breaking news
Srikakulam District Latest News
-
కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’
● కాంట్రాక్టర్ల ఈఎండీలు ఇచ్చేదెప్పుడో..? ● రూ.4 కోట్ల మేర పెండింగ్ ● గగ్గోలు పెడుతున్న 40 మంది కాంట్రాక్టర్లు ● అధికార పార్టీ అండదండలు ఉంటేనే బిల్లుల చెల్లింపు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఎర్న్డ్ మనీ డిపాజిట్లు(ఈఎండీ) చెల్లించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లను కలిశామని, వారు హామీ ఇచ్చినా నేటికీ పని జరగలేదని అంటున్నారు. ఈ ఏడాది జూన్లో మూడుసార్లు, జూలైలో ఒక్కసారి ఎమ్మెల్యే, కలెక్టర్లతో కాంట్రాక్టర్లకు మీటింగ్లు జరిగాయి. అయినా ఫలితం మా త్రం లేదు. ఈఎండీలు అంటే కాంట్రాక్టర్లు ఏదైనా పనులకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నప్పుడు ముందస్తుగా డిపాజిట్ కింద 2.5 శాతం డబ్బుల్ని చెక్ రూపంలో చెల్లించాలి. పనులు పూర్తయిన తర్వాత నాణ్యతప్రమాణాలు లోపించడం గానీ, పనులు పాడవ్వడం వంటివి జరిగితే డిపాజిట్గా కట్టిన డబ్బుల్లో దానికి ఖర్చు చేస్తారు. అ లాంటి పరిస్థితులు కార్పొరేషన్ పరిధిలో ఒక్కటి కూడా లేవు. కానీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. నిర్లక్ష్యమే కొంప ముంచింది ఇంజినీరింగ్ సెక్షన్లో పదేళ్ల పాటు ఈ–1గా విధు లు నిర్వహించిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్లు చెబుతున్నా రు. డిపాజిట్ కింద ఇచ్చిన చెక్కులు, పనుల వివరాలు రికార్డు చేసిన ఎం–బుక్లు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వ్యక్తి వెళ్లి కొత్త ఈ–1 వచ్చినా సమస్యను పరిష్కరించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎండీల కోసం తిరిగి తిరిగి రాకపోవడంతో ఇమ్మంది మల్లేసు, కంచరాన బాబురావు అనే కాంట్రాక్టర్లు టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. చేసిన పనుల సంగతేంటి..? ఈఎండీ బిల్లుల సంగతి అటుంచితే కూటమి వచ్చాక చేసిన పనులకై నా బిల్లులు ఇవ్వడం లేదు. నిధి పోర్టల్ని అప్డేట్ చేస్తున్నామని కూటమి అధికారంలోకి వచ్చాక నెలల తరబడి తాత్సారం చేశారు. ఇప్పుడు ఈ పోర్టల్ పనిచేస్తున్నా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. పక్కన విజయనగరంలో పనిచేస్తున్న నిధి పోర్టల్ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎందుకు పనిచేయడం లేదో తెలియని పరి స్థితి ఉంది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 25 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి 25 ఫైళ్ల కు గాను రూ.8 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ నలుగురికే బిల్లులు.. కార్పొరేషన్ పరిధిలో పనులు ఎంతమంది పనులు చేసినా బిల్లులు మాత్రం ఆ నలుగురికే వస్తున్నా యి. సీ–బిల్లు పేరుతో కమిషనర్ కూటమి నాయకుల సిఫార్సులు ఉన్నవారికి బిల్లులు ఇస్తు న్నారు. యోగాంధ్ర వంటి కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వెంటవెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాంటిది శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఉపయోగకరమైన రోడ్లు, కాలువలు, భవణ నిర్మాణాలకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మరో థర్మల్ కేంద్రం మాకొద్దు’
శ్రీకాకుళం: జిల్లాలో గత కొన్నేళ్లుగా కాలుష్యకారకమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రతిపాదించడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ చౌదరి లక్ష్మణ రావు అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని గిరిజన గ్రామం వెన్నెలవలస వద్ద 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రంతో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను తక్షణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశా రు. కరపత్రాల ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల ప్రకృతికి, మానవాళికి జరిగే అనర్థాలను వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఊసే లేదన్నారు. పర్యావరణ అనుకూలమైన ప్ర త్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. -
సర్కార్ స్పందించకపోతే
● డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన పీహెచ్సీ వైద్యులు ● పూర్తి స్థాయి విధులకు దూరంగా ప్రభుత్వ గ్రామీణ వైద్యులు అరసవల్లి: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సర్కారుపై ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్యులంతా కలిసి ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ప్రభు త్వ వైద్యం రోగులకు దూరమైంది. తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సు ధీర్, ప్రతిష్టాశర్మ, సుమప్రియ, పావని తదితరుల ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 72 పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్న సుమారు 125 మంది వైద్యులు మంగళవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. సోమవారం వరకు అవుట్ పేషెంట్ (ఓపి) రోగులకు వైద్య సేవలను నిలిపివేసి, కేవలం ఎమర్జెన్సీ వైద్య సేవలను మాత్రమే అందించిన వైద్యులు.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను బంద్ చేశా రు. ముందస్తుగా ఇచ్చిన సమ్మె నోటీసు ప్రాప్తికి తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని సర్కార్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టించుకోవడం లేదు.. వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్గౌర్ విదేశీ పర్యటనను సాకుగా చూపుతూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ వైద్యులు ఆరోపిస్తున్నారు. మరో ఐఏఎస్ అఽధికారి కృష్ణబాబుకు తాత్కాలిక బాధ్యతలను అప్పగించినా ఇలాంటి ప రిపాలన అంశాలపై కీలక నిర్ణయాలపై ఆదేశాలు ఇవ్వలేరని చెబుతున్నారు. -
నేటి నుంచే కిరణ దర్శనం
● ఆదిత్యాలయంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు ● రేపు కూడా దర్శనానికి చర్యలు అరసవల్లి: ఆదిత్య క్షేత్రంలోని సూర్యభగవానుడిపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుతానికి సమయం ఆసన్నమైంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా ఉత్తరాయణ దక్షిణాయణ కాలమార్పుల్లో సంభవించే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఈ మేరకు బుధవా రం వేకువజాము సూర్యోదయ కాలాన తొలి సూర్యకిరణాలు ఆలయ రాజగోపుర ప్రాకారం నుంచి అనివెట్టి మండపం గుండా నేరుగా గ ర్భాలయంలోని స్వామి మూలవిరాట్టును తాకనున్నాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు మంగళవారం సాయంత్రానికే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ మేరకు భక్తులకు కిరణదర్శనానికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం నుంచి బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సూర్యోదయ సమయా న వాతావరణం అనుకూలిస్తే కచ్చితంగా బుధ, గురువారాల్లో సూర్యకిరణాల కాంతులు స్వామి మూలవిరాట్టుపై దర్శనమిస్తాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వివరించారు. విద్యార్థి విజ్ఞాన్ మంతన్ రిజిస్ట్రేషన్స్ గడువు పొడిగింపు శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం, భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా లార్జెస్ట్ ఆన్లైన్ సైన్స్ టా లెంట్ టెస్ట్ విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 25–26, ఆన్లైన్లో నమోదు చేసుకునే కార్యక్రమం అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు వీవీఎం జిల్లా కోఆర్డినేటర్ ఎ.పున్నయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ రాష్ట్రాల పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు ప్రకృతి వైపరీత్యాలు, అర్ధ సంవత్సర పరీక్షలు, పండగలు దృష్ట్యా పొడిగించామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్ అక్టోబర్ 15 వరకు ఉంటుందని తెలియజేశారు. దుర్గా దేవిగా నీలమణిదుర్గమ్మ పాతపట్నం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారు దుర్గా దేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆవరణలోని యోగశాలలో దేవతా హోమాలు, అమ్మవారి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జి.సిగడాం: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జి.సిగడాం మండలం ఆనందపురం –వాండ్రంగి గ్రామాల మధ్య వంతెన సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం ఇల్లయ్యగారిపేట గ్రామానికి చెందిన కొంచాడ యశ్వంత్కుమార్(15), గారపేటకు చెందిన కెల్ల వెంకటేష్ బైక్పై దవళపేటలోని స్నేహితుడి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి లగేజ్ వ్యాన్ ఢీకొనడంతో యశ్వంత్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్కు తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.ప్రైవేటు బస్సు ఢీకొని..మెళియాపుట్టి : బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. చాపర గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నాగవంశపు లక్ష్మణరావు(39) నడిచి వెళ్తుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణరావుకు భార్య కల్పన, ముగ్గు రు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ద్విచక్ర వాహనం ఢీకొని..శ్రీకాకుళం రూరల్: పెదపాడు ప్రధాన రహదారిలో పద్మావతి కల్యాణ మండపం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. బొట్ట సూర్యనారాయణ (75) స్థానిక పద్మావతి కల్యాణ మండపంలో నైట్ వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధుల్లో చేరేందుకు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి పెదపాడు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సూర్యనారాయణ భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీరంలో మృతదేహం
సంతబొమ్మాళి: పిట్టవానిపేట సముద్రతీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం కొట్టుకొచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఒకటి రెండు రోజుల కిందట సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతై ఉంటారని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు ఎచ్చెర్ల : తోటపాలెం పంచాయతీ అఖింఖాన్పేట శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినోద్కుమార్ తెలిపారు. ఘనంగా కొత్తమ్మ తల్లి మారువారం టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో మంగళవారం మారువారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముర్రాటలతో చల్లదనం చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా రూ.51 కోట్లు భారం టెక్కలి: ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం దిగ్విజయంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో నెలకు సుమారుగా రూ.51 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 6 జిల్లాల్లో 1610 బస్సులు ఉన్నాయని వాటిలో సీ్త్ర శక్తి పథకానికి 1352 బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా బస్సులు పెంచే ఆలోచన ప్రభుత్వ విధానం పై ఆధారపడి ఉంటుందని ఈడీ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఒక సారి రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేయడం కష్టతరమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లను బీఓటీ పద్ధతి ద్వారా ఆధునీ కరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఈడీ పేర్కొన్నారు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఫిట్టర్ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 154 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.1.10 కోట్ల పరిహారం అందజేస్తామ ని, సాధారణంగా మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, డీఈ రవికుమార్, డీఎం ఎం.శ్రీనివాస్ ఉన్నారు. 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు కె.భానుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం ఎన్జీఓ భవన్లో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు కాలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏటా రూ.180 కోట్లు హెల్త్కార్డుల కోసం చెల్లిస్తున్నా ఆస్పత్రులు అంగీకరించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్కుమార్, కార్యవర్గ సభ్యులు జి.రమణ బి.వెంకటేశ్వర్లు వి.సత్యనారాయణ, కుప్పిలి జగన్మోహన్, చావలి శ్రీనివాస్, వి.నవీన్కుమార్, వి.రామారావు, పి.హరిప్రసన్న, టి.శ్రీనివాసరావు, డి.రామ్మోహన్ డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గొలుసు దొంగల అరెస్టు
సోంపేట : కొర్లాం జాతీయ రహదారి వద్ద సెప్టెంబరు 14న చైన్స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరిని బారువ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ బి.మంగరాజు, బారువ ఎస్ఐ హరిబాబునాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కవిటి మండలం దూగానపుట్టుగకు చెందిన దంపతులు ఎంపలి కృష్ణ, జానకి మందస మండలంలో తన అల్లుడి వద్దకు దసరా పిలుపుకు బయలుదేరారు. కొర్లాం జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరిని కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు దారి చూపించమని అడిగారు. దీంతో కృష్ణ బైక్ను నెమ్మది చేశారు. ఈ సమయంలో కృష్ణ భార్య ధరించిన 42 గ్రాముల బంగారు చైన్ తెంచుకుని పలాస వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనుమానించారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్పై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వెంబడించి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మురళి శెట్టి, రంజన్ సాహులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా కొర్లాంలో జరిగిన చైన్స్నాచింగ్ను ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సోంపేట సీఐ, బారువ ఎస్ఐలకు ఎస్పీ అభినందించారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
● తక్షణమే ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోవాలి ● అన్ని పార్టీలు, సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు శ్రీకాకుళం : వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి సర్కారు తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఐక్యంగా పోరాటం సాగించి అణగారిన, బహుజన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల జేఏసీ ఆద్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ నేత తైక్వాండో శ్రీను పర్యవేక్షణలో డాక్టర్ కంఠ వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటాని నివాళులర్పించారు. పాటల తూట ఆతవ ఉదయభాస్కర్ తొలుత ఏమై పోదుమో అంబేద్కర్ లేకుంటే అన్న పాటను పాడి సమావేశాన్ని ప్రారంభించారు. – రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అణగారిన, బహుజన, మైనార్టీవర్గాలను వైద్య విద్యకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని కోరారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తారని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు, సొంత సామాజికవర్గం వారికి మేలు చేయడంపైనే ఆయన దృష్టి పెడతారని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించే వారు కరువవుతుండడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమన్నారు. గతంలో పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేపట్టేవారని గత కొంత కాలంగా ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చణీయాంశమై మరో పోరుకు నాందికావాలని ఆకాంక్షించారు. రౌండ్ సమావేశంలో తీర్మానించిన అంశాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని నేతలు స్పష్టం చేశారు. ●తైక్వాండో శ్రీను, కంఠ వేణులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జేఏసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా పండుగ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ● రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు, కళింగ కోమటి సామాజికవర్గ నాయకులు అంధవరపు సూరిబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్గోపాల్, దళిత ఆదివాసీ నాయకులు వాబ యోగి, గ్లోబల్ స్కూల్స్ అధినేత ప్రసాదరావు, హ్యూమన్ రైట్ కమిషన్ నాయకులు ఇంజనీర్ మునిశ్రీనివాస్, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ముజీమ్, ఎస్సీ ఎస్టీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాడాన దేవభూషణరావు, రెల్లి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, లయన్ కరణం హారికా ప్రసాద్, లయన్ పొన్నాడ రవికుమార్, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహిబుల్లా ఖాన్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ, రచయిత దుప్పల రవికుమార్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ.రఫీ, ఎస్సీ సెల్ నాయకుడు పొన్నాడ రుషి, కాళింగ సామాజికవర్గ ప్రతినిధి బగాది వెంకటరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, స్వచ్ఛంధ సేవకులు నటుకులు మోహన్, ఇంజినీర్ దుంగ సుధాకర్, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, కళింగ కోమటి సామాజికవర్గ ప్రతినిధి కోణార్క్ శ్రీను, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు టి.కామేశ్వరి, నాయకులు మండవిల్లి రవి తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు చేపట్టే విధానాలన్నీ పేదల వ్యతిరేక విధానాలే. కార్పొరేట్లకు, తన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. – ధర్మాన రామ్మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ యువనేత కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. దేశంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదు. – అంధవరపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు. ఆయన సొంతంగా రాసుకున్న రాజ్యాంగం దాని ప్రకారమే పాలన సాగిస్తుంటారు. – కల్లేపల్లి రామ్గోపాల్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. మా అధినాయకత్వానికి పునరాలోచన చేయమని కోరుతాం. – సవలాపురపు వెంకటరమణ మాదిగ, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు అభివృద్ధి ముసుగులో విధ్వంసం చేయడం కూటమి నాయకులకు పరిపాటి అయింది. ఇటువంటి ప్రజావ్యతిరేక పేదల వ్యతిరేక నిర్ణయాలపై సమష్టిగా పోరాడాలి. – దుప్పల రవికుమార్, రచయిత వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చంద్రబాబు తనవారికి లబ్ధి చేకూర్చాలన్నదే కానీ పేదల కోసం ఏ అంశంలోనూ ఆలోచన చేయరు. – ఎంఏ రఫీ , వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకుడు వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం అంటే పేద విద్యార్థి కలను కాలరాయడమే. ఇటువంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో తెలియడం లేదు. – పట్నాల శ్రీనివాస్, వస్త్ర వ్యాపారుల సంఘ నేత వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేయాలని చూస్తే ఉద్యమమే. దీనిపై పునరాలోచన చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా పోరాడుతాం. – పొన్నాడ రుషి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకుడు వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వైద్య విద్యను ప్రైవేటీకరించాలని యోచించడం తగదు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. – జోగినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు -
పెరుగుతున్న చైతన్యం
స్వచ్ఛంద రక్తదానం.. ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైనం ● నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంశ్రీకాకుళం కల్చరల్ : రక్తదానంపై చైతన్యం పెరుగుతోంది. అపోహలు, వివిధ కారణాల వల్ల ఒకప్పుడు శిబిరాలు ఏర్పాటు చేసి బతిమాలితే గానీ రక్తదానానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా బ్లడ్బ్యాంకులు, శిబిరాలకు వెళ్లి రక్తదానం చేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ లభిస్తోంది. భారత ప్రభుత్వం ఏటా అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం (నేషనల్ వలంటరీ బ్లడ్ డోనర్స్ డే) నిర్వహిస్తోంది. రక్త నిల్వ కేంద్రాలు.. రక్తాన్ని సేకరించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు(రక్త నిల్వ కేంద్రాలు)లు అందుబాటులో ఉన్నాయి. ఏర్పాటు చేశారు. సేకరించిన ఇక్కడ నిల్వచేసి అవసరమైన వారికి అందిస్తుంటారు. జిల్లాలో అతి పెద్ద రక్తనిల్వ కేంద్రంగా శ్రీకాకుళం రెడ్క్రాస్ నిలుస్తోంది. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రంలో రిమ్స్కు, పాతపట్నం, టెక్కలి, పాలకొండల ప్రభుత్వ ఆసుపత్రులకు రక్తాన్ని అందిస్తున్నారు. తలసేమియా, సికిల్సేమియా, హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. దీంతో పాటు ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీ కూడా సేకరించి అందిస్తున్నారు. ఎస్డీపీ ద్వారా కూడా రక్తసేకరణ చేస్తున్నారు. అపోహలు వీడాలి.. చాలా మందికి రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మి.లీ. రక్తం మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో 300 మి.లీ.రక్తం దానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. 18 నుంచి 60 ఏళ్లు కలిగిన ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. బీపీ, షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండటం మంచిది. జిల్లా జనాభాతో పోల్చితే రక్తదాతలు కేవలం ఒక్క శాతం మాత్రమే. అవసరం మాత్రం అంతకుమించి ఉంది. జిల్లా అవసరాలకు సరిపడా రక్తం సేకరణ జరగడంలేదనే చెప్పాలి. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● 93 ఫిర్యాదుల స్వీకరణశ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి 93 అర్జీలు స్వీకరించారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని డీఎస్సీకి ఎంపికై న 12 మందిని అభినందించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి.. మెళియాపుట్టి: సుర్జిని గ్రామ పరిధిలో గ్రానైట్ క్వారీ వల్ల సమస్యలు మొదలవుతాయని, తమను ప్రశాంతంగా బతకనివ్వాలని మెళియాపుట్టి మండలం బాణాపురం సర్పంచ్ పెద్దింటి చంద్రరావు, విశ్రాంత ఉపాధ్యాయులు కొర్ల కృష్ణమూర్తి తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా బయట గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ ముగించారని, సుర్జిని గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వలేదన్నారు. -
పదోన్నతులు కలేనా?
శ్రీకాకుళం: డీఈఓ పూల్లోని పండితులు పదోన్నతులకు నోచుకోవడం లేదు. అనేక ఏళ్లుగా అప్గ్రేడేషన్ కోసం పోరాటం చేస్తున్న వీరికి 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుగా నిలిచారు. వీరి గోడును తెలుసుకొని అప్గ్రేడేషన్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పండితులుగా పనిచేస్తున్న 1200 మంది పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. అయితే రాష్ట్రంలో 1134 మంది పండితులు పోస్టులు ఖాళీగా లేకపోవడంతో డీఈవో పూల్లోనే నేటికీ కొనసాగుతూ వస్తున్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 87 మంది పండితులు ఇప్పటికీ పదోన్నతులకు నోచుకోకుండా డీఈవో పూల్లోనే ఉండిపోయారు. వీరిలో 65 తెలుగు పండిట్లు, 18 ఒరియా పండిట్లు, 4 హిందీ పండిట్లు ఉన్నారు. ఈ కారణంగా ఏటా ఉపాధ్యాయులకు బదిలీలు చేసినప్పుడు వీరి ప్రమేయం లేకుండానే మారుమూల ప్రాంతాలకు బదిలీ అవుతున్నారు. దీంతో వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. డీఈవో పూల్లో ఉన్న వారికి స్కూల్ అసిస్టెంట్ స్థాయి జీతాలు చెల్లించడం లేదు. పండిట్లకు ఇచ్చే జీతాన్నే ఇస్తున్నారు. కోర్టు చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోంది. పండితులకు పదోన్నతులు కల్పించకపోగా, ఏటా వారి ప్రమేయం లేకుండానే బదిలీల చేస్తుండటంపై విసిగి వేశారిన పండితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం తక్షణం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 2024 డిసెంబర్లో తీర్పును వెలువరించింది. ఇది జరిగి తొమ్మిది నెలలు కావస్తున్నా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్జీటీలు సైతం కోర్టును ఆశ్రయించగా యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మరలా దీనిపై పండితులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా స్టేటస్ కోను ఎత్తివేసింది. అయినా ప్రభుత్వం పదోన్నతులకు చర్యలు తీసుకోకపోవడం పట్ల పండితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ఇతర ఉపాధ్యాయ సంఘాలు సైతం వీరికి అండగా నిలవాలని యోచిస్తున్నారు. కోర్టు తీర్పు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పండితులకు పదోన్నతులు కల్పించాలి. నెలలు గడుస్తున్నా తాత్సారం చేయడం సరికాదు. ప్రత్యేక బదిలీలతో వీరిని వేధిస్తున్నారు. – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ వేదనకు గురవుతున్నాం పండితులకు పదోన్నతులు ఇవ్వకపోగా ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. దీని వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకపోవడం సరైన పద్ధతి కాదు. – లోలుగు ప్రసాద్, డీఈఓ పూల్ పండితుడు ప్రమోషన్లకు నోచుకోని డీఈవో పూల్ పండితులు పదేళ్లుగా తప్పని నిరీక్షణ ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ అమలు కాని కోర్టు ఉత్తర్వులు -
● దుర్గంధం..భరించలేం..
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కొత్తరోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లే మార్గం దుర్గంధభరితంగా మారింది. ఇక్కడి ఫుట్పాత్పై చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ శుభకార్యాలు, ఫంక్షన్లు జరిగినా మిగిలిపోయిన భోజనాలు, ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడే పారబోస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అవి కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు
పలాస: మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు చెక్కభజన, కోలాటం, తదితర జానపద కళారూపాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు దక్కడం గొప్ప విషయమని పలాస మండలం రంగోయి గిడుగురామ్మూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు చెప్పారు. కళాపీఠం సభ్యులు తవిటినాయుడు, సాయికుమార్లు మలేషియాలో నెలరోజుల పాటు అక్కడి తెలుగువారికి జానపద కళల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల సమీప వాటర్ట్యాంక్ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యు వకుడు ఢీకొట్డాడు. ఈ నెల 27న జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నం హనుమంతువాకకు చెందిన కొత్తలంక పూర్ణచంద్రరావు తీవ్రంగా గాయపడి ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వివాహమై మూడు నెలలే.. శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో పరిపాలనావిభాగంలో కార్యాలయ అసిస్టెంట్గా ఉన్న పూర్ణచంద్రరావుకు విశాఖ యువతి పావనితో మూడు నెలల కిందట వివాహమైంది. పూర్ణచంద్రరావు కారుణ్య నియామకంలో రిమ్స్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శనివారం రిమ్స్ లో గాయాలతో పూర్ణచంద్రరావు చేరినా అక్క డి సిబ్బంది ఎందుకో గోప్యంగా ఉంచారని భార్య పావని చెప్పినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ వెల్లడించారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిచంద్ర (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. అదే సమయములో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న హరిచంద్ర పిడగు ధాటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కొత్తూరు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడు. హరిచంద్రకు భార్య అనసూయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని యువజన నాయకులు పెద్దిన అమర్నాథ్, గ్రామస్తులు కోరారు. తాటి వనాలతో సంరక్షణ సోంపేట: తీర ప్రాంతం వెంబడి తాటి వనాలను పెంచడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుఫానులు, సునామీల నుంచి రక్షణ లభిస్తుందని అటవీశాఖ చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ , అడిషనల్ పీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే అన్నారు. బట్టిగళ్లూరు గ్రామంలోని తీర ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. అటవీ శాఖ ద్వారా తాటి విత్తనాలు సేకరించి తీరప్రాంతం వెంబడి నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సముద్ర తాబేళ్ల సంరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎఫ్ఓ ప్రసన్న, కాశీబుగ్గ రేంజర్ మురళీ కృష్ణం నాయుడు, సెక్షన్ ఆఫీసర్ బిందుమతి, బీట్ ఆఫీసర్ సంతోష్కుమార్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, మత్స్యకార ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లింగ్పై ఉక్కుపాదం
శ్రీకాకుళం పాతస్టాండ్: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా అవసరమని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డితో కలిసి నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో తక్షణమే ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత సమాజంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి అరికట్టడంలో కేసులు పెట్టడం మాత్రమే లక్ష్యం కాదని, ఒకే వ్యక్తి పదేపదే వాడుతున్నాడంటే నిఘా లోపం ఉన్నట్టేనని పేర్కొన్నారు. చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు గానీ, 112 లేదా 1930 నంబర్లకు గానీ తెలియజేయాలని కోరారు. 2025 జులై–ఆగస్టు నెలల్లో 350.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 77 మందిని అరెస్ట్ చేసి, 8 వాహనాలను సీజ్ చేసినట్టు వివరించారు. మహిళా భద్రతకు అమలు చేస్తున్న ‘నారీ శక్తి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం రహదారుల భద్రతపై సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 524 రహదారి ప్రమాదాలు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, పోలీస్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా, వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు. -
హార్డ్వేర్ షాపు దగ్ధం
కొత్తూరు : కొత్తూరులోని బత్తిలి రోడ్డులో ఇరాజీ కిమారామ్కు చెందిన కమల హార్డ్వేర్ షాపులో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని కొత్తూరు అగ్ని ప్రమాక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ శంకరరావు సిబ్బందితో వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంజిన్ మోటార్ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. విషయాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహన్రావుకు తెలియజేయడంతో వెంటనే పాలకొండ, ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రాల ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హార్డ్వేర్షాపుతో పాటు పక్కనే ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ మందులు షాపులోకి మంటలు చెలరేగడంతో అక్కడ కూడా సుమారు రూ.ఏడు లక్షల విలువైన మందులు పాడయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కొత్తూరులో వేకువజామున ఘటన సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది -
25 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస : పలాస రైల్వేస్టేషన్ మార్గంలో 25 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన 10 కిలోల గంజాయిని పలాస రైల్వేస్టేషన్ మీదుగా కోల్కతాకు రవాణా చేసేందుకు వెళ్తుండగా పర్లాకిమిడికి చెందిన సర్వశుద్ది కుమార్ స్వామిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో.. గజపతి జిల్లా జలంతర్సింగ్ గ్రామానికి చెందిన రాజేష్బెరా ఒడిశాలో కొనుగోలు చేసిన 15 కిలోల గంజాయిని తెలంగాణాకు రైలు ద్వారా అక్రమ రవాణా చేసేందుకు పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా అరెస్టు చేశారు. గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
అంతేనా బాసూ!
శ్రీకాకుళం69 తులాల బంగారం చోరీకె.మత్స్యలేశంలో భారీ చోరీ జరిగింది. 69 తులాల బంగారం చోరీ చేశారు. –8లోనేటికీ దొరకని కీలక సూత్రధారి మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025మద్యం కేసు.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నకిలీ మద్యం కేసు మిగతా కేసుల్లాగానే నీరుగారిపోతున్నట్లు కనిపిస్తోంది. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు ఆయన వేసిన క్వాష్ పిటీషన్ కోర్టు కొట్టేసింది. ప్రత్యేక బృందాన్ని వేశామని చెబుతున్న ఎకై ్సజ్ అధికారులు ఆయనను పట్టుకోలేకపోతున్నారు. ఈ నెల 2వ తేదీన సారవకోట మండం అవలింగి సమీపంలోని దుర్గా వైన్ షాపులో, సమీపంలోని ఇంటిలో నకిలీ మద్యం దొరికింది. షాపులో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన నకిలీ మద్యం బాటిళ్లు దొరకగా, సమీపంలోని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లతో పాటు ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నెంబర్ స్టాంపింగ్ మిషన్ వంటివి దొరికాయి. ఆ ఇంటిని జిల్లా టీడీపీ కీలక నేత సోదరుడు సన్నిహితుడు మీసాల నీలకంఠం అద్దెకు తీసుకుని, నకిలీ మద్యం బాగోతాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి సరఫరా చేశారో గానీ బుడితిలోని దుర్గా వైన్ షాపులో మాత్రం దొరికాయి. అద్దెకు తీసుకున్న ఇంటితో పాటు దుర్గా వైన్ షాపులో ఈ నకిలీ మద్యం వ్యవహారం చిన్నదేమీ కాదని సమాచారం. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చిన అల్కహాల్కు కలర్ కలిపి నకిలీ మ ద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి విక్రయిస్తున్నట్టుగా సందేహాలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రిపోర్టు ఊహించిందే.. అవలింగిలో దొరికిన నకిలీ మద్యంలో ప్రమాదకర ఆల్కహాల్ కేరామెల్ కలిపి ఉండొచ్చని, ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఉండొచ్చని అధికార వర్గాలు సైతం భావించాయి. కానీ, నకిలీ మద్యం శాంపిల్ను విశాఖలోని ల్యాబ్కు పంపించగా డై ల్యూట్లో ఫ్రైస్ లిక్కర్ విత్ వాటర్ అని రిపోర్టు వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి అసిస్టెంట్ క మిషనర్ రామచంద్రరావు తెలిపారు. అంటే తక్కు వ ధర వైన్లో నీటిని కలిపి ఎక్కువ ధర వైన్లో మిక్స్ చేసినట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు. అంటే రూ.160 ధర గల వైన్లో రూ.99 వైన్తో పాటు నీటిని కలిపినట్టు అధికారులు అంచనాకు వచ్చా రు. సాధారణంగా ఎకై ్సజ్ శాఖలో ఎక్కడే కల్తీ మ ద్యం దొరికినా, నకిలీ మద్యం పట్టుబడినా ఈ రకమైన రిపోర్టే వస్తుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది. దీంట్లో నిజమెంతో వారికే తెలియాలి. ప్రమాదకరమైన ఆల్కహాల్ కలిసినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని ఎకై ్సజ్ వర్గాలు తేల్చిపారేశాయి. తప్పించుకుంటున్నారా? తప్పిస్తున్నారా? కీలక సూత్రధారి మీసాల నీలకంఠం దొరకకుండా వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారా? తెరవెనక శక్తులు తప్పిస్తున్నాయా? అన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవంగా నీలకంఠం బాగోతం అంత సులువుగా బయటపడేది కాదు. కానీ, నరసన్నపేట టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు జిల్లా కీలక నేత సోదరుడు నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు స్థానిక నేత నాయకత్వం వహిస్తున్నారు. కీలక నేత సోదరుడు అండ చూసుకుని నీలకంఠం స్థానిక నేతకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. స్థానిక నేతకు నీలకంఠం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు సరికదా తన సిండికేట్ వ్యాపారానికి కలిసి రావడం లేదు. ఆ క్రమంలోనే స్థానిక నేత వ్యూహాత్మకంగా నీలకంఠం బాగోతాన్ని బయటపెట్టించేలా పథకం రచించారన్న వాదనలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికారులు పట్టుకోక తప్పలేదని తెలుస్తోంది. టీడీపీలోని సిండికేట్ గ్రూపు రాజకీయాలతో నకిలీ మద్యం గుట్టు, నీలకంఠం బాగోతం బయటపడింది. ఇప్పుడా కీలక నేత సోదరుడు తెలివిగా నీలకంఠం తప్పించుకునేలా సహకరిస్తున్నారు. అధికారులకు దొరకకుండా.. అధికార వర్గాలు కూడా సీరియస్గా తీసుకోకుండా ఒత్తిడికి గురి చేసి నకిలీ మద్యం కేసును, మీసాల నీలకంఠంను కాపాడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. నీలకంఠంకు కూడా ఎకై ్సజ్ శాఖలో మంచి పట్టు, ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడాయనకు కలిసొస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణ కేసుగానే.. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం మద్యంలో అడల్ట్రేషన్ జరుగుతోంది. కాస్ట్లీ లిక్కర్లో చీప్ లిక్కర్ కలపడం, చీప్ లిక్కర్లో నీరు కలపడం వంటి సాధారణంగా జరుగుతున్నాయి. ఆ మధ్య టెక్కలిలో ఒక కేసు వెలుగు చూసింది. తర్వాత మసిపూసి మారేడు కాయ చేసేశారు. కల్తీ మద్యం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని లైసెన్సు దుకాణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా తేడా కొడితే భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు. నకిలీ మద్యం కేసు నీరు గారినట్టేనా..? తప్పించుకుని తిరుగుతున్న కీలక సూత్రధారి మీసాల నీలకంఠం స్పెషల్ బృందాలు తిరుగుతున్నా దొరకడం లేదంటున్న ఎకై ్సజ్ వర్గాలు టీడీపీ గ్రూపు రాజకీయాలతో దొరికిన నకిలీ మద్యం సూత్రధారిని జిల్లా కీలక నేత సోదరుడు తప్పిస్తున్నట్టుగా అనుమానాలు ఈ నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారి మీసాల నీలకంఠంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడైతే నకిలీ మద్యం పట్టుబడిందో నీలకంఠం పరారైపోయారు. మద్యం బాటిళ్లు దొరికిన దుర్గా వైన్ షాపులో పనిచేస్తున్న ఇద్దరు నౌకర్ నామాలను, లైసెన్సు షాపు యజమానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత షాపు సీజ్ చేశారు. ఇక, నీలకంఠం తీసుకున్న అద్దె ఇంట్లో ఉంటున్న పైడిరాజు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం మాత్రం దొరకడం లేదు. ఈయన కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నీలకంఠం కోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
ఓపిక నశించి
● నిరసనకు దిగిన పీహెచ్సీ వైద్యులు ● ఓపీ సేవలకు దూరం ● నేటి నుంచి పూర్తిస్థాయి వైద్యసేవలు బంద్ అరసవల్లి: ప్రభుత్వ వైఖరితో సర్కారు వైద్యుల్లో ఓపిక నశించిపోయింది. దీంతో వైద్యులంతా నిరసన బాట పట్టారు. ముందస్తు నోటీసు ప్రకారం సోమవారం నుంచి ఓపీ సేవలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గత రెండు రోజుల నుంచి అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి నిష్క్రమించిన వైద్యులు ఆన్లైన్ నివేదికలను పంపించడాన్ని కూడా నిలిపివేశారు. తాజాగా ఓపీ సేవలను అన్ని పీహెచ్సీలలో నిలిపివేయడంతో రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం అనుమతిస్తూ తమ వృత్తిధర్మాన్ని పాటించారు. ఓపీ సేవలకు దూరంగా జిల్లాలో 72 గ్రామీణ పీహెచ్సీల్లో సుమారు 125 మంది వైద్యులు సమ్మెబాట పట్టారు. ఇందులో భాగంగా ఔట్పేషెంట్(ఓపీ) సేవలకు అనుమతి నిరాకరించడంతో ఎక్కడికక్కడ రోగులు ప్రభుత్వ వైద్యం కోసం పడిగాపులు కాశారు. ఒక్కో పీహెచ్సీకి 30 నుంచి 35 మంది రోగులు చొప్పున మొత్తం 2, 500 మంది సోమవారం ప్రభుత్వ వైద్యానికి దూరమయ్యారు. వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధులతో రోగులు అవస్థలు పడ్డారు. అలాగే చిన్నారులకు, బాలింతలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిలిచింది. నేటి నుంచి పూర్తిస్థాయి బంద్ రాష్ట్ర, గ్రామీణ పీహెచ్సీ వైద్య సంఘ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృత చర్చలకు అవకాశం ఇవ్వకపోవడంతో వైద్యు లు సమ్మె నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందిస్తున్న పీహెచ్సీ వైద్యులు మంగళవారం నుంచి పూర్తిస్థాయి వైద్య సేవలను నిలిపివేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా కేంద్రంలో పీహెచ్సీ వైద్యులంతా ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సుధీర్(గుప్పెడుపేట), ప్రతిష్టాశర్మ(బాతువ), సుమప్రియ(పోలాకి), పావని(చాపర) బృందం ఆధ్వర్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నారు. మెళియాపుట్టి మండలం చాపర పీహెచ్సీలో వైద్యురాలు పావని అత్యవసర వైద్యం కింద ఓ గర్భిణికి డెలివరీ చేసి తమ వైద్య వృత్తి ధర్మాన్ని చాటుకోవడం గమనార్హం. చాపర పీహెచ్సీలో వైద్యం కోసం వేచి ఉన్న ఓపీ రోగులు -
కక్ష సాధింపు
● ప్లానింగ్ ప్రకారం జీతాలు పెట్టకపోవడం దారుణం దసరా వంటి పండుగ పూట జీతం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా. ఒకే సమయంలో చాలా పనులు చెబుతున్నారు. మాకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. సంబంధం లేని పనులన్నీ చెబుతున్నారు. – రెల్ల యమున, వార్డు ప్లానింగ్ సెక్రటరీశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సచివాలయ ఉద్యోగులపై ఓ ‘ప్లానింగ్’ ప్రకారమే కక్ష సాధింపులు జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇతర ఏ శాఖలోని ఉద్యోగులకూ ఇవ్వనన్ని బాధ్యతలు వీరికే అప్పగిస్తున్నారు. పనులు చేయకపోతే తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ సచివాలయ ఉద్యోగుల్ని పురుగుని చూసినట్లు చూస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘సిగ్గు, లజ్జ లేదా.. పది వేళ్లు నోటికి ఎలా వెళ్తున్నాయి..’ అని రాయలేని భాషలో తిడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ–2 జానకి ప్లానింగ్ సెక్రటరీలను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా పనులు అప్పగిస్తున్నారని, ప్రశ్నిస్తే కక్షసాధింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. దసరా పూట పస్తులే.. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలకు జీతాలు పెట్టవద్దంటూ ఏసీపీ లేఖ రాయడం అందరినీ విస్మయపరుస్తోంది. దసరా వంటి పండుగ వేళ జీతాలు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 నుంచి 3గంటల వరకు వారు ఆందోళనకు దిగడంతో ఉద్రి క్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు గంటల పాటు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, ఏసీపీ, ఉన్నతాధికారులు చర్చించి చివరకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను తాత్కాలికంగా విరమించారు. వేధింపులు ఇలా.. సచివాలయ ఉద్యోగుల చేత కనీసం 14 నుంచి 15 గంటల పాటు పనిచేయిస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో సైతం పనులు అప్పగిస్తున్నారు. అదనపు అలవెన్సుల ఊసే లేదు. ఇన్చార్జిల పేరుతో ఒక్కొక్కరికి 4 నుంచి 5 సచివాలయాలు అప్పగిస్తున్నారు. ప్లానింగ్ సెక్రటరీలపై ఏసీపీ కక్ష సాధింపు ప్రశ్నించే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వైనం ఎఫ్ఏసీ అలవెన్సులు ఇవ్వకుండా ఇష్టానుసారం విధుల అప్పగింత ఆందోళనకు దిగిన ఉద్యోగులు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి 3గంటల వరకు ఉద్రిక్తత -
ఎవరొస్తారో..ఎప్పుడొస్తారో!
● రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో కొరవడుతున్న పర్యవేక్షణ ● సక్రమంగా అమలు కాని ఫేస్ అటెండెన్స్ శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో పర్యవేక్షణ కొరవడుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్ల సెలవులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ రెండేళ్లుగా అమలు చేస్తోంది. ప్రత్యేక యాప్ ద్వారా హాజరు వేయకుంటే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారు. ఈ హాజరును పరిశీలించి జీతాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం ఇది అస్సలు అమలు కావడం లేదు. దీనిని ఎవరు పరిశీలిస్తున్నారన్నది కూడా అంతుచిక్కడం లేదు. రాష్ట్రస్థాయిలో సైతం ఈ హాజరును పరిశీలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఓ అధికారి తరచూ అనధికారికంగా గైర్హాజరవుతున్నా ఫేస్ అటెండెన్స్ వేయకుండా నెల మొత్తానికి జీతాలు చెల్లించేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సైతం దీనిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. రిమ్స్ లోని చాలామంది వైద్యులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో నిర్ణీత సమయానికంటే చాలా ముందుగానే వెళ్లిపోతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారి సైతం నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిపోవడం, సెలవులో ఉండటం జరుగుతుండడం వల్ల ప్రశ్నించే వారే లేకుండాపోతున్నారు. ఈ కారణంగానే గైర్హాజరవుతున్న అధికారిని సైతం అడగలేని పరిస్థితి నెలకొంది.నవంబరు 11 నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నవంబరు 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు నిర్వహించాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమిటీ ఆదివారం సమావేశమైంది. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 100 ప్రచురణ సంస్థలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. 10 రోజుల పాటు సాహిత్య సభలు, పుస్తక పరిచయాలు, కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటిక, డ్యాన్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయ ప్రదర్శనలు, సైన్స్ఫెయిర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, కవితలు, కథలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. సమావేశంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కన్వీనర్ కేతవరపుశ్రీనివాస్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయ్ శర్మ, అట్టాడ అప్పలనాయుడు, ఎల్.రామలింగస్వామి, యు.నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, కంచరాన భుజంగరావు, చింతాడ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం అరసవల్లి/గార: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. దసరా సెలవులు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కుటుంబ సమేతంగా ఆదిత్యుని దర్శించుకున్నారు. ఈయన వెంట జిల్లా ఎస్పీ కె.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,78, 800, విరాళాల రూపంలో రూ.66,718, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05లక్షలు వరకు ఆదాయం లభించినట్లు ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని కూడా విజయనగరం ఎస్పీ దామోదర్ దర్శించుకున్నారు. ఈవో కె.నరసింహానాయుడు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందించారు. . -
బయటపడుతున్న.. బంగారం బండారం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బంగారం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్మార్క్ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాటల గారడీ.. ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు. దొంగ బంగారం ఆరోపణలు.. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్ అని 22 క్యారెట్, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది. జీరో వ్యాపారం.. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చైన్నె, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికై తే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని కొందరు వ్యాపారులు దగా చేస్తున్నారు. బయటపడుతున్న ఘటనలన్నీ నరసన్నపేటలో అయినప్పటికీ దాని లింకు జిల్లా వ్యాప్తంగా ఉందనే వాదనలు ఉన్నాయి. మొత్తానికి బంగారం విషయంలో జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. బంగారంలో నాణ్యత, లావాదేవీలు ఎంతవరకు కచ్చితమనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. బట్టబయలవుతున్న బంగారం మోసాలు నరసన్నపేటకే పరిమితమా? జిల్లా వ్యాప్తంగా ఇదే బాగోతమా? మొన్న నకిలీ హాల్మార్క్ మోసం తాజాగా జీఎస్టీ అధికారుల సోదాలతో వెలుగులోకి జీరో వ్యాపారం చివరికీ మోసపోతున్నది వినియోగదారులే నకిలీ హాల్మార్క్ మోసాలు.. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి హెచ్యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్ఐయూడీ నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్ఐయూడీ నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. -
30న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
గార: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూచనలతో జిల్లాలోని అన్ని దళిత సంఘాలను సమన్వయం చేస్తూ, పార్టీ అనుబంధ విభాగాలతో నిరసన ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అన్ని విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కాంప్లెక్స్ కిటకిట
● సరిపడా బస్సులు లేక ప్రయాణికుల పాట్లు ● గంటల తరబడి తప్పని నిరీక్షణ శ్రీకాకుళం అర్బన్: దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. సెలవులకు తోడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ప్రతి బస్సు రద్దీగా కనిపిస్తోంది. సీట్లు సంగతి పక్కన పెడితే నిల్చునేందుకు కూడా జాగా లేని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా ఇంటర్మీడియెట్, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో దూరప్రాంతాల నుంచి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం చేరుకోవడంతో కాంప్లెక్స్ కిటకిటలాడింది. ఎక్కువగా విశాఖ నుంచి నాన్స్టాప్ బస్సులతో పాటు సిటీ బస్సులు సైతం నాన్స్టాప్ బస్సులుగా నడిపారు. మరోవైపు, సకాలంలో బస్సులు రాక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. -
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశ్వమానవ సమానత్వం కోసం తన కలంతో గర్జించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని బడుగు, బలహీనవర్గాల నాయకులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ఆదివారం జాషువా 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో ఉన్న కుల వివక్షత, అణచివేత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచి గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి అనేక రచనలు ద్వారా సమాజాన్ని చైతన్యపరచినా గొప్ప కవి గుర్రం జాషువా అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళల సమానత్వం కోసం అనేక రచనలు చేశారన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, దళిత సంఘాలు, బహుజన నాయకులు కళ్ళేపల్లి రాంగోపాల్, కంఠ వేణు, అమీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణ, కాగిత వెంకటరావు, యజ్జల గురుమూర్తి, కిల్లాన శ్రీనివాస్, ఆలాపన త్రినాథ్రెడ్డి, బోనెల రమేష్, సీర రమేష్బాబు, పడాల ప్రతాప్కుమార్, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకీరావు, సాంబారిక సూరిబాబు, గోల్లపల్లి నందేశ్ పాల్గొన్నారు. -
వ్యయ ప్రయాసల రేషన్
● ఉచిత రేషన్ తీసుకొచ్చేందుకు రూ.200 ఖర్చు ● ఏడు గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని వ్యధ ● కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. గిరిజనులకు శాపం హిరమండలం : కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది ఆ ఏడు గిరిజన గ్రామాల పరిస్థితి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటా రేషన్ సరఫరా చేయడంతో అప్పట్లో ప్రతి ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ తెచ్చుకోవాలంటే రూ.200 ఖర్చవుతోందని హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ పంచాయతీలో లోకొండ, మామిడిజోల, మొగడపేట, గోడిపాడు, పూలకొండ, తాళ్లపాడు, లింగుపురం తదితర గ్రామాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. గిరిజనులు కూడా నిశ్చింతగా తీసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంటింటా రేషన్ సరఫరా చేసే వాహనాలను తొలగించింది. పాత రేషన్ విధానాన్ని పునరుద్ధరించింది. దీంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. సుదూరంగా డిపో.. లోకొండ పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో రేషన్ డిపో కేటాయించకుండా భగీరథపురంలో డిపో ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తోంది. ఉచిత రేషన్ కోసం కుటుంబానికి 30 నుంచి 50 కిలోల బియ్యం అందిస్తున్నారు. ఆ బియ్యాన్ని తెచ్చుకునేందుకు ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.200 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి లోకొండ పంచాయతీ పరిధిలో రేషన్ డిపోను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంతో బాగుండేది. ఇప్పుడు పేరుకే ఉచిత రేషన్. తెచ్చుకోవాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? ప్రభుత్వం ఇప్పటికై నా తప్పిదాన్ని సరిచేయాలి. లోకొండ పంచాయతీ పరిధిలో డిపో ఏర్పాటుచేయాలి. – ఎన్.బుడ్డమ్మ, లోకొండ స్థానికంగా రేషన్ డిపో ఏర్పాటుచేయాలి. గతంలో ప్రతి ఇంటికి సులువుగా రేషన్ అందేది. ఇప్పుడు రేషన్ కావాలంటే 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ అందించాలి. – కుద్దిగాం రాము, లోకొండ -
నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం రూరల్: పోటీ ప్రపంచంలో విద్యార్హతలు కంటే నైపుణ్యత ఉంటేనే రాణించగలమని జెమ్స్ సీఓఓ శ్రీధర్రెడ్డి అన్నారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బొల్లినేని బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ కళాశాల ఫ్రెషర్స్డే వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా వైద్యరంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు మాత్రమే ఈ రంగంలో రాణించగలరని చెప్పారు. బీఎస్సీ ఎలైడ్ హెల్త్కేర్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. జెమ్స్ మెడికల్ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ రోగికి వైద్య చికిత్సలో ఎలైడ్ హెల్త్ కోర్సు విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు. వైద్యుని తరువాత స్థానం వీరిదేనన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టుదలతో చదివితే విజయం సొంతమవుతుందన్నారు. అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ మాట్లాడుతూ కళాశాల దశమ వార్షిక ప్రణాళిక, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
డబుల్ కిక్
ఎక్సైజ్కుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మద్యం షాపుల నుంచి ఎకై ్సజ్ తదితర వర్గాలు నెలవారీ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా దసరా మామూళ్లు సైతం ఫిక్స్ చేశారని తెలిసింది. బెల్ట్ షాపునకు రూ.5వేలు, దాబాకు రూ.10వేలు, వైన్ షాపునకు రూ.25వేలు చొప్పున నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. బెల్ట్షాపులు, దాబాల నుంచి వసూలు చేసే బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించగా, వైన్షాపుల బాధ్యత ఓ క్షేత్రస్థాయి అధికారికి అప్పగించినట్టు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. వసూలు చేసిన దాంట్లో వాటాలు కూడా నిర్ణయించినట్టు సమాచారం. బెల్టుషాపుల హవా.. జిల్లాలో సిండికేట్ హవా నడుస్తోంది. బెల్ట్షాపుల దందా కొనసాగుతోంది. ఎంఆర్పీకి మించి విక్రయా లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎకై ్సజ్ వర్గాలకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లాలో వైన్షాపులు, పర్మిట్ రూమ్ లు ఇప్పటికే ఉండగా, అనుబంధంగా బెల్ట్షాపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో కాదు.. ఒక్కొక్క వీధిలో నాలుగైదు బెల్ట్షాపులు నడుస్తున్నాయి. కోడ్ ప్రకారమే.. కొన్నిచోట్ల ఏకంగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంచి ఏ దుకాణానికి, ఏ కోడ్తో ఏ మద్యం సరఫరా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుని బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నారు. మద్యం విక్రయించే సమయంలో కూడా ఎంచుకున్న కోడ్తో ఏ, బీ, సీ, డీ అనే అక్షరాలు బాటిల్పై రాస్తున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా బెల్ట్షాపులకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అధికారులు దాడులు చేసి మద్యం సీసాలను పట్టుకుంటే ఆ కోడ్ను చూసి వదిలేసేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి బెల్ట్ వ్యవహారం పక్కా పథకం ప్రకారం జరుగుతోంది. వైన్ షాపుల నుంచి బెల్ట్షాపులకు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వేసి ఇస్తున్నట్టు తెలుస్తోంది. వాటి పై మరో రూ.20, రూ.30, రూ.40, రూ.50 వేసి మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఎకై ్సజ్ వర్గాల ప్రోత్సాహం ఉండాల్సిందే. కొనసాగుతున్న ముడుపుల పర్వం.. íÜ…yìl-MóS-sŒæ™ø Jç³µ…-§éË$, ¯ðlÌSÐéÈ Ð]l¬yýl$-ç³#ÌS ç³Æý‡Ó… Mö¯]l-ÝëVýS$-™ø…¨. »ñæÌŒæt-Úë-ç³#Ë$ ò³Ç-W¯]l ™èlÆ>Ó™èl ÐéÅ´ëÆý‡… MýS*yé ò³Æý‡-VýS-yýl…™ø Ððl¬§ýlsZÏ Ð]l¬yýl$-ç³#Ë$ CÐ]lÓ-yé-°MìS ÐéÅ´ë-Æý‡$Ë$ Mö…™èl Cº¾…-¨-ç³-yéz..C-糚yýl$ Ìê¿êË$ Ð]lçÜ$¢…yýlr…™ø Ð]l¬yýl$-ç³#ÌS ÑçÙ-Ķæ*°² ò³§ýlª ¿êÆý‡…V> ¡çÜ$-Mø-Ð]lyýl… Ìôæ§ýl$. C§ýl…™é ¯ðlÌS ÐéÈ »êVø-™èl…. C糚yýl$ §ýlçÜÆ> Ð]l_a…-¨. V>Å‹Ü, ´ëË$, ´ëÇÔ¶æ$§ýl®Å M>Ç-Ã-MýS$yýl$, Ððl$M>-°MŠSÌS §ýlVýSYÇ ¯]l$…_ {糡 JMýSP-ÇMîS CçÙt…-V>¯ø, MýSçÙt…-V>¯ø G…™ø Mö…™èl CÐ]lÓyýl… B¯]l-Ðé-Ƈ$$-¡. CMýSPyýl MýS*yé A§ól ™èlÆý‡-àÌZ CÐéÓ-ÌS-°.. ç³…yýlVýS ^ólçÜ$-Mø-ÐéÌS° OÐðl¯ŒSÚëç³#, »ñæÌŒætÚëç³#, §é»êÌSMýS$ «§ýlÆý‡Ë$ °Æý‡~-Ƈ$$…_¯]lr$t ™ðlÍíÜ…¨. D ¯ólç³£ýlÅ…ÌZ ÐéÅ´ëÆý‡$-ÌSMýS$ BçœÆŠ‡ MýS*yé C_a¯]lr$t çÜÐ]l*-^é-Æý‡…. §ýlçÜÆ> ç³…yýlVýS ïÜf¯ŒSÌZ G…BÆŠ‡-ï³MìS Ñ$…_ «§ýlÆý‡Ë$ ò³…^èl$-MýS$¯ól ÐðlçÜ$-Ë$-»êr$ MýS͵…-_-¯]lr$t BÆø-ç³×æË$ Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. »ñæÌŒætÚë-ç³#-ÌZÏO¯ðl™ól JMöPMýSP »êsìæÌŒæ Oò³ Æý‡*.50MìS-Oò³V> ò³…^éÌS° Cç³µsìæMóS »ñæÌŒæt °Æ>Ó-çßæ-MýS$Ë$ °Æý‡~-Ķæ*-°-Mö^éaÆý‡$. hÌêÏ A…™èl-sê C§ól ™èl…™èl$ ¯]lyýl$-Ýù¢…-¨.◘నెలవారీ వసూళ్లు.. తోడుగా దసరా మామూళ్లు! బెల్ట్షాపుల నుంచి వైన్షాపుల వరకు సొమ్ము ఇచ్చుకోవాల్సిందే రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు రేట్ ఫిక్స్ నెలవారీ మామూళ్లకు ఇవి అదనం మద్యం ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు! -
తవ్వేస్తాం.. దోచేస్తాం
● జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ● యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు వసప గ్రామంలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద లారీలకు ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యం కొత్తూరు: మండలంలోని వసప గ్రామ సమీపంలో బల ద గ్రామం పేరుతో ఇసుక ర్యాంపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారు లు పట్టించుకోవడం లేదు. నదికి వరదలు వచ్చినట్లయితే ఇసుక తవ్వకాలకు ఆటంకం లేకుండా ఉండేందుకు నది మధ్యలో భారీగట్టును నిర్మించారు. దీంతో నదికి వచ్చిన వరద ప్రవాహం మారిపోయే ప్రమాదం ఉంది. నిబంధనల మేరకు నదిలో ఇసుకను కూలీలతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్కు లోడు చేయించాలి. అయితే అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రొక్లెయినర్లతో రెండు నుంచి మూడు మీటర్ల లోతులో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విధంగా తవ్వకాలు చేయడం వలన భూగర్భ జాలలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. పేరుకే ఉచితం ప్రభుత్వం ఉచితంగా ఇసుక అని చెబుతున్నా ఇక్కడ అమలు జరగడం లేదని తెలుస్తోంది. ఉచిత ఇసుక పేరుతో సుమారు 20 టన్నుల ఇసుకను రూ. 15 వేల వరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. అక్రమంగా ఇక్కడ నుంచి విజయనగరం, విశాఖపట్నంతో పాటు పలు పట్టణాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాలపై మైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక లోడుతో ఇసుక లారీలు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నదిలో ఇంతవరకు ఎన్ని క్యూబిక్ మీట ర్ల ఇసుక తరలించారన్న లెక్కలు కూడా తెలియడం లేదు. మరోవైపు రోడ్లు మీద అధికంగా ఇసుక లారీ లు వెళ్తుండడంతో రోడ్లు గోతులమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు లేకుండా నదిలో అడ్డంగా నిర్మించిన గట్టు నదికి పైభాగాన ఉన్నందున్న వరదలు వచ్చినట్లయితే కుంటిభద్ర, సిరుసువాడ, వసప కాల నీ గ్రామాలకు ప్రమాదకరంగా మారుతుంది. నదిలో వరద ఉద్ధృతంగా వచ్చినప్పుడు గట్టు అడ్డంగా ఉన్నందున గ్రామాల్లో వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. అక్రమంగా జరుగుతు న్న ఇసుక తవ్వకాలను అధికారులు నిలుపుదల చేయాలి. – అగతమూడి నాగేశ్వరరావు, కుంటిభద్ర, కొత్తూరు మండలం -
బ్యాంగిల్ షాపు దగ్ధం
టెక్కలి రూరల్: టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 10వ లైన్లో కోటిపల్లి కృష్ణారావు, దమయంతికి చెందిన బ్యాంగిల్ షాపు దగ్ధమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో షాపు నుంచి పొగ రావడంతో చుట్టుపక్కలవారు గమనించి షాపు యజమానికి ఫోన్లో సమాచారం అందించారు. యజమాని హుటాహుటిన షాపు వద్దకు చేరుకోగా అప్పటికే మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే షాపులో చీరలు, ఫ్యాన్సీ సామగ్రి, గాజులు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నరసన్నపేట: జమ్ము కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలాకి మండలం గాతలవలసకు చెందిన బమ్మిడి దామోదరరావు ఆదివారం ఉదయం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో (54) మృతి చెందాడు. స్థానిక హాటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దామోదరరావు డ్యూటీ ముగించుకొని జమ్ము కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్సులో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. దామోదరరావు భార్య వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయితో పట్టుబడిన రౌడీషీటర్ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని డచ్బంగ్లా వద్ద రెండు కిలోల గంజాయితో నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ పట్టుబడ్డాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలా ట హరికృష్ణ ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తెచ్చి డచ్బంగ్లా సమీపంలో విక్రయం చేసేందుకు వేచి ఉండగా ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ మహిళపై అఘాయిత్యానికి సంబంధించి కేసులో హరికృష్ణపై షీట్ ఓపెన్ అవ్వడం, కొట్లాట కేసు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు, కేసును సీఐ పైడపునాయుడు దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. జనసేనలో వర్గ విభేదాలు కంచిలి: జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకత్వంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్కు స్థానిక పార్టీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కష్టపడే నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు గుర్తింపు ఉండటం లేదని, ఇదేంటని ప్రశ్నిస్తే తాము వేరే పార్టీ వాళ్లమంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడుతూ గొడవలు సృష్టిస్తున్నారని వాపోయారు. -
కానిస్టేబుల్ అరెస్టు
టెక్కలి రూరల్: దమ్ము గోపాలం అనే పోలీస్ కానిస్టేబుల్ అరెస్టయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ మాట్లాడుతూ గోపాలం గతంలో టెక్కలిలో కానిస్టేబుల్గా పనిచేసి ప్రస్తుతం పలాసలో విధులు నిర్వర్తిస్తున్నాడని, తనను మోసం చేశాడంటూ టెక్కలిలో ఉంటున్న ఓ మహిళ ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం విచారణ జరిపి కానిస్టేబుల్ను జిల్లా జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇచ్ఛాపురం రూరల్: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి తేలుకుంచి వస్తున్న విదేశీ పక్షులు, సైబీరియన్ కొంగలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇచ్ఛాపురం తహసీల్దార్ ఎన్.వెంకటరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం తేలుకుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి, ఎంపీడీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
డిజిటల్ బుక్తో.. వైఎస్సార్సీపీ శ్రేణులకు భరోసా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ కార్యకర్తల కు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ బుక్లో లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే పార్టీ అండగా ఉంటుందని శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భరోసా ఇచ్చారు. వేధింపులు, ఇబ్బందు లు ఎదురైతే డిజిటల్ బుక్లో ఫోన్ నెంబర్, ఇతర వివరాలు పొందుపరచాలని కోరారు. శ్రీకాకుళంలో ని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీతారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విజ యవాడలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. ఇప్పటికే చాలామంది పార్టీ సానుభూతిపరులకు, కార్యకర్తల కు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినవెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్ను టీడీపీ నేతల రెడ్బుక్ మాదిరి పెట్టుకున్నా మని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజలకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందు కు డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర కాళింగ కుల అధ్యక్షుడు దుంపల రామారావు, వెలమ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కళింగ వైశ్య కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, పార్టీ సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్దనరావు, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎంఏ బేగ్, సనపల నారాయణరావు, వై.వి.శ్రీధర్, యజ్జల గురుమూర్తి, బొడ్డేపల్లి పద్మజ, తంగుడు నాగేశ్వరరావు, గుండ హరీష్, సిహెచ్ భాస్కర్, రుప్ప అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ తల్లి గుడిలో చోరీ
నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో ఉన్న గంగమ్మ తల్లి గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త ముత్తా సింహాచలం తెలిపారు. గంగమ్మ తల్లి విగ్రహం మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారు శతుమానం, మూడు గ్రాముల వెండితో ఉన్న మట్టెలను దోచుకెళ్లారని తెలిపారు. అలాగే హుండీని ఎత్తుకుపోయారన్నారు. హుండీలో రూ.20 వేల వరకూ నగదు, కొన్ని వెండి వస్తువులు ఉంటాయని వివరించారు. ప్రతిఏటా నవంబర్ నెలలో హుండీ లెక్కించి వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తామని, ఇంతలో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సచివాలయ ఉద్యోగుల చలో కలెక్టరేట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం సచివాలయం ఉద్యోగులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్అండ్బీ వసతి గృహం రోడ్డుపై రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల బకాయిలు చెల్లించాలని, తొమ్మిది నెలల ఎరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్ల పనులు కూడా ఉద్యోగులతో చేయించడం ఆపాలని, గ్రామ స్థాయిలో నాయకుల నుంచి వేధింపులు అరికట్టాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి బి.జగదీష్బాబు, పి.నారాయణ రావు, ఎం.రవికుమార్, వెంకటేశ్వర్లు, సంగయ్య, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
● 134 కేసుల్లో 106 మంది అరెస్టు ● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: సోషల్ మీడియాలో అసత్య ప్రచా రాలు చేస్తూ, మహిళలను అగౌరవపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై గట్టి నిఘా పెట్టామని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. రేంజి పరిధిలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీలతో వర్చువల్గా సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. పోస్టులు మితిమీరుతుండడంతో ప్రతీ జిల్లాలో పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక బృందాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని గుర్తించాలన్నారు. వారు పెట్టిన పోస్టు ఏ కేటగిరీకి వస్తుంది.. వారిపై ఎటువంటి చర్యలు చేపట్టార న్న అంశాలపై రోజువారి నివేదిక తనకు పంపాల ని అధికారులను ఆదేశించారు. గుర్తించిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారికి సహకరిస్తున్న వ్యక్తుల ను వ్యవస్థీకృత నేరమునకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు. 106 మంది అరెస్టు రేంజి పరిధిలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 134 మందిపై కేసులు నమోదు చేసి, 106 మందిని అరె స్టు చేశామని, 57 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ ప్రారంభమైందన్నారు. డీఎస్పీ లు వారి పరిధి స్టేషన్లలో ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అభ్యంతరకర పోస్టు లు పెడుతున్న వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరన్నది స్పష్టం చేయాలన్నారు. -
ఇంకెంత కాలం రైతులు రోడ్డెక్కాలి..?
