులుగా కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. తప్పు చేస్తే కుటుంబసభ్యులైనా సహించబోనని గతంలోనే కేసీఆర్ చెప్పారన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుచుకుంటామన్నారు. కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
బీఆర్ఎస్ నిరసనలు.. దిష్టిబొమ్మ దహనాలు
ఎమ్మెల్సీ కవిత తీరుపై ఆగ్రహాలుఅక్కన్నపేట(హుస్నాబాద్): జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్సీ కవిత తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకుల ఆందోళనలతో అక్కన్నపేట మండలం కేంద్రం దద్దరిల్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాశేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసే కుట్ర చేస్తున్నారన్నారు. కవిత దిష్టిబొమ్మ దహనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్రావుపై కవిత అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోపణలు తగవు
హుస్నాబాద్: మాజీ మంత్రి హరీశ్రావు, సంతోశ్రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కవిత బీజేపీకి అమ్ముడుబోయిందని విమర్శించారు. ఆమైపె ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు, తన రాజకీయ భవిష్యత్ కోసం హరీశ్రావును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. అంతక ముందు అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులపై సీబీఐ విచారణ నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. -
నిబంధనలు పాటిస్తేనే ఇళ్లకు బిల్లు
● కలెక్టర్ హైమావతి ● వర్గల్ మండలంలో పర్యటన వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగులు దాటితే బిల్లు రాదన్నారు. మంగళవారం ఆమె వర్గల్, నెంటూరు, మీనాజీపేట గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, పాఠశాలల్లో భోజనాలు, పారిశుద్ధ్యం తీరు సమీక్షించారు. ఎక్కడికక్కడా అధికారులను హెచ్చరిస్తూ అప్రమత్తం చేశారు. సీజనల్ వ్యాధులబారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మొరం చేరేలా పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మండలంలో 367 ఇండ్లు మంజూరయ్యాయని, 244 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చామని, 38 మంది సుముఖంగా లేరని ఎంపీడీఓ మచ్చేందర్ కలెక్టర్కు నివేదించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తహశీల్దార్ రఘువీర్రెడ్డిని ఆదేశించారు. నెంటూరు స్కూల్ లో మెనూకు భిన్నంగా టమాటా పప్పు పెడుతున్నట్లు గమనించి హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాహ్నభోజనంలో మెనూ పాటించాలని, స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మీనాజీపేట హైస్కూల్ లో కిచెన్ గార్డెన్ను పరిశీలించి అభినందించారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి సిద్దిపేటరూరల్: జిల్లాలోని ఫార్మా, కెమికల్ కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల పర్యవేక్షణ శాఖ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలపై కార్మికులకు మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేశ్రామ్, డిప్యూటీ చీఫ్ ధర్మారెడ్డి, లేబర్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.బస్తీ దవాఖానలో కలెక్టర్ బీపీ చెకప్ గజ్వేల్: ఆకస్మిక తనిఖీలతో నిత్యం బిజీగా ఉంటున్న కలెక్టర్ హైమావతి మంగళవారం గజ్వేల్లోని కోటమైసమ్మ సమీపంలోగల బస్తీ దవాఖానాలో బీపీ చెకప్ చేయించుకున్నారు. ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా వైద్యాధికారి గౌతమితో మాట్లాడి తనకు బీపీ చెకప్ చేయాలని అడిగారు. వెంటనే సదురు వైద్యురాలు బీపీ చెకప్ చేసి నార్మల్గానే ఉందని తెలిపారు. అనంతరం మల్టీ విటమిన్ మందులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ఉధృతంగా ప్రబలుతున్నందువల్ల అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు జరిపి తగిన మందులు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆ తర్వాత సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎంత మంది రోగులకు దవాఖానకు వస్తున్నారని, డెంగీ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్కొండపాక(గజ్వేల్): పరిసరాల పరిశుభ్రతలతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ గరీమా ఆగర్వాల్ అన్నారు. మండలంలోని దుద్దెడలో పంచాయతీ సిబ్బంది, అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంట్లో వాడుకునే నీటిని పరిశీలించారు. కొందరి ఇళ్లల్లో నీరు ఎక్కువ రోజులుగా నిల్వ ఉండటాన్ని గుర్తించి బయట పడేయిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గరీమా అగర్వాల్ మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించవద్దన్నారు. సంపులు, నీటి తొట్టిల్లో మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజుల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వారం రోజులకోమారు మురికి కాలువలను శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి దేవకీదేవి, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లికార్జున్, ఏఎంపీ డైరెక్టరు కొమ్ము మల్లికార్జున్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ల తీరుపై సర్వత్రా చర్చ చేర్యాల(సిద్దిపేట): తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఉపాధ్యాయులు వ్యవహరించారు. మూడు రోజుల ముందే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగళవారం ముస్త్యాల మోడల్స్కూల్లో ఎంఈఓ కిష్టయ్య ఆధ్వర్యంలో టీఎల్ఎం మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. విచిత్రమేమిటంటే ఈ సందర్భంగా పలువురి ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయడం గమనార్హం. ఈ విషయమై ఎంఈఓ కిష్టయ్యను వివరణ అడగగా 5వ తేదీన సెలవు ఉందని, కనుక ముందస్తుగా జరుపుకొన్నట్లు చెప్పారు. -
పంట నష్టం లెక్కపక్కాగా..
భారీ వర్షాల వల్ల చోటుచేసుకున్న పంట నష్టాన్ని మరోసారి పక్కాగా అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు సంబంధిత అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరిపి నష్టం అంచనా వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 7,759ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలో తేలింది. రెండోసారి జరపనున్న పరిశీలనలో పంట నష్టంపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. గజ్వేల్: జిల్లాలో ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షల ఎకరాలు, మొక్కజొన్న 27,820, కంది 6594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగవుతోంది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి భారీ వర్షాలు రైతాంగాన్ని కుదేలు చేశాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి నష్టాలు పాలుచేస్తే.. తాజాగా పంటలు ఏపుగా పెరుగు తున్న సమయంలో అతివృష్టి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. ఆశలపై నీళ్లు.. భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. తెరిపి లేకుండా కురవడం వల్ల పంటలకు అపార నష్టం సంభవించింది. ప్రత్యేకించి వరికి తీవ్ర నష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. లోతట్టు చేలల్లో పత్తి నీటి మునిగి రంగుమారుతోంది. మరోవైపు తెగుళ్లు విజృంభించాయి. మొక్కజొన్న పంటకు సైతం భారీ నష్టం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనకు.. జిల్లాలో పంట నష్టాన్ని పక్కాగా తేల్చాలని, ఇందుకోసం రెండోసారి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. పంట నష్టం జరిగిన గ్రామాల్లో రైతు వారీగా గణన చేయడానికి కార్యాచరణతో ముందుకుసాగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ధ్రువీకరించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలోకి అధికారులు -
దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తాం
గజ్వేల్రూరల్: దివ్యాంగులకు వారి వైకల్యాన్ని మేరకు ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర శిక్షా విభాగం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ తెలిపారు. మంగళవారం ప్రజ్ఞాపూర్లోగల బాలుర ఉన్నత పాఠశాలలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమయ్యే ఉపకరణాలను అందించేందుకు నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, కొండపాక, ములుగు, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, కుకునూర్పల్లి, మర్కుక్ మండలాల నుంచి 60మందికి పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే వీరందరికీ ఉపకరణాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు కోమల, భవిత సెంటర్ నిర్వాహకురాలు హరిత తదితరులు పాల్గొన్నారు. -
7న మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈనెల 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 1గంట నుంచి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణ, ప్రాతఃకాలపూజల అనంతరం స్వామి వారి దర్శనం కల్పించనున్నుట్లు తెలిపారు. క్రీడల్లోనూ రాణించాలి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్దిపేట అర్బన్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రోజూ చిన్నారులు ఆటలు ఆడాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య, మండల విద్యాశాఖ అఽధికారి రాజ ప్రభాకర్రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనర్ రాజేంద్రకుమారేనా? పదవీ విరమణ పొందినా ఆయన పేరే చేర్యాల(సిద్దిపేట): పట్టణ ప్రజలను కమిషనర్ ఎవరనే అయోమయంలో పడేస్తోంది సిటిజన్ బడ్డీ యాప్. ఇక్కడ కమిషనర్గా పనిచేసి బదిలీపై వెళ్లి, పదవీ విరమణ పొందిన రాజేంద్రకుమార్ పేరే యాప్లో కనబడటంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సిన యాప్లో సరైన సమాచారం పొందుపర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కమిషనర్లు మారినా యాప్లో పేరు మారకపోవడం గమనార్హం. అలాగే పదవీకాలం ముగిసి నా పాలక వర్గం పేర్లు అవే కొనసాగడం విచిత్రం. ప్రస్తుత కమిషనర్ ఎస్. నాగేందర్ చొరవ చూపి బడ్డీ యాప్లో పేర్లు మార్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తుది ఓటరు జాబితా విడుదలసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం తుది ఓటరు జాబితాను ప్రదర్శించింది. గత నెల 28న జాబితా ముసాయిదాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 508 పంచాయతీలు ఉండగా 4,508 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. ఇందులో 3,21,766మంది పురుషులు, 3,34,184 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. నిమజ్జన ఏర్పాట్లు వేగవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక కోమటి చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనం ఘాట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. బ్యారికేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భారీ విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువు వద్ద గజ ఈతగాళ్ళు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పట్టణంలో పలు మరమ్మతుల పనులను పరిశీలించారు. -
అందని యూరియా..ఆగని పోరు
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సాగు చేసిన పంటలకు సమయానికి యూరియా అందకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి రోజంతా యూరియా కోసం బారులు తీరుతున్నారు. సోమవారం హుస్నాబాద్లో ఎరువుల దుకాణాల వద్ద యూరియా లేదంటూ బోర్డులు వెలియడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రెండు చోట్ల రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేర స్తంభించాయి. వ్యవసాయ అధికారి వచ్చి యూరియా అందేలా చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే యూరియా వస్తుందని తెలిసి మద్దూరు మండల కేంద్రంలోని రేబర్తి సొసైటీ వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తీరా క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకే టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పి మద్దూరు క్లస్టర్ పరిధిలోని రైతులకే టోకెన్లు ఇప్పించి యూరియా సరఫరా చేయించారు. కొండపాక, జగదేవ్పూర్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రహదారులపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనలను విరమింపజేశారు. –హుస్నాబాద్/మద్దూరు(హుస్నాబాద్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్పూర్ జిల్లాకు 2 వేల టన్నుల యూరియా కేటాయింపు గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలితంగా జిల్లాకు 2వేల టన్నుల యూరియా వచ్చిందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. ఆదివారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే వెయ్యి టన్నుల యూరియా గజ్వేల్ రేక్ పాయింట్కు చేరిందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొరత తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాని సూచించారు. మద్దూరు: రేబర్తి సొసైటీ ఎదుట రైతులు బారులు -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ రాస్తారోకో
ములుగు(గజ్వేల్): హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలోని రాజీవ్రహదారిపై సోమవారం బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు, రైతులకు సరిపోను యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు వ్యవసాయ పనులు మానేసి రోజూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమింప జేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బాగ్యలక్ష్మి, నాయకులు రమేష్యాదవ్, కృష్ణయాదవ్, హరికృష్ణ, శ్రీకాంత్, అరుణ్, రమేష్, ఎలేందర్రెడ్డి, కనుకయ్య, ప్రవీణ్గౌడ్, కర్ణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక కసరత్తుముమ్మరం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి మంగళవారం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. –సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించనున్నారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి 10న తుది జాబితాను వెల్లడించనున్నారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230 ఉన్నాయి. వార్డుల వారీగా తుదిజాబితా గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు. అగస్టు 28న ఓటరు ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓటరు ముసాయిదా జాబితా పై 1,182 అభ్యంతరాలు రాగా వాటిని పరిష్కరించారు. మంగళవారం తుది జాబితాను విడుదల చే యనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 700 నుంచి 750 మంది ఓటర్లు ఉండే విధంగా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పలు చోట్ల 400 ఓటర్లకు సైతం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఇతర కేంద్రాలకు తరలించే అవకాశం ఉందని సమాచారం. ఏర్పాట్లు చేస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు ముసాయిదా జాబితాలను సిద్ధం చేసి ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నాం. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి తుది జాబితాను ఈ నెల 10న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – రమేశ్, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్తుగ్రామీణ మొత్తం ఓటర్లు: 6,55,958 మహిళలు: 3,34,186 పురుషులు: 3,21,766 ఇతరులు: 06 పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం -
ప్రభుత్వ బడుల్లోనే చదువుదాం
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, అందులోభాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ .. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కన్నారం గ్రామంలో మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సైకిల్ పంపిణీ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రానున్న రోజుల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, అసెంబ్లీ కో–కన్వీనర్ వేణుగోపాల్రావు పాల్గొన్నారు. -
బ్యాంకు సేవలుసద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కొండపాక(గజ్వేల్): ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండి, బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కొండపాకలో ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి రుణాలు కావాలన్నా ప్రభుత్వ బ్యాంకుల నుంచే పొందాలని, ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఏజీఎం రితీష్ పటేల్, డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వైద్యశాఖ అదనపు డైరెక్టర్ అమర్సింగ్నాయక్జగదేవ్పూర్(గజ్వేల్): వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు ప్రబలవని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ అన్నారు. సోమవారం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నీటి తొట్టెలను, నీటి కుళాయిలను, పరిసరాలను పరిశీలించారు. నీటినిల్వలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నందున ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రత లోపిస్తే దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. రక్తపరీక్షల ఫలితాలను త్వరగా అందజేయాలి సిద్దిపేటకమాన్: పీహెచ్సీలలో రోగుల నుంచి సేకరిస్తున్న బ్లడ్ శాంపిల్స్ను టీహబ్లో పరీక్షలు నిర్వహించి త్వరగా ఫలితాలను అందజేయాలని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టీహాబ్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని అన్నారు. -
కాళేశ్వరంపై కుట్రలు సహించం
● బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ ● అమరవీరుల స్తూపానికి జలాభిషేకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను సహించబోమని, కాంగ్రెస్ తీరుతో అమరవీరుల ఆత్మ గోషిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం ‘ఇది కదా కాళేశ్వరం’ అనే నినాదంతో రంగనాయకసాగర్ నుంచి బిందెలతో నీరు తెచ్చి, జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. అనంతరం రాజీవ్రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన కుట్రలే నేడు కాళేశ్వరంపై జరుగుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్, హరీశ్రావులపై, కాళేశ్వరం పేరుతో సీబీఐ విచారణ చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల ముందు కావాలని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నిందలు మోపుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 228 పిల్లర్లకు గాను మూడు పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా బీఆర్ఎస్ ను ఎదుర్కొనలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు పక్కకు తప్పించే క్రమంలో వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీ దహనం చేసే క్రమంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులకు ప్రమాదం తప్పింది. రాస్తారోకో సందర్భంగా రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఫ్లెక్సీ దహనంలో తప్పిన ప్రమాదం ఫ్లెక్సీ దహనంలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణను నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంగధంపల్లి చౌరస్తాలో రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే మంటలను ఆర్పివేశారు. -
మళ్లీ వానలు..
తప్పని ఇబ్బందులు ● పంటలకు తీరని నష్టం ● ఎర్రబడుతున్న పత్తిపంట దుబ్బాక: వారం రోజులుగా భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన జనం.. ఇంకా కోలుకోకముందే మళ్లీ వానలు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు రోజుల విరామంతో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమై సోమవారం రోజంతా ముసురుపెట్టింది. పంటలకు తీరని నష్టం కలుగుతోంది. పత్తి, మొక్కజొన్న పంటలు సైతం.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నీరు నిలిచి పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి చేనులో నీరు నిల్వ ఉండటంతో ఎర్రబడి ఎదుగుదల లోపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పుట్టెడు పెట్టుబడులు పెట్టామని తీరా పూత, కాయలు వస్తున్న సమయంతో అధిక వర్షాలతో పంటలకు నష్టం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎడతెరిపిలేని వానలు రైతన్నలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పత్తి ఎర్రబడుతోంది నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశాను. కలుపు తీసి మందులు కొట్టిన. తీరా వానలు కురుస్తుండటంతో నీరు నిలిచి పత్తి పంట ఎర్రగా మారుతోంది. పూత, కాయలు కాసే దశలో నష్టం ఏర్పడుతుంది. ఇప్పటికే పుట్టెడు పెట్టుబడులు పెట్టాం. –భూపతిరెడ్డి, రైతు -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన వస్తుండటంతో ప్రజలకు ప్రజావాణిపై విశ్వాసం పెరుగుతోందన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 174 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ రెహమన్ తదితరులు పాల్గొన్నారు. ఖబ్రస్థాన్కు భూమిని కేటాయించండి ఏడెకరాల ఖబ్రస్థాన్ భూమి కేటాయించాలంటూ మల్లన్నసాగర్ ముంపునకు గురైన ముస్లింలు కోరారు. ఈమేరకు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ముంపునకు గురైన ఎర్రవల్లి, వేములఘాట్, లక్ష్మాపూర్, సంగారం గ్రామాలకు సంబంధించి ఏడు ఎకరాల ఖబ్రస్థాన్ భూమి పోయిందన్నారు. పునరావాసం, నష్టపరిహారం చెల్లించినా ఖబ్రస్థాన్కు భూమిని కేటాయించలేదన్నారు. భూమి లేకపోవడంతో 2019 నుంచి ఇబ్బందులు తప్పడంలేదన్నారు. తమకు అధికారులు స్థలాన్ని కేటాయించాలన్నారు. -
హామీలు విస్మరించిన సర్కార్
తపస్ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీలను గుర్తు చేయడం కోసం సోమవారం ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నామన్నారు. మన పాఠశాల – మన ఆత్మగౌరవం, ఆత్మగౌరవ సభ లను చేపడుతున్నామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. అంతకు ముందు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఫాగింగ్కూ డబ్బులు లేవట
● ఇట్లయితే మున్సిపాలిటీ నడిచేదెట్లా.. ● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట లాంటి పెద్ద మున్సిపాలిటీలో ప్రస్తుతం ఫాగింగ్కూ డబ్బులు లేని పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధులు ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇట్లయితే మున్సిపాలిటీ ఎలా కొనసాగాలి’ అని అసెంబ్లీలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రస్తావించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో భాగంగా మున్సిపల్శాఖ బిల్లు అంశంపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. సిద్దిపేట బల్దియా అంశంపై మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధులు లేవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్నారు. రూపాయి లేకుండా మున్సిపాలిటీ ఎలా కొనసాగాలన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పరిస్థితి అయోమయంగా ఉందని, సిద్దిపేట మున్సిపాలిటీలో ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లకుగాను ఒక్కరూ లేరన్నారు. అన్ని ఖాళీగా ఉంటే ఎట్లా అని ప్రశ్నించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● రోగులకు మెరుగైన సేవలందించాలి ● కలెక్టర్ హైమావతి ● వేళలు పాటించని డాక్టర్లపై ఆగ్రహం మద్దూరు(హుస్నాబాద్): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులకు సూచించారు. ఆదివారం లద్నూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కలెక్టర్ సందర్శించినపుడు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు క్రమం తప్పకుండా విధులకు వస్తున్నారా? లేదా అని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. మెడికల్ ఆఫీసర్ రాసే ఓపీ రిజిస్టర్ ఎవ్వరికీ అర్థం కాకుండా రాస్తే ఏం ఉద్యోగం చేస్తున్నట్లు అని అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ఓకు రిజిస్టర్ లు చూపించి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రోగులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. పీహెచ్సీ మరమ్మతు పనులను పరిశీలించారు. స్లాబ్ పైన నీరు నిలవకుండా చూడాలన్నారు. ప్లంబింగ్ ఇతరత్ర పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మద్దూరు ఏంపీడీఓ, మండల కేంద్రంలో, గ్రామాల్లో ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ‘తపాస్పల్లి’ భూములు ఆక్రమిస్తే చర్యలు కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ భూములు ఆక్రమిస్తే చర్కలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఆదివారం తపాస్పల్లి రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ సామర్థ్యం, నీటి పంపింగ్, లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ రిజర్వాయర్ భూములు కబ్జాకు గురికాకుండా రెవిన్యూ అధికారులు చూడాలన్నారు. కట్టపై ఉన్న పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అలాగే రిజర్వాయర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలనిన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వండర్ బుక్లో విశ్వేశ్వర్రావు
గజ్వేల్రూరల్: గజ్వేల్ ప్రాంతానికి చెందిన పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు రాయారావు విశ్వేశ్వర్రావుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం దక్కింది. 2019 నుంచి 2025 వరకు ప్రతియేటా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాటలు రాయడంతో పాటు వాటిని కంపోజ్ చేయడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించడంతో లండన్ సంస్థ గుర్తించింది. ఈ సందర్భంగా శనివారం నగరంలోని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ కార్యాలయంలో సంస్థ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్గౌడ్ విశ్వేశ్వర్రావుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆదివారం గజ్వేల్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు, పట్టణ వాసులు సన్మానించారు. -
అధికారుల్లో కదలిక
ముంచెత్తిన ముంపుతో అధికారుల్లో కదలిక వచ్చింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురైన నేపథ్యంలో బల్దియా దిద్దుబాటుకు శ్రీకారం చుట్టింది. కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఇరువైపులా నాలాలు కబ్జాకు గురికావడం.. నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఫీడర్ ఛానల్ ప్రక్షాళన దిశగా మూడు శాఖలు (మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్) అడుగులు వేస్తున్నాయి. ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించారు. ఇప్పటికే 15 నిర్మాణాలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. – సిద్దిపేటజోన్ ముంపు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మూడు శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేలా యంత్రాంగం సమాలోచన చేస్తోంది. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మత్తడికి పురాతన చరిత్ర ఉంది. ఎగువ భాగాన ఉన్న ఆయా చెరువుల నీటి ప్రవాహం కోమటి చెరువు ద్వారా కెనాల్ గుండా దిగువ భాగంలోని నర్సాపూర్ చెరువులోకి వెళ్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆధునీకరణ జరిగింది. కోమటి చెరువు గరిష్ట నీటి మట్టం దాటిన క్రమంలో నీటి ప్రవాహం మత్తడి దూకి నర్సాపూర్ చెరువుకు ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మునుపెన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదతో కోమటి చెరువు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఫీడర్ ఛానల్ లక్ష్యంగా ప్రణాళికలు భవిష్యత్తు తరాల కోసం అడుగులు అక్రమ కట్టడాలపై నజర్ ఇప్పటికే 15 నిర్మాణాలకు నోటీసులు -
శాశ్వత పరిష్కారం దిశగా..
