Srikakulam District Latest News
-
డప్పు కళాకారులను ఆదుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డప్పు కళాకారులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం గురువులు, గొర్లె రవి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో జిల్లాస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని చైతన్య పరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా తరతరాలుగా డప్పు కళను వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.7 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. 2014 టీడీపీలో పెన్షన్లు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరలా సర్వే పేరుతో పెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలని, కొత్త పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమన్నారు. సమావేశంలో ఆరవ డిల్లీ, బాలు, దమ్ము కృష్ణ, బోనేల రామయ్య, సవాలపురపు అప్పన్న, కాళ్ల అప్పారావు, గెడ్డపు రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైన విద్యార్థిని
మెళియాపుట్టి: మండలంలోని పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న శ్వేత అనే విద్యార్థిని అస్వస్థతకు గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. నందిగాం మండలం సవరలింగుపురం గ్రామానికి చెందిన శ్వేత మెళియాపుట్టి మండలం పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతుంది. సోమవారం గణితం పరీక్ష రాస్తూ.. కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సపర్యలు చేశారు. పరీక్షలకు ముందు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందజేసినట్లు విద్యార్థి తెలిపింది. నీరసంగా ఉండడంతోనే కళ్లు తిరిగాయని వైద్య సిబ్బంది తెలిపారు. సపర్యల అనంతరం ఆమె మళ్లీ పరీక్ష రాసింది. -
బెట్టింగ్లకు పాల్పడవద్దు
గుర్తుంచుకోండి ● తెలియని లింక్లపై క్లిక్ చేస్తే చిక్కులు ● డేటా కాజేసి దోచేస్తారు ● అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు శ్రీకాకుళం క్రైమ్: ● జిల్లా కేంద్ర సమీపంలోని అపార్ట్మెంట్లో ఒక వివాహిత నివాసముంటోంది. ఆమెకు ఫ్యాషన్స్పై మోజు ఉండడంతో ఎఫ్బీలో తక్కువ ధరకే సిల్క్ శారీస్ అంటూ ఆఫర్తో కూడిన ఒక లింక్ వస్తే క్లిక్ చేసింది. దీనికోసం ఆమె రూ.1,200 లు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. అయితే కొద్దిరోజులకే వచ్చిన పార్సిల్లో కనీసం రూ.200 లు విలువైనా చేయని చీర రావడంతో లబోదిబోమంది. ● నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. విజిల్ అప్డేట్స్ పేరుతో లోన్ అప్రూవ్డ్ అంటూ ఒక మెసేజ్ అతడి సెల్ఫోన్కు వచ్చింది. డియర్.. యువర్ 25,000 లోన్ హేజ్ బీన్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ, చెక్ యువర్ డీటైల్స్ హియర్ అంటూ ఓ లింక్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే అతని అకౌంట్, ఆధార్, యూపీఐ డీటైల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అకౌంట్లో ఉన్న రూ.60 వేలు మాయమయ్యాయి. ఇలా మెసేజులు, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తక్కువ అక్షరాలతోనే షార్ట్ వెబ్ లింక్లు పంపించి సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి మోసాలు కోకొల్లలు. చిన్నవిగా వచ్చే ఈ లింక్లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా చోరీ వాస్తవానికి పెద్దవిగా, గజిబిజి అక్షరాలతో ఉండే వెబ్లింక్లను చిన్నవిగా షార్ట్ లింక్ల మాదిరిగా చేసి ఎవరికై నా పంపే ఆప్షన్లు ఇప్పుడొచ్చేసాయి. దీంతో దీనినే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఏమార్చుతున్నారు. షార్ట్లింక్స్లో మాల్వేర్లను పంపి వైరస్లను వ్యాప్తి చేస్తున్నారు. దీనిద్వారా మన ఫోన్ లేదంటే కంప్యూటర్లో ఉన్న పర్సనల్ డేటా హ్యాక్ చేస్తారు. ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్ క్లిక్ చేస్తే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి తెలియక మన వివరాలన్నీ ఎంటర్ చేసేస్తాం. హ్యాకర్లు ఈ లింక్లతో మన సిస్టమ్ను వారి కంట్రోల్లోకి తీసు కుని క్రిప్టో మైనింగ్ ద్వారా డబ్బులు దోచేస్తారు. హలో అంటూ అందినకాడికి.. వేసవి సమీపిస్తుండడంతో మన ఇంట్లో ఉపయోగించే ఏసీ, ఫ్రిజ్, టీవీల వంటివి రిపేర్ అవుతుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్ కేర్ నంబర్ కోసం నెట్లో వెదికితే అవే కంపెనీల పేరిట ఫేక్ కాల్ సెంటర్ల నుంచి సైబర్ ఫ్రాడ్స్ ఎరవేస్తారు. టెలీ కాలర్స్లా మాట్లాడి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ, యూపీఐ పిన్ అడుగుతారు. ఎన్నో ప్రముఖ కంపెనీల పేరిట పుట్ట గొడుగుల్లా ఫేక్ కస్టమర్ కేర్ సెంటర్లు నడుస్తుండడం, ఇంటర్నెట్లో దర్శనమిస్తుండడంతో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యువత కాల్ సెంటర్లలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశించి, టెలీ కాలర్స్గా చేరితే తీరా అవి మోసపూరితమైనవని తెలిశాక అవాక్కవుతున్నారు. సైబర్ అలెర్ట్ సెల్ఫోన్కు వచ్చే మెసేజ్లు, వాట్సాప్, ఈ–మెయిల్కు వచ్చే లింకుల్లో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలి. తెలియని లింక్లు క్లిక్ చేయకూడదు. ఒక వేళ తెలియక క్లిక్ చేసినా డబ్బులు పంపించకూడదు. ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పిన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే సైట్స్లో ఎంటర్ చేయరాదు. తెలియని క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయరాదు. క్రెడిట్ కార్డులో నగదు పెంచేందుకు గడువు ఒక్కరోజే ఉంది. ఓటీపీ చెబితే వెంటనే అప్డేట్ చేస్తామంటారు. ఇలాంటివి నమ్మవద్దు. మీరు ఆన్లైన్లో కొన్న వస్తువుకు గిఫ్ట్ వచ్చింది. అడ్రస్ చెబితే ఇంటికి పంపిస్తామని ఫేక్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. చిరునామా గానీ, బ్యాంకు ఖాతా వివరాలు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. ఎవరైనా పైన పేర్కొన్న సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. లేదంటే https://www.cybercrime. gov.inలో ఫిర్యాదు చేయాలి. మీ పరిధిలో ఉండే పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సంబంధిత బ్యాంకువారిని మోసపోయిన గంటలోనే సంప్రదించాలి. శ్రీకాకుళం క్రైమ్: ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో యువత బెట్టింగ్లకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, మ్యాచ్లను వినోద ప్రక్రియలో చూడాలి తప్ప కుటుంబంలో విషాదం నింపేదిగా ఉండరాదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి పోకూడదని సూచించారు. బెట్టింగ్లో ఒకసారి ఆదాయమొచ్చినట్లు అనిపించినా, పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. నష్టాలను భర్తీ చేసేందుకు, అప్పులు తీర్చేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్లకు పాల్పడినా, బెట్టింగ్లను నిర్వహించినా ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారముంటే డయల్ 112/100కు లేదా సంబంధిత పరిధి పోలీసులకు తెలపాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి -
తూర్పు కాపుల ఐక్యతను చాటిచెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా తూర్పుకాపు సామాజికవర్గం ప్రతినిధులు సురంగి మోహనరావు, డోల జగన్మోహన్, లంక గాంధీ, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావులు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో తూర్పుకాపుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో ముందుగా తూర్పు కాపు జాతి ఐక్యత చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపులు నేడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 38 మండలాల్లో జాతి ఐక్యత చైతన్య సదస్సులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ డవలప్మెంట్ అథారిటీ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. త్వరలో దీనికి సంబంధించిన టూర్ ప్రోగ్రాం విడుదల చేస్తామన్నారు. పరిహారం ఇవ్వకపోవడం దారుణం వంశధార ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం వలన దెబ్బతిన్న నిర్వాసితులకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా అర్హులైన నిర్వాసితులకు గత ప్రభుత్వం పెంచిన పరిహారాన్ని సత్వరమే అందించి ఆదుకోవాలని కోరారు. నిర్వాసితులకు కేటాయించిన కొత్తూరు మండలం గూనభద్ర కాలనీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని తీర్మానించారు. హిరమండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తూర్పు కాపు సామాజికవర్గం భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతలు వెంటనే కమిటీ ప్రతినిధులకు అందజేయాలని, చిరకాల స్వప్నం కాపు భవన్ నిర్మాణం త్వరలో సాకారం కాబోతుందన్నారు. లావేరు మండలం నుంచి తూర్పు కాపు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా భవనం నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ కూడా పునః ప్రారంభమవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డోల తిరుమలరావు, పొగిరి సుగుణాకరరావు, కిళ్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, పడాల తమ్మునాయుడు, వాళ్ల శ్రీరాములునాయుడు, రౌతు గోపి, సురవరం పార్వతీ, గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్, ఎస్.సత్యనారాయణ, పిసిని వసంతరావు, కురిటి దుర్గారావు, డాక్టర్ చందక రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పల్లి సురేష్, పాండ్రంకి రమేష్ నాయుడు, డోల బాలమురళీకృష్ణ, ఎం.శంకర్నారాయణ, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మాఫియా