ఇచ్ఛాపురం రూరల్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలించిన ప్రతిసారీ రైతులు ఏదో సమస్యతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇంకెంత కాలం ఇలా రైతులు రోడ్డెక్కాలని జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ ప్రశ్నించారు. రైతు పోరులో భాగంగా శనివారం ఆమె రైతులు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి యూరియా కష్టాలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటే, కేవలం 320 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. దీంతో రైతులు అధిక మొత్తాన్ని చెల్లించి ఒడిశాలో యూరియాను కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇస్తున్న యూరియాను కూటమి నాయకులు తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇస్తున్నారన్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో యూరియాను అన్నదాతలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఎన్.వెంకటరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, మండల కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, నాయకులు సల్ల దేవరాజు, కారంగి మోహనరావు, తడక జోగారావు, దక్కత నూకయ్యరెడ్డి, ఎన్.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నిర్మాణంపై వివాదం
కొత్తూరు: మండలంలోని కడుము కాలనీలో ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలంపై రెండు వర్గాల మధ్య శనివారం వివాదం చెలరేగింది. కాలనీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎం.అప్పారావు నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ వేసేందుకు శనివారం ఏర్పాట్లు చేశారు. అయితే అప్పారావు ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నందున పనులు నిలుపుదల చేయాలని కాలనీకి చెందిన వి.గోవిందరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలియడంతో స్థానిక సీఐ చింతాడ ప్రసాద్, ఎస్ఐ ఎండీ అమీర్ అలీ తమ సిబ్బందితో చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ కె.బాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి పనుల వద్దకు చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత అప్పారావు నిర్మిస్తున్న ఇల్లు జిరాయితీ స్థలంలో ఉందని స్పష్టం చేశారు. అనంతరం పనులు చేపట్టేందుకు అప్పారావు సమాయత్తమయ్యారు. పాఠశాల స్థలంలో పనులు చేపడితే అడ్డుకోవడం తప్పదని గ్రామస్తులు కొంతమంది అధికారులకు తెలిపారు. ఇల్లు నిర్మిస్తున్న స్థలంతో పాటు పాఠశాల స్థలాన్ని కడుము కాలనీకి చెందిన ఒకరు గతంలో దానం చేశారని, అందుకు సంబంధించిన అధారాలు అక్టోబర్ 5వ తేదీన సమర్పిస్తామన్నారు. దీంతో అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని తహసీల్దార్ ఆదేశించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. -
సైకో ఎవరనేది ప్రజలకు తెలుసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిండు శాసనసభలో పద్ధతి లేకుండా జేబులో చెయ్యిపెట్టుకుని, కళ్లద్దాలు నెత్తిన పెట్టుకుని సభా సంప్రదాయాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బాలకృష్ణ సైకోనా.. పద్ధతిగా ఉండే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైకోనా అనేది ప్రజలందరికి తెలుసునని మాజీ శాసన సభాపతి, శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలో శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గతంలో బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరిపిన బాలకృష్ణను కాపాడింది ఆనాటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనే హక్కు వారికి లేదన్నారు. సినీ పరిశ్రమ, సినిమా హీరోలకు జగన్మోహన్రెడ్డి అంటే చాలా అభిమానం ఉందన్నారు. కరోనా సమయంలో చిరంజీవి, సినిమా హీరోలంతా కలుస్తామని అడిగితే అన్ని రకాల మర్యాదలతో కలిసి సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించింది జగన్ అని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి సైకో అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ పూర్తిగా మెంటలైపోయాడేమేనని అనిపిస్తుందన్నారు. కరోనా నిబంధనల మేరకే ఐదుగురికి అవకాశం ఇస్తే చాలదు అంటే 10 మందికి అవకాశం కల్పించి విందు ఇచ్చి మరి మర్యాద చేశారని చెప్పారు. బాలకృష్ణ ఏ రకమైన సైకోనో నాకు బాగా తెలుసునని, టీడీపీలో చాలాకాలం ప్రయాణం చేశానన్నారు. బాలకృష్ణకు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవడ్రా.. అని నోటికొచ్చినట్లు పిచ్చోడిలా మాట్లాడతాడని అన్నారు. వైఎస్సార్ దయాదాక్షణ్యాలతో బతుకుతున్నావన్న విష యం మరిచిపోకూడదన్నారు. పవన్, చిరంజీవి ఫ్యామిలీలతో బాలకృష్ణకు ఏమైనా పొరపొచ్చాలుంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప జగన్పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. బాలకృష్ణ తీరు మార్చుకోకుంటే వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
రవాణా సదుపాయాలతో అభివృద్ధి
ఆమదాలవలస: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత ముఖ్యమ ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన బెర్హంపూర్ – సూరత్ (ఉద్నా) అమృత్ భారత్ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్ భారత్ రైలు దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్నారు. శ్రీకాకుళం, పలాసలో రెండు హాల్ట్లు ఇచ్చినట్లు తెలిపారు. విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలి త్ బొహ్రా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షుడు శివ్వల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్దానం ప్రజలకు వరం పలాస: బరంపురం నుంచి సూరత్ వెళ్లే అమృత్ భారత్ రైలు ఉద్దానం ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ఖుర్ధా ఏఆర్డీఎం ప్రమోదకుమార్ బెహరా అన్నారు. పలాస రైల్వేస్టేషన్లో రైలు స్వాగత కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సూరత్, కాండ్ల, గుజరాత్, రాయపూర్, బిలాయ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, వారికి ఈ రైలు చాలా ఉపయోగమన్నారు. కార్యక్రమంలో డీసీఎం సుక్రాంబరో, పలాస రైల్వే మేనేజర్ ఎస్కే దాసు, పలాస – కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
1, 2 తేదీల్లో కిరణ దర్శనం
అరసవల్లి: అరుదైన అద్భుత దృశ్యానికి వేళ య్యింది. అక్టోబర్ 1, 2 తేదీల్లో అరసవల్లిలో ఆదిత్యుని మూలవిరాట్టుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అరుదైన అద్భుత దర్శనం కన్పించనుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయ న కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి పాదాలను నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి. రానున్న బుధ, గురువారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు ఇప్పటికే చర్చించారు. దసరా సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఇబ్బంది లేకుండా, సూర్యకిరణాలకు అడ్డం రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా శంకరశర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిరణ దర్శనం ఉంటుందన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ లీగల్సెల్ ఆధ్వర్యంలో నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరణకు సిద్ధం కావడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరంగి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీపతి, యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు ఆధ్వర్యంలో లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేపట్టగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని, దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య విద్య అందని అందని ద్రాక్షలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో లీగల్సెల్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సీనియర్ న్యాయవాది తంగి శివప్రసాదరావు, న్యాయవాదులు పొన్నాడ రుషి, కూన అన్నంనాయుడు, గణపతినాయుడు, విజయ్కుమార్, నీలాద్రి, సుధాబాల, అప్పారావు పట్నాయుకుని, ఉషా తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారస్తులు ముందుకు రావాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ధరలు తగ్గించేందుకు వ్యాపారస్తులు వాలంటీర్గా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జీఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారస్తులతో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మెడికల్, ఆటోమొబైల్స్, వ్యవసాయానికి సంబంధించి యంత్రాలు, ఎరువులు, ప్యాకింగ్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్పై తగ్గింపులు వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల వద్ద డబ్బులు ఉంటే మరింతగా వ్యాపారాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు షాపుల వద్ద పాత ధరలు, కొత్త ధరల బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉన్న అనుమానాలను జీఎస్టీ నోడల్ అధికారి నివృత్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ జీఎస్టీ అధికారి చంద్రకళ, కాశీబుగ్గ, నరసన్నపేట, ఆమదాలవలస అసిస్టెంట్ జీఎస్టీ అధికారులు, బంగారం వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్, హోటల్స్, కిరాణా, ఆటోమొబైల్స్, సిమెంటు తదితరులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలపై ఆ శాఖ ఉద్యోగులు, కార్మికులు నిరసనలకు దిగనున్నారు. ఇదివరకే పలు రకాలుగా శాంతియుత నిరసనలు, ధర్నాలు చేపట్టిన విద్యుత్శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సంయుక్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 నుంచి నిరసన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 14 నుంచి అన్ని విద్యుత్ సర్కిల్ కేంద్రాల వద్ద ఉద్యోగ, కార్మి కులంతా విధులను నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వినియోగదారులకు కలగనున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం, డిస్కం యాజమాన్యాలే బాధ్యత వహిస్తాయని జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ●అక్టోబరు 6న విశాఖపట్టణం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా ●8న ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాల యం వద్ద ధర్నా ●13న ఛలో విజయవాడ కార్యక్రమం ●14 నుంచి నిరవధిక సమ్మె ●అనంతరం ప్రభుత్వ నిర్ణయాలపై జేఏసీ ప్రతినిధులు స్పందన మేరకు చర్యలు -
రెండోసారి.. నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 100 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 16 ప్రభుత్వ, 84 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. ఇందులో 8వేల సీట్లు కూడా భర్తీకావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. డిగ్రీ ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఐటీఐవైపు విద్యార్థులు చూస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విద్యాసంస్థల మేనేజ్మెంట్ల ప్రతినిధులు చెబుతున్నారు. డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాల కోసం వివిధ కారణాలతో అడ్మిషన్లు పొందలేని విద్యా ర్థుల కోసం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – డాక్టర్ కణితి శ్రీరాములు, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఐడీ కళాశాల) ప్రిన్సిపాల్ శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొద్దునిద్ర వీడింది. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల కోసం సకాలంలో దర ఖాస్తులు చేసుకోలేని విద్యార్థుల కోసం రెండో విడ త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మొద టి ఫేజ్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో క్లాసులు మొదలుకాలేదు. ఇంటర్మీడియె ట్ ఫలితాలు వెలువడి నాలుగైదు నెలలు గడిచినా నోటిఫికేషన్ విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. ●2025–26 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ అడ్మిషన్ల కోసం రెండో విడత ప్రవేశాలకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీలు రూ.200 నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ●ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ●27 నుండి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ●ఈనెల 29 నుంచి అక్టోబర్ ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు ●అక్టోబర్ 6న కాలేజీల్లో సీట్ల కేటాయింపు ●7 నుంచి క్లాసులు ప్రారంభం కాలేజీలు మూసివేతతో ఆందోళన.. కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు సమ్మెబాటపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి ప్రైవేటు కాలేజీల్లో క్లాసులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీలను మూసివేశారు. జిల్లాలో ఒక్క డిగ్రీ విద్యకు సంబంధించే జిల్లాలో 80 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు ఏపీ ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తుండటంతో దిగులు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిగ్రీ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మె సైరన్
అరసవల్లి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. ముందస్తు నోటీసులను ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వ విధులను నిలిపివేసేలా సన్నద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో పీహెచ్సీ వైద్యుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలతోనే విధులు నిర్వర్తిస్తూనే అధికారిక ఆన్లైన్ విధులు, రోజువారీగా పంపించాల్సిన ఆన్లైన్ నివేదికలను కూడా నిలిపివేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిరసనల షెడ్యూల్ ప్రకారం నిర్వర్తించేలా చర్యలకు దిగారు. ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టరేట్కు కూడా సమ్మె నోటీసులను శుక్రవారం అందజేశారు. ఈ నెల 29 నుంచి ఓపీ సేవలను కూడా నిలిపివేసేలా నిర్ణయాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పేద, సామాన్య వర్గాలకు ప్రభుత్వ వైద్యం దూరం కానుంది. నిరసనల షెడ్యూల్ ఇలా.... ●నేడు సంచార చికిత్సలు వంటి క్యాంపు విధుల బహిష్కరణ ●28న ప్రభుత్వ అధికారిక వాట్సాప్ల నుంచి నిష్క్రమణ ●29 నుంచి ఓపీ(అవుట్ పేషంట్) సేవలు నిలుపుదల. ఎమర్జెన్సీ సర్వీసులైన డెలివరీలు, పాముకాటు, విషం తీసుకునే తదితర కేసులకు మాత్రమే అనుమతి. ●30న జిల్లా కేంద్రంలో నిరసన ●అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, వినూత్న నిరసన ●3న విజయవాడలో నిరాహార దీక్షలు ప్రారంభం -
అధికారుల తనిఖీలు..
నరసన్నపేట : జిల్లాలో వ్యాపార కేంద్రమైన నరసన్నపేటలో కేంద్ర జీఎస్టీ అధికారులు శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పడి హోల్సేల్ బంగారం షాపుల్లో మమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీసీ వర్మ ఆధ్వర్యంలో విశాఖ నుంచి వచ్చిన అధికారులు తమ్మయ్యపేటలో ఉప్పు గిరి నివాసం, ఆదివరపుపేట కూడలిలో మన్మధరావు హోల్సేల్ షాపులో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. మూడేళ్లుగా జరిగిన వ్యాపారం, కట్టిన టాక్స్లపై ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని రికార్డులు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. పన్ను ఎగవేత బంగారం పెద్ద మొత్తంలో గుర్తించినట్లు తెలుస్తోంది. కోయంబత్తూరులో హోల్సేల్ వ్యాపారి ఒకరు సెంట్రల్ జీఎస్టీ అధికారులకు పట్టుబడ్డారని, ఈయన ఇచ్చిన సమాచారం మేరకు నరసన్నపేటలో రెండు హోల్సేల్ షాపుల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. షాపులు మూసేసిన వ్యాపారులు.. జీరో బంగారం వ్యాపారం చేస్తూ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మోసం చేస్తున్న నరసన్నపేటలోని పలువురు బంగారం వ్యాపారులు తమ గుట్టురట్టు అవుతుందనే భయంతో వెంటనే షాపులను మూసేశారు. షట్టర్లు దించి ఇళ్లకు వెళ్లిపోయారు. బంగారం వ్యాపారుల చర్యల పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. జీఎస్టీ అధికారులు వస్తే షాపులు మూసేసి వెళ్తున్నారంటే వీరు చేస్తున్న వ్యాపారం అంతా మోసమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై 17న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బంగారు ఆభరణాలపై వేసిన నకిలీ హాల్మార్క్ వ్యవహరం వెలుగుచూసిన విషయం తెలిసిందే. -
పోక్సో కేసు నమోదు
కవిటి: మండలంలోని ఆర్.బెలగాం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న అభియోగంపై శావసానపుట్టుగకు చెందిన విశ్వనాథంపై పోక్సో కేసు గురువారం నమోదు చేసినట్లు కవిటి ఎస్ఐ వి.రవివర్మ శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస రూరల్: మండలంలోని తొగరాం గ్రామం వద్ద ఇసుక లారీ వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాతూరు ఇసుక ర్యాంపు నుంచి అధిక బరువుతో వచ్చిన లారీ రహదారికి అడ్డంగా ఆగిపోయింది. దీంతో ఇరువైపుల నుంచి వచ్చిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటలపాటు బస్సులు, ఆటోలతో పాటు అనేక భారీ వాహనాలు నిలిచిపోవడంతో అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ప్రాంతీయ పర్యావరణాధికారి(ఆర్ఐఓ)గా రేగ సురేష్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ /సెక్రెటరీ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య డీవీఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్ఐఓగా పనిచేసిన ప్రగడ దుర్గారావు ఈ నెలతో ఉద్యోగ విరమణ చేయనుండటంతో డీవీఈవో సురేష్కుమార్కు బాధ్యతలు అప్పగించారు. -
మనస్థాపంతో ఆత్మహత్య
బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన బొమ్మాళి శిరీష (22) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరీషకు తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తుండగా ఆమె తిరస్కరిస్తూ ఉండేది. వివాహం చేసుకోనని.. తన చిన్నాన్న దగ్గర చదువుకుంటానని చెప్పేది. ఈ క్రమంలో బుధవారం భోజనాల తర్వాత పక్క ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా, ఆమె తల్లి తనకు సాయం చేయకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్లావని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్నటువంటి గడ్డిమందు తాగేసింది. తల్లి గన్నెమ్మ చూసి వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి తండ్రి రాజు, తల్లి గన్నెమ్మ, అక్క దివ్య, డిగ్రీ చదువుతున్న తమ్ముడు మని ఉన్నారు. తల్లి గన్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.ప్రవళ్లిక తెలియజేశారు. -
పుస్తెల తాళ్లు చోరీ
పాతపట్నం: మండలంలోని పాశీగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో ఇంట్లోని నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు మెడల్లో నాలుగు తులాల బంగారం పుస్తెల తాళ్లు చోరీకి గురయ్యాయని ఎస్ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట గ్రామానికి చెందిన గంగు రాము, అతని భార్య గంగు లక్ష్మి అలియాస్ మీరమ్మలు గురువారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దొంగ చొరబడి లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారం పుస్తెల తాడును చోరీ చేశాడు. అలాగే చంద్రపే ట గ్రామానికి చెందిన మొర్రి వెంకటరమణ, అతని భార్య మొర్రి పద్మవతిలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనూ మెడలోని రెండు తులాల బంగారం పుస్తలతాడు చోరి జరిగినట్లు తెలిపారు. రెండు చోరీలపై కేసు నమోదు చేశారు. బంగారం దుకాణంలో చోరి రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీవిజయదుర్గా బంగారు నగల దుకాణంలో శుక్రవారం మధ్యా హ్నం చోరీ జరిగింది. బంగారు వస్తువులతో పాటు గా వెండి వస్తువులను అపహరించారు. బాధిత దుకాణదారుడు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి కృష్ణ బుడుమూరులో బంగారం దుకాణం నడుపుతున్నాడు. షాపునకు శుక్రవారం మధ్యా హ్నం గుర్తు తెలియని ముగ్గురు మహిళలు నగలు కొనుగోలుకు చేసేందుకు వచ్చారు. యజమానిని మాటల్లో పెట్టి బేరమాడారు. అనంతరం కొనుగో లు చేయకుండానే వెనుదిరిగారు. వారు షాపు విడి చి వెళ్లగా సీసీ పుటేజీ పరిశీలించిన యాజమాని కృష్ణ చోరీ జరిగిందని గుర్తించారు. సుమారు 3 గ్రాముల బంగారం ముక్కు పుడకలు నాలుగు, 480 గ్రాముల 6 జతల వెండి పట్టీలు చోరికి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. -
హోటల్లో అగ్ని ప్రమాదం
పాతపట్నం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న అబీబీ డ్రైవ్ ఇన్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోట ల్ మొదటి ఫ్లోర్ మొత్తం పూర్తిగా మంటల్లో కాలి బూడిదయింది. ప్రమాదం సంభవించిన సమయంలో హో టల్లో పలువురు భోజనం చేయడంతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందని హోటల్ యాజమాని రెడ్డి తెలి పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం రూ.2 లక్షల వరకు ఉంటుందంటున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకుని, ప్రమాదం వివరాలు నమోదుచేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి గ్రామానికి చెందిన వాన వైకుంఠరావు(65) గురువారం సాయంత్రం సరియాపల్లి గ్రామ సమీపంలో ఉన్న తన పొలం పనికి వెళ్లి తిరిగి నడిచి వస్తుండగా, అదే మార్గంలో కప్పల రమణ అనేవ్యక్తి వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వెంకుటరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్పష్టత ఏదీ..?
శ్రీకాకుళం: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర అధికారుల విధులు ఏమిటనే దానిపై స్పష్టత ఇవ్వాలని రిమ్స్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు డీఎంఈకి నివేదించారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ఆరు నెలల క్రితం వరకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. కళాశాల, ఆస్పత్రుల్లో సమస్యలన్నింటినీ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం అడ్మినిస్ట్రేటర్ అంటూ ఒక పోస్టును క్రి యేట్ చేసి డీడీ స్థాయి అధికారిని నియమించింది. దీంతో అప్పటినుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కేజీహెచ్ నుంచి రాష్ట్రస్థాయికి ఇటువంటి వ్యవహారం ఇప్పటికే విశాఖపట్నంలోని కేజీహెచ్ నుంచి రాష్ట్రస్థాయికి చేరగా, తాజాగా శ్రీకాకుళం వ్యవహారం కూడా చేరింది. శ్రీకాకుళంలో అడ్మినిస్ట్రేటర్, వైద్యుల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ జరుగుతోంది. దీనిపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో లోలోనే మదన పడుతూ వచ్చారు. తాజాగా ఐదు రోజుల క్రితం కలెక్టర్ రిమ్స్లో జరిగిన మొక్కల నాటే కార్యక్రమానికి వచ్చి, హాస్టల్, వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్ వ్యవస్థను నెలకొల్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి విధి విధానాలను ప్రకటించింది. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఆవరణను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడడం వంటి బాధ్యతలను అప్పగించింది. అయితే శ్రీకాకుళం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తన విధులను వదిలి వైద్యుల విధుల్లో అడ్మినిస్ట్రేటర్ తల దూర్చడం వలన వైద్యులు, అడ్మినిస్ట్రేటర్ మధ్య వివాదం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ వైద్యురాలి సేవలను ఓ గదికి పరిమితం చేసి, కంప్యూటర్ ఆపరేటర్ తరహాలో పనిచేయిస్తుండడాన్ని ప్రశ్నించిన వైద్యులను, దీనిపై ప్రచురితమైన వార్త కథనాలను ఉద్దేశించి ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్ అనడాన్ని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరి విధులు ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. తక్షణమే విధులను తెలియజేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని వైద్యులు రెండు రోజుల క్రితం డీఎంఈకి నివేదించి అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నారు. రిమ్స్లో పనిచేస్తున్న ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత నెల 30వ తేదీన ఈఈగా పనిచేసిన సత్య ప్రభాకర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విశాఖపట్నంలో క్వాలిటీ కంట్రోల్ డీఈ గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ను ఇన్చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ఆయన వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే శ్రీకాకుళం వస్తూ ఉండడం, తరచూ సెలవులు పెడుతూ ఉండడంతో ఇంజినీరింగ్ అధికారుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఇటీవల కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు, నీటిని తరచూ పరీక్ష చేయించడం లేదని వృథాగా వదిలేస్తున్నారని.. మరలా ఇదే గమనిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డీఈని హెచ్చరించడంతో వివాదం ముదిరిపోయింది. ఆరోజు ఈఈ ఉన్నప్పటికీ కలెక్టర్కు ఎదురుపడకుండా ఉండటం వల్ల డీఈపై కలెక్టర్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలా బాధ్యత కలిగిన అధికారులు తప్పించుకుంటూ బాధ్యత లేని అధికారులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆవేదన అటు వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులతో పాటు మరికొందరు ఉద్యోగుల్లో ఉంది. ఇప్పటికై నా రాష్ట్ర అధికారులు స్పష్టత ఇవ్వకుంటే కేజీహెచ్ స్థాయిలోనే వివాదం ముదిరే ప్రమాదం ఉంది. -
వేట సాగక.. పూట గడవక..!
సముద్రంలో వేట సాగించేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితు ల్లో వేటకు విరామం తప్ప డం లేదు. వేట నిషేధ భృతి మాదిరిగానే వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక భృతిని ప్రకటించాలి. జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మత్స్యకార భరోసా రెండేళ్లకు ఒక ఏడాది మాత్రమే అందించారు. మరో ఏడాది భరోసా అందించి ఆదుకోవాలి. – కోనాడ నర్సింగరావు, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు గార: కడలి తల్లి కరుణిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి మత్స్యకారులది. వేట సాగితేనే కుటుంబాల పూట గడుస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు మత్స్యకారుల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారుతుండడంతో వేట సాగడం లేదు. వేట నిషేధం అనంతరం వరుసగా నాలుగు నెలల్లో ఏకంగా 27 రోజుల పాటు తుఫాన్లు, వాయుగుండాల ప్రభావం వలన వేటకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్ సంభవిస్తున్నా వాతావరణ హెచ్చరికలు ఆధారంగా అప్రమత్తత పేరుతో వేట నిలిపేయాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. కానీ ఒక్కోసారి వాతావరణ హెచ్చరికలకు విరుద్ధంగా సముద్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అందువలన ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో భృతి ఇస్తున్నట్టే.. తుఫాన్, వాయుగుండాల సమయంలో వేటకు వెళ్లకుండా అర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలోని 11 మండలాల్లో మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు. మొత్తం 1,526 మెకనైజ్డ్ బోట్లు, 2,606 నాన్ మెకనైజ్డ్ బోట్లుపై వేట సాగిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతి అర్హులైన మత్స్యకారులందరికీ అందిస్తే.. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి మత్స్యకారులను తగ్గించిందన్న విమర్శలున్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భృతి ఒక సంవత్సరం ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని రోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగ డం లేదు. తరుచూ తుఫాన్ లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ సమయంలో రోజుల తరబ డి వేట సాగకపోతుండడంతో జీవనం కష్టతరంగా ఉంటోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా వాయుగుండాలు, తుఫాన్లు వస్తుండడంతో బోట్లు, వలలు భద్రపర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. – పుక్కళ్ల తవిటయ్య, మత్స్యకారుడు, బందరువానిపేట -
ప్రజలకు అవగాహన కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అధికారులు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన సేవింగ్స్ గురించి వివరించాలని పేర్కొన్నారు. పోస్టర్లు తయారు చేసి సచివాలయాలు, గ్రామ, మండలాల వారీగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నోడల్ ఆఫీసర్ స్వప్న దేవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈనెల 22వ తేదీన ప్రారంభమైందన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, డీపీవో భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
కింజరాపు కుటుంబం దోచుకుంటోంది
● అక్రమాలపై అధికారులు దృష్టి సారించడం లేదు ● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త తిలక్ టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింజరాపు కుటుంబం జిల్లాలో మైనింగ్ ఆదాయంతో పాటు ఇతర ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ దోచుకుంటోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. విజిలెన్స్ ఎస్పీ నిరంకుశ వైఖరితో కింజరాపు కుటుంబం చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించకుండా, వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన క్వారీలు, క్రషర్లపై కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దోపిడీపై ఆధారాలతో సహా చెబుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్టోబర్ 6న ముట్టడి కింజరాపు కుటుంబం చేస్తున్న మైనింగ్ అక్రమాల తో పాటు మైన్స్ అధికారుల కక్ష సాధింపు చర్యలపై తిరుగుబాటు చేస్తున్నట్లు తిలక్ తెలియజేశారు. ఈ మేరకు అక్టోబర్ 6వ తేదీన టెక్కలిలో మైన్స్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. కూట మి కక్ష సాధింపుతో నష్టానికి గురైన మైనింగ్ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీలు, కార్మికులు తరలి రావాలని కోరారు. సొంత నియోజకవర్గంలో రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్ధత మంత్రి అచ్చెన్నాయుడు అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యం కనిపించిందన్నారు. అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించకుండా మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెప్పు కోసం ఆరాటపడ్డారని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ సైతం టీడీపీ నాయకుల సేవలో నిమగ్నం కావడం సిగ్గుచేటన్నారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చులపై దేవదాయ శాఖ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెలీకాఫ్టర్ రైడ్ పేరుతో భక్తుల నుంచి దోపిడీ చేసి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సొంత ప్రచారాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇటీవల నందిగాం మండలంలో ఒక ఫైనాన్స్ సంస్థ దళిత కుటుంబాన్ని వేధిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సినీ నటుడు బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, టెక్కలి వైస్ ఎంపీపీ పి.రమేష్, నాయకులు కె.అజయ్, ఎ.రాహుల్, చిన్ని జోగారావు, బి.రాజేష్, దానయ్య, కర్నిక జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రుణాల కోసం ఆందోళన
హిరమండలం : వ్యవసాయ రుణాలు అందించాలని హిరమండలం మండలంలోని 50 గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ మేర కు శుక్రవారం సవర చొర్లంగిలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో డీపట్టా భూములకు బ్యాంకులు ద్వారా రుణాలు అందేవని, భూముల రీ సర్వే తర్వాత 1బీ అడంగల్ రాకపోవడంతో రుణాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1బీ ఉంటేనే రుణాలు ఇస్తాం.. రెన్యూవల్ చేస్తామ ని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వ్యవసాయ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారెక్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. పలువురి నుంచి బెయిల్ పిటీషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయు డు, సిబ్బంది పాల్గొన్నారు. పలాస: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోరీస్ అనే వ్యక్తిని గంజాయితో శుక్రవారం అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలియజేశారు. పలాస రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫామ్లో తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించాడన్నారు. అతని బ్యాగ్లో తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో రాయగడలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తూకం వేయగా 14 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీకాకళం కల్చరల్: స్థానిక రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై ఒక్కరోజు శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడు తూ ప్రథమ చికిత్స శిక్షణతో ఎంతో ప్రయో జ నం ఉందన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ కె.అని త మాట్లాడుతూ ప్రథమ చికిత్స శిక్షణ ప్రతి ఒక్కరికీ ఈ రోజుల్లో అవసరమని, ప్రాణనష్టం తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులకు ధృవపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్క్రా స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకోరూ.. !
● డిప్యూటీ సీఎం సారూ.. ● విద్యార్థి కుటుంబసభ్యుల విజ్ఞప్తి వజ్రపుకొత్తూరు రూరల్: అధికారం కోసం కూటమి నాయకులు ఎన్నికల సమయంలో విద్యార్థుల చావులతోనూ రాజకీయం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వేదికల మీద ఊదరగొట్టే ప్రసంగాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేశారు. శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవుకు చెందిన మువ్వల నగేష్ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ 2021 జనవరి 26న అనూమానాస్పదంగా మృతి చెందాడు. తమ కుమారుడిని కాలేజీలోనే ఎవరో చంపి మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేశారని, పోస్టుమార్టం చేసినా రిపోర్టు ఇవ్వలేదని, కేసును సైతం తారుమారు చేశారని కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎన్నికల సమయంలో రణస్థలం వద్ద నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలాసలో జరిగిన యువగళం కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ కూడా మనం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే దోషులను శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విలేకర్ల ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను మూడుసార్లు కలిశామని, తాను ఈ విషయంలో ఏమీ చేయలేనంటూ ఎంపీ రామ్మోహన్నాయుడిని గానీ మంత్రి అచ్చెన్నాయుడిని గానీ కలవండి అంటూ తప్పించుకున్నారని వాపోయారు. ఇప్పటికైనా నిందితులను శిక్షించి న్యాయం చేయాలని కోరారు. -
తగ్గేదేలే!
మడపాం దగ్గర నదిలో తవ్వకాలు వానొచ్చినా.. వరదొచ్చినా సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుకాసురాలు వెనక్కి తగ్గడం లేదు. వానలు పడుతున్నా, వరద వచ్చినా లెక్క చేయడం లేదు. కోట్ల రూపాయలు రుచిమరి గిన అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తునే ఉన్నారు. ప్రభుత్వమే తమకు లైసెన్సు ఇచ్చినట్టుగా ఇసుక దందా సాగిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వర్షాలు పడుతున్నా, నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా కూడా అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. ప్రధానంగా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం నడుస్తోంది. అక్కడి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, అనుచరులు దగ్గరుండి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అనుచరులతో పాటు బాబాయ్ అబ్బాయ్ అనుచరులు అక్రమ ఇసుక దందాతో లబ్ధి పొందుతున్నారు. పట్టపగలు, బహిరంగంగా ఇసుక పేరుతో లూఠీ చేసేస్తున్నారు. అనధికార రీచ్ల్లోనే కాదు అధికారిక రీచ్ల్లో కూడా చొరబడి ఇసుక మింగేస్తున్నారు. వంశధార, నాగావళి నదులు అక్రమ సంపాదనకు ఆనవాళ్లుగా మారుతుండడం విశేషం. అక్రమాల జాడలివిగో.. ● శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భైరి, కరజాడ, కళ్లేపల్లి, కిల్లిపాలెం, లొద్దలపేట, సింగూరు, నైరాతో పాటు పొన్నాం నుంచి రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తెల్లవారయ్యేసరికి తమ పని కానిచ్చేస్తున్నారు. ప్రజలు నిద్రలేచే లోపు దందా ముగించేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.35వేలకు పైగా వసూలు చేసి అప్పనంగా సంపాదిస్తున్నారు. ● ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రెండు నదుల్లోనూ ఇసుక దందా కొనసాగుతోంది. ముద్దాడపేట, పురుషోత్తపురం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, తొగరాం, బెలమం, పొందూరు మండలం సింగూరు, బొడ్డేపల్లి, నెల్లిమెట్టలో సైతం ఇదే రకంగా ఇసుక దోపిడీ జరుగుతోంది. బూర్జ మండలం కాఖండ్యాం, నారాయణపురం, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, పాతపాడులో అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. ● నరసన్నపేటనియోజకవర్గ పరిధిలోని మడపాం, లుకలాం, బుచ్చిపేట, చెవ్వాకులపేట, పర్లాంలో భారీగా ఇసుక తరలిపోతోంది. అధికార పార్టీ నాయకులు దర్జాగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పొన్నాడ, తోటపాలెంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ● పాతపట్నం నియోజకవర్గంలో వసప, బలద, ఆకులతంపర, హిరమండలంలో కోరాడ, భగీరథిపురం, రెల్లివలస, అక్కరాపల్లి, పిండ్రువాడలో ఇసుక దందా కొనసాగుతోంది. నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నా తగ్గని ఇసుకాసురులు ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నంలో యథేచ్ఛగా దందా లారీలు పట్టుకుంటే వదిలేయాలని ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు చూసీచూడనట్టుగా అధికార యంత్రాంగం -
మాజీ సీఎంను దూషించడం సరికాదు
నరసన్నపేట : ప్రజా సేవకుడిగా..ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ మోహనరెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా సంస్కార హీనంగా మాట్లాడటాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం తీవ్రంగా ఖండించారు. సినీ నటుడిగా తాను నటించిన సినిమాల్లో హిత బోధలు చేస్తూ గొప్పలు చెప్పుకొనే వ్యక్తి నిజ జీవితంలో అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఉద్దేశించి సైకో అని మాట్లాడాన్ని తప్పుపట్టారు. సినీ నటులను తాడేపల్లికి పిలిచి వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ సినీ పరిశ్రమకు అండగానే ఉన్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు జాబ్మేళా రేపు శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా కేంద్రంలో బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ/డీఎల్టీసీ వద్ద ఈ నెల 27న మహిళలకు జాబ్మేళా జరగనుందని అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు గురువారం తెలిపారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్లో టీఏఎస్ఎల్ ఏరోస్ట్రక్చర్స్, ఏరో ఇంజినీర్స్ సంస్థ పేరిట ఫీమేల్ ట్రెయినీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ధ్రువపత్రాలతో శనివారం ఉదయం 9 గంటలకు డీఎల్టీసీ ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు. మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ ఇచ్ఛాపురం రూరల్ : గత వైఎస్సార్సీపీ హయాంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకురాలు పిట్ట శేషమ్మపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 13న చెక్ పవర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోర్టు ద్వారా పోరాటం చేసిన నేపథ్యంలో గురువారం చెక్ పవర్ను పునరుద్ధరిస్తూ జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య ఉత్తర్వుల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ న్యాయం గెలిచిందని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన తనను మానసికంగా వేధించారని, అయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేసి విజయం సాధించానని చెప్పారు. -
మురిసిన భక్తజనం
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం ముగిసిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు ● ముర్రాటలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోటబొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి -
బాలింత మృతిపై ఆందోళన
● రిమ్స్ వైద్య సిబ్బందిపై కుటుంబ సభ్యుల ఆరోపణ ● అలికాం – బత్తిలి రహదారిపై నిరసన హిరమండలం: రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఎల్ఎన్పేట మండలంలోని స్కాట్పేట గ్రామస్తులు అలికాం – బత్తిలి ప్రధా న రహదారిపై మృతదేహంతో గురువారం నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట గ్రామానికి చెందిన తొగరాపు లోచన (21)కు నెలలు నిండడంతో ప్రసవం కోసం భర్త ఉదయ్కుమార్ ఈనెల 22వ తేదీన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సుఖ ప్రసవం కోసం వేచి చూద్దామంటూ చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజు మంగళవారం పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో అక్కడున్న వైద్యులు ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు. లోచన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బుధవారం నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. కేజీహెచ్కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని నేరుగా స్వగ్రామం స్కాట్పేటకు బుధవారం రాత్రి తీసుకొచ్చారు. అయితే రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతోనే లోచన చనిపోయిందంటూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ అలికాం–బత్తిలి రహదారిపై గురువారం మృతదేహంతో ఆందోళనకు దిగారు. సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పారు. పోస్టుమార్టంకు పంపితే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా మృతురాలి లోచనకు రెండేళ్ల కుమారుడు, భర్త ఉదయ్కుమార్ ఉన్నారు. పసికందును చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కేసు విచారణ వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సోంపేట మండలంలోని బీల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమం 2010 జూలై 14వ తేదీన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో ముగ్గురు ఉద్యమకారులు దుర్మరణం పాలవ్వగా.. వంద లాది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 725 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు బనాయించారు. అయితే ఈ కేసు విచారణ ఆలస్యమవుతుండడంతో కేసులో ప్రథమ ముద్దాయి, ఉద్యమ రూపకర్త బీన ఢిల్లీరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది చౌదరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరో 21 మంది ముద్దాయిలతో కలిసి మరో న్యాయవాది కరుకోల సింహాచ లంతో రిట్ పిటిషన్ దాఖలు చేశా రు. అనంతరం విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసు విచారణను అత్యంత వేగంగా జరపాలని సోంపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉద్యమ రూపకర్త బీన ఢిల్లీరావు, హైకోర్టు న్యా యవాది చౌదరి లక్ష్మణరావులు మరికొందరు నిందితులతో కలిసి గురువారం శ్రీకాకుళంలో విలేకరు ల సమావేశంలో వివరించారు. -
అక్రమ ఇసుక ర్యాంపులపైఆకస్మిక దాడులు
పొందూరు: పొందూరు మండలంలో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు, ఇసుక డంపింగ్లపై బుధవారం అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దా డులు చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు బొడ్డేపల్లిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు, సింగూరు కూడలి నుంచి బొడ్డేపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. ఈ సమయంలో ఇసుక లోడుతో ఉన్న మూడు భారీ టిప్ప ర్లు, 4 జేసీబీలు, ఒక ట్రాలీ, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. బొడ్డేపల్లి ర్యాంపులోనూ ఇసుక నిల్వల వద్ద టిప్పర్లు, లారీల్లోకి ఇసుకను డంప్ చేస్తున్న సమయంలో జేసీబీలను స్వాధీనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా ర్యాంపు నిర్వాహకుల గురించి వాహ న డ్రైవర్లను ప్రశ్నించారు. అయితే తాము కేవలం ఇసుకను మాత్రమే తీసుకెళ్తామని, లావాదేవీలన్నీ తమ వాహన ఓనర్లే చూసుకుంటున్నారని డ్రైవర్లు తెలిపారు. ఇసుక ర్యాంపుల వద్ద, ఇసుక డంపింగ్ కేంద్రాల వద్ద ఉన్న రికార్డులను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, మైనింగ్ డీడీ మోహనరావు, ఏడీ విజయలక్ష్మి, తహసీల్దార్ వెంకటేష్ రామానుజుల, ఎస్ఐ బాలరాజు పాల్గొన్నారు. ర్యాంపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్టేషన్కు తరలించారు. -
క్రెడాయ్ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): స్థానిక ఒక ప్రైవేటు హోటల్లో శ్రీకాకుళం క్రెడాయ్–2025 నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. వైజాగ్ చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్, స్టేట్ ప్రెసిడెంట్ బోయిన శ్రీనివాసరావు, స్టేట్ చైర్మన్ ముని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం చాప్టర్ ప్రెసిడెంట్గా పొట్నూరు రమేష్ చక్రవర్తి, సెక్రటరీగా ఆదీప్ రెడ్డి, చైర్మన్గా బెండి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా దుంగ సుధాకర్, కో రాడ సత్యారావు, గంజి భీమారావు, డోల వంశీ బాలకృష్ణ, ట్రెజరర్గా పృథ్వీరాజ్, ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ముని శ్రీనివాసరావు, యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పూజారి బాలచందర్, సెక్రటరీగా ఎన్ని జగదీష్, వైస్ ప్రెసిడెంట్గా లీలామోహన్ కృష్ణ, జాయింట్ సెక్రటరీగా వేదుల సంతోష్కుమార్ తదితరుల ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎల్జీపీ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
భార్య మోసం చేసిందని..
