Sri Rajarajeshwara Temple
-
శరభ.. శరభ
వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణోత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించి పులకించిపోతారు. కానీ వేములవాడలో శివకల్యాణం సందర్భంగా అత్యధిక మంది శివుడిని పెళ్లాడటం ఆనవాయితీ. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తే స్వామినే పెళ్లాడుతామని మొక్కుకుంటారు. ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోయిన వారు ఏటా శివకల్యాణోత్సవం సందర్భంగా త్రిశూలం పట్టుకొని స్వామిని వివాహమాడుతుంటారు. శివకల్యాణోత్సవాల్లో ఆకట్టుకునే మరో ప్రత్యేకత వీరశైవులు (జంగమయ్యలు) వీరభద్రుడికి ఆహ్వానం పలికే వేడుక. వీరభద్రుడికి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడి జంగమయ్యలు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరశైవ అర్చకులు దండకాలు (ఖడ్గాలు) వేస్తూ స్వామిని ఆహ్వానిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన 28 కుటుంబాలు పాల్గొంటాయి. స్మార్థ వైదిక పద్ధతిని అనుసరించి.. రాష్ట్రంలోని మిగతా శైవక్షేత్రాలలో ‘కారణాగమము’అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు చేస్తుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరిపిస్తుంటారు.ఈశ్వరుడు తపస్సులో ఉండగా, మన్మథుడు తన బాణాన్ని సంధించి తపస్సును భగ్నం చేశాడని, దీంతో ఈశ్వరునికి కోపమొచ్చి మన్మథున్ని త్రినేత్రంతో దహనం చేశాడని, అందుకోసమే కామదహనం తర్వాత మరుసటి రోజున ఈశ్వరుడు పార్వతిని కల్యాణం చేసుకుంటాడని అర్చకులు చెబుతున్నారు. ఇల్లు సల్లంగుండాలని.. ఏటా రాజన్నను పెళ్లాడే శివపార్వతులు ముందుగా ఇల్లు సల్లంగుండాలని రుద్రాక్ష పూజ చేసుకుంటారు. తమ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మానసిక పరిస్థితులు మెరుగుపడాలని ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వారంతా వయో, లింగభేదం లేకుండా ఇక్కడి వీరశైవులతో రుద్రాక్షపూజ నిర్వహించుకుంటారు. అనంతరం రాజన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇక్కడి వీరశైవులు వీరికి ప్రత్యేక పూజలు చేసి రుద్రాక్షధారణ నిర్వహిస్తారు. అనంతరం వారంతా రాజన్న సేవలో తపించడంతోపాటు తమతమ కుటుంబ వ్యవహారాల్లోనూ కొనసాగుతుంటుంటారు. రాజన్నకు ఉచిత ప్రచార కర్తలుగా పని చేస్తుంటారు. -
వేములవాడ రాజన్న దశ మారేనా?
వేములవాడ అర్బన్ : పేదల దేవుడు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని రూ.145 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయూరు చేశారు. వీటిని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేసినట్లు తెలిసింది. ఇతర ఆలయూలకు రూ.కోట్లు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్.. ఎములాడ రాజన్నను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులతో కసరత్తు చేయించారు. పలు అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే జర్మనీ పర్యటన ముగిశాక సీఎం పర్యటన తేదీ ఖరారవుతుందని అంటున్నారు. కేసీఆర్పైనే ఆశలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు వెచ్చిస్తామని, రాజన్న భక్తుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చుతామని 2012 వేములవాడ పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ కావడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తాసుకుంటారని పట్టణవాసులతో పాటు రాజన్న భక్తుల ఆశించారు. తొలుత యాదగిరిగుట్టపై దృష్టి సారించిన సీఎం.. అక్కడి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించడమే కాకుండా ప్రతీ బడ్జెట్లో రూ.వందకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రక టించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రాజన్నకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య రూ.145 కోట్ల వ్యయంతో దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. దీంతో పనుల్లో కదలిక ప్రారంభమైనట్లు భక్తులు భావిస్తున్నారు. అరుుతే, వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ హాజరైతే స్పష్టత వస్తుందని వారు ఆశిస్తున్నారు. -
వేములవాడలో పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులోనూ రెండవ కార్తీక సోమవారం కావడంతో అమ్మ శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తజనం పోటెత్తింది. దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ ప్రాత:కాలమే పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం కోసం నిర్దేశించిన క్యూల్లో వేచివున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా శ్రీరాజరాజేశ్వరి నామాన్నిస్మరిస్తూ బారులు తీరారు. దాంతో అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.