breaking news
slander
-
అపవాదు వేస్తారా?
న్యూఢిల్లీ: బెంగాల్ న్యాయవ్యవస్థ మీద అపవాదులు మోపడం సరికాదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని మందలించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులను బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ గత డిసెంబరులో కోరింది. ‘‘లేదంటే సాక్షులను భయపెట్టే అవకాశముంది. బెంగాల్ కోర్టులలో శత్రుత్వభావంతో కూడిన వాతావరణం నెలకొంది’’ అని పేర్కొంది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసుల బదిలీకి ఇదేం ప్రాతిపదిక? మొత్తం న్యాయవ్యవస్థపైనే అపవాదు వేస్తారా? బెంగాల్ కోర్టులన్నింటిలోనూ విరో«ధభావం నెలకొందన్నట్లుగా చూపుతున్నారు. ఒక రాష్ట్రంలోని న్యాయమూర్తులను సీబీఐ అధికారులు ఇష్టపడనంత మాత్రాన మొత్తం న్యాయవ్యవస్థే పనిచేయడం లేదనకండి. జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు, సెషన్స్ జడ్జిలు తమను తాము సమరి్థంచుకోవడానికి సుప్రీంకోర్టు దాకా రాలేరు’’ అని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొంది. పిటిషన్లో వాడిన పదజాలాన్ని ఆయన సమరి్థంచుకోనే ప్రయత్నం చేశారు. కోర్టులపై అపవాదు వేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొంటూ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. -
ఇన్ఫీ మూర్తిపై మాజీ ఛైర్మన్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్లో రగిలిన బోర్డ్ వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తిపై సంస్థ మాజీ ఛైర్మన్ ఆర్ శేషసాయి మళ్లీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా శేషసాయి హయాంలో ఇన్ఫీ పాలనాపరంగా విఫలమైందన్న మూర్తి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై మూర్తి వ్యక్తిగత దూషణలకు దిగడం, అవాస్తవాలను, అభాండాలను వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అసందర్బంగా ఉన్నాయని విమర్శించారు. తాను నిజం చెప్పలేదని ఆరోపించడం సరియైంది కాదన్నారు. తాను ఇన్ఫోసిస్కు సంబంధించిన అన్ని విషయాల్లో చాలా నిజాయితీగా వ్యహరించానని శేష సాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 29న జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో మూర్తి , మాజీ చైర్మన్ శేషసాయిపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్పందించిన ఆయన ఆ ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫోసిస్ బోర్డుకు రాజీనామా చేసి నాటినుంచి బహిరంగంగా ప్రకటనలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి వాటికి తాను దూరంగా ఉన్నానన్నారు. తద్వారా కంపెనీ పురోభివృద్ధినీకోరకున్నాననీ, ఈ వివాదాల వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం జరగకూడదని తాను భావించానన్నారు. మూర్తి వ్యాఖ్యలు కంపెనీ భవిష్యత్తు మంచిది కాదని హితవు పలికారు. అయితే దీనిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలకేని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయణ మూర్తి మంగళవారం, పెట్టుబడిదారు సమావేశంలో మాట్లాడుతూ, శేషసాయి నేతృత్వంలోని బోర్డు మాజీ సీఎఫ్వో రాజీవ్ బన్సల్ అధిక వేతనం, చెల్లింపులపై అసలు కారణం వివరించడంలో విఫలమైందని అరోపించారు. శేషసాయి నేతృత్వంలో ఇన్ఫీ బోర్డు పాలన అత్యంత దారుణంగా ఉందని, మాజీ సీఎఫ్వో రాజీవ్ బన్సల్కు భారీగా ముడుపులు చెల్లించారని ఆరోపించారు. కాగా ఇన్ఫోసిస్ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామా, సంక్షోభం ,పీస్మేకర్ గా నందన్ నీలేకని రీ ఎంట్రీ, బోర్డుప్రక్షాళన, బోర్డు ఛైర్మన్ శేషాసాయి సహా ,ఇతర బోర్డు సభ్యులు కొంతమంది రాజీనామా చేయడం తెలిసిన సంగతే.