దంతలోమట్టి తరలిస్తున్న టిప్పర్సోమవారం రాత్రి చీకటిలో మట్టి తవ్వకాలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలంలోని దంత గ్రామంలో గల పెద్ద చెరువు నుంచి అక్రమంగా రాత్రి పూట మట్టి తరలిస్తున్నారు. కీలక నేత పేరు చెప్పుకుని మట్టి రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా ఇప్పుడా అక్రమాల్లో మట్టి కూడా చేరింది. టెక్కలి నియోజక వర్గంలో ఇప్పటికే మైనింగ్ దందా నడుస్తోంది. అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తున్నారు. పర్మిట్లతో పని లేకుండా బ్లాకులు తరలిపోతున్నాయి. ముఖ్యంగా కోటబొమ్మాళి మండలంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పుడు అదే మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రిపూట పెద్ద పెద్ద చెరువులను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అందులో భాగంగా దంత గ్రామంలోనీ పెద్ద చెరువును కూడా తవ్వేసి వందల లారీల్లో తరలించేస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో అధిక సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా పట్టుకునే నాథుడు లేకుండా పోయారు. టిప్పర్ల ద్వారా పెద్ద చెరువు నుంచి రాత్రి పూట మట్టి తరలిస్తున్నారని స్థానికులు అటు పోలీసులకు, ఇటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చీకటిలో వెళ్తున్న టిప్పర్ -
దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. -
నిధుల గోల్మాల్పై ఫిర్యాదు
హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు. న్యాయం చేయండి నందిగాం: చట్టబద్ధంగా కొనుకున్న ఇంటిని ఖాళీ చేయించి, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని మండలంలోని కొత్తగ్రహారానికి చెందిన ఏదూరు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమేశ్వరరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. 2022 మార్చి 30వ తేదీన కొత్త అగ్రహారంలో ఉన్నటువంటి ఇల్లు, ఖాళీ స్థలాన్ని పొట్నూరు ఆనందరావు, అతని సోదరులు, సోదరి తనకు అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారని తెలియజేశారు. అప్పటినుంచి ఆ ఇంట్లోనే తాను, తన పిల్లలు, అత్తతో కలిసి ఉంటున్నానని తెలిపారు. భర్త గల్ఫ్ దేశంలో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే గ్రామానికి చెందిన దుంప కృష్ణారావు మరలా ఆనందరావుతో కోటబొమ్మాళి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఇంటి నుంచి తమను వెళ్లగొట్టడానికి పలుమార్లు దాడులు చేశారని వాపోయారు. కోర్టులో కేసు నడుస్తున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవారు, పిల్లలపై ఈ దాడులు మరింత తీవ్రంచేస్తూ దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినా న్యాయం జరగలేదని తెలిపారు. అనంతరం దుంప కృష్ణారావు తదితరులు ఇంట్లో సామాన్లు పగలుగొట్టి, దాడులు చేసి ఇంటి నుంచి గెంటేశారని తెలిపారు. దీంతో ప్రస్తుతం వేరే వాళ్ల ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మృతుడు అంబకండి వాసిగా గుర్తింపు పొందూరు: స్థానిక రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రేగిడి ఆమదాలవలస మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన బోడిసింగి వెంకటరమణ(25)గా గుర్తించినట్లు సోమవారం జీఆర్పీ ఎస్ఐ ఎస్.మధుసూదనరావు తెలిపారు. మృతుడు విజయవాడలో తాపీ పనులు చేస్తుంటాడని, వారం రోజుల క్రితం ఊరు వచ్చాడని పేర్కొన్నారు. తిరిగి మరలా విజయవాడ వెళ్లేందుకు పొందూరు రైల్వేస్టేషన్కు వచ్చాడన్నారు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు తండ్రి చిన్నారావు ఫిర్యాదు చేశారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు నేడు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు. -
● మా.. ఊరికి రండి..!
విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1990లో చదువుకున్న విద్యార్థులంతా, మూడున్నర దశాబ్ధాల తర్వాత మరలా మెడికల్ కళాశాలలో కలుసుకొని గత స్మృతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, డాక్టర్ హర్షవల్లి నేతృత్వంలో మా ఊరికి రండి పేరిట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం వైభవంగా జరిగింది. రోజంతా ఆనందోత్సహాల నడుమ గడిపిన వైద్యులంతా, ప్రజలకు మరింత వైద్య సేవలు అందజేసేందుకు వినూత్న ఆలోచనలు చేశారు. వైద్యరంగంలో ప్రజా ఆరోగ్య సమస్యలను రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేశారు. –శ్రీకాకుళం అర్బన్ -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు షిఫ్ట్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు షిఫ్ట్–2లు పరీక్షా సమయంగా నిర్ణయించామన్నారు. పరీక్షకు అరగంట ముందుగా గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఈశ్వరి, పద్మప్రియ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి టీవీ బాలకష్ణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు -
నిఘా నడుమ టెన్త్ పరీక్షలు
ఓటీపీ.. వెతలు కాశీబుగ్గ: పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ఓపీ కోసం రోగులకు వెతలు తప్పడం లేదు. రోగి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సెల్ఫోన్కు వచ్చే ఓటీపీని చెబితేనే ఓపీ చీటి ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువు రాని, మారుమూల పల్లెలు నుంచి సెల్ఫోన్ లేకుండా వస్తున్న రోగులను పక్కకు జరిగి ఉండాలని చెబుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 200–300 వరకు నమోదయ్యే ఓపీలు, ఒక్కసారిగా 90–100 లోపునకు మాత్రమే నమోదు అవుతుండడంతో అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అనారోగ్యంతో ఆస్పత్రి వస్తున్నవారికి ఓపీ చీటీ కోసం క్యూలైన్ లేకుండా సులభతరం చేయాలని, సెల్ఫోన్ లేకపోయినా వైద్య సేవలు సక్రమంగా అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పిలిలో ప్రశాంతం ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు. ిసట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన డీఈఓ సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● వ్యక్తికి తీవ్రగాయాలు కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. -
గంజాయితో యువకుడు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. -
నిశిరాత్రి విధ్వంసం
కొత్తూరు అతలాకుతలం విద్యుత్ తీగ నుంచి మంటలు స్థానిక ఆదిఆంధ్ర వీధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వానకు విద్యుత్ తీగ తెగి పడిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సోమవారం ఉదయం 6గంటలు సమయంలో కరెంటు రావడంతో ఒక్కసారిగా ఆ విద్యుత్ వైరు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ వైరు పడిన భాగంలో ఉన్న కాగితాలు, కవర్లు మంటకు అంటుకున్నాయి. ఎవరైనా అటువైపుగా వెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ లైన్లు సరిచేశారు. –టెక్కలి రూరల్అరసవల్లి: ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరుముల వాన జిల్లాకేంద్రంపై విరుచుకుపడింది. భారీ గాలు లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఈ వాన దెబ్బకు జిల్లా కేంద్రం అంతా చీకటిగా మారిపోయింది. గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు చోట్ల భారీ చెట్లు, కొమ్మలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పిడుగుల ధాటికి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో సోమవారం జిల్లా కేంద్రం సరిహద్దుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రహదారులన్నీ స్తంభించిపోయాయి. జిల్లాలో టెక్కలి, పలాస డివిజన్లలో ఈ వర్షం ప్రభావం పెద్దగా లేకపోవడంతో తీర ప్రాంతాల్లో పెద్ద ప్రభావం చూపలేదు. అయితే స్థానిక డివిజన్లో మాత్రం విద్యుత్ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చి ంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లిసిపురం, ఏఎస్ఎన్ కాలనీ, బొందిలీ పురం, పాలకొండ రోడ్డు, బలగ కూడలి, ఆసుపత్రి జంక్షన్, కత్తెర వీధి ఫీడర్ తదితర నగర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం రూరల్ గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో సుమారు 30 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పిడుగులు పడి సుమారు 16 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో పాటు భారీ వృక్షాలు నేలకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఫలితంగా విద్యుత్ శాఖకు రూ.35లక్షలు నుంచి రూ.40 లక్షల వరకు నష్టం వచ్చిందని అంచనా వేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్కుమార్లు తెలియజేశారు. శరవేగంగా పునరుద్ధరణ అకాల వర్షాలకు శ్రీకాకుళం డివిజన్లో ప్రధానంగా జిల్లా కేంద్రంలోనే అత్యధిక ప్రభావం కనిపించింది. పిడుగుల ధాటికి ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో పాటు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. అలాగే గాలుల కారణంగా ఫ్లెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో కూడా విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సోమ వారం వేకువజాము నుంచే విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదేశాల మేరకు టెక్నికల్ ఈఈ సురేష్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులు యుద్ధప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు బృందంతో కలిసి