Siddipet District News
-
జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై కినుక.. సీనియర్లు అలక
● ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీలో అయోమయం ● ఎంపీ తీరని అన్యాయం చేశారంటూ ఓ నేత కంటతడి ● భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతల చర్చలు ● బుజ్జగింపు చర్యల్లో అధిష్టానం ● అసంతృప్తులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ గురిఎమ్మెల్సీ ఎన్నికల వేళ కమలంలో ముసలం మొదలైంది. జిల్లా అధ్యక్షుడి నియామకంపై సీనియర్లు అలకబూనారు. ఏళ్లుగా ఎన్నో కష్టాలు.. ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పార్టీని నమ్ముకొని వస్తున్న తమకు అన్యాయం జరగడంపై సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని కేవలం మూడు, నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొందరు నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ అసంతృప్తులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు దృష్టిసారించాయి. దుబ్బాక: బీజేపీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని కొందరు పార్టీ సీనియర్ నేతలు ఏళ్లుగా ఆశిస్తున్నారు. ప్రస్తుత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురువారెడ్డి, బైరి శంకర్ ముదిరాజు, పార్లమెంట్ కో కన్వీనర్ నలగామ శ్రీనివాస్ పోటీపడ్డారు. రెండు నెలలుగా జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం మల్లగుల్లలు పడుతూ వచ్చి ఈ నెల 18న రాత్రి బైరి శంకర్ ముదిరాజును నియమించింది. దీంతో జీర్ణించుకోలేని సీనియర్లు బాహాటంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు తమకు అన్యాయం జరగడంపై పార్టీ సీనియర్లు ముమ్మరంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై న అధ్యక్షుడిపై బహిరంగంగానే సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తుండటం శోచనీయం. నమ్ముకున్న వారే తమను నట్టేట ముంచారంటూ ఆరోపిస్తున్నారు. చివరివరకు అధ్యక్ష పదవిని ఆశించిన బాలేశ్గౌడ్తో పాటు పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై తగిన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అధిష్టానం ప్రత్యేక దృష్టి జిల్లా బీజేపీలో నెలకొన్న అసంతృప్తిపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అసంతృప్తులతో రాష్ట్ర ముఖ్య నాయకుడు ఫోన్లో మాట్లాడుతూ బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నాయకులు బిజీగా ఉన్నారు. దీంతో ఎన్నికల తర్వాత కలిసి మాట్లాడుకుందామని, అంత వరకు ఓపిక పట్టాలంటూ బుజ్జగింపు చర్యలు చేపడుతున్నారు. అధిష్టానానికి చెందిన ముఖ్యనేతలు ఎప్పటి కప్పుడు జిల్లాపై దృష్టి సారించి పరిస్థితి చేయిదాటకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై అధిష్టానం సైతం తీవ్ర కలవరపాటు చెందుతున్నట్లు తెలిసింది. కమలంలో ముసలం కాంగ్రెస్, బీఆర్ఎస్ గాలం అసంతృప్తితో ఉన్న బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరేలా జిల్లాకు చెందిన మంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి. బీఆర్ఎస్ నేతలు సైతం తమ పార్టీలోకి వస్తే భవిష్యత్ బాగుంటుందనే ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఎంపీ రఘునందన్రావు ముఖ్య అనుచరుడిగా పేరొందిన రాష్ట్ర నాయకుడిపై మంత్రి ప్రత్యేకంగా ఫోకస్పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బాలేశ్గౌడ్ కంటతడి.. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తనకు ఎంపీ రఘునందన్రావే అధ్యక్ష పదవి రాకుండా అన్యాయం చేశారంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అంబటి బాలేశ్గౌడ్ సన్నిహితుల వద్ద కంటతడిపెట్టినట్లు సమాచారం. రెండు పర్యాయాలు తనకు అన్యాయమే జరిగిందని, ఈ సారి పక్కా అంటూ ఎంపీ మోసం చేశారంటూ అనుచరులతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో సైతం బాలేష్గౌడ్తో పాటు పార్టీ క్యాడర్ చాలా మంది ఎందుకిలా చేశారంటూ పోస్టులు పెట్టడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా జిల్లా బీజేపీలో నెలకొన్న అసంతృప్తి సెగలు అధిష్టానం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాల్సిందే. -
భయం వీడితేనే పరీక్షల్లో జయం
తొగుట(దుబ్బాక): పరీక్షలంటే భయపడకుండా ప్రశాంతంగా రాయాలని, అప్పుడే విజయం సాధిస్తామని అదనపు కలెక్టర్ గరిమఅగర్వాల్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వార్షిక పరీక్షలపై పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ పరీక్షలంటే సహజంగానే భయం ఉంటుందని, అనవసర భయాందోళకు గురికాకుండా ప్రశాంతంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. క్రమపద్ధతిలో చదువుకుని మంచి మార్కులు సాధించాలని కోరారు. మెనూ ప్రకారంగా విద్యార్థులకు పౌష్టికాహరం అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. భోజనంలో గుడ్లు, క్యారెట్, బీట్రూట్ వంటివి తప్పనిసరిగా అందిచాలని సూచించారు. అనంతరం హాస్టల్ గుదులు, డైనింగ్ హాల్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజంచేశారు. అనంతరం స్థానిక పీహెచ్సీని సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ -
మా భూముల జోలికి రావొద్దు
సిద్దిపేటజోన్: ‘మా బతుకేంగావాలి’ అని గురువారం సాక్షిలో ప్రచురించిన కథనం రైతులను కదిలించింది. వివిధ గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణం పేరిట మా భూముల జోలికి రావొద్దని, ఇప్పటికే వివిధ పథకాలకు భూములు ఇచ్చామని, మళ్ళీ ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. గురువారం దుద్దెడ, మర్పడగ, తడ్కపల్లి, బురుగుపల్లి, పుల్లూర్ తదితర గ్రామాల రైతులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం మా భూముల జోలికి రావొద్దని వేడుకొన్నారు. సర్వే అధికారులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకదశలో ఆర్డీఓ ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సన్నకారు రైతుల భూములను లక్కోవడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు.సర్వేను అడ్డుకుంటాం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుల నిరసన కదిలించిన సాక్షి కథనం -
మంటగలుస్తున్న మానవత్వం
ఆందోళన కలిగిస్తున్న హత్యలు ● ఆస్తి, వివాహేతర సంబంధాలతో కుటుంబ సభ్యులపైనే దాడులుసిద్దిపేటకమాన్: మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు.. బంధుత్వాలను మరిచి క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఆధునిక జీవన శైలి, ఆస్తి, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలే హత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యులను.. కట్టుకున్న భార్యను.. భర్తను, చివరకు సొంత అన్నదమ్ములను సైతం మట్టుబెడుతున్నారు. చిన్న చిన్న తగాదాలు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో నా అనుకున్న వాళ్లనే హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది. బీమా డబ్బులు వస్తాయని, భూములు, ఆస్తులు దక్కించుకోవాలని, తదితర కారణాలతో మద్యం మత్తులో, క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో రెండు హాత్యలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో పలు రకాల కారణాలతో 2024లో (గతేడాది) 25 హత్య కేసులు, 2023లో 13 హత్య కేసులు నమోదైనట్లు పోలీసు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. భూతగాదాలు, వివాహేతర సంబంధాలే కారణం మారుతున్న జీవనశైలి, ఆస్తి, భూతగాదాలు, వివాహేతర సంబంధాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు అధికంగా పెరగడం వల్ల కుటుంబ సభ్యులను, సొంత అన్నదమ్ములను సైతం హత్య చేయడానికి వెనుకాడడం లేదు. మానవత్వాన్ని, రక్త బంధాన్ని మరిచి హత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల.. అడ్డు తొలంగించుకోవాలనే ఉద్దేశ్యంతో కట్టుకున్న వారినే మట్టుబెడుతున్నారు. ఇన్సురెన్స్ (బీమా) డబ్బులు వస్తాయనే దురుద్దేశంతో మనిషి విలువైన ప్రాణాలను సైతం తీస్తున్నారు.సిద్దిపేట గుండ్ల చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న బోదాసు శ్రీను గురువారం గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ శ్రీను హత్యకు దారితీసినట్లు సమాచారం. ఆవేశమే శ్రీనుని బలితీసుకుంది. ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాశ..ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. వీరు తల్లిని సరిగా చూడడం లేదని అక్క యాదవ్వ తనతో ఉంచుకుని బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో తల్లి పేరుపై ఉన్న 3.03 ఎకరాల భూమిని సోదరులకు తెలియకుండా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయంలో అన్నదమ్ములు, అక్క మధ్య గొడవలు జరగాయి. కనకయ్య తరుచూ గొడవ పెట్టుకుంటుండటంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న యాదవ్వ, ఆమె కుమారుడు కృష్ణమూర్తి కలిసి కనకయ్యను హత్య చేశారు. ఆత్మహత్యలా చిత్రీకరించేలా ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడటంతో నిందితులను ఈ నెల 9న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధంతో.. మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. సిద్దిపేట పట్టణంలో భార్య, పిల్లలతో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువకుడు శ్రవణ్ సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రియుడు శ్రవణ్తో కలిసి భర్తను చంపడానికి భార్య పతకం వేసింది. అందులో భాగంగా గత నెలలో రెండు సార్లు భర్తను చంపడానికి యత్నించారు. ఘటనపై బాధితుడు సిద్దిపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈనెల 18న నిందితుడు శ్రవణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆవేశం..జిల్లాలో హత్య కేసులు సంవత్సరం.. సంఖ్య 2023 13 2024 25 2025లో ఇప్పటి వరకు 02 మనుషులపై ప్రేమ ఏదీ? డబ్బుపై ఉన్న ప్రేమ మనిషిపై లేకపోవడం వల్లనే హత్యలు జరుగుతున్నాయి. మనిషి తన అవసరాలకు మించి హుందాతనం, హంగు, ఆర్భాటం గొప్పతనానికి పోయి అనవసర ఖర్చులతో ఆర్థిక వలయంలో చిక్కుకుంటున్నారు. కారణం ఏదైనా సరే విలువైన మనిషి ప్రాణం తీయడం సరికాదు. మనిషి తనను తాను మోసం చేసుకుంటూ తనుకు ఏం కావాలో తెలియక ఉన్మాద స్థితికి వెళ్లి దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విలువైన ప్రాణాలను తీయకూడదు. – డాక్టర్ శాంతి, సైకియాట్రిక్ విభాగ ం హెచ్ఓడీ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు తప్పనిసరి
ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్సిద్దిపేటకమాన్: పైవేటు ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అనవసర పరీక్షలు చేయకూడదని తెలిపారు. పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రుల యాజమాన్యాలు నూతన రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకునేందుకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు వేగిరం చేయండి
కలెక్టర్ మనుచౌదరినంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారంలోగా పూర్తి చేసి అందుబాటు లోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అఽధికారులను ఆదేశించారు. నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను గురువారం అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఫ్రేష్ ప్రూట్ బంచెస్, ప్రాసెసింగ్ షెడ్, బ్రాయిలర్ను మే నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. సివిల్, మెకానికల్ పనులు, పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయిల్ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, నిర్మాణ సంస్థ సైట్ మెనేజర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి సువర్ణ, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప అధికారులు పాల్గొన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యం బాలికల పౌష్టికాహారం అందించడంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం గట్లమల్యాల లోని బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, వంట గది, హాస్టల్లో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యార్థినులకు అందజేస్తున్న మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాత్రూంకు డోర్లు లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారి మాధవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం డోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లలో వంట సరుకుల సరఫరాలో సమస్యలు, అల్పాహారం వండేందుకు వంట పాత్రలు లేకుంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఇన్చార్జి ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి హమీద్కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప తదితరులు ఉన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. జిల్లా జైలును న్యాయమూర్తి బుధవారం సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్ పరిశీలించి, ఖైదీలకు కల్పిస్తున్న భోజన వసతుల గురించి జైలు సూపరింటెండెంట్ వికాస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయమైన సలహాలు, సూచనల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వారానికి నాలుగు సార్లు జైలును సందర్శిస్తారని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో తప్పనిసరిగా మెడికల్ టెస్టు చేయించాలన్నారు. బెయిలబుల్ ఆఫెన్స్ కేసులో పోలీసు స్టేషన్ ష్యూరిటీలను సమర్పించి బెయిల్ పొందవచ్చని తెలిపారు.అధిక కేసులు పరిష్కారం కావాలి హుస్నాబాద్: జాతీయ లోక్అదాలత్లో అత్యధికంగా కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు కృషి చేయాలని అదనపు సివిల్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. వచ్చే నెల 8న నిర్వహించే లోక్అదాలత్ నేపథ్యంలో బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జడ్జి కృష్ణతేజ్ మాట్లాడుతూ కేసులతో కక్షిదారులు సమయం, డబ్బు వృథా చేసుకుంటున్నారని తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులకు అవగాహన కల్పించి అధిక కేసు లు పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు. తెలుగు డీటీపీ కోర్సు ప్రారంభంసిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో తెలుగు డీటీపీ ఫొటోషాప్ సర్టిఫికెట్ కోర్సును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కోర్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. తెలుగు విభా గాధిపతి డాక్టర్ సంపత్కుమార్రెడ్డి మాట్లాడు తూ ఈ కోర్సు 30 రోజుల పాటు నిర్వహిస్తామని, తరగతులు వింటూనే సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో శిక్షకులు హరీష్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి సహకరించండి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హుస్నాబాద్: ప్రజలు ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. పన్నుల వసూళ్లపై బుధవారం బిల్ కలెక్టర్లతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఇంటి పన్నులు తప్పకుండా చెల్లించాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ కనకయ్య, బిల్ కలెక్టర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిగజ్వేల్రూరల్: గజ్వేల్లోని ఎడ్యుకేషన్ హబ్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ను యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవితో కలిసి బుధవారం పరిశీలించారు. ఉపాధ్యాయులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ హబ్లు సమస్యల నిలయాలుగా మారాయని, కనీసం వాచ్మెన్ను ఏర్పాటు చేయలేని దుస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం హబ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