● కుమార్తెతో కలిసి గడ్డిమందు తాగిన తండ్రి ● చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి ● సంచాం గ్రామంలో విషాదం రణస్థలం : భార్య మోసం చేసిందనే ఆవేదన తో కుమార్తెకు గడ్డిమందు తాగించి తాను కూ డా అదే గడ్డిమందు తాగిన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రణస్థ లం మండలం మండలం సంచాం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, జే.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్(35) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనూకు ఇద్దరు కుమారులు, రెండో భార్య స్వాతికి ఒక కుమార్తె ఉన్నారు. సంతోష్ కారు డ్రైవింగ్ చేస్తూ రెండు ఇళ్లు తీసుకుని ఇద్దరు భార్యలతో పాటు విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నాడు. కుమార్తె హైమవతి శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. దసరా సెలవులు కావడంతో హైమవతిని ఈ నెల 20న తీసుకురమ్మని రెండో భార్య స్వాతిని సంతోష్ పంపించాడు. ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు.. స్వాతి విశాఖపట్నం నుంచి వస్తూ అప్పటికే సంచాంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో అతని వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. స్వాతి అదే రోజు రాత్రి కుమార్తెతో కలిసి విశాఖలోని ఇంటికి వెళ్లినప్పటికే ఇన్స్టాలో ఫొటోలు చూసిన సంతోష్ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ నెల 21న కుమార్తె హైమవతితో పాటు రెండో భార్య స్వాతితో కలిసి స్వాతి కన్నవారైన జీరుపాలెం గ్రామానికి వెళ్లి, అక్కడ పెద్దల సమక్షంలో అప్పగించి తిరిగి విశాఖపట్నం వెళ్లిపోయాడు. మరలా ఈ నెల 24న జీరుపాలెం వెళ్లి కుమార్తెను వెంటబెట్టుకుని తన స్వగ్రామం సంచాం వచ్చాడు. సంచాం కొండ సమీపంలోని తోటలో హైమవతికి గడ్డిమందు తాగించి, తానూ తాగి మేము చనిపోతున్నామని వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. చావుబతుకుల మధ్య ఉన్న ఇద్దరినీ కుటుంబ సభ్యులు తొలుత రణస్థలం సీహెచ్సీ తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరూ మృతి చెందారు. మృతుడి తండ్రి దుప్పాడ సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. -
దసరా ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: దసరా సందర్భంగా ఏపీఎస్ఆర్ ఆర్టీసీ సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపనుంది. జిల్లాలోని శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల నుంచి 480 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకూ ఈ సర్వీసులు నడపనున్నారు. అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. దసరా పండగ సందర్భంగా ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ స్కూళ్లకు, ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. పండగ ముందు బస్సులు, పండగ తర్వాత తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దూరప్రాంత ప్రయాణికులు తమ టికెట్లను ఆన్లైన్లో ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.ప్రత్యేక బస్సులు ఇలా..దసరా పండగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దూరప్రాంతమైన విజయవాడకు 7 బస్సులు నడుస్తున్నాయి. అలాగే టెక్కలి నుంచి రాజమండ్రికి 5 బస్సులు, కాకినాడ నుంచి పాతపట్నంకు 2 బస్సులు, టెక్కలి నుంచి అమలాపురానికి 3 బస్సులు నడుస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం నుంచి విశాఖకు 25 అల్ట్రా డీలక్స్, 11 అల్ట్రా పల్లెవెలుగులు, 8 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణంకు ప్రతి 5 నిమిషాలకు ఒక నాన్స్టాప్ బస్సు అందుబాటులో ఉండగా ప్రత్యేక బస్సులతో కలిపి ప్రతి 2 నిమిషాలకు ఒక నాన్స్టాప్ బస్సు నడవనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.10 శాతం రాయితీఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ఎప్పటిలాగే బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే ప్రయాణ చార్జీలో 10శాతం రాయితీ ఇస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేవారు రాను, పోను టికెట్ తీసుకుంటే 10శాతం రాయితీ ఇస్తున్నారు.రద్దీకి తగ్గట్టుగా సర్వీసులుదసరా పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులు నడుపుతాం. దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళంకు, తిరుగు ప్రయాణ సమయంలో శ్రీకాకుళం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటిటి అదనపు చార్జీలు ఉండవు. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. – సీహెచ్ అప్పలనారాయణ, డీపీటీఓ -
నరసన్నపేటలో ‘కన్యా కుమారి’
నరసన్నపేట: కన్యాకుమారి సినిమా హీరోయిన్ గీత్ షైనీ బుధవారం నరసన్నపేట మండలంలో పలు గ్రామాల్లో సందడి చేశారు. మడపాం, కోమర్తి, దేవాది తదితర గ్రామాల్లో తిరిగారు. స్థానికులతో మాట్లాడి కన్యాకుమారి సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గీత్ షైనీ మాట్లాడుతూ కన్యాకుమారి సినిమాలో నటించేందుకు అవకాశం రావడం, అదీ శ్రీకాకుళం ప్రాంతంలో తీయ డం సంతోషంగా ఉందన్నారు. సినిమా ఓటీటీలో ట్రెండింగ్లో ఉందన్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియోస్లో దేశ వ్యాప్తంగా మొదటి 10 సినిమాల్లో కన్యాకుమారి స్థానం పొందిందన్నారు. అలాగే ఆహాలో మొదటి 5 సినిమాల్లో ఫస్ట్ స్థానంలో నిలిచిందని ఆనందంగా చెప్పా రు. మడపాంలో అభయాంజనేయ విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. హీరోయిన్ తో పాటు డైరెక్టర్ సృజన్ అట్టాడ కూడా ఉన్నారు. -
● జజ్జనకరి జాతర
కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో బుధవారం నిర్వహించిన శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. శోభాయాత్ర కొత్త పేట కూడలి నుంచి కోటబొమ్మాళి వరకు అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు విజయ ఢంకా మోగించి శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. పలు రకాల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. విద్యుత్ వెలుగులతో కొత్తమ్మ తల్లి ఆలయం నేత్రపర్వంగా మెరిసింది. జిల్లా పోలీసుల సమన్వయంతో ప్రజల సహకారంతో కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా శాంతియుతంగా జరుగుతున్నాయని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. – టెక్కలి/ శ్రీకాకుళం క్రైమ్ -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో బుధవారం మత పెద్దలు, కుల పెద్దలతో బాల్య వివాహాలు – అనర్థాలు – చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కొన్ని సామాజికవర్గాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఆడ పిల్లలకు అనే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచిస్తూ, బాల్య వివాహాల నివారణ కోసం ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే 15100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం లేదా స్థానిక జిల్లా కోర్టు భవనంలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ మత పెద్దలు, కె.రమణ (ఐసీపీఎస్), జి.ఇందిరాప్రసాద్ (అడ్వకేట్), కె.ఆఫీసు నాయుడు (చీఫ్ ఎల్ఏడీసీ) తదితరులు పాల్గొన్నారు. ‘మాన్యువల్ పద్ధతిలో ప్లేసులు కేటాయించాలి’ శ్రీకాకుళం: డీఎస్సీ–2025 అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా ప్లేసులు కేటాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణ మూర్తి, జి.రమణ ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చాలామంది ఆన్లైన్ కౌన్సెలింగ్పై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా క్లస్టరు వేకెన్సీల గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండా అప్పటి అధికారులు వెబ్ కౌన్సిలింగ్ పేరిట దూరం ప్లేసులు కేటాయించారని ఇప్పటికీ ఆవేదన చెందుతూనే ఉన్నారని, కాబట్టి డీఎస్సీ 2025 అభ్యర్థులందరికీ మాన్యువల్ పద్ధతిలోనే ప్లేసులు కేటాయించాలని తెలియజేశారు. నాటుసారా స్థావరాలపై దాడులు పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న నాటుసారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగిపూర్, నేరేడి గూడ, శిరడా, గురిసింగిగూడ, దిదింగూడ పరిసరాల్లో 720 లీటర్ల నాటుసారా, 6,800 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, సూపరిటెండెంట్లు మురళీ, కుమార్, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, జిల్లా టాస్క్ఫోర్స్ పాతపట్నం, టెక్కలి, పలాస, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, కాశీనగర్ ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు నీడలో..!
కొత్తూరు: జిల్లాలో వందలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న చెరువుల బాగోగులను అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు వాటి రూపం కోల్పోతున్నాయి. వర్షాలు పడితే తప్పా జిల్లాలోని చెరువుల కింద సాగు చేస్తున్న పొలాల్లో వరినాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని 30 మండలాల్లో 6,630 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు(సాగునీటి చెరువులు) ఉన్నాయి. అందులో వంద ఎకరాల ఆయకట్టుకు దాటి సాగునీరు అందిస్తున్న చెరువులు 655 ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలో ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్లో 2.65 లక్షల ఎకరాల్లో వరి పంటకు సాగునీరు అందిస్తున్నాయి. అయితే సాగునీటి చెరువుల మరమ్మతులు, పూడికలు తీయడానికి, చెరువులు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అలాగే మరోవైపు ఆక్రమణలకు గురవ్వడంతో వాటి రూపం కోల్పోయాయి. దీంతో చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గి ఆయకట్టు భూములకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలోని 6,630 చెరువుల్లో 9.85 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది. అయితే చెరువులు నిర్లక్ష్యానికి గురవ్వడంతో పాటు ఆక్రమణలకు గురికావడం, పూడికలతో నిండిపోవడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం 7.52 టీఎంసీలకు తగ్గింది. దీంతో శివారు భూములకు సాగునీరు అందక.. రైతులు వర్షపు నీటిపైనే ఆధారపడుతున్నారు. వర్షాలు కురవకపోతే కొన్ని సందర్భాల్లో వరినాట్లు వేయని సందర్భాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా పంటలు పొట్టదశలో, వెన్ను దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. రూ.200 కోట్లతో ప్రతిపాదనలు జిల్లాలోని 663 ఎంఐ ట్యాంకుల అభివృద్ధి కోసం ఆర్ఆర్ఆర్ కమిటీ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో రూ.200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాము. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపిస్తాము. నిధులు మంజూరైన వెంటనే చెరువుల్లో పనులు జరగడం జరుగుతుంది. – పొన్నాడ సుధాకరరావు, మైనర్ ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ, శ్రీకాకుళం జిల్లా నిర్లక్ష్యానికి గురయ్యాయి సాగునీటి చెరువులు నిర్లక్ష్యానికి గురికావడంతో ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు. బలద గ్రామానికి చెందిన సుమారు 89 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పద్మనాభ సాగరం సుమారు 525 ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. అటువంటి ఈ చెరువు పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు ఆక్రమణకు గురయ్యింది. అధికారులు స్పందించి చెరువులో పూడికలు తీయడానికి నిధులు కేటాయించాలి. – బీవీ రమణమూర్తి, బలద గ్రామం, కొత్తూరు మండలం ఉపాధి పథకం ద్వారా చెరువు పనులు చేస్తున్నప్పటికీ ఆక్రమణలు తొలగించకుండా పనులు చేస్తుడడంతో ఉపయోగం ఉండడం లేదు. అందువలన ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యానికి గురైన మైనర్ ఇరిగేషన్ చెరువులకు నిధులు కేటాయించి, ఆక్రమణలు తొలగించి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. మరమ్మతులకు నోచుకోని సాగునీటి చెరువులు వెంటాడుతున్న నిధుల కొరత యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్న వైనం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆక్రమణలు తొలగించాలి తరాలు నుంచి వస్తున్న సాగునీటి చెరువులు పలు గ్రామాల్లో ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. దీంతో వరిపంట సాగుకు వర్షాలపై ఆధారపడుతున్నాము. ఆక్రమణలు తొలగించి చెరువులకు పూర్వ వైభవం తీసుకు రావాలి. – గార రాజులునాయుడు, మాకవరం, కొత్తూరు మండలం -
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. -
ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం
ఎచ్చెర్ల: బీఆర్ఏయూలో ఎన్ఎస్ఎస్ 57వ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి డా.ఎం.సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అందించేది ఎన్ఎస్ఎస్ మాత్రమేనన్నారు. ప్రతీ విద్యార్థి ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం కావడం ద్వారా దేశ ప్రగతికి ఊతమిచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత, నెహ్రూ యువకేంద్రం ఉప సంచాలకుడు కె.వెంకట ఉజ్వాల్, బెజ్జపురం యూత్క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాదరావు, ఎన్ఎస్ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ డా.డి.వనజ తదితరులు మాట్లాడుతూ.. 1969లో గాంధీజీ శత జయంతోత్సవాల సందర్భంగా దేశంలోని 37 వర్సిటీల్లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ సేవలు.. నేడు అన్ని వర్సిటీలు, కాలేజీల్లో విస్తృతమయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రగతిదాయక కార్యక్రమాలకు వాలంటీర్లు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్స్ డా.ఎం.అనూరాధ, డా.సీహెచ్.రాజశేఖరరావు తదితరులు కూడా మాట్లాడారు. జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఈ కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా జిల్లా, వర్సిటీ స్థాయిలో ఎంపిక చేసిన పదిమంది ఎన్ఎస్ఎస్ పీవోలకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. అలాగే వర్సిటీలో ఏడు యూనిట్ల పీవోలకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. అంతకుముందు నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
దొంగలను పట్టించిన రోడ్డు ప్రమాదం
● పోలీసుల అదుపులో నిందితులు పలాస/శ్రీకాకుళం క్రైమ్: పలాస మండలంలోని మోదుగులపుట్టి గ్రామానికి చెందిన అవుగాన పార్వతీశం, అవుగాన రమణలకు చెందిన సుమారు రూ.1.5 లక్షల విలువైన పెద్ద మేకపోతులను సోమవారం రాత్రి దొంగతనం చేశారు. మోదుగులపుట్టి సమీపంలోని కొత్తపేటలో మేకల మందను వేయగా.. రాత్రిపూట మంద వద్దకు వెళ్లిన నలుగురు వ్యక్తులు దొంగతనం చేసి ఎత్తుకుపోయారు. మోదుగులపుట్టి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కోసంగిపురం జగనన్న కాలనీ సమీపంలో ఉన్న సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, పలాస మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పాటు మరో ఇద్దరు దొంగతనం చేశారు. ప్రమాదం జరగడంతో... మేకలను దొంగిలించిన నలుగురు యువకులు కారులో శ్రీకాకుళం నగరానికి తీసుకెళ్లి అమ్మేశారు. తిరుగు ప్రయాణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పోలీసులకు పట్టుబడడంతో విచారణలో అసలు విషయం బయటకొచ్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాస మండలంలో మేకలు దొంగతనం చేసిన కె.సాయికుమార్, కె.గణేష్, ఎం.వంశీ, ఎల్.ఛత్రపతిలు ఐదు మేకలను దొంగిలించి, కారులో ఎక్కించి నగరంలోని గుజరాతీపేటలో మటన్ షాపు నిర్వాహకుడికి తక్కువ ధరకు అమ్మేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హయాతీనగరం వచ్చేసరికి కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి విషయం పూర్తిగా తెలిసినా డ్రంక్ అండ్ డ్రైవ్తో సరిపెట్టేద్దామనుకున్నారు. సమాచారం ప్రత్యేక విభాగ పోలీసులకు అందడంతో చేసేదేమీలేక ట్రాఫిక్ పోలీసులు ఒకటో పట్టణ పోలీసులకు యువకులను అప్పగించారు. దీంతో ఎస్ఐ ఎం.హరికృష్ణ యువకులను ప్రశ్నించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. ఎప్పటినుంచో నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో మంచి పేరున్న మటన్ షాపు నిర్వాహకుడి కుమారుల్లో ఒకరైన రాజు (గుజరాతీపేట షాపునకు) వద్దకు వెళ్లి తక్కువ ధరకు అమ్మారని తెలిసింది. గతంలో కూడా రూరల్ మండలం పాత్రునివలసలో రెండో పట్టణ పరిధి ఇద్దరు రౌడీషీటర్లు గొర్రెలు ఇదే నిర్వాహకుడికి అమ్మడంతో అప్పట్లో కూడా పోలీసులు ఇతడిని విచారించడం గమనార్హం. విచారణ అనంతరం కేసును కాశీబుగ్గ స్టేషన్కు బదలాయించినట్లు ఎస్ఐ ఎం.హరికృష్ణ వెల్లడించారు. -
ప్రయాణానికి ప్రయాసలు..!
● డీఎస్సీ అభ్యర్థులతో తరలి వెళ్లిన బస్సులు ● జిల్లాలో ప్రయాణాలకు ఇబ్బందులు శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. జిల్లాలోని కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి పండగలు జరుగుతుండడం, దసరా పండగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడింది. అయితే ప్రయాణికులకు తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల కోసం ప్రయాణికులు ఫుట్పాత్లపై వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరలివెళ్లిన 37 ఆర్టీసీ బస్సులు ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీలో సెలెక్టయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం విజయవాడ రమ్మని పిలిచింది. వీరంతా ఈనెల 25వ తేదీకి హాజరవ్వాలని చెబుతూ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను వేసింది. దీంతో జిల్లా నుంచి శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 11 బస్సులు, శ్రీకాకుళం రెండో డిపో పరిధిలో 7 బస్సులు, టెక్కలి డిపో నుంచి 8 బస్సులు, పలాస డిపో నుంచి 8 బస్సులు, పాలకొండ డిపో నుంచి 3 బస్సులను విజయవాడకు వేశారు. దీంతో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సకాలంలో రాని బస్సులు విజయవాడకు 37 బస్సులు తరలిపోవడంతో సకాలంలో ఆర్టీసీ బస్సులు రాలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు ఎప్పుడు వస్తుందోనని ఫుట్పాత్లపై ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు నాన్స్టాప్ కౌంటర్ వద్ద బారులుతీరుతూ కనిపించారు. నాన్స్టాప్ కౌంటర్ వద్ద రద్దీ అధికంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులనే నాన్స్టాప్ బస్సులుగా నడిపారు. శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ 2025కు ఎంపికై న అభ్యర్థులను విజయవాడ తరలించారు. 673 మంది అభ్యర్థులు జిల్లా నుంచి ఎంపిక కాగా, వీరితోపాటు వీరికి సహాయకులుగా 673 మందిని 37 బస్సుల్లో తీసుకువెళ్లారు. స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు ఈ బస్సులు బయల్దేరాయి. బస్సులను ఆర్డీఓ సాయి ప్రత్యూష జండా ఊపి ప్రారంభించారు. ప్రతి బస్సులోనూ ఓ కానిస్టేబుల్తో పాటు ముగ్గురు సహాయకులను పంపించారు. అభ్యర్థులతో పాటు డీఈఓ రవిబాబు, ఉప విద్యాశాఖ అధికారి విజయ కుమారి తదితరులు వెళ్లారు. వీరందరికీ గురువారం విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేస్తారు. అటు తర్వాత వీరందరికీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలను కేటాయిస్తారు. -
నిబంధనలు కాలరాసి..
పౌర సేవకు కేరాఫ్గా ఉండాల్సిన సచివాలయం బెదిరింపులకు నిలయమవుతోంది. సచివాలయం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంపై ఆరోపణలు రావడం, ఉద్యోగికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం వంటివి సచివాలయ వ్యవస్థలో కొత్త లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇప్పుడీ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. జలుమూరు మండలం జోనంకి సచివాలయం ఈ వివాదానికి వేదికై ంది. జలుమూరు: జోనంకి సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసి న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోనంకి పంచాయతీకి చెందిన ధవళ అప్పలనాయుడు మే 22న విశాఖలో అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి లో మృతి చెందారు. కానీ స్థానికంగా జోనంకిలో మృతి చెందినట్లు కార్యదర్శి గుడ్ల సరోజిని డిజిటల్ సైన్తో మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అయితే సరోజిని ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సెలవులో ఉన్నారు. ఇదే సమయంలో లింగాలవలస సచివాలయం కార్యదర్శి ఎం.లక్ష్మి జోనంకి పంచాయతీకి ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఈమె అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం సరోజిని డిజిటల్ సైన్తో మంజూరు చేశారు. దీంతో వి వాదం మొదలైంది. స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ మంజూరు చేశారని స్థానికులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ హరి ఈ పత్రానికి సంబంధించి ఫార్ం–2ను అప్లోడ్ చేసి సిస్టమ్ ద్వారా అందించారు. అయితే సెలవులో ఉన్న కార్యదర్శి పేరిట ధ్రువీకరణ పత్రం ఇవ్వకూ డదు. హరి మాట్లాడుతూ తనకు లింగాలవలస కా ర్యదర్శి అప్పల నాయుడు సర్టిఫికెట్కు సంబంధించిన ఓటీపీ చెబితే ఇచ్చానని, తనకు అంతవరకే తెలుసని వివరించారు. దీనిపై లింగావలస కార్యద ర్శి లక్ష్మీ మాట్లాడుతూ అదేం పెద్ద తప్పు కాదని, అప్పల నా యుడు స్థానికంగా మృతి చెందినట్లు వంద మంది సంతకాలు తన వద్ద ఉన్నాయని చెప్పడం విశేషం. సైబర్ కమిషనర్ అంటూ రూ.1.20 లక్షలు వసూలు.. సెలవులో ఉన్న ఉద్యోగి పేరుతో పత్రం రిలీజ్ కావ డంతో ఓ అజ్ఞాత వ్యక్తి తాను సైబర్ కమిషనర్ను అంటూ కార్యదర్శి సరోజినికి ఫోన్ చేశాడు. ‘మీరు సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు. మీ సంతకంతో లింగాలవలస కార్యదర్శి లక్ష్మి విశాఖలో మృతి చెందిన వ్యక్తికి ఇక్కడ మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. మీ మీద పోలీసు కేసు నమోదవుతుంది. మీరు కోర్టులకు తిరగాల్సి వస్తుంది. త్వరలో అరెస్ట్ అవ్వనున్నా రు’ అని బెదిరించారు. దాదాపు నాలుగు గంటల పా టు ఇలా వేధింపులు రావడంతో ఆమె భయపడ్డారు. దీని నుంచి తప్పించుకోవాలంటే తమ ఫోన్కు పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని కార్యదర్శి సరోజినికి ఫోన్ రావడంతో ఆమె ఈ నెల 11న రూ.1.20 లక్షలు ఫోన్ పే చేశారు. అయినా మళ్లీ డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఈ సోమవారం ఎస్పీ మహేశ్వర రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో జలుమూరు పోలీసులు కేసు ను ప్రత్యేకంగా దర్యాప్తు చేసి రూ.1.20 లక్షలు నగదు ఫోన్పే చేసిన ఫోన్ను హోల్డ్లో పెట్టిన ట్లు సమాచారం. ఇదే పంచాయతీలలో నాలుగేళ్ల కిందట ఏటీఎం మార్చి డబ్బు కొట్టేశారు. మళ్లీ ఇలా జరగడంతో స్థానికుల ప్రమేయం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఏటీఎం మార్చి నగదును దొంగిలించిన వ్యక్తి ఒకరైతే మరో వ్యక్తిని అప్పట్లో పోలీసులు విచారించారు. దొంగలించిన వ్యక్తి తప్పు జరిగిందని అందులో కొంత నగదు తిరిగి ఇవ్వడంతో ఆ వివాదం సద్దు మణిగింది. ఈ అంశంపై సర్పంచ్ జీవీ రమణి మా ట్లాడుతూ తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ, కార్యదర్శి నుంచి డబ్బులు వసూలు వంటి అంశాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జోనంకిలో నిబంధనలకు విరుద్ధంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ టీడీపీ నాయకుల ఒత్తిడితోనే సర్టిఫికెట్ మంజూరు! సెలవులో ఉన్న కార్యదర్శి డిజిటల్ సైన్తో పత్రం అదే సాకుతో సైబర్ క్రైమ్ కమిషనర్ను అంటూ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు ఆ వ్యక్తికి రూ.1.20 లక్షలు డిజిటల్ పేమెంట్ చేసిన కార్యదర్శి అయినా ఆగని వేధింపులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన కార్యదర్శి -
ఉత్సవం.. ఉత్సాహం
● వైభవంగా కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది జాతర ఉత్సవాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మతల్లి గుడిలో ఉన్న అమ్మవారి జంగిడిని అసాదీల కుటుంబీకుల పెద్ద తలపై పెట్టుకుని అమ్మతల్లికి నిలయమైన రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వెంట పేరంటాళ్లు వెళ్లారు. సర్పంచ్ కాళ్ల సంజీవరావు, కల్లి విశ్వనాథరెడ్డి తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ జంగిడిని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రెడ్డిక వీధి నుంచి పసుపు కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి మళ్లీ కొత్త మ్మ తల్లి ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించి అమ్మ వారి దండకం చదివి కొత్త చీరను మొక్కుగా చెల్లిస్తారు. జాతర సందర్భంగా ఏర్పా టు చేసిన హెలికాప్టర్ రైడ్ను కేంద్ర, రాష్ట్ర మంత్రు లు జెండా ఊపి ప్రారంభించారు. సెంటర్ లైటింగ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పాల్గొన్నారు. క్రైమ్ బృందాలతో ప్రత్యేక నిఘా శ్రీకాకుళం క్రైమ్ : కోటబొమ్మాళిలో జరుగుతున్న కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ మహేశ్వరరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. సుమారు 100 సీసీ కెమెరాలు, 6 డ్రోన్ కెమెరాలు, 10 ఎల్ఈడీ తెరలను కంట్రోల్ రూమ్నకు అనుసంధానం చేశామన్నారు. పోలీస్ హెల్ప్లైన్ నంబర్ల ద్వారా తక్షణ ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, తప్పిపోయిన పిల్లలు, వస్తువుల ట్రేసింగ్ కోసం ప్రత్యేక కంట్రోల్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. -
ఒక మెసేజ్తో తొలగించేస్తారా..?
● ఉద్దానం తాగునీటి పథకం ఉద్యోగుల తొలగింపుపై ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు ● ఇదేనా అనుభవజ్ఞుని పాలన అంటూ శాసన మండలిలో చర్చ ● తొలగించిన 104 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ కవిటి : సుమారు 28 ఏళ్లుగా ఉద్దానం తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల తొలగింపు దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. మంగళవారం శాసనమండలి, మీడియా పాయింట్ వేదికగా ఈ సమస్యను ప్రస్తావించారు. ఉద్యో గాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారం దక్కాక ఉన్నవి తీసేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని ఒకే మెసేజ్తో రాత్రికి రాత్రి తొలగించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నా రు. 104 కుటుంబాలు ఆ ఒక్క మెసేజ్తో రోడ్డున పడ్డాయన్నారు. తొలగించిన ఆ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన..? దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని తొలగించడమే విజనరీయా, ఇదే అనుభవజ్ఞుడి పాలనా అంటూ నర్తు ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయి 45 రోజులుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ కార్మికులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నా రు. జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ప్రభుత్వ విప్, రాష్ట్ర, కేంద్ర మంత్రి ఉండి ఆ 104 మంది కార్మికులను ఆ దుకోలేరా అని ప్రశ్నించారు. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లో ఉన్న వారిని తీసుకువెళ్లి, మెగా సంస్థలో విలీనం చేసి నా లుగు నెలల్లోనే వారిని విధుల్లో నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కార్మికుల తరఫున వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం ఆ కార్మికుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై వైఎస్ జగన్ వెంటనే స్పందించి పార్టీ లీగల్ టీమ్ ప్రతినిధి మనోహర్ రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నర్తు చెప్పారు. ఆ 104 మంది కుటుంబాల భవిష్యత్ కోసం లీగల్గా న్యాయపోరాటం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. ఉద్యమకారుల ఆవేదన అర్థం చేసుకోండి థర్మల్ ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని నర్తు రామారావు కోరారు. విరామ సమయంలో శాసనమండలి ప్రాంగణంలో తనను కలిసిన పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ యారాడ కృష్ణమూర్తిని, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వద్దకు తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. -
అరణ్య రోదన..!
నిర్వాసితుల మిగులు భూములు న్యాయం జరుగుతుంది వంశధార నిర్వాసితుల మిగుల భూముల సమస్య ఎప్పటినుంచో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. తప్పకుండా ఉన్నతాధికారులు పరిష్కారం చూపుతారు. నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. – ఎ.జోగారావు, తహసీల్దారు, హిరమండలం మా గోడు పట్టదా..? వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశాం. కానీ మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది. మిగులు భూముల సమస్యలు పరిష్కరించాలని గత 15 సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నాం. కానీ మా గోడు వినిపించుకునే వారు కరువయ్యారు. – గొర్లె చంద్రినాయుడు, నిర్వాసితుడు, దుగ్గుపురం నిర్వాసిత గ్రామం హిరమండలం: వంశధార రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశారు వారు. కానీ రెండు దశాబ్ధాలు దాటుతున్నా వారి త్యాగాలకు మాత్రం సరైన న్యాయం జరగడం లేదు. వారికి స్వాంతననిచ్చే నిర్ణయం రావడం లేదు. వంశధార రిజర్వాయర్కు సంబంధించి మిగులు భూముల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాయితీ రావడం లేదు. వాటికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించలేదు. చివరకు పంటలు పండించేందుకు ఎరువులు కూడా అందించడం లేదు. దీంతో వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం. 2005లో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2007 నుంచి హిరమండలం, కొత్తూరు, ఎల్ఎన్పేట మండలాల పరిధిలోని 10 వేల ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. 2010లో సేకరణ పూర్తయ్యింది. నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చిన భూమి పోనూ.. మిగులు భూమి విషయంలో తలెత్తిన రెవెన్యూ సమస్యలను అధికారులు ఇంతవరకూ పరిష్కరించలేదు. అయితే చేతిలో భూమి ఉందన్న విషయమే తప్ప.. ఆ భూములకు సంబంధించి బ్యాంకు రుణాలు రావడం లేదు. విత్తనాలు ఇవ్వడం లేదు. అన్నదాత సుఖీభవ లాంటి సాగు ప్రోత్సాహం లేదు. ఎందుకంటే మిగులు భూమికి సంబంధించి ధ్రువపత్రాలు, రిజర్వాయర్ నిర్మాణానికి నిర్వాసితులు వదులకున్న భూములతో లింకు కావడమే. రిజర్వాయర్ కోసం రైతుల నుంచి సేకరించిన భూములు, మిగులు భూములను విడగొట్టకుండా అప్పట్లో అధికారులు సాంకేతిక తప్పిదానికి పాల్పడ్డారు. ఆ శాపం ఇప్పుడు రైతులకు వెంటాడుతోంది. 13 గ్రామాలదే సింహభాగం హిరమండలం మండలం పాడలి, దుగ్గుపురం, తులగాం, పెద్దసంకలి, గార్లపాడు, చిన్నకొల్లివలస తదితర 13 గ్రామాల రైతులు వేలాది ఎకరాలను వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి వదులుకున్నారు. రిజర్వాయర్లో సింహభాగం భూమి ఈ గ్రామాల వారిదే. ఆ సమయంలో రిజర్వాయర్ ఎగువున ఉన్న భూములను మిగులు భూములుగా గుర్తించారు. వాటిని రైతులకు విడిచిపెట్టారు. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చిపడింది. ఒకే సర్వే నంబర్, వెబ్ల్యాండ్లో ఉన్న భూమి రిజర్వాయర్కు ఇచ్చిన దాంట్లోనూ.. మిగులు భూమిగానూ ఉంది. అప్పట్లో రెవెన్యూ రికార్డులు విభజించకుండా పూర్తి చేశారు. దీంతో అదంతా రిజర్వాయర్ భూమి పరిధిలో ఉండడంతో దాదాపు 2,200 ఎకరాల మిగు లు భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ పథకమూ వర్తించడం లేదు. ఇలా పథకాలు దక్కని మిగులు భూములకు సంబంధించి పాడలిలో 264 ఎకరాలు, దుగ్గుపురంలో 180, అంతిలిలో 1,200, పెద్దసంకిలిలో 220, గార్లపాడులో 150, చిన్నకొల్లివలసలో 100 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ రైతులంతా తహసీల్దారు, జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రాలు అందించుకోవడమే తప్ప సమస్యకు మాత్రం పరిష్కార మార్గం దొరడకం లేదు. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వంశధార నిర్వాసితులకు తీరని అన్యాయం 20 ఏళ్ల క్రితం రిజర్వాయర్కు సర్వం త్యాగం మిగిలిన 2,200 ఎకరాల భూములకు వెంటాడుతున్న సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయానికి దూరం చాలా అన్యాయం ఇంతకంటే అన్యాయం ఉంటుందా..?. రిజర్వాయర్కు భూములిచ్చాం. కొన్ని భూములు మిగిలాయి. వాటిపై ప్రత్యేకంగా హక్కు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ అది తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి. – పెద్దకోట సాదుబాబు, నిర్వాసితుడు, పాడలి నిర్వాసిత గ్రామం -
టీడీపీ నాయకుల బరితెగింపు
● కొత్త కుంకాంలో చెరువు ఆక్రమణ ● రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ● హెచ్చరికలు బేఖాతరు చేస్తున్న వైనం రణస్థలం: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఇటీవల టీడీపీ నాయకులు గ్రావెల్ దందా చేసి సొమ్ము చేసుకుంటే.. నేడు ఆ పార్టీ కార్యకర్తలు ఏకంగా చెరువులనే కబ్జా చేస్తున్నారు. లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కొత్త కుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 55లో పెద్ద కోనేరు చెరువు ఉంది. ఈ చెరువు మడ్డువలస కాలువ వలన రెండు పాయలుగా చీలిపోయింది. ఒకవైపు సుమారు రెండు ఎకరాల పరిధిలో ఉన్న చెరువును స్థానిక టీడీపీ నాయకులు ఆక్రమించే చర్యలు చేపట్టి ఇప్పటికే ఎకరా వరకు కప్పివేశారు. ఉన్న మరో ఎకరాను పూర్తిగా అక్రమించే చర్యలు గత పదిహేను రోజులుగా చేపట్టారు. దీనిపై గ్రామంలో ఎంత వ్యతిరేకత వచ్చినా కనీసం స్పందించకుండా టీడీపీ కార్యకర్తలు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. కొందరికి మాత్రం ఊరులో ఉన్న కోవెల ఆదాయం కోసం మొక్కలు వేసి సాగు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు ఈనెల 8వ తేదీన కలెక్టర్ గ్రీవెన్స్లో స్థానిక గ్రామస్తుల తరుపున ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా ఉంది. చెరువును కూనపల్లి కిషోర్ కుమార్, బత్తుల గిరిబాబులు అక్రమిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ మేరకు రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోయారు. మండల రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అధికారుల అదేశాలు బేఖాతర్ చేస్తూ మరలా సోమవారం నుంచి టీడీపీ నాయకులు ఆక్రమించే చర్యలు చేపట్టారు. దీనిపై గ్రామస్తులంతా కలిసి అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు అందిందని ప్రస్తుతం పనులు ఆపించాం. వర్షం పడుతుంది పోలీసుల బందోబస్తుతో వెళ్తామని రెవెన్యూ అధికారుల ఒక వైపు చెబుతుంటే... ఏ రెవెన్యూ అధికారి వచ్చినా ఆపేది లేదని టీడీపీ అక్రమణదారులు సవాల్ విసురుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తాం చెరువు ఆక్రమణకు సంబంధించి గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు సిబ్బంది వెళ్లి పరిశీలించారు. సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణలు నిజమని తేలితే తొలగిస్తాం. ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేస్తాం. – జీఎల్ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్, లావేరు -
గోవులను సంరక్షించాలని పాదయాత్ర
కంచిలి: గోవులను సంరక్షించాలని నినదిస్తూ రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లా జ్యోతిర్యాలీ గ్రామానికి చెందిన రాహుల్ చౌదరి ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా కంచిలి పట్టణానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఇతడిని స్థానిక హిందూ ధార్మిక ప్రతినిధులు ఆహ్వానించి బస ఏర్పాటు చేశారు. తన పాదయాత్రను ఉత్తరాఖండ్లో ముగింపు చేయనున్నట్లు రాహుల్ చౌదరి తెలిపారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి గోవులను జాతీయ చిహ్నంగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 9,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఇతడిని కంచిలికి చెందిన జగదీష్ పట్నాయక్, ఇప్పిలి ప్రవీణ్, వూనా శ్రీకాంత్, కొత్తకోట విజయబాబు, కొంచాడ కామేష్, హరేరామ భక్తుడు ధర్మ, ఎస్ఆర్సీపురం పాఠశాల ఉపాధ్యాయుడు ముకుంద తదితరులు కలిసి సంఘీభావం తెలుపుతూ, కొంత ఆర్థిక సాయం అందించారు. -
నరకయాతన..!