ఇల్లిసిపురం, బొందిలీపురంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రానికి దాదాపుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మాత్రం సోమవారం రోజంతా విద్యుత్ సరఫరా జరగలేదు. రోజంతా కాంప్లెక్స్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగించాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడడంతో కొత్తూరు, కర్లెమ్మ, బడిగాం, మహసింగి, సిరుసువాడ, కుంటిభద్ర, నివగాం, మెట్టూరు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సాగు చేస్తున్న వందలాది ఎకరాల అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గాలులకు నష్టపోయిన పంటలకు ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించాలని బాధిత రైతు లు తోకల ధర్మారావు, భాస్కరరావు, పెద్దకోట ఆనందరావుతో పాటు పలువురు కోరుతున్నా రు. ఈదురు గాలులకు మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. – కొత్తూరు కోలుకోలేని నష్టం చేతికి అందిన అరటి పంట ఈదురుగాలులకు నేలమట్టమైంది. ఎకరాకు సుమారు రూ. 75 వేల వరకు పెట్టుబడి పెట్టాము. ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన అరటి పంట గాలులకు నేలకొరిగిపోయింది. ఎకరాకు సుమారు రూ. 2 లక్షలు వరకు నష్టపోయాం. మమ్మల్ని ఆదుకోవాలి. – పెద్దకోట ఆనందరావు, అరటి రైతు, కొత్తూరు జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వాన శ్రీకాకుళం, రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు రూ.40 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టమని అంచనా -
గురుకుల పరీక్షల షెడ్యూల్లో మార్పులు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు దుప్పలవలస బాలురు, ఎచ్చెర్ల బాలికలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు బోర బుచ్చిబాబు, లక్ష్మి సోమవా రం ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర, ఐదో తరగతి ప్రవేశ పరీక్ష లు ఏప్రిల్ ఆరు నుంచి 13వ తేదీకి వాయిదా పడినట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటలు నుంచి 4.30 గంటల వరకు ఇంటర్ ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని, హాల్ టిక్కెట్లతో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్ శ్రీకాకుళం అర్బన్: ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి చేపట్టిన ఉపాధ్యాయ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. శ్రీకాకుళంలోని ఎన్జీఓ సంఘ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం చౌదరి రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 25న సాయంత్రం 4గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తదుపరి కొన్ని నిరసనల అనంతరం ఏప్రిల్ 3న టెన్త్ స్పాట్ బహిష్కరించాలని నిర్ణయించారు. నేడు శ్రీకూర్మనాథాలయ హుండీ ఆదాయం లెక్కింపుగార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను మంగళవారం తెరిచి ఆదాయం లెక్కించనున్నామని ఆలయ ఇన్చార్జి ఈఓ జి.గురునాథం ఒక ప్రకటనలో తెలిపారు. కూర్మనాథాలయంతో పాటు పాతాళ సిద్ధేశ్వర, తండ్యాలపేట అభయాంజనేయ స్వామి ఆలయ హుండీలను లెక్కించనున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. -
కూటమి పాలనలో అన్నీ ఇబ్బందులే
పాతపట్నం: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ విమర్శించారు. పాతపట్నంలోని రెడ్డి అపార్ట్మెంట్లోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు కోసం సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ అన్నివర్గాలనూ కూటమి నాయకులు మోసం చేశారన్నారు. వెరిఫికేషన్ పేరుతో గత 20 ఏళ్లుగా ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని, దివ్యాంగులను ఎండల్లో తిప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన పది నెలల్లోనే ప్రజలను నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వాటికి భయపడేది లేదన్నారు. ప్రజల సమస్యలపై ప్రతీ సోమవారం మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎల్.ఎన్.పేట జెడ్పీసీటీ సభ్యుడు కిల్లారి త్రినాథరావు, పార్టీ నాయకులు తూలగాపు తిరుపతిరావు, ఎన్ని తిరుపతి, నాగరాజు, గూరాడి అప్పన్న, బొని గిరి, బోసి రామారావు, కనకాల కర్రెన్న, పల్లి గోవిందరావు, కీర్తి తిరుమలరావు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
మారణకాండపై న్యాయ విచారణ జరిపించాలి
పలాస: మధ్య భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరపాలని, ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, అడవులు ఆదివాసీ గూడేల్లో ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని ప్రజాతంత్ర ఉద్యమ వేదిక (పి.డి.ఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో భగత్సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా స్వాతంత్య్రోద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పి.డి.ఎం. జిల్లా అధ్యక్షుడు జె.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి వీరులు దోపిడీ రహిత సోషలిస్టు సమాజం నిర్మాణం కోసం కలలు గన్నారని, నేడు ఆ కలలు కల్లలయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆఽశలు ఆశయాలు నేటికి ఇంకా మిగిలే ఉన్నాయని, వారి తోవలోనే దండకారణ్యంలో ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. అయితే పాలకవర్గాలు ఆ పోరాటాన్ని అణిచివేయాలని కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి పథకం రచించారని, వాటిని పౌర సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కె.ఎన్.పి.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, డి.