sings
-
మెట్రోలో నవరాత్రి సందడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. फूहड़ रील वालों ने मेट्रो को दूषित कर दिया था और इन्होंने मेट्रो का शुद्धिकरण कर दिया😍जय माता शेरावाली🙏 pic.twitter.com/pjOULqMCSu— Vikash Mohta (@VikashMohta_IND) October 5, 2024ఇది కూడా చదవండి: దుర్గమాసుర సంహారం -
అనాథలు అడగగానే గొంతువిప్పింది
-
ఈమె కూతా ఘనమే
ఇప్పుడు నటనకయినా, పాడటానికయి నా పెద్దగా కసరత్తు లేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాడటానికి సం గీత సాధనతో కూడా పని లేకుండా పోయిం ది. కాస్త హస్కీ వాయిస్ ఉంటే చాలు పాడేయవచ్చు. గాయనీమణులైన నటీమణుల శాతం తక్కువే. హీరోల్లో అయితే రజనీ, కమల్, విజయ్, సూర్య, శింబు, ధను ష్, కార్తి, విశాల్, శివకార్తికేయన్, భరత్ అంటూ వరుసపెట్టి పాడేశారు. ఇలా తమిళంలో పాడిన హీరోయిన్లు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆండ్రియా, మమతా మోహన్ దాస్, రమ్యా నంబీశన్ వంటి వారు గాయనీమణులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరందరూ ఇతర భాషలకు చెందిన వారేననన్నది గమనార్హం. వీరిలో రమ్యా నంబీశన్ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. ఈమె మలయాళంలో పలు పాటలు పాడినా తొలిసారిగా పాండియనాడులో గళం విప్పారు. ఆ తరువాత డమాల్ డుమీల్ చిత్రంలో ఒక పాట పాడారు. ఇప్పుడీ జాబితాలో లక్ష్మీ మీనన్ చేరారు. కుంకీ నుంచి ఇటీవల విడుదలైన మంజాపై చిత్రం వరకు వరుస విజయాలనే తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఈ లక్కీ హీరోయిన్ తాజాగా గాయని అవతారమెత్తారు. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ఊరుల రెండు రాజా చిత్రం కోసం ఐటమ్ సాంగ్ పాడేశారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను లక్ష్మీ మీనన్తో పాడాల్సి రావడంపై దర్శకుడు కన్నన్ తెలుపుతూ ఈ పాటకు హస్నిగా ఉండే వాయిస్ అవసరం అయ్యిందన్నారు. ఎవరితో పాడించాలన్న ఆలోచిస్తుండ గా డి.ఇమాన్ లక్ష్మీ మీనన్ పేరును సూచించారని చెప్పా రు. వెంటనే ఆమెను చెన్నైకి రప్పించి పాడించామని తెలి పారు. ఎక్కువ టేకులు తీసుకోకుండా రెండు గంటల్లో లక్ష్మీ మీనన్ పాడేశారని చెప్పారు. చాలా కాలం పాడాలనే ఆశ మనసులో ఉందని అది ఒరు ఊరుల రెండు రాజా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని లక్ష్మీ మీనన్ పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్, దర్శకుడు కన్నన్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డి.ఇమాన్కు హీరోయిన్లతో పాడించడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు ఆయన ప్రియాంక చోప్రా, మీనా, శృతిహాసన్, రమ్యా నంబీశన్ వంటి హీరోయిన్లతో పాడించారు. -
‘అంజాన్’లో సూర్య గాత్రం
సంగీతం, సాహిత్యాల మేనికలయిక పాట. అలాంటి పాటకు మంచి గానం తోడయితే వీనులవిందుగా ఉంటుంది. అయితే పాడడం అంత సులభం కాదు. గాయకులుగా రాణించడానికి అర్హత ఉంటుంది. అయితే అంత పరిజ్ఞానం లేకపోయినా చాలా మంది పాడేస్తున్నారు. ముఖ్యంగా నేటి నటీనటులు తమ గాన పాండిత్యాన్ని చూపించేస్తున్నారు. పద్మశ్రీ కమల్ హాసన్లో మంచి గాయకుడున్నాడని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈయన సంగీత, సాహిత్య రంగాల్లోనూ శిక్షణ పొందారు. అయితే అలాంటి శిక్షణ లేకుండా నటుడు శింబు, ధనుష్, శివకార్తికేయన్లాంటి యువ నటులు పాడేస్తున్నారు. చివరికి సూపర్స్టార్ రజనీకాంత్ కూడా కోచ్చడయాన్ చిత్రంలో పాడి తాను గాయకుడిననిపించుకున్నారు. తాజాగా ఈ కోవలోకి నటుడు సూర్య చేరనున్నారు. ఈయన ఇంతకు ముందు ఒక వాణిజ్య ప్రకటన కోసం గళం విప్పారు. తాజాగా అంజాన్ చిత్రం కోసం పాడనున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంజాన్. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం కోసం సూర్య ఒక పాట పాడనున్నారు. అయితే ఈపాట ఇంకా రికార్డ్ చేయూల్సి ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
తెలుగులో పాట పాడిన లతా రజనీకాంత్!
తమిళంలో ‘కొచ్చడయాన్’గానూ, తెలుగులో ‘విక్రమసింహ’గానూ రూపొందుతోన్న రజనీకాంత్ తాజా చిత్రం కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘అవతార్’ తరహాలో త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతోన్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. ‘రోబో’ తర్వాత రజనీ చేస్తున్న సినిమా ఇదే. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య దర్శకురాలు కావడం ఒక విశేషం కాగా, రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ఇందులో ఒక పాట పాడడం మరో విశేషం. లతా రజనీకాంత్ సినిమా పాట పాడటం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇళయరాజా స్వరసారథ్యంలో ఓ తమిళ సినిమాకు పాడారు. ఆ తర్వాత మళ్లీ ఆమె పాడలేదు. ఈసారి మాత్రం తమిళ వెర్షన్తో పాటు, తెలుగు వెర్షన్కి కూడా ఆమె పాడటం విశేషం. అనంత శ్రీరామ్ రాసిన ‘ఏదేమైనా సఖా’ అనే పాటను లతా పాడారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలందించారు. ఈ నెల 9న తమిళంలోనూ, 10న తెలుగులోనూ పాటలు విడుదల కానున్నాయి. -
ఉష పాటలతో ఉద్యమకారుల్లో ఉత్సాహం
-
తెరవెనుక రాయల తెలంగాణ అజెండా