భవిష్యత్లో ఇంతకంటే రెట్టింపు స్థాయిలో వరద ప్రవాహం వచ్చినప్పటికీ సమస్య రాకుండా రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బఫర్ జోన్ నియమావళి మేరకు ఫీడర్ ఛానల్కు ఇరువైపులా నిర్మాణాలు.. కట్టడాలు లేకుండా చూడటంతో పాటు ఫీడర్ ఛానల్ ఇరువైపులా రేలింగ్ ఎత్తు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా ఇటీవల బల్దియా అధికారులు కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆద్యంతం సర్వే చేసి సుమారు 15 కట్టడాలు ఇరిగేషన్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దిశగా ఫీడర్ ఛానల్ ఇరువైపులా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ సంయుక్తంగా హద్దులు నిర్ణయించే ప్రక్రియకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేందుకు అధికార యంత్రాంగం వేచిచూస్తోంది. -
మల్లన్న సాగర్ను సందర్శించిన ఐఏఎస్లు
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ఐఏఎస్ అధికారులు శనివారం సందర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సందర్శించిన వారిలో ఉన్నారు. వారితో పాటు మల్లన్న సాగర్ అధికారులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సందర్శన మర్కూక్(గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఎంఆర్డిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృధ్ది ప్రాజెక్ట్లో చేపట్టబోతున్న రేవెట్మెంట్లు, గేబియన్ వాల్ నిర్మాణ పనుల విధానాలను సమిక్షించారు. సంబందిత పనులలో అనుసరించబోయే సాంకేతికత, నాణ్యత ప్రమాణాలు మరియు నిర్మాణ విధానాలపై ఆరా తీశారు. అనంతరం కొండపోచ మ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి వెళ్లే కాల్వను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సృజనాత్మకతతో బోధించాలిజిల్లా కోఆర్డినేటర్ రమేష్ దుబ్బాకటౌన్: విద్యార్థులకు బోధన అభ్యాస సామగ్రి పద్ధతిని ఉపయోగించి సృజనాత్మకతతో విద్యాబోధన చేస్తే సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని జిల్లా కోఆర్టినేటర్ రమేష్, మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్ అన్నారు. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో మండల స్థాయి బోధన అభ్యాస సామగ్రి మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలలో బోధన పద్ధతులు సృజనాత్మకతతో మెరుగుపరుచుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులున్నారు. -
అన్నదాత అగచాట్లు
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025యూరియా కోసం నిత్యం ఎదురు చూపులుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు పనులు చేయాల్సిన రైతులు. యూరియా బస్తాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. 25 రోజులుగా పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల బస్తాల కోసం ఇళ్లు వదిలి అర్థరాత్రి నుంచే పీఏసీఎస్ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరి 3,31,020 ఎకరాలు, పత్తి 1,06,921, మొక్క జొన్న 27,826, కంది 6,594లతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంటలు వేసిన 20 రోజుల్లోపే యూరియా చల్లాలని ఆ తర్వాత వేసినప్పటికీ దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదను దాటితే ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు యూరియా బస్తాల కోసం రోజుల తరబడి సొసైటీ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్లు, రాళ్లు క్యూ లైన్లుగా పెడుతున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లలో ఉంటూ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్లో విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాకు వచ్చింది 59శాతమే జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 4,65,318 ఎకరాల్లో సాగు అవుతందని ఈ సీజన్కు 43,130.8 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 25,780 (59.77శాతం) మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అందులో సొసైటీలకు 15,468 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్కు 10,312 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇంకా ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు పూర్తిగా యూరియా జిల్లాకు చేరాలంటే రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నులు వస్తేనే సరిపోతుంది. వ్యవసాయ అధికారులు 4.65లక్షలు సాగు అవుతుందని, దానికి సరఫరా యూరియాను అంచనా వేశారు కానీ ఇప్పటికే 4.90లక్షలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ యూరియా అవసరం పడనుంది.గరికపోసలతో గణనాథుడి అలంకరణ దుబ్బాకలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో కేదారేశ్వర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణనాథున్ని 4 లక్షల గరిక పోసలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. – దుబ్బాకటౌన్ : మిరుదొడ్డికి చెందిన రాములు ఒక ఎకరంలో మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు. దుక్కి దున్ని విత్తనం పెట్టి 44 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. పదిరోజులుగా యూరియా బస్తాల కోసం తిరుగుతున్నా ఒక్కటి లభించలేదు. యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదు. పెట్టిన పెట్టుబడి సైతం వస్తుందో రాదో అని రైతు రాములు ఆందోళన చెందుతున్నాడు. 43వేల మెట్రిక్ టన్నులకు.. వచ్చింది 25వేల మెట్రిక్ టన్నులే 4.90లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అదను దాటిపోతుందని ఆందోళన -
సృజనాత్మక బోధనతోనే గుణాత్మక విద్య
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రాథమిక పాఠశాల స్థాయిలో సృజనాత్మకతో బోధించడం వల్ల విద్యార్థులకు నేర్చుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగదేవ్పూర్లో శనివారం ప్రాథమిక స్థాయి టీఎల్ఎం (బోధనాభ్యసన సా ఛగ్రి) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధనలో ప్రాథమిక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకునేలా బోధనా విధానం, తరగతి గది ఉండాలనే లక్ష్యంతో ఎఫ్ఎల్ఎన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గదిలోకి రాగానే చదవడం, రాయడం కాకుండా విద్యార్థులకు బోధనాభ్యాసన వైపు ఆసక్తిని రేకెత్తించేలా బోధన విధానాన్ని ఎంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాధవరెడ్డి, తహశీల్దార్ నిర్మల, ఎంపీడీవో రాంరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం సైదులు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి జగదేవ్పూర్లో టీఎల్ఎం మేళా -
రోడ్డెక్కిన రైతులు
అక్కన్నపేటలో అధికారుల నిర్బంధందుబ్బాక మండలం చీకోడులో ధర్నా చేస్తున్న రైతులుసిద్దిపేటజోన్/అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్రూరల్/హుస్నాబాద్/తొగుట(దుబ్బాక)/ దుబ్బాకరూరల్: జిల్లాలో యూరియా కోసం రైతులు శనివారం రోడ్డెక్కారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అలాగే.. అక్కన్నపేట మండల కేంద్రంలో నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో అధికారులను కలిసేందుకు విఫలయత్నం కావడంతో ఆందోళనకు దిగారు. దీంతో సిద్దిపేట, కరీంనగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అక్కన్నపేట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వందలాది రైతులు యూరియా కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయ అధికారులను నిర్భందించారు. అక్కడే చుట్టుముట్టి అలసిపోయి కొందరు నిద్రించారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. రెండు లారీల యూరియా వస్తుందన్న సమాచారంతో వివిధ గ్రామాల రైతులు, మహిళలు ఉదయం 4 గంటలకు తొగుటకు చేరుకున్నారు. ఆగ్రోస్ సేవా కేంద్రం, పీఏసీఎస్ కార్యాలయం ఎదుట లైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి నిలబడిన రైతులు ఓపిక నశించడంతో చెప్పులు, బీరు బాటిళ్లను వరుసలో ఉంచారు. లింగంపేటకు చెందిన నాల్గవ తరగతి విద్యార్ది రేవంత్ స్కూల్కు వెళ్లకుండా యూరియా కోసం తండ్రితో పాటు లైన్లో నిలుచున్నాడు. 9 గంటల వరకు వేచిచూసిన రైతులకు యూరియా సాయంత్రం వస్తుందనితేవో మోహన్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్–సిద్దిపేట రోడ్డుపై భైఠాయించారు. దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. హుస్నాబాద్: పంట కాలం ముగిసిన తర్వాత ఎరువులు ఇస్తారా అంటూ రైతులు మండిపడ్డారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని రైతు మిత్ర, గ్రోమోరు ఎరువుల దుకాణాల వద్ద ధర్నా నిర్వహించారు. వరి నాట్లు వేసి దాదాపు నెల రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. -
పత్తికి అతివృష్టి దెబ్బ
గజ్వేల్: పత్తికి అతివృష్టి దెబ్బ తగిలింది. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే ఈ పంటను ఎన్నో ఆశలతో సాగు చేస్తే రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టుగా ఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఈసారి 1.06లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకిరాగా ఇప్పటికే 60శాతానికి పంట దెబ్బతిన్నది. జిల్లాలో ఈసారి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే..ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షలు, మొక్కజొన్న 27,820, కంది 6,594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే పత్తితో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. వరి తర్వాత పత్తి పంటే ఇక్కడి రైతులకు ప్రధాన ఆధారం. నిజానికి ఈసారి 1.11లక్షల ఎకరాల్లో ఈ పంట సాగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. 5వేల ఎకరాలు తగ్గింది. సీజన్ ఆరంభంలో అనావృష్టితో నష్టపోయిన రైతులు.. తాజాగా అతివృష్టితో పంట దెబ్బతిని పీకల్లోతూ కష్టాలు కూరుకుపోయారు.పత్తి రికవరీకి అవకాశంరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి పంట రివకరీ అయ్యే అవకాశం ఉన్నది. రైతులు ముఖ్యంగా తమ పత్తి చేలల్లో నీరు నిలిచి ఉండకుండా బయటకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి. తెగుళ్ల సోకితే క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి. : స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి వేలాది ఎకరాల్లో అపార నష్టం తెగుళ్ల దాడి, పంట ఎదుగుదలపైతీవ్ర ప్రభావం జిల్లాలో 1.06లక్షలఎకరాలకుపైగా సాగు పంట రికవరీకి యూరియా ప్రభావం ఆందోళనలో రైతాంగం అతివృష్టితో పత్తికి భారీ నష్టం కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురిసిన వర్షాలు మిగతా పంటలతో పోలీస్తే పత్తికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కాలం కలిసొస్తే మంచి దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఆశించిన విధంగా పలకవచ్చనే ఆశతో రైతులు పత్తిని సాగు చేస్తుండగా..అతివృష్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇదేవిధంగా వర్షాలు కొనసాగితే చెలక, నల్ల రేగడి భూముల్లో పత్తికి నష్టం తీవ్రత పెరగనున్నది. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు వ్యాపించే అవకాశమున్నది.పంటను రికవరీ చేసుకునే అవకాశం ఏదీ..? ఇప్పటికే భారీ వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా.. యూరియా కొరత శాపంగా మారింది. అతివృష్టి వల్ల దెబ్బతిన్న పత్తిని కొంత మేరకై నా రికవరీ చేసుకోవడానికి యూరియాను వేస్తుంటారు. ప్రస్తుతం యూరియా దొరక్క రైతులు పంటపై ఆశలు చాలించుకున్నారు. కొందరు ఈ పంటను తొలగించడానికి సిద్ధమైన దయనీయ పరిస్థితి నెలకొన్నది. జిల్లావ్యాప్తంగా సాగులోకి వచ్చిన 1.06లక్షల ఎకరాల్లో భారీ వర్షాల వల్ల 60శాతానికిపైగా పంట ఇప్పటికే దెబ్బతిన్నది. వరద నీరు తొలగించిన చోట కొంత రికవరీ అవుతున్నది. ఈ సమయంలో యూరియా వేసి పంటను కాపాడుకోవాల్సి ఉండగా...యూరియా దొరికే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. -
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి
సిద్దిపేటకమాన్: కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వరంగా న్యాయాన్ని అందించాలని హైకోర్టు న్యాయమూర్తులు పుల్లా కార్తీక్, బి.విజయ్సేన్రెడ్డి, ఎన్.వి, శ్రావణ్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్డు కమ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాన్ని, మూడు, నాల్గవ అంతస్తులో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవితో కలసి న్యాయమూర్తులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పుల్లా కార్తీక్ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్, కోర్టు బెంచ్ ఆరోగ్యవంతమైన సంబంధాలతో ముందుకు సాగాలని, అప్పుడే న్యాయం అందుతుందని చెప్పారు. జస్టిస్ విజయ్సేన్రెడ్డి మాట్లాడుతూ.. న్యాయం కోసం కోర్టులకు వచ్చే ప్రజలకు అసంతృప్తిని కల్పించకూడదన్నారు. ఇరువర్గాల కక్షిదారులకు న్యాయం చేకూరేలా చూడాలని తెలిపారు. జస్టిస్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ..జిల్లాలో 450మంది న్యాయవాదులు ఉంటే 20మంది మహిళ న్యాయవాదులు ఉన్నారన్నారు. తాను బెజ్జంకి మండలం గుగ్గిళ్ల ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతం వాడినన్నారు. రాజ్యాంగం చదివితే తమ హక్కులు, విధులు తెలుసుకోవడంతో పాటు, ప్రజాస్వామ్యంలో చురుకై న పాత్ర పోషించగలరని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. రెండు బ్యాంకుల సహకారంతో బాలసదనంకు రూ.50వేల చెక్తో పాటు వాటర్ ప్యూరిపైర్ను అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి, కలెక్టర్ కె.హైమావతి, సీపీ అనురాధ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్కాంబ్లి, సంతోష్, సాధన, రేవతి, స్వాతి, జితేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ జనార్థన్రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుకార్తీక్, విజయ్సేన్రెడ్డి శ్రావణ్కుమార్ సిద్దిపేటలో నూతన కోర్టు భవనాలనుప్రారంభించిన న్యాయమూర్తులు -
వానొస్తే వణుకే..
● వరదొస్తే జలదిగ్బంధమే ● రియల్ ‘దందా’తో ఎక్కడికక్కడా నాలాల మూసివేత ● పాలకుల పట్టింపులేనితనమే కారణం ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితిగజ్వేల్: భారీవర్షాలొస్తే మున్సిపాలిటీ వరద ముప్పుతో వణికిపోతుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణంలో ఉన్న నాలాల వ్యవస్థ ఎక్కడికక్కడా మూసుకుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అధికారుల పట్టింపులేనితనంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్నేళ్ల కిందట రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఆమోదం కరువైంది. భారీ వరదలతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లోని లోతట్టు కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దుంకితే.. ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. వాస్తవానికి నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి వరద వెళ్లాల్సి ఉంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక ఇళ్ల మధ్య నుంచే వెళ్తోంది. ఈ క్రమంలో పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద జలమయంగా మారుతోంది. ఆ రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించినా పూర్తి స్థాయిలో తరలిపోయే విధంగా నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి 2కిలోమీటర్ల మేర జలమయంగా మారింది. వరద ఉధృతికి గంటలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రూ.12కోట్లతో ప్రతిపాదనలు పంపినా.. సమస్య పరిష్కారానికి గతంలో ప్రధాన రహదారి కింది భాగంలో ఓ అండర్ బ్రిడ్జిని నిర్మించాలనుకున్నా.. పెండింగ్లో పెట్టారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అండర్ డ్రైనేజీ గుండా వరద వేళ్లే విధంగా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలున్నా.. ఆమో దం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు మోక్షం కరువైంది. మున్సిపాలిటీ పరిధిలో దశాబ్ధాల కాలంగా ఉన్న వరదనీటి కాలువ వ్యవస్థ రియల్ ‘దందా’ వల్ల పూర్తిగా కనుమరుగైంది. అక్రమ ప్లాట్లలో నిర్మాణాలను మున్సిపల్ అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. నీటిపారుదల శాఖ ఏనాడూ కాల్వలు ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా చినుకువస్తే చాలా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. -
12 గంటలకుపైగా జలదిగ్బంధంలో సిద్దిపేట
భారీ వర్షాలతో పలు కాలనీలు, గ్రామాలు నీట మునగడానికి తప్పు ఎవరిదనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాల్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఎక్కువగా నాలా ఆక్రమణలు, చెత్తా చెదారం, గుర్రపు డెక్కను తొలగించకపోవడమేనని తెలుస్తోంది. మరోవైపు భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలు, నాలాలపై పడింది. పలువురి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండతో భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆక్రమణలు కట్టడి అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేటజిల్లా కేంద్రంలో వరద ముంపు తగ్గిన తరువాత ప్రస్తుత పరిస్థితి.. ఎందుకీ ముంపు..ఎవరిదీ తప్పు! ● నీట మునిగిన కాలనీల్లో అవస్థలు వర్ణనాతీతం ● నాలాలు, చెరువులు, ● హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్వత్రా డిమాండ్ సిద్దిపేట పట్టణంలో వర్షం కురవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరింది. తొగుట నుంచి వచ్చిన వరద నీరు తడ్కపల్లి, ఎన్సాన్పల్లి చెరువులు నిండి కోమటి చెరువుకు చేరాయి. దాదాపు 1800 క్యూసెక్కుల వరద చేరడంతో కోమటి చెరువు ఉప్పొంగింది. అవుట్ ఫ్లో కేవలం 800 క్యూసెక్కులు ఉండటంతో కాలువ నిండి చూట్టూ పక్కల ఉన్న శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస నగర్లోని పలు ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వరద ఇళ్ల మధ్యే వరద ఉంది. దీంతో దాదాపు 12 గంటల పాటు స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తడిసిన నిత్యావసర సరుకులు సిద్దిపేట పట్టణంలో పలువురి ఇళ్లల్లోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు, వివిధ వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలోకి వచ్చిన వరద నీటిని స్థానికులు ఎత్తిపోశారు. ఇళ్లన్నీ బురదమయం కావడంతో వాటర్తో కడిగి మట్టిని తొలగించారు. హరిప్రియానగర్ రోడ్ నంబర్ 3కు సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలోకి వరద చేరడం.. మట్టి వినాయకుడు కావడంతో బాగా తడిసింది. దీంతో రెండో రోజే విగ్రహాన్ని యువకులు నిమజ్జనం చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సెల్లార్లోకి వరద చేరడంతో రెండు రోజులుగా సేవలు నిలిపివేశారు. వినియోగదారులకు మరో బ్రాంచ్కు పంపించారు. అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యేకంగా జనరేటర్ను అద్దెకు తీసుకుని విద్యుత్ సరఫరా కల్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెల్లార్లో వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్లార్లో ఉన్న బెడ్లు, ఇతర సామగ్రి బురదమయం కావడంతో వాటిని శుభ్రం చేశారు. ఆక్రమణలు ఇలా.. -
శనిగరం.. పరవళ్లు
శనిగరం మధ్యతరహ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో నిండుకుండలా దర్శనమిస్తోంది. భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ వరదంతా ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్ట్ సామర్థ్యం టీఎంసీ కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మత్తడి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం కలెక్టర్ ప్రాజెక్టును సందర్శించారు. మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జల దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. – కోహెడరూరల్(హుస్నాబాద్) -
ఉధృతంగానే కూడవెల్లి
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025నిండుకుండలా రామసముద్రం చెరువుఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగుకూడవెల్లి వాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో కూడవెల్లి వాగుపై ఉన్న 58 చెక్డ్యాంలు నిండి పరవళ్లు తొక్కుతున్నాయి. జగదేవ్పూర్ మండలం అలీరాజ్పేట శివారులో కూడవెల్లి వాగు పుట్టి.. గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, భూంపల్లి–అక్బర్పేట, దుబ్బాక మండలాలగుండా ప్రవహించి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎగువమానేరులో కలుస్తుంది. వాగు ఉధృతితతో చాలా గ్రామాలకు రాకపోకలు రెండురోజులుగా బంద్ అయ్యాయి. వరదలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. – దుబ్బాక -
ఓటరూ మేల్కోండి.. మార్పులు సరిచేసుకోండి
● సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి ● కలెక్టర్ హైమావతి ● వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంసిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాపై ఎలాంటి సందేహాలు, మార్పులు, చేర్పులున్నా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 508 గ్రామపంచాయతీల్లో 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించామన్నారు. జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా పంచాయతీల్లో, ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎస్ ద్వారా చేపడు తున్న పనులపై సంబందిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపి భవనాలు, అంగన్వాడీ సెంటర్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ‘ఆ గ్రామంలోనే ఉంచండి’ఓటరు లిస్టుపై అభ్యంతరాలు అక్కన్నపేట(హుస్నాబాద్): ‘మేమంతా భూ నిర్వాసితులం.. రామవరం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శంకరయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ గత అసెంబ్లీఎన్నికల్లో తమ ఓటు హక్కును రామవరంలోని వినియోగించుకున్నామన్నారు. ఇటీవల ఓటరు లిస్టులో సేవలాల్ మహరాజ్ తండాలో చేర్చారన్నారు. -
ఆ ప్రభుత్వాస్పత్రిలో ఏం జరుగుతోంది?