టి.ఎఫ్ జిల్లా నాయకుడు డి.ధర్మారావు, చింతాడ ధర్మారావు, ఎం.ధర్మారావు(పి.కె.ఎస్), జోగి కోదండం, మద్దిల వినోద్కుమార్(పి.డి.ఎస్.యు), తెప్పల అజయ్, కృష్ణమూర్తి, నాగమణి, వీరాస్వామి, లక్ష్మణ్, పి.దానేసు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రసాద్’ పథకం కోసం ప్రయత్నాలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇంకా ఎలాంటి ఫాలోఅప్ చేయకపోవడంపై తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇందుకోసం ఆలయం ముందర నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి.. అద్భుతంగా అభివృద్ది పనులు చేపట్టాలని భావించామని, తర్వాత ఫాలో అప్ సరిగ్గా లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. ఆ నిధులు వచ్చేవరకు భక్తులకు తాత్కాలికంగా సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి సోదరుడు హరిప్రసాద్, టీడీపీ ఇన్చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
జిల్లా బేస్బాల్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బేస్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.రవికుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సీనియర్ అడ్వకేట్ మొదలవలస రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, రాష్ట్ర బేస్బాల్ సంఘ పరిశీలకులు సీహెచ్ రాజేష్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతు జిల్లాలో బేస్బాల్ అసోసియేషన్ను ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తామని.. గేమ్ అభివృద్ధికి, క్రీడాకారుల ఎదుగుదలకు పాటుపడతామన్నారు. అంతకుముందు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి బేస్బాల్ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ జిల్లా సీఈఓ పి.సుందరరావు, బి.విజయ్కుమార్, వై.పోలినాయుడు, సాధు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, సీహెచ్ జగదీష్, నిర్మల్కృష్ణ, కె.మాధవరావు, సతీష్రాయుడు, పేడాడ బాబూరావు, ఈశ్వరరావు, వెంకటరమణ, పీడీలు, పీఈటీలు, మాజీ, తాజా సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా బేస్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా కిల్లంశెట్టి అరుణ్కుమార్ గుప్తా, జిల్లా అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు, కోశాధికారిగా చీకటి మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండపల్లి రవికుమార్, సంఘ సహధ్యక్షులుగా డి.రామాంజనేయులు, లకిలి రాంబాబు, నిమ్మాన విజయమ్మ, సంయుక్త కార్యదర్శులుగా తోటాడ శ్రీను, అంధవరపు సంతోష్కుమార్, ఇప్పిలి అరుణ్కుమార్, కార్యవర్గ సభ్యులగా వి.గురుమూర్తి, కె.రమేష్, ఐ.సాయికిరణ్, ఐ.గౌరీశంకర్, డి.రాజేష్, ఎం.మధు, కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
దూసుకొచ్చిన మృత్యువు
ఎచ్చెర్ల క్యాంపస్: విధి నిర్వహణకు బయలుదేరిన ఓ ఉద్యోగిని మృత్యువు వెంటాడింది. ఇంటి నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడనే విషయం తెలిసి అతని భార్య విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశరాజు వెంకట కిరణ్కుమార్ (40) అనే వ్యక్తి రణస్థలం సమీపంలోని కొండములగాం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని అపార్ట్మెంట్లో కొన్నేళ్ల క్రితం ప్లాట్ కొనుక్కుని కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇక్కడి నుంచే ఆస్పత్రికి స్కూటీపై రాకపోకలు సాగిస్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా ఆస్పత్రి విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై బయలుదేరాడు. పాత జాతీయ రహదారిపై కేశవరెడ్డి ప్రైవేట్ పాఠశాల సమీపంలో సర్వీస్ రోడ్డు నుంచి రణస్థలం వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుండగా రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న మ్యాక్సీ క్యాబ్ వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీ కొన్ని మీటర్లు ముందుకెళ్లి ఎగిరిపడింది. ఈ ఘటనలో కిరణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి స్క్రాప్ షాపులోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కిరణ్కుమార్ గతంలో ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశారు. అనంతరం రణస్థలం బదిలీ అయ్యారు. ఇతనికి భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు జ్యోతితాశ్రీ, నితీషాశ్రీ ఉన్నారు. స్వస్థలం శ్రీకాకుళమైనా ఇక్కడే సొంతంగా ప్లాట్ కొనుక్కొని పిల్లలను చదివిస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని పొలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాక్సీక్యాబ్ ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ మృతి విషాదంలో కుటుంబ సభ్యులు -
వామపక్ష పార్టీలు ఏకం కావాలి