వంద ఫీట్లలోనే నిర్మించాలి
గతంలో రోడ్డు విస్తరణ కోసం 12గుంటల భూమి కోల్పోయాను. ఇప్పుడు జాతీయ రహదారి కోసం భూమి మధ్యలోంచి వెళ్తుందని చెబుతున్నారు. దీంతో మరో 1.05ఎకరాల భూమి పోతుందని తెలుస్తోంది. రోడ్డు వద్దనడం లేదు. ఉన్న రోడ్డుకు అనుబంధంగా 100ఫీట్ల రోడ్డునే నిర్మించాలి. 150 ఫీట్లు వద్దు. భూమి నష్టపోకుండా జాతీయ రహదారిని నిర్మించాలి. – రామచంద్రారెడ్డి, దుద్దెడ భూమి పోతే.. రోడ్డున పడతాం కష్టం చేసి 2.13 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. రోడ్డు పేరుతో రెండు ఎకరాల భూమి పోతుందని తెలిసింది. మిగిలింది 13గుంటలే. అది కూడా అటు సగం.. ఇటు సగం ఉంటుంది. భూమి పోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. నా కూతురు పెళ్లి కోసం అమ్ముదాం అనుకున్నా. ఇప్పుడు భూమి పోతే నా కూతురి పెళ్ల్లి ఎలా చేయాలి. ప్రాణం పోయినా భూమి ఇవ్వను. –దాసరి యాదగిరి, జప్తినాచారం మార్కెట్ ధర అమలు చేయాలి1.03 ఎకరాల భూమి ఉంది. రహదారి కింద దాదాపు 30 గుంటలు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మా దగ్గర ఎకరం రూ.80లక్షలకు పోతుంది. మాకు ఎలాంటి సమాచారం లేకుండానే కొలతలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి. భూమి కోల్పోతే జీవనం కష్టమవుతుంది. – ఆకుల శ్రీకాంత్, రైతు, ఎన్సాన్పల్లి అప్పుడు మల్లన్నసాగర్.. తొగుట మండలం బ్రాహ్మణ బంజరుపల్లిలో 7ఎకరాల భూమి, ఇల్లు ఉండేది. మల్లన్నసాగర్లో భూ మి, ఇల్లు పోయింది. వచ్చిన పరిహారంతో ఎన్సాన్పల్లిలో 20 గుంటల వ్యవసాయ భూమిని రూ.30 లక్షలు పెట్టి 2020లో కొనుగోలు చేశాం. ఈ భూమిలో మళ్లీ రోడ్డు కోసం అధికారులు కొలతలు పెడుతున్నారు. ప్రభుత్వం మాకు పూర్తి న్యాయం చేయాలి. – తోట సుజాత, రైతు, ఎన్సాన్పల్లి ట్రాఫిక్ దృష్ట్యా 150 ఫీట్లకు పెంచాం హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వెళ్లే దారిలో ట్రాఫిక్ పెరుగుతుండటంతో 150ఫీట్ల వెడల్పుతో నిర్మించాలని నిర్ణయించాం. పైగా రోడ్డు వంకలు ఉండటంతో కొత్తగా రహదారి నిర్మించనున్నాం. సర్వే కొనసాగుతోంది. ఇది పూర్తి కాగానే రెవెన్యూ ద్వారా నోటీసులు జారీ చేసి నష్టపరిహారం అందజేస్తాం. – అన్నయ్య, డీఈఈ, జాతీయ రహదారులు -
తెలంగాణపై చిన్నచూపు
గజ్వేల్: తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ ఇన్చార్జి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వంశీకృష్ణ మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రావాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలను గుజరాత్కు తరలించుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ రెండు కోట్ల ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిందన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టభద్రుల ఎన్నికల సమన్వయకర్త గుత్తా అమిత్రెడ్డి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నీలం మధు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ ఇన్చార్జి ఎమ్మెల్యే వంశీకృష్ణ గజ్వేల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం -
శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
జయంతి వేడుకల్లో వక్తలు సిద్దిపేటజోన్: యువత ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడారు. ప్రతి వ్యక్తి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకుముందు అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేద్దామన్నారు. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది మన భారతదేశమన్నారు. శివాజీ పోరాట పటిమ నేర్చుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా దేశాలు తమ సైనికులకు చెబుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్. జిల్లా హిందూ వాహిని అధ్యక్షుడు సత్యం తదితరులు పాల్గొన్నారు. -
చెరువులు, కుంటలు నింపండి
సిద్దిపేటఅర్బన్: జిల్లాలోని చెరువులు, కుంటలను రిజర్వాయర్ల నీటితో నింపి సాగు నీటిని అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, తాగునీటికి సైతం ఇబ్బందులు లేకుండాచూడాలన్నారు. జిల్లా ప్రజల అవసరాలు తీరిన తర్వాతే ఇతర జిల్లాలకు నీటిని తరలించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు -
లక్ష్యం మేరకు రుణాలివ్వండి
లీడ్ జిల్లా మేనేజర్ హరిబాబు గజ్వేల్రూరల్: బ్యాంకు అధికారులు లక్ష్యాల మేరకు రుణాలివ్వాలని లీడ్ జిల్లా మేనేజర్ హరిబాబు సూచించారు. పట్టణంలోని ఐఓసీలో బుధవారం నాబార్డు డీడీఎం నిఖిల్రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం విద్యాసాగర్, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రాజలింగంలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి, పీఎంఎఫ్ఎంఈతో పాటు స్వయం సహాయక బృందాల పురోగతి, బ్యాంకు శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలను నెలాఖరులోగా క్లియర్ చేసేలా చూడాలన్నారు. అర్హత కలిగిన రైతులకు వ్యవసాయ రుణాలను అందించాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించారు. కార్యక్రమంలో గజ్వేల్ బ్లాక్ పరిధిలోని బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భోజనంలో మెనూ తప్పనిసరి
● పాటించకపోతే చర్యలు తప్పవు ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● కలెక్టరేట్లో అధికారులతో సమావేశంసిద్దిపేటరూరల్: గురుకుల, సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థుఽలకు ఆహారం అందించాలని, పాటించాలని అధికారులను సస్సెండ్ చేస్తానని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు మెనూను అమలు చేయాలన్నారు. నాణ్యమైన సరుకులు సరాఫరా చేయని వారిని సైతం తొలగిస్తామన్నారు. ఆకుకూరలు, క్యారెట్ ఆహారంలో అధికంగా ఉండేలా చూడాలన్నారు. స్నాక్స్ మెనూ ప్రకారం పండ్లను అందించాలన్నారు. ప్రతీ గురుకులంలో ఆర్డీసీఓలు, డీసీఓలు రాత్రి వేళ నిద్ర చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీఆర్ఓ, ఇంచార్జీ బీసీ అభివృద్ది అధికారి నాగరాజమ్మ, తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రణాళికతో బడ్జెట్ను రూపొందించండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రణాళికతో బడ్జెట్ను రూపొందించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కమిషనర్లు, మెప్మా, మున్సిపల్ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా మున్సిపల్ ఆదాయ వనరులైన ఇన్కంట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతరత్రా గ్రాంట్లను అన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వచ్చిన ఆదాయం లో మున్సిపల్ సిబ్బంది జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ సప్లయ్, శానిటేషన్ పనులతో పాటు తప్పనిసరిగా బడ్జెట్ లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కోసం పెట్టాలన్నారు. మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లను మార్చి 15వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించాలని, అన్ని వివరాలు పరిశీలన చేసి నిజనిర్ధారణ జరిగితే కూల్చివేత సైతం జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు ఆశ్రిత్ కుమార్, మల్లికార్జున్, నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్, పబ్లిసిటీ హెల్త్ డీఈలు మహేష్, ప్రేరణ, మెప్మ పీడీ హన్మంతు రెడ్డి, ఏఈ, అర్ఐ లు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్పై సీపీఎం నిరసన
సిద్దిపేటఅర్బన్: కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించేలా ఉన్న కేంద్ర బడ్జెట్పై సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. బుధవారం సిద్దిపేటలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోపాలస్వామి మాట్లాడుతూ రైతాంగానికి సంబంధించిన బడ్జెట్ అంటూనే కేటాయింపుల్లో కోత పెట్టారన్నారు. వ్యవసాయ రంగానికి తగిన విధంగా నిధులు కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి సైతం అరకొరగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. సవరించి ప్రజానుకూల బడ్జెట్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, వెంకట్, యాదగిరి, అరుణ్కుమార్, బాలనర్సయ్య, నవీన, శారద, కృష్ణారెడ్డి, ప్రశాంత్, రంజిత్రెడ్డి, సంజీవ్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ఆత్మహత్య
వర్గల్(గజ్వేల్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం గౌరారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. చింత వెంకటేశ్(30), రమ్య దంపతులు గౌరారంలో నివాసం ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే వెంకటేశ్ తనకు తెలిసిన వారి నుంచి రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించే మార్గం లేక భార్యతో చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది మంగళవారం అర్థరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక డంప్ స్వాధీనం కొండపాక(గజ్వేల్): అక్రమంగా డంప్ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి మెరుగు రమేశ్ కొంత కాలంగా రహస్య ప్రదేశాల్లో అక్రమంగా ఇసుకను డంప్ చేసుకుంటూ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, కుకునూరుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 50 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రమేశ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను, మట్టిని, మొరం, రేషన్ బియ్యాన్ని రవాణా చేసే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి
● జెండావిష్కరణ చేస్తుండగా ఏడుగురికి విద్యుత్ షాక్ ● ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు ● వర్గల్ మండలం జబ్బాపూర్లో విషాదంవర్గల్(గజ్వేల్): ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వర్గల్ మండలం జబ్బాపూర్లో జెండావిష్కరణ చేస్తుండగా విద్యుత్ తీగలు ఇనుప జెండా పైపునకు తగిలి ఏడుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జబ్బాపూర్ గ్రామ కూడలిలో యువకులు, గ్రామస్తులు ఇనుప పైపుతో కూడిన కాషాయజెండాను ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 11.30 ప్రాంతంలో జెండాను పైపు చివరన బిగించారు. లింగ ప్రశాంత్(22), దేశెట్టి కరుణాకర్(22), పల్లపు బన్నీ, కొంతం వేణు, కొంతం కనకరాజు, లింగ గణేష్, లింగ మహేశ్ జెండా పైపును పట్టుకొని పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు పైనున్న కరెంట్ తీగలకు తగిలింది. దీంతో పైపును పట్టుకున్న వారందరూ విద్యుత్ షాక్కు గురై పడిపోయారు. షాక్ తీవ్రతకు లింగ ప్రశాంత్ మృతి చెందగా, దేశెట్టి కరుణాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను గ్రామస్తులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కరుణాకర్ను మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో జబ్బాపూర్ గ్రామం శోకసంద్రమైంది. చేతి కందిన కొడుకు విద్యుత్ షాక్తో మృత్యువాత పడటంతో ప్రశాంత్ తల్లి కనకమ్మ రోదనలు మిన్నంటాయి. ఒంటరిని చేసి పోయావా అంటూ ఆమె విలపిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. డిగ్రీ చదువులో మిన్నగా, ఎన్సీసీలో గ్రూప్ లీడర్గా ప్రశాంత్ రాణించాడు. మిన్నంటిన రోదనల మధ్య అతడి అంత్యక్రియలు ముగిశాయి. -
శుభకార్యానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
కొండాపూర్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మారేపల్లి గ్రామానికి చెందిన గంజాయి ప్రకాశ్ (28) బంధువుల శుభకార్యం నిమిత్తం మూడు రోజుల కిందట మండల పరిధిలోని మల్కాపూర్కు వచ్చాడు. బుధవారం ఉదయం కార్యక్రమం కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు బైక్పై బంధువైన జేమ్స్తో కలిసి సంగారెడ్డికి వచ్చాడు. తిరిగివెళ్తున్న క్రమంలో మల్కాపూర్ గ్రామ శివారు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు గంజాయి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని న్యాల్కల్(జహీరాబాద్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హుస్సెళ్లి చెక్ పోస్టు వద్ద చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శంశల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభు(31) మంగళవారం రాత్రి హుస్సెళ్లి చౌరస్తా నుంచి కాలి నడకన ఇంటికొస్తున్నాడు. చెక్ పోస్టు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పున్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.బైకును ఢీకొట్టిన డిప్పర్: యువకుడు దుర్మరణం -
సమస్యల పరిష్కారంపై సీఎం హామీ
● ఉద్యోగులతో మార్చిలో ప్రత్యేక సమావేశం ● టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సీఎంని హైదరాబాద్లో కలిసి కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, పెన్షన్ బెనిఫిట్స్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన సీఎం సీనియార్టీ ప్రకారం చెల్లింపు జరిగేలా చూస్తామని, ఏప్రిల్లో డీఏలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల అన్ని సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా సమీక్ష చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు వివరించినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో త్వరలో ఉద్యోగుల సమావేశం ఉంటుందని, టీఎన్జీవో ప్రతినిధులు రావాలని సూచించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
● కల్లు తాగేందుకు వచ్చి ఈతకు వెళ్లిన యువకులు ● ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి ● జిన్నారం మండలంలోని వావిలాల పీర్ష చెరువు వద్ద ఘటనజిన్నారం (పటాన్చెరు): చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగలక్ష్మి కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్కు చెందిన వల్లపు రాంబాబు కుమారుడు నరేశ్(26), వల్లపోలు రాజు కుమారుడు శంకర్ (22) ఇద్దరూ స్నేహితులు కాగా కూలీ పని చేస్తుంటారు. మంగళవారం సాయంత్రం జిన్నారం మండలం వావిలాలలో కల్లు తాగేందుకు స్క్యూటీ పై వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఈత కొట్టేందుకు వావిలాల పీర్ష చెరువులోకి దిగారు. చెరువు ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అక్కడే గేదెలు మేపే ఓ వ్యక్తి గమనించి చెరువులో దిగి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వెంటనే పోలీసులకు విషయం చెప్పాడు. బుధవారం జగంపేట వావిలాల గ్రామాలకు చెందిన ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారుల నిర్లక్ష్యమే రైతులను ముంచేను