● వైద్యుని రాకకోసం దివ్యాంగుల ఎదురుచూపులు ● పలాస ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సదరం ఇక్కట్లు పలాస: స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వద్ద దివ్యాంగులకు సదరం ఇక్కట్లు అంతా ఇంతా కాదు. సంబంధిత వైద్యుడు సమయానికి రాకపోవడంతో గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి సోమవారం నెలకొంది. అక్కడ సరైన సదుపాయాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పలాస సామాజిక ఆస్పత్రి వద్ద ప్రతీవారం సదరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఇచ్ఛాపురం మొదలుకొని పలాస వరకు పలాస రెవిన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చే వారికి వారానికి 30 మందికి చొప్పున పరీక్షలు చేయాల్సి ఉంది. గత వారం సదరం పరీక్షలు జరగలేదు. దీంతో సోమవా రం మొత్తం 60 మంది వివిధ రకాల దివ్యాంగులు ఉదయం 7 గంటలకే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎముకలు, కీళ్లు వ్యాధులకు సంబంధించిన వైద్యుడు డాక్టరు చిన్నంనాయుడు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉంది. అయితే ఆయన ఆస్పత్రికి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోయారు. డాక్టర్ను అక్కడికి వచ్చినవారు చూశారు. ఇక పరీక్షలు చేస్తారని సంతోషపడ్డారు. అయితే అంతలోనే అక్కడ నుంచి అతను మాయమైపోయారు. దీంతో అతని కోసం సుమారు 2 గంటల పాటు ఎదురుచూశారు. అక్కడ వైద్య సిబ్బందికి అడిగితే.. వస్తారని చెబుతున్నారు గానీ రాకపోవడంతో వికలాంగులు నరకయాతన అనుభవించారు. కనీసం అక్కడ ఫ్యాన్లు, కుర్చీలు లేవు. మలమూత్ర విసర్జాలకు కూడా బయటకు వెళ్లలేరు. ఈవిధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నింపాదిగా సుమారు 12 గంటల సమయంలో వైద్యుడు చిన్నంనాయుడు వచ్చి పరీక్షలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది వికలాంగులు ఈ సదరం పరీక్షలకు వచ్చారు. ఈ విషయంపై వైద్యుడు చిన్నంనాయుడుని వివరణ కోరగా తాను ఒక గంట ఆలస్యంగా రావడం వాస్తవమేనని, అయితే వచ్చిన 50 మందికి పరీక్షలు ఒంటిగంటలోపే చేశామని తెలియజేశారు. చాలా ఇబ్బంది పడ్డాం వైద్యుడు సమయానికి రాకపోవడం చాలా ఇబ్బంది పడ్డాం. మా ఇంట్లో మా బావ కొడుకు చనిపోయాడు. అక్కడకి వెళ్లలేని.. ఇక్కడ ఉండలేని పరిస్థితి. మా బాబు కదల్లేడు. కవిటి నుంచి వచ్చాము. మా ఇబ్బందులు ఆ దేవుడుకు తెలుసు. – బృందావతి, సహాయకురాలు, సిగలపుట్టుగ, కవిటి మండలం కనీస సదుపాయాలు లేవు డాక్టర్ కోసం ఉదయం 7 గంటలకు వచ్చాను. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకొని ఉన్నాను. కనీసం మూత్రం పోయడానికి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. అక్కడ ఉండడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. నరకయాతన అనుభవించాము. – యజ్జల వెంకటరావు, బారువ, సోంపేట మండలం -
గంజాయితో యువకుడు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో 15.080 కేజీల గంజాయితో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణ పోలీసుస్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ వి.రవివర్మ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడుకి చెందిన అజయ్ అనే యువకుడు 15.080 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. నిందితుడిని విచారించి తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మేళకొండై గ్రామానికి చెందిన అజయ్గా గుర్తించారు. యువకుడు మైదానంలో ఆడడానికి వెళ్లేటప్పుడు అతనికి గంజాయి వ్యాపారం చేసే విగ్నేశ్వర్ అలియాస్ విక్కి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విక్కికి అజయ్ చెప్పాడు. దీంతో ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చేందుకు తనకు సహకరిస్తే సేవించడానికి గంజాయితో పాటు అదనంగా రూ.5 వేలు ఇస్తానని విక్కి చెప్పాడు. దీనికి అజయ్ అంగీకరించి ఈనెల 14వ తేదీన బయల్దేరి రైలు ద్వారా తమిళనాడు నుంచి ఒడిశాలోని బరంపురం వచ్చారు. అనంతరం మోహన ప్రాంతంలో ధౌడ్ధీర అలియాస్ దీరజ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బరంపురం రైల్వేస్టేషన్కి చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడం గమనించి, బరంపురం నుంచి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. వీరిలో అజయ్ రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి బ్యాగుతో వేచి ఉండగా విక్కి రైలు టికెట్ తీసేందుకు స్టేషన్కి వెళ్లాడు. ఈ క్రమంలో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన పట్టణ పోలీసులకు అజయ్ గంజాయి బ్యాగుతో పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి గంజాయి, కీప్యాడ్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
పని గంటల పెంపు సరికాదు
శ్రీకాకుళం (పీన్కాలనీ): కార్మికులంతా కలిసి సాధించుకున్న పని గంటలను 8 నుంచి 10కి పెంచుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపునకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎం.గోవర్ధనరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, స్మార్ట్ కం ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి.జనార్ధనరావు, నీలం జూట్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలపై ఆందోళన వద్దు
● జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు ఎచ్చెర్ల: విద్యార్థులకు విడతలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల త్వరలో చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, దీనిపై ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్తో వర్సిటీలో ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానభూమి పోర్టల్లో వివిధ సాంకేతికపరమైన మార్పులు, విద్యార్థుల బయోమెట్రిక్ పెండింగ్ వంటి సమస్యల వలన ఫీజు బకాయిల మంజూరులో జాప్యం వస్తోందన్నారు. కోర్సుల నిర్వహణలో కొత్త మార్గదర్శకాలు వీసీ ఆచార్య కేఆర్ రజనీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలు, కోర్సుల నిర్వహణలో కొత్త మార్గదర్శకాలు వచ్చాయన్నారు. ఇంటర్న్ షిప్ కాల వ్యవధి తగ్గింపు, క్వాంటమ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన బోధనాంశాలు అమలు జరగనున్నట్లు పేర్కొన్నారు. సీడీసీ డీన్, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉదయభాస్కర్ మాట్లాడుతూ అపార్ ఐటీ నమోదు కార్యక్రమం పూర్తిస్థాయిలో జరిగేలా కళాశాలలు చొరవ తీసుకోవాలని సూచించారు. వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతీ ఏడాది బయోమెట్రిక్ పరికరాల్లో మార్పులు తెస్తున్నందున పలు సమస్యలకు ఆస్కారం ఏర్పడుతోందన్నారు. 2023 విద్యా సంవత్సరం నుంచి ఏడు విడతలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి, ఉన్నత విద్య గాడిలో పడేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డా.కె.స్వప్న వాహిని, ఎన్వో డా.కె.సామ్రాజ్యలక్ష్మీ, యూజీ పరీక్షల డీన్, అసిస్టెంట్ డీన్లు డా.జి.పద్మారావు, డా.కె.ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్ఏ) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా డి.శ్రీరామ్ కుమార్, జిల్లా కార్యదర్శిగా ఎం.డేవిడ్, జిల్లా కోశాధికారిగా కె.వరప్రసాద్. ఉపాధ్యక్షులుగా ఎం.సాయిప్రసాద్, విజయ భాస్కర్ రాథో, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు బృందం పర్యటన కవిటి: రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన ఉద్దానం కొబ్బరితోటల్లో పండిన నాణ్యమైన కొబ్బరిని కొత్త మొక్కల తయారీకి తీసుకునేందుకు జాతీయ కొబ్బరి బోర్డు సంసిద్ధంగా ఉందని ఆ సంస్థ వివిధ రాష్ట్రాల డైరెక్టర్లు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కపాసుకుద్ధి, ఆర్.భైరిపురం, నెలవంక, సన్యాసిపుట్టుగ గ్రామాల్లోని కొబ్బరితోటలను వారు పరిశీలించారు. ఇక్కడ పండుతున్న కొబ్బరి నాణ్యత ప్రమాణాలు మంచి ఉత్తమ శ్రేణిగా గుర్తింపు పొందాయని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఎంపిక చేసిన 1 లక్ష టెంకాయలను సేకరించేందుకు క్షేత్రపరిశీలన చేశామని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో సాగవుతున్న కొబ్బరికాయలను చికాఫ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటించిన బృందంలో కోకోనట్ డవలప్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ రెడ్డి, ఒడిశా డిప్యూటీ డైరెక్టర్ శరవణ్, వేగువాడ ఫామ్ డైరెక్టర్ రఘోత్తం, కర్ణాటక ఫామ్ డైరెక్టర్ ధన శేఖర్లు ఉన్నారు. విజయవంతం చేయాలి గార: విశాఖ డెయిరీ పాలు పోస్తున్న రైతుల డిమాండ్ల పరిష్కారానికి ఏపీ పాల రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న చలో విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీపీ గొండు రఘురామ్ పిలుపునిచ్చారు. సోమవారం అంపోలులో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీ రైతులకు అందాల్సిన పాల సేకరణ ధర తగ్గించి, సంక్షేమ పథకాలు కొనసాగించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లీటరుకు రూ.4లు బోనస్ ఇవ్వడంతో పాల సేకరణ ధర రూ.40 లు పైబడి ఉంటే, ఈ ప్రభుత్వంలో ధర తగ్గించి రైతుల నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల దాణా ధరలు పెరిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం, కంపెనీ రైతులకు అండగా నిలబడలేదని దుయ్యబట్టారు. పాలరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, కౌలు రైతుల సంఘం కార్యదర్శి పోలాకి ప్రసాదరావులు మాట్లాడుతూ డెయిరీ అవినీతిపై వేసిన హౌస్ కమిటీ విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని కోరారు. పాల సేకరణ ధర పెంచడంతో పాటు ప్రతీ మూడు నెలలకు బోనస్ ప్రకటించాలని, పశువులకు ఉచిత బీమా, మందులు, గడ్డి విత్తనాలపై రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాముకాటుతో విద్యార్థిని మృతి నందిగాం: మండలంలోని మొండ్రాయివలసలో ఆదివారం అర్ధరాత్రి పాము కాటు వేయడంతో గ్రామానికి చెందిన సీపాన శ్రీనిధి (10) మృతి చెందింది. వివరాలను పరిశీలిస్తే గ్రామానికి చెందిన సీపాన శివ, పవిత్ర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రేష్మ, చిన్న కుమార్తె శ్రీనిధి. శ్రీనిధి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి పడుకున్న శ్రీనిధికి అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేసింది. కొద్దిసేపటికే శరీరంలో ఇబ్బంది కలగడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వీరు వేకువజామున టెక్కలి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
అరసవల్లి: ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ సర్కిల్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీ విజయవంతమైంది. విద్యుత్ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు కదం తొక్కారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎంవీ గోపాలరా వు(గోపి), కన్వీనరు జి.రమేష్కుమార్, కో చైర్మన్లు ఎంవీ అప్పలనాయుడు, బీవీ గురునాథరావు, పీవీ రమణ, ఎం.శ్రీను, ఎస్.వెంకటరావు, సుబ్రహ్మణ్యం తదితరులు నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
కార్పొరేట్ల కోసమే పవర్ ప్లాంట్
● ఆలోచన విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ● బహిరంగ సభలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు సరుబుజ్జిలి/బూర్జ: పవర్ ప్లాంట్ నిర్మాణం పేరుతో కార్పొరేట్ శక్తులకు భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఐకమత్యంగా తిప్పి కొట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వీఎస్ కృష్ణ పిలుపునిచ్చారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిఽధిలో థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ ఆధ్వర్యంలో అడ్డూరిపేట వద్ద సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకరాపల్లి మాదిరిగా ఇక్కడ ప్లాంట్ జీఓను రద్దు చేయకుంటే ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్లాంట్ను రద్దు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ గతంలో వెన్నెలవలస వద్ద కూనవారిపూలతోట పేరు మీదుగా తన భార్య పేరుపై 99 ఎకరాల భూమిని లీజు పేరుతో దక్కించుకోవాలని చూశారని థర్మల్ పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్ తెలిపారు. ఇప్పుడు అన్ని చోట్లా తరిమికొట్టిన ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నా రని విమర్శించారు. 20 గ్రామాల్లో 5వేల ఎకరాల్లో బంగారం లాంటి పంట భూములను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టే ప్రయత్నాలను తిప్పి కొ ట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్ వస్తే భవిష్యత్తరాలు నాశనమవుతాయని పోరాట కమిటీ కన్వీనర్ సురేష్ దొర హెచ్చరించారు. ఇంటిలో కట్టెల పొయ్యి వల్ల కాలుష్యం జరుగుతుందని గ్యాస్ అందిస్తున్న ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రగ తి శీలా మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. జనం నెత్తిన బొగ్గుల కుంపటి పెట్టవద్దని సీపీఎం నాయకుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, రైతు కూలీ సంఘం నాయకుడు వంకల మాధవరావు, ఆదివాసీ పరిషత్ జిల్లా కార్యదర్శి సింహాచలం, పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం, గురాడి అప్పన్న, మద్దిలి రామారావు, ఉదయభాస్కర్, తామాడ సన్యాసిరావు, కోత ధర్మారావు, బెలమలప్రభాకర్ పాల్గొన్నారు. -
సమస్యల ఏకరువు
● గ్రీవెన్స్లో 85 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. మొత్తం 85 అర్జీలు వచ్చాయి. శుభ్రత పరంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పరిశీలనలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి స్థాయిలో మూడు ప్రదేశాలను ఎంపిక చేసి అక్టోబర్ 2న స్వచ్ఛ అవార్డులు అందజేస్తామన్నారు. వినతుల్లో కొన్ని.. ● వంశధార ప్రాజెక్టు పరిహారం ప్రస్తుత రేటు ప్రకారం చెల్లించాలని ఓవీపేట గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి కోరారు. ● శ్రీముఖలింగంలో కాలువ తీత పనులు అధ్వానంగా ఉన్నాయని ఆలయ అనువంశిక అర్చకుడు నాయుడు గారి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ● జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న 21 మంది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలకు గడచిన 23 నెలలుగా జీతాలు విడుదల చేయలేదని, జీతాలివ్వాలని ఉద్యోగులు అనూష, మనీష, సాయి సంతోషి తదితరులు కోరారు. ● శ్రీకాకుళం నగర పరిధిలోని పొన్నాడ బ్రిడ్జిని అనుకొని శ్రీ సాయి శ్రీనివాసనగర్ లేఅవుట్ మధ్య గుండా 45 మీటర్ల రోడ్డు ప్రతిపాదన నిలుపుదల చేయాలని, దీని వల్ల అక్కడి కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ‘విద్యార్థిని ఆదుకోవాలి’ పొందూరు మండలంలోని కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ ఏడాది విద్యార్థి ప్రమాద ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయా లని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగినప్పుడు అక్కడి సిబ్బంది ఏం చేస్తున్నారో తెలపాలని కోరా రు. ప్రభుత్వమే విద్యార్థిని చికిత్సకు సాయం అందించాలని, ఎస్ఓపై చర్యలు తీసుకోవాలన్నారు. మాకూ ‘సీ్త్రశక్తి’ ఇవ్వండి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్టీసీలో అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకం వల్ల ప్రైవేటు బస్సులు ఎవరూ ఎక్కడం లేదని, తమకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా ప్రైవేటు బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. టీడీపీ కార్యకర్తలకే ఎరువులు పొందూరు మండలంలోని రైతులకు ఎరువులు అందడం లేదని, టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఎరువు లు ఉంచుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తల ఇంటి వద్ద యూరియా ఎరువు టోకెన్లు ఇస్తున్నారని, ఏఓ పూర్తి గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్య లు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి ఏఓతో మాట్లాడారు. తుంగపేట, అచ్చిపోలవలస, బొడ్డేపల్లి, లచ్చయ్యపేట రైతులు కూడా పాల్గొన్నారు. గ్రీవెన్స్ -
కూటమి కుమ్ములాట
● అసెంబ్లీని తాకిన .. ● ఎన్ఈఆర్ వర్సెస్ కూన రవికుమార్ ● చిచ్చురేపిన గ్రావెల్, ఇతరత్రా వ్యవహారాలు ● వర్గపోరులో ఆధిపత్యం కోసం వివాదం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమిలో గ్రావెల్ చిచ్చు రేపింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య రేగిన వివాదం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీ ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత సమస్యలకు వేదికై ంది. కూటమి అధికారంలోకి వచ్చాక తమ పార్టీ వారికి కాకుండా వేరొకరికి గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే అక్కసు వెళ్లగక్కుతూ.. ఆ క్వారీకి అండగా పక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని తెలిపారు. ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావన వరకు వచ్చిందంటే వీరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వీరిద్దరి నడుమ గ్రావెల్ ఒక్కటేనా.. ఇంకేమైనా వ్యవహారాలు విభేదాలకు దారితీశాయా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఎవరికి వారే..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, ఇటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎవరి వ్యవహారాలు వాళ్లు చేసుకుంటున్నారు. అవకాశం మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు, ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. రణస్థలం మండలంలో ఉన్న కంపెనీల దగ్గరి నుంచి ఎచ్చెర్ల మండలంలోని భూముల వరకు వ్యవహారాలు నడిచాయి. అనుచరుల బెదిరింపుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో దారికి తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు సైతం పనిచేయలేక చేతులేత్తేసి, సెలవుపై వెళ్లిపోతామని చెప్పిన రోజులు ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవహారం నచ్చక.. రణస్థలం మండలంలోని సంచాం కొండలోని గ్రావెల్ తవ్వకాలు ఆ ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య వివాదం రేపింది. గుండు కై లాష్ పేరున సంచాం రెవెన్యూలోని 89/6లో సుమారు 7 ఎకరాల వరకు గ్రావెల్ లీజు అనుమతి తీసుకున్నారు. ఈయన దగ్గర ఎమ్మెల్యే కూన రవికుమార్ సోదరుడు కుమారుడు రాజేష్ సబ్ లీజు తీసుకుని నడుపుతున్నారు. ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్కు ఇష్టం లేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో స్థానికుల ముసుగులో ఈయన అనుచరులు అక్కడ తవ్వకాలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న గ్రావెల్ తవ్వకాలకు ఉంచిన పొక్లెయినర్ను అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ధ్వంసం చేశారని, అద్దాలు పగలుగొట్టి, రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు పట్టుకు వెళ్లిపోయారని లీజుదారులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే కొండలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్ లోడ్లు హైవే పనులకు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారని ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన రోజున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎన్ఈఆరే ఇదంతా చేశారని ప్రచారం జోరందుకుంది. ఇప్పుడిది ఎన్ఈఆర్కు ఇబ్బందికరంగా తయారైంది. దీంతో వ్యక్తిగత సమస్యను ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇళ్లు, స్కూల్ ముందు వేసిన గ్రావెల్ సంగతేంటి? ఎన్ఈఆర్ అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాల్లో సంచాం కొండ గ్రావెల్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తనకెలాంటి సంబంధం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆర్థిక వ్యవహారాల్లో సంబంధం లేదు సరే.. తన ఇళ్లు, స్కూల్ ముందు ప్రాంగణంలో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని సమతలం చేసేందుకు తీసుకొచ్చిన గ్రావెల్ ఎక్కడిది? సంచాం కొండ నుంచి కాదా? తన ఇళ్లు, స్కూల్ ముందు టిప్పర్లతో అన్లోడ్ చేస్తున్నప్పుడు సంచాం కొండ నుంచి ఎలా తవ్వి తీసుకొస్తారు? అని స్థానికులు నిలదీసింది వాస్తవం కాదా? గ్రావెల్ లోడ్తో వచ్చిన టిప్పర్లను ఆ సిబ్బంది సంచాం కొండ నుంచి తీసుకొచ్చామని చెప్పింది నిజం కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంచాం క్వారీలోని ధ్వంసమైన పొక్లెయినర్ (ఫైల్)ఆధిపత్య పోరు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా అంబేడ్కర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు దగ్గరి నుంచి నియామకాల వరకు తన మాట చెల్లలేదని బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పినట్టుగానే అక్కడంతా నడిచిందన్న అభిప్రాయం ఉంది. అలాగే ఎచ్చెర్ల మండలంలో పలు భూ సమస్యలు, కేసులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే కూన రవికుమారే అంతా తానై వ్యవహరిస్తున్నారని, తన మాటకు విలువ లేకుండా పోతుందన్న అభిప్రాయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీలో కింజరాపు అచ్చెన్నాయుడు వర్గమంతా ఎన్ఈఆర్ వైపు ఉండగా, కళా వెంకటరావు వర్గమంతా కూన రవికుమార్ వైపు ఉన్నారు. దీంతో ఆధిపత్య పోరు తప్పడం లేదు. తన నియోజకవర్గంలో కూన రవికుమార్ ఆధిపత్యం చెలాయించడం బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఈఆర్కు నచ్చడం లేదు. ఇక్కడేం జరిగినా తన కనుసన్నల్లోనే జరగాలని, తాను చెప్పినట్టే చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్ పెరిగింది. -
కొత్తూరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : భూమి ఇవ్వకుంటే ప్రాణాలు తీసేస్తామంటూ తమ కోడలు, ఆమె తరపు బంధువులు తమను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఓ వృద్ధురాలు ఎస్పీ మహేశ్వరరెడ్డిని వేడుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్కు బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కొత్తూరు మండలం దాశరథీపురానికి చెందిన తొత్తడి జయమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు సింహాచలంతో కలిసి ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా తన కుమారుడికి, కోడలికి విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భూ వివాదాలు జరిగాయని, గత నెల 15న తమ ఇంటికొచ్చి తన కుమారుడిపై దాడి చేయడమే కాకుండా తిరిగి కేసు పె ట్టారని ఆమె పేర్కొన్నారు. కొత్తూరు ఎస్ఐ కౌంటర్ ఎఫ్ఐఆర్లో తమ సంతకాలు తీసుకుని తా ము చెప్పిన ఫిర్యాదులో నిజానిజాలు రాయకుండా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీనిపై విచారణ జరపాలని ఆమె పేర్కొన్నారు. అలాగే టెక్కలి పంచాయతీ కార్యాలయంలో స్వీపరుగా పనిచేస్తున్న పడాల శ్రీను తాను ఫేస్బుక్లో స్కూ టీ అమ్మకం ప్రకటన చూసి మోసపోయానని, రూ.30వేలు తీసుకుని స్కూటీ ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. -
కొత్తమ్మ తల్లి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భక్తులంతా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా పక్కా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి జరగనున్న ఉత్సవాలకు సంబంధించి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. మొట్టమొదటి సారిగా భక్తుల కోసం హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాగునీరు, వైద్య సదుపాయం, భక్తుల వాహనాలకు అనుకూలమైన పార్కింగ్, ఫైర్ సేఫ్టీ తదితర సదుపాయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయనతో పాటు డ్వామా పీడీ సుధాకర్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యన్నారాయణ, డీఎస్పీ లక్ష్మణరావుతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 25 నుంచి పీహెచ్సీ వైద్యుల నిరవధిక సమ్మె అరసవల్లి: ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం (ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో వైద్యులంతా సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించని పక్షంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణ చేపట్టేలా అడుగు లు వేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవా రం కలెక్టర్ను పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ ప్రతిష్టాశర్మ (బాతువ), సుమప్రియ (పోలాకి), రమ్య(గార), మౌనిక (లావేరు), మౌనిక (కళింగపట్నం), చాందిని (సింగుపురం) తదితర బృందం కలిసి సమ్మె నోటీసుతో పాటు తమ డిమాండ్లను కలెక్టర్ వద్ద ప్రస్తావించారు. దీంతో మరో కీలక రంగం సమ్మెకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్సీ వైద్యులు సమ్మెకు దిగితే జరగనున్న పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైద్యుల సంఘం హెచ్చరిస్తోంది. -
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ.. గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలె అందజేసారు. ఈయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ప్రోటోకాల్ సిబ్బంది ఉన్నారు. మహిళలపై దాడులు అరికట్టాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు విచారణకు తొలి సంతకం చేస్తానన్న హామీ ఏమైందని ఎస్ఎఫ్ఐ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ పావని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను, వేధింపులను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయాలన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదన్నారు. అనంతరం జిల్లా గర్ల్స్ కన్వీనింగ్ కన్వీనర్గా పి.దివ్య, కో–కన్వీనర్గా నందినిలను నియమించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పి.పవిత్ర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమణారావు పాతపట్నం: జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీరాం రమణారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పాతపట్నం గిరిజన సామాజిక భవనంలో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా గురాడి అప్పన్న, సెక్రటరీగా జన్నివలస షణ్ముఖరావు, జాయింట్ సెక్రటరీగాఎన్ని దిలిప్కుమార్, ట్రెజరర్గా జమ్ము లోకేశ్వరరావు, సలహాదారుడిగా మాణిక్యాలరావులతో పాటు సభ్యులను ఎన్నుకున్నట్లు రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు తెలిపారు. వీరిని పాతపట్నం డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొండాల చక్రపతి, పీడీలు, పీఈటీలు అభినందించారు. నాయీ బ్రాహ్మణులను కించపరచడం తగదు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నాయి బ్రాహ్మణ కులాన్ని ఎగతాళి చేసి కించపరిచేలా మాట్లాడిన బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొరుపూరు గజపతిరావు, ఎస్.వి.జగన్నాథం ఆదివారం డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాలలో వెనుకబడి ఉన్న తమ కులాన్ని కించపరచడం భావ్యం కాదన్నారు. సమాజంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర అత్యంత విలువైందని, గ్రామాలు విడిచి పట్టణ ప్రాంతానికి వలసపోయే పరిస్థితుల్ని కొందరు రాజకీయ నాయకులు అగ్రకుల దురంహకారులు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. సమాజానికి వెలుగుజాడ గురజాడ శ్రీకాకుళం అర్బన్: సమాజ జాగృతికి వెలుగు జాడ మహాకవి గురజాడ అప్పారావు అని గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ జయంతి వేడుకలు ఆదివారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్తల స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాతలు జామి భీమశంకర్, పత్తి సుమతి, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, నక్క శంకరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పిన గురజాడ స్ఫూర్తి సజీవంగా నిలిచి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జి.నాగేశ్వరరావు, మెట్ట అనంతం భట్లు, శాస్త్రి, సువ్వారి రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన తపాలా ఉద్యోగ సంఘాల మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం డివిజన్ తపాలా ఉద్యోగ అనుబంధ సంఘాల 12వ ద్వైవార్షిక మహాసభలను యూటీఎఫ్ కార్యాలయంలో గ్రూప్–సీ అధ్యక్షులు యు.వి.రమణ, పోస్టుమేన్– ఎం.టి.ఎస్ అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్ఎఫ్పీఈ సంఘ నాయకులు శ్రీధర్బాబు మాట్లాడుతూ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్పీఈ రాష్ట్ర కన్వీనర్ బి.శ్రీధర్ బాబు, పోస్టుమేన్, ఎం.టి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.మురళి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, విశాఖట్నం పోస్టల్ రీజియన్ రాష్ట్ర నాయకులు కొండబాబు, రుద్రప్రతాప్, రామానందం, కిరణ్ కుమార్, పెంటపాపయ్య, నందికేశ్వరరావు, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సి అధ్యక్ష కార్యదర్శులుగా యు.వి.రమణ, కె.గణపతి, కోశాధికారిగా వి.డిల్లేశ్వరరావు, పోస్టుమేన్–ఎంటీఎస్ అధ్యక్ష కార్యదర్శులుగా టి.వెంకటేశ్వర్లు, ఎల్.బాబూరావు, కోశాధికారిగా ఎం.చిన్నారావు, ఇతర కార్యవర్గ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కలెక్టర్ దృష్టికి విద్యారంగ సమస్యలు
శ్రీకాకుళం: జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ఆదివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో చర్చించారు. కుప్పిలి పరీక్ష కేంద్రంపై అప్పటి డీఈఓ తిరుమల చైతన్య ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం తెలియజేశారని, 15 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్కు కారణమయ్యారని పేర్కొన్నారు. సస్పెన్షన్ వెనువెంటనే ఎత్తివేసినా ఉపాధ్యాయులపై ఇంకా చార్జెస్ పెండింగ్స్ ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కొరిగాం హైస్కూల్ విద్యార్థులకు తాగునీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలెక్టర్ను కలిసిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగి మురళీమోహనరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బత్తుల రవికుమార్, నాయకులు వి.హరిశ్చంద్రుడు జి.సిగడాం మండల శాఖ అధ్యక్షుడు లాడే చంద్రశేఖరరావు, లావేరు మండల శాఖ అధ్యక్షుడు మెండ నీలంకుమార్, భామిని మండల శాఖ ప్రతినిధి ముద్దాడ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. వెటరన్ క్రికెటర్ నురేన్ హక్ మృతికి సంతాపం శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ మాజీ వెటరన్ క్రికెటర్ మహమ్మద్ నురేన్ హక్ ఆదివారం బెంగళూరులోని ఓ హాస్పటల్లో తుదిశ్వాస విడిచారు. చంపాగల్లి వీధికి చెందిన నురేన్ హక్ పాతతరం క్రికెటర్లలో ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. నార్త్జోన్, జోనల్ స్థాయి వరకు ప్రాతినిధ్యం వహించారు. 1994 నుంచి 1999 వరకు జిల్లా క్రికెట్ సంఘం సెక్రటరీగా వ్యవహరించారు. ఈయన మృతిపట్ల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, హజన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ అహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, ఆర్సీరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కూలిన గోడ.. తప్పిన ప్రమాదం మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ నందవ గ్రామంలో సవర చిన్నలక్ష్మయ్య ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి గోడ తడిసిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కుటుంబసభ్యులంతా అదే ఇంట్లోఉన్నారు. గోడ బయటవైపు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు పరిశీలించి సాయం అందించాలని బాధితుడు కోరారు. -
బైక్ను ఢీకొట్టి.. లారీ కిందకు దూసుకెళ్లి..
● జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు ● ముగ్గురికి తీవ్ర గాయాలు నరసన్నపేట : దేవాది కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని తోసుకుంటూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం లారీ కిందకు వెళ్లి నుజ్జు కాగా.. కారు ముందు భాగం సైతం లారీ కిందకు దూసుకుపోయింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న తలసముద్రం గ్రామానికి చెందిన శ్రీను, వెనుక కూర్చుకున్న సంతోషిలకు తీవ్ర గాయాలయ్యాయి. సంతోషి పరిస్థితి విషమంగా ఉంది. కారు కిష్టుపురం నుంచి వస్తుండగా డ్రైవింగ్ సీట్లో దుర్గారావు ఉన్నారు. ఈయనకు స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను ఎన్హెచ్ అంబులెన్స్, 108 వాహనాల్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగులను మోసగిస్తున్న ప్రభుత్వం
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు ఒక్క పైసా కూడా ప్రయోజనం కల్పించలేదని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ మండిపడ్డారు. ఆదివారం నగరంలోని దాసరి క్రాంతిభవన్లో కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు దనపు ఇంక్రిమెంట్లు, బోనస్లు అడగడం లేదని, తమకు న్యాయంగా రావలసిన ఆర్థిక ప్రయోజనాలనే సకాలంలో చెల్లించాలని కోరుతున్నారని గుర్తు చేశారు.వాటిని కూడా చెల్లించకపోవడం మోసం చేయడం కాదా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో అధిక మొత్తంలో పెట్టుబడులను మనమే ఆకర్షిస్తున్నామని దేశంలోకెల్లా అత్యధిక వృద్ధిరేటు నమోదులో మనమే ఉన్నామని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి మరి ఉద్యోగులకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలకు ఎందుకు గండి కొడుతున్నారో చెప్పాలన్నారు. సంక్రాంతి, దీపావళి, రెండు దసరాలు వెళ్లిపోయినా ఉద్యోగులకు మాత్రం పండగ ఆనందం లేదని, రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, కనీసం దసరా కానుకగానైనా ఒక డీఏ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సమర్థంగా నిర్వహించాలని కోరారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 7న ఫ్యాప్టో తలపెట్టిన విజయవాడ ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, చింతల రామారావు, బి.ఇందిర, డీవీఎన్ పట్నాయక్, సంగమేశ్వరరావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ వ్యతిరేక పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు
ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించనున్న థర్మల్ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2030 నాటికి 50 శాతం థర్మల్ పవర్ ప్రాజెక్టులను మూసివేస్తామని, 2050 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులను మూసివేస్తామని తీర్మానం చేశాయని గుర్తు చేశారు. ఈ తరుణంలో రాష్ట్రంలో శివారు జిల్లా శ్రీకాకుళంలో రూ.30 వేల కోట్లతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉంన్నారు. అవసరమైతే సీఎం సొంత నియోజకవర్గంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుతో ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, ఎల్ఎన్పేట, హిరమండలం, సీతంపేట, పాలకొండ, సంతకవిటి, శ్రీకాకుళం రూరల్తో కలిపి తొమ్మిది మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు, భావితరాల మనుగడ దృష్ట్యా ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రాణత్యాగాలకై నా సిద్ధమని ప్రకటించారు. గతంలో జెన్కో పేరుతో భూములు సేకరించి విశాఖపట్నంలో హిందూజా కంపెనీకి, రాజమండ్రి వద్ద జీవీకే కంపెనీకి కారుచౌకగా భూములు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ● వెన్నెలవలస థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అక్కడ సేకరించిన భూములు, ప్లాంట్ నుంచి వచ్చే బూడిదతో వ్యాపారం చేసి వాటిని కాజేయడానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందస్తు ప్రణాళిక చేస్తున్నారని ఆరోపించారు. వెన్నెవలసలో కూన రవి పేరిట 50 ఎకరాలు, ఆయన సతీమణి పేరిట 50 ఎకరాలు 10 ఏళ్ల లీజుకు తీసుకునేందుకు కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారని, ఆ స్థలంలో కూనవారిపూలతోట పేరుతో తోటలు పెంపకం చేసేందుకు సిద్ధమయ్యారని గుర్తుచేశారు. అప్పుడే ఆ భూములపై కూన రవికుమార్ కన్ను పడిందన్నారు. ఇపుప్పడు పవర్ ప్లాంట్ పేరుతో మళ్లీ ఆ భూములు నొక్కేసేందుకు, ప్లాంట్ తయారైతే దాని నుంచి వచ్చే బూడిదతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ● థర్మల్ పవర్ ప్లాంట్కు నాలుగు టీఎంసీల నీరు అవసరమని, అదే నాలుగు టీఎంసీల నీటితో 50వేల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. ప్లాంట్ పేరుతో ఆ ప్రాంతంలో గిరిజనులకు బతుకు తెరువు లేకుండా చేయడం సమంజసంకాదన్నారు. అనంతరం ప్లాంట్ ముప్పుకు సంబంధించిన అన్ని పత్రాలను విడుదల చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, ఆమదాలవలస పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులు దుంపల శ్యామలరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, కూన రామకృష్ణ, దన్నాన అజయ్కుమార్, మామిడి రమేష్, చిగురుపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతా వ్యతిరేకిస్తుంటే ఆమదాలవలసలో ఎందుకు? సీఎం సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవచ్చుకదా.. విలేకరుల సమావేశంలో పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
శ్రీకాకుళం రూరల్: యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ రజనీ పిలుపునిచ్చారు. మునసబుపేటలోని గాయత్రీ కాలేఫ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో గురజాడ విద్యాసంస్థలు, విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం యువ కవితా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా కొంత సమయం కళారంగానికి కేటాయించాలన్నారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు నాలుగు గోడల మధ్య నుంచే భవిష్యత్కు పునాదులు వేసుకోవాలన్నారు. విశ్వసాహితి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రమావతి మాట్లాడుతూ యువతకు నాటి, నేటి సాహిత్యాన్ని పరిచయం చేసి వారితో రచనలు చేయించి విశ్వవేదికలపై పరిచయం చేయాలన్నారు. అనంతరం గజల్ శ్రీనివాస్ తన పాటలతో యువతను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జంధ్యాల శరత్బాబు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఛాయరాజ్ రచనలు స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్: ఛాయరాజ్ రచనలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని, ప్రజాసాహిత్యాన్ని, ప్రజాకళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రజాసాహితీ ఆధ్వర్యంలె ఛాయరాజ్ 13వ వర్ధంతి సభ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. వర్తమాన సంక్షోభాలకు పరిష్కారాలు ఛాయరాజ్ కవిత్వంలో లభిస్తాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. ముఖ్య వక్త సయ్యద్ సాబిర్ హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో నిర్బంధ అణిచివేత, అప్రకటిత ఎమర్జెన్సీ నిత్యకృత్యంగా మారిందని, ఇటువంటి వాటిని ఛాయరాజ్ తన కవిత్వం ద్వారా నిరసించారని గుర్తు చేశారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజల స్థితిగతుల కోసం చాయారాజ్ ఆవేదన చెందారని అన్నారు. కవి సనపల నారాయణమూర్తి, రచయిత అట్టాడ అప్పలనాయుడు, ప్రజాసాహితీ ఎడిటర్ పి.ఎస్.నాగరాజు మాట్లాడుతూ చాయరాజ్ ప్రజా విప్లవ కవి అన్నారు. అనంతరం అరసం ప్రచురించిన కవితా స్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చావలి శ్రీనివాస్, సదాశివ శంకరరరావు, జనసాహితీ ప్రధాన కార్యదర్శి పి.మోహనరావు, దాసరి రామ్మోహన్రావు, పీడీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మన్మోహన్, ఏఈటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, వి.నవీన్కుమార్, రంగారావు భాగవతార్, కె.గోవిందరావు, తాండ్ర అరుణ, ఛాయరాజ్ కుటుంబసభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
గంజాయితో ఐదుగురు అరెస్టు
పలాస: మూడు కేసుల్లో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గొయిబంద గ్రామానికి చెందిన జిసియా గుంట, అతని భార్య స్వప్నబిబార్లు గుణుపూర్ నుంచి 40.240 కిలోల గంజాయిని రెండు ట్రాలీ బ్యాగుల్లో పట్టుకొని బస్సులో బయలుదేరి పలాసలో దిగారు. అక్కడి నుంచి నడుచుకుంటూ పలాస రైల్వేస్టేషన్కు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే తమిళనాడు రాష్ట్రం విజయరాఘవపురం గ్రామానికి చెందిన గాయిత్రి అనిఫ్, సుభాస్(అన్నా చెల్లెళ్లు) ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి పలాస బస్సులో వచ్చి రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 28.860 కిలోల గంజాయి, సెల్ఫోన్, రూ.540 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఒడిశా రాష్ట్రం కంటసారు గ్రామానికి చెందిన లలిత మజిహి, సంజయ్ కుమార్ సాహులు బరంపురం నుంచి బస్సులో పలాస వచ్చారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 15.715 కిలోల గంజాయి, సెల్ఫోన్, రూ.470లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
వీడని గ్రహణం
● ఎక్కడకక్కడ నిలిచిపోయిన భవన నిర్మాణాలు ● పట్టించుకోని కూటమి పాలకులు నరసన్నపేట: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ని విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు గ్రహణం పట్టింది. ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా భవనాలు నిర్మించేందుకు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో భవనం నిర్మించేందుకు రూ.21 లక్షలు మంజూరు చేసింది. అదే వేగంతో వీటి నిర్మాణానికి స్థలాలు సేకరణ కూడా అధికారులు పూర్తి చేశారు. భవనాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టారు. కొన్ని వినియోగంలోనికి వచ్చాయి. మరికొన్ని పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులు ఆలోశిస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ భవనాలకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. ఎక్కడికక్కడ భవనాల నిర్మాణం నిలిచిపోయాయి. ప్రారంభమైన భవనాలు సక్రమంగా వినియోగంలో ఉండగా.. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు గ్రామాల్లో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇంత వరకూ వెచ్చించిన ప్రభుత్వ ధనం వృథా అవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా 594 విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లకు భవనాలు నిర్మాణం చేపట్టారు. భవనాలు అన్నీ ఒకేలా ఉండేవిధంగా ప్రత్యేకమైన డిజైన్ రూపొందించారు. వీటిలో 175 భవనాలు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. వివిధ దశల్లో 348 నిర్మాణంలో ఉన్నాయి. 71 చోట్ల పనులు ప్రారంభం కాలేదు. అయితే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో అనేకం చివరి దశలో ఉన్నాయి. వీటన్నీంటికి తుది మెరుగులు దిద్దితే వినియోగంలోకి వస్తాయి. అయితే ప్రభుత్వం కక్ష ధోరణితో వ్యవహరిస్తూ వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్లు పరాయి పంచన నిర్వహిస్తున్నారు. చాలీచాలని వసతులతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అరకొర సేవలు అందుతున్నాయి. కొన్ని చోట్ల సచివాలయాల్లోనే మందులు ఉంచి వచ్చిన రోగులకు సేవలు అందిస్తున్నారు. కాగా నరసన్నపేట నియోజకవర్గంలో 74 భవనాలు మంజూరు కాగా 26 పూర్తయ్యాయి. మిగిలిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మరో వైపు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన మేరకు ఇంజినీరింగ్ సిబ్బంది బిల్లులు అప్లోడ్ చేశారు. ఈ మేరకు డబ్బులు వస్తాయనే సరికి ప్రభుత్వం మారడంతో బిల్లులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా రూ.23 కోట్లు వరకూ బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. బిల్లులు చెల్లిస్తున్నామని ఇంజినీర్లు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. భవనాలు పూర్తయిన వాటికి కూడా ఫైనల్ బిల్లు కాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాకోవడంతో అప్పుల పాలయ్యామని, వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్షధోరణి విడనాడి ఈ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయించాలని సర్వత్రా కోరుతున్నారు. అప్పుడే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని వైద్య సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. -
ప్రొటోకాల్ రగడ
అరసవల్లి: జిల్లా పరిషత్ చరిత్రలో తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో అధ్యక్షురాలితో సహా సభ్యులంతా వాకౌట్ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన శాసన మండలి సభ్యు డు పాలవలస విక్రాంత్ను ఇటీవల పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండా నిలువరించడమే కాకుండా భౌతిక దాడికి సైతం పాల్పడిన సంగతి విదితమే. దీనిపై ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ నెల 16న పాలకొండలో జరిగిన ఈ ఘటనకు బాధ్యుడైన పాలకొండ ఎంపీడీఓపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి జెడ్పీటీసీ సభ్యులపై అమానుషంగా ఏకవచనంతో మాట్లాడిన జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వీ శ్రీధర్రాజాపై విచారణకు ఆదేశించాలని సభ్యులంతా పట్టుపట్టడంతో సభ హీటెక్కింది. అనంతరం సీఈఓ తీరును నిరసిస్తూ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పాలకొండ సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రాజా తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓపై ధ్వజం ఎమ్మెల్సీ విక్రాంత్కు జరిగిన అవమానంపై జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు స్పందిస్తూ ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా ఎంపీడీఓపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా బదులిస్తూ కమిషనర్కు నివే దించానని, తదనంతరం చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ క్రమంలో ‘నేను చెప్పింది విను ముందు’ అనడం సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ను ఏకవచనంతో పిలవడమేంటని పోడియంను చుట్టుముట్టారు. జెడ్పీ చైర్ పర్సన్ కూడా జత కలిశారు. పాలకొండ ఎంపీడీఓపై చర్య లు తీసుకునేంత వరకు సభ జరగదని అంతా వాకౌ ట్ చేశారు. సభలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, హిరమండలం టీడీపీ జెడ్పీటిసీ బుచ్చిబా బు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్లు మాత్ర మే కూర్చుండిపోయారు. అనంతరం సభ వాయి దా పడిందని జెడ్పీ సీఈఓ ప్రకటించారు. సభలో ఆందోళన ● టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న చట్టసభ్యులందరికీ గౌరవంగా ప్రోటో కాల్ పాటించామని గుర్తుచేశారు. గతంలో ఆహ్వానాలు పంపినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఏనాడూ రాలేదన్నారు. ● వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ మాట్లాడుతూ ఎమ్మెల్సీకి సమావేశానికి ఆహ్వానించి మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ● ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ చట్టసభ్యులనే లోపలికి రానివ్వని సంస్కృతి దారుణమన్నారు. ● జి.సిగడాం జెడ్పీటీసీ కాయల వెంకట రమణ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. ● రాజాం జెడ్పీటీసీ నర్సింహులు, బూర్జ జెడ్పీటీసీ రామారావు, రణస్థలం జెడ్పీటీసీ టి.సీతారాం, వీరఘట్టం జెడ్పీటీసీ జె.కన్నతల్లి, సీతంపేట జెడ్పీటీసీ ఆదినారాయణ, సంతబొమ్మాళి జెడ్పీటీసీ వసంత్రెడ్డి మాట్లాడుతూ విక్రాంత్కు జరి గిన అవమానం తట్టుకోలేకపోతున్నామన్నారు. నన్ను దారుణంగా అవమానించారు ఈ నెల 16న పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం మేరకే వెళ్లాను. కానీ నన్ను లోపలకు వెళ్లనివ్వలేదు. నాకు ఆప్షనల్ నియోజకవర్గమైన పాలకొండలో మండల సమావేశానికి రా కుండా ముఖద్వారం వద్దనే ఆపేశారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు భౌతికంగా తోసేశారు. నన్ను దా రుణంగా అవమానపరిచారు. ఆహ్వానం పంపిన ఎంపీడీఓను వివరణ అడిగితే ‘అవగాహన లేక పని ఒత్తిడిలో చూసుకోక ఆహ్వానం పంపించాం.. ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నామంటూ.’ లేఖలో సమాధానం ఇచ్చారు. ఒక ఎమ్మెల్సీగా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే జెడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఏంటి. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పాలకొండ ఎంపీడీఓపై ఎందుకు చర్య లు తీసుకోలేదు. జెడ్పీ సీఈఓపైనా విచారణ జరగాలి. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ నన్నే చాలాసార్లు పిలవలేదు చట్ట సభ్యులను కూడా అవమానించడం దారుణం. ఇటీవల ఇచ్ఛాపురంలో జిల్లా పరిషత్ నిధులతో ఆర్డబ్ల్యూఎస్ పథకాల ప్రారంభోత్సవానికి నాకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాకపోయినా ఈ చైర్కు అయినా విలువ ఇవ్వాలి కదా. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కు అవమానంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీవ్ర చర్చ పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకున్నాకే సమావేశమంటూ ప్రకటించిన జెడ్పీ చైర్పర్సన్ విజయ ఎమ్మెల్సీకి మద్దతుగా సభ్యుల వాకౌట్ జెడ్పీ సీఈఓ పాత్రపై కూడా విచారణ జరిపించాలన్న ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రొటోకాల్ పాటించాలి.. జిల్లాలో అన్ని శాఖల అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్ పాటించాలి. ఈ విషయంలో అనుమానాలు ఉంటే జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. ఇచ్ఛాపురం ప్రొటోకాల్ ఉల్లంఘన నా దృష్టికి వచ్చింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదు. పాలకొండ అంశంపై జెడ్పీ సీఈఓ విచారణ జరపాలి. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్ -
రైలు నుంచి దిగిపోయిన చిన్నారి
శ్రీకాకుళం అర్బన్: పలాస రెల్వేస్టేషన్లో తల్లిదండ్రులు, బంధువులు లేకుండా తిరుగుతున్న ఓ చిన్నారిని రైల్వే అధికారులు గుర్తించి శ్రీకాకుళంలోని అరసవల్లిలోగల శిశుగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ నుంచి పలాస రైల్వేస్టేషన్లో ఒక బాలుడు (వయసు సుమారు 3 సంవత్సరాలు) ఒంటరిగా దిగిపోయాడు. ఈ విషయాన్ని ప్రయాణికులు 139 నంబరు ద్వారా సమాచారం ఇవ్వగా, అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది బాలుడిని చైల్డ్ హెల్ప్లైన్కి అప్పగించారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల గురించి విచా రించినా ఎవరూ ముందుకు రాలేదు. తప్పిపోయిన బాలుడికి ఏం అడుగుతున్నా చెప్పలేకపోవడంతో ఆ బాలుని వివరాలు అందుబాటులోకి రాలేదు. అనంతరం బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది ఆ చిన్నారిని శ్రీకాకుళంలోని అరసవల్లి శిశుగృహలో చేర్పించారు. బాలుడికి సంబంధించి తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, శ్రీకాకుళంను సంప్రదించాలని అధికారులు కోరారు. ఉద్దానం పథకం పైప్లైన్ లీక్ కంచిలి: ఉద్దానం పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నీరు నిత్యం ఏదోచోట వృథా అవుతూనే ఉంది. కంచిలి పంచాయతీ పరిఽధి మఠం కంచిలి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న పైప్లైన్ రెండు రోజుల నుంచి లీక్ అవుతోంది. శనివారం పెద్ద ఎత్తున నీరు లీక్ కావడంతో స్థానికులు ఫిర్యా దు చేయడంతో, పైన వాల్వ్ బంద్ చేశారు. మళ్లీ ఆదివారం నీరు విడిచిపెట్టడంతో మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు అదే భాగంలో నీరు పెద్ద ఎత్తున వృఽథా అవుతూ కన్పించింది. దీంతో మళ్లీ పంచాయతీ కార్యదర్శి ఎన్ని రాంబాబు దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన ఉద్దానం నీటి పథకం అధికారులకు తెలియజేయడంతో, మళ్లీ వాల్వ్ బంద్ చేశారు. మరమ్మతులు చేయకుండా నేరుగా వాల్వ్ బంద్ చేసి, నీటి సరఫరాను ఆపేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శతాబ్ది ఉత్సవం.. ఎనలేని ఉత్సాహం
● రేపటి నుంచి మూడు రోజుల పాటు కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ● లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం టెక్కలి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోటబొ మ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి గు రువారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లా నాయకులు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్ర త్యేక పర్యవేక్షణలో దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశా రు. అమ్మవారి దర్శనానికి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వివిధ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొట్టమొద టి సారిగా హెలికాప్ట ర్ రైడింగ్, అమ్మ వారి చరిత్ర తెలిపే లేజర్ షో కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. మొదటి రోజు సంగిడి పోటీలు, 24వ తేదీన ఉలవల బ స్తాలు ఎత్తే పోటీలు, అమ్మవారి శోభా యాత్ర, లేజర్ షో, 25న భారీ ఎత్తున మందుగుండు సామగ్రి కాల్చడం, శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, మెగా డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు మూ డు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. -
కూటమి కన్ను
● పేదింటి పట్టాపై ● వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తిరిగి తీసుకునేందుకు కుయుక్తులు ● వాటిని కొత్తగా కూటమి నాయకులకు ఇచ్చే ప్రయత్నం ● జిల్లాలో దాదాపు 2867 మంది లబ్ధిదారులకు నష్టం శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదవాడి ఇంటి పట్టాపై కూటమి కన్ను పడింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటిపోయినా ఒక్క ఇంటినైనా మంజూరు చేయని ప్రభుత్వం.. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా లు తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పేదల ఇళ్లపై ఓ నిర్ణయం తీసుకు న్నారు. గత ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుని, నిధులు మంజూరై నిర్మాణం ప్రారంభించకపోతే ఆ ఇల్లు రద్దు చేయాలని, ఆ పట్టాను కొత్తవారికి ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు నష్టం చేకూర్చనుండగా.. కూటమి నాయకులకు మాత్రం లాభం తీసుకురానుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం ప్రారంభం కాకపోతే వారికి ఆర్థికంగా సాయం చేసి ఇంటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన పట్టాలను వెనక్కి లాక్కోవాలనుకోవడంపై సామాన్యు లు మండిపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రయ త్నం చేస్తుంటే వారికి నిధులు మంజూరు చేయకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి పట్టాలను రద్దు చేయడం దుస్సాహసమేనని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో.. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వేలు నిర్వహించి, అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. స్థలం ఉన్న వారికి వారి స్థలంలో ఇంటి నిర్మాణం చేసేందుకు సా యం చేశారు. సొంత స్థలం లేని పేదలకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి, వారికి పట్టాలను అందజేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా గత ప్రభుత్వ మే చేపట్టింది. గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో 30 మండలాలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 80,691 ఇళ్లను మంజూరు చేసింది. ఇందుకు గాను 834 లే అవుట్లను ఏర్పా టు చేసింది. ఆ లే అవుట్లలో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించారు. స్థలమిచ్చి జిల్లాలో 33,123 ఇళ్లను మంజూరు చేసి వారికి శాశ్వత చిరునామా ఇచ్చారు. వారిలో చాలామంది ఇళ్ల ప్రవేశాలు కూడా పూర్తి చేశారు. కొందరు మాత్రం ఇళ్లను ప్రారంభించుకోలేకపోయారు. ఇలాంటి వారు జిల్లాలో 2867 మంది ఉన్నారు. ఇప్పుడు వీరి పట్టాలు ప్రమాదంలో పడ్డాయి. -
కన్నీటి ఎత్తిపోతలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఎత్తిపోతల నీటిపారుదల పథకం ఇంజినీర్లకు, సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ శాఖలో ఇంజినీర్ల స్థాయిని బట్టి ఈఈ, డీఈలకు సుమారు 9నెలలకు పైగా, ఏఈ, జేఈ, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లకు మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. కేవలం వర్షాలపై ఆధా రపడి పంటలు పండించే ప్రాంతంలోని వారికి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందజేస్తారు. వీరు పనిచేస్తేనే రైతులు పంట పండించగలరు. రైతులు జీవితాల్లో వెలుగులు నింపే ఇంజినీర్ల బతుకుల్లో మాత్రం జీతాలు రాక చీకట్లు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా ఏడాది కాలంగా జీతాల్లేక విధులు నిర్వహిస్తున్నారంటే వీరి సహనాన్ని కూటమి ప్రభుత్వం పరీక్షిస్తున్నట్లే. కుటుంబాలు ఎక్కడ రోడ్డున పడిపోతాయోనని భయంతో ఇప్పటి వరకు రోడ్డెక్కకుండా అలా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లిస్తే అప్పులు తీర్చగలుగుతామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పాతవి, కొత్తవి 50కి పైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించే, భాద్యత ఇక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లదే. ఎత్తిపోతల నీటిపారుదల పథకం శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్నారు. ఏఈలు ఒకరు, జేఈ ఒకరు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరు, అటెండర్స్ ఇద్దరు, వాచ్మెన్ ఒకరు పనిచేస్తున్నారు. వీరంతా గత ఏడాది కాలంగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి జీతాలకు నోచుకోని ఎత్తిపోతల ఇంజినీర్లు స్థాయిని బట్టి వేతనాల చెల్లింపులో జాప్యం కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు తప్పని తిప్పలు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల నియామకం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేశా రు. రాష్ట్ర మున్సిపల్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలాస నియోజకవర్గానికి చెందిన బడగల బాలచంద్రుడు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేట నియోజకవ ర్గం నుంచి బాన్న రాము, వైఎస్సార్ టీయూసీ సంయుక్త కార్యదర్శిగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కొబగాపు నాగరాజు, సోషల్మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శులుగా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బొడ్డేపల్లి వెంకటసత్యం, నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కనపల అరవింద్నాయుడుని నియమించారు. కొత్తూరు: వసప గ్రామం వద్ద ఉన్న కేజీబీవీలో అదనంగా ఉన్న 1150 కిలోల బియ్యంను స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ శనివారం సీజ్ చేశారు. కేజీబీవీని తహసీల్దార్ శనివారం తని ఖీ చేశారు. కేజీబీవీ ఎస్ఓ రాధిక అందించిన రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పుస్తకాలను నిశితంగా పరిశీలించారు. రికార్డుల ప్రకా రం 248 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా.. అదనంగా మరో 1150 కిలోల బియ్యం ఉన్నట్లు తహసీల్దార్ గుర్తించారు. వీటిని సంచులు కప్పి గోప్యంగా ఉంచారు. సీజ్ చేసిన బియ్యంలో 300 కిలోలు బియ్యం హాస్టల్కు వెనుక భాగంలో ప్రహరీకి, హాస్టల్కు మధ్యన ఉండడం గమనార్హం. ఈ బియ్యం పూర్తిగా తడిసి పాడైపోయిందని తహసీల్దార్ తెలిపారు. అదనపు బియ్యంపై సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఏపీసీకి నివేదిక అందించామన్నారు. కేజీబీవీ ఎస్ఓపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. -
కేజీబీవీలో అర్ధరాత్రి అలజడి
● రెండంతస్తుల భవనంపై నుంచి పడి గాయపడిన విద్యార్థి ● లోలుగు కేజీబీవీలో ఘటన పొందూరు: అర్ధరాత్రి సమయం.. విద్యార్థులంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. అంతా ఉలిక్కిపడేలా పెద్ద శబ్దం.. వచ్చి చూస్తే ఓ విద్యార్థిని రక్తమోడుతూ కనిపించింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపో యాయి. వెన్నెముకకు తీవ్రమైన గాయమైంది. పొందూరు మండలం లోలుగు కేజీబీవీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కేజీబీవీ పాఠశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సీహెచ్ వందన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రెండతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. పెద్ద శబ్దం కావడంతో సిబ్బంది, విద్యార్థులు లేచి చూసేసరికి తీవ్రంగా గాయాలపాలై కింద పడిపోయి ఉన్న విద్యార్థిని కనిపించింది. వెంటనే విధుల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయురాలు రూపవతి, అకౌంటెంట్ నాంచారమ్మలు ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో అందులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. విద్యార్థిని కాళ్లు రెండూ విరిగిపోవడంతో పాటు వెన్నుపూస కూడా గాయమైనట్లు సమాచారం. ఘటనపై ఎస్ఐ సత్యనారాయణ ఉపాధ్యా యినులు, సిబ్బంది, విద్యార్థినులతో మాట్లాడా రు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు పొందూరు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశా రు. కొన్ని రోజులుగా స్థానిక కేజీబీవీ అనేక విషయాల్లో వివాదాస్పదమవుతుండడంతో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయినులు, సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఎంఈఓ–1 వాగ్దేవికి సమాచా రం ఇవ్వడంతో ఆమె శ్రీకాకుళం రిమ్స్కు వెళ్లి వివరాలు సేకరించారు. పొందూరు: మండలానికి చెందిన రచయిత, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార అవార్డు గ్రహీత వావిలపల్లి రాజారావుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న భక్తి సందేశం కార్యక్రమంలో ప్రసంగించేందుకు టీటీడీ ఆహ్వానం పంపింది. ఈ నెల 30వ తేదీన తిరుమలలోని ఆస్థాన మండపంలో అన్నమయ్య కీర్తనలపై ప్రసంగం ఉంటుంది. -
వంశధారలో మునిగి ప్రధానోపాధ్యాయుడు మృతి
నరసన్నపేట: గోపాలపెంట ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మార్పు నాగేశ్వరరావు (54) ప్రమాదవశాత్తూ వంశధారలో మునిగి మృతి చెందారు. ఇదే గ్రామంలో నాగేశ్వరరావు నివసిస్తుండగా కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వంశధార నదికి స్నానానికి వెళ్లిన ఆయన ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో భార్య రమణమ్మ, కుమారులు సునీల్, సుధీర్లు కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో పరిసరాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయానికి ఒక చోట ఆయన వస్త్రాలు, చెప్పులు కనిపించచడంతో ప్రమాదవశాత్తూ నీట మునిగి ఉంటారని అనుమానించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలించ గా నదిలో నీరు అధికంగా ఉన్న ఒక చోట మృతదేహాన్ని శనివారం సాయంత్రం గుర్తించారు. దీంతో ఒక్కసారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన ఇక్కడ మూడేళ్లుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకుని గ్రామస్తులు కూడా కంట నీరు పెట్టారు. నాగేశ్వరరావు మృతిపై సర్పంచ్ ఎండ కృష్ణవేణి, ఎంపీటీసీ గదిలి మల్లేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు బొబ్బాది ఈశ్వరరావు, తోట భార్గవ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంబరాల సమయం
పాతపట్నం: నీలమణి దుర్గ ఆలయ సన్నిధిలో సంబరాలకు సమయం ఆసన్నమైంది. అమ్మవారిని జిల్లా వాసు లతో పాటు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు పూజిస్తారు. ఆలయానికి దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ పాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఒడి శా పర్లాకిమిడిలో ఉన్న మహారాజులు పరిపాలన కోసం ఈ ప్రాంతం నుంచి టెక్కలిలో ఉన్న కోటకు వెళ్లేవారని ప్రతీతి. 1674 సంవత్సరం ప్రాంతంలో పర్లాకిమిడిని పరిపాలిస్తున్న గజపతి మహారాజుకు చెందిన కూలీలు పొలం దున్నుతుండగా నాగలికి విగ్రహం తగిలి బయటపడిందని, రాజుకు అమ్మవారు కలలో కనిపించగా ఇక్కడ ప్రతిష్టించారనేది స్థల పురాణం. అమ్మవారికి ప్రత్యేక పూజలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి రోజూ అమ్మవారు రోజుకో అవతారంలో కనిపిస్తారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కుంకుమపూజ, కలశపూజ, అష్టోత్తర శతనామపూజలు జరుగుతాయని, సాయంత్రం 3 గంటలకు సహస్రనామపూజ, కుంకుమ పూజ ఉంటాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.వాసుదేవరావు తెలిపారు. దసరా రోజు వాహనాలకు ప్రత్యేక పూజలు అమ్మవారి గుడి ప్రాంగణంలో కొత్తగా కొనుగోలు చేసిన రకరకాల వాహనాలతో పాటు, ఇతర వాహనాలకు దసరా రోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తామని, 22న బాలత్రిపుర సుందరిదేవిగా, 23న గాయత్రి దేవి, 24న అన్నపూర్ణదేవి, 25 కాత్యాయని దేవి, 26న మహాలక్ష్మి దేవి, 27న లలిత త్రిపుర సుందరి దేవి, 28న మహాచండి దేవి, 29న సరస్వతి దేవి (మూలనక్షత్రం), 30న దుర్గాదేవి (దుర్గాష్టమి), అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్ధని, 2న రాజరాజేశ్వరిగా అలంకరణ ఉంటుందని తెలిపారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు 22వ తేదీన సాయంత్రం రాగ సుధా మ్యూజికల్ ఆర్కెస్ట్రా, 23న భక్తి సంగీత విభావరి, అన్నమయ్య కీర్తనలు, 24న రాత్రి 6గంటలకు సినీ భక్తీ సంగీత విభావరి, 25న సాయంత్రం భక్తి సంగీత విభావరి, 26న భరత నాట్యం, కూచిపూడి నృత్య విభావరి, 27న శ్రీ సప్తగిరి సంగీత విభావరి, 28న రాత్రి 6 గంటలకు నరసన్నపేట వారి శ్రీ సీతారామ కల్యా ణం బుర్రకథ, 29న సాయంత్రం భక్తి సినీ సంగీత విభావరి, 30న రాత్రి 8 గంటలకు విజయనగరం వారిచే రేలారే రేలా, అక్టోబర్ 2న సాయంత్రం 5.30గంటలకు అమ్మవారి తిరువీధి, బాణాసంచా, కాళికవేషాలు, మేళతాళాలతో నిర్వహించనున్నారు. పాతపట్నం నీలమణి దుర్గ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి దేవదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాతపట్నం సీఐ ఎన్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కోసం పాతపట్నం, మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు విధులు అందించనున్నారు. – టి.వాసుదేవరావు, కార్యనిర్వాహణాధికారి, పాతపట్నం -
కొత్తమ్మతల్లి జాతరకు సర్వం సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను 23, 24, 25 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయ న, జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించా రు. జాతరకు భద్రతా పరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతర సందర్బంగా కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకు రహదారి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, సెంటర్ డివైడర్ అలంకరణ, విద్యుద్దీపాలు అమర్చినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బయో టాయిలెట్లు, ఆర్టీసీ బస్సులు, వైద్య శిబిరాలు, అన్నదానం, మజ్జిగ పంపిణీ, శోభా యాత్ర వంటి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘నిరసన కొనసాగిస్తాం’
అరసవల్లి: న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఈ మేరకు యాజమాన్యం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే తమ జేఏసీ తరఫున నిరసన కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగ కార్మికులంతా స్పష్టం చేశారు. శనివా రం కూడా విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులంతా దీక్ష చేపట్టారు. అయితే ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు పాల్గొనడం చర్చనీయాంశమైంది. తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని దీక్షలో కూర్చున్న మహిళా ఉద్యోగులు ప్రకటించడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. 22న విద్యుత్ సర్కిల్ కార్యా లయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామని తెలిపారు. -
మండపాలకు ఉచిత విద్యుత్ బురిడీ
అరసవల్లి: జిల్లాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల సంఖ్య 1100పైగానే ఉంటుంది. కానీ మండపాలన్నింటికీ ఉచిత విద్యుత్ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఉచితంగా కరెంటు ఇచ్చిన మండపాల సంఖ్య తెలుసా.. కేవలం 170. స్థానిక రాజకీయ సిఫారసులనే అర్హతగా చూసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి ‘ఉచిత’ భారం పడకుండా తక్కువ సంఖ్యలోనే మండపాల నమోదు సంఖ్య ఉండేలా ముందుగానే జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు దసరా మండపాలకూ అదే సూత్రం వర్తించేలా పనిచేస్తున్నారు. విద్యుత్ శాఖకు రూ.7.71 లక్షల బిల్లులు వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ‘అనుమతి’ పొందిన మొత్తం 170 మండపాల్లో విద్యుత్ వినియోగ లెక్కలు పరిశీలిస్తే.. మొత్తం శ్రీకాకుళం డివిజన్లో 36, పలాస డివిజన్లో 78, టెక్కలి డివిజన్లో 56 మండపాలనే గుర్తించారు. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం ఈ మొత్తం 170 మండపాల నుంచి రోజుకు 12,240 యూనిట్లు చొప్పున తొమ్మిది రోజులకు గాను మొత్తం 1,10,160 యూనిట్లు విద్యుత్ వినియోగించినట్లుగా గుర్తించారు. ఈ లెక్కన వినియోగ విద్యుత్ బిల్లుగా రూ.7,71,120 వచ్చినట్లుగా లెక్కలు కట్టారు. ఈ మేరకు ఈ ఉచిత భారమంతా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపిడిసిఎల్ డిస్కం)పై పడనుంది. అయితే ఈ రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే డిస్కంకు చెల్లించాల్సి ఉంది. నేటి నుంచి దసరా మండపాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా వినాయక చవితితో పాటు దసరా నవరాత్రులకు కూడా మండపాల నిర్వహణకు ‘ఉచిత’ విద్యుత్ విధానాన్ని అమలు చేయనున్నారు. దేవీశరన్నవరాత్రులు నేటితో ప్రారంభం కానున్న నేపధ్యంలో అనుమతుల కోసం జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి యువకులు, నిర్వాహక ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 30 మండలాల్లో కనీసంగా 300 నుంచి 500 వరకు దేవీనవరాత్రులను జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నింటికి ఉచిత విద్యుత్ వస్తుందో వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దసరా నవరాత్రుల నిర్వహణ మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయనున్నాం. సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు పొందిన మండపాలకు మాత్రమే ఈ రాయితీ ఉంటుంది. వినాయక చవితికి జిల్లాలో 170 మండపాలకు ఉచిత విద్యుత్ రాయితీని అమలు చేశాం. – నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ, విద్యుత్ శాఖ నేటి నుంచి దసరా నవరాత్రుల మండపాలకు అనుమతులు ప్రారంభం దసరా మండపాలకూ ఉచిత విద్యుత్ గణేశ్ చవితికి 1100 మండపాలు పెడితే 170 మండపాలకే ఉచిత విద్యుత్ డిస్కంకు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము రూ.7.71 లక్షలు -
దస్తావేజు లేఖర్ల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 2.0 ప్రైమ్ కార్డు విధానంలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికి కూటమి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందని, ఓటీపీలు పలుమార్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు కోరారు. ఈ మేరకు పెన్డౌన్లో భాగంగా జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులకు, స్టాంప్ వెండర్లకు, దస్తావేజు లేఖరులకు న్యాయం చేయాలని, సజావుగా సులభతరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కింతలి రమణారావు, శ్రీనివాస పాత్రో, దామోదర మెహర్, కె.దుర్గాప్రసాద్, తాళ్లవలస కుమారస్వామి, తొగరాం భువనమోహన్, చింతనిప్పుల అప్పలరాజు, అన్నెపు సీతారాం, అల్లు రాజారావు, బలగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంత్యోదయ కార్డులో అక్రమాలు
● గిరిజనుడి రేషన్కార్డులో చేరి బియ్యం బుక్కేస్తున్న తెలుగుదేశం నేత ● లబోదిబోమంటున్న బాధితుడు నందిగాం: తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ రేషన్ కార్డులో అక్రమంగా తన పేరు చేర్చి ఆ కార్డుకు వచ్చే బియ్యాన్ని బుక్కేస్తున్న తెలుగుదేశం నాయకుడి లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నందిగాం మండలం హర్షబడ పంచాయతీ ముకుందాపురం గ్రామానికి చెందిన సవర మన్మధరావు అనే గిరిజనుడికి వైఏపీ 013064000173 నంబర్తో నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ రేషన్ కార్డు, 2801209354 నంబరుతో రైస్ కార్డు ఉండేది. దీని ద్వారా ప్రతి నెలా అందే 35 కిలోల బియ్యంతో కుటుంబం నెట్టుకొచ్చేది. 2017లో మన్మధరావు ఉపాధి కోసం చైన్నె వలస వెళ్లి అక్కడ నాలుగు నెలలు పని చేసి మరలా గ్రామానికి వచ్చాడు. రేషన్ కోసం డీలర్ను సంప్రదిస్తే కార్డు పరిధి మారిపోయిందని చెప్పడంతో బడగాం డీలర్ను సంప్రదించాడు. ఆ నంబరు కార్డులో బడగాం పంచాయతీ గనియాపేటకు చెందిన తెలుగుదేశం నాయకుడు గరుడాచలం తులసీదాస్ చేరి ఉన్నాడనే విషయం తెలిసింది. దీంతో తులసీదాస్ ఇంటికి వెళ్లి అంత్యోదయ కార్డులో తన ప్రమేయం లేకుండా చేరడం, డిపో మార్చడంపై నిలదీశాడు. అంతా నా ఇష్టమని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ మన్మధరావును వెల్లగొట్టాడు. ఎన్నిసార్లు అడుగుతున్నా కార్డు ఇవ్వకుండా బెదిరిస్తుండటంతో శనివారం నందిగాం డిప్యూటీ తహసీల్దారు శంకరరావుకు ఫిర్యాదు చేశాడు. పరిశీలించి న్యాయం చేస్తామని డీటీ హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ రైస్కార్డులో కుటుంబపెద్దగా గరుడాచలం తులసీదాస్ ఉంటూ కుటుంబ సభ్యునిగా సవర మన్మధరావు పేరు ఉండటం గమనార్హం. -
బకాయిల భారం భరించలేం!