నరసన్నపేట: ప్రజల సమస్యలు పరిష్కారానికి, వారికి అండగా ఉండేందుకు వామపక్ష పార్టీల తలో మార్గంలో ఎర్రజెండా నీడన ఉద్యమాలు చేస్తున్నారని, బూర్జువా పార్టీలు కలిసి పనిచేస్తున్న తీరులో వామపక్ష పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని సినీ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నరసన్నపేట మండలం కోమర్తిలో మామిడి అప్పలసూరి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ అమరవీరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాలో ఉన్న ప్రధాన వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. 1960 నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అప్పలసూరి ఆయన మరణించే వరకూ విప్లవ పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎంలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని భావించే వారని, ఈ మేరకు చివరి వరకూ తన వంతు ప్రయత్నాలు చేశారని అధ్యక్షోపాన్యాసం చేసిన ప్రముఖ కథా రచయత అట్టాడ అప్పలనాయుడు గుర్తు చేశారు. ఎర్ర జెండాలన్నీ ఒక గొడుగు కిందకు రావడమే అప్పలసూరికి మనమిచ్చే ఘన నివాళి అవుతుందని నారాయణమూర్తి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అప్పలసూరి వ్యక్తిత్వం ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు దంతులూరి వర్మ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాశిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, విజయనగరం పౌరహక్కుల సంఘం కార్యదర్శి సీహెచ్ పకీరునాయుడు, ప్రజా కళాకారుల సమాఖ్య ప్రతినిధి రౌతు వాసుదేవరావు, రచయిత గంటేటి గౌరినాయుడు, న్యాయవాది మామిడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకళామండలి ఆధ్వర్యంలో కార్యకర్తలు గీతాలు ఆలపించారు. అప్పలసూరి ఆశయం నెరవేర్చాలి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వక్తలు -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్లు శ్రీకాకుళం స్టేషన్ సీఐ ఎం.వి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటర్న్ అధికారిగా తనతో పాటు నరసన్నపేట సీఐ ఎస్.వి.రమణమూర్తి వ్యవహరించినట్లు తెలిపారు. అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ప్రత్యేక ఆదివారంతో పాటు వత్సవలస రాజమ్మతల్లి ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కొందరు సూర్యనమస్కారాల పూజలు చేయించుకోగా...మరికొందరు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లుతో పెద్దగా ఉపశమనం కలుగకపోవడంతో భక్తులు విమర్శలకు దిగారు. వీఐపీల పేరిట చాలా మంది ఫేక్ వీఐపీలు దర్శనాలకు వెళ్లడంపై క్యూలైన్లలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.75 లక్షల వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వై.భద్రాజీ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జిల్లా సలహాదారుడిగా చందనరావు శ్రీకాకుళం న్యూకాలనీ: బాలల హక్కుల వేదిక పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా సలహాదారుడిగా తమ్మినేని చందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి నియామక పత్రం అందజేశారు. చందనరావు సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి జిల్లా కమిటీ చొరవతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ఈయన నియామకం పట్ల సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి డి.ప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి ఆమదాలవలస గేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ చల్లపేటకు చెందిన కరిమెళ్ల సూరిబాబు(55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. కుటుంబం లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఇంకేం జరిగిందో తెలియదు గానీ ఆదివారం పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు శవ పంచనామా కోసం తరలించారు. రైలు ఢీకొని యువకుడు మృతి పొందూరు: పొందూరు రైల్వేగేటు సమీపంలో ఆదివారం అమరావతి రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. సుమారు 30 ఏళ్ల గల ఈ యువకుడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. యువకుడు ఎరుపు టీషర్టు, నీలం ప్యాంట్ ధరించాడని, ముఖం గుర్గు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. వివరాల కోసం 9493474582 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శ్రీకూర్మంలో భక్తజన సందోహం గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాధా రణ భక్తులతో పాటు చిన వత్సవలస రాజమ్మ తల్లి సంబరాల నుంచి తిరుగుపయనమైన వారు కూడా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథం పర్యవేక్షించారు. మరోవైపు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇబ్బందులు తప్పలేదు. కారు, ఆటో, బైక్లు పెట్టేందుకు స్థలం చూపించకపోయినా ఆశీలు మాత్రం పంచాయతీ పేరిట వసూలు చేస్తుండటంపై పలువురు వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు
ఇచ్ఛాపురం రూరల్: ‘ఏరా.... ఏ ఊరు నీది...?. మీ నాన్న ఎవ డ్రా...?!’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వెటకారంగా మాట్లాడి యువకుడ్ని ఒంటర్ని చేసి ముకుమ్మడిగా పిడుగుద్దులు గుద్ది పైశాచికానందం పొందారు టీడీపీ సానుభూతిపరులు. వివరాలలోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామంలో కొత్తపల్లి దేవరాజుది ఒకే ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబం. దేవరాజు కుమారుడు భీమారావు వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉంటా డు. భీమారావు అదే గ్రామంలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. అదే గ్రామానికి చెందిన పైల బైరాగి, రంగు కామేష్ అనే టీడీపీ సానుభూతిపరులు భీమారావును పిలిచి ‘మీది ఈ ఊరు కాదు కదా.. మరి ఏ ఊరు, మీ నాన్న ఎవడ్రా...?’ అంటూ వెటకారంగా మా ట్లాడటంతో భీమారావు ప్రతిఘటించాడు. దీంతో పైల భైరాగి, రంగు కామేష్లతో పాటు ఉప సర్పంచ్ ఆశి మాధవరావు, ఆశి లక్ష్మీనారాయణ, రోకళ్ల కుమార్లు భీమారావును చుట్టిముట్టి పిడుగుద్దులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మహిళలు అడ్డుకున్నారు. భీమారావు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో తనకు ప్రాణహాని ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ ఎం.చిన్నంనాయుడు మాట్లాడుతూ ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలను విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎచ్చెర్ల క్యాంపస్: వైఎస్సార్ సీపీ కార్యకర్త, పూర్వపు వలంటీర్ కూన కిరణ్కుమార్పై టీడీపీ వర్గానికి చెందిన వారు ఆదివారం దాడికి పాల్పడ్డారు. కిరణ్కుమార్ బైక్పై ఫరీదుపేట వస్తుండగా ముగ్గురు వ్యక్తులు దారి కాచి కర్రలు, రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి విషయాన్ని ఎచ్చె ర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా గ్రామానికి డీఎస్పీ వివేకనంద, ఎస్ఐ సందీప్కుమార్ చేరుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఇప్పటికే కొనసాగుతోంది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘కుప్పిలి’పై ప్రత్యేక దృష్టి