గాంధీనగర్లో తెగులు సోకిన వరి పంటహుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు సాగు చేసిన పంటలను అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడం లేదు. దీంతో పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. అలాగే విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ సమయంలో ఎలాంటి మందులు వాడాలనేది తెలియడం లేదు.హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి మండలాల్లో 68,272 ఎకరాల్లో పంటలు సాగు చేయగ అందులో వరి 53,280, మొక్కజొన్న 12,782, పొద్దుతిరుగుడు 1660, వేరుశనగ 150, ఇతర పంటలు 400 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. యాసంగి సీజన్కు ముందు గ్రామాల్లో అవగాహన కల్పించలేక రైతులు వారికి నచ్చిన పంటలను సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతం సాగు నీరు కష్టాలను తప్పించుకొనేందుకు కూడా రైతులు వరి తగ్గించి మొక్కజొన్న పంటను పెంచారు. ప్రైవేటు సీడ్ విత్తన కంపెనీలు గ్రామాలకు రావడంతో వారి దగ్గర విత్తనం తీసుకొని పంట సాగు చేస్తున్నారు. పంటల దిగుబడులు విత్తన కంపెనీలు గ్యారంటీ ఇవ్వకపోవడం, కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చేతుకు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయనే ఆశ రైతులను విత్తన కంపెనీల వైపు చూస్తున్నారు. గాంధీనగర్, తోటపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులు విత్తనం మొలువకపోవడంతో విత్తనం చెడగొట్టి లోకల్ విత్తనం వేసుకొన్నారు. దీంతో రైతలకు పెట్టుబడుల భారం పెరిగింది, సమయం వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్న ఆన్లైన్ సమస్య.. వ్యవసాయ అధికారులు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెల్లి రైతులకు విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుల్ల నివారణ పై అవగహన కల్పిస్తే మంచి దిగుబడులు తీస్తారు. క్షేత్ర స్థాయికి వెళ్లిన అధికారులకు రైతులు ఏ పంటలు వేశారనే విషయాలు కూడా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేయడం సులభమవుతుంది. పంటల క్షేత్రాలకు వెళ్లని అధికారులు ఆన్లైన్లో రైతుల వివరాలు లేక పంటలు విక్రయించడానికి మార్కెట్కు వెళ్తే ఆన్లైన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వచ్చి పంటలను ఆన్లైన్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలించని వ్యవసాయ అధికారులు సాగుపై రైతులకు కొరవడిన అవగాహన సబ్సిడీ విత్తనాలపై అందని సమాచారం బయట మార్కెట్లో కొనుగోలు తెగుళ్ల సమయంలో ఏం మందులు వాడాలో తెలియని పరిస్థితి ఆన్లైన్లో నమోదుకాని పంట వివరాలు సీసీఐలో అమ్ముకోలేక దళారులకు విక్రయంప్రభుత్వ సబ్సిడీ విత్తన వెనక్కి.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నేషనల్ సీడ్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల రైతుల కోసం 18 క్వింటాళ్ల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం సరఫరా చేసింది. 10 కిలోల విత్తనం ఖరీదు రూ.275 ఉంటే రూ.100 సబ్సిడీ పోను రైతులు రూ.175 చెల్లించాలి. రైతులకు అధికారులు అదును దాటిన తర్వాత సమాచారం ఇవ్వడంతో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో ఒక రైతు కూడా విత్తనం తీసుకోలేదు. కోహెడ, బెజ్జంకి మండలాల్లో 8 క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకొని సాగు చేశారు. ప్రభుత్వం విత్తనం సరఫరా చేస్తుందని రైతులకు అధికారులు చెప్పకపోవడంతో రైతులు ప్రైవేటు కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు.రెండు ఎకరాలను చెడగొట్టిన హైబ్రిడ్ సీడ్ మక్క అంటే ఉత్తర కార్తెల దుక్కిపోతం చేసి విత్తనం పెట్టిన. విత్తనాలు సరిగాలేక మక్క మొలువలేదు. రెండు ఎకరాల మక్క చేను దున్ని మళ్లీ దుకాణానికి వెళ్లి లోకల్ మక్క తెచ్చి పెట్టిన. రూ.15 వేలు ట్రాక్టర్ దున్నకానికి అయ్యింది. మక్కలు పెట్టి పెట్టుబడి ఖర్చు నష్టపోయిన. మా భూమి దగ్గరనే ఏడీఏ ఆఫీసు ఉంటదని, అయినా ప్రభుత్వం సబ్సిడీ విత్తనం వచ్చిందని చెప్పలేదు. – పోలు మహేందర్, రైతు గాంధీనగర్ పంటల వద్దకు వెళ్లాలని ఆదేశించాం డివిజన్ పరిధిలోని వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఏఈఓలను పంటల క్షేత్రా లకు వెళ్లాలని ఆదేశించాం. పంటల తెగుళ్ల నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పాం. ఆన్లైన్ నమోదు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ నాసిరకం ఉందని రైతులు వద్దంటే తిరిగి పంపించాం. కోహెడ, బెజ్జంకి రైతులు మొక్కజొన్న సాగు చేసుకున్నారు. – శ్రీనివాస్, ఏడీఏ, హుస్నాబాద్ -
సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి ● 50 ఏళ్ల తర్వాత మళ్లీ పురిటిగడ్డకు ● సంతోషంగా ఉంది: సీనియర్ సిటిజన్లు
సిద్దిపేటజోన్: యాభై ఏళ్ల కిందట ఉన్న సిద్దిపేటకు ప్రస్తుతం చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని, అభివృద్ధి చెంది రూపు రేఖలే మారిపోయాయని సిద్దిపేట సీనియర్ సిటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ మిత్రులుగా చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేసుకొని విదేశాల్లో ఏళ్ల కొద్ది జీవించిన తర్వాత సిద్దిపేట రావడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణం అభివృద్ధి చెందడంతో రోల్ మోడల్గా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం రంగనాయక, మల్లన్న సాగర్, కోమటిచెర్వు సందర్శించారు. సమావేశంలో సికిందర్, హమీద్, నజిమ్, కలిమ్తో పలువురు పాల్గొన్నారు. పరిశ్రమలో అగ్ని ప్రమాదం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని రంగాయపల్లి శివారులో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ బట్టిలోంచి వచ్చే వేస్టేజ్ను ఒక పక్కన వేయగా వేడికి అక్కడ మంటలు చెలరేగి పక్కన్న ఉన్న స్టోర్ రూమ్ దగ్ధమైంది. ఇది గమనించిన యాజమాన్యం, స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి మంటలార్పారు. కార్మికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి పరిశ్రమ వద్దకు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వీరి వెంట తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ ఉన్నారు. పరిశ్రమలో జరిగే ప్రమాదాల వల్ల గ్రామానికి ముప్పు పొంచి ఉందని రంగాయపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లలో కారం కొట్టి ● మహిళ మెడలోంచి బంగారం చోరీ పటాన్చెరు టౌన్: కిరాణా షాపు నిర్వాహకురాలు కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోంచి బంగారం లాక్కెళ్లిన ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తులసీవనం కాలనీలో రమ్య అనే మహిళ కిరాణా షాపు నడుపుతుంది. మూడు రోజుల నుంచి ఓ వ్యక్తి కిరాణా షాపునకు తెల్లవారుజామున వచ్చి సామగ్రి తీసుకెళ్తున్నాడు. బుధవారం ఉదయం బైక్పై మాస్క్ ధరించి కిరాణా షాపునకి వచ్చాడు. ఉల్లిపాయలు కావాలని అడుగడంతో రమ్య తీస్తుండగా ఆమె కళ్లల్లో కారం కొట్టి మెడలో నుంచి పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో విరిగిన అరతులం బంగారంను లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనపై షాపు నిర్వాహకురాలు రమ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు 31 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 21 కిలోమీటర్ల నూతన రోడ్డు కోసం భూమిని సేకరించనున్నారు. పంట పొలాల మీదుగా రోడ్డు ఉండనుంది. మొత్తంగా పాత రోడ్డును 10 కిలోమీటర్లు విస్తరిస్తూ 21 కిలోమీటర్లు నూతన రోడ్డు కోసం సుమారు 210 హెక్టార్ల భూమిని రైతులు కోల్పోతున్నారు. భూమి సేకరణ దిశగా జాతీయ రహదారుల అధికారులు చర్యలు చేపడుతున్నారు. దుద్దెడ, జప్తినాచారం, నాగిరెడ్డిపల్లి, మార్పడగ, కంభంపల్లి, ఎన్సాన్పల్లి, తడ్కపల్లి, బూర్గుపల్లి, ఇర్కోడ్, చిన్నగుండవెల్లి, రాఘవాపూర్, పుల్లూరు, మల్యాల, జక్కాపూర్ మీదుగా జాతీయ రహదారి సాగనుంది. ఇందుకు భూ సర్వే చేస్తున్నారు. నష్టపోతున్న రైతులు 150 ఫీట్ల రోడ్డుతో ఫోర్లేన్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. జనగామ నుంచి దుద్దెడ వరకు 100 ఫీట్ల వెడల్పుతో ఉన్న రోడ్డును దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు 150ఫీట్లకు పెంచారు. దీంతో కొందరు రైతులు మొత్తం భూమిని కోల్పోతుండగా మరి కొందరు సగం కంటే ఎక్కువగా నష్టపోనున్నారు. కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్న భూమి దక్కకుండా పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే పలు చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అనుబంధంగా కొత్త రోడ్డు కోసం భూ సేకరణ చేస్తుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు. న్యూస్రీల్365బీ జాతీయ రహదారి విస్తరణపై రైతుల గగ్గోలు భూమిపోతే ‘రోడ్డు’న పడతాం అంటూ ఆవేదన వంద ఫీట్లకే కుదించాలంటూ వినతులు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాల్సిందేనంటూ పట్టు ఇప్పటికే పలుచోట్ల సర్వే అడ్డగింత జిల్లాలో దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు నిర్మాణం బహిరంగ మార్కెట్ ధర చెల్లించాల్సిందే..జాతీయ రహదారి వెళ్లే మార్గంలో గతంలోనే బహిరంగ మార్కెట్ ధర ఎకరానికి రూ.45 లక్షల నుంచి రూ.60లక్షలు ఉంది. కానీ ప్రభుత్వం భూ సేకరణకు ఎకరానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో రైతులు ఒక్కో ఎకరానికి లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బహిరంగమార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ‘ఎవుసమే మా ప్రాణం.. ఏళ్లుగా భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం.. మా భూములు లాక్కోవద్దు.. విస్తరణ పేరుతో ‘రోడ్డు’న పడేయవద్దు..’ అంటూ రైతులు వేడుకుంటున్నారు. కొన్ని చోట్ల సర్వేకు వచ్చిన అధికారులను సైతం అడ్డుకుంటున్నారు. 365బీ జాతీయ రహదారి విస్తరణపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 365 బీ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందుకోసం రూ.1,100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే పలు చోట్ల సర్వేను నిర్వహించి మార్కింగ్ చేశారు. జనగామ నుంచి దుద్దెడ వరకు 100ఫీట్లు ఉన్న మాదిరిగానే సిరిసిల్ల వరకు కూడా అలాగే విస్తరించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 31 కిలో మీటర్ల మేర (దుద్దెడ నుంచి జక్కాపూర్) నిర్మాణం చేపట్టాల్సి ఉంది. -
సమస్యలను పరిష్కరిస్తాం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్ అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి ఓటు వేసి గెలిపిద్దామని, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బుధవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఎంతోమంది పేదలకు బాసటగా నిలిచిన ప్రసన్న హరికృష్ణను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరామ్కృష్ణ, లింగంపల్లి యాదగిరి, వెంకట్, వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, శంకర్, నరేష్, పుల్లూరు ఉమేష్, రాజు, సంపత్, బాబు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో.. సిద్దిపేటకమాన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు రవీంద్రసింగ్ను గెలిపించాలని శాతావహన జేఏసీ చైర్మన్ వ్యవస్థాపకుడు చైతన్య కోరారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యా వ్యాపారవేత్తలకు, విద్యావంతులకు జరుగుతున్న ఎన్నిక అన్నారు. అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నరేష్, అశోక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్ -
స్రవంతి.. ప్రాజెక్టుతో సత్తా చాటి
జోగిపేట(అందోల్): ప్రతి రోజూ కళ్ల ముందే అంగవైకల్యంతో ఉన్న స్వీపర్ తరగతి గదిని శుభ్రం చేస్తూ పడుతున్న ఇబ్బందులు చూసి ఆ విద్యార్థినిని తన ఆలోచనకు పదును పెట్టింది. ఈ ఇబ్బందిని ఎలాగైన దూరం చేయాలని సులభంగా గదిని శుభ్రం చేసే విధంగా ఓ ప్రాజెక్ట్కు రూపకల్పన చేసింది. రెండు, మూడు మాసాలు కష్టపడి ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్ట్ను తయారు చేయడమే కాకుండా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామానికి చెందిన అతిపేద కుటుంబానికి చెందిన ఆశం యాదయ్య, కవితల మూడవ కూతురు స్రవంతి. జోగిపేటలోని ఎస్ఆర్ఎమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో పని చేస్తున్న సైన్స్ టీచర్ సిద్దేశ్వర్ సహకారంతో 2023లో ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్టుకు తయారు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రాజెక్టు ప్రదర్శించారు. అక్కడ అందరినీ ఆకట్టుకొని హైద్రాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికై ంది. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన 11వ నేషనల్ సైన్స్ ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనలో ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 2025 జూన్లో జపాన్లో నిర్వహించే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపిక చేశారు. జపాన్ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో 60 ప్రాజెక్టులు, రాష్ట్ర స్థాయిలో నాలుగు ప్రాజెక్టులు ఎంపిక కాగా వాటిలో కన్సాన్పల్లి విద్యార్థిని రూపొందించిన ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. అతి తక్కువ ఖర్చుతో, తేలికై న వస్తువులతో ఎక్కడికై నా అవలీలగా తీసుకువెళ్లే విధంగా ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టును రూపొందించారు. పాఠశాలలు, ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో గదులు శుభ్రం చేయడానికి దీన్ని వాడొచ్చు. అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికై న ‘డెస్క్ లిఫ్టర్’ తక్కువ ఖర్చు, తేలికై న వస్తువులతో రూపకల్పన చేసిన విద్యార్థిని సులువుగా గదులు శుభ్రం చేసేందుకు ఉపయోగంసంతోషంగా ఉంది డెస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు తయారు చేసే సమయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తే చాలనిపించేది. కానీ భారత ప్రభుత్వం ద్వారా జపాన్లో జరిగే ప్రదర్శనకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. జూన్లో జపాన్ వెళ్లేందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. పాస్ పోర్టును కూడా సిద్ధం చేసుకున్నాను. ఈ అనుభూతిని జీవితంలో మరచిపోను. – శ్రవంతి, విద్యార్థి, కన్సాన్పల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు డెస్క్ లిఫ్టర్ అనే పరికరాన్ని ఎక్కడికై నా తీసుకెళ్లొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా స్కూళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో టేబుళ్లని లేపి చక్కగా శుభ్రం చేయొచ్చు. 2025 జూన్ మాసంలో జపాన్ రాష్ట్రంలోని సకూరలో జరిగే ప్రదర్శనకు భారతదేశ ప్రభుత్వం ఎంపిక చేసింది. గతేడాది కన్సాన్పల్లి పాఠశాల నుంచి ‘పింక్ లూ ’ ప్రాజెక్టు తరఫున భూమిక జపాన్ ప్రదర్శనకు వెళ్లింది. – సిద్దేశ్వర్, గైడ్ టీచర్, కన్సాన్పల్లి -
ఉగాదికి సన్న బువ్వ!
