breaking news
Sports News
-
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారింది. ఆ మ్యాచ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్కు స్ప్లీన్లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్తో ఆడిన 32 మ్యాచ్ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో వైట్వాష్ చేసింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ (భారత్), 2018 నవంబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్లో), 2023 (భారత్లో) సిరీస్ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్లోని మూడో మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్లో ప్రతిక మంధనతో కలిసి భారత్కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించింది.ఛేదనలో అమన్జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్లలో లేని ప్లేయర్ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా వికెట్కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్లో పటిష్టమైన ఆసీస్ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్ -
ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్
ఊహించిన విధంగానే జరిగింది. యాషెస్ సిరీస్ (Ashes Series 2025-26) తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్నెముకలో స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా కమిన్స్ జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో తొలి టెస్ట్కు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు. ఈ విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21న పెర్త్లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్ భర్తీ చేసే అవకాశం ఉంది. బోలాండ్.. జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్తో కలిసి తొలి టెస్ట్లో బౌలింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.ప్రస్తుతం కమిన్స్ రన్నింగ్ చేయగలుగుతున్నా, బౌలింగ్ చేయడం లేదు. పూర్తి రికవరీకి కనీసం నాలుగు వారాల సమయపడుతుందని అతనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న బ్రిస్బేన్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్కు కమిన్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. 2018లో సాండ్పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్, కమిన్స్ వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. ఆసక్తికరంగా, కెప్టెన్గా ఉన్నప్పుడు స్మిత్ బ్యాటింగ్ యావరేజ్ 68.98గా ఉండగా, సాధారణంగా అది 49.9 మాత్రమే.కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల యాషెస్ 2025-26 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ నవంబర్ 21న పెర్త్లో, రెండో టెస్ట్ డిసెంబర్ 4న బ్రిస్బేన్లో, మూడో టెస్ట్ డిసెంబర్ 17న అడిలైడ్లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మెల్బోర్న్లో, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానున్నాయి.స్వదేశంలో జరిగే ఈ సిరీస్ను ఆస్ట్రేలియా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్కు కమిన్స్ దూరం కావడం వారికి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా గట్టిగానే కసరత్తు చేస్తుంది. నెల ముందుగానే జట్టును ప్రకటించి సన్నద్దతను వ్యక్తం చేసింది.యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: అదరగొట్టిన తెలుగు టైటాన్స్ -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
సచిన్ గారాల పట్టీ.. సారా టెండూల్కర్ క్యూట్ ఫొటోస్ చూశారా?
-
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
-
అటు శర్మ.. ఇటు స్మృతి! ఇద్దరికి తిరుగులేదు
-
సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
2027 వరల్డ్ కప్ కొట్టాకే రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన హిట్ మ్యాన్
-
అంత పొగరెందుకు? అయ్యర్ పై మాజీ క్రికెటర్ ఫైర్!
-
పాక్ ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు
-
వెండి బతుకమ్మ.. భర్తతో కలిసి ఆడిన పీవీ సింధు (ఫొటోలు)
-
తగ్గే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన భారత్
-
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
-
నాడు అవమానించారు.. నేడు అతనే కాపాడాడు
-
తెలుగోడి సత్తా చాటిన తిలక్ వర్మ
-
పాక్ కు చెంపదెబ్బ.. ట్రోఫీ నిరాకరించిన భారత్
-
ఆసియా కప్ భారత్దే... ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక
-
ఆసియా కప్ లో ఆఖరి పోరాటం
-
హార్దిక్ అవుట్? బుమ్రా డౌట్? అతడే దిక్కు!
-
సూర్య వంశీ దెబ్బ.. వణికిన ఆస్ట్రేలియా.. సిరీస్ భారత్ కైవసం
-
ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా
-
మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
-
Asia Cup 2025: పాక్ ను చిత్తు చేసిన భారత్
-
సండే గ్రేట్ వార్.. మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్
-
జస్ట్ మిస్..! టీమిండియాని వణికించిన ఒమన్
-
భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా
-
మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆన్ జొంగ్యీకి ముచ్చెమటలు పట్టించిన వైశాలి
-
షేక్ హ్యాండ్ వివాదంపై పాక్కు ఇచ్చిపడేసిన బీసీసీఐ
-
భారత్-పాక్ మ్యాచ్ లో హ్యాండ్ షేక్ వివాదం
-
చీల్చిచెండాడిన భారత్.. పాక్ చిత్తుచిత్తు.. హైలైట్స్ ఇవే
-
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
చిక్కుల్లో ఆసియా కప్
-
ఆసియా కప్ టీ-20లో టీమిండియా బోణి
-
ఆసియా కప్ టోర్నీలో నేడు భారత్ తొలి మ్యాచ్
-
వెన్నుపోటు భయ్యా! శాంసన్ Sad స్టోరీ
-
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
-
రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్..! ద్రవిడ్ గుడ్ బై
-
నాపై కుట్ర.. షమి కంటతడి
-
క్రికెట్కు పుజారా గుడ్ బై
-
గిల్ దెబ్బకు ఆ ఇద్దరూ అబ్బా!
-
అసలు రంగు బయటపడింది
-
ధోని పై రివేంజ్.. గంభీర్ ది బాస్
-
India vs England: ఆఖరి పంచ్ ఎవరిది..?
-
ది ఓవల్ టెస్ట్ లో ముగిసిన మూడో రోజు ఆట
-
ఓవల్ టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడు
-
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్ట్ లో ముగిసిన తొలిరోజు ఆట
-
భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్
-
ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ డ్రా
-
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో భారత్ నాలుగో టెస్ట్
-
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
-
క్రికెట్ లోనూ ఇంతేనా? తమిళ కుర్రాడిపై ఢిల్లీ పెద్దల కుట్రలు
-
HCA అక్రమాలపై ఇవాళ రెండో రోజు విచారణ
-
మూడు వన్డేల సిరీస్ లో భారత్ శుభారంభం
-
లార్డ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి
-
భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు
-
లార్డ్స్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట
-
మరోసారి బజారున పడిన HCA ఇమేజ్
-
లార్డ్స్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట
-
తొలిరోజు ఆటలో భారత్దే పైచేయి
-
HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా ఐదుగురి ఎంక్వైరీ
-
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మరో టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధం
-
బర్మింగ్హామ్ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
-
టీమ్ లో కరివేపాక్.. గంభీర్ కోటాతో ఇండియా కొంపకూలుతుందా?
-
రెండో ఇన్నింగ్స్ లోనూ దంచి కొట్టిన టీమిండియా
-
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
-
సెకండ్ టెస్టులో ఇండియా ఓడిపోతుందా?
-
టీ-20 సిరీస్ లో బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్స్ జట్టు
-
వెళ్లి పక్కన కూర్చొ.. గంభీర్ తో పంత్ ఫైట్
-
సత్తా చాటిన నీరజ్ చోప్రా
-
లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం
-
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగింపు
-
ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ రెండో రోజు ముగిసిన ఆట
-
తొలిరోజే ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన భారత్
-
సన్ రైజర్స్ ఫ్రాంఛైజ్ రద్దు కానుందా..?
-
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం
-
ఇంగ్లండ్ తో టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సిద్ధమైన భారత్
-
టీమిండియాకు బిగ్ షాక్
-
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత అల్కరాస్
-
RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి
-
Bangalore: చిన్నస్వామి స్టేడియంలో దారుణం
-
RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి
-
ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల
-
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
ఫైనల్స్ కి చేరేదెవరు?
-
నేడు IPL 18వ సీజన్ లో మరో ఆసక్తికర పోరు
-
గుజరాత్ పై 20 రన్స్ తేడాతో గెలిచిన ముంబై
-
ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
-
ఫైనల్స్ కు ఆర్సీబీ..
-
శ్రేయాస్ ఎవరో నాకు తెలీదు.. గంభీర్ నోటి దురద
-
ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు
-
ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB
-
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్స్టార్గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం
-
IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!
-
శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ
-
విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?
-
బెంగళూరుపై హైదరాబాద్ విజయం
-
ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై
-
తిరుమలలో గౌతమ్ గంభీర్
-
మళ్ళీ ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025
-
రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం
-
కుళ్లుబోతు రాజకీయాలు
-
సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?
-
గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!
-
రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
-
IPL రీస్టార్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం
-
ఐపీఎల్ రద్దు
-
ఐపీఎల్ కు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
-
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో ఢిల్లీ కీలక పోరు
-
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం
-
హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్
-
RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం
-
ఐపీఎల్ లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
-
CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు
-
KKR Vs DC: కీలక విజయం సాధించిన కోలకతా నైట్ రైడర్స్, మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
సెంచరీతో కుమ్మేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (ఫోటోలు)
-
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
-
భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
-
IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై
-
ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి 2025 విజేతగా కోనేరు హంపి
-
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లు ప్రకటన
-
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవేదన
-
ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి
-
విరాట్ కోహ్లికి ఘోర అవమానం
-
2 పరుగుల తేడాతో గెలుపొందిన లక్నో సూపర్ జెయింట్స్
-
ఐపీఎల్ లో బెంగళూరుపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం
-
హైదరాబాద్ పై 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు
-
నలుగురు కోచింగ్ స్టాఫ్ పై బీసీసీఐ వేటు
-
మరో కీలకపోరుకు రెడీ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్
-
రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
కోల్ కతాపై పంజాబ్ ఘన విజయం
-
ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపు
-
చెన్నైపై కోల్ కతా భారీ విజయం
-
కెప్టెన్ గా ఎంఎస్ ధోని.. ఫ్యాన్స్ కు పండగే
-
RCBపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
-
రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
-
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
-
హైదరాబాద్ ను ఓడించిన గుజరాత్
-
పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం
-
చతికిలపడ్డ ముంబై.. అదరగొట్టిన లక్నో
-
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి
-
వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్