ఎచ్చెర్ల క్యాంపస్: మాస్ కాపీయింగ్తో అందరి దృష్టిలో పడిన కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. టెన్త్ గణితం పరీక్ష సోమవారం జరగనుంది. తర్వాత సైన్స్, సోషల్ పరీక్షలు కూడా ఉన్నా యి. ఈ నేపథ్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పిలి మోడల్ స్కూల్లోని ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 425 మంది పరీక్ష రాస్తున్నా రు. 17 గదుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 21 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం పాత వారిని అందరినీ మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు ఇలా అందరినీ మార్పు చేస్తున్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కొత్తూరులో చిరు జల్లులు కొత్తూరు: కొత్తూరులో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. సుమారు నాలుగు నెలల నుంచి వర్షాలు లేవు. గత రెండు రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో మండలంలోని కర్లెమ్మ, పారాపురం, ఎన్ఎన్ కాలనీలతో పాటు పలు గ్రామాలలో వర్షం కురిసింది. వర్షం జీడి, మామిడి, నువ్వుతో పాటు కూరగాయ పంటలకు ఎంతో ఉపయోగపడింది. భగత్సింగ్కు నివాళి కవిటి: భారత స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని హెచ్ఎం బెజ్జిపల్లి దేవదాస్ అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ జయంతి సందర్భంగా పెద్ద ఎర్రగోవిందపుట్టుగ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి భగత్సింగ్ వేషధారణతో అలరించాడు. -
ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు
టెక్కలి: జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉల్లాసంగా జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. కర్నూల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.నారాయణరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఎంపికల్లో ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ క్రీడాకారులకు అవసరమైన దుస్తులు, రవాణా చార్జీల ను అందజేశారు. ఈ ఎంపికల్లో ఎన్.జనార్ధన్, కేకే రామిరెడ్డి, రాజా, కె.రఘనాథరావు, సత్యనారాయణ, శ్యామలరావు, మోతీలాల్, నారి, సీతయ్య, నర్మద తదితరులు పాల్గొన్నారు. ‘ఉల్లాస్’ అపహాస్యం సారవకోట: వయోజనులకు విద్య నేర్పించి వారికి స్వయం శక్తి సంఘాలలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన పెంచేందుకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఒక వలంటీర్ను నియమించి వారి ద్వారా గ్రామాలలో వయోజనులకు విద్య నేర్పించాలి. ఇదంతా స్థానిక సీఎఫ్ ఆద్వర్యంలో జరిగాలి. ఆదివారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించారు. అయితే మండలంలో ఈ పరీక్ష నిర్వహణ అపహాస్యమైంది. లక్ష్మీపురం, బుడితి, చీడిపూడి గ్రామాల్లో పరీక్షలు చేపట్టినట్లు చూపించారే తప్ప పరీక్షలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. అవలింగిలో స్థానిక సీఎఫ్ కోట సంతోషి ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిన్నారులతో పరీక్ష పత్రాలను నింపించేశారు. లక్ష్మీపురంలో పరీక్ష కోసం సీఎఫ్ సుశీలను విచారించగా గ్రామంలో ఫంక్షన్ జరుగుతోందని పరీక్ష ఉదయం నిర్వహించామని చెప్పారు. ముగిసిన నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: స్థానిక బాపూజీ కళామందిర్లో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ, టీవీ హాస్యనటులు అప్పారావు ప్రదర్శించిన ‘హాస్యవల్లరి’ అందరినీ నవ్వించింది. అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వారి ఆధ్వర్యంలో ‘విడాకులు కావాలి’ నాటిక ఆకట్టుకుంది. వల్లూరి శివప్రసాద్ రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వంలో చక్కనైన ప్రదర్శన చేశారు. విశాఖకు చెందిన చైతన్య కళా స్రవంతి వారిచే ‘అసత్యం’ నాటిక కూడా అలరించింది. అనంతరం హా స్యనటుడు అప్పారావును సుమిత్రా కళాసమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, సుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, లోకనాథం రామలింగేశ్వరరావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘స్వప్నం రాల్చిన అమృతం’ సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి నాటి క పోటీల్లో.. ఉత్తమ ప్రదర్శన బహుమతి కరీంనగర్, చైతన్య కళాభారతి ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటికకు దక్కింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, విశాఖ, చైతన్య కళాస్రవంతి వారి ‘అసత్యం’ నాటికకు, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన తాడేపల్లి, అరవింద్ ఆర్ట్స్ వారి ‘విడాకులు కావాలి’నాటికకు దక్కాయి. న్యాయనిర్ణేతలుగా మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, లండ రుద్రమూర్తిలు వ్యవహరించారు. విజేతలకు ప్రముఖ టీవీ, సినీ హాస్