గజ్వేల్: పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో గతంతో పోలిస్తే డెలివరీలు తగ్గడానికి కారణాలేమిటీ?, అసలు ఏం జరుగుతోంది? అనే అంశాలపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజ్ఞాపూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వెంకట్రామ్రెడ్డి, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరితోపాటు ఆస్పత్రికి చెందిన పలువురు సిబ్బంది సైతం ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ అన్నపూర్ణపై కొన్ని రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి దామోదరతోపాటు వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. 2024లో నెలకు 360కిపైగా డెలివరీలు జరిగితే 2025జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం నెలకు కేవలం 304డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే గైనకాలజీ విభాగంలో వసతులు మెరుగుపడి, వైద్యాధికారులు, సిబ్బంది సంఖ్య పెరిగినా డెలివరీలు తగ్గాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుగనున్నదని సమాచారం. ఆరా తీస్తున్న వైద్యారోగ్యశాఖఉన్నతాధికారులు సూపరింటెండెంట్పై ఫిర్యాదుతోపలు అంశాలు వెలుగులోకి -
రోజంతా బారులు.. తప్పని నిరసనలు
గజ్వేల్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన రైతులువర్గల్లో అంబర్పేట వద్ద టోకెన్ల కోసం నిరసనజిల్లాలో యూరియా ఇక్కట్లు తీరడంలేదు. రైతులు రోజంతా పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం సైతం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గజ్వేల్ పట్టణంలో, వర్గల్లో రైతులు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గల్లో స్టాక్ లేకపోవడంతో టోకెన్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దుబ్బాకలోనూ రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒక్క లారీ లోడ్ రావడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. హుస్నాబాద్లోనూ రైతులు గంటలకొద్దీ బారులు తీరి నిరీక్షించారు. – గజ్వేల్రూరల్/వర్గల్(గజ్వేల్)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్: -
విద్యుత్ మీటర్లు కాలిపోయాయి
అపార్ట్మెంట్లో 21 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నా. గత 12 ఏళ్ల క్రితం ఇలా వరద వచ్చింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. వరద చేరుతుంటే అప్రమత్తమై మా వాహనాలు అన్ని గుడి దగ్గర పార్కింగ్ చేసి వచ్చాం. మా పార్కింగ్లోకి దాదాపు నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నీరు వచ్చింది. ఆరు విద్యుత్ మీటర్లు కాలి పోయాయి. పవర్ ఇంకా రాలేదు. మా అపార్ట్మెంట్ సమీపంలోని కెనాల్ కాలువలో కాలువలో సిల్ట్ తీయడమే లేదు. కెనాల్ కాలువ ఎత్తు పెంచి వరద నీరు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నర్సింహారెడ్డి, సతీష్, మణికంఠ అపార్ట్మెంట్, హరిప్రియనగర్బియ్యం తడిసిపోయాయి ఇంట్లోకి ఒక్కసారిగా వరద రావడంతో భయంతో బయటకు వచ్చాం. గ్యాస్ సిలిండర్ను తీసుకుని బయటకు వచ్చి మెట్ల పైన ఉన్నాం. బియ్యం, కారం, పప్పు, పసుపు తడిసిపోయాయి. ఇళ్లు అంతా బురద మయమైంది. నీళ్లు బయటకు పోవడంతో బురద తొలగించాం. నా కొడుకు సర్టిఫికెట్లు సైతం తడిచాయి. – లక్ష్మీ, హరిప్రియనగర్, సిద్దిపేట పట్టణం -
జిల్లాలో కుంభవృష్టి బీభత్సం
వామ్మో.. ఇదేమి వాన.. ఆకాశానికి చిల్లులుపడ్డట్లు.. ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లు, పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో జనం బిక్కుబిక్కు మంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాక్షి, సిద్దిపేట: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పలు గృహాలు కూలిపోయాయి. సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారాయి. పలు చోట్ల రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకనియోజకవర్గాలతో పాటు పలు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. కొమురవెల్లి మండలంలో అత్యధికంగా 20.6 సెంటీమీటర్లు, దౌల్తాబాద్లో 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సిద్దిపేట పట్టణంలో నీట మునిగిన కాలనీలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, కలెక్టర్ హైమావతిలు పరిశీలించారు.7వేల ఎకరాల్లో పంట నష్టంరెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా 3,209 రైతులకు చెందిన 7,335 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఎక్కువగా నష్టపోయాయి. జిల్లాలో 74 గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో వీరిని ఇతర ప్రాంతాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.250 విద్యుత్ స్తంభాలు నేలమట్టంజిల్లా వ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. అలాగే 25 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయి. ఐదు కిలో మీటర్ల మేర విద్యుత్ వైర్ ధ్వంసమైంది. దీంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది పలు చోట్ల వర్షాన్ని సైతం లెక్కచే యకుండా విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేసి విద్యుత్ను సరఫరాను అందించారు. మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి, బెజ్జంకి మండలాల్లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ వర్షాలకు విద్యుత్ శాఖకు దాదాపు రూ35లక్షల వరకు నష్టం వాటిల్లింది.బయట పడిన అధికారుల నిర్లక్ష్యంసిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయం కావడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పట్టణంలో నాళాలు ఆక్రమించిన సైతం మున్సిపల్ అధికారులు, నీటీ పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. అలాగే కాలనీల్లో సెట్బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేసిన సైతం కాసులకు ఆశపడి పట్టించుకోలేదు. దీంతో వర్షాలకు నీట మునిగే పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపించారు.ముంచెత్తిన వానలు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
తొగుట(దుబ్బాక): భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని చందాపూర్లోకి వరద నీరు చేరడంతో పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి కలెక్టర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కూడవెల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహం ఉన్నచోట రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు. వరద కారణంగా చందాపూర్ రేషన్ దుకాణంలో తడిసిపోయిన బియ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. తడిసిన బియ్యం తీసుకుని మంచి బియ్యం అందించాలని తహసీల్దార్కు ఆదేశించారు. -
పండుగరోజూ పడిగాపులే
దుబ్బాకటౌన్/మిరుదొడ్డి(దుబ్బాక)/కొండపాక(గజ్వేల్)/నంగునూరు(సిద్దిపేట):: వినాయక చవితి పండుగ రోజూ, మరోవైపు జోరువానలోనూ రైతులకు యూరియా పాట్లు తప్పలేదు. బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు పడ్డారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకుని క్యూ కట్టారు. యూరియా లభించినా వర్షంలో తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరు ఉంటే ఒక బస్తా, దంపతులు లైన్లో ఉంటే రెండు సంచులకు టోకెన్లు లభించడంతో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న యూరియా లారీ వద్దకు పరుగులు తీశారు. యూరియా పంపిణీ కోసం ఇటు పోలీసులు, అటు వ్యవసాయ అధికారులు సైతం వర్షంలోనూ విధులు నిర్వహించారు. కొండపాక, మండలాల్లోనూ ఇదే దుస్థితి కనిపించింది. నంగునూరు ఆగ్రోసేవా కేంద్రం ఎదుట రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయ కుండా రాత్రి వరకు నిరీక్షించారు. తీరా 500 బస్తాలు రావడంతో చాల మందికి యూరియా దొరకలేదు. ఇదే సమయంలో ఏఓ గీత అక్కడికి చేరుకోవడంతో కారును అడ్డగించి వాగ్వాదానికి దిగారు. రోడ్డెక్కిన రైతన్న గురువారం దుబ్బాక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని తెలిసి ఉదయాన్నే వచ్చి క్యూ కట్టారు. యూరియా లారీ రాకపోవడంతో దుబ్బాక ఛత్రపతి సర్కిల్లో జోరువానను సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డు పై నిలిచిపోయాయి. యూరియా కోసం బారులు వర్షంలోనూ రైతుల పాట్లు -
వరద ఉధృతిని తట్టుకునేలా ప్రణాళికలు
సిద్దిపేటజోన్: భవిష్యత్లో వరద ఉధృతిని తట్టుకునేలా సాంకేతిక పర నిపుణులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. భారీ వర్షాలతో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలను గురువారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కోమటి చెరువు నీటిమట్టం దాటి ఉప్పొంగుతున్న వరద నీటి ప్రవాహన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస్ నగర్ కాలనీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులతో చర్చించారు. భవిష్యత్లో కోమటి చెరువు ఉధృతి పెరిగినప్పటికి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 20 ఏళ్లలో ఇంత వరద రాలేదు.. గతంలో ఎన్నడూ లేనట్లు ఈసారి భారీ వరద వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో 10 సెంటీమీటర్లు, ఎగువ భాగంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైందన్నారు. కోమటి చెరువు మత్తడి ద్వారా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయన్నారు. సమస్య పరిష్కారం కోసం నర్సాపూర్ చెరువు కొంత భాగం తొలగించి నీటిని శనిగరం,మందపల్లి చెరువులకు మళ్ళించి వరద ఉధృతిని తగ్గించినట్టు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, నాళాలు కబ్జాలు చేసి, సెట్బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి సమయంలో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు -
వాగులో చిక్కుకున్న రైతులు..
కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దుబ్బాక/ దుబ్బాకరూరల్: భూంపల్లి–అక్బర్పేట మండలం చిన్ననిజాంపేటకు చెందిన రైతులు శేర్ల రాజు, సుదర్శన్, గోపాల్ బుధవారం ఉదయం తమ పొలాల వద్దకు వెళ్లారు. తీరా భారీ వర్షం కురవడంతో పోతారెడ్డిపేట పెద్ద చెరువుతో పాటు కూడవెల్లి వాగు ఉధృతం కావడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. మధ్యలో చిక్కుకున్న వారిని భయటకు తెచ్చేందుకు సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సీఐ శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు బుధవారం సాయంత్రం నుంచి ప్రయత్నాలు చేశారు. గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం మధ్యలో చిక్కుకున్న ముగ్గురు రైతులను సురక్షింతగా భయటకు తీసుకరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తొగుట మండలం చందాపూర్ గ్రామంలోకి కూడవెల్లి వాగు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో గజ్వేల్–మిరుదొడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అకారం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో ఆకారం–బీబీపేట మధ్య, అలాగే చిన్ననిజాంపేట గ్రామానికి, భూంపల్లి–ఖాజీపూర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
యూరియా పక్కదారి
● పక్క గ్రామాల్లో విక్రయాలు ● ఆందోళనకు దిగిన రైతులు ● జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్నిసీజ్ చేయాలని డిమాండ్ దౌల్తాబాద్ (దుబ్బాక): యూరియా పక్కదారి పట్టింది. టోకెన్లు ఉన్న రైతులకు సైతం ఇవ్వకుండా అడ్డదారిలో పక్క గ్రామాల్లో గుట్టుగా విక్రయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జ్యోతి ఫర్టిలైజర్ యజమాని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. అయితే టోకెన్లు తీసుకున్న రైతులకు కాకుండా మండల పరిధిలోని నర్సంపేటలో రెండు లారీల యూరియాను అక్రమంగా డంపింగ్ చేసి గుట్టుగా బస్తాకు రూ.350లకు అమ్మేశాడు. మంగళవారం విషయం తెలుసుకున్న రైతులు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ధర్నాకు దిగి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని, దుకాణ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, దుబ్బాక ఏడీఏ మల్లయ్య అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.45.79లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ. 45,79,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు భక్తుల కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 46 రోజులలో రూ.45,79,870 నగదుతోపాటు విదేశి కరెన్సీ నోట్లు 83, మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 300 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జయప్రకాశ్రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్రెడ్డి, వల్లాద్రి అంజిరెడ్డి, ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు, శివరామ కృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలి హుస్నాబాద్: న్యాయవాదులకు రక్షణ కరువైందని, ప్రత్యేక చట్టాన్ని తేవాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కూకట్పల్లి కోర్టులో న్యాయవాది శ్రీకాంత్పై జరిగిన దాడి ని నిరసిస్తూ మంగళవారం కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. శ్రీకాంత్పై దాడి చేసిన వారిని శిక్షించాలన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సాయిని మల్లేశం, కన్నోజు రామకృష్ణ, మురళీమోహన్, ప్రవీణ్, కిరణ్, సంపత్ తదితరులు ఉన్నారు. ముగిసినపదోన్నతుల ప్రక్రియ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 154మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లుగా (ఎస్ఏ) పదోన్నతులు పొందారన్నారు. అదేవిధంగా 40 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందినట్లు తెలిపారు. మహిళలకు రూ. 40 కోట్ల రుణాలు వర్గల్(గజ్వేల్): రాబోయే ఏడాదిలో మహిళా సంఘాలకు రూ.40 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెర్ప్ ఏపీఎం కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సెర్ప్ కార్యాలయంలో తాళ్ల రేణుక అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య వార్షిక మహాసభ జరిగింది. రాబోయే సంవత్సరంలో 420 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, బ్యాంకు లింకేజీ ద్వారా 669 సంఘాలకు రూ. 40 కోట్ల రుణాలు అందించాలని తీర్మానించారు. అలాగే మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు మహిళాలోకం బాసటగా నిలవాలని పిలుపునిస్తూ కిరణ్కుమార్ అందరికీ మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో కృషి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యయాదవ్ గజ్వేల్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రిమ్మనగూడలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. -
దశలవారీగా డబ్బులు జమ
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని జెడ్పీ సీఈఓ రమేశ్ సూచించారు. మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టిన దశలవారీగా డబ్బులు జమవుతున్నాయన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మరళీధర్శర్మ, పంచాయతీ కార్యదర్శి గౌస్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ రమేశ్ -
పల్లెల్లో స్థానిక జోరు
● ఓటరు తుది జాబితాకుషెడ్యూల్ విడుదల ● రేపు 508 జీపీలు, 4,508వార్డుల వారీగా జాబితా ప్రదర్శన సాక్షి, సిద్దిపేట: పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి జోరందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను విడుదల చేసి ఫైనల్ పబ్లికేషన్ చేసేందుకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులుండగా 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. హైకోర్టు తీర్పుతో.. పల్లెలో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30లోగా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే నెలలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. పంచాయతీలకు పంపిస్తున్నాం వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసి పంచాయతీలకు పంపిస్తున్నాం. ఈ నెల 28న ఉదయం ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 2న ఫైనల్ జాబితాను విడుదల చేస్తాం. – దేవకీదేవి, డీపీఓ ఈనెల 28న పంచాయతీ, వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్
● వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం ● నారాయణరావుపేట మండల కేంద్రంలో పర్యటన సిద్దిపేటరూరల్: వైద్య సిబ్బందిపై కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో కలెక్టర్ హైమావతి పీహెచ్సీని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డ్రై డేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ సందర్శించి హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి లీవ్లో ఉన్నట్లు తెలపగా డీఎంహెచ్ఓకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఇతర హెల్త్ సూపర్వైజర్లు సునీత, పాండురంగాచారి, సుధారాణిలు ఫీల్డ్కు వెళ్లారని చెప్పడంతో కలెక్టర్ వారికి వీడియో కాల్ చేసి తెలుసుకున్నారు. దీంతో 10.30 గంటలైనా విధులకు వెళ్లకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు వేతనాన్ని నిలిపివేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య సిబ్బందిపై ఎంపీడీఓ తరచూ పర్యవేక్షణ ఉండాలన్నారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటి నే తాగాలని సూచించారు. ఇంటితో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుక్రవారం డ్రై డే నిర్వహించేలా ప్రజల్లో అవగా హన తీసుకురావాలన్నారు. మండల కేంద్రంలో 68 ఇళ్లు మంజూరుకాగా, కేవలం 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు కలెక్టర్కు తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇంటి నిర్మాణం చేపట్టాలని, నిధులు అకౌంట్లో జమ అవుతాయన్నారు. మట్టి విగ్రహాలను పూజిద్దాంసిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదామన్నారు. -
అసెంబ్లీని ముట్టడిస్తాం
చేర్యాలను డివిజన్ చేయాల్సిందే● సాధన సమితి జేఏసీ చైర్మన్నరసయ్య పంతులు ● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకోకొండపాక(గజ్వేల్): చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సాధన సమితి జేఏసీ చైర్మన్ వకులాభరణం నరసయ్య పంతులు హెచ్చరించారు. మండల పరిధిలోని వెలికట్ట శివారులో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజానీకం వివిధ సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట, జనగామ తదితర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో దూరభారంతోపాటు ఆర్థిక భారం తప్పడంలేదన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలంటూ ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. అయినా పాలకులు స్పందించడంలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. రహదారిపై సుమారు 25 నిమిషాల పాటు రాస్తారోకో కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆముదాల మల్లారెడ్డి, బాల్నర్సయ్య, యాదగిరి, శ్రీధర్రెడ్డి, సంతోష్, రవీందర్, పద్మ, శోభ, మానస, మల్లేశం, కర్ణాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
శాఖల మధ్య సమన్వయ లోపం
పారిశుద్ధ్య నిర్వహణను వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుంది. వర్షా కాలానికి వారం రోజుల ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని తగిన ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంది. డ్రైనేజీల శుభ్రత, పైప్లైన్ల లీకేజీ, వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాధులు ప్రభలే అవకాశమున్న చోట దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. కానీ ఆయా శాఖల సమన్వయ లోపంతో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. -
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అదనపు డీసీపీగా కుశల్కర్ సిద్దిపేటకమాన్: నూతన అదనపు డీసీపీ (అడ్మిన్) గా సీహెచ్ కుశల్కర్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, ఏసీపీ నరసింహులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టి గణపయ్యనే ప్రతిష్ఠిద్దాం ● పర్యావరణాన్ని కాపాడుదాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ స్కాలర్షిప్లు విడుదల చేయండి దుబ్బాక: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ దుబ్బాక నగర కార్యదర్శి జశ్వంత్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. లక్షలాది పేద విద్యార్థులు పైచదువులకు పోకుండా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అఖిల్, శేషాంక్, రాజు, దిలీప్, రాకేశ్ ఉన్నారు. -
అర్జీలపై నివేదిక ఇవ్వండి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించాలని, అలాగే అర్జీలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 281 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు తొలగించండి మాది బందారం గ్రామం. ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రామం మధ్యలో ఉన్న సీసీ రోడ్డును తొలగించారు. మళ్లీ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వర్షాలకు పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఎలాగైనా అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని బందారం గ్రామస్తులు కోరారు. డంపింగ్ యార్డును తొలగించాలి మాది తొగుట మండలం, వరదరాజులపల్లి గ్రామం. సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన చెత్తను తీసుకువచ్చి గ్రామ శివారులో వేస్తున్నారు. దీంతో నీటితోపాటు భూమలు కలుషితం అవుతున్నాయి. అలాగే బయోఎరువులు, బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను దిగువన ఉన్న కుంటలోకి వదులుతున్నారు. అందులోని చేపలు సైతం చనిపోతున్నాయి. ఇప్పటికై నా డంపింగ్ యార్డును తొలగించాలని వరదరాజుల పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఉపకరణాలు అందించాలి జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలను అందించాలని స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ దివ్యాంగులు ఉపకరణాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించండి సిద్దిపేటరూరల్: పరిశ్రమల్లోని కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు ఉపాధి అందించడానికి పరిశ్రమల స్థాపన ఎంతో ముఖ్యమన్నారు. వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న వాటిని పరిశీలన చేయాలన్నారు. పరిశ్రమల శాఖ అధికారి గణేశ్రామ్, ఎల్డీఎం హరిబాబు, పాల్గొన్నారు. ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్మెంట్ వరకు నిర్మాణం కాని వారి వివరాలను తీసుకురావాలన్నారు. బేస్మెంట్ వరకు అయిన వాటిని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో నమోదు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్ ఇవ్వాలన్నారు. -
యూరియా కోసం అలసి.. సొలసి
యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రాత్రనక పగలనకా పడిగాపులు పడుతున్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అలసి సొలసిన కొందరు అక్కడే కునుకు తీశారు. తీరా యూరియా రావడం లేదని తెలియడంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో రోడ్డుపై బైఠాయించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రెండు యూరియా లారీలను తెప్పించి పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. మద్దూరు మండలం రేబర్తి సొసైటీ వద్ద జరిగిన యూరియా పంపిణీలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల పహారాలో అందించారు. చిన్నకోడూరు, బెజ్జంకి, చేర్యాల, కొండపాక తదితర మండలాల్లోనూ ఇదే దుస్థితి. – మిరుదొడ్డి(దుబ్బాక)/ మద్దూరు(హుస్నాబాద్)/ చిన్నకోడూరు/బెజ్జంకి/చేర్యాల(సిద్దిపేట):రెండు రోజులుగా జ్వరం..అయినా.. సంచి యూరియా కోసం నాలుగు రోజుల నుంచి తిప్పలు పడుతున్నా. అయినా దొరకడంలేదు. నాకు బీపీ, షుగర్ ఉంది. పైగా రెండు రోజులుగా జ్వరం. గంటల కొద్దీ నిరీక్షించడంలో పానం ఆగమవుతోంది. జర యూరియా అందించి పుణ్యం కట్టుకోండి. – కనకవ్వ, మహిళా రైతు, అందె, మిరుదొడ్డి -
వీడని బారులు.. తీరని తిప్పలు
సిద్దిపేట రూరల్: రాఘవపూర్లో రైతుల నిరసననంగునూరు: పాలమాకుల పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు నంగునూరు(సిద్దిపేట): జిల్లాలో యూరియా కష్టాలు తొలగడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. రోజంతా నిరీక్షించినా అందని దుస్థితి నెలకొంది. నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్కు ఆదివారం యూరియా వస్తోందని తెలియడంతో తెల్లవారు జామునే చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే ఇప్పటి వరకు తీసుకోని వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో గందళగోళానికి దారి తీసింది. ఆగ్రహించిన కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. గొడవ సద్దు మణగడంతో అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. పోలీసుల పహారాలో యూరియా అందజేశారు. ఈసందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఒక బస్త యూరియాకు మూడు సార్లు క్యూలైన్లో నిలబడాల్సి వచ్చిందన్నారు. పోలీసుల పహారాలో.. కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల పహారాలో ఆదివారం యూరియా పంపిణీ చేశారు. రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓలతో కలసి ఎస్ఐ రాజు, సిబ్బంది పహారాలో రైతులకు టోకన్లు జారీ చేశారు. రైతు సేవా కేంద్రం వద్ద యూరియాను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాఘవపూర్లో ధర్నా సిద్దిపేటరూరల్: సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ సిద్దిపేట– ముస్తాబాద్ రహదారిపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటే కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. పాలకులు స్పందించి కావాల్సిన యూరియా సరఫరా చేయాలన్నారు.యూరియా కోసం పడిగాపులు -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● సకాలంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి ● వైద్యాధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశాలు ● తిమ్మాపూర్లో క్షేత్రస్థాయిలో పర్యటనజగదేవ్పూర్(గజ్వేల్): సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇటీవల డెంగీతో మృతి చెందిన శ్రావణ్, మహేశ్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఫీవర్ సర్వేతో పాటు డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే రక్తనమూనాలను టీహబ్కు పంపించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలన్నారు. నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, గ్రామాల్లో స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ఎలాంటి లక్షణాలున్నా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో అసాధారణ వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ రమేశ్ క్లీనిక్ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఎంహెచ్ఓ ధనరాజ్, ఎంపీడీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ముదిరాజ్లను బీసీ ఏ లోకి మార్చాలి