బియ్యం పంపిణీకి సన్నద్ధం ● తొలి విడతలో 12,471 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ ● జిల్లాలో 2.91 లక్షలకుపైగా రేషన్ కార్డులు ● ప్రతి నెలా 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్న వడ్ల మిల్లింగ్పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఉగాది నుంచి పంపిణీకి కసరత్తు జరుగుతోంది. పేదలకు రేషన్ కార్డులపై ప్రస్తుతం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా ఆ స్థానంలో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వానాకాలంలో 419 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 2,51,766 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, అందులో 9,679 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంది. సాక్షి, సిద్దిపేట: రేషన్ కార్డుదారులకు ఉగాది పండగ రోజు సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల భోజనానికి ఇప్పటికే సన్నబియ్యం వినియోగిస్తున్నారు. జిల్లాలో 2,92,139 రేషన్ కార్డులు ఉండగా అన్నపూర్ణ 82, అంత్యోదయ 18,337, ఆహార భద్రత కార్డులు 2,73,720 ఉన్నాయి. వీటికి నెలకు సుమారుగా 5వేల మెట్రిక్ టన్నుల బియ్యం కాగా సంవత్సరానికి సుమారుగా 60వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానున్నాయి. 12,471 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ జిల్లాలో 9,679 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రాగా, మెదక్ జిల్లాకు చెందిన 6,403మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సిద్దిపేటకు కేటాయించారు. మొత్తంగా తొలివిడతలో 16,082 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వచ్చింది. అందులో నుంచి 3,611టన్నుల ధాన్యాన్ని విద్యార్థుల హాస్టల్స్, మధ్యాహ్న భోజనానికి కేటాయించారు. మిగిలిన 12,471 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 52 మిల్లులకు కేటాయించారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా ఒక్కో క్వింటాల్ ధాన్యానికి 67కిలోల బియ్యం ఇచ్చేలా మిల్లర్లతో అగ్రిమెంట్ చేశారు. ఇక రీసైక్లింగ్కు చెక్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ నెలకు 6కిలోల చొప్పున దొడ్డు బియ్యం ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తినేందుకు ఆసక్తి చూపని పేద, మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే వినియోగించుకుంటారని, బ్లాక్ మార్కెట్ను నియంత్రించవచ్చని ప్రభుత్వ భావిస్తోంది.సన్నబియ్యం పంపిణీకి సిద్ధం చేస్తున్నాం వానాకాలంలో సన్న ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేశాం. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించాం. వాటిని త్వరగా మిల్లింగ్ చేసే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
కబడ్డీ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
మర్కూక్(గజ్వేల్): క్రీడాకారులు ప్రతిభను కనబరిచి రాణించాలని నాయకులు కోరారు. మండలంలోని దామరకుంటలో పదిరోజులుగా అండర్ 16 కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ జట్టుకు క్రీడా దుస్తులు, భోజన ఖర్చులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, మండల జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కృష్ణయాదవ్, దామరకుంట మాజీ సర్పంచ్ గాయత్రి, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు యాదవ్, కబడ్డీ కోచ్ నరేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రజల చూపు బీజేపీ వైపు
● కాంగ్రెస్, బీఆర్ఎస్లపై నమ్మకం పోయింది ● చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డిసిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నమ్మకం పోయిందని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్, ఇటీవల వివిధ రాష్ట్రాల ఫలితాలు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట తదితర కారణాల వల్ల దేశంలో ప్రధాని నరేంద్రమోదీ మీద నమ్మకం మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకోలేక నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే రత్నం, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కోహెడరూరల్(హుస్నాబాద్): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. తంగళ్లపల్లిలోని కస్తూర్బా గాంధీ(కేజీబీవీ) బాలికల విద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలు, పరిశుభ్రత, టాయిలెట్స్ నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. వంట సామగ్రి, తరగతి గదుల నిర్వహణ, భోజన వసతుల ఏర్పాటు, విద్యార్థుల ఆరోగ్యం, నీటి సరఫరా తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి గణిత సబ్జెక్ట్ బోధించారు. పైథాగరస్ సిద్ధాంతం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సురేఖ, మండల విద్యాధికారి ఆర్, పద్మయ్య, కేజీబీవీ ప్రత్యేకాధికారి హిమబిందు, ఎంపీఓ శోభ తదితరులు పాల్గొన్నారు. -
‘పాత పెన్షన్’ అమలుకు పోరాటం
సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రశాంత్నగర్(సిద్దిపేట): పాత పెన్షన్ విధానం అమలుకు పోరాడుదామని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయ్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూపీఎస్ స్కీం ను వ్యతిరేకిస్తూ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్, యూపీఎస్ల రద్దుకు అందరం కలిసికట్టుగా పోరాడుదామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం హామీని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను అమలు చేయాలన్నారు. పాత పెన్షన్ అమలయ్యేదాకా పోరాటమే తమ ఏకై క ఎజెండా అని అన్నారు. అందరం ఏకమై సీపీఎస్, యూపీఎస్ పై వ్యతిరేకంగా పోరాడితే పాత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చితీరుతుందన్నారు. సీపీఎస్, యూపీఎస్లకు వ్యతిరేకంగా మార్చి 2న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే యుద్ధభేరి ని విజయవంతం చేయాలన్నారు.కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు చేగూరి దేవరాజ్, ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, జగదీష్, ప్రవీణ్, సీపీఎస్ సంఘ సభ్యులు, ఉద్యోగ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాగు నీరు అందించాలంటూ ర్యాలీ
కొమురవెల్లి(సిద్దిపేట): చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలలోని 133 చెరువులను తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి తపాస్పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా తపాస్పల్లి రిజర్వాయర్ను చేర్యాల ప్రాంత రైతులకు నీరందించేందుకు నిర్మించారని, కానీ రిజర్వాయర్లో నీరు లేక వెలవెలబోతుందని అన్నారు. రిజర్వాయర్ను నింపిన ప్రతిసారీ చేర్యాల ప్రాంత చెరువులు నింపకుండా ఆలేరు, సిద్దిపేటకు నీటిని తరలించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈప్రాంత రైతులను కాపాడాలని కోరారు. ఎప్పటికే వరి సాగు పొట్ట దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో, ఆలేటి యాదగిరి, బండకింది అరుణ్కుమార్, తాడూరి రవీందర్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, అత్తిని శారద, మద్దూరు మండల కార్యదర్శి షఫీ, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ఐదో వారం ఆదాయం రూ.48 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో ఐదోవారం రూ. 48,10,683 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి వివిధ రకాల మొక్కు లు, దర్శనాలు, లడ్డూ ప్రసాదాలు, పట్నాలు, బోనాల టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదా యం సమకూరినట్లు తెలిపారు. గత ఏడాది ఐదోవారం రూ.56,03,330 సమకూరింది. ఈసారి రూ.7,92,647 తక్కువగా వచ్చినట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఫార్మా రంగంలోని ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ హెచ్ఆర్ విభాగాధిపతి డాక్టర్ శరత్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు కెమిస్ట్రీని ఇష్టంగా చదివి పట్టు సాధించి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫార్మారంగంలోని వివిధ విభాగాల్లోని ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్కుమార్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, కెమిస్ట్రీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి గజ్వేల్రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు అధ్యాపక బృందం కృషి చేయాలని సీపీడీసీ సభ్యులు సూచించారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల ప్రణాళిక అభివృద్ధి కార్యవర్గం(సీపీడీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు సహకరిస్తామన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు అడ్మిషన్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన కళాశాల బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు డాక్టర్ ఆకుల నరేష్బాబు, లక్ష్మణ్, గోపాల్రెడ్డి, శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): వసతిగృహాల్లోని విద్యార్థులకు మూడేళ్లుగా కాస్మోటిక్ చార్జీలు రావడం లేదని, వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా సామగ్రిని సైతం సమకూర్చాలన్నారు. వసతిగృహాంలో దోమల బెడద ఎక్కువ ఉందని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతాభావం పెంచేందుకే కార్డెన్ సెర్చ్: ఏసీపీ మధు చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజల రక్షణకు సంబంధించి భద్రతాభావం పెంచేందుకే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. మండల పరిధిలోరి ఇబ్రహీంనగర్లో మంగళవారం సాయంత్రం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద ప్రాంతాల్లో నార్కోటిక్స్ డాగ్స్ తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల పట్ల, అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నిరవాణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రూర ల్ సీఐ శ్రీను, ఎస్ఐ బాలకృష్ణ, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. 16 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
‘స్వచ్ఛ’ సిద్దిపేట దిశగా సాగుదాం
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటజోన్: ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ’ సిద్దిపేట దిశగా సాగుదామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా విభాగం, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో స్వచ్ఛ సర్వేక్షన్ పై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్రం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో పట్టణ ప్రజల మద్దతు ద్వారా అనేక జాతీయ స్థాయిలో అవార్డులు పొందామన్నారు. ఈసారి మళ్ళీ ప్రజల అభిప్రాయాలను సేకరించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ అంశంపై మెరుగైన ఫలితాలు సాధించాలని, అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. పట్టణ ప్రజలు సిటిజన్ ఫీడ్ బ్యాక్లో పాల్గొనాలని, అందుకు సిబ్బంది వారిని చైతన్యం చేయాలని సూచించారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రక్రియలో భాగంగా క్యూఆర్ కోడ్ ద్వారా లేదా సిబ్బందికి ప్రజాభిప్రాయ అందించి సర్వేలో పాల్గొనాలని సూచించారు.10 రకాల ప్రశ్నలకు ప్రజలు సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
ఉద్యాన పంటలకు ‘డ్రోన్’ దన్ను
గజ్వేల్: సాధారణ వ్యవసాయ పంటల్లో ఇప్పటికే డ్రోన్ల వినియోగం పెరిగింది. కూలీల కొరత ప్రధా న సమస్యగా మారగా డ్రోన్ల వినియోగం తరుణోపాయంగా మారుతోంది. ఎరువులు, పురుగు మందుల పిచికారీ సరైన పద్ధతిలో నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. దీనివల్ల అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతున్నది. ఇదే విధానం కొత్తగా ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయల తోటల సాగులో తీసుకొచ్చేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. గత 10వ తేదీన యూనివర్సిటీలో డ్రోన్ల ఏర్పాటుపై కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆర్టీఓ (రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్) అధికారులతో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం చేసుకోవాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. అంతకు ముందు కూడా ఇతర కంపెనీలతోనూ అధికారులు చర్చలు జరిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎంఓయూలు పూర్తికానున్నాయి. ఉద్యాన పంటల్లో ప్రయోగాలు కంపెనీలతో ఒప్పందాలు పూర్తయితే ఉద్యాన తోటలను ఎంచుకొని పంటల వారీగా ప్రయోగాలు చేయనున్నారు. పండ్ల తోటలు, కూరగాయల పంటల్లో అయిదారు రకాలు ఒకేసారి ఎంపిక చేసి ఆయా తోటల్లో డ్రోన్ ఆధారిత విధానం అమలు కోసం కచ్చితమైన పద్ధతులను నిర్ధారించడానికి స్టాండర్డ్ ఆపరేటీవ్ సిస్టమ్(ఎస్ఓపీ)ని అభివృద్ధి చేయనున్నారు. సాధారణ వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలు పూర్తిగా భిన్నం. కనుక తోటల్లో పురుగుమందులు, ఎరువులు కొమ్మకొమ్మకు పడే విధానం అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యమైన విషయమేమిటంటే డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రయోగాలను యూనివర్సిటీలోని డ్రోన్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం పండ్లు, కూరగాయల తోటలకు తొలిసారిగా కొత్త విధానం ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ సాధారణ వ్యవసాయ పంటలకే పరిమితమైన డ్రోన్ విధానం...ఇక ఉద్యాన పంటల్లోనూ అందుబాటులోకి రాబోతున్నది.ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు పలు కంపెనీలతో ఎంఓయూలకు చర్చలు జరుపుతున్నారు. -
కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్
ఉద్యాన పంటలకు డ్రోన్ విధానం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. పలు కంపెనీలతో చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇది పూర్తి కాగానే ప్రయోగాత్మకంగా చేపడతాం. వచ్చే ఫలితాలను రైతులకు వివరించి అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ దండ రాజిరెడ్డి, వైస్ ఛాన్స్లర్, హార్టికల్చర్ యూనివర్సిటీ దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం పండ్లు, కూరగాయల తోటలకు తొలిసారిగా కొత్త విధానం ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ త్వరలోనే డ్రోన్ విధానం -
తాగునీటి సరఫరాలో అంతరాయం రానివ్వం
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సిద్దిపేటరూరల్: జిల్లాలో తాగునీటికి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతు భరోసా అర్హులకు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా, రేషన్కార్డులకై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు అందిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ది తొండి ఆట
సిద్దిపేటజోన్: ప్రతి ఆటలో గెలుపు, ఓటమి సహజమని, రేపటి విజయానికి ఓటమి నాంది లాంటిదని, అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ఆడుతున్నది తొండి, గండి ఆట అని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం రాత్రి స్థానిక స్టేడియంలో కేసీఆర్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తాను గతంలో లెక్క టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదని, టీ20మ్యాచ్ అడుతున్నట్లు చెప్పారని, అయితే సీఎం ఆడుతున్నది తొండి, గండి మ్యాచ్ అని ఎద్దేవా చేశారు. మాటలు తొండి, హామీలు గండి అని అన్నారు. కేసీఆర్ ఆటలో ఆయన ఆల్ రౌండర్ అని అభివర్ణించారు. సీఎం రేవంత్ సచివాలయానికి వెళ్లక ఆరు నెలలు అయిందని, ప్రజలను కలవడం లేదన్నారు. ప్రస్తుతం పల్లెల్లో ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, రావాలి అని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కేసీఆర్ క్రికెట్ టోర్నీలో 378జట్లతో భారీ టోర్నమెంట్ నిర్వహించడంపై ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అవార్డును నిర్వాహకులు ఎమ్మెల్యే హరీశ్ రావుకు అందజేశారు. మాజీమంత్రి హరీశ్రావు -
పేదల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం
వర్గల్(గజ్వేల్): అభివృద్ధి, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వర్ అన్నారు. సోమవారం నాచారంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు కట్టుబడి ఉందని, సీఎం రేవంత్రెడ్డి పాలనదక్షతతో సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తాచాటాలన్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు గ్రామాల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాగనోల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాచగిరీశుని దర్శించుకున్న సిద్ధేశ్వర్ ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని సిద్ధేశ్వర్ సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలి రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వర్ బీజేపీకి గుణపాఠం తప్పదు గజ్వేల్: అమెరికా కొత్త ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న భారతీయులకు ప్రధాని మోదీ అండగా నిలవాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సోమ వారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికా అంశంపై స్పందించాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాదిరిగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేస్తుండగా, బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై కులం, మతం పేరిట విమర్శలు చేయడం తగదన్నా రు. రాహుల్గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు ప్రజలందరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు. బీజేపీ అసంబద్ద విధానాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● ఈజీఎస్ కింద చేపడుతున్న పనులపై సమీక్షసిద్దిపేటరూరల్: ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వేగిరం చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జీపీ భవనాలు, అంగన్వాడీలు, తదితర నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై పీఓ, ఏపీఓలతో కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. ఓటు వేసే విధానంపై పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మాస్టర్ ట్రైనర్, ఎన్నికల పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. అటవీ భూమిని సంరక్షించాలి గజ్వేల్, మైలారం గ్రామంలోని 28 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని రక్షించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఫారెస్ట్ రైడ్ యాక్ట్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. అటవీ భూమి ఉన్న ప్రాంతాన్ని మొత్తం సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త ప్లాంటేషన్, పాత మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని, ఇది అందరి బాధ్యత అన్నారు. అటవీ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, అటవీ శాఖ అధికారి, జోజి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అఖిలేష్రెడ్డి, ఏడి సర్వే ల్యాండ్ వినయ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరికలెక్టరేట్లో బయోమెట్రిక్ కలెక్టరేట్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది హాజరు వివరాలు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విదానాన్ని అమలులోకి తెస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటు పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది హాజరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలని ఈడీఎం ఆనంద్ను కలెక్టర్ ఆదేశించారు. -
విద్యార్థుల నమోదులో తేడా రావొద్దు: డీఈఓ
జగదేవ్పూర్(గజ్వేల్): ఎడ్యుకేషన్ యాప్లో వ్యత్యాసం లేకుండా విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించారు. అలాగే జీవశాస్త్రం, సాంఘికశాస్త్రంపై ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. తిగుల్, మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో పరీక్షల విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషన్ యాప్లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. లేనట్లయితే కేంద్రం నుంచి పాఠశాలలకు వచ్చే నిధులు ఆగిపోతాయని చెప్పారు. మునిగడప పాఠశాలలో భోజనం చేసే విద్యార్థుల సంఖ్యకు, రికార్డు నమోదులో తేడా ఉండడం వల్ల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సైదులు, కనకయ్య సరిత తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారిణికి సీపీ అభినందనలు సిద్దిపేటకమాన్: ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన రశ్మితరెడ్డిని సీపీ అనురాధ సోమవారం అభినందించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 9వ తరగతి చదువుతన్న రశ్మితరెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. సీపీ, పోలీసు అధికారులు అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమయ పాలన పాటించండి డీఎంహెచ్ఓ పల్వాన్కుమార్ సిద్దిపేటకమాన్: పల్లె దవాఖాన వైద్యులు, సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వాన్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో డీఎంహెచ్ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. పల్లె దవాఖాన వైద్యుల అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యులు పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో అలసత్వం తగదని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలుంటే తెలపండి జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: వైద్యులు, పేషెంట్లకు ఏమైనా సమస్యలు ఉంటే లీగల్ ఎయిడ్లో తెలపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను న్యాయమూర్తి స్వాతిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లీగల్ ఎయిడ్ క్లినిక్లో ఒక ప్యానెల్ లాయర్, పారా లీగల్ వలంటరీని నియమించినట్లు తెలిపారు. ఈ సెంటర్ ద్వారా న్యాయపరమైన సలహాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, సైకియాట్రి విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, ఆర్ఎంఓలు పాల్గొన్నారు. -
బాలికల విద్యకు తోడ్పాటు భేష్
డీఐఈఓ రవీందర్రెడ్డిసిద్దిపేటడ్యుకేషన్(సిద్దిపేట): బాలికల విద్యకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటునివ్వడం అభినందనీయమని ఇంటర్మీడియెట్ విద్యశాఖ జిల్లా అధికారి రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్రెడ్డి మాట్లాడు తూ మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం సామాజిక సేవా కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 60మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్ అందజేయడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు పై చదువులకు ఉపయోగించి ఉన్నతంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు పాలొన్నారు. -
మార్చి నుంచి పంచాయతీలను నిర్వహించలేం..
నిధులు విడుదల చేయాల్సిందే.. పంచాయతీ కార్యదర్శులు స్పష్టీకరణ జగదేవ్పూర్(గజ్వేల్): గ్రామ పంచాయతీల నిర్వహణను మార్చి నెల నుంచి చేయలేమని కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ల పదవీకాలం పూర్తయి యేడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. పంచాయతీ నిర్వహణ కార్యదర్శిలపై పడుతోందని వాపోయారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు, రాష్ట్ర పైనాన్స్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. -
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది జిల్లాలోని కార్యదర్శుల పరిస్థితి. గ్రామంలో రోజు వారీ పనులు, మరో వైపు ప్రభుత్వ పథకాల అమలు చేసే పనుల్లో నిత్యం బీజీగా ఉండే కార్యదర్శులు పెండింగ్ బిల్లులు, నిధుల లేమి సమస్యతో సతమతమవుతున్నారు.