● రేపటి నుంచి మూతపడనున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ● ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వ తీరుకు నిరసనగా తరగతుల బంద్ శ్రీకాకుళం న్యూకాలనీ: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నుంచి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడనున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పాఠశాల విద్యను గాలికొదిలేసింది. ఇంటర్మీడియెట్ విద్యను పెద్దగా పట్టించుకున్నదాఖలాలు కనిపించడంలేదు. ఇక డిగ్రీ కాలేజీ విద్యపై ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మొన్నటి వరకు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను సైతం వెలువరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇతర వృత్తివిద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. గత 16 నెలలుగా సీఎంను, డిప్యూటీ సీఎం, విద్యాశాఖామంత్రును పలుమార్లు కలిసినా అతీగతీ లేదని సంఘ నాయకులు వాపోతున్నారు. నిర్వహణ భారం భరించలేక.. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయలేక, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక కాలేజీల నిర్వహణ భారంగా మారింది. భవనం అద్దెలు, అధ్యాపకుల జీతాలు, కరెంట్బిల్లులు, అఫ్లియేషన్ ఫీజులు, కళాశాలల రోజువారి నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను భయపెట్టి, బాధపెట్టి సాధించిందేమీలేదని భావించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పందించే వరకు కాలేజీల్లో తరగతులు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈనెల 14న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ నెల 22 నుంచి ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూడపడనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మూసివేస్తామని సంఘ నాయకులు స్పష్టంచేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధుల విషయమై ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసిన ఉపయోగం లేకపోయింది. విద్యార్థులను ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేయలేక, ప్రభుత్వం నిధులు విదల్చక కాలేజీల నిర్వహణభారం కష్టంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంతోపాటు శ్రీకాకుళం జిల్లాలోను ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో క్లాసులను నిర్వహించకూడదని నిర్ణయించాం. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని బకాయి నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలి. – పొన్నాన జయరాం, ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 100 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 16 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మినహా మిగిలిన 84 ప్రైవేటు కాలేజీలే. వీటిల్లో ఫింక్షనింగ్ జరుగుతూ.. అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీలు 76 వరకు ఉన్నాయి. వీటిలో 30 వేలు మంది వరకు చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2024–25 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ ఇయర్ బ్యాచ్కు రూ.45 కోట్లు, అంతకుముందు మూడు క్వార్టర్ల పెండింగ్ మరో రూ.35 కోట్లు కలిపి రూ.80 కోట్ల మేర ఒక్క డిగ్రీ విద్యకే పెండింగ్ ఉన్నట్టు ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. -
కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి రేగ సురేష్కుమార్ అన్నారు. మూడు వారాలుగా జిల్లాలోని రణస్థలం, జలుమూరు, నరసన్నపేట, నివగాం, ఆమదాలవలస, కొత్తూరు, హిరమండలం, కళింగపట్నం తదితర కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శనివారం కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీచేశారు. క్వార్టర్లీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి జవాబుపత్రాలను పరిశీలించారు. అంతకుముందు కళాశాలకు చెందిన సైన్స్ ల్యాబ్, నాడు–నేడు పనులపై ఆరా తీశారు. సకాలంలో సిలబస్ పూర్తిచేయాలి.. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కీర్తి తవిటినాయుడు, లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ సకాలంలో పూర్తిచేయాలని, ముఖహాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, శతశాతం విద్యార్థులకు కాలేజీలకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, తరచూ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని, అవసరమైతే పిల్లల ఇళ్లకు వెళ్తుండాలని సూచించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ప్రిన్సిపాల్తో కలిపి డీవీఈఓ స్వయంగా వడ్డించారు. కళాశాలలో వసతులు, సౌకర్యాలు, విద్యాప్రమాణాలు, సిబ్బంది పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కళాశాల ఏజీఎంసీ సనపల షణ్ముఖరావు, ఎన్.ధర్మారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ను పరిశుభ్రంగా ఉంచుదాం
శ్రీకాకుళం రూరల్: భావితరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిద్దామని, సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచుదామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రత దినోత్సవం శనివారం నిర్వహించారు. పెదగనగళ్లవానిపేట బీచ్ పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి చెత్తాచెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీచ్కు వచ్చిన వారు సైతం తమవెంట చిన్నపాటి డస్ట్బిన్ను తీసుకురావాలన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కింద జిల్లాలో ఇప్పటికే 912 గ్రామాలకు గాను 221 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వ్యర్థాలు సముద్రంలోకి నేరుగా విడిచిపెట్టడం వల్ల నీరు కలుషితమవుతోందన్నారు. మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, డీపీఓ కె.భారతి సౌజన్య, తహశీల్దార్ గణపతిరావు, ఎంపీడీఓ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. -
తల్లీబిడ్డకు ప్రాణంపోశారు
టెక్కలి/మందస: పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన గర్భిణికి ప్రసవం చేసి తల్లీబిడ్డలకు 108 సిబ్బంది ప్రాణం పోశారు. మందస మండలం బంసుగాం గ్రామానికి చెందిన సవర రుక్మిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్కు రిఫర్ చేశారు. శనివారం వేకువజామున 108 వాహనంలో గర్భిణిని తరలిస్తుండగా కోటబొమ్మాళి సమీపంలో పురిటి నొప్పులు అధికం కావడంతో 108 ఈఎంటీ దేవాది శ్రీనివాసరావు, పైలట్ మూగి దుర్గారావు తదితరులు వైద్య సేవలు అందజేసి ప్రసవం చేశారు. రుక్మిణి పాపకు జన్మనిచ్చింది. అయితే పాపలో చలనం లేకపోవడంతో సీపీఆర్ చేశారు. దీంతో చిన్నారి ఊపిరితీసుకోవడం ప్రారంభించింది. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది చేసిన సేవలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గాలికుంటు నివారణకు చర్యలు నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పశు సంవర్థకశాఖ జేడీ రాజగోపాల్ అన్నారు. ఉర్లాం పశువైద్య కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3.30 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు నిర్వహించే ఈ టీకాల కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం జిల్లాలో ప్రారంభించామని, ఇప్పటి వరకూ 20 వేల పశువులకు టీకాలు వేశామన్నారు. ఆస్పత్రుల వారీగా పశువులకు టీకాలు వేస్తున్నామని చెప్పారు. ఉర్లాం పశువైద్య కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈయన వెంట డీడీ బి.గణపతిరావు ఉన్నారు. జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు లక్ష్మునాయుడు ఎచ్చెర్ల : జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికై న స్థానిక రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ రెడ్డి లక్ష్మునాయుడును ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ శనివారం అభినందించారు. చండీగఢ్లో డిసెంబర్ 14, 15న జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్మునాయుడును ఆదర్శంగా తీసుకుని ఫిట్నెస్ సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వో ముని రామకృష్ణ, అకడమిక్స్ డీన్ శివరామకృష్ణ, డాక్టర్ వాసు, గేదెల రవి, గణేష్, సాగర్, నూకేశ్వరరావు, రాకోటి శ్రీనివాసరావు, సాయిరాజు, పీఆర్వో మామిడి షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు. మూడు పూరిళ్లు దగ్ధం జి.సిగడాం: జాడ గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు కాలిపోయాయి. గ్రామానికి చెందిన చల్లా అప్పయ్యమ్మ, చల్లా ఆదినారాయణ, పులపా నర్సింహులు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. విలువైన సామగ్రి, తిండి గింజలు పూర్తి కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 4లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పంచాయతీ కార్యదర్శి జాడ వెంకటన్నాయుడు, వీఆర్ఓ సంతోష్ కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట గార: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. గార మండం కె.సైరిగాం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. శనివారం శ్రీకూర్మంలోని ఓ ప్రైవేటు కల్యాణ మంటపంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ‘క్యాడర్ తో లీడర్’ కార్యక్రమంలో భాగంగా ఏడు పంచాయతీల క్యాడర్తో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. కె.సైరిగాం పంచాయతీ కార్యకర్తల సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు, తర్వాత చేరిన నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే వారించే ప్రయత్నం చేసినా నాయకులు తగ్గకపోవడం గమనార్హం. -
● అయిన వారికే యూరియా!
ఇచ్ఛాపురం రూరల్: యూరియా అధికార పార్టీ వారికి, వారికి అయిన వారికి మాత్రమే దక్కుతోందని కొళిగాం, కీర్తిపురం, పాయితారి, బొడ్డబడ పంచాయతీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత వచ్చిన యూరియాను శుక్రవారం కొళిగాం రైతు సేవా కేంద్రంలో పంపిణీ చేస్తుండటంతో వందలాది మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. అయితే గతంలో యూరియాను తీసుకువెళ్లిన వారే మళ్లీ పేర్లు మార్చి తీసుకువెళ్తున్నారని, కూటమి నాయకులు ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వం మెడలు వంచే వరకు
నిధులు లేవుగా..రాష్ట్ర పండుగకు నిధులు లేవు. కోటమ్మ తల్లి ఉత్సవాల తీరు ఇది. –IIలో● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ● వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం ‘చలో మెడికల్ కాలేజీ’ లో పాల్గొన్న జిల్లా నాయకులుసాక్షి, పార్వతీపురం మన్యం:రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు అధ్యక్షతన పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కదం తొక్కాయి. పేదలకు వైద్య విద్యను దూరం చేసే సర్కారు కుటిలత్వాన్ని కడిగి పారేశాయి. జిల్లా నుంచి కూడా నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పార్వతీపురం వైద్యకళాశాలకు అనుబంధంగా ఇక్కడి జిల్లా ఆస్పత్రిని అప్గ్రేడ్ చేశారని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇదంతా ప్రజలకు చెందాల్సిన ఆస్తి అని, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఎస్టీ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవేనని తెలిపారు. అంతా పేద గిరిజన, దళిత వర్గానికి చెందిన వారేనని, వీరందరికీ కష్టం వస్తే ఎక్కడో ఉన్న కేజీహెచ్కు వెళ్లాల్సిందేనని చెప్పారు. వీరికి మంచి చేయాలని జగన్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొస్తే.. అది కూడా కబ్జాచేసి, ప్రైవేట్కు కట్టబెట్టేందుకు సిద్ధమైన దుర్మా ర్గ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ఇక్కడున్న గిరిజన శాఖా మంత్రికి ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను చూస్తే జాలేస్తోందన్నారు. జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదని అంటున్నారని, పార్వతీపురం మెడికల్ కాలేజీకి వచ్చి జీఓలు చూడాలని సూచించారు. మంత్రి పదవులు కాపాడుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మంత్రులను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసి, వైఎస్సార్సీపీపై విమర్శలకు దిగాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెడలు వంచే వరకూ మెడికల్ కళాశాల పరిరక్షణ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
మందుబాబులకు సుఖీభవ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో వింత పరిస్థితి నడుస్తోంది. పేదల కుటుంబాలను నాశనం చేసే మద్యం ఎప్పుడు కా వాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గరుండి మరీ పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చింది. కానీ ఎరువు కావాలంటే మాత్రం నానా యాతన పడాల్సి వస్తోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడినా బస్తా ఎరువు సర్కారు ఇవ్వలేకపోతోంది. పొలంలో పనులన్నీ మానుకుని చీటీల కోసం ఓ రోజు, ఎరువు కోసం మరో రోజు నిలబడినా దొరుకుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది. ఈ రెండింటిలోనూ అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న వైనాలు కనిపిస్తున్నా యి. ఒకవైపు యూరియాను పక్కదారి పట్టించి, బ్లాక్లో అమ్ముకుని లబ్ధి పొందుతుండగా, మరోవైపు ఎంఆర్పీకి మించి మద్యాన్ని అమ్ముతూ, ముడుపులు తీసుకుంటూ కోట్లలో ఆర్జిస్తున్నారు. సంపాదనే ధ్యేయం.. రైతుల సమస్యలు, ప్రజల ఆరోగ్యం కూటమి ప్రభుత్వానికి, పాలకులకు పట్టడం లేదు. గుడి, బడి తేడా లేకుండా మద్యం షాపులు పెట్టి, పర్మిట్ రూమ్లను ప్రోత్సహించి, బెల్ట్షాపులు నడిపి ఫుల్గా జనాల్ని తాగిస్తున్నారు. ప్రజల ఆరో గ్యాన్ని దెబ్బతీసి దాని ముసుగులో ఎంఆర్పీకి మించి విక్రయాలు, నెల వారీ ముడుపులు తీసుకుని రూ.కోట్లకు పడగలెత్తున్నారు. టార్గెట్లు పెట్టి, ఇంటికి దగ్గరలో సరఫరా చేసి మద్యం విక్రయాలను భారీగా పెంచుతున్నారు. ఏడాది కాలంలో 14లక్షలకు పైగా ఇండియన్ మేడ్ లిక్కర్ కేసులు, 4లక్షల 59వేల 81బీరు కేసులు విక్రయాలు జరిగాయంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో అర్థం చేసు కోవచ్చు. రైతులపై శ్రద్ధ ఏదీ..? ప్రభుత్వం మద్యం అమ్మకాలు, లాభాలు, ముడుపులపై చూపించిన శ్రద్ధ రైతులపై చూపించలేదు. యూరియా కొరత జిల్లాలో తీవ్రంగా ఉన్నా సంబంధిత ప్రజాప్రతినిధులు కనీసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా చేయలేదు. అరకొర యూ రియా సరఫరా చేసి తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రైతులను క్యూలలో వదిలేశారు. జిల్లాలో 3,68,057మంది రైతులు ఉన్నారు. వరి, చెరుకు, మొక్కజొన్న, ప్రత్తి, పెసర, కంది తదితర పంటలు 4లక్షల ఒక వెయ్యి 472ఎకరాల్లో సాగుతున్నట్టు అధికారికంగా చూపించారు. ఇక, తోట పంటలైతే మరో లక్షా 20వేల వరకు వరకు ఉన్నాయి. వీటిన్నింటికీ 50వేల మెట్రిక్ టన్నులకు యూరియా అవసరం ఉంది. కానీ, ప్రభుత్వం చచ్చీ చెడీ సెప్టెంబర్ 19వ తేదీ నాటికి 30,646 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు చెబుతోంది. కానీ ఇంకా రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో అరకొర యూరియా వచ్చిందనుకుంటే దాన్ని కూడా పక్క దారి పట్టించి, బ్లాక్లో విక్రయించుకున్నారు. ఒక్కో నాయకుడు ఎంత దాచుకున్నారో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లే తేటతెల్లం చేశారు. మండల పరిషత్ సమావేశాల్లోనైతే ప్రతి పక్షాల సభ్యులు ఏకంగా నిలదీశారు. -
మాటకు కట్టుబడి
● ఊరి బడికి ఊపిరి పోసిన గ్రామస్తులు ● సర్కారు సాయం కోసం ఎదురుచూపులు కవిటి: మండలంలోని దూగాన పుట్టుగ వాసులు ఊరి బడికి ఊపిరి పోశారు. ప్రభుత్వ పోకడలతో ఈ బడి ఉనికే ప్రశ్నార్థకమైన వేళ పిల్లలందరినీ తీసుకువచ్చి బడిలో చేర్చి మళ్లీ పాత వైభవాన్ని తీసుకువచ్చారు. గ్రామస్తులు ఎంత చేసినా ప్రభు త్వ సాయం అందకపోతే బడి పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. వివరాల్లోకి వెళితే.. దూగానపుట్టుగలో ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు అప్పర్ ప్రైమరీ బడిగా ఉండేది. 6,7 తరగతులు సమీపంలోని పాఠశాలలో కలిపేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలగా మిగిలిపోయింది. దీని కొనసాగింపు కూడా ప్రశ్నార్థకమైంది. ఈ దశలో ఊరివారంతా సమావేశమయ్యారు. బడిని కాపాడుకోవాల నే లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను తీసుకువచ్చి ఈ బడిలో జాయిన్ చేశారు. ఒకేసారి 40 మంది చేరడంతో బడిలో పిల్లల సంఖ్య 59 కు చేరుకుంది. ఇంత మంది పిల్లలు ఉంటే నిబంధనల ప్రకారం దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా గుర్తించాలి. బేసిక్ ప్రైమరీ స్కూల్ అయితే ముగ్గురు ఉపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ స్కూల్ అయితే ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఇది ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలగానే ఉంది. ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇటీవల బదిలీల్లో వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ ఉపాధ్యాయుడు వచ్చినంత వరకు ఆయన ఇక్కడే ఉండాలి. టీచర్ ఒక్కడే కావడంతో గ్రామస్తుల ఔదార్యంతో ముగ్గురు వలంటీర్లను నియమించారు. డీఎస్సీ నోటిఫికేషన్ సమయానికి ఈ బడిలో ఉన్న పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఒక్క టీచర్ పోస్టు మాత్రమే కేటాయించే వీలుంది. ప్రస్తుతం ఉన్న 59 మందికి ఆ ఒక్క ఉపాధ్యాయు డు సరిపోడు. మోడల్ ప్రైమరీ స్కూల్ అర్హత ఉన్న ఈ స్కూల్కు నలుగురు ఎస్జీటీలతో పాటు ఓ హెచ్ఎం ఉండాలి.ఆ గుర్తింపు రాకుంటే పిల్లలు నష్టపోతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఈ బడిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. టీచర్ను నియమించాలి ఈ బడిని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రైవేటు బడుల్లో ఉన్న పిల్లలను ఇక్కడకు తీసుకుచ్చాం. ఉపాధ్యాయుల్ని నియమించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. – దూగాన భద్రాచలం, సర్పంచ్, దూగానపుట్టుగ -
సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు
నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన గట్కా పోటీ(యుద్ధ విద్య ) లో సత్తా చాటారు. 23 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది స్వర్ణ పతకాలు, 12 మందికి రజత పతకాలు, మరో ముగ్గురికి కాంస్య పథకాలు వచ్చాయని హెచ్ఎం వకులా రత్నమాల తెలిపారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రా లయాలా కళాశాల్లో ఈ నెల 13, 14 తేదీల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. వీరిని శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, ఎంఈఓ దాలినాయుడు, విద్యా కమిటీ చైర్మన్ శాంతా నాగరాజులు అభినందించారు. -
మండల స్థాయిలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించాలి
శ్రీకాకుళం: జిల్లాలో సబ్జెక్టు కాంప్లెక్స్ను మండల స్థాయిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ స్థాయిలో సబ్జెక్టు కాంప్లెక్స్ నిర్వహించడం వల్ల ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యా విషయాలపై చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తే ఎక్కువ సంఖ్యలో చర్చించుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. 2025 పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్లను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్, జి.చిన్నికృష్ణ, ఎస్.రాజు, బి.జి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళమ కల్చరల్ : ఇచ్ఛాపురం మెజిస్ట్రేట్ పెదసింగు పరేష్కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మీ (100) అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి చెందారు. ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో నేత్రదానానికి మెజిస్ట్రేట్ పరేష్కుమార్, సీహెచ్.సురేష్, ఎం.ఢిల్లీరావులు ముందుకువచ్చారు. భౌతికకాయాన్ని స్వగ్రామం మచిలీపట్నానికి తరలించే ముందు విషయాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేంద్రర్రెడ్డి రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, చిన్ని కృష్ణలు శ్రీకాకుళం వద్ద ఆమె కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సభ్యులు దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబరుకు తెలియజేయాలని కోరారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించి వినతులు స్వీకరించారు. 40 వినతులు రాగా.. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హ్యాండ్ స్టిక్కులు, వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జెడ్పీ సీఈఓ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి ఎ.డి. శ్రీధర్ రాజా, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్కూల్గేమ్స్ అథ్లెటిక్స్ పోరుకు సిద్ధంశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా శనివారం జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. డివిజన్ స్థాయిలో అండర్–14, 17, 19 విభాగాల్లో ఎంపికై న బాలబాలికలు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరికి వేర్వేరుగా రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ అధికారుల నేతృత్వంలో రన్నింగ్ ట్రాక్, ఇతర కోర్టులను సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దారు. బేస్బాల్ ఎంపికలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సాఫ్ట్బాల్ అండర్–14,17,19 వయో విభాగాల్లో ఎంపికలను పూర్తిచేశారు. మరోవైపు, పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. -
హైవే పెట్రోలింగ్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం నుంచి కాశీబుగ్గ జాతీయ రహదారి–16 మార్గమధ్యంలో ఉన్న హైవే పెట్రోలింగ్ వాహనాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. నిరంతర వాహన తనిఖీలు చేయాలని, అనుమానాస్పద వాహనాలు, మద్యం సేవించి నడిపేవారిని, నిబంధనలు ఉల్లఘించేవారిని, గంజాయి, పశువులు అక్రమ రవాణా చేసే వాహనాలను గుర్తించి ఆ పరిధి స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా లారీలు, ఇతర భారీ వాహనాలు పార్కింగ్ లేకుండా చూడాలని, రాంగ్రూట్లో వచ్చే వాహనాలను నియంత్రించాలన్నా రు. వేకువజామున టోల్ప్లాజా, చెక్పోస్టుల వద్ద చోదకులకు ఫేష్వాష్ చేయించాలన్నారు. -
అంబేడ్కర్ వర్సిటీకి గ్రీన్ ఆడిట్ గుర్తింపు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి మొదటిసారి గ్రీన్ ఆడిట్ గుర్తింపు లభించింది. ఈ మేరకు జీసీ కన్సల్టెంట్ సర్వీసెస్ (గోరఖ్పూర్– ఉత్తరప్రదేశ్) వర్శిటీకి సమాచారం అందజేసింది. వచ్చే ఏడాది నాక్ పరిశీలనకు సన్నద్ధమవుతున్న అంబేడ్కర్ వర్సిటీ పలు గుర్తింపుల కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా జీసీ కన్సల్టెంట్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ విశాశ్ శ్రీవాత్సవ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూలై 22, 23 తేదీల్లో క్యాంపస్లో పర్యటించి వర్శిటీలోని బోధన, పరిపాలన, పరిశోధన, సేవలు, సౌకర్యాలు, పర్యావరణ సంబంధిత అంశాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు వర్శిటీ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ప్రశంసిస్తూ గ్రీన్ ఆడిట్ యూనివర్శిటీగా గుర్తింపునిచ్చారు. అదే విధంగా, క్వాలిటీ, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్, మేనేజ్మెంట్ సిస్టమ్స్ కేటగిరీల్లో 2025 విద్యాసంవత్సరానికి ఐఎస్ఓ గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ సైతం జారీచేశారు. వర్శిటీ ఐక్యూఏసీ విభాగం ఈ పర్యటనను పర్యవేక్షించి వారికి అవసరమైన పూర్తిస్థాయి సమాచారం అందజేశారు. కాగా వర్శిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ రెడ్డి తిరుపతిరావు, సభ్యులు ఎన్.శ్రీనివాస్, జి.కిరణ్కుమార్, పి.మాధవరావులను వర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజినీ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. నాక్ గుర్తింపు మరోసారి పొందేందుకు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఆయా విభాగాలు పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎస్.ఉదయభాస్కర్, ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని, ఎస్ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుంది
● మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం చీకటి అధ్యాయం ● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: పేదవాడికి వైద్య విద్యను దూరం చేయడం ప్రభుత్వానికి తగదని, పేదల ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగలక మానదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్వతీపురంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జిల్లా యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శ్రీ కాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయల్దేరారు. నేతలంతా ఒకచోట చేరిన సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నేతలు మాట్లాడారు. మాజీ స్పీకర్ తమ్మి నేని సీతారాం మాట్లాడుతూ పేదల పొట్టకొట్టడం చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఆదాయ అన్వేషణలో విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటుకు తాకట్టు పెట్టడం సమంజసం కాదన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పేదలకు అండగా వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉంటారని తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడు తూ చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముడుపోయారని విమర్శించారు. అందుకే అన్ని రంగాలను ప్రైవేటుపరం చేసేందుకు పావులు కదుపుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆమదాలవలస పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి డౌన్లోగల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ మన్యం జిల్లా(పార్వతీపురం)మెడికల్ కళాశాలను సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)దుంపల లక్ష్మణరావు, తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర యువజన విభా గం అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బొడ్డేపల్లి రమేష్కుమార్, గుమ్మడి రాంబాబు, ఇంటలెక్చువల్ ఫామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ధర్మాన రామ్ మనోహ ర్ నాయుడు, కోట గోవిందరావు, జిల్లా యువజన అధ్యక్షుడు మార్పు పృథ్వీ, ముత్తాడ విజయ్ కుమా ర్, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, ముఖ్యనాయకులు పిన్నింటి సాయి కుమార్, గేదెల పురుషోత్తం, రౌతు శంకర రావు, సీపాన రామారా వు, బొడ్డేపల్లి నారాయణరావు, దుంపల శ్యామలరావు, టోంపల సీతారాం, రామకృష్ణ, కూన రామ కృష్ణ, సిస్టు గోపి, చిన్ని జోగారావు, కామేశ్వరి, మామిడి కిరణ్, అత్తులూరి రవికాంత్, బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరావు, మామిడి కిరణ్, పొన్నాడ చిన్నారావు, చిన్ని జోగారావు, తంగి అప్పన్న తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్నతో ఇథనాల్ ఉత్పత్తి
రణస్థలం: మొక్కజొన్న నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేయడం ద్వారా సాగు చేసే రైతుల ఆదాయం మెరుగుపడుతుందని పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ.సుధీర్ అన్నారు. లావేరు గ్రామంలో పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం, పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా మొక్కజొన్న వంటి పునరుత్పాదక వనరులతో ఇంధనం ఉత్త్పత్తి చేస్తే పర్యావరణానికి మేలు కలగడమే కాక, మొక్కజొన్నకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని చెప్పారు. మొక్కజొన్న విత్తే సమయంలో ఎరువులు వేయడం లేదని, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువుల వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అయితే మోతాదుకు మించి నత్రజని ఎరువులు వినియోగిస్తే సాగు ఖర్చులు పెరగడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మొక్కజొన్న పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూ సారం క్షీణిస్తుందని, దానికి బదులు పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్.హరిబాబు, సీనియర్ మేనేజర్ పి.తవిటినాయుడు, పెద్దాపురం పరిశోధన స్థానం సిబ్బంది హఫీజా, సమన్వయకర్తలు ఎస్.సాయిదుర్గ, ఐ.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జయకేతనం ఎగురవేసి జిల్లా కీర్తిప్రతిష్టతలను చాటిచెప్పాలని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు శుక్రవారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రికార్డుస్థాయిలో 300 మంది వరకు బాలబాలికలు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కె.డి.పాలెం వేదికగా అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఏపీ రాష్ట్రస్థాయి బాలబాలికల సబ్–జూనియర్స్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్–2025 పోటీలు జరగనున్నాయని సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బి.వి.రమణ, కె.మాధవరావు, ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, బొడ్డేపల్లి సురేష్కుమార్, ఎం.ఆనంద్ కిరణ్, అన్నెపు రాజగోపాల్, ఎ.డిల్లేశ్వరరావు, పెంటయ్య, పి.రమేష్, ఎస్వీ రమణ, మహంతి, మల్లేశ్వరరావు, తోటారావు, మోహనబాబు, ఐ.గౌరి, వెంకటరమణ, నాగు, హరికృష్ణ, అఖిల్, పీడీ పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పండుగ
అరసవల్లి: కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలపై పెడుతున్న శ్రద్ధ నిధులు మంజూరు చేయడంలో చూపించడం లేదు. జిల్లాలో గత ఏడాది నుంచి రథసప్తమితో పాటు కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి సంబరాల ఉత్సవాలను రాష్ట్ర పండుగలంటూ ప్రకటించినా ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చడం లేదు. రాష్ట్ర పండుగలంటూ ప్రకటనలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రచారాలకు దిగుతున్నారు తప్ప ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా నిధులివ్వం.. సమీపంలో ఉన్న పెద్ద ఆలయాల నిధులను వెచ్చించి పండుగ చేస్కోండి..’ అంటూ అధికారిక ఉత్తర్వులు మాత్రం జారీ అయ్యాయి. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అందునా.. శతాబ్ది సంబరాల పేరిట ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి ఆర్ధిక సహకారం ఉండదని తేల్చేసింది. దీంతో పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా సర్కార్ తీరుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే ఈఏడాది రథసప్తమి మహోత్సవాలను కూడా తొలిసారిగా రాష్ట్ర పండుగ చేస్తున్నామని ప్రకటించి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు. రాష్ట్ర పండుగ అంటూ..అలాగే ‘ప్రసాద్’ స్కాం వచ్చేస్తుందంటూ...ఆలయ పరిసరాల్లో ఉన్న అన్ని కట్టడాలను కూల్చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అరసవల్లి ఆలయ పరిసరాలన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మళ్లీ అరసవల్లి నుంచే.. రాష్ట్ర పండుగంటూ కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి ఆలయ శతాబ్ది సంబరాలను నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో గౌరవ సాంప్రదాయాల భారమంతా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయ నిధులపై పడింది. గత ఏడాది కూడా ఇలాగే అరసవల్లి నుంచే సంప్రదాయక ఖర్చులన్నీ వెచ్చించింది. మళ్లీ ఇప్పుడు కూడా ఈ కొత్తమ్మతల్లి సంబరాల ప్రారంభ ఖర్చు, సంప్రదాయక ప్రక్రియలు, పట్టువస్త్రాలు, ప్రసాదాల ఖర్చు అంతా అరసవల్లి ఆలయంపైనే పడనుంది. అరసవల్లి ఆలయ డిప్యూటీ కమిషనర్/ఈఓ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమించి కొత్తమ్మతల్లి అమ్మవారి సంబరాల ప్రారంభ రోజున సంప్రదాయక ఉత్సవ నిర్వహణ, ప్రోటోకాల్తో పాటు పట్టువస్త్రాల సమర్పణ, గౌరవ లాంఛనాలు, ప్రసాదాల భారమంతా ఆదిత్యాలయ నిధుల నుంచే ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పండుగలంటూ నిధులివ్వకపోవడంపై గతేడాది కొత్తమ్మతల్లి సంబరాల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తమ్మతల్లి ఉత్సవాలకు ఈ ఏడాది కూడా అరసవల్లి నుంచి పట్టు వస్త్రాలు, ప్రసాదాలను అమ్మవారికి సమర్పించనున్నాం. రాష్ట్ర పండుగగా కొత్తమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చర్యలు చేపడుతున్నాం. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఈఓ, సూర్యనారాయణ స్వామి ఆలయం, అరసవల్లి ఒక్క రూపాయి కూడా విదల్చని సర్కార్ కొత్తమ్మతల్లి సంబరాల భారం మళ్లీ అరసవల్లికే.. ఆదిత్యుని నిధులతోనే పట్టువస్త్రాల సమర్పణ -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం
● రిలే దీక్షలకు దిగిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు అరసవల్లి: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు మొండివైఖరి వీడి విద్యుత్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం కూడా రిలే దీక్షలను కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు రమేష్, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ఇచ్ఛాపురం :అప్పుల బాధ భరించలేక ఇచ్ఛాపురంలోని 17వ వార్డు సంతపేటకు చెందిన కర్రి నాగరాజు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగరాజు గతంలో లారీ ట్రాన్స్పోర్టు వ్యాపారం నిర్వహించేవాడు. వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోవడంతో లారీలు అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం తన ఇంటి మేడపైన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సచివాలయం ఉద్యోగుల సమ్మె నోటీసు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు సమ్మె నోటీసు అందజేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల ని, రాజకీయ, పని ఒత్తిళ్లు తగ్గించాలని కోరారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె నోటీసులు అందజేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా మార్చి వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం బాధాకరమని అన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఉత్తరాంధ్ర సచివాలయ ఉద్యోగుల జేఏసీ కోఆర్డినేటర్ కూన వెంకట సత్యనారాయణ, జిల్లా జీఎస్డబ్ల్యూఎస్ జేఏసీ నాయకులు సంజీవ్, శరత్ కుమార్, చంద్ర మౌళి, సూర్య భర త్, సాయి కుమార్ తదితరులు ఉన్నారు. నేటి నుంచి డాక్యుమెంట్ రైటర్ల పెన్డౌన్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు శుక్రవారం, శనివారం పెన్డౌన్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్యుమెంట్ తయారుచేసినప్పుడు మొదలుకుని అన్ని విభాగాల్లో ఓటీపీ వ్యవస్థ రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డాక్యుమెంట్ ఫీడింగ్ చేసినప్పుడే పాన్కార్డు, ఆధార్కి వెరిఫికేషన్తో ఓటీపీలు వస్తున్నాయని, కొంతమంది చదువులేని వారుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో అదనపు పనిభారం పెరిగిపోతోందని తెలిపారు. ప్రైమ్ 2.0 చేసినప్పుడు, వివరాలు దస్తావేజు లేఖరి నుంచి సబ్రిజిస్ట్రార్కి వెళ్తున్నాయని అయినా మళ్లీ మళ్లీ ఓటీపీలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారు. స్లాట్ బుకింగ్లో ఏదైనా కారణం వ ల్ల హాజరు కాకుంటే యూజర్చార్జీ రూ.500 వృధాగా పోతోందన్నారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు కుమార్, అన్నెపు సీతారాం, పాత్రో శ్రీనివాసరావు, నల్ల శ్రీను, రాజారావు, మెహర్, గోవింద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండచిలువ హల్చల్ కొత్తూరు: మండలంలోని మహసింగి కాలనీలో గురువారం కొండ చిలువ హల్ చల్ చేసింది. కాలనీలోని పి. సుశీల ఇంటి పెరట ఉన్న పోగుగా ఉన్న కర్రల కింద కొండ చిలువ దాగుంది. సర్పాన్ని చూసిన కాలనీ ప్రజలు భయపడ్డారు. చివరకు సర్పాన్ని పట్టుకుని హడ్డుబంగి గెడ్డలో విడిచిపెట్టారు. అసంఘటిత కార్మికులకు చట్టపరమైన సేవలు శ్రీకాకుళం పాతబస్టాండ్: అసంఘటిత రంగంలోని కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక న్యా య సేవా సదన్లో శుక్రవారం అసంఘటిత రంగ కార్మికులకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ రంగంలోని కార్మికులు సాధారణంగా చదువురానివారు, యూనియన్ లో లేనివారు కావడం వల్ల ఎక్కువగా పథకాల గురించి తెలియడం లేదని తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి ఎన్.వై.నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.నూకరాజు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా 7వ మహాసభలు శుక్రవారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో నిర్వహించారు. మున్సిపల్ రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించి మరణించిన జి.సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని, సమ్మెకాలపు జీతం చెల్లించేలా జీఓ జారీచేయాలని, జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా పి.తేజేశ్వరరావు, అధ్యక్షుడిగా డి.యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్.బలరాం, ఉపాధ్యక్షులుగా రమేష్ పట్నాయక్, ఎ.గణేష్, సహాయ కార్యదర్శులుగా మురుగన్, పి.ఢిల్లీ, కోశాధికారిగా టి.సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎ.శంకర్ గణేష్, ఎ.మోహన్, కమిటీ మెంబర్లుగా ఎ.దేవసంతోష్, ఎ.రాజేష్, బి.సరోజ, ఎ.రాజేశ్వరి, జె.మాధవి, హరీష్, తారక, రాజేష్, భాస్కర్, కె.రవి, కె.రాజేశ్వరి, ఎ.రాము, ఎం.రాఘవ, ఎ.జ్యోతిప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
జలుమూరు: తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉంటుందని, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీస్లకు సమాచారం తెలియజేయాలని కోరారు. రైలుపట్టాలపై మృతదేహం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడు కాలికి కట్టు కట్టి ఉందని, నీలం షర్ట్, పంచె ధరించాడని చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 9492250069 నంబర్కు తెలియజేయాలని పలాస జీఆర్పీ హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
అరసవల్లి: శ్రీకాకుళం పాతబస్టాండ్లోని పెద్ద మార్కెట్ వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా స్తంభం ఒరిగిపోయి వైర్లు తెగి పడ్డాయి. జనసంచా రం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ంది. ఈ ఘటనతో పాతబస్టాండ్ పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేయించి వేకువజామున విద్యుత్ సరఫరా అందించా రు. తాగిన మత్తులో ట్రాక్టర్ను నడిపి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమానిపై సంబంధిత విద్యుత్ శాఖ, మున్సిపల్ కార్పోరేషన్, ట్రాఫిక్ పోలీసు లు గానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. స్థానిక రాజకీయ నేతల జోక్యంతోనే ప్రమాద ఘటనకు కారకులను విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంపీ లాడ్స్ నిధులు సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం ఎంపీ లాడ్స్, జాతీయ రహదారుల, జల జీవన్ మిషన్ పథకాలపై సమీక్ష నిర్వహించా రు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ సంవత్సరం ప్రారంభించి న కార్యక్రమం.. అదే సంవత్సరం ముగించాలి అనే విధానంలో ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నా మని చెప్పారు. కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి ఆనుకొని ఆరు లైన్ల జాతీయ రహదారి రానుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టును రానున్న జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా పరిధిలో 180 కిలోమీటర్లకు పైగా ఉన్న జాతీయ రహదారిలో అనేక బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాటి వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో జల జీవన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే.. శ్రీకాకుళం పరిస్థితి మరింత దారుణంగా ఉందని మంత్రి తెలిపారు. ఉద్దానం ప్రాజెక్ట్ను బలోపేతం చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
● పేరుకే కూటమి ప్రభుత్వం..నడిపించేదంతా టీడీపీయే ● ‘సాక్షి’తో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో రాజ్యంగబద్ధంగా పాలన సాగడం లేదని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాలన, సంపద అందరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లు పరిపాలించారని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు రూ.లక్ష కోట్లు ఒకే రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలని, మళ్లీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా? అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని, అందరూ నాయకులుగా ఎదగాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో కష్టపడే ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కష్టపడే తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయన్నారు. అందరి సహకారంతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. పార్టీలో ఇటీవల వివిధ పదవులు స్వీకరించిన వారంతా క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. రాష్టంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం టీడీపీ మాత్రమే అధికారాన్ని చలాయిస్తోందని ధర్మాన విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే నడుస్తోందన్నారు. బీజేపీ, జనసేన పాత్ర ఏమీ లేదన్నారు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కూటమి ప్రభుత్వం అంటూ ఢంకా మోగిస్తున్నారని, చేసిన పాపాలు ఇతర పార్టీలపై నెట్టేయాలనే ధోరణితోనే తెలుగుదేశం అలా వ్యవహరిస్తోందని చెప్పారు. రెడ్బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలను వేధించడమే పనిగా పాలకులు వ్యవహరిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. వేధింపులపై ఎవరూ ఆందోళన చెందవద్దని, మనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలు కోసం వైఎస్సార్ సీపీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం చిన్న వర్షానికే చెరువులను తలపిస్తోందని ధర్మాన విమర్శించారు. చిన్నపాటి రాజధాని చెరువు అయితే అది కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం తన అనుకూల మీడియాతో మేనేజ్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటివి బయట ప్రపంచానికి తెలియాలంటే సోషల్ మీడియా ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, నిజాన్ని నిర్భయంగా వెలికి తీయాలని ధర్మాన పిలుపునిచ్చారు. -
మా జీవితాలు ఇంతేనా?
హిరమండలం: సమగ్రశిక్ష, విద్యాశాఖలో చిరుద్యోగులైన సీఆర్ ఎంటీ (క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్), మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్టినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె లు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెరగ డం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా ఉండటం లేదని ఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ను పాలకులు అమలు చేయకపోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రాలలో 224 మంది సీఆర్ఎంటీలు, 15 మంది మండల లెవల్ అకౌంటెంట్లు, 30 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 30 మంది మెసెంజర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ. 18500 జీతం అందేది. తర్వాత వచ్చిన పాలకులు జీతాలు విస్మరించగా 2020లో వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.23,500కు వేతనం పెంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరునెలల్లోనే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింప చేయరాదని 2025 జనవరిలో జీవో నంబర్ –2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టులలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంద్రప్రదేశ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు అమలు కావడం లేదని వాపోతున్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినా అమలు చేయడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్యఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో జీతాలు సరిపోవడం లేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం పెంపుతో పాటు రిటైర్మెంట్ వయసు పెంపు, ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటివి ప్రత్యేకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెరగక ఇబ్బందు లు పడుతున్నాం. నిత్యావసర ధరలు, రవాణా, వైద్యం, ఇంటి అద్దె వంటి ఖర్చులు విపరీతంగా పెరగడంతో కుటుంబ పోషణ భారమవుతోంది. నెల వారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచాలి. – కె.చంద్రరావు, సీఆర్ఎంటీ, అవలంగి క్లస్టర్, హిరమండలం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్ర త కల్పించాలి. చాలీచాలనీ జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధ్యా యుల మాదిరిగానే సెలవులు వర్తింపచేయాలి. ఉద్యోగ విరమణ 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి. – పోలాకి తవిటినాయుడు, సీఆర్ఎంటీ జిల్లా అధ్యక్షుడు -
నేడు జిల్లా సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు శుక్రవారం జరగనున్నాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 2011 జనవరి ఒకటి తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని చెప్పారు. ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్ 4 నుంచి 6 వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం: శ్రీకాకు ళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగం, వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు గురువారం సందర్శించారు. రోగులను పరామర్శించి, వారికి అందిస్తున్న వైద్య సేవ లు, పౌష్టిక ఆహార సరఫరా, ఆస్పత్రి పరిసరా ల పరిశుభ్రతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డాక్టర్ డి.విజయలక్ష్మి, టి.అలేఖ్య పాల్గొన్నారు. ఎచ్చెర్ల : కేశవరావుపేట వద్ద జాతీయ రహదా రిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్ చెందిన లారీ డ్రైవర్ రామ్నాథ్సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి విశాఖపట్నం పోర్టుకు వెళ్తు కంటైనర్ లారీ కేశవరాపుపేటకు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న మరో లారీ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని 108 ద్వారా రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: యువత, మహిళా సంఘాలకు ప్రధాన మంత్రి రైతు నిధి, ఆయుష్మాన్ భారత్, నైపుణ్య భారతం వంటి ప్రధాన పథకాలపై అవగాహన అవసరమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకుడు పి.కిరణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మేరా యువ భారత్ ఉప సంచాలకుడు కె.వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్–ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి రుణ పథకం, డిజిటల్ భారత్ కార్యక్రమాలు, నైపుణ్య భారతం, స్వచ్ఛ భారత్, ప్రతి ఇంటికీ నీరు పథకం, విశ్వకర్మ యోజన, స్టాండ్ అప్ ఇండియా, ఉజ్వల యోజన, బిడ్డను చదివించు–బిడ్డను కాపాడు వంటి పథకాలను వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ప్రధాన అధికారి జి.ఎం.శ్రీధర్, నాబార్డ్ సహాయ ప్రధాన అధికారి కె.రమేష్కృష్ణ, లీడ్ బ్యాంకు అధికారి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు సంచాలకుడు ఆర్.శ్రీనివాసరావు, సెట్శ్రీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి వి.వి.అప్పలనాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్, స్వీప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కొమ్ము రమణమూర్తి, స్పందన సంస్థ అధ్యక్షుడు పొన్నాడ కష్ణారావు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మేర యువ భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎచ్చెర్ల : పీఎం ఉష నిధులు సహకారంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును గురువారం వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం నుంచే హిందీ తదితర భాషలన్నీ ఉద్భవించాయని చెప్పారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య మాట్లాడుతూ సంస్కృతం నేర్చుకుని విద్యార్దులు మంచి భవిష్యత్తులో స్థిరపడాలని అన్నా రు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనూరాధ, ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ టి.సంతోషి, పావని, తెలుగు భాషా విభాగం సమన్వయకర్త డాక్టర్ పి.లక్ష్మణరావు, ఎన్.లోకేశ్వరి, కె.ఉదయ్కిరణ్, బలరాం నాయుడు, ఎం.ప్రకాష్రావు, పి.రవికుమార్ పాల్గొన్నారు. -
పరిశోధనలతోనే ఉజ్వల భవిష్యత్
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశోధనలవైపు విద్యార్థులు దృష్టి సారిస్తే అద్భుతంగా రాణించగలుగుతారని మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా సమాజంలో సైన్స్ వైబ్రేషన్స్ పేరిట జరిగిన రెండు రోజుల సైన్స్ ప్రయోగాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. కళాశాల సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా.. ఇండిజీనియస్ సొసైటీ ఫర్ ప్రోగల్ సైన్స్ ఇన్వెన్షన్ సొసైటీ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ గొంటి గిరిధర్, వివిధ కళాశాలల అధ్యాపకులు ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఇలాంటి ఎగ్జిబిషన్తో శాసీ్త్రయ దక్పథం పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి నిర్వహనకర్త డాక్టర్ మదమంచి ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, ప్రొగ్రాం కోఆర్డినేటర్స్ డాక్టర్ రోణంకి హరిత, పి.సుధారాణి, శివాల రవిబాబు, కె.అపర్ణ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సవాలక్ష కండీషన్లు!
ఒక్క సర్టిఫికెట్.. శ్రీకాకుళం రూరల్ : జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆస్పత్రి నుంచి వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫిట్నెస్ కేంద్రం (వైదంతి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) నిర్వాహకులు ఆటోడ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సవాలక్ష కండీషన్లు పెడుతున్నారు. వాహనా లు బట్టి వేల రూపాయల్లో వసూళ్లు చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహన మిత్ర పథకానికి కీలకంగా మారిన ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యంతో బుధవారం రాత్రి వందలా ది ఆటోడ్రైవర్లు నరకయాతన పడిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. వందలకొద్దీ ఆటోలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం క్యూకట్టాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు డ్రైవర్లు చలానాలు తీసుకొని ఫిట్నెస్ కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది సవాలక్ష కండీషన్లు పెట్టి వెనక్కి పంపేశారు. గతంలో ఆర్టీఏ అధికారులు తమకు ఇలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేశారని చెప్పినా వినిపించుకోవడం లేదని పలువు రు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఫిట్నెస్ కేంద్రం ప్రైవేట్ప రం కావడంతో ఇష్టమొచ్చినట్లుగా దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు అడిగినంత సొమ్ము ముట్టచెప్పుకోవాల్సి వస్తోంది. అప్పులు చేసుకొని కమీషన్లు ఇవ్వాల్సి వస్తోంది. – చిన్నారావు, ఆటో డ్రైవర్, గార -
గ్రానైట్ క్వారీతో ప్రశాంతత దూరం చేయొద్దు
మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వల్ల గ్రామం మట్టి దిబ్బలా మారిపోతుందని, ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇబ్బందులు చూస్తున్నామని, తమ గ్రామ పరిధిలో గ్రానైట్ క్వారీ ఏర్పాటు చేసి ప్రశాంతత లేకుండా చేయవద్దని మెళియాపుట్టి మండలం సుర్జిని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు దుర్గమ్మ కొండ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీలో తవ్వకాలు, రాళ్ల రవాణా వల్ల గ్రామం దుమ్ముధూళితో నిండిపోవడమే కాకుండా రాళ్లు ఇళ్లపై పడి ప్రమాదాలు జరగే అవకాశం ఉందన్నారు. ప్రశాంతంగాజీవిస్తున్న తాము నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ పాపారావుకు కార్యాలయంలో వినతిప త్రం అందించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారని చెప్పా రు. శక్తి మూగాంబికా క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బయటి గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ ముగించారని పేర్కొన్నారు. ప్రఽథమపౌరుడు గ్రామ సర్పంచ్ పెద్దింటి చంద్రరావుకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. నిరసన కార్యక్రమంలో కొర్ల కృష్ణమూర్తి, ఇప్పిలి రామారావు, ఢిల్లేశ్వరరావు, జన్ని రామారా వు, కొర్ల వేణు, కొర్ల లోకేశ్వరరావు, పైల కూర్మనా యకులు, కింతలి కిరణ్, రాంబాబు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. -
పొదుపు సొమ్ము స్వాహా
ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని 17వ వార్డు సంతపేటకు చెందిన జనసేన పార్టీ వార్డు ఇన్చార్జి కర్రి నాగరాజు భార్య కృష్ణవేణి శ్రీభువనేశ్వరి ఎస్హెచ్జీ గ్రూప్ లీడర్గా వ్యవహరిస్తోంది. ఈమె గ్రూప్ సభ్యులతో కలిసి గత ఏడాది జనవరి 11న రూ.15 లక్షలు రుణంతీసుకున్నారు. సభ్యులు వాయిదాలు చెల్లించేందుకు ఇస్తున్న సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా గ్రూప్ లీడర్ కృష్ణవేణి తన సొంత అవసరాలకు వాడుకుంది. దీనితో పాటు పొదుపు సొమ్ము రూ.2,74,500 కూడా సభ్యులెవరికి తెలీయకుండా డ్రా చేసింది. తొమ్మిది నెలల తర్వాత విషయం వెలుగుచూడటంతో ఆమె భర్త నాగరాజును సభ్యులు నిలదీశారు. మొత్తం సొమ్ముని ఆగస్టు 25 నాటికి చెల్లిస్తామని పోలీసుల సమక్షంలో అంగీకరించారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోవాలని దురుసుగా ప్రవర్తించాడని సభ్యులు వాపోతున్నారు. ఈ మేరకు గురువారం పట్టణ ఎస్సై ముకుందరావు వద్ద మొరపెట్టుకున్నారు. నాగరాజుపై చర్యలు తీసుకొని బ్యాంకుకు బకాయిలు చెల్లించేలా చూడాలని కన్నీటి పర్యంతమయ్యారు. -
పోలీసుస్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
పలాస: కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఎదుటే ఓ వివాహిత గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన రాపాక రూపావతికి మందస మండలం లింబు గ్రామానికి చెందిన భానుతేజతో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందట కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసుకున్నారు. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గురువారం రూపావతి కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు చేరుకొని తన భర్తతో పాటు అత్తమామలు ఏకమై వేధించి దాడి చేశారని మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ సూర్యనారాయణ భానుతేజకు ఫోన్ చేసి కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ భానుతేజ వినకుండా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రూపావతిని అంగీకరించేది లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. కుమారుడిని స్టేషన్ వద్దే ఉంచి బిస్కెట్ కొనిస్తానని చెప్పి బజారుకు వెళ్లి పురుగుల మందు తాగింది. పోలీసు స్టేషన్ చేరుకు ని స్పృహతప్పి పడిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
కుట్రను పసిగట్టారు.. అక్రమార్కుల పనిపట్టారు
కంచిలి: జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ విలువైన స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నాలను స్థానికులు ఐకమత్యంతో తిప్పికొట్టారు. రెండు మూడు రోజులుగా ఈ హైడ్రామా నడుస్తోంది. కంచిలి మండలం జాడుపూడిలో జాతీయ రహదారికి ఆనించి 6.2 ఎకరాల జిరాయితీ స్థలం ఉంది. ఆ స్థలం మధ్యలోంచి సుమారు 70 సెంట్లు విస్తీర్ణంలో ప్రభుత్వ పోరంబోకు గోర్జీ సహజసిద్ధంగా ఏర్పడింది. దీన్ని పూర్వం నుంచి గోర్జీగానే పరిగణిస్తున్నారు. ఈ గోర్జీ వెంబడి వ్యవసాయ అవసరాల కోసం ఎడ్ల బండ్లు తిరిగేవి. ప్రస్తుతం ఆ దారి చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ గోర్జీకి ఆనించి కొత్త చెరువు, చిన్న చెరువు ఉన్నాయి. వీటికి కొండ నుంచి వచ్చే వరద నీరు ఈ గోర్జీ నుంచే ప్రవహిస్తుంటుంది. అలాంటి గోర్జీని కొందరు అక్రమార్కులు కొల్లగొట్టే యత్నం చేశారు. మూడు జేసీబీలు పెట్టి గోర్జీకి రెండు వైపులా ఉన్న జిరాయితీ స్థలాన్ని చదును చేసి కలిపేయాలని ప్లాన్ వేశారు. ఈ స్థలం విలువ రూ.కోట్లలో ఉంటుంది.దీనికి అడ్వాన్సుగా ‘పెద్దలకు’ రూ.20 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. పని పూర్తయ్యాక ఇంకా ఇచ్చేందుకు డీల్ కుదిరినట్లు తెలిసింది. కానీ గ్రామస్తులు అక్రమార్కుల ప్లాన్ను తిప్పికొట్టారు. అన్ని రకాల సమాచారాలు సేకరించి మీడియాకు చెప్పడంతో పాటు గురువారం పలాస ఆర్డీఓకు, స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.దీంతో రెవెన్యూ యంత్రాంగం రంగప్రవేశం చేసి, గోర్జీ స్థలాన్ని సర్వే చేసి, హద్దులుగా జెండాలను పాతారు. స్థానిక తహసీల్దార్ ఎన్.రమేష్కుమార్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఇప్పటికే తన దృష్టికి గోర్జీ స్థలం చదును చేసిన అంశం వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్జీ స్థలం ఆక్రమించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు
అరసవల్లి: తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలకు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘా ఐక్యవేదిక (జేఏసీ) తమ నిరసనలను మ రింత ఉద్ధృతం చేసింది. ఈ మేరకు గురువారం భోజన విరామ సమయంలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులంతా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర, శనివారాల్లో సర్కిల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లుగా ప్రకటించా రు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మహంతి ప్రభాకరరావు, రమేష్, టీవీ సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో ముందంజ శ్రీకాకుళం: రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నియంత్రణలోనే ఉందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ప్రాజెక్టు సంచాలకులు కె. నీలకంఠ రెడ్డి తెలిపారు. 2010లో 4.1 శాతం ఉన్న వ్యాధి ప్రస్తుతానికి 0.5 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇకపై హెచ్ఐవీ రోగులకు ఒకే చోట అన్ని రకాల సేవలు అందించే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్రంలో 2.75 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని, వీరందరికీ ఉచిత మందులు, పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు, త్వరలో 42 వేల కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ కేథరిన్, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ తాడే ల శ్రీకాంత్, రిమ్స్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాశీబుగ్గ డీఎస్పీకి వీఆర్ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కాశీబుగ్గ సబ్డివిజనల్ కేంద్రానికి డీఎస్పీగా వ్యవహరిస్తున్న వీవీ అప్పారావును మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వీఆర్ అటాచ్ చేస్తూ గురువారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 2025 ఎన్నికల అనంతరం డీఎస్పీగా పాత్రిని శ్రీనివాసరావు కాశీబుగ్గ రావడం.. అక్కడికి కొద్ది నెలల్లోనే జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్)గా ఉద్యోగోన్నతి పొందడంతో అతని స్థానంలో బదిలీపై వీవీ అప్పారావు వచ్చారు. 30న దళిత సంఘాల జేఏసీ నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని దళిత సంఘాల నేతలు అన్నారు. పాలకులు, అధికారుల తీరుకు నిరసనగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని ఆదివారంపేటలో జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, బోధన సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, ఇందుకు బా ధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ మేరకు గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా క న్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జీ ఈశ్వరరావు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లో ఈ యాతన..?
● లక్ష్మీపురంలో గొడవ కాళ్లు నొప్పులు పుట్టే వరకు నించుంటే గానీ బస్తా యూరియా దొరకడం లేదు. పనులన్నీ మానుకుని లైను కడితే గానీ చీటీలూ అందడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎరువుల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు ప్రతి ఊరులోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ● యూరియా కష్టాలు పాతపట్నం మండలంలోని బూరగాం, ఆర్.ఎల్.పురం గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని రైతులకు తెలియటంతో గురువారం ఒకేసారి రైతు సేవా కేంద్రానికి ఆర్.ఎల్.పురం, రొమదల, రొంపివలస, నల్లబొంతు, ఎ.ఎస్.కవిటి, సీది, తీమర, బూరగాం, సీతారాంపల్లి, బొరుభద్ర గ్రామాలకు చెందిన రైతులు వచ్చి బారులు తీరారు. – పాతపట్నం● ఎదురు చూపులే.. మండలంలో యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గురువారం చెన్నాపురం, మాకివలస రైతు సేవా కేంద్రాల పరిధిలో యూరియా పంపిణీ చేశారు. చెన్నాపురానికి 200 బస్తాలు, మాకివలసకు 110 బస్తాలు వచ్చాయి. వచ్చిన యూరియా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో రైతులు పడిగాపులు కాశారు. ఇంత వరకూ యూరియా ఇవ్వని రైతులకు ఇద్దరు ముగ్గురేసి కలిపి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. –నరసన్నపేట● తోపులాట మండలంలోని మాతల, వసప గ్రామ సచివాలయాల వద్ద గురువారం యూరియా పంపిణీ చేశారు. మాతల గ్రామంలో ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. పోలీసులు వచ్చినా గందరగోళం ఆగకపోవడంతో పంపిణీ నిలిపివేశారు. చివరకు తహసీల్దార్ కె.బాలకృష్ణ, ఏఓ స్వర్ణలతలు మాతల చేరుకొని ఇంత వరకు పూర్తిగా యూరియా అందని రైతులను గుర్తించి వారికి అందజేశారు. –కొత్తూరుపలాస: పలాస మండలం లక్ష్మీపురం రైతు సేవా కేంద్రం వద్ద గురువారం యూరియా కోసం అధికారులతో రైతులు గొడవ పడ్డారు. గతంలో ఈ రైతు సేవా కేంద్రానికి 200 బస్తాల యూరియా వచ్చింది. ఇప్పుడు తాజాగా గురువారం మరో 220 బస్తా యూరియా వచ్చింది. దీంతో సచివాల యం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంతో పాటు గరుడఖండి, పాతజగద్దేవుపురం, సరియాపల్లి, గోపాలపురం తదితర గ్రామాల రైతులకు ఈ యూరియా అందరికీ సమానంగా ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఒక ఎకరాకి ఒక బస్తా అని చెప్పినప్పటకీ ఆ విధంగా ఇవ్వకుండా కేవలం లక్ష్మీపురం రైతులకే మొత్తం యూరియా ఇస్తున్నారని, మిగతా గ్రామాలకు యూరియా ఇవ్వడం లేదని రైతులు బూర్లె నరిసింహులు, అంపోలు రాజారావు, బూర్లె మహేష్, ఎంపీటీసీ గొండు మోహనరావు తదితరులు అధికారులను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు మొత్తం యూరియా ఇస్తున్నారని, మిగతా వారికి ఇవ్వడం లేదని ఎంపీటీసీ మోహనరావు పలాస తహసీల్దార్ దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో తాత్కాలికంగా యూరియా పంపకాన్ని ఆపారు -
ఏఓ‘బీ.. కేర్ఫుల్’!
● సరిహద్దులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు ● చెక్పోస్టులు లేకపోవడంతో అక్రమంగా తరలింపు ● ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రాలో అమ్ముతున్న వైనం ● రాత్రిపూట హల్చల్ చేస్తున్న మందుబాబులు కొత్తూరు: ఆంధ్రా ఒడిశా బోర్డర్ అక్రమ మద్యం రవాణాకు చిరునామాగా మారింది. సరిహద్దులో చెక్పోస్టులు ఎత్తివేయడంతో మత్తు పదార్థాల రవాణాకు అనుకూలంగా మారింది. జిల్లాలో సరిహద్దు గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తూ ఇక్కడ విక్రయిస్తున్నారు. కొత్తూరు మండలంలోని బలద, కడుము, కౌశల్యాపురం, దిమిలి, రాయల, మాతల, నివగాంతో పాటు జిల్లాలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న మండలాలకు చెందిన గ్రా మాల్లో ఒడిశా మద్యం ఏరులై పారుతోంది. దీంతో రాత్రిళ్లు కూడా మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు విషయం తెలిసినా ఏమీ అనడం లేదు. స్థానిక పోలీసులకు సమాచా రం ఉన్నా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో ఒడిషా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు జిల్లాలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. అందులో భాగంగా కొత్తూరు మండలంలో ఈ ఆగస్టు 11వ తేదీన బలద గ్రా మంలో ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్న బెల్టు షా పుల్లో ఒడిషా మద్యం పట్టుకున్నారు. స్థానిక ఎకై ్సజ్, పోలీసులు మాత్రం ఎలాంటి దాడులు చేయడం లేదు. బోర్డర్లోని ఆంధ్రాకు చెందిన ప్రతి గ్రామంలోని పాన్షాపుల్లోనూ మద్యం దొరుకుతోంది. రాత్రి ఏ సమయంలో కావాలన్నా వీరు మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రి పూట మందు బాబులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం ఆంధ్రా–ఒడిశా బోర్డర్లోని పల్లెల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఒడిశా మద్యం ఆంధ్రా గ్రామా ల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులకు వెళ్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. బెల్టుషాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటాం. – కిరణ్మీశ్వరి, సీఐ, ఎకై ్సజ్ స్టేషన్, కొత్తూరు -
మరణమే చిన్నబోయేలా..
● జెమ్స్లో అవయవదానం ● చిరంజీవిగా మారిన సన్యాసినాయుడు శ్రీకాకుళం రూరల్, జి.సిగడాం: జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం మరో అవయవదానం జరిగింది. జి.సిగ డాం మండలం, బాతువ గ్రామానికి చెందిన పోతిరెడ్డి సన్యాసిరావు నాలుగు రోజుల కిందట బ్రెయిన్స్ట్రోక్తో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ మరోసారి స్ట్రోక్ రావడంతో మెరుగైన వైద్యం కోసం జెమ్స్ కు తరలించారు. చికిత్స అందిస్తున్నా సన్యాసిరావులో కదలికలు లేకపోవడంతో వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బ్రె యిన్ డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు అతని అవయవా లు సజీవంగా ఉంటాయని వివరించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. జీవన్దాన్ విధానం ద్వారా లివర్, కిడ్నీలను సేకరించారు. ఇందులో ఒక కిడ్నీని జెమ్స్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విశాఖ లోని మెడికవర్కు వైద్యులు కేటాయించారు.