సిద్దిపేటకమాన్: ముదిరాజ్లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజు పోరాట సమితి (టీఎంపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట నిర్వహించామన్నారు. ముదిరాజ్ల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. 57ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు కేటాయించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్లకు అవకాశం కల్పించాలన్నారు.కార్యక్రమంలో అశోక్, నీవన్, రమేశ్, రంజిత్, శేఖర్, శ్రీశైలం, నరేశ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ సిద్దిపేటజోన్: జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పబ్లిక్ సర్వెంట్స్ హోంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో వారు పాల్గొన్నారు. కష్టపడి పనిచేయాలని, అధికారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్రెడ్డి, కార్యదర్శిగా కనకరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా నాగేందర్, కోశాధికారిగా జహంగీర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు అశ్వాక్, శశిధర్, తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్: దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్ డబ్బులను పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద కుమార్ అన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో నిర్వహించనున్న పెన్షన్దారుల ‘మహా గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో పెన్షన్దారుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన మంద కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన విధంగా వృద్ధుల పెన్షన్ రూ.4వేలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ‘మహా గర్జన’కు పెన్షన్దారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మైస రాములుమాదిగ పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమం పట్టని సర్కార్ మిరుదొడ్డి(దుబ్బాక): వికలాంగుల సంక్షేమాన్ని సీఎం రేవంత్రెడ్డి విస్మరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మంద కుమార్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు విమర్శించారు. ఆదివారం మిరుదొడ్డిలో వీహెచ్పీఎస్ (వికలాంగుల హక్కుల పోరాట సమితి) సీహెచ్పీఎస్ (చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి) సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో ఉన్న 45 లక్షల పెన్షన్దారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకతప్పదన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్లో తలపెట్టిన వికలాంగులు, చేయూత పెన్షన్దారుల మహా గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి రాజేశ్వర్రావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శాంతికుమార్, నాయకులు రాములు, రాజనర్సు, అంజయ్య, వెంకటేశం, ఎల్లయ్య, మల్లయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహం తనిఖీ
కోహెడరూరల్(హుస్నాబాద్): శనిగరం గ్రామంలోని బాలుర వసతి గృహన్ని కలెక్టర్ హైమవతి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్లో నమోదైన పిల్లలు వసతి గృహంలో లేకపోవడంతో కలెక్టర్ వార్డెన్ను ప్రశ్నించారు. అదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లారని వార్డెన్ తెలిపారు. ఆనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్లు సరిగాలేవని విద్యార్థులు తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిరు. -
విద్యారంగం బలోపేతం చేద్దాం
● ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు ● గజ్వేల్లో టీపీటీఎఫ్ విద్యాసదస్సు ● హాజరైన ప్రొఫెసర్ కాశీం, విమలక్క గజ్వేల్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎల్లయ్య పదవీవిరమణ సందర్భంగా స్థానిక ప్రజ్ఞాగార్డెన్స్లో టీపీటీఎఫ్ విద్యా సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ విద్యారంగాభివృద్ధికి టీపీటీఎఫ్ నిబద్దతతో పనిచేయాలన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–పౌర సమాజం పాత్ర’ అంశంపై ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఎస్ విధానం వద్దు అంటూ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న తరుణంలో...ఈ విద్యారంగాన్ని ఎలా కాపాడుకోగలమని ప్రశ్నించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుకుభిన్నమైన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ఈ పరిస్థితి మార్చడానికి ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ‘తెలంగాణ సాంస్కృతికోద్యమం–మహిళలు’ అంశంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ‘తెలంగాణ సాహిత్యోద్యమం–మహిళలు’ అంశంపై నల్గొండ మహత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత ప్రసంగించారు. టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ విద్యా సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, నాయకులు పాల్గొన్నారు. -
పాపన్న ఆశయాలు సాధిద్దాం
మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ చిన్నకోడూరు(సిద్దిపేట): నాడు కులవృత్తులను ఏకం చేసిన గొప్పవ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం గోనెపల్లిలో గౌడ సంఘం, కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం పోరాటం చేసిన పాపన్న గౌడ్ ఆదర్శనీ యుడన్నారు. ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చామన్నారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత సిద్దిపేటజోన్: సాక్షాత్తు పార్వతీదేవి మట్టితో వినాయకుడికి జీవం పోసింది. అలాంటి మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తేనే భక్తి, శక్తి లభిస్తుందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అమర్నాథ్ సేవా సమితి సేవలు ఆదర్శంగా ఉన్నాయని కితాబిచ్చారు. మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదామన్నారు. ఇటీవల పట్టణంలో ఇష్టానుసారంగా చెట్లను నరుకుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచారం గుట్ట నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తజనులతో రద్దీగా మారింది. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో విశేషాలంకృతులై కొలువుదీరిన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల తాకిడితో క్యూలైన్లు రద్దీగా మారాయి. ఇబ్బంది తలెత్తకుండా ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. నాచగిరీశుని దర్శించుకుంటున్న భక్తులు -
ఎరువుల ఇబ్బందులు ఉండొద్దు
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో రైతులెవరూ ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా యూరియా సరఫరా, ఇండెంట్ గురించి ఆరా తీశారు. నియోజకవర్గంలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఈ వానాకాలం సీజన్లో 11,600 మెట్రిక్ టన్నులకుగాను 4,772 మెట్రిక్ టన్నులే సరఫరా చేశారని మిగతా 6,878 మెట్రిక్ టన్నులను ఎప్పుడు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టం, రైతు బీమా అందించడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. -
డిప్యుటేషన్లు రద్దు చేయండి
● డీఎంహెచ్కు కలెక్టర్ ఆదేశం ● చింతమడక పీహెచ్సీ తనిఖీసిద్దిపేటరూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్యసేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిష్టర్ను తనిఖి చేశారు. వైద్యాధికారి భాస్కర్ 13వ తేదీ నుంచి రావడం లేదని అడగగా వర్గల్ మండలంలో డిప్యుటేషన్ ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే డీఎంహెచ్ఓతో మాట్లాడి రోజు 70 నుంచి 80 మంది వరకు ఓపి ఉండే ఆసుపత్రికి డాక్టర్ని డిప్యుటేషన్ ఇవ్వకూడదని, తప్పకుండా రెగ్యులర్ డాక్టర్ను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని డిప్యుటేషన్లను రద్దు చేయాలన్నారు. సీహెచ్ఓ లింగయ్య సెలవు మంజూరు కాకముందే సెలవు తీసుకున్నారని రిజిస్టర్ లో కలెక్టర్ కంప్లైంట్ రాశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ డాక్టర్లు వస్తారా అని ఆరా తీయగా డాక్టర్ అప్పుడప్పుడు వస్తారని, నర్సులు సేవలందరిస్తారని రోగులు కలెక్టర్కు తెలిపారు. మట్టి గణపతులను పూజిద్దాం వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, పర్యావరణ ఇంజనీర్ కుమార్ పాఠక, టి.రవీందర్, పర్యావరణ శాస్త్రవేత్త, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● దేశస్థాయిలో వర్గల్ ఖ్యాతి ఇనుమడింపజేయాలి: ఎంపీ రఘునందన్ ● నవోదయలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి వర్గల్(గజ్వేల్): భూనిర్వాసిత రైతులు సాగుచేసిన పొలాలకు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. వర్గల్ ఫుడ్ప్రాసెసింగ్ జోన్లో భూములు కోల్పోయిన రైతులు శనివారం వర్గల్ మండలం అవుసులోనిపల్లి కెనాల్ వద్ద ఆయనను కలిసి న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు అక్కడ ఏర్పాటు కాకపోవడంతో భూనిర్వాసిత రైతులు పంటలు సాగు చేసుకున్నారని, పంట సగంలో హఠాత్తుగా అర్ధరాత్రి అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేయడం సరికాదన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఫోన్ద్వారా పరిస్థితి వివరించారు. ముందే చెబితే రైతులు నాట్లు వేసేవారు కాదన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని కోరారు. విద్యుత్ పునరుద్ధరణ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వర్గల్(గజ్వేల్): శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా పురోగమిస్తున్న వేళ.. నవోదయ విద్యార్థులు దేశం గర్వించేస్థాయిలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వర్గల్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు పిలుపునిచ్చారు. శనివారం ఉమ్మడి మెదక్జిల్లాలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి ఆయన డీఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామచందర్రావుతో కలిసి హాజరయ్యారు. వారికి ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ఆధ్వర్యంలో విద్యాలయ పరివారం, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం అంతరీక్ష రంగానికి సంబంధించి ఆర్యభట్ట నుంచి చంద్రయాన్, గగనయాన్ దాకా భారత పరిశోధనలు, విజయాలు సూచిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమున్నత ఆశయంతో విద్యార్థులు ముందుకుసాగుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భావిపౌరులుగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధిచెందిన దేశంగా మార్చాల్సిన భాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేందర్ విద్యాలయలో అభివృద్ధి పనులు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్రావు, శ్రీనివాస్, గాడిపల్లి భాస్కర్, నందన్గౌడ్, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదే వరుస.. అదే ప్రయాస
మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/దౌల్తాబాద్(దుబ్బాక)/సిద్దిపేటకమాన్:/సిద్దిపేటఅర్బన్: యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూరియా వస్తుందని తెలిస్తే చాలు అన్నదాతలు అర్ధరాత్రే యూరియా కేంద్రాల వద్ద వాలిపోతున్నారు. పట్టా పాస్పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒకటి, రెండు యూరియా బస్తాలు దొరకడమే గగనంగా మారిపోయింది. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి రెండు లారీల్లో 1,108 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో పడిగాపులు కాచారు. అధికారులు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. అయితే యూరియా దొరకని రైతులు ఆగ్రహించి రైతు వేదికలో ఉన్న వ్యవసాయ అధికారులను నిర్భంధించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఉదయం నుంచే కాచుకొని కుర్చున్నారు. గంటల తరబడి లైన్లో ఉన్నా యూరియా దొరకడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శ్రీరామ్రెడ్డి వాపోయారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు ఆరోపించారు. కార్మిక, కర్షక భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరిపడా యూరియాను సరఫరాచేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతుల పాట్లు -
పేదరికం పరిధులు దాటి..
సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన యువకుడుతొగుట(దుబ్బాక): సంకల్ప బలముంటే విధి కూడా తలవంచుతుందని నిరూపించాడో నిరుపేద యువకుడు. మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నర్మెట ఎల్లవ్వ, రాములు దంపతులు రెక్కల కష్టంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు. వీరికి మనోజ్ కుమార్ కుమా రుడు. ఎలాగోలా కష్టపడి మనోజ్ కుమార్ను డిగ్రీవరకు చదివించారు. ఇదేక్రమంలో తండ్రి రాములు మరణించాడు. దీంతో తన తల్లిని కష్టాల నుంచి గట్టెంక్కించాలన్న సంకల్పంతో కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగంలోని సీఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్)లో కానిస్టేబుల్గా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహించాడు. తను పనిచేస్తున్న విభాగంలో మరింత ఉన్నత ఎత్తుకు ఎదగాలనుకుని కానిస్టేబుల్గానే విధులు నిర్వర్తిస్తూనే సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాడు. హకీంపేటలో గత ఆరు నెలలుగా కఠినమైన ట్రైనింగ్ను పూర్తి చేసుకుని తన పాసింగ్ అవుట్ పరేడ్ను పూర్తి చేశాడు. ఉద్యోగం వచ్చిన ఆనందంతో తన తల్లి ఎల్లవ్వతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఉద్యోగం సాధించుకున్న మనోజ్కుమార్ను అభినందిస్తూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
పర్యాటక కేంద్రంగా ఎల్లమ్మ చెరువు
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ...ఎల్లమ్మ చెరువులో చేపడుతున్న అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎల్లమ్మ సుందరీకరణ పనుల పురోగతి బతుకమ్మ, దసరాలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం మాదిరిగా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. 250 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయని, అది పూర్తికాగానే పీజీ కళాశాల పనులను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి యూరియా సరఫరాపై సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొన్నం ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా యూరియాను అందించాలన్నారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు చేసుకోకుండా విజిలెన్స్ మానిటరింగ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎల్లమ్మ దేవాలయ కార్యనిర్వహణ అధికారి కిషన్రావు తదితరులున్నారు. -
ట్రిపుల్ఆర్.. ఐదు ప్యాకేజీలు
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 202530 కిలోమీటర్లకు ఒకటి.. ● పూర్తి కావొస్తున్న త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్లు ● త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలుట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల అంశం కొలిక్కి వచ్చింది. 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం త్రీడీ నోటిఫికేషన్ పూర్తికాగా, త్రీజీ కూడా తుది దశకు చేరుకోబోతుంది. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. పనిలో పనిగా టెండర్ ప్రక్రియను సైతం వేగిరం చేసి పనులు ప్రారంభించడానికి సంబంధిత యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. – గజ్వేల్ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులు ఎలా చేపట్టాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధికారులు చివరకు ఐదు ప్యాకేజీలుగా చేపట్టడానికి నిర్ణయానికి వచ్చారు. ప్యాకేజీగా 30 కిలోమీటర్కు పైగా విభజించి పనులు చేపట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 161.518 కిలోమీటర్ల మేర పనులు జరగనుండగా, ఇందులో 100 కిలోమీటర్లపైగా నిడివి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉంది. ఈ క్రమంలోనే మూడు ప్యాకేజీల పనులు ఇక్కడ జరుగను న్నాయి. మరో ముఖ్య విషయమేమిటంటే గజ్వేల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కార్యాలయం ఈ పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించనుంది. పరిహారం పంపిణీకి సన్నాహాలు భూసేకరణ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెల్సిందే. చౌటుప్పల్, యాదాద్రి– భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో త్రీడీ నోటిఫికేషన్లో భాగంగా 4,832.5 ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో 4,747.5 ఎకరాలను సేకరించారు. ఈ లెక్కన 98 శాతం భూసేకరణ పూర్తయ్యింది. త్రీజీ నోటిఫికేషన్లో పరిహారం పంపిణీకి సంబంధించిన అంశంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 86 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీకి త్వరలోనే చర్యలు చేపట్టబోతున్నారు. పరిహారం పంపిణీ తర్వాత భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీని తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను సైతం ప్రారంభించే ఆలోచనతో ఉన్నారు.ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం మ్యాపుఅటవీశాఖకు భూముల అప్పగింత పూర్తి ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూమిలో 180 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో భాగంగానే ప్రత్యేకించి గజ్వేల్లోనే 70 ఎకరాల భూమిని అటవీశాఖ కోల్పోతుంది. ఈ భూమికి బదులుగా మహబూబాబాద్లో 180 ఎకరాల భూములను అటవీశాఖకు కేటాయించారు. ఈ భూముల అప్పగింతను అధికారికంగా పూర్తి చేశారు. ఇకపోతే మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్నారు.మరికొన్ని నెలల్లో ప్రారంభిస్తాం ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులను మరికొన్ని నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించాం. త్రీడీ నోటిఫికేషన్ పూర్తయ్యింది. త్రీజీ కూడా త్వరలోనే పూర్తి కానుంది. కాలాల ఆధ్వర్యంలో పరిహారం పంపిణీ కూడా జరుగనుంది. దీని తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. – మాధవి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, గజ్వేల్ -
13న జాతీయ లోక్ అదాలత్
సిద్దిపేటకమాన్: సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన కేసులు రాజీపడేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ అనురాధ, న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్ కాంబ్లి, సంతోష్కుమార్, సాధన, రేవతి, స్వాతిగౌడ్, జితేందర్, కాంతారావు, రాజశేఖర్రెడ్డి, పీపీ జీవన్రెడ్డి, అడిషనల్ పీపీ ఆత్మరాములు, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు. కూడవెల్లి ఆలయం అభివృద్ధికి కృషిమంత్రి కొండా సురేఖ దుబ్బాక: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం చైర్మన్ రాజిరెడ్డి మంత్రి సురేఖను కలిసి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆమె తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనంతుల శ్రీనివాస్, ఏసురెడ్డి, రవి, శ్రీరాం నరేందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శ్యాంసుందర్కు డాక్టరేట్దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాంసుందర్కు హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. శ్యాంసుందర్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బెంజాక్సజోల్స్, థయాజొలిడిన్ డయోన్స్ అండ్ బయోలిజికల్ డాకింగ్ స్టడీస్పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. పర్యవేక్షకులు సుధాకర్ ఆధ్వర్యంలో శ్యాంసుందర్ చేసిన పరిశోధన ఫలితాలు రెండు అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లెటర్స్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు రష్యన్ జర్నల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. శ్యాంసుందర్కు డాక్టరేట్ రావడంపై ప్రిన్సిపాల్ భవాని అధ్యాపకులు అభినందించారు. ఉత్తమ ప్రతిభకు పురస్కారం సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందించనున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శనివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. చేర్యాల పట్టణంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది గంజాయి నేరస్తులను అరెస్టు చేసినందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నుంచి నగదు పురస్కారం అందజేశామన్నారు. 32మందికి కేపీఐ రివార్డులు అందజేసినట్లు చెప్పారు. 11 మంది పోలీస్ అధికారులకు నగదు పురస్కారం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవీందర్రెడ్డి, నర్సింలు, అధికారులు పాల్గొన్నారు. -
ఇక అటవీ శాఖ ముద్ర
● చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి ● ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్ వార్కు చెక్ ● ట్రాన్స్కోకు నోటీసుల జారీలో మున్సిపల్ యంత్రాంగం పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు జిల్లా కేంద్రంలో విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య కొంతకాలంగా నెలకొన్న చెట్ల నరికివేత అంశం అటవీశాఖ చేతుల్లోకి వెళ్లింది. ఇక నుంచి పట్టణంలో చెట్లు నరికివేసేందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు.. అటవీశాఖ అనుమతి పత్రం ఉంటేనే పట్టణంలో హరితహారం చెట్లను తొలగించాలని ట్రాన్స్కోకు అధికారికంగా నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు. సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా హరితహారం కింద మొక్కలు నాటారు. అదే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొంత కాలంగా విద్యుత్ వైర్లను పొడవాటి చెట్ల కొమ్మలు తాకడం, విద్యుత్ సరఫరాలో సమస్యల దృష్ట్యా విద్యుత్ శాఖ చెట్లను తొలగిస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, ఇరు శాఖల సమన్వయ లోపంతో కొన్ని ప్రాంతాల్లో చెట్ల మొదళ్ల వరకు తొలగించారు. ఇదే అంశంపై ఇరు శాఖల్లో కొంత అగాధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు శాఖలు ఎవ్వరికీ వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరించాయి. పెద్ద ఎత్తున జరిమానాలు మరోవైపు పట్టణంలో ఏపుగా పెరిగిన చెట్లను వివిధ కారణాలతో పలువురు తొలగించారు. అలాంటి సంఘటనలపై బల్దియా స్పందించి జరిమానాతోపాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. రూ.500 నుంచి రూ.లక్ష వరకు జరిమానా రూపంలో బల్దియా విధించింది. ఈ లెక్కన ప్రతి ఏడాది సగటున రూ. 50 వేలు జరిమానా పేరిట బల్దియాకు ఆదాయం సమకూరింది. అటవీశాఖ జోక్యం విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారానికి అటవీశాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ శాఖలు, ఇతర వ్యక్తులు చెట్లను తొలగించే అంశంపై అటవీశాఖ అనుమతి తప్పనిసరి అని నిబంధన విధించింది. అందుకు అనుగుణంగా ఇరు శాఖలకు సూచనలు చేసింది. ఇప్పటివరకు విద్యుత్, మున్సిపల్ శాఖల పరస్పర అవగాహన మేరకు విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్లు తొలగించారు. ఇక భవిష్యత్తులో ఇరు శాఖలు అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పట్టణంలో చెట్లు నరికేందుకు అటవీశాఖ అనుమతి లేఖ బల్దియాకు అందజేయాలని మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖకు అధికారికంగా నోటీస్ జారీ చేసే పనిలో నిమగ్నమైంది.అనుమతి ఉంటేనే.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో చెట్లను తొలగించడానికి అటవీశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అందుకు సంబంధించిన అంశాలను నోటీసు రూపంలో విద్యుత్ శాఖ అధికారులకు పంపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్ -
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
● గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం ● త్వరలో గౌరవెల్లిని నింపి సస్యశ్యామలం చేస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట(హుస్నాబాద్): అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని కట్కూర్, గొల్లకుంట, అక్కన్నపేట, కేశనాయక్తండా, కుందనవానిపల్లి, గండిపల్లి, రామవరం, మల్చెర్వుతండా, గోవర్ధనగిరి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణానికి శంకుస్థాపనులు, నూతన జీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడికక్కడా అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్కు గుండెకాయ గౌరవెల్లి గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్కు గుండెకాయ లాంటిదన్నారు. ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతాంగం ఏళ్లుగా ఎదురుచూస్తోందన్నారు. త్వరలో ఎన్జీటీ కేసును సైతం తొలగిస్తామన్నారు. అందరి సహకారంతో త్వరలో గౌరవెల్లి గోదావరి జలాలతో నింపి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యాలమం చేస్తామన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తాం.. నందారం, కపూర్నాయక్తండా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిషరిస్తామని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకే పట్టా హక్కులు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి హుస్నాబాద్రూరల్: పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలనే మీర్జాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.2కోట్లతో నిర్మించామని అన్నా రు. అభివృద్ధి పనులను వేగంగా పర్తి చేయాలని ఆదేశించారు. మహిళ సంఘాలకు స్టీల్ బ్యాంక్ను అందించారు. -
యూరియా.. తిప్పలు ఇంతింత కాదయా
● అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో రైతులు ● రోజంతా ‘చెప్పు’ కోలేని పాట్లు జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మిరుదొడ్డి పీఏసీఎస్ కేంద్రానికి శుక్రవారం యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే లైను పోతుందేమోనన్న బెంగతో చెప్పులను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. మహిళా రైతుల పరిస్థితి అంతాఇంతా కాదు. సుమారు 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడానికి అధికారులకు సైతం తిప్పలు తప్పలేదు. టోకెన్ కౌంటర్ ఒకటే ఉండటంతో రైతుల మధ్య కాసేపు తోపులాటకు దారి తీసింది. యూరియా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అందనివారు నిరుత్సాహంగా వెనుదిరగాల్సి వచ్చింది. దుబ్బాకలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వచ్చిన 560 సంచుల కోసం 2 వేల మందికి పైగా బారులు తీరడం విశేషం. హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు మంత్రి తుమ్మల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దౌల్తాబాద్లోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం గంటలకొద్దీ నిరీక్షించారు. – మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్ -
యూరియాపై ఆందోళన వద్దు
యూరియా కోసం ఎలాంటి ఆందోళన వద్దని, కేంద్ర ప్రభుత్వం సరఫరాలో అలసత్వం వహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండల కేంద్రంలో విశాల పరపతి సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరడం చూసి అక్కడికి వచ్చా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కోసం ఇబ్బందులు పడవద్దని, కాంగ్రెస్ ఎంపీలు ఢీల్లీలో సరిపడా యూరియా అందించాలని ఆందోళన చేశారన్నారు. త్వరలోనే యూరియా సరఫరా అవుతుందన్నారు. కొందరు రైతులు మాట్లాడుతూ మూడు రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరకడంలేదన్నారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, ఇప్పడు యూరియా చల్లకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ గేమ్స్పై నిఘా ముమ్మరం
సీపీ అనురాధహుస్నాబాద్: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లపై నిఘా ముమ్మరం చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పోలీస్స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని సీపీ సందర్శించారు. సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డు, రైటర్ గదిని పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీపీఓలు నిమజ్జనం పూర్తయ్యేంత వరకు తరుచూ గ్రామాలను సందర్శించాలన్నారు. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఊరికి రక్షణ సీసీ కెమెరాలు హుస్నాబాద్రూరల్: ఊరికి రక్షణగా సీసీ కెమెరాలు నిలుస్తాయని సీపీ అనురాధ అన్నారు. శుక్రవారం పోతారం(ఎస్) గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పల్లెలను సీసీ కెమెరాల నిఘా కిందకు తెచ్చేందుకు ప్రజలతో కలిసి పోలీసులు పని చేయాలన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా నలుగురు కూర్చుండి మాట్లాడితే పరిష్కారమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మాజీ సర్పంచ్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
లిక్కర్ జోరే..