ఏడాది గడుస్తున్నా పెండింగ్లోనే బిల్లులు ● ఒత్తిడిలో గ్రామ కార్యదర్శులు ● సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకోలు దుబ్బాకటౌన్: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక నానావస్థలు పడుతున్నామని, నిర్వహణ చేయలేక తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి పంచాయతీ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన చెక్కులు ఇప్పటికీ చెల్లించలేదు. పైగా వాటిని ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. దీంతో ప్రతి పనికి తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీకి రోజువారీ అవసరాలైన పారిశుద్ధ్యం, ట్రాక్టర్కు డీజిల్, వీఽధిదీపాలు, మోటార్ మరమ్మతుల నిర్వహణ, కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కొనేందుకు కూడా చాలా పంచాయతీల్లో ఒక్క రూపాయి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల చేయని ప్రభుత్వం గత వేసవిలో గ్రామస్థాయిలో నీటి సరఫరా కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే కార్యదర్శులు అనేక కష్టాలు పడి నీటి సరఫరా సజావుగా సాగించేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ఆ బిల్లు లను ప్రభుత్వం విడుదల చేయలేదు. పెండింగ్లో ఉన్న చెక్కులు, నిధులను విడుదలచేసి కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలని వారు వేడుకుంటున్నారు. జగదేవ్పూర్ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేస్తున్న కార్యదర్శులు నేరుగా చెల్లించే వెసులుబాటు కల్పించండి గ్రామ పంచాయతీ పన్ను వసూళ్లను ట్రెజరీతో సంబంధం లేకుండా చేయాలి. టీఎస్బీపాస్ అకౌంట్ ద్వారా నేరుగా చెల్లింపులు చేసే వేసులుబాటును ప్రభుత్వం కల్పించాలి. – రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి డబ్బులిస్తేనే డీజిల్ అంటున్నారు.. బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల గ్రామ పంచా యతీ నిర్వహణకు పెట్రోల్ బంకు, ఇతర షాపు యజమానులు ఇవ్వలేమని చెప్తున్నారు. పెండింగ్లో ఉంచిన చెక్కులు, నిర్వహణకు నిధులను వెంటనే విడుదల చేయాలి. – లింగంపల్లి మురళి, జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం ● -
‘స్వశక్తి’కి బిల్లులేవి?
● జిల్లాలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల దుస్తుల సరఫరా ● నాలుగేళ్ల నుంచి రూ.34.80 లక్షల బిల్లులు పెండింగ్లోనే ● టోకెను ఇచ్చిన ఖాతాలో జమకాని డబ్బులు స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలని స్వశక్తి సంఘాల మహిళలు ఆశ పడ్డారు. అధికారులు చెప్పగానే నెలనెలా ఉపాధి పొందవచ్చని టైలరింగ్ ప్రారంభించారు. అయితే మహిళల చేత కుట్టుపని చేయించిన అధికారులు బిల్లులు ఇప్పించడంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు. దీంతో స్వశక్తి మహిళల్లో అసహనం వ్యక్తమవుతోంది. హుస్నాబాద్రూరల్: జిల్లాలోని 18 బీసీ, 21 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలోని దాదాపు 1500 మంది విద్యార్థులకు యేడాదికి నాలుగేసి డ్రెస్సులను స్వశక్తి మహిళలు కుట్టి అందించారు. వారికి ఇప్పటి వరకు రూ.34.80లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వ్యవసాయ కూలీ పనులు మానేసి బట్టలు కుట్టే పనిచేశామని, నాలుగేళ్ల నుంచి బిల్లులు రాకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుందని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో అరుంధతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో 30 మంది సభ్యులు సీ్త్ర శక్తి టైలరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నారు. డీఆర్డీఏ అధికారులు మహిళాసంఘాల సభ్యులు అందరూ స్వయం ఉపాధి పొందాలని చెప్పగానే మొదట పోతారం మహిళలు ముందుకు వచ్చి సీ్త్ర నిధి రుణాలను తీసుకొని మిషన్లు కొనుగోలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కుట్టు శిక్షణతో ఉపాధి పొందిన మహిళలకు మొదట బిల్లులు బాగానే వచ్చేవి. అయితే నాలుగేళ్ల నుంచి రూ.30లక్షల బిల్లులు పెండింగ్లో ఉండటంతో కుట్టు పనినే నమ్ముకొన్న ఆ మహిళలకు పిల్లల స్కూల్ ఫీజులు, నెలనెలా రుణాలు చెల్లించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీ సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థుల డ్రెస్సులు ఈ యేడాది ఇవ్వకపోయినా పాత బిల్లులు చెల్లించడం లేదని మహిళలు వాపోతున్నారు. పెండింగ్లో రూ.1.80 లక్షల బిల్లులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల డ్రెస్సులు కుడితే ఒక్కొక్క డ్రెస్సుకు రూ.75లు ఇస్తామని చెప్పిన అధికారులు రూ.50ల చొప్పున చెల్లించారు. మిగతా రూ.25ల చొప్పున రూ.3లక్షల వరకు రావల్సి ఉంది. వాటితో పాటు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల పిల్లల డ్రెస్సులు కుట్టుపని అప్పగించడంతో వారికి 2024 సెప్టెంబరులోనే డ్రెస్సులు అందించారు. అయినా నేటికీ రూ.1.80లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. అధికారులు బిల్లులు చెల్లించి మహిళలను ఆదుకోవాలని కోరుతున్నారు.కుట్టుపనిలో నిమగ్నంమిషన్ కుడితేనే ఇల్లు గడుస్తది బట్టలు కుడితే రోజుకు రూ.1500 నుంచి రూ.2వేలు వస్తయి. ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి బిల్లులు ఇయ్యక పోవడంతో నెలనెలా మహిళా సంఘం రుణం చెల్లించడం ఇబ్బంది అవుతోంది. కుట్టుపని ఉందని బయట కూలిపనికి పోతలేం. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుడు కూడా తిప్పలైతంది. బిల్లులు వస్తాయని అప్పులుచేస్తే వాటికి వడ్డీలు పెరుగుతున్నా బిల్లులు రావాయె.. అవసరం తీరదాయే. – పి.లక్ష్మి, పోతారం(ఎస్)సచివాలయం చుట్టూ తిరగాలంటే ఎట్లా.. హాస్టల్ విద్యార్థుల డ్రెస్సులు కుట్టిన బిల్లులు రూ.30 లక్షలు రావాల్సి ఉంది. ఆఫీసుల చుట్టూ తిరిగితే బీసీ సంక్షేమశాఖ రూ.10లక్షలు, ఎస్సీ సంక్షేమశాఖ రూ..10లక్షలకు టోకెన్స్ ఇచ్చాయి. మూడు నెలలు గడిచినా డబ్బులు జమకాలేదు. టోకెన్ పట్టుకొని హైదరాబాద్ సచివాలయం చుట్టూ తిరగాలంటే ఎట్లా అయితది. తక్షణం కలెక్టర్ చొరవ చూపాలి. – కనకతార, సీఏ, పోతారం -
పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ● కాంగ్రెస్లో పలువురి చేరిక గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన యువత కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కులగణన సర్వే చరిత్రాత్మకమని చెప్పారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణను సైతం కాంగ్రెస్ పూర్తి చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు విశేష ప్రజాదరణ పొందుతుండగా, ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు శివారెడ్డి, మల్లేశంగౌడ్ల అధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నాయకులు రామలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండపోచమ్మకు ఎంపీ పూజలు
జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్యాదవ్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్లు తమ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనిల్కుమార్యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి అమ్మవారి సారే, ప్రసాదం అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న తర్వాత కొండపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. 5వ వారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది మహేందర్రెడ్డి, కనకయ్య, హరి, చిన్న, సుధాకర్, లక్ష్మణ్, చందు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత
● 317 జీఓకు వ్యతిరేకంగాపోరాడింది బీజేపీయే ● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గజ్వేల్రూరల్: రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలన, రేవంత్రెడ్డి ఏడాది పాలనలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట గజ్వేల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. పట్టభద్రులు, టీచర్లు సామాజిక దృక్పథం ఉన్నవారని, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందోననే ఆలోచనతో ఓటు వేస్తారన్నారు. ఉపాధ్యాయుల బదిలీల సమయంలో 317 జీఓను తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా పోరాడింది బీజేపీయేనని గుర్తు చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టీచర్ల దుఃఖానికి కారణమవుతుందని అన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నాణ్యమైన యువశక్తిని తయారు చేయాలనే సంకల్పంతో బడ్జెట్లో రూ.4లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ మార్గం.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ చూపిన మార్గం అనుసరణీయమని గిరిజన నేత అన్నారు. వివరాలు 9లో u
దూర విద్యను దగ్గరకు చేర్చింది సిద్దిపేటఎడ్యుకేషన్: దూర విద్యను డిజిటల్గా మార్చి దగ్గరకు చేర్చిన ఘనత బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకే దక్కిందని రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి అన్నారు. స్టూడెంట్ సర్వీస్ సెల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆదివారం ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట స్టడీ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ అపార్ నమోదులో దేశంలోనే అంబేడ్కర్ యూనివర్సిటీ ముందుందన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ వైపునకు మరలకుండా వారిలో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కౌన్సిలర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే సిద్దిపేట స్టడీ సెంటర్కు ఎన్ఎస్ఎస్ యూనిట్ను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమేళనానికి శ్రీకారం చుట్టిన స్టడీ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందంను అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఎల్లం, రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరి పరామర్శ
చేర్యాల(సిద్దిపేట): స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నాయకురాలు సింగాపురం ఇందిర అన్నయ్య కర్రొల్ల భాస్కర్ ఈ నెల 14న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం పట్టణకేంద్రానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయనవెంట మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి తదితరులున్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లాఅధ్యక్షుడి సస్పెన్షన్ గజ్వేల్: ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణమాదిగ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి శనిగరి రమేశ్మాదిగలను సస్పెండ్ చేసినట్లు ఆ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కోళ్ల శివమాదిగ ప్రకటించారు. ఆదివారం గజ్వేల్ అంబేడ్కర్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈనేపథ్యంలోనే వారిపై జరిపి, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్మాదిగ, సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు బోనాలతో స్వాగతం కొండపాక(గజ్వేల్): ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా కుకునూరుపల్లిలోని తెలంగాణా తల్లి విగ్రహానికి కవిత పూల మాల వేసి జై తెలంగాణా, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి రాజీవ్ రహదారిపై ఉన్న రవీంద్రనగర్ చౌరస్తా వద్దకు కవిత చేరుకోగానే మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సిద్దిపేటకు వెళ్లారు. కవిత రాకతో ట్రాఫిక్కు 20నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. ఉప కాల్వ ద్వారా సాగు నీరు అందించండి మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక పట్టణ శివారులో ఉన్న సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములకు మల్లన్న సాగర్ ఉప కాల్వ ద్వారా సాగు నీటిని అందించాలని రైతులు కోరారు. ఈమేరకు అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు ఆదివారం రైతులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో దుబ్బాక బాబూ జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు రాజమల్లు, ఉపాధ్యక్షుడు జోగయ్య, కోషాధికారి యాదగిరి, రైతులు పాల్గొన్నారు. కాలి బూడిదైన ఈత చెట్లు గజ్వేల్రూరల్: ఈత చెట్లను దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదీపూర్కు చెందిన గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద 500 ఈత చెట్లను పెంచి వాటి ద్వారా ఉపాధి పొందుతున్నామన్నారు. ఈ క్రమంలో ఆదివారం 40 చెట్ల వరకు కాలిపోయినట్లు సంఘం సభ్యులు గుర్తించారని, ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కడియం -
డైలమాలో పౌల్ట్రీ రైతులు
● బర్డ్ ఫ్లూ దెబ్బతో విలవిల ● ఉత్పత్తుల తరలింపులోనూ తీవ్ర జాప్యం ● ఉమ్మడి మెదక్ జిల్లాలో దుస్థితి ● తెలుగు రాష్ట్రాల కోళ్ల ఉత్పత్తుల్లోసింహభాగం ఇక్కడే గజ్వేల్: పౌల్ట్రీ రంగాన్ని తరుచూ ఏదో అంశం కుదిపేస్తూనే ఉంది. తాజాగా బర్డ్ఫ్లూ ప్రచారంతో ఈ పరిశ్రమకు గట్టి దెబ్బే తగలింది. ఉమ్మడి మెదక్ జిల్లా(సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లో వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ వెలుగొందుతోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉత్పత్తులను ఈ ప్రాంతం అందిస్తున్నది. పౌల్ట్రీపై ప్రతి నెలా వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు సాగుతున్నాయి. ఎంతోమంది రైతులు దశాబ్దాలుగా సొంతంగా పరిశ్రమను నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీనే తమ జీవితంగా మలుచుకున్నారు. కంపెనీల మాయాజాలం ఇంటిగ్రేషన్ కంపెనీల మాయాజాలంతో సొంతంగా పౌల్ట్రీ పరిశ్రమను నిర్వహిస్తున్న రైతులను కుంగదీస్తున్నది. రైతు నుంచి తక్కువ ధరకు కోళ్లను కొనుగోలు చేస్తున్న కంపెనీలు బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి అమ్ముకుంటున్నాయి. ఇకపోతే జిల్లాలో వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమాండ్, జాప్నవి, జానకీ, ఎస్ఆర్, స్నేహా, విమల తదితర ఇంటిగ్రేషన్ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్, లేబర్, కరెంట్, నీరు వంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో కోడిపై కిలోకు రూ.5–6కుపైగా చెల్లిస్తాయి. నిర్వహణ బాగుంటే మరో 50పైసలు అదనంగా చెల్లిస్తారు. ఇదిలాఉంటే ఇంటిగ్రేటెడ్ సంస్థల ఒప్పందం ప్రకారం ఉత్పాదక వ్యయం భారీగా పెరిగితే మాత్రం రైతులు నష్టాలు భరించాల్సి ఉంటుంది. 5శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాతపడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్ ఛార్జీల రూపేణా 5వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్కు 45రోజులకు రూ.5వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకూ మిగులుతున్నది అంతంతమాత్రమే. ఫౌల్ట్రీ రంగంలో వరుసగా వస్తున్న నష్టాలను నియంత్రించడానికి రైతులకు కరెంట్, దాణాలో సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ఎన్నోఏళ్లుగా ప్రభుత్వం ముందు ఉన్నది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడటంలేదు.బర్డ్ ఫ్లూ దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. సొంతంగా పరిశ్రమను నడుపుకుంటున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వీరంతా కోళ్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలా? వద్దా? అనే డైలమాలో పడ్డారు. మరోవైపు ఇంటిగ్రేషన్ రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. బర్డ్ ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కంపెనీలు ఉత్పత్తులను లిఫ్టింగ్ చేయడానికి సమయం తీసుకుంటున్నాయి. దీనివల్ల నిర్వహణ భారం రైతులకు తప్పడం లేదు. కోళ్ల ఉత్పత్తుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా వర్ధిల్లుతున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి ఇది. ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేశా.. 30 ఏళ్లుగా పౌల్ట్రీ రంగంలో ఉన్నాను.16వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్డు నిర్వహిస్తున్నా. 15 రోజుల కిందటే అన్ని కోళ్లను అమ్మేశాను. ప్రస్తుతం బర్డ్ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కొత్త కోడిపిల్లల ఉత్పత్తిని ఆపేద్దామని నిర్ణయించుకున్నా. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తా. – వెంకట్రెడ్డి పౌల్ట్రీఫామ్ నిర్వాహకుడు, ఇందుప్రియాల్, దౌల్తాబాద్ మండలంఒక్కో కోడిపై రూ.195కుపైగా ఖర్చు.. సాధారణంగా కోడి పిల్లలను 45రోజులు పెంచుతారు. చిక్స్ రూ.45, దాణాకు (కోడి పెరిగేంతవరకు) రూ.140, ఇతర ఖర్చులు మరో రూ. 10కి పైగా ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన ఒక్కో కోడిని ఉత్పత్తి చేయడానికి అన్నీ కలుపుకొని రూ.195కిపైగా ఖర్చవుతున్నది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే లైవ్ బర్డ్స్ ధర రూ.220కి పైగా పలికితే నష్టాలు ఉండవు. కానీ ప్రస్తుతం బర్డ్ఫ్లూ నేపథ్యంలో లైవ్ బర్డ్ ధర రైతుల నుంచి తీసుకెళ్లే కంపెనీలు కిలోకు రూ.52 మాత్రమే చెల్లిస్తున్నాయి. అంటే రెండు కిలోల బరువుంటే లైవ్ బర్డ్కు రూ.104మాత్రమే ధర దక్కుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా పరిశ్రమను నడుపుకునేవారు లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారంతా ప్రస్తుతం కొత్త కోడి పిల్లల ఉత్పత్తిని ఆపేశారు. -
కాలినడక కాలచక్రం
ఒకప్పుడు ఎంతదూరమైనా బడికి కాలినడకనో సైకిళ్లపైనో వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఆటో రిక్షాలు, బస్సులు, సొంత వాహనాల్లో వెళ్తున్నారు. పుస్తకాలను ఒకప్పుడు వస్త్రాలతో లేదా గోనెసంచిలతో కుట్టిన బ్యాగుల్లోనో, సిల్వర్ బాక్స్ల్లోనో బడికి తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు అనేక ఆకర్షణీయమైన స్కూల్ బ్యాగుల్లో తీసుకెళ్తున్నారు. గ్రౌండ్లో ఆటల దగ్గర్నుంచి మొబైల్లోనే ఆటలాడుకునే దశకు వచ్చింది పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లేక్రమంలో కాలక్రమేణా వచ్చిన మార్పులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.8లో -
విద్యార్థుల పురోగతికి డిజిటల్ లెర్నింగ్
● బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ● వర్గల్ పూలే మహిళా డిగ్రీ కళాశాలలో డిజిటల్ ల్యాబ్ ● ‘ప్యూర్’సంస్థ ద్వారా 20 ల్యాప్టాప్లు వితరణవర్గల్(గజ్వేల్): డిజిటల్ లెర్నింగ్ విధానంలో పురోగతి సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అన్నారు. శనివారం వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు భవిష్యత్లో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులతో మన జీవనశైలి మరింత ఆధునికంగా మారనుందని, విద్యార్థులు ఈ దిశగా విద్యను అభ్యసించాలని సూచించారు. డిజిటల్ లెర్నింగ్ కోసం ఫ్యూర్ సంస్థ(పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సహాయం అభినందనీయమన్నారు. ప్యూర్ సంస్థ సీఈఓ డాక్టర్ శైలా తాల్లూరి డిజిటల్ ల్యాబ్ కోసం 20 ల్యాప్టాప్లను అందించి.విద్యార్థులతో యూత్ హబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సామాజిక, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ను ప్రోత్సహించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్జిల్లా ఆర్సీఓ గౌతమ్కుమార్, కాగ్నిజెంట్ సీనియర్ మేనేజర్ శివ బవనరి, ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త మెనూ ప్రకారమే భోజనం