ఉమ్మడి జిల్లాలో రూ. కోట్లలో వ్యాపారంమెదక్ అర్బన్: కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో వ్యాపారుల్లో కదలిక ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో లిక్కర్ వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వినియోగం సర్కారుకు కనకవర్షం కురిపిస్తోంది. ఈసారి వైన్షాపు దరఖాస్తు ధర పెంచడంతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 243 వైన్ షాపులు ఉండగా, 2023– 25 ఎకై ్సజ్ సంవత్సరానికి 12,227 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు రూ. 244.54 కోట్ల ఆదాయం కేవలం అప్లికేషన్ల ద్వారానే సమకూరింది. కాగా ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 2,490 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. ఇదిగాక వైన్ షాపుల నుంచి ప్రభుత్వం వసూలు చేసే లైసెన్స్ రుసుము, టర్నోవర్ టాక్స్, ఎకై ్సజ్ టాక్స్ అదనం. ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి.. మెదక్, సంగారెడ్డి జిల్లాలలోని 118 వైన్ షాపులు, 16 బార్లకు మెదక్ జిల్లా ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి మద్యం, బీర్లు సరఫరా అవుతాయి. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 2,490 కోట్ల విలువ గల మద్యం కొనుగోలు చేశారు. ఇందులో 26,40,682 కార్టన్ల లిక్కర్, 34,34,238 కార్టన్ల బీర్లు కొనుగోలు చేశారు. గత ఎకై ్సజ్ సంవత్సరం వ్యవధి సుమారు 100 రోజులు మిగిలి ఉంది. వచ్చే ఎకై ్సజ్ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున, ఈ ఏడాది వైన్ షాపులకు దరఖాస్తులు మరిన్ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వ్యాపారులు, ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్పడి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.ఉమ్మడి జిల్లాలో వైన్షాపుల వివరాలుసిద్దిపేట 93 మెదక్ 49 సంగారెడ్డి 101 ఉమ్మడి జిల్లాలో 243 ఏ4 వైన్షాపులు ఉన్నాయి. 2023– 25 ఎకై ్సజ్ సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలో 6,156, మెదక్లో 1,905, సిద్దిపేటలో 4,166 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో అప్లికేషన్ రుసుం రూ. 2 లక్షలు ఉండేది. ఈ లెక్కన కేవలం దరఖాస్తుల రూపేణ రూ. 244.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ధర రూ. 3 లక్షలకు పెంచడంతో సుమారు రూ.120 కోట్ల ఆదాయం అదనంగా పెరిగే అవకాశం ఉంది. గత ఎకై ్సజ్ ఏడాది 12,227 దరఖాస్తులు రూ. 244.54 కోట్ల ఆదాయం ఈసారి మరింత పెరిగే అవకాశం -
కొరత లేదు.. ఆందోళన వద్దు
● రైతులందరికీ యూరియా అందిస్తాం ● డీఏఓ స్వరూపరాణి మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని, సకాలంలోనే అందరికీ అందిస్తామని డీఏఓ స్వరూపరాణి తెలిపారు. గురువారం మిరుదొడ్డిలోని పీసీసీఎస్ కేంద్రంతో పాటు, పలు ఎరువుల దుకాణాలను, చెప్యాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్లో ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు నెల వరకు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. నేటికి 25 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. ఈ యేడాది సాగు పెరగడంతో యూరియా కొరత సమస్య తలెత్తిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి యూరియా సమస్య తీసుకెళ్లామన్నారు. వెంట వెంటనే యూరియాను ఆయా పండలాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు. నానో యూరియా సైతం అందుబాటులో ఉందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం నానో యూరియాను పంటలకు వాడాలని సూచించారు. కాగా ఎరువుల దుకాణాలకు వచ్చిన యూరియాను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సరఫరా చేయాలని ఎరువుల దుకాణా డీలర్లను ఆదేశించినట్లు తెలిపారు. -
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: ఎమ్మెల్సీ
గజ్వేల్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలి పారు. గురువారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు నేటికీ అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా గ్రామాల్లో పనులు చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కనీస సౌకర్యాలైన డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల్లో (ఏటీసీ) ఉన్న సీట్లను వందశాతం భర్తీ చేసేలా చూడాలని ప్రిన్సిపాల్స్ను అదనపు కలెక్టర్ గరీమా అరగ్వాల్ ఆదేశించారు. బుధవారం ఇర్కోడ్లోని ప్రభుత్వ ఏటీసీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా అందిస్తున్న ఆరు ఆడ్వాన్స్డ్ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేట, దుబ్బాక, కుకు నూర్పల్లిలో గల ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సు ల్లో చేరి ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది శాఖ అధికారి జయదేవ్ ఆర్యా, అదనపు డీఆర్డీఓ, డీపీఎం, ఏపీఎం విజయనిర్మల, ప్రిన్సిపాల్ రామానుజ, అధికారులు పాల్గొన్నారు. వర్గల్(గజ్వేల్): ఉమ్మడి జిల్లాలో సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రాన్ని గురువారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో కొలువైన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు కలెక్టర్ను శేషవస్త్రంతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మేసీ్త్రల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన హౌసింగ్ ఏఈని వెంటనే విధుల నుంచి తొలగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న మేసీ్త్రకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమేకాకుండా దుర్భాషలాడిన అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి రవికుమార్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కనకయ్య, వెంకన్న, రవీంద్రచారి, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): నగరంలో ఈ నెల 23న జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. -
పల్లెలు మురిసేలా..
ప్రగతి మెరిసేలా..నేడు ఊరూరా పనుల జాతరపల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ‘పనుల జాతర’ చేపడుతోంది. ఈజీఎస్, పంచాయతీ రాజ్ ద్వారా పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ పనుల జాతర ఎంతో ఉపయోగపడనుంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రూ.12.85కోట్ల నిధులతో పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి పొన్నం ప్రభాకర్ చేయనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ్) కింద ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్లు, సామాజిక పారిశుద్ధ్య కాంప్లెక్స్లు, పశువులు, కోళ్లు, గొర్రెలషెడ్లు, భూగర్భ జలాలు పెంచే పాంపాండ్స్, ఊట కుంటలు వంటి పనులను ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళాశక్తి– ఉపాధి భరోసా కింద చేపట్టే జీవనోపాధిలో రైతులు, లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో మంజూరు ఉత్తర్వులు అందించనున్నారు. అలాగే ఉపాధిహామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన కూలీలతో పాటు దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను సన్మానించనున్నారు. రూ.12.85కోట్లు కేటాయింపు జిల్లా వ్యాప్తంగా 536 పనులకు రూ.12.85కోట్ల నిధులు కేటాయించారు. ఈజీఎస్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ నిధులతో పనులు జరగనున్నాయి. జిల్లాలో కొంత కాలంగా అభివృద్ధి పనులు జరగలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నూతన పనులు ప్రారంభించేందుకు, మధ్యలో నిలిచిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు బాటలు పడనున్నాయి. నియోజకవర్గం పనులు నిధులు (రూ.లక్షల్లో) సిద్దిపేట 119 189.4 గజ్వేల్ 145 189.54 హుస్నాబాద్ 81 603.98 దుబ్బాక 114 219.66 జనగామ 54 65.94 (మూడు మండలాలు)మానకొండూరు 23 16.75 (బెజ్జంకి) శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు 536 పనులకు రూ.12.85కోట్లు ఈజీఎస్, పంచాయతీ రాజ్ ద్వారా అభివృద్ధి పనులు నేడు హుస్నాబాద్లో ప్రారంభించనున్న మంత్రి పొన్నం -
పాఠశాలల నిధులు గాయబ్
గాంధీనగర్ పాఠశాలకు కొనుగోలు చేసిన ప్లే గేమ్స్ పరికరాలు, ఎంఈఓ కార్యాలయంలో కొనిచ్చిన ఎల్ఈడీ టీవీహుస్నాబాద్రూరల్: సత్యమేవ జయతే అని బోధించే గురువులే కాకీ లెక్కలు చూపి రూ.18.78 లక్షల పాఠశాలల నిధులను స్వాహా చేశారు. ఈ ఘటన హుస్నాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం 2024–25లో ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించింది. 11 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. తరగతులు బోధించడానికి ఒక వలంటీరుకు రూ.8వేల చొప్పున 10 నెలలకు రూ.80వేలు, అయాకు రూ.6వేల చొప్పున 10 నెలలకు రూ.60వేలు ప్లేగేమ్స్ పరికరాల కోసం రూ.20వేలు, ఆరోగ్య పరిరక్షణ కోసం రూ. 10వేలు ఇలా మొత్తం ఒక్కొక్క పాఠశాలకు రూ.1.72 లక్షలను 11 పాఠశాలలకు రూ.18.78 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ఖర్చు చేయకుండానే ప్రధానోపాధ్యాయులు థర్డ్ పార్టీ అకౌంట్లకు జమ చేసి అదే రాత్రి హెచ్ఎంల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేసుకున్నారు. గత విద్యా సంవత్సరానికి మంజూరైన నిధులను కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయకపోవడంతో పాఠశాలలో జాయింట్ బ్యాంక్ ఖాతా ఉపాధ్యాయుల మధ్య గొడవకు దారి తీసి ప్రధానోపాధ్యాయుల అవినీతి వెలుగు చూసింది. తరగతులు లేకుండానే ప్రతిపాదనలు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలల వివరాలను జిల్లా అధికారులు కోరారు. దీంతో అంగన్వాడీ పిల్లల పేర్లను నమోదు చేసుకుని ఉపాధ్యాయుల పేరునే వలంటీరుగా, స్వీపర్ల పేరునే అయాగా నమోదు చేసి ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎంలు ప్రతిపాదనలు పంపించారు. వీరు పంపిన ప్రతిపాదనలపై ఎలాంటి విచారణ చేయకుండానే విద్యాశాఖ 11 పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. నా పేరు రాసినందుకు నాకే వేతనం ఇవ్వాలని స్వీపర్లు, వలంటీరు లేకుండానే నిధులు వచ్చినందుకు వాటిని పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని తోటి ఉపాధ్యాయులు పట్టుపట్టడంతో గిట్టని ఉపాధ్యాయులను ఎంఈఓ సహకారంతో మరో చోటకు డిప్యూటేషన్ వేయించి ప్రశ్నించే గొంతులను లేకుండా అణచి వేస్తున్నారు. అవినీతి హెచ్ఎంలకు బాసటగా నిలిచిన ఎంఈఓ కార్యాలయానికి పాఠశాలకు రూ.10వేల చొప్పున రూ.1.10లక్షలను జమ చేసి కొత్త ఎల్ఈడీ టీవీ కొనిచ్చారు. పాఠశాలలను పర్యవేక్షించే అధికారులే అవినీతి కూపంలో కూరుకుపోయారనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలి. ఇందుకు గాంధీనగర్, పోతారం(ఎస్), హుస్నాబాద్, తోటపల్లి, మీర్జాపూర్, పూల్నాయక్ తండా, నాగారం, భల్లునాయక్ తండా, పందిల్ల, కెబి కాలనీ, కూచనపెల్లి పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. మార్చి ముగింపులో నిధులు తిరిగి వెళ్లకుండా హెచ్ఎంలు వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నారు. ఇప్పుడు పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పాం. ఎల్ఈడీ టీవీ ఉపాధ్యాయుల శిక్షణకు ఉపయోగపడుతుందని కొని ఇచ్చారు. నిధులు దుర్వినియోగం చేసిన హెచ్ఎంలపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – బి.మనీల, ఎంఈఓ, హుస్నాబాద్ హెచ్ఎంల చేతివాటం పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు విద్యాబుద్ధులు చెప్పే గురువులే దారితప్పిన వైనం బాసటగా నిలిచిన ఎంఈఓ కార్యాలయానికి ఎల్ఈడీ టీవీ బహూకరణ -
పశువుల సంరక్షణ ముఖ్యం
● శాఖాపరమైన చర్యలు చేపట్టాలి ● అధికారులతో కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: జిల్లాలోని పశువుల సంరక్షణకు శాఖపరంగా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పశువుల మేతకు కొరత లేకుండా చూడాలని, పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలన్నారు. పశువులకు వ్యాధులు సంక్రమించకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి వ్యాక్సినేషన్ అందించాలన్నారు. అన్ని పశువైద్యశాలల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా ఇచ్చిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి పూర్ణచందర్, పశు వైద్య అధికారులు పాల్గొన్నారు. ఉపాధికి ఐటీఐ కేంద్రాలు దోహదం కొండపాక(గజ్వేల్): ఉద్యోగ, ఉపాధి కోసం ఐటీఐ కేంద్రాలు దోహదపడతాయని కలెక్టర్ హైమావతి అన్నారు. కుకునూరుపల్లిలో ప్రభుత్వ ఐటీఐ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధనలు, ప్రాక్టికల్స్ నిర్వహన తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీతో అధునాతన మిషన్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు. ఐటీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రాంచంద్రాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఘనంగా తీజ్ ఉత్సవాలు హుస్నాబాద్: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్కు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమ మొలకల బుట్టను తలపై పెట్టుకొని బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్, మేరీమా యాడి ఆశీర్వాదంతో పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. 1978లో ఇందిరా గాంధీ గిరిజనుల అభ్యున్నతికి ఎస్టీ హోదాను కల్పించారని గుర్తు చేశారు. గిరిజనుల్లో అభివృద్ది చెందిన వారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారికి సహకారం చేసుకోవాలన్నారు. పేదవాళ్లకు అండగా నిలువాలని చెబితే దానిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో ఏమీ చేయని వారు.. మరో మూడేళ్లల్లో వచ్చి చేస్తామని చెప్పడం వారి అవివేకమన్నారు. బంజారా భవనం నిర్మాణం కోసం రూ.45లక్షలు మంజూరు చేశామన్నారు. భవనం పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. బంజార భవన్లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూ సేకరణ వేగవంతం చేయాలిహుస్నాబాద్ ప్రాంతానికి సాధ్యమైనంత త్వరగా నీళ్లు అందించడానికి గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణ వేగిరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లెల్లగడ్డలో అర్బన్ డెవలప్మెంట్ పార్క్కు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యా సంస్థలకు, ఇతర భవనాలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఉంచాలన్నారు. ఇంటి పన్నులు వంద శాతం వసూలు అయ్యేలా చూడాలన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు వినాయక విగ్రహాలు, మారేడు మొక్క, సంచి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమీక్ష హుస్నాబాద్: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్ కింద చేపడుతున్న పంచాయతీ, అంగన్వాడీ కేంద్ర భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నేషనల్ హైవే పనుల్లో భాగంగా పోతారం(ఎస్), పందిల్ల, జిల్లెల్లగడ్డ, సముద్రాల, బస్వాపూర్ వద్ద సెంట్రల్ లైటింగ్ పనులు చేయాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు, బతుకమ్మ ఘాట్ను బతుకమ్మ పండుగ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని పక్కా ప్రణాళికతో నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా హౌసింగ్ అధికారులు సందర్శించాలన్నారు. మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం టార్గెట్ పూర్తి చేసి, రహదారుల వెంబడి రావి, మర్రి. వేప చెట్లను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి నంగునూరు(సిద్దిపేట): వరద నీటి ప్రవాహం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెక్డ్యామ్, వాగుల్లో సమస్యలు రాకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం నంగనూరు మండలం పరిధిలోని మోయతుమ్మెద వాగు ఘనపూర్, ఖాతా ప్రాంతాల్లో చెక్ డ్యామ్లను పరిశీలించారు. పది రోజులుగా చెక్డ్యామ్ ద్వారా నీటి ప్రవాహం ఉంటోందని అధికారులు కలెక్టర్కు వివరించారు. అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రేపు ‘పనుల జాతర’ సిద్దిపేటరూరల్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 22న శుక్రవారం పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
జిల్లాలో పలుచోట్ల ఆందోళనలుకోడికూత కూయగానే పొలం బాట పట్టే రైతన్న.. ఇప్పుడు యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం సైతం జిల్లాలో పలు చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు.పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. సిద్దిపేట రూరల్, దుబ్బాక, గజ్వేల్, మిరుదొడ్డి, హుస్నాబాద్ మండలాల్లో ప్రధాన రహదారులపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సకాలంలో ఎరువులుసరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రోజంతా నిరీక్షించినా రెండు బస్తాలు కూడా లభించడంలేదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలే నేడు రైతులపై చిన్నచూపు చూస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలతో రహదారులపై రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. – సిద్దిపేటరూరల్/దుబ్బాకటౌన్/గజ్వేల్రూరల్/హుస్నాబాద్/మిరుదొడ్డి(దుబ్బాక) -
యూరియా ఇవ్వకుండా
కేంద్రం నాటకాలుదుబ్బాక: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ మండిపడ్డారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కార్యకర్తల కష్టసుఖాలు తెలుసు కున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకాలు చేస్తోందన్నారు. 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే కేవలం 4 లక్షల టన్నులే ఇచ్చిందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనన్నారు. కానీ కొన్నిపార్టీల నాయకులు కావాలనే యూరియాను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరత ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ధర్నా చేయడం ఏమిటని ధమ్ముంటే ఢిల్లీలో చేయాలన్నారు. యూరియా కొరతపై సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ.. తెప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. సన్నవడ్ల బోనస్ డబ్బులు వచ్చే నెలలో వేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్కార్డు కూడా ఇవ్వలేదని ఇప్పుడు అర్హులందరికీ రేషన్కార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు. శ్రీనివాస్రెడ్డికి పదవి నా బాధ్యత మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డికి పదవి ఇప్పించే బాధ్యత నాదేనని మంత్రి వివేక్ అన్నారు. సముచితమైన పదవి ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తాం ప్రశాంత్నగర్(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న రహదారులను పరిశీలించి పూర్తి చేస్తామని, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ వెళ్తూ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీని అభివృద్ధి చేస్తూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ హరికృష్ణ, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్, సందబోయిన పర్శరాములు పాల్గొన్నారు. కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ దుబ్బాకలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం -
మల్లన్నసాగర్ టు కొండపోచమ్మ సాగర్
నీటి పంపింగ్ ప్రారంభం మర్కూక్(గజ్వేల్): భారీ వర్షాల నేపథ్యంలో మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్కు బుధవారం నీటిపంపింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ సాయిరెడ్డి మాట్లాడుతూ ఒక పంపు ద్వారా ప్రస్తుతం కొండపోచమ్మసాగర్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. వరద ఉధృతి మేరకు మిగతా పంపు లను కూడా ప్రారంభిస్తామన్నారు. మంగళవారం నాటికి కొండపోచమ్మసాగర్లో 4.78 టీ ఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. 12 టీఎంసీల వరకు పంపింగ్ చేస్తామన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు అర్హులన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు 15 ఏళ్లు, ఉపాధ్యా యులు పదేళ్ల ఉద్యోగ నిర్వహణ చేసిన వారు దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 25లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. గజ్వేల్: జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి బుధవారం గజ్వేల్లోని ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వహణను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ ఉన్నారు. సిద్దిపేటరూరల్: ‘ఇందిరమ్మ ఇళ్లలో అధికారుల చేతివాటం’ అనే శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ స్పందించారు. సంబంధిత అధికారిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక అందించాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. చిన్నకోడూరు(సిద్దిపేట): రైల్వే లైన్పై ఆ శాఖ అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో భాగంగా ట్రయల్ రన్ చేపట్టారు. మొదటి సారి రైలు కూత వినిపించడంతో స్థానికులు సెల్ఫీలు దిగారు. చిన్నకోడూరుకు రైలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్గాంధీకి ఘన నివాళి గజ్వేల్: ప్రపంచ దేశాల్లో భారత్ను తలెత్తుకునేలా చేసిన దివంగత ప్రధాని రాజీవ్గాంధీ చరిత్రను చెరిపేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆరోపించారు. రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ రాజీవ్గాంధీ సాంకేతిక రంగాలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. -
ముఖంచూపని ఉపాధ్యాయులు
● ఈ నెల 18న వినియోగించుకోని 700 మంది ● ఆలస్యంగా వచ్చిన వారు సైతం అదే దారిలో.. ● జిల్లా వ్యాప్తంగా 5,649 టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్ ద్వారా అటెండెన్స్ను నమోదు చేసుకునేందుకు పలువురు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. డుమ్మాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో విద్యాశాఖ ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ నెల ఒకటి నుంచి ఎఫ్ఆర్ఎస్ యాప్ను అమలు చేస్తున్నారు. ఒక్కరోజే 700 మంది ఉపాధ్యాయులు యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోకపోవడం గమనార్హం. ఎఫ్ఆర్ఎస్లో పలు కఠిన చర్యలు తీసుకుంటేనే ఉపాధ్యాయులు గాడిలో పడే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బోధనా తరగతులు సమతుల్యంగా జరగడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని భావిస్తోంది. పలువురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొడుతూ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. దీంతో క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ను అమలు చేస్తోంది. 5వేల మందికి పైగా ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా 1,021 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,649 మంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. వారిలో 5,555 మంది ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. మరో 94 మందిలో ఇతర దేశాలకు వెళ్లిన వారు 63 మంది వరకు ఉండగా 31 మంది వివిధ కారణాలు చెబుతూ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం లేదు. ఉపాధ్యాయుడు, నాన్టీచింగ్ సిబ్బంది సదరు పాఠశాలకు 500మీటర్ల లోపు ఉంటేనే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకుంటుంది. యాప్పై కానరాని ఆసక్తి ఈ నెల 18న 700 మంది ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ను వేసుకోలేదు. ఇందులో కొంత మంది సెలవులు పెట్టినా హెచ్ఎం ఆమోదం తెలపకపోవడంతో వారందరికీ గైర్హాజరుగా నమోదైంది. మరికొందరు పాఠశాలకు ఆలస్యంగా రావడంతో ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేసుకోలేదు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినట్లు తెలిసిపోతుందని ఆటెండెన్స్ వేసుకోవడంలేదు. వర్కింగ్ డేస్లలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4:15గంటల వరకు పాఠశాలలోనే ఉపాధ్యాయులు ఉండాలి. కొందరు ముగింపు సమయం కంటే ముందే వెళ్తుంటారు. అలాంటి వారు సైతం ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేసేందుకు మొగ్గు చూపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ను వేయని వారిని మొదటే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటే అందరూ క్రమం తప్పకుండా వినియోగించుకుంటారన్న చర్చ జరుగుతోంది. నిర్దేశిత సమయంలో పాఠశాలలోనే ఉండి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అభిప్రాయ పడుతున్నారు. వారిపై చర్యలు తప్పవు హాజరైన ప్రతి రోజు అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ ద్వారానే నమోదు చేసుకోవాలి. యాప్ను ఉపయోగించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అందరూ సమయ పాలన పాటించాలి. మరో వారం రోజుల్లో ట్రయల్ రన్ ముగియనుంది. కొన్ని చోట్ల టెక్నికల్ సమస్య వస్తుంది. పరిష్కారం చేస్తున్నాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
డీలర్ల పరేషన్!
సిద్దిపేటజోన్: లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించిన డీలర్లు సంబంధిత కమీషన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదు నెలలుగా కమిషన్ డబ్బులు రాకపోవడంతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలుకు రూ.140 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి రూ.3 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గతంలో ఉన్న నిబంధనలను సవరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ డబ్బులు జమ చేసే విధానం రావడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 685 రేషన్ షాప్ల ద్వారా 2,98,985 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా దాదాపు 5వేల మెట్రిక్ టన్నులపై చిలుకు రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అందుకు సంబంధించి ఆయా రేషన్ షాప్ నిర్వహకులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున కమిషన్ చెల్లిస్తుంది. జిల్లాలో 685 రేషన్ డీలర్లకు 51 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీకి సంబంధించి ప్రతి నెలా సుమారు రూ.71లక్షల పై చిలుకు కమిషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత మార్చి వరకు సజావుగా కమిషన్ డబ్బులను బ్యాంకులో జమ చేసింది. కాగా ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కమిషన్ డబ్బులు పెండింగ్లో ఉండడం మరోవైపు ఇటీవల జూన్లో మూడు నెలల బియ్యాన్ని డీలర్లు ఒకేసారి పంపిణీ చేశారు. దీనితో మొత్తంగా ఐదు నెలల కమిషన్ డబ్బులు పెండింగ్లోపడ్డాయి. ఆర్థిక ఇబ్బందుల్లో డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారు. షాప్ కిరాయి, లబ్ధిదారులకు బియ్యం అందించడానికి అవసరమైన సిబ్బంది జీతం, ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని రేషన్ షాప్ లో దిగుమతి చేసిన హమాలీలకు చార్జీల చెల్లింపు తదితర ఆర్థిక పరమైన అంశాల్లో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే జమ చేయాలి కొన్ని నెలలుగా ప్రభుత్వం కమీషన్ డబ్బులు జమ చేయడం లేదు. ఇప్పటివరకు ఐదు నెలలుగా బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రతి నెలా ఒకటవ తేదీనే కమీషన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కమీషన్ను పెంచాలి. – నాగరాజు, రాష్ట్ర డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కమీషన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే జమ చేసేది. కానీ ఇటీవల నిబంధనలను సవరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా డీలర్లకు కమిషన్ డబ్బులు జమ చేస్తున్నాయి. కమిషన్ డబ్బుల జమ అంశంపై డీలర్లకు అయోమయ పరిస్థితి నెలకొంది. కమీషన్ కోసం ఎదురుచూపులు ఐదు నెలలుగా పెండింగ్ జిల్లాలో రూ.3కోట్ల బకాయిలు కొత్త నిబంధనలతో అయోమయం -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● దిలాల్పూర్లో తెగిపోయిన కొండపోచమ్మసాగర్ కాల్వ పరిశీలన గజ్వేల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం గజ్వేల్ మండలం దిలాల్పూర్లో తెగిపోయిన దౌల్తాబాద్వైపు వెళ్లే కొండపోచమ్మసాగర్ కాల్వను పరిశీలించారు. కాల్వ నీళ్లు పొలాల గుండా కుంటలోకి వెళ్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు వివరించగా వెంటనే కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగి చెరువులు, కుంటలు, కాల్వలు తెగిపోయే ప్రమాదమున్నందువల్ల ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరదలో వాగులను దాటొద్దు మిరుదొడ్డి(దుబ్బాక): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ హైమావతి కోరారు. మంగళవారం అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న లో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ లో లెవల్ బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రత్యేకంగా బారికెడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్య లు చేపట్టాలని అధికారులకు సూచించారు. నర్సరీ పరిశీలన ములుగు(గజ్వేల్): స్థానిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్, రైతు శిక్షణ కేంద్రంలోని నర్సరీలను కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కూరగాయలు, పండ్లు, పూలు ఇతరత్ర మొక్కలు సాంకేతిక పద్ధతి ద్వారా మొలిచే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశీరకం వంగడాలతో కూడిన మొక్కలను నర్సరీలలో పెంచాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
హస్తవ్యస్తం
గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ రచ్చకెక్కుతోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపైఒకరు కేసులు పెట్టుకునే స్థితికి చేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు మధ్య కొంతకాలంగా పోరు నడుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గం తయారైంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో స్పందించి నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్ను కన్వీనర్గా నియమించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని మల్లు రవి ఆదేశించారు. – సాక్షి, సిద్దిపేట ములుగులో గతేడాది డిసెంబర్ 2న కోకాకోలా కంెపెనీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. లోపలికి శ్రీకాంత్ రావు అనుచరులను అనుమతించారని.. తన అనుచరులను రానివ్వలేదని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నిరసన తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ఈ నెల 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ ఎదుటే కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్లు ఘర్షణకు దిగారు. దిష్టిబొమ్మల దహనాలు కేసుల నమోదు వెనకాల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం ఉందని నర్సారెడ్డి వర్గీయులు నిరసనలు చేపడుతున్నారు. కొండపాక మండలం వెలికట్ట క్రాస్ రాజీవ్ రహదారిపై మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు మల్లేశం, రవీందర్ల ఆధ్వర్యంలో ఈ నెల 17న టోల్ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్ రోడ్డు వరకు నర్సారెడ్డి దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకవచ్చి దహనం చేశారు. ఇలా సొంత పార్టీ నేతలే పరస్పర విమర్శలతో రోడ్డెక్కుతూ దిష్టిబొమ్మల దహనానికి పాల్పడుతుండటం గమనార్హం. వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతల మధ్య రోజు రోజుకు కలహాలు ముదురుతున్నాయి. విభేదాలు పరిష్కరించడంలో కాంగ్రెస్ అధిష్టానం జాప్యం చేస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వర్గాలు ఒక్కటయ్యేనా గజ్వేల్ కాంగ్రెస్లో కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతోంది. ఈ విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి పలువురు ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్ను కన్వీనర్గా నియమించారు. 10 రోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కావాలని ఒక వర్గం కుట్రలకు పాల్పడుతోందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గాలను ఒక్కటి చేసి పార్టీని పటిష్ట పరచాలని క్యాడర్ కోరుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇటీవల ఇన్చార్జి మంత్రి ఎదుటే నేతల బాహాబాహీ ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు నర్సారెడ్డి, మైనంపల్లి దిష్టిబొమ్మల దహనాలు నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడి నియామకం కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వంగజ్వేల్: కాంగ్రెస్లో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు పలువురు నేతలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ను కలిసి పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు విజయ్కుమార్పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డితోపాటు పలువురు హైదరాబాద్లో పీసీసీ చీఫ్ను కలిశారు. విజయ్కుమార్పై నర్సారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని వివరించారు. పార్టీలో నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో గజ్వేల్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందనే అంశంపై అధిష్టానం సీరియస్గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వాల వైఫల్యమే కారణం
● సకాలంలో యూరియా సరఫరా చేయాలి ● దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలుకు ముందు చూపు లేకనే యూరియా కొరత ఏర్పడుతోందని విమర్శించారు. రైతులు యూరియా కోసం పస్తులతో పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభత్వుం ఏం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే యూరియా కొరతను తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కమలాకర్రెడ్డి, సోలిపేట సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి, మాజీ కోఅప్షన్ మెంబర్ ఎండీ. అహ్మద్, నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ రాస్తారోకో చిన్నకోడూరు(సిద్దిపేట): యూరియా కొరత నివారించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. గంట పాటు నిర్వహించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేటలో బారులు అక్కన్నపేట(హుస్నాబాద్): వరిసాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రానికి స్టాక్ రావడంతో రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు తమ వంతుకోసం గంటల కొద్దీ నిరీక్షించారు. పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. -
హాట్ స్పాట్లపై నిఘా ముమ్మరం
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: హాట్ స్పాట్లను రోజుకు మూడు, నాలుగు సార్లు సందర్శించి, మరింత నిఘా పెంచాలని సీపీ అనురాధ తెలిపారు. షీ టీమ్, భరోసా సెంటర్ సిబ్బందితో సీపీ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షీ టీమ్.. మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలన్నారు. సంబంధిత ఏసీపీలు వారానికి ఒకరోజు షీటీమ్ కార్యక్రమాలపై మానిటర్ చేయాలన్నారు. సమావేశంలో మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ములుగు(గజ్వేల్): ఫర్టిలైజర్ దుకాణ యజమానులు యూరియాను పక్కదారి పట్టించి, కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. వంటిమామిడిలోగల పలు ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా బ్యాగ్లను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. నకిలీ మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఫొటో తీసి ఆన్లైన్లో పొందుపరిచి, లబ్ధిదారులకు వేగంగా చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. వేగంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇంకా ప్రారంభించని చోట త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అధికారులు నగేశ్, స్వామి, తదితర అధికారులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): మంత్రి వివేక్ను పీసీసీ సభ్యుడు, భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం నగరంలో మంగళవారం కలిసినట్లు పార్టీ నాయకుడు రవితేజ తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దరిపల్లి చంద్రం కోరినట్లు తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లు ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్ను అందించాలని విన్నవించినట్లు తెలిపారు. కార్మికుల పిల్లలకు విద్యలో స్కాలర్షిప్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.10 లక్షలు, సాధారణ మరణమైతే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగిన కార్మికులకు రూ. 3 లక్షలను ఇవ్వాలని మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్ను దరిపల్లి చంద్రం కోరారన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెలిమిల రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నట్లు తెలిపారు. -
అనంతగిరిపల్లి కుంటకు గండి
యుద్ధప్రాతిపదికన పూడ్చివేత వర్గల్(గజ్వేల్): కుండపోత వానతో అతలాకుతలమైన వర్గల్ మండలంలో వరద ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతగిరిపల్లిలోని కిష్టమ్మ కుంటకు భారీ గండి పడింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులతోపాటు ఎంపీడీఓ మచ్చేందర్, ఆర్ఐ రాజు, ఇరిగేషన్ ఏఈ అలీ, అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నీటి వృథాకు అడ్డుకట్ట పడేలా జేసీబీ యంత్రాలతో యుద్ధప్రాతిప్రదికన మరమ్మతులు చేపట్టారు. గండి పూడ్చివేశారు. కాగా వర్గల్ మండలంలో మంగళవారం 3.18 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఇంకా పొలాల్లో వరద వీడలేదు. -
ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిద్దాం
● పరిశోధనలు విస్తృతంగా సాగాలి ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ములుగు(గజ్వేల్): ‘ఉద్యాన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం పరిశోధనలపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి. తద్వార ఇతర రాష్ట్రాలపై ఆధార పడటం తగ్గించాలి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మంగళవారం ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కలెక్టర్ హైమావతి, వర్సిటీ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు రఘునందన్రావు, రైతు సంక్షేమ కమిషన్ బోర్డు సభ్యురాలు భవానీరెడ్డిలతో కలసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్మించిన సెంట్రల్ డైనింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, ఉద్యాన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు స్వయాన పొలాల్లోకి వెళ్లి రైతుల పని విధానాన్ని పరిశీలించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్నిరంగాల కంటే వ్యవసాయ రంగానికే అధిక ప్రాముఖ్యత ఉంటుందని మంత్రి తెలిపారు. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చినా దేశ ప్రజలను బతికించగలిగే ఏకై క రంగం వ్యవసాయమన్నారు. ఉద్యాన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా క్షేత్ర అనుభవాన్ని పొందాలని, రైతులతో చురుకుగా సంభాషించి సాంకేతిక మార్గ దర్శకం అందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, విజయమోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
గంటలు
సంచులు..82 యూరియా కోసం రైతన్న పాట్లు కౌంటర్ వద్ద తొక్కిసలాటదుబ్బాకటౌన్: రైతులు యూరియా సమస్యతో సతమతమవుతున్నారు. సరిపడా యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. యూరియా వచ్చిందని తెలియగానే పరుగులు పెట్టడం.. పెద్ద క్యూ కట్టి గంటల తరబడి నిరీక్షించినా.. చివరకు సంచి బస్తా దొరుకుతుందో లేదో అన్న ఆందోళన వారిని పట్టిపీడిస్తోంది. ఇది కొంతకాలంగా రైతన్నకు కునుకులేకుండా చేస్తోంది. యువకులు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వానను సైతం లెక్క చేయకుండా సోమవారం దుబ్బాక పీఏసీఎస్సీకి యూరియా వచ్చిందని తెలియగానే తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచి క్యూ లైన్ కట్టారు. రెండు సంచుల యూరియా కోసం ఏకంగా ఎనిమిది గంటల నిరీక్షణ తప్పడం లేదంటూ రైతన్నలు వాపోతున్నారు. ఏఓతో రైతుల వాగ్వాదం వేకువ జాము నుంచి యూరియా కోసం వేచి చూసినా దొరకకపోవడంతో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్తో రైతులు వాగ్వాదానికి దిగారు. ఏఓ వ్యవహరించే తీరుతోనే తమకు యూరియా దక్కడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఏఓ కనుసైగల్లోనే యూరియా పక్కదారి పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఎస్ఐ కీర్తిరాజు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. వేల మంది రైతుల క్యూ లైన్ దుబ్బాకకు యూరియా వచ్చిందనే తెలియగానే మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు ఉదయాన్నే వచ్చి క్యూలైన్ కట్టారు. వచ్చిన 560 యూరియా బస్తాల కోసం రెండు వేల మందికి పైగా లైన్ కట్టడం విశేషం. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో.. గంటల తరబడి నిరీక్షించినా దొరకని వైనం కొంతమందికి ఇచ్చి మమ అంటున్న అధికారులు -
రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కొమురవెల్లి(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): కొమురవెల్లి మండలంలో పలు చెరువులు నిండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మండలంలోని పోసాన్పల్లి గుండ్ల చెరువుతోపాటు పలు చెరువులను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండలంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చేబర్తి నుండి పాతూరు వెళ్లే రోడ్డును అదనపు కలెక్టర్ పరిశీలించారు. వరద ఉధృతి ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వరద తగ్గిన వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రంలో తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈ శ్రీధర్, ఏఈ అభిలాష్, రైతులు పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన పులికాశీ వంశీకృష్ణ రాష్ట్ర కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యారు. సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. క్రీడలకు పుట్టినిల్లుగా చౌటపల్లి గ్రామంలో అనేక మంది వివిధ క్రీడల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ క్రీడాకారుడు గంగాధరి మల్లేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షు డు జంగపల్లి అయిలయ్య, యూత్ నాయకులు చుంచు రాకేష్, పులికాశీ రమేష్ పాల్గొన్నారు. తొగుట(దుబ్బాక): కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్రావు తెలిపారు. మండలంలోని కూడవెల్లి వాగుతో పాటు గ్రామాల్లో చెరువులను సోమవారం పరిశీలించారు. చేపలు పట్టేవారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండలంలో 142 చెరువులు, కుంటలు ఉన్నాయని అందులో 29 ఇప్పటికే నిండి అలుగు పారుతున్నాయని చెప్పారు. వర్షం కురుస్తుండటంతో వరద పెరిగి వాగులోకి నీరు ప్రవహిస్తుందన్నారు. రైతులు, గొర్లకాపరులు వాగులోకి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈ అస్మజబీన్, సిబ్బంది పాల్గొన్నారు. హుస్నాబాద్: బోధన సామగ్రితో విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల ప్రతి అంశం సులువుగా అర్థమవుతుందని ఎంఈఓ బండారి మనీల అన్నారు. మండల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మండల స్థాయి టీఎల్ఎం (టీచింగ్, లర్నింగ్, మెటీరియల్) మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ ఎగ్జిబిట్లను ప్రదర్శించారని తెలిపారు. 52 మంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా ఎగ్జిబిట్లను తయారు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించారన్నారు. ఇందులో పది ఎగ్జిబిట్లను ఎంపిక చేసి జిల్లా టీఎల్ఎం మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. -
గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల గోల
● రెండు వర్గాలుగా చీలిన వైనం ● పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు గజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల గోల తారాస్థాయికి చేరుకున్నది. ఈనెల 3వ తేదీన పట్టణంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని కొండపాకకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు.. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈనెల 15న సిద్దిపేటలోనూ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం గజ్వేల్ కాంగ్రెస్ నర్సారెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేక వర్గీయులుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆదివారం విజయ్కుమార్ సహా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణకు పార్టీ అధిష్టానం ప్రత్యేక కమిటీని నియమిస్తునట్లు వార్తలొచ్చాయి. తాజాగా సోమవారం విజయకుమార్పై నర్సారెడ్డితోపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమోహన్ తదితరులు హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. గత గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం పనిచేశారని, ఎంపీ ఎన్నికల్లో రఘునందన్రావుకు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల్లోనూ విజయ్కుమార్ పాల్గొనలేదని తెలిపారు. అలాగే.. భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మొత్తానికి రెండు వర్గాల ఫిర్యాదుల పర్వం ప్రస్తుతం హాట్టాపిక్ మారింది. గ్రూపుల కట్టడికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. -
కుమ్మేసిన
వర్గల్(గజ్వేల్): భారీ వర్షం అతలాకుతులం చేసింది. మున్నెన్నడులేని అతిభారీ వర్షంతో హల్దీవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడికి ఖాన్చెరువు ఉప్పొంగింది. నాచగిరి వద్ద హరిద్రనది పొంగిపొర్లింది. రోడ్లపై రాకపోకలకు స్తంభించిపోయాయి. చందాపూర్ వద్ద రోడ్డు మీదుగా వరద ఉధృతితో గ్రామానికి వెళ్లే దారి మూతపడింది. వర్గల్ మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షంతో పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపించాయి. వర్గల్ మండలం గౌరారంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండల వ్యాప్తంగా 22.8 సెంటీమీటర్ల వర్షం పడగా.. మొక్కజొన్న, పత్తి, వరి పైర్లు వరదనీటిలో మునకేశాయి. అంబర్పేట–శాకారం రోడ్డుపై భారీగా ఖాన్చెరువు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒక వాహనం నీటి మధ్యలో నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లు, జేసీబీలతో గట్టెక్కించారు. పోలీసులు రాకపోకలను నిలిపేశారు. చందాపూర్–బొర్రగూడెం మార్గంలో లోలెవెల్ కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చందాపూర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గౌరారంలో పలువురి ఇళ్లలో నీరు చేరడంతో ఇబ్బందిపడ్డారు. రాజీవ్రహదారిపైకి వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. కాగా మండలంలో 2,945 ఎకరాల్లో వరి, 237 ఎకరాల పత్తి, 81 ఎకరాల్లో మొక్కజొన్న, 129 ఎకరాలలో కూరగాయ తోటలు నీటిలో మునిగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఏఓ శేషశయన తెలిపారు. వర్షంలోనే కలెక్టర్ పర్యటన వర్గల్ మండలంలో వర్ష తీవ్రత, పంటల స్థితిగతి, జలాశయాలు, రవాణాపరమైన ఇబ్బందులు పరిశీలించేందుకు సోమవారం కలెక్టర్ హైమావతి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళతో కలిసి పర్యటించారు. వర్షం లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు ఎక్కడికక్కడ దిశానిర్దేశం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంబర్పేట ఖాన్చెరువు, వేలూరు రంగం చెరువు, సీతారాంపల్లి తదితర ప్రాంతాలు పర్యటించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ యూరియా, ఎరువల లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం సరాఫరా చేస్తున్న యూరియాను సరిగ్గా చేర్చేందుకు కావాల్సిన ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన యూరియాను త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతిభారీ వర్షం.. రాష్ట్రంలోనే అత్యధికం గౌరారంలో 23.6 సెం.మీ వర్షపాతం నమోదు మునిగిన పంటలు.. ఉప్పొంగిన వాగులు, చెరువులు ముంపు పొలాలు, రోడ్లను పరిశీలించిన కలెక్టర్ నేడు పాఠశాలల బంద్సిద్దిపేటరూరల్: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వర్గల్, మర్కుక్, జగదేవపూర్, గజ్వేల్, కుకునూరుపల్లి, కొమురవెల్లి, మిరుదొడ్డి మండలాల్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించదని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి అవసరానికై నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08457–230000 ను సంప్రదించాలని ఆమె కోరారు. -
అప్రమత్తంగా ఉండండి
సీపీ అనురాధ మిరుదొడ్డి(దుబ్బాక): అకాల వర్షాల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. మండల పరిధిలోని అల్వాల శివారులోని కూడవెల్లి లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదను సోమవారం ఆమె పరిశీలించారు. వాగుకిరువైపులా దారులను మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వాగులను ఎవ రూ దాటే ప్రయత్నం చేయవద్దని సీపీ అన్నారు. ఆమె వెంట సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, దుబ్బాక సీఐ రవీందర్రెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ పోలీస్ అధికారులను ఆదేశించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
గుబులే..
చీకటి పడితే● పట్టణాల్లో అంతంత మాత్రంగానే గస్తీ ● సొత్తు రికవరీ అంతంతే.. ● ఈ ఏడాది ఇప్పటి వరకు 228 చోరీలు సంవత్సరం కేసులు నష్టం రికవరీ (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) 2023 680 2.78 1.80 (65శాతం) 2024 6671.94 1.30 (67శాతం) 2025 228 రూ. 78లక్షలు రూ. 53లక్షలు (68 శాతం) ఇప్పటి వరకుచీకటి పడితే చాలు.. ఎవరి ఇంటికి కన్నం వేస్తారో.. ఎవరి ఇంటిలో దొంగతనం జరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. దొంగల ముఠాలు తాళాలు వేసిన ఇళ్లను, వ్యాపార సముదాయాలను టార్గెట్ పెట్టుకుని అందినకాడికి దోచేస్తున్నారు. పట్టణాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల్లో గల ట్రాన్స్ఫార్మర్లను సైతం ధ్వంసం చేసి కాపర్ వైర్లను, ఆయిల్ను అపహరిస్తున్నారు. కేసులను ఛేదించడంతో పాటు చోరీలను నియంత్రించడంలో పోలీసులు వెనుకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రధాన కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో పోలీసుల నిఘా లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణాల్లో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనం సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ సెంటర్లో చోరీలే. దీంతో పట్టణంలో ఎంత పకడ్బందీగా పెట్రోలింగ్ ఉందో అర్థమవుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లు, వీధుల్లో మాత్రమే రాత్రి 11 గంటల వరకు గస్తీ నిర్వహిస్తూ తర్వాత మిన్నకుండిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గస్తీని పెంచి దొంగతనాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. రికవరీ అరకొరే.. జిల్లాలో అపహరణకు గురైన సొత్తు రికవరీ అంతంతమాత్రంగానే ఉంది. గత మూడేళ్లుగా 70శాతంలోపే రికవరీ ఉంది. పోయిన సొత్తు కోసం పలువురు ఫిర్యాదు దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోయిన సొత్తు వస్తుందా లేదా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫిర్యాదు దారులు తిరుగుతున్నారు. చోరీ ఘటనలు ● సిద్దిపేట పట్టణం వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సోమవారం అర్ధరాత్రి రెండు మెడికల్ షాప్లలో దొంగలు పడ్డారు. విక్టరీ చౌరస్తా సమీపంలోని మెడికల్ షాప్లో రూ.1,500 నగదు పోగా, బీజేఆర్ చౌరస్తాలోని మెడికల్ షాప్లో ఏమీ పోలేదు. ● గజ్వేల్ పట్టణంలో ఒకే రోజు జూలై 26న అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దాదాపు 20 గ్రామాలు బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ● ఈ నెల 11న జగదేవ్పూర్ మండలం నిర్మల్నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.5లక్షల నగదు, 12 తులాల వెండి గోలుసులు, అర తులం బంగారు రింగులు దోచుకెళ్లారు. కర్రె మాధవి భర్త రెండేళ్ల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు. కాగా రైతు బీమా ద్వారా రూ.5లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు బంధువులకు అప్పుగా ఇవ్వగా ఇటీవల తిరిగిచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా తల్లిగారి ఇంటికి వెళ్లారు. తాళం పగలగొట్టి ఉండటంతో స్థానికులు మాధవికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చి చూసేసరికి నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరణకుగురైనట్లు గుర్తించారు. ● మే 15న పట్టపగలే బాలాజీనగర్లో రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. మూడు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు. -
పరమాత్ముని సేవలోనే తృప్తి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలే ఉంటాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ సుందర సత్సంగంలో కొనసాగుతున్న కృష్ణాష్టమి వేడకల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పరమాత్ముని సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదన్నారు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దుఖం ఉండదని, బాధలు తొలగుతాయన్నారు. కృష్ణుని దీవెనలతో అందరికీ మంచే జరుగాలని, ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల సిద్దిపేటజోన్: హరిత సిద్దిపేట దిశగా అందరం అడుగేద్దామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల సూచించారు. ఆదివారం స్థానిక 24 వార్డులో స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వాటిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్ల ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు. వార్డు మహిళలు పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాంసిద్దిపేటరూరల్: యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని రూరల్ సీఐ శ్రీను సూచించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదామన్నారు. ఆదివారం యాంటీ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మండల పరిధిలోని రాఘవాపూర్ , నారాయణరావుపేట మండల కేంద్రాల్లోని యువతకు నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువతరాన్ని డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడంతో పాటు ఆటలు, మన సంస్కృతి వైపు మళ్లించేందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే డయల్ 100 , టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రాజేష్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డి దిష్టి బొమ్మ దహనం కొండపాక(గజ్వేల్): డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు ఆదివారం దహనం చేశారు. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్ రోడ్డు వరకు దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసువచ్చి దహనం చేస్తూ నర్సారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏర్పుల మల్లేశం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నర్సారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే యూరియా కొరత సృష్టించారన్నారు. రైతుల ఇబ్బందులను చూస్తున్న బీజేపీ ఎంపీలు యూరియా ఎందుకు తేవడంలేదని విమర్శించారు. వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. -
అప్రమత్తంగా ఉండాలి
● అఽధికారులకు కలెక్టర్ హైమావతి సూచన ● లో లెవల్ బ్రిడ్జిల సందర్శన చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని సికింద్లాపూర్లో లో లెవల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉన్నాయన్నారు. వర్షాల కురుస్తున్నందున పొంగిపొర్లుతున్న వాగులు, కుంటలు, చెరువులు, కల్వర్టుల ప్రాంతాల వద్ద ప్రజలు వెళ్లకూడదని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. లోలెవల్ వంతెనల వద్ద జాగ్రత్త.. కోహెడరూరల్(హుస్నాబాద్): వర్షాకాలంలో లో లెవల్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గుండారెడ్డిపల్లిలోని లో లెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహాన్ని ఆర్అండ్బీ వెంకటేశ్తో కలిసి పరిశీలించారు. అలాగే తంగళ్లపల్లిలోని పిల్లి వాగు లోలెవల్ వంతెనను పరిశీలించారు. మోయతుమ్మెద వాగు పరిశీలన నంగనూర్(సిద్దిపేట): కలెక్టర్ హైమావతి ఆదివారం నంగనూరు మండలం ఆక్కేనపల్లి వద్ద మోయతుమ్మెద వాగును పరిశీలించారు. అలాగే లోలెవల్ బ్రిడ్జి, బద్దిపడగ ఊర చెరువు, మత్తడి కింద రోడ్డును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి వాగు మీదగా రాకపోకలు లేకుండా చూడాలని సూచించారు. -
మూణ్నాళ్లకే పగుళ్లు
● గోడల నుంచి లీకవుతున్న వర్షం నీరు ● నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ● రూ.17 కోట్లు వెచ్చించినా నిష్ఫలమే.. దుబ్బాకటౌన్: పట్టణంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయ భవనం (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్.. ఐఓసీ)లో మూణ్నాళ్లకే పగుళ్లు ఏర్పడ్డాయి. నాణ్యత లోపించి పెచ్చులూడుతోంది. 2023 అక్టోబర్ నెలలో నాటి ఆర్థిక మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.17కోట్లు వెచ్చించారు. ప్రారంభించిన రెండేళ్లకే పగుళ్లు, పెచ్చులూడుతుండటంతో అందులో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సైతం జంకుతున్నారు. భవన నిర్మాణం వేళ అధికారుల పర్యవేక్షణ కొరవడటంవల్లే నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి పట్టుబట్టి నాటి సీఎం కేసీఆర్తో ఐఓసీ భవన నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింద రూ.17 కోట్లు మంజూరు చేయించారు. ఐఓసీ భవాన నిర్మాణనికి 2018లో శంకుస్థాపన చేయగా పనులు నత్తనడకన సాగుతూ..వచ్చి ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2023లో అక్టోబర్ నెలలో భవనాన్ని ప్రారంభించారు. పునాదులకే రూ.6 కోట్లకు పైగా.. పట్టణంలోని రామసముద్రం వెనుకాల 2018లో 4 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ స్థలం పూర్తిగా చెరువు వెనుకాల ఉండడం, జాలు భూమి కావడంతో కేవలం పునాదులకే రూ.6 కోట్ల నిధులు ఖర్చయ్యాయని అధికారులు చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు సైతం పలుమార్లు భవన నిర్మాణ పనులు పరిశీలించి నత్తనడకన సాగుతున్న పనులను వేగిరం చేయించి రూ.15 కోట్లతో కింది అంతస్తును పూర్తి చేయించారు. ప్రస్తుతం 3 శాఖలు ఐఓసీలో ప్రస్తుతం తహసీల్దార్, అటవీ శాఖ, పీఆర్ ఏఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వివిధ సమస్యలపై, రిజిస్ట్రేషన్లకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కార్యాలయానికి లోపలికే వెళ్లు దారిలో భవనం పెచ్చులూడి వర్షం పడితే నీళ్లు వచ్చి గోడలు తేమ వస్తున్నాయి. బయటే కాకుండా తహసీల్దార్ కార్యాలయం లోపల పలు గదులు బీటలు వారి పగుళ్లు వచ్చాయి. అలాగే అటవీ శాఖ కార్యాలయంలో సైతం బీటలు రావడంతో నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపించిన నాణ్యత కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించ పోవడంతో పిల్లర్లు, గోడలు బీటలు వారి వర్షానికి నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.17 కోట్లతో మొదటి అంతస్తు మాత్రమే నిర్మిస్తే గోడల పెచ్చులూడడంమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా అధికారులు సదరు కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లిస్తారని ఆరోపిస్తున్నారు. భవనంలో విద్యుత్ సౌకర్యాలు సైతం సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. మరమ్మతులు చేయిస్తాం ఇటీవల నీరు లీకై న ప్రదేశాలను పరిశీలించాం. సదరు కాంట్రాక్టర్ మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం. – మహ్మద్ రిజ్వాన్, ఏఈఈ పీఆర్, దుబ్బాక -
వ్రత వైభవం.. భక్తజన సందోహం
సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం శ్రావణ శోభను సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సత్యదేవుని వ్రతాలు, కల్యాణాలు, అభిషేకాది మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో వ్రతాది మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నది. – వర్గల్(గజ్వేల్) -
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకం
మిరుదొడ్డి(దుబ్బాక): నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్ద చెప్యాలలో గ్రామానికి చెందిన నరేశ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా ముందస్తు చర్యలు చేపట్టవచ్చన్నారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో క్రైమ్ రేట్లు తగ్గుతాయన్నారు. -
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. మట్టి కుండలో మల్లన్నకు బెల్లంపాయసం నివేదించారు. పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కాగా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించే కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ప్రారంభించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
జోరు తగ్గని మంజీరా
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు తగ్గలేదు. సింగూరు నీరు పోటెత్తుతుండటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తుతూ మంజీరా పరవళ్లు తొక్కుతుంది. మూడో రోజు శనివారం కూడా రాజగోపురంలోనే దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. వరుస వర్షాలతో ఎగువ నుంచి సింగూరులోకి 31,400 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 43,300 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలకళను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. -
డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు
సిద్దిపేటఅర్బన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల ఇన్చార్జి మంత్రి పర్యటనలో భాగంగా గజ్వేల్లో నర్సారెడ్డి.. సొంత పార్టీ ఎస్సీసెల్ నాయకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సెల్ నాయకులు నర్సారెడ్డి తీరుపై నిరసన తెలుపుతున్నారు. పంద్రాగస్టు రోజు సిద్దిపేట డీసీసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణకు వచ్చిన నర్సారెడ్డికి మరోసారి నిరసన ఎదురైంది. జెండా ఆవిష్కరణ ముగించుకుని తిరిగి వెళ్తున్న సందర్భంలో జిల్లా అధ్యక్షుడి వాహనం ఎదుట పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంలో పార్టీకి చెందిన దళిత మహిళను కులం పేరుతో దూషించాడని ఆమె సిద్దిపేట త్రీ టౌన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనను అడ్డుకున్నారని నర్సారెడ్డి కౌంటర్ ఫిర్యాదు ఇవ్వడంతో నలుగురిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. -
మైనంపల్లి దిష్టి బొమ్మ దహనం
కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట క్రాస్రోడ్డులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టి బొమ్మను దహనం చేశారు. హన్మంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై 20 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బాబు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను పెంచుతున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై లేనిపోని అంతరాలు సృష్టించి గొడవలకు మైనంపల్లి కారణమవుతున్నారంటూ ఆరోపించారు. కులాల పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. చిల్లర రాజీకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ప్రతి పక్ష పార్టీల నేతలు సొంత పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో అండగా ఉండాల్సిన మైనంపల్లి ఇలా వ్యవహరించడమేమిటన్నారు. మైనంపల్లి ప్రవర్తనలో మార్పు రావాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజశేఖర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా కాంగ్రెస్ మార్పు?
నంగునూరు(సిద్దిపేట): పదేళ్లుగా కనబడని రైతుల క్యూలైన్లు మళ్లీ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నాయని, ఇదేనా కాంగ్రెస్ మార్పు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం పాలమాకుల పీఏసీఎస్ను సందర్శించి ఎరువుల కోరతపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను వివరించారు. పొద్దంతా నిలబడినా ఒకటి, రెండు బస్తాలే ఇసున్నారని అన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే సాగు విస్తీర్ణం తగ్గినా ఎరువుల కొరత ఎందుకు ఉందో చెప్పాలన్నారు. సబ్సిడీలను ఎత్తివేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాసిద్దిపేటజోన్: చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం ఇందిరానగర్ పద్మశాలి సమాజ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన స్థలంలో సొంత నిధులతో భవనం నిర్మాణం సంతోషంగా ఉందన్నారు. భవనం చుట్టూ మంచి ప్రహరీ నిర్మాణానికి తన సహకారం ఉంటుందన్నారు. పట్టణంలో చేనేత మగ్గం విగ్రహాన్ని ఏర్పాటుకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తానన్నారు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట అభివృద్ధిలో పరుగులు పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పిడికెడు మట్టి తీయలేదని, అంగుళం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతుల క్యూలైన్లు, కాలిన మోటార్లు మళ్లీ దర్శనం ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా -
యూరియా కోసం అరిగోస
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం పొద్దు పొడవక ముందే యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీఏసీఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలో ఒక్కో రైతు ఆధార్పై రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ పంపిణీ చేశారు. దీంతో కొందరికి అర కొరగా యూరియా బస్తాలు లభించగా చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో నిరాశగా వెనుదిగిరిగి వెళ్ళిపోయారు. యూరియా కొరత ఏర్పడుతుండటంతో ప్రభుత్వంతో పాటు, అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళన యూరియా కొరత ఏర్పడటంతో రైతులు చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చే స్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు, పోలీసులు ఆందోళన వద్ధకు చేరుకుని సకాలంలో యూరియా పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు అందోళన విరమించారు. ఆందోళనకు దిగిన రైతులకు ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే తొగుట(దుబ్బాక): రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని వెంకట్రావుపేటలో యూరియా కోసం శుక్రవారం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడి యూరియా కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా అందక పోతే పంటల దిగుబడి ఎలా వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు లేక పోవడం సిగ్గుచేటన్నారు.చెప్యాల చౌరస్తా వద్ద రైతుల ఆందోళన -
సమాజాభివృద్ధికి పాటుపడాలి
వేడుకల్లో అధికారుల డ్యాన్సులుసిద్దిపేటరూరల్: స్వాతంత్య్రాన్ని సాధించేందుకు ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రాన్ని సాధించందేకు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. త్యాగదనుల ఆశయాలకు అనుగుణంగా దేశ సేవలో మనందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.చేర్యాల(సిద్దిపేట): స్వాతంత్య్ర దినోత్సవం వేళ అధికారులు డ్యాన్సులు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వేడుకలు ముగిసిన అనంతరం సినిమా పాటలకు పురుష, మహిళాధికారులు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఓ అధికారి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గౌరవప్రదంగా నిర్వహించుకునే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారులు చిందులు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ -
త్యాగధనుల పుణ్యఫలం
ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్ సిద్దిపేటకమాన్: ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించిందని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవిందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్, టాస్క్ఫోర్స్ ఏసీపీ రవిందర్, సీఐలు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లో విష జ్వరాలు జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం క్రితం ఓ యువకుడికి డెంగీ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదారు రోజులుగా వర్షాలు కురవడంతో గ్రామంలో చాలా మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ బురదమాయంగా మారాయి. వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లకు ఇరు వైపులా అండర్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలుస్తోందన్నారు. గ్రామంలో సుమారు పది మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొంతమంది గజ్వేల్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎక్కువగా చిన్నారులు జ్వరాలు బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. వైద్య సిబ్బంది ఇటువైపు దృష్టి సారించడంలేదని, మురికి కాల్వల వెంట, మురుగు గుంతల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సంక్షేమమే ధ్యేయం
సాక్షి, సిద్దిపేట: ప్రజా పాలనలలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జరిగిన 79వ పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతామన్నారు. ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం.. ప్రజా ప్రభుత్వంలో పేదలందరూ తింటున్నారన్నారు. జిల్లాలో కొత్తగా 35,681 రేషన్ కార్డులు మంజూరు చేసి 1.10లక్షల మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,633 ఇళ్లు మంజూరు కాగా 6,509 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరిన్ని త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఉచిత ప్రయాణంతో రూ.527 కోట్ల లబ్ధి జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద రూ. 527 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లోనే రూ.355కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2025–26 వానాకాలంలో రూ.2.22కోట్ల సబ్సిడీతో 3,110 క్వింటాళ్ల జనుము విత్తనాలు, రూ 4.56కోట్లతో 727 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందించినట్లు తెలిపారు. గృహజ్యోతితో నెలకు రూ.7.22కోట్ల లబ్ధి గృహజ్యోతి పథకం ద్వారా 2,00,981 వినియోగదారులకు నెలకు రూ 7.22కోట్ల మేర లబ్ధి కలిగిందని మంత్రి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్లో జీపీ, అంగన్ వాడీ భవనాల నిర్మాణాలు జరగనున్నాయన్నారు. 2025– 26లో 14,909 మహిళా సంఘాలకు రూ.886కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,077 సంఘాలకు రూ.260కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించామని తెలిపారు. గౌరవెల్లి ప్రధాన కాలువల పనులు 55శాతం పూర్తయ్యాన్నారు. త్వరలో హుస్నాబాద్కు కబడ్డీ అకాడమీని తీసుకవస్తామన్నారు. పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సెట్విన్ ద్వారా నిరుద్యోగ మహి ళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాంలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 20 ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ 2.61కోట్లును మంజూరు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా.. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేయడానికి కృషి జరుగుతోందన్నారు. వన మహోత్సవం 22.47లక్షల మొక్కలు టార్గెట్ కాగా ఇప్పటి వరకు 18.80లక్షల మొక్కలను నాటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.అభివృద్ధే లక్ష్యం జిల్లాలో కొత్తగా 35వేల రేషన్ కార్డులు పేదలందరికీ సన్న బియ్యం సొంతింటి కల సాకారం త్వరలో హుస్నాబాద్కు కబడ్డీ అకాడమి పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ -
జేఏసీ బైక్ ర్యాలీ
చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ చేర్యాలలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఎనిమిదేళ్లుగా అనేక రకాల పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించడంలేదన్నారు. ఈక్రమంలోనే ఈ నెల 25న అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామనారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట, చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపూరి, శబాష్ గూడెం గ్రామాల్లో బైక్ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు ఇంటింటికి జాతీయ రహదారి ముట్టడి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బాల్నర్సయ్య, మల్లారెడ్డి, సంజీవులు, నారాయణరెడ్డి, రాజేందర్, నాగేశ్వర్రావు, కరుణాకర్, వెంకట్మావో, తిరుపతిరెడ్డి, మల్లేశం, ఎల్లారెడ్డి, సత్తిరెడ్డి, గురువయ్యగౌడ్, సంతోష్, కిషన్, సిద్దప్ప, పాండు, కొండయ్య, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, టీఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తీజ్.. జోష్
జిల్లా కేంద్రంలో గురువారం తీజ్ సంబురం అంబరాన్నంటింది. గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన తీజ్ నిమజ్జన కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. మొదట భవానిదేవి, సంత్ సేవాలాల్ చిత్ర పటాల వద్ద తీజ్ (గోధుమ నారు)లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వేషధారణ, మన కట్టుబొట్టు, మన భాషే మన అస్థిత్వమన్నారు. ఎస్టీలకు అనేక ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మనం ఇతరులను గౌరవించడంతో పాటుగా మనం గౌవింపబడే విధంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి కోమటి చెరువులో తీజ్లను నిమజ్జనం చేశారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో దుబ్బాక: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. హబ్షీపూర్ చౌరస్తాలో గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఎల్కతుర్తి–మెదక్ జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కీర్తిరాజులు బలవంతంగా రైతులను అక్కడినుంచి పంపించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. రైతులు మాట్లాడుతూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరీక్షణ నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల పీఏసీఎస్కు గురువారం యూరియా వస్తోందని ప్రచారం జరగడంతో తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చాల సేపటి నుంచి నిరీక్షించిన యూరియా రావడం ఆలస్యం కావడంతో చెప్పులు క్యూలైన్లో పెట్టారు. యూరియా ఇవ్వడం ప్రారంభించగానే ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని రావడంతో గందరగోళం ఏర్పడింది. కొరత తీరేవరకు పోరాటం గజ్వేల్: యూరియా కొరత తీర్చేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేపట్టగా వారి ఆందోళనకు ప్రతాప్రెడ్డి మద్దతు పలికి బైఠాయించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. -
ఘనంగా తిరంగా ర్యాలీ
గజ్వేల్రూరల్: పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి బసవేశ్వర విగ్రహం వరకు 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి అండగా నిలుద్దామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రాంరెడ్డి, నందన్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదరికమే అతి పెద్ద సమస్య
దరిచేరని స్వేచ్ఛ, సమానత్వం ● అధికార యంత్రాంగం నీతిగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు ● ‘సాక్షి’ సర్వేలో ఉమ్మడి జిల్లా ప్రజల మనోగతంసాక్షి, నెట్వర్క్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పేదరికమే అతి పెద్ద సమస్య అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అర్హులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం ఎంత మందికి దరిచేరింది? స్వాతంత్య్ర ఫలాలు అందరికి దక్కాలంటే ఏ రంగం నీతి, నిజాయితీగా పనిచేయాలి? ఇలా మూడు ప్రధాన మైన అంశాలపై సర్వే చేపట్టింది. ఈ అంశాలపై సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 90 మంది అభిప్రాయాలను సేకరించింది. పేదరికం తర్వాత అతిపెద్ద సమస్య వైద్యమే అని సర్వేలో పేర్కొన్నారు. కుల వివక్ష కూడా ఎక్కువగానే ఉందని, అవినీతి కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని తేలింది. అందని స్వేచ్ఛ–సమానత్వం.. స్వేచ్ఛ – సమానత్వం ఇంకా ప్రజలందరికి చేరువకాలేదని సాక్షి చేపట్టిన సర్వేలో వ్యక్తమైంది. 60 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 28 శాతం మంది కొద్ది మందికే చేరువైందని చెప్పారు. 12 శాతం మంది అందరికీ స్వేచ్చ – సమానత్వం చేరువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అధికార యంత్రాంగం నీతి నిజాయితీగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయాన్ని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. చట్టసభలు, న్యాయస్థానాలు మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చాలా మంది చెప్పారు.ఈ సర్వే ఫలితాలు ఇలా..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వాతంత్య్ర ఫలాలుఅందరికీ దక్కాలంటేమరింత నీతి, నిజాయితీగాపనిచేయాల్సిన రంగం? స్వేచ్ఛ – సమానత్వం నిజంగానే అందరికీచేరుతోందా?మీడియా620చట్టసభలు4510అధికార యంత్రాంగంన్యాయ స్థానాలునాణ్యమైన విద్య -
కొలువులు రావాలి.. సంపద పెరగాలి
పేదరికం తగ్గాలి.. నాణ్యమైన విద్య అందించాలి ● స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలి ● పరిమిత రంగాలలోనే రిజర్వేషన్లు వర్తింపజేయాలి ● ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి ● ‘వందేళ్ల భారతం’పై విద్యార్థుల మనోభావాలు బానిస సంకెళ్లు తెంచుకొని పరాయి పాలన నుంచి విముక్తి పొందిన మన దేశం.. 78 ఏళ్లల్లో ఎంతో పురోగతి చెందింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందా? పరిపాలన ఎలా సాగుతోంది? ఇంకా ఎలా ఉండాలి? టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, నిరుద్యోగం వంటి అంశాలపై గురువారం పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను పంచుకున్నారు. సిద్దిపేటఅర్బన్ ఆర్థికంగా బలపడితేనే.. దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. చదువుకు తగిన ఉద్యోగాలు లేకపోవడంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందిస్తే ఆటోమేటిక్గా అన్ని రంగాలలో మెరుగవుతాం. ఆర్థికంగా బలపడితే పేదరికం తగ్గి దేశ సంపద పెరుగుతుంది. – సత్యనారాయణ, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి రాజకీయ పదవులకు అర్హత ఉండాలి ఏ ఉద్యోగానికి అయినా కనీస విద్యార్హత, నైపుణ్యాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. కానీ పరిపాలన అందించే వారికి, రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతలు లేకపోవడం వల్ల ఇంకా వెనకబడి పోతున్నాం. రాజకీయ పదవులకు కూడా కనీస అర్హతలు పెట్టాలి. ఉన్నత చదువులలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. దీని వల్ల మైగ్రేషన్ పెరిగి దేశాభివృద్ధికి సాయపడే వారు తగ్గిపోతున్నారు. –నవ్య, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థిని స్టడీస్లో అడ్వాన్స్ టెక్నాలజీని చేర్చాలి ప్రస్తుతం ఉన్న సిలబస్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీని సిలబస్లో చేర్చాలి. హెల్త్ కేర్ రంగాలలో ప్రైవేట్ వారిదే ఆధిపత్యంగా ఉంది. వైద్య రంగంలో ప్రభుత్వం ఆధిపత్యం సాధించాలి. ప్రకృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని విస్త్ర ృత పరచుకోవాలి. –సాయిప్రవర్షిణి, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థిని ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలి. ప్రభుత్వం ఇండస్ట్రీల ఏర్పాటుకు సబ్సిడీలు ఇచ్చి కంపెనీలు నెలకొల్పేలా చేయూత ఇవ్వాలి. మత ఘర్షణ లు ఆపి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి. అనవసరమైన వాటి కోసం ఉచితాలు ఇవ్వకుండా దేశాభివృద్ధికి దోహదపడే వాటికే ఉచితాలు ఇచ్చే విధంగా నాయకులు ఆలోచన చేయాలి. –ఖాజా హుస్సేన్, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి కొన్ని రంగాల వాటికే.. ప్రతి రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల క్వాలిటీ, కంటెంట్ ఉన్న వారు ప్రైవేట్ రంగంలో స్థిరపడిపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడిపోతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఉద్యోగాలలో ఇవ్వడం వల్ల దేశానికి నష్టం జరుగుతోంది. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీస్ పెరగాలి. ఉద్యోగాల కల్పన ఎక్కువ మొత్తంలో కల్పించే విధంగా మార్పు రావాలి. –అఖిల్, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి -
అత్యాధునిక బోధనే లక్ష్యం కావాలి
● ఇంజనీరింగ్ కళాశాల ఆదర్శంగా నిలవాలి ● ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ● మొదటి ఏడాది తరగతులు ప్రారంభం హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా బోధన అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో రాజీ పడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ శివారు కిషన్ నగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం హైదరాబాద్ నుంచి ఫోన్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హుస్నాబాద్ నాలుగు జిల్లాల పరిధిలో ఉందని, ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాల స్ధాపనకు తనతో పాటు కలెక్టర్, వైస్ చాన్స్లర్ ఎంతో కృషి చేశారన్నారు. కళాశాలలో అధునాతనమైన వసతులు కల్పించడం నా బాధ్యత అన్నారు. కళాశాలలో అధ్యాపకులు, స్టాఫ్ నియామకంలో రాజకీయ జోక్యం లేకుండా అంతా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కే అప్పగించామన్నారు. కళాశాల నిర్మాణం కోసం 35 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అకాడమిక్ విద్యా ప్రమాణాలతో ఇతర కళాశాలతో పోటీ పడి చదువు చెప్పాలని అద్యాపకులకు సూచించారు. మొదటి బ్యాచ్ విద్యార్ధులే ఈ కళాశాలకు అంబాసిడర్లు అని మంత్రి అన్నారు. ఆధునిక వసతులు కల్పిస్తాం: కలెక్టర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆధునిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా పరిపాలన తరపున అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే హుస్నాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాల కోసం స్థలం పరిశీలించాలని మంత్రి కోరారని తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలి విద్యార్థులు ఇష్టపడి చదివి రాష్ట్రంలోనే నంబర్ వన్ కళాశాలగా పేరు తేవాలని వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ప్రాక్టికల్ గదులు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునికమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులు జాబ్తోపాటే బయటకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
యాంటీ డ్రగ్స్ వారియర్లుగా కదలాలి ● మాదక ద్రవ్యాలను అరికట్టాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు హుస్నాబాద్: ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నాషాయుక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే ప్రాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు. భవిష్యత్తు ముఖ్యమని, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆచూకి తెలిస్తే తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సీపీ అనురాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎంఈఓ బండారి మనీల, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.చేర్యాల(సిద్దిపేట): ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం ముస్త్యాల పీహెచ్సీ, మోడల్ స్కూల్ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఓపి రిజిస్టర్ చూసిన ఆమె ఎక్కువ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఎంత మంది వస్తున్నారు? అనే విషయాలను ఆరా తీశారు. అలాగే మందులు అందుబాటులో ఉన్నాయా, సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ను సందర్శించారు. స్కూల్ వాతావరణం చాలా బాగుందన్నారు. ప్రణాళిక ప్రకారం సెలబస్ పూర్తి చేయాలని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ దిలీప్నాయక్, ఆర్ఐ తదితరులు ఉన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్ హైమావతి -
సమాజ శ్రేయస్సే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణం ప్రశాంత్నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సమాజ శ్రేయస్సుకు కలిసి కట్టుగా కృషి చేయాలని, ప్రశాంత్ నగర్ రెడ్డి సంఘం ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
గోస ఎన్నాళ్లు..
దుబ్బాక: యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించారు. బుధవారం పట్టణంలో రెండు షాపులకు కలిసి 500 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఆ దుకాణాల ఎదుట బారులు తీరారు. వేల సంఖ్యలో రైతులు వస్తే కేవలం కొద్దిమందికి మాత్రమే 2 బ్యాగుల చొప్పున పంపిణీ చేశారు. రోజు ఇలాగే లైన్లో నిల్చున్నా దొరకడం లేదంటూ చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం తిప్పలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ గోస పడాలని రైతులు ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సంచి దొరకలే.. ‘వారం నుంచి లైన్లో నిలబడుతున్నా.. ఒక్క సంచీ దొరకలేదు’ అని మహిళా రైతు లక్ష్మి వాపోయారు. నాట్లు వేసి నెల రోజులైందన్నారు. యూరియా దొరకకపోవడంతో పంట పరిస్థితి ఏందో అంటూ కన్నీరు పెట్టారు. త్వరగా అందేలా చూడాలంటూ వేడుకున్నారు. -
డ్రగ్స్, మత్తు పదార్థాలపై నిఘా
పోలీస్ కమిషనర్ అనురాధ చిన్నకోడూరు(సిద్దిపేట): గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మాచాపూర్లోని బయో మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో 21.017 కిలో గ్రామ్స్ గంజాయిని కాల్చి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక డాగ్స్తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మత్తు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీపీ అనురాధ పోలీసు అధికారులకు సూచించారు. పరేడ్ గ్రౌండ్లో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. -
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 27 వరకు ఆన్లైన్లో స్వీకరణ వర్గల్(గజ్వేల్): స్థానిక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి గడువు పొడిగించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 27 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఆదేశాలు జారీచేసింది. బుధవారంతో గడువుతేదీ ముగియాల్సి ఉండగా, పాలనాపరమైన కారణాలు, విద్యార్థుల సౌలభ్యం కోసం నవోదయ విద్యాలయ సమితి గడువు పొడిగించిందని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక సిద్దిపేటజోన్: స్కూల్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అండర్ 15 బాలబాలికల వాలీబాల్ జట్ల సభ్యులను ఎంపిక చేశారు. స్థానిక గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సెలెక్షన్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 150మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఎనిమిది మందిని బాలికల జట్టుకు, అదేవిధంగా మరో ఎనిమిది మందిని బాలుర జట్లకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 18,19 తేదీల్లో ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియ ఎస్జీఎఫ్ కార్యదర్శి సౌందర్య పర్యవేక్షించారు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా వెంకట్మావో చేర్యాల(సిద్దిపేట): రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ముస్త్యాల గ్రామానికి చెందిన కొంగరి వెంకట్మావో ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో చల్లారపు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెంకట్మావోను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్మావో మాట్లాడుతూ జిల్లాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దుండగులను శిక్షించాలి గజ్వేల్: పట్టణంలో భగత్సింగ్ విగ్రహ గద్దెను కూల్చేసిన దుండగులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విగ్రహ గద్దెను కూల్చేసిన ప్రదేశాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాంచంద్రం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ తదితరులు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్సింగ్ విగ్రహా ఏర్పాటుపై కుట్రలు సహించేదిలేదన్నారు. అనంతరం వారు ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్, టీపీటీఎఫ్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిట్టాపూర్లో విషజ్వరాలు.. దుబ్బాకరూరల్: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులు భూంపల్లి ప్రాథమిక ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో వారికి జ్వరం తగ్గక పోవడంతో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది గ్రామంలో జ్వర సర్వే నిర్వహించి, శానిటేషన్ చేశారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకు పోవడంతోనే విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేయడంలేదని అన్నారు. -
యూరియా.. నో స్టాక్
జిల్లాలో కొరత తీవ్రరూపం● పలుచోట్ల బారులు తీరిన రైతులు ● పొంతనలేని కేటాయింపులే కారణం గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 4.47లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 2.86లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. ఇంకా నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వరి సాగు 3లక్షలపైచిలుకు ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇకపోతే పత్తి 1.06లక్షల ఎకరాలు, మొక్కజొన్న 28502 ఎకరాలు, కంది మరో 6449ఎకరాల్లో సాగులోకి రాగా మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. వర్షపాతం సక్రమంగా లేక నానా ఇబ్బందులు పడుతూ రైతులు సాగు చేసుకుంటున్న క్రమంలో యూరియా కొరత శాపంగా పరిణమించింది. అరకొర కేటాయింపులే.. పొంతన కేటాయింపుల వల్లే యూరియా కొరత తీవ్రమవుతోంది. నిజానికి వానాకాలం సీజన్ ఆరంభం ఆగస్టు నెలాఖరు వరకు 31,939 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు సగం కేటాయింపులు మాత్రమే వచ్చాయి. దీంతో జిల్లాలో ఎక్కడా కూడా సరిపడా స్టాకు లేక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం చాలా చోట్ల వరినాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ముందుగా వేసిన వరి క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వరికి తప్పనిసరిగా యూరియా వేయాలి. యూరియా వాడకం పెరిగిన సమయంలో కొరత తలెత్తడం శాపంగా మారింది. ఈ క్రమంలోనే నో–స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. తాజాగా బుధవారం గజ్వేల్లోని సహకార కేంద్రం వద్ద అధికారులు నో–స్టాక్ బోర్డు వేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. జిల్లా రైతాంగానికి కంటికి కునుకులేకుండా చేస్తోంది. ఎక్కడ చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా చివరకు స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. తాజాగా బుధవారం ప్రధాన మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. నిల్వలు తక్కువే.. వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా దేశానికి రావాల్సిన యూరియా, ఇతర ఎరువులకు బ్రేక్ పడిందని చెబుతున్నారు. ఇకపోతే ప్రభుత్వానికి చెందిన ఆర్ఎఫ్సీఎల్(రామగుండం ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్, ఎన్ఎఫ్ఎల్ ఇతర కంపెనీల నుంచి యూరియా నిల్వలు తక్కువగా వస్తున్నాయి. దీనివల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం కష్టసాధ్యంగానే మారింది. రాబోవు రోజుల్లో కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.ఇబ్బందులు తీరుస్తాం యూరియా నిల్వలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే రైతుల ఇబ్బందులు తీరుస్తాం. సాధారణ యూరియా స్థానంలో నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలి. ఆ దిశగా రైతులు ఆలోచించాలి. – స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి -
ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయండి
● పనులు ముమ్మరంగా సాగాలి ● కలెక్టర్ హైమావతి ● ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం వ్యాధుల వేళ అప్రమత్తత అవసరండాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశాం సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై ఏంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్ మెంట్ లెవెల్ వరకు రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలని సూచించారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యాక ఇంజనీర్ అధికారులు సందర్శించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సుముఖంగా లేని వారితో లేటర్ తీసుకుని మరొక లబ్ధిదారునికి అందజేయాలన్నారు. రోజు గ్రామాలకు వెళ్లి పంచాయతీ కార్యదర్శి ల పనితీరును పర్యవేక్షించాలన్నారు. మండలాల్లో ఇసుక కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ లో సైతం ఇందిరమ్మ ఇళ్లు వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. జిల్లా కేంద్రంలోని నాసర్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరానగర్ బస్తీ దవాఖానను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లోని సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాలపై ఆరా తీశారు. సెంటర్కు వచ్చిన రోగులతో మాట్లాడారు. అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. రోజూ పది నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంగునూరు(సిద్దిపేట): డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశామని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, అవుట్ పేషంట్ రికార్డులను పరిశీలించారు. ఓపీ రిజిష్టర్ను వైద్యులు మాత్రమే రాయాలని, స్టాఫ్నర్సు రాస్తూ మందులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల వేళ ముందస్తు చర్యలు రాబోవు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మైనర్, మేజర్ రిజర్వాయర్లలో నీటీ నిల్వలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని మోయతుమ్మెద, హల్దీ వాగులు పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. పిడుగుపాటుకు గురై పశువులు మృతిచెందితే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. -
బోనస్ ఏమాయో?
ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు గడిచినా ఇంత వరకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదు. వానాకాలం సీజన్లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం పంటల సాగు పెట్టుబడి పెరిగింది. దీనికి తోడు ఎరువుల ధరలు పెరగడంతో తిప్పలు తప్పడంలేదు. బోనస్ త్వరగా చెల్లించి సహకరించాలని రైతులు కోరుతున్నారు.సాక్షి, సిద్దిపేట: యాసంగిలో 92,954 మంది రైతుల నుంచి 3,81,402 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు రూ. 884.53కోట్లను చెల్లించారు. వాటిలో 13,682.320 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉన్నాయి. యాసంగి నుంచి ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాల్కు రూ.500లు బోనస్ అందజేస్తోంది. 3,162 మంది రైతులకు రూ.6,84,11,600 బోనస్ చెల్లించాలి. సన్నరకం వైపు మొగ్గు చూపిన రైతులకు సకాలంలో బోనస్ డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.రైతులకు భారంఇప్పటికీ బోనస్ డబ్బులు రాకపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్ ఇస్తారా? ఇవ్వరా? అన్న సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మాట విని బోనస్కు ఆశపడి సన్నాలు సాగుచేస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, బోనస్ పైసలు ఆలస్యం కావడంతో వడ్డీల భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజుల్లోనే ధాన్యం పైసలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూడు నెలలైనా బోనస్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.ఆలస్యంతో వెనుకడుగు!ప్రభుత్వం బోనస్ వెంటనే చెల్లించకపోవడంతో రైతులు సన్నాల సాగుకు వెనుకంజ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో తప్పనిసరిగా సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కానీ బోనస్ చెల్లించడం ఆలస్యం అవుతుండటంతో ఈ సారి వానాకాలంలో పలువురు సన్నాల సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.బోనస్ జాడలేదుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు రాచబోయిన అంజగౌడ్, ఇతనిది వర్గల్ మండలం మైలారం గ్రామం. 1.5 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. 34 బస్తాల వడ్లు దిగుబడి వచ్చింది. జూనన్ 2న మైలారం కొనుగోలు కేంద్రంలో తూకం వేయగా 13.6 క్వింటాళ్లు ఉన్నట్లు తక్ పట్టి ఇచ్చారు. క్వింటాల్కు రూ.500 బోనస్ లెక్కన రూ.7వేలు రావాలి. రెండు నెలలు దాటినా రాలేదు. డబ్బులు వస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయని, వెంటనే చెల్లించాలని అంజగౌడ్ కోరుతున్నారు.ఎవరిని అడిగినా..యాసంగిలో 90 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో విక్రయించాను. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారని తెలిసి సన్నాలు సాగు చేశా. ఇప్పటికీ బోనస్ డబ్బులు రాలేదు. ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడంలేదు. బోనస్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. –నరేందర్, రాంనగర్, జగదేవ్ పూర్వివరాలు పంపించాందొడ్డు ధాన్యానికి సంబంధించిన డబ్బులు అన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. సన్న ధాన్యం ఎంత వచ్చాయో ఆ వివరాలు సైతం పంపించాం. రైతులకు బోనస్ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి.– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
యూరియా పక్కదారి పట్టొద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణికొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని జిల్లావ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మర్రిముచ్చాల, గౌరయపల్లి, అయినాపూర్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఎరువులు విక్రయిస్తూ ఏరోజుకు ఆరోజు స్టాక్ రాయాలని సూచించారు. అందుకు భిన్నంగా వ్యవహరించినా, నకిలీ మందులు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ తదితరులు పాల్గొన్నారు. తొగుటలో బారులు తొగుట(దుబ్బాక): మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులుతీరారు. స్థానిక ఫర్టిలైజర్ దుకాణానికి మంగళవారం యూరియా లారీ వచ్చింది. సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. అధికారుల సమక్షంలో రైతుకు రెండు బ్యాగుల చొప్పున అందజేశారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసుకుంటారు. మొక్కజొన్న కంకులు వేసే దశకు, పత్తి పూత దశకు వచ్చాయి. ఈ క్రమంలోనూ యూరియాతో పాటు పోటాష్ కలిపి వేస్తారు. అదనుతప్పితే పంటలకు ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తంచేశారు.