● కలెక్టర్ మనుచౌదరి ● గజ్వేల్లోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన గజ్వేల్రూరల్: గురుకులంలోని విద్యార్థినులకు కొత్త డైట్ మెనూ ప్రకారమే భోజనం అందించాలని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, సామగ్రి దొరకలేదని సాకులు చెబితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో పాతూరు చౌరస్తా వద్దగల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ బైపీసీ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృథా చేయవద్దని, కష్టపడి చదువుతూ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. అనంతరం గురుకులంలోని విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వంట సామగ్రి, డార్మెటరీలో మరమ్మతులు చేయాల్సి ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తస్లిమా సుల్తానా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహాసీల్దార్ శ్రావణ్, ఎంపీడీవో ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
17 ఏళ్ల కల సాకారం
● 2008 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరిన వేళ ● సుదీర్ఘ నిరీక్షణకు తెర ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 184 మంది నియామకంప్రశాంత్నగర్(సిద్దిపేట): ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల పోరాటానికి తెరపడింది. 2008లో ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నిర్వహించిన అప్పటి ప్రభుత్వం, ఎస్జీటీ ఉద్యోగాలను డీఈడీ, బీఈడీ అభ్యర్థులతో 70: 30తో భర్తీ చేసే విధంగా ప్రణాళికా రూపొందించింది. అయితే డీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలు పూర్తిగా మాకే ఇవ్వాలని డిమాండ్ చేయగా, నాడు వారితోనే ఉద్యోగాలు భర్తీ చేసింది. కాగా అప్పటికే అప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న బీఈడీ అభ్యర్థులు తమకు ఎస్జీటీలో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కోర్టును సైతం ఆశ్రయించారు. 17 ఏళ్ల అనంతరం కోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ పద్దతిలో ఎస్జీటీ ఉద్యోగాలు కేటాయించింది. నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది బీఈడీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. శనివారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 292 అభ్యర్థులు గాను 184 మంది హాజరయ్యారు. వీరు ప్రతి నెల రూ. 31,040 వేతనంగా పొందనున్నారు. దీంతో తమకు జీవితంలో ఉద్యోగం వస్తుందో రాదో అన్న బాధలో నుంచి తేరుకున్నారు. అలాగే పలుచోట్ల ఖాళీగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కానున్నాయి. -
ఎమ్మెల్సీ బరి.. పార్టీల గురి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ ● ప్రచారం జోరు పెంచిన అభ్యర్థులు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, ఉపాధ్యాయకు 15 మంది పోటీ ఉదయం, సాయంత్రం ప్రచారం పాఠశాలలో తరగతులు కొనసాగుతున్న సమయాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. దీంతో అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. సాయంత్రం గెట్ టు గెదర్ నిర్విహిహంచి దావత్లతో మచ్చిక చేసుకుంటున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండటం.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది పోటీ చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావు, దేవునూరి రవీందర్తో పాటు మరో 51 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మద్దతుతో జగ్గు మల్లారెడ్డితో పాటు 11 మంది బరిలో నిలిచారు. శనివారం హుస్నాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేటలో బీజేపీ నాయకులతో ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ సమావేశం నిర్వహించి ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీకి రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నాయకుడు బాణాల లక్ష్మారెడ్డిని నియమించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. స్థానిక నాయకులకు 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రతి ఓటరును నాలుగు సార్లు కలిసి పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చే బాధ్యత వీరిదే. కాంగ్రెస్ పార్టీ ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని, నియోజకర్గ వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్రెడ్డి సైతం పీఆర్టీయూ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. -
సంతోషంగా ఉంది
నేను 2008లో ఎస్జీటీలో 1,380 ర్యాంకు సాధించాను. అయితే మాకు పోస్టింగ్ ఇచ్చే సమయంలో వివిధ కారణాలతో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. 17 ఏళ్ల అనంతరం ఉద్యో గం లభించడం సంతోషంగా ఉంది. నాకు ధూళ్మిట్ట మండలం బెక్కల్ పాఠశాలను కేటాయించారు. – స్వప్న, 2008 డీఎస్సీ అభ్యర్థి ఇప్పటికై నా గుర్తించారు బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ ఉద్యోగం ఇవ్వకపోవడం సరికాదు. అప్పుడే మాకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే సర్వీస్ పిరియడ్ పెరిగేది. ఇన్ని సంవత్సరాల తర్వాత అయిన ప్రభుత్వం స్పందించడం సంతోషంగా ఉంది. నాకు కోహెడ మండలం శ్రీరాములపల్లి పాఠశాలను కేటాయించారు. – మాధవి, 2008 అభ్యర్థి రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది 2008 డీఎస్సీలో నాకు ఎస్జీటీలో 484 ర్యాంకు వచ్చింది. కాని పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్దతిన కాకుండా రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది. నాకు బెజ్జంకి మండలం మల్లంచెరువు పాఠశాలను కేటాయించారు. – ప్రమోద్, 2008 డీఎస్సీ అభ్యర్థి -
రాష్ట్రస్థాయికి మూడు ప్రాజెక్టులు ఎంపిక
పర్యవేక్షకులు, విద్యార్థులకు అభినందనలు దుబ్బాక: కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి 14 విభాగాల్లో 1047 ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళశాల నుంచి ఆరు ప్రాజెక్టులు రాగా 3 ప్రాజెక్టులు ఎంపిక కావడం విశేషం. వృక్షశాస్త్రం విభాగం నుంచి డాక్టర్ స్వాతి పర్యవేక్షణలో ఫెసిలిటేటెడ్ ఫారెస్టు రీజనరేషన్ ఇన్ దుబ్బాక్ రిజర్వ్ ఫారెస్ట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం నుంచి ఆంజనేయులు, పర్యవేక్షణలో నెగోషియేషన్ ఇన్ కామర్స్ అండ్ స్టడీ టెక్స్టైల్ అండ్ ఓకల్ ఇంటరాక్షన్ తెలుగు విభాగంలో డాక్టర్ వెంకటేష్ , నాగరాజు.. పర్యవేక్షణలో నేటి యువతరంలో తెలంగాణ భాష అనే ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులకు మార్చి 5,6 తేదీల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ప్రాజెక్టులు ఎంపిక కావడంపై కళాశాలలో ప్రిన్సిపాల్ భవాని, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, జిజ్ఞాస కో ఆర్డినేటర్ వెంకట్రెడ్డి పర్యవేక్షకులు, విద్యార్థులను అభినందించారు. ప్రాక్టికల్స్ పరీక్షల పరిశీలన బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షలను శనివారం సిద్దిపేట డీఐఈఓ రవీందర్రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగే పరీక్షలను ఇంటర్మీడియట్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసేలా కమిషనర్ నియంత్రించినట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రాక్టికల్స్, పరీక్షలను విద్యార్థులు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు గంగాధర్, ప్రిన్సిపాల్ దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. కరాటే గ్రేడింగ్ పరీక్షలు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలోగల సెయింట్ జోసెఫ్ స్కూల్లో కోచ్లు శ్రీనివాస్, రజిత ఆధ్వర్యంలో శనివారం కరాటే గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్ట్లను సాధించారని వారు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టెక్నికల్ ఎక్సామినర్ పాపా య్య, ప్రిన్సిపాల్ షాలిని పాల్గొన్నారు. రామయ్య పంతులు సేవలు మరువలేనివి జగదేవ్పూర్(గజ్వేల్): జగదేవ్పూర్ గాంధీ, మాజీ సర్పంచ్ దివంగత నరసింహరామయ్య పంతులు సేవలు మరువలేనివని ఏఎన్ఆర్ పీపుల్స్ ట్రస్టు చైర్మన్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్శర్మ అన్నారు. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగదేవ్పూర్ను మండలంగా చేసేందుకు ఎంతో కృషిచేశారని, ప్రజాసేవకుడిగా ప్రజల్లో నిలిచిపోయారని తెలిపారు. వివిధ పార్టీల నాయకులు మహేందర్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కనకయ్య, ఇక్బాల్, శ్రీధర్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా పాలనను ఆశీర్వదించండి
హుస్నాబాద్రూరల్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికి ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్లో ఏర్పాటు చేసి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామని చెప్పారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యావేత్త నరేందర్రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పోటీలో లేదు.., బీజేపీ అభ్యర్థిది మన ప్రాంతం కాదన్నారు. బీజేపీ అభ్యర్థి ఓటు అడిగితే మోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయాలని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి మాట్లాడుతూ..తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కర్ణకంటి మంజులారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ముత్యాల సంజీవరెడ్డి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ సేవలు శ్లాఘనీయం గిరిజనుల ఆరాధదైవం సేవాలాల్ మహారాజ్ సేవలు శ్లాఘనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ బంజార భవన్లో ఏర్పాటు చేసి సంతు సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పిస్తాంహుస్నాబాద్: రాష్ట్రంలో మొదటిసారి కులగణన సర్వే చేశామని మంత్రి పొన్నం అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము వందశాతం కులగణన చేశామని, చెప్పడం లేదని, మిగిలిన 3శాతం జనాభాను సర్వేలో పాల్గొనేందుకు ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. ప్రతిపక్షాలు సర్వేలో పాల్గొని, మిగతా వారు పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. బీసీల జనాభా 52 శాతం ఉందని సర్వేలో తేలిందని, 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు మీరు మద్ధతు ఇస్తారా లేక, వ్యతిరేకిస్తారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుపడపితే ప్రధానిని కూడా వదలపెట్టబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి మంత్రి పొన్నం ప్రభాకర్ -
రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి
గజ్వేల్రూరల్: రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో మనుషుల ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. పట్టణంలోని వేంకటేశ్వరాలయ ప్రాంగణం వద్ద శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వాళ్లమవుతామని అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఐఎంఏ గజ్వేల్ అధ్యక్షులు నాగమున్నయ్య, వైద్యులు నరేష్బాబు, లింగం, ఆలయ పూజారి శేషం శ్రీనివాసచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు
● దెబ్బతిన్న పంటలు ● దుబ్బాక–మల్లాయపల్లి మధ్య రాకపోకలు బంద్దుబ్బాక: మల్లన్నసాగర్ కాల్వకు శుక్రవారం గండి పడింది. ప్రాజెక్టు నుంచి నీరు ఎక్కువగా వదలడంతో ఉధృతికి 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు మల్లాయపల్లి శివారులో గండిపడి నీరంత వృథాగా పోయింది. ఉధృతంగా నీరు ప్రవహించడంతో మల్లాయపల్లి ప్రధాన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో దుబ్బాక–మల్లాయపల్లి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ను పలు గ్రామాల చెరువులతో పాటు రాజన్నసిరిసిల్ల జిల్లా కొత్తపల్లి వరకు చెరువులు, కుంటలతో పాటు పంటలకు నీరందిచేందుకు నిర్మించారు. కాల్వకు చాలా చోట్ల సీసీ పోయకుండా వదిలేశారు. దీంతో ప్రధాన కెనాల్ నుంచి నీరు ఎక్కువగా వదలడంతో గండిపడింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని గండిపడ్డ కాల్వను పూడ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. కొట్టుకుపోయిన రోడ్డు ఇరువైపులా బారికేడ్లను పెట్టి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెనాల్ నుంచి నీటిని నిలిపివేశామని శనివారం ఉదయం లోగా నీటి ఉధృతి తగ్గుతుందని అన్నారు. నీరు తగ్గాక గండిపూడ్చడంతో పాటుగా రోడ్డు మరమ్మతు పనులు చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా కాల్వకు గండిపడి నష్టం జరిగిన పంటలకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొట్టుకుపోయిన దుబ్బాక–మల్లాయపల్లి రోడ్డు -
గురి తప్పొద్దు.. ఆత్మవిశ్వాసం వీడొద్దు
పోలీస్ ఫైరింగ్ ప్రాక్టీస్ను పరిశీలించిన సీపీ నంగునూరు(సిద్దిపేట): శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అలవడుతుందని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. రాజగోపాల్పేటలో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను శుక్రవారం సీపీ తనిఖీ చేశారు. ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు మధు, సతీష్, పురుషోత్తంరెడ్డి, సువన్కుమార్, రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా సమీపం నుంచి ముష్కరులను ఎదుర్కోవడం, స్కిల్ డెవలప్మెంట్, వివిధ ఆయుధాలతో ఫైరింగ్ చేయడంపై శిక్షణ ఇచ్చారు. కమిషనర్ సైతం ఎంపీ 5 పిస్తల్, గ్లాక్ వెపన్తో ఫైరింగ్ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ శిక్షణ ద్వారా నైపుణ్యం, ఆలోచన విధానం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. పోలీసులు అన్ని రకాల ఆయుధాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఫైరింగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారి భూ సర్వే అడ్డగింత
● అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం ● ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ● పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ● చేసేది లేక వెనుదిరిగిన అధికారులు కొండపాక(గజ్వేల్): జప్తినాచారం గ్రామ శివారులో జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను శుక్రవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో అధికారులు సర్వే చేసి పట్టా భూముల్లో హద్దులు పాతారు. ఇటీవల సర్వే అధికారులు పెట్టిన హద్దులను పరిశీలించడానికి నేషనల్ హైవే రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జప్తినాచారం, దుద్దెడ, మర్పడ్గ, ఖమ్మంపల్లి, తడ్కపల్లి, ఎన్సానిపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బాధిత రైతులు జప్తినాచారం శివారులోకి ఉదయమే చేరుకున్నారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం తగదని వారు వాపోయారు. సాయంత్రం 4 గంటలకు నేషనల్ హైవే నిర్వహణ ఉన్నతాధికారి రాకపోగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నయ్యతో అధికారులు సర్వే పనులను పరిశీలించడానికి వచ్చారు. దీంతో సమాచారం ఇవ్వకుండా పట్టా భూముల్లో ఎలా సర్వే చేస్తారంటూ బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను చేయనిచ్చేది లేదంటూ అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు లేకుండా కేవలం నేషనల్ హైవే నిర్వహణ అధికారులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే పనులను అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారం మేరకు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, తొగుట, త్రీటౌన్ సీఐలు లతీఫ్, విద్యాసాగర్, ఎస్ఐ శ్రీనివాస్లతో పాటు సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో చేసేది లేక సర్వే పనుల పరిశీలన కోసం వచ్చిన అధికారులు వెనుదిరిగారు. అంతకు ముందు హైవే రూట్ మ్యాప్ను మార్చుతూ తక్కువ భూములు కోల్పోయేలా చూడాలని ఇంజనీర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగిరం చేయండి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● రెవెన్యూ, సర్వే అధికారులతోకలెక్టర్ సమావేశంసిద్దిపేటరూరల్: ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కేటాయించిన భూ సేకరణ పనులు వేగిరం చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో టీజీఐఐసీ, రెవెన్యూ సర్వే అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేటాయించిన మండలాల్లో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన వెంటనే కాంపౌండ్ ఏర్పాటు చేయాలన్నారు. టీజీఐఐసి, రెవెన్యూ, సర్వే అధికారుల సమన్వయంతో భూసేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, టిజిఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ, డీజిఎం ఉమామహేశ్వర్, డీఈ జ్యోతి, డీఎం మహేశ్వర్ , మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించండి చేర్యాల(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, సరుకులను పరిశీలించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వండి విద్యార్థులకు వడ్డించాలని స్కూల్ ప్రిన్సిపాల్ పుల్లయ్యను ఆదేశించారు. గతంలో పదో తరగతి పరీక్షలో వచ్చిన ఉత్తీర్ణత శాతం వివరాలపై ఆరా తీశారు. అనంతరం మండల పరిధిలోని ముస్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఏఎన్సీ, ఈడీడీ, ఓపీ, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆరోగ్య మహిళ తదితర రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్... కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణపనులు పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. -
నేడు పోలింగ్ కేంద్రాల తుది జాబితా
సిద్దిపేటజోన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా శనివారం విడుదల కానుంది. ఈ మేరకు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ రమేష్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా మేరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. డ్రాఫ్ట్ జాబితా మేరకు 230 ఎంపీటీసీల స్థానాలకు సంబంధించి 1293 పోలింగ్ కేంద్రాల గుర్తింపు పై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెరిగిన మూడు జెడ్పీటీసీ స్థానాలకు అనుగుణంగా ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మోహన్ లాల్(బీఆర్ఎస్), వెంకట్(బీఎస్పీ) రవి(సీపీఎం), కల్యాణ్(బీజేపీ)తో పాటు నాగరాజు, అధికారులు పాల్గొన్నారు. -
రక్త నిల్వలు ఖాళీ!
జిల్లాలోని బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు ఖాళీ అవుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు.. సుమారు 30 మంది మహిళలు పురుడు పోసుకుంటున్నారు. ఇందులో చాలా మందికి రక్తం అవసరం అవుతోంది. తలసేమియా బాధితులకు సైతం పదిహేను రోజులకొకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటోంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. జీజీహెచ్(ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి)లో బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇందులో నిల్వలు తగ్గడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఏబీ నెగిటివ్ స్టాక్ నిల్ ● బ్లడ్ బ్యాంక్లో 60 యూనిట్లే నిల్వ ● వచ్చేది వేసవి కాలం మరింత తగ్గే అవకాశం ● రక్తదాన శిబిరాలు నిర్వహించాలంటున్న అధికారులు సాక్షి, సిద్దిపేట: జిల్లాలో రక్తనిల్వలు తగ్గడంతో వేసవిలో ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులున్నాయి. కొరతను అధిగమించేందుకు దాతల సహకారం అవసరం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం కావాలంటే ఇతరుల నుంచి సేకరించి ఇవ్వాల్సి వస్తోంది. జీజీహెచ్లో ఏబీ నెగిటివ్ బ్లడ్ స్టాక్ లేదు. బ్లడ్ బ్యాంక్ మొత్తంగా 60 యూనిట్ల రక్తం మాత్రమే నిల్వ ఉంది. అందులో ఏబీ పాజిటివ్ 6, ఓ పాజిటివ్ 18, బీ పాజిటివ్ 15, ఏ పాజిటివ్ 11, ఏ నెగిటివ్ 1, ఓ నెగిటివ్ 2 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రక్తం కొరత ఉండటంతో బ్లడ్ అవసరం ఉన్న వారి తరుపున ఒకరు డోనేట్ చేస్తే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో డోనర్ కోసం రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కొరత ఉండే నెగిటివ్ గ్రూప్లకు సంబంధించిన ఫోన్ నంబర్లకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు. ఎవరు ఇవ్వొచ్చంటే.. 18–55 వయసు ఉండి.. 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారే రక్తదానం చేయాలి. మనిషి శరీరంలో సుమారు 5లీటర్ల వరకు రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల మేర రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయడంతో శరీరంలో ఐరన్, మినరల్ లెవెల్స్ సమస్థాయిలో ఉండి, శరీరానికి మేలు చేస్తాయి. స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి రక్త నిల్వలు సమకూరేందుకు యువత, రాజకీయ పార్టీ నేతలు, సినీ హీరో అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. వచ్చేది వేసవి కాలం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. రక్తం కొరత నుంచి గట్టెక్కించ్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. యువత, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. దాతలు ముందుకు రావాలి... రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలి. పోలీసు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థులచే క్యాంప్లను ఏర్పాటు చేసి బ్లడ్ను సేకరించనున్నాం. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్లో రక్తం కొరత లేదు. – డాక్టర్ శ్రావణి, మెడికల్ ఆఫీసర్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్సంవత్సరం సేకరించిన యూనిట్లు2017 2,500 2018 2,840 2019 3,210 2020 2,200 2021 2,848 2022 3,266 2023 2,950 2024 2,736 2025 ఇప్పటి వరకు 285 -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ కోహెడరూరల్(హుస్నాబాద్): సాక్షి దినపత్రికలో ఈ నెల 13న ‘మూడు గంటలకే ఆస్పత్రికి తాళం’.. సిబ్బంది ఇష్టారాజ్యం అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ స్పందించారు. ఈమేరకు శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. 24గంటలు అందుబాటులో గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను అందించాలన్నారు. అదేవిధంగా సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నిమ్రాని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ‘పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే ’మిరుదొడ్డి(దుబ్బాక): రాజకీయ పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కూరెల్లి జస్వంత్రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు సేంద్రియ వ్యవసాయ ప్రముఖ్ సత్తు రాజిరెడ్డి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు వజ్జపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన శుక్రవారం మిరుదొడ్డిలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగు నీరు, విద్యుత్, రెవెన్యూ సమస్యలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, విత్తనాల అధిక ధరల అమ్మకం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొటున్న సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు గ్రామ స్థాయిలో రైతు కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, జిల్లా కార్యదర్శి చెంద్రాగౌడ్ రైతులు పాల్గొన్నారు. కేసీఆర్ కృషి వల్లేగ్రీనరీలో నంబర్వన్ గజ్వేల్: కేసీఆర్ కృషి వల్ల గ్రీనరీలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఆవిర్భవించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదంతో బీఆర్ఎస్ నేత జోగినిపల్లి సంతోష్కుమార్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న వృక్షార్చన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను శుక్రవారం గజ్వేల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జన్మదినం రోజున కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సైతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులు నవాజ్మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
నార్కోటిక్స్ డాగ్స్తో తనిఖీలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నార్కోటిక్స్ డాగ్స్తో సిద్దిపేట టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులు, పాన్ షాప్స్, హోటల్స్ ఇతర అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కలిగి ఉన్నా చట్టరీత్యా నేరమన్నారు. మత్తుపదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908, పోలీస్లకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు విజయ్ కుమార్, రమేశ్, పోలీస్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించండి గజ్వేల్రూరల్: వ్యాపారులు, గృహ సముదాయాల వారు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ నర్సయ్య కోరారు. బుధవారం పట్టణంలోని గృహ, వాణిజ్య సముదాయాల మొండి బకాయిలు వసూలు చేశారు. అలాగే వ్యాపార సముదాయాలను పరిశీలిస్తూ కొలతల
మూడు గంటలకే ఆస్పత్రికి తాళం సిబ్బంది ఇష్టారాజ్యం కోహెడరూరల్(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 3 గంటలకే ఆస్పత్రిని మూసివేస్తున్నారు. రోజూ సమయపాలన పాటించకపోడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం మండంలోని తంగళ్ళపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లాడు. ఆస్పత్రి మూసి ఉండటంతో చేసేదిలేక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సరైన సమయానికి రాకపోవడంతో రోగులు గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఈ విషయంపై వైద్యురాలు నిమ్రాని వివరణ కోరగా ‘సిబ్బంది సరిపడా లేరు. మమ్మల్ని ఏం చేయమంటారు. మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పట్టించుకోవడంలేదు’ అంటూ సమాధానం ఇచ్చారు. -
హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం
దుబ్బాకటౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని ఆర్య వైశ్య భవన్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, చదువుకున్న యువతీ, యువకులు బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ ఉత్తమ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల తరఫున పోటీ చేస్తున్న అంజిరెడ్డి, ఉపాధ్యాయుల తరపున కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించి, బీజేపీ సత్తాను మరోసారి చాటాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట, సంగారెడ్డి బీజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, గోదావరి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు తదితరులున్నారు.బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి -
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొమురవెల్లి మండలంలో అయినాపూర్ పల్లె దవాఖాన. సొంత భవనం లేకపోవడంతో గ్రామ పంచాయతీలోనే సేవలు అందిస్తున్నారు. ఈ పల్లె దవాఖానాకు వైద్యుడు సైతం లేరు. దీంతో ఏ చిన్న రోగం వచ్చినా వేరే ఊరికి పరుగులు తీయాల్సిందే. పల్లెల్లో ఏర్పాటు చేసిన దవాఖ
సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా 194 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా అందులో 108 వాటిని పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేశారు. 3 వేల నుంచి 5వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యాయి. ఆరోగ్య ఉపకేంద్రాలలో గతంలో వ్యాధి నిర్ధారణ చేయలేని పరిస్థితి ఉండేది. జ్వరం, జలుబు, తలనొప్పి, విరేచనాలు వంటి చిన్న సమస్యలకే మందులు ఇచ్చేవారు. ఉపకేంద్రం పరిధిలోని వారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడితే సమీపంలోని పీహెచ్సీకి, జిల్లా ఆస్పత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో దవాఖానాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సేవలు అందిస్తారు. ఇందులోఒక వైద్యాధికారి, ఇద్దరు ఏఎన్ఎంలతో పాటు ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తారు. ప్రజలకు 12 రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. గర్భిణులకు, పిల్లలకు బుధ, శనివారాల్లో వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లలకు టీకాలు వేస్తారు. క్యాన్సర్ మధుమేహ, రక్తపోటు బాధితులకు పల్లె దవాఖానాల్లో తగిన పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. వారంలో ఒక రోజు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రి, పీహెచ్సీలకు సిఫారుసు చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా పలు దవాఖానాలకు వైద్యులు లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. చాలా ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్క భవనాలు లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారు. 33చోట్ల ఖాళీలు పల్లె దవాఖానాలలో 33 చోట్ల వైద్యులు లేకపోవడంతో ఏఎన్ఎం వరకే పరిమితం అయ్యాయి. అక్బర్పేట్(భూంపల్లి), ధర్మారెడ్డిపల్లి, బంగ్లా వెంకటాపూర్ (అహ్మదీపూర్), గట్లమల్యాల, వడ్లెపల్లి(ఇందుప్రియాల్), పీర్లపల్లి(జగదేవ్పూర్), తంగళ్లపల్లి (కోహెడ), ముస్త్యాలపల్లి, అయినాపూర్ (కొమురవెల్లి), కొండపాక, బంధారం, మార్పడగ (కొండపాక)లో వైద్యులు లేరు. అలాగే మంగోల్ (కుకునూరుపల్లి), బైరాన్పల్లి, అర్జునపట్ల, దూల్మిట్ట (మద్దూరు), చుంచుకోట(ముస్త్యాల), దామెరకుంట(మర్కూక్), చేర్యాల–1, 3, ప్రశాంత్నగర్(పుల్లూరు), రాజక్కపేట, శ్రీగిరిపల్లి ( ప్రజ్ఞాపూర్), రాయవరం, వట్పల్లి, చాట్లపల్లి (తీగుల్), దుబ్బాక–ఏ, గుడికందుల, ఆర్ఆర్కాలనీ(తొగుట), మాజిద్పల్లి, గౌరారం, నాచారం, గీర్మాపూర్(వర్గల్) వైద్యులు లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వైద్యం కోసం పీహెచ్సీ, జిల్లా ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికై నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి వైద్యులను నియమించాలని కోరుతున్నారు. త్వరలో భర్తీ చేస్తాం పల్లె దవాఖానాలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం. ఇందుకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం – డాక్టర్ పల్వాన్, డీఎంహెచ్ఓ -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
● సిద్దిపేటలో దుబ్బాక ఆర్ఐ పట్టివేత ● రూ.లక్ష నగదు స్వాధీనం ● వారసత్వ పట్టా మార్పు కోసంలంచం డిమాండ్ సిద్దిపేటజోన్: భూమికి సంబంధించి వారసత్వ పట్టా మార్పు కోసం లక్ష నగదు లంచంగా తీసుకుంటూ దుబ్బాక ఆర్ఐ నర్సింహారెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టబడ్డాడు. సిద్దిపేట పట్టణం బీజేఆర్ చౌరస్తాలోని ఒక టీ స్టాల్ వద్ద బుధవారం సాయంత్రం బాధితుల నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష నగదు స్వాధీనం చేసుకుని దుబ్బాక తహశీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు తరలించారు. దుబ్బాక మండలం అప్పన్న పల్లికి చెందిన 257, 259, 266, 275, 287 సర్వే నంబర్లలో ఉన్న 3 ఎకరాల 25 గుంటల భూమికి సంబంధించి వారసత్వ పట్టా మార్పు కోసం కుంభాల సుజాత, రాజిరెడ్డి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. ఆర్ఐ నర్సింహారెడ్డికి డబ్బు ఇవ్వగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తహీసీల్దార్ కార్యాలయంలో సోదాలు.. దుబ్బాక: తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లంచం తీసుకుంటూ సిద్దిపేటలో పట్టుబడ్డ ఆర్ఐ నర్సింహరెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి దుబ్బాక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి పలు కోణాల్లో ప్రశ్నించారు. భూముల వివరాలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. సిద్దిపేటలోని ఆర్ఐ నర్సింహరెడ్డి ఇంట్లో సైతం ఏసీబీకి చెందిన మరో టీం సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. రాత్రంతా కార్యాలయంలో తనిఖీలు చేపడతామని తమ సోదాలు పూర్తి అయ్యాకే వివరాలు వెల్లడిస్తామంటూ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఆర్ఐ నర్సింహరెడ్డిపై గతంలోనూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. -
మమ్మల్నే కొనసాగించండి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీసీసీబీ, పీఏసీఎస్ల పాలకవర్గం పదవీకాలం విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్న నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమను కొనసాగిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేస్తామనే అభిప్రాయాన్ని పీఏసీఎస్ల చైర్మన్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే రానుందని సహకార వర్గాలు పేర్కొంటున్నాయి.● పదవులు కాపాడుకునేందుకు డీసీసీబీ చైర్మన్ల ముమ్మర యత్నాలు ● అనధికారికంగా పాలకవర్గాల భేటీలు ● పీఏసీఎస్ చైర్మన్ల సంతకాలతో తీర్మానాలు ● మంత్రి తుమ్మలను కలిసిన 8 జిల్లాల డీసీసీబీల చైర్మన్లు ● ‘స్థానిక’ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)ల పాలకవర్గాల పదవీకాలం రెండో రోజుల్లో ముగియనుంది. దీంతో తమ పదవులను కాపాడుకునేందుకు ఆయా డీసీసీబీ చైర్మన్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసిన ఎనిమిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీల చైర్మన్లు... తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బుధవారం పలు జిల్లాలో డీసీసీబీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనాలపేరుతో సమావేశాలు నిర్వహించాయి. తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అనధికారిక తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలపై ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న అన్ని పీఏసీఎస్ (ప్రాథమిక సహకార సంఘాల) చైర్మన్లతో సంతకాల సేకరణ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో డీసీసీబీ పాలకవర్గం సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో అనధికారికంగా సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు తీర్మానాలు చేశారు. డీసీసీబీలతోపాటు, పీఏసీఎస్ల పాలకవర్గం పదవీకాలం ఈనెల 15తో ముగుస్తున్న విషయం విదితమే. మేమంతా కాంగ్రెస్ వాళ్లమే... ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలో మొత్తం తొమ్మిది (హైదరాబాద్ మినహా) డీసీసీబీలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీసీసీబీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఈ తొమ్మిది డీసీసీబీ చైర్మన్లలో ఎనిమిది డీసీసీబీల చైర్మన్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్లో కొనసాగుతున్న రవీందర్రావును కొన్ని నెలల క్రితం టెస్కాబ్ చైర్మన్ పదవి నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించిన విషయం విదితమే. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ ఎనిమిది డీసీసీబీ చైర్మన్లు తామంతా తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళతానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు డీసీసీబీ చైర్మన్లు చెబుతున్నారు. మమ్మల్ని కూడా కొనసాగించండి.. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)ల పాలకవర్గాల పదవీకాలం కూడా ఈనెల 15తోనే ముగుస్తుంది. దీంతో తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని ఆయా పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 920 పీఏసీఎస్లు ఉండగా.. బీఆర్ఎస్ సర్కారు హాయాంలో తొంభై శాతం పీఏసీఎస్ల చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న చైర్మన్ల సంఖ్య సుమారు 585 చేరినట్లు అనధికారిక అంచనా. దీంతో తాము కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని పీఏసీఎస్ చైర్మన్లు కోరుతున్నారు. -
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.12.80లక్షలు
జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.12,80,943 వచ్చినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. 74 రోజుల అమ్మవారి హుండీలోని కానుకలను లెక్కించినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయంతో ఆలయాభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘ఉగాది బాలల’పోటీకి 372 కథలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది బాలల పోటీలకు 372 కథలు వచ్చాయని సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాది పండుగ పురస్కరించుకుని బాలల కథల పోటీలను నిర్వహిస్తున్నామని దుర్గయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 29 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 372 కథలు రావడం సంతోషంగా ఉందన్నారు. మార్చి నెల చివరి నాటికి విజేతలను ప్రకటించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు సాముచిత స్థానం దక్కుతుందని పార్టీ నాయకులు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా అధ్యక్షురాలిగా మార్క పద్మకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకూ వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, ముద్దం లక్ష్మి, పయ్యావుల ఎల్లం యాదవ్, వహాబ్ తదితరులు పాల్గొన్నారు. జాబ్మేళాలో 48 మంది ఎంపిక సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాలో 48 మంది అభ్యర్థులు ఎంపికై నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్కుమార్రెడ్డి తెలిపారు. స్థానిక కళాశాలలో ఆయన మాట్లాడుతూ మేళాకు చక్కని స్పందన వచ్చిందన్నారు. మొత్తం 176 మంది అభ్యర్థులు హాజరుకాగా వివిధ బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల్లో మొత్తం 48 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు చెప్పారు. హెచ్డీఎఫ్సీలో 18, యాక్సిస్ బ్యాంకుకు 25 మంది, యూనిమోనిలో ఐదుగురు అభ్యర్థులు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఎస్కేసీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరీ, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. అందుబాటులోకి అకాడమీ సేవలుతొలి బ్యాచ్కు 31మంది ఎంపిక మొదటిరోజు 12మంది చేరిక సిద్దిపేటజోన్: జిల్లాకు మంజూరైన వాలీబాల్ అకాడమీ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంబంధిత శాఖ ప్రచారార్భాటాలు లేకుండా బుధవారం అకాడమీ సేవలను ప్రారంభించారు. అకాడమీలో శిక్షణ తరగతులకోసం ఇద్దరు కోచ్లను, వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాలీబాల్ అకాడమీకి 20మంది బాలికలు, 20బాలురుకు వసతి, శిక్షణ అనుమతి లభించింది. గతేడాది అకాడమీలో ప్రవేశాల కోసం 31 మందిని ఎంపిక చేశారు. తొలి బ్యాచ్కు 31మంది క్రీడాకారులలో మొదటిరోజు 10మంది బాలురు, ఇద్దరు బాలికలు జాయిన్ అయ్యారు. పరామర్శ మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో వివిధ కారణాలతో ఒకే రోజు మృతి చెందిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకులు ఉన్నారు. -
రైతులను భాగస్వామ్యం చేయండి
వ్యవసాయశాఖ అధికారికి ఏఈఓల వినతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సర్వే ప్రక్రియలో రైతులను భాగస్వామ్యం చేయాలని ఏఈఓలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధికకు వినతి పత్రం అందించారు. అనంతరం ఏఈఓలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ డిజిటల్ సర్వేకు వెళ్లినప్పుడు రైతులు లేకపోవడంతో సర్వే నెంబర్లలో పంటలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఏఈఓలకు డివైజ్లను అందించి యాప్ ల ద్వారా పనులు చేసేలా కృషి చేయాలన్నారు. పంట చేనుల వద్దకు వెళ్ళినప్పుడు రైతులు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా మహిళా ఏఈవోలు పంట చేనుల వద్దకు వెళ్లి నప్పుడు, రైతులు, ఇతర సహాయ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మహిళా ఏఈఓలకు భద్రత కల్పించేలా చర్యలు చేపడుతూ, రైతులతో పాటు వివిధ శాఖల నుంచి సహాయ సహకారాలు అందించాలన్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయండి
● మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ ● వార్డు ప్రత్యేక అధికారులతో సమావేశంసిద్దిపేటజోన్: వార్డు ప్రత్యేక అధికారులుగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్ దీపాల సమస్యలు ఉంటే సంబంధించిన సిబ్బందికి తెలుపాలని సూచించారు. వార్డుల్లో నూతన ఇంటి నిర్మాణాలు నిబంధనల మేరకు ఉండేలా చూడాలని, నిబంధనలు ఉల్లంగిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు తాగునీరు పొదుపుగా వాడేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆస్తి, నల్లా పన్నులు వసూలు వంద శాతం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
నంగునూరు(సిద్దిపేట): పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంగునూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పెండింగ్ పనులపై ఆరా తీశారు. మండలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చే వినతులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ సరిత, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్, ఆర్ఐ లింగం, జయసూర్య పాల్గొన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలిహుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ అధికారి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం అస్తి పన్ను వసూలు చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, వాటర్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష కార్యక్రమానికి హుస్నాబాద్ మున్సిపాలిటీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మేనేజర్ భూమానందం, ఏఈ మహేష్, జేఏఓ ఆరతి, ఆర్ఐ కనకయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలిహుస్నాబాద్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం ఐఓసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులను డీపీఓ దేవకీదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ -
13 నుంచి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
సిద్దిపేటరూరల్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దిపేట డివిజన్కు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు 13, 14, 15 తేదీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని పీఓలు 13, 14 తేదీలలో గజ్వేల్ ఐఓసీలో, హుస్నాబాద్ డివిజన్ పీఓలు 13, 14 తేదీలలో ఐఓసీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. -
బాబోయ్.. బర్డ్ ఫ్లూ!
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు దూల్మిట్ట మండలం బెక్కల్లోని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. వివరాలు 8లో uబుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో పౌల్ట్రీ ఫామ్స్ అతిపెద్ద ఉపాధి కల్పన పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడి నుంచి కోడిగుడ్లు, కోళ్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతుంటాయి. దీంతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో జిల్లా వాసులు చికెన్, కోడిగుడ్లు అంటేనే భయపడుతున్నారు. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనే భయంతో వారంలో నాలుగు రోజులు తినే వారు సైతం చికెన్ వైపు చూడటంలేదు. దీంతో వ్యాపారం మందగించడంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు, కోడిగుడ్ల వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ బర్డ్ఫ్లూ విస్తృతంగా వ్యాప్తిస్తోందని, చికెన్, కోడిగుడ్లు తినవద్దని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటనలు విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులు మరింత ఆందోళన చెందుతున్నారు.న్యూస్రీల్బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను వణికిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పౌల్ట్రీ ఫామ్లు ఉన్న జిల్లాగా సిద్దిపేట పేరుగాంచింది. జిల్లాలో 60కిపైగా లేయర్, 175పైగా బాయిలర్ పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 50 లక్షల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతండగా, 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వివిధ కారణాల చేత కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లాలోని ఫాల్ట్రీ ఫామ్ల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. లేయర్(గుడ్లు) పౌల్ట్రీ ఫామ్లు: 60 బాయిలర్ (చికెన్) పౌల్ట్రీ ఫామ్లు: 175సుమారు కోళ్ల సంఖ్య: 92లక్షలు -
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, లైబ్రరీని పరిశీలించి కళాశాల వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫస్టియర్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్కు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థినులు కంప్యూటర్ విద్యను శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్ కళాశాల ఆవరణను కలెక్టర్కు చూపించారు. మొత్తం 325 మంది విద్యార్థినులు చదువుతున్నారని, తరగతి గదులు సరిపోవడం లేదన్నారు. స్పందించిన కలెక్టర్ కళాశాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఎఫ్పీఓలను బలోపేతం చేయండి సిద్దిపేటఅర్బన్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనేజేషన్ (ఎఫ్పీఓ)లను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో, ఎఫ్పీఓల సీఈఓ, డైరెక్టర్లతో మంగళవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రిషి కల్ప సీఈఓ పాటిల్ ఎఫ్పీఓలు బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సాహం అందించాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ విద్యార్థులకు మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించి వాటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్రిషి కల్ప అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏఓ రాధిక, డీహె చ్ఓ సువర్ణ, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.కలెక్టర్ మనుచౌదరి -
ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
● ఉమ్మడి మెదక్ నుంచి 27 మంది నామినేషన్లు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 22 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఐదుగురు ● రేపటి వరకు ఉపసంహరణ గడువు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో77వేల మంది ఓటర్లుసాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వంద మంది నామినేషన్లు వేయగా అందులో ఉమ్మడి మెదక్ నుంచి 22 మంది ఉన్నారు. అందులో సంగారెడ్డి జిల్లా నుంచి 11 మంది, సిద్దిపేట నుంచి 9, మెదక్ నుంచి ఇద్దరు ఉన్నారు. బీజేపీ నుంచి అంజిరెడ్డి (రామచంద్రాపురం, సంగారెడ్డి), ఇండిపెండెంట్లుగా పిడిశెట్టి రాజు (కోహెడ, సిద్దిపేట), చంద్రశేఖర్ (కంది, సంగారెడ్డి), దొడ్ల వెంకటేశం (సదాశివపేట్, సంగారెడ్డి), ఎన్ చంద్రశేఖర్ (మెదక్), దేవునూరి రవీందర్ (భరత్నగర్, సిద్దిపేట), మంద జ్యోతి (శ్రీనివాసనగర్, సిద్దిపేట), గుమ్మడి శ్రీశైలం (పెద్దలింగారెడ్డిపల్లి, సిద్దిపేట), సంజీవులు (కంది, సంగారెడ్డి), బెజుగం వెంకటేష్ (హౌసింగ్బోర్డు కాలనీ, సిద్దిపేట) నామినేషన్లు వేశారు. అలాగే వెంకటేశ్వర్లు (పటాన్చెరు, సంగారెడ్డి), సాయిబాబా (తూప్రాన్, మెదక్), మచ్చ శ్రీనివాస్ (దుబ్బాక, సిద్దిపేట), ఎన్.యాదగిరి (ఆర్సీపురం, సంగారెడ్డి), గిరిధర్ (మంజీరానగర్, సంగారెడ్డి), ఇంద్రాగౌడ్ (మర్కూక్, సిద్దిపేట), శంకర్ రావు (పటాన్చెరు, సంగారెడ్డి) , సత్యనారాయణగౌడ్ (సదాశివపేట, సంగారెడ్డి), లక్ష్మీప్రసన్న (పటాన్చెరు, సంగారెడ్డి), నరేందర్ రెడ్డి (జహీరాబాద్, సంగారెడ్డి), ఆంజనేయులు (నంగనూరు, సిద్దిపేట), పోచబోయిన శ్రీహరి యాదవ్ (చిన్నకోడూరు, సిద్దిపేట) నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి.. ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు వేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి(చిన్న కోడూరు, సిద్దిపేట), పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్ రెడ్డి (ప్రశాంత్నగర్, సిద్దిపేట) మామిడి సుధాకర్ రెడ్డి (టేక్మాల్, మెదక్), అశోక్ కుమార్ ( కొండాపూర్, సంగారెడ్డి), జగ్గు మల్లారెడ్డి (మోయిన్పూర, సిద్దిపేట) నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే నామినేషన్లు వేసిన వారిలో ఎనిమిది మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో.. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గ్రూపులుగా డిన్నర్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. తనను గెలిపిస్తే విద్యా అభివృద్ధికి, నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీలు గుప్పిస్తున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు గురువారం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ఎవరు పోటీలో ఉంటారో తేలనుంది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌటింగ్చేపట్టనున్నారు. -
రంగరాజన్నుపరామర్శించిన బ్రాహ్మణులు
గజ్వేల్రూరల్: చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ను గజ్వేల్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిందితులను పట్టుకొని శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు దేశపతి శంకరశర్మ, రవీందర్రావు, విఠాలకృష్ణమూర్తిశర్మ, నందబాలశర్మ, సాయికృష్ణశర్మ, శ్యాంప్రసాద్శర్మ, రఘు మురళీమోహనశర్మ, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్కునీటి పంపింగ్ కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్పల్లి రిజర్వాయర్కు నీటి పంపింగ్ను అధికారులు ప్రారంభించారు. జనగామతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సాగు నీరు అందించే తపాస్పల్లి రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గింది. దీంతో మంగళవారం అధికారులు బొమ్మకూరు రిజర్వాయర్నుంచి పంపింగ్ చేపట్టారు. దీంతో పరిసర గ్రామాల రైతులు హర్షం వక్తం చేస్తున్నారు. గతంలో రిజర్వాయర్ నీటితో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు దూల్మిట్ట, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులను నింపేవారు. మారిన రాజకీయ పరిణామాలతో ఈప్రాంతంలోని చెరువులు నిండకముందే భువనగిరి నియోజకవర్గానికి కొంత మంది నాయకులు నీరు తరలించండంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఈప్రాంత చెరువులు పూర్తిగా నింపేందుకు అధికారులు, రాజకీయ నాయకులు కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్ దుబ్బాకటౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, సమయ పాలన పాటించాలని డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రజలకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూఅందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాచేస్తే చర్యలు: సీపీ సిద్దిపేటకమాన్: అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 87126 67100కు సమాచారం అందించాలన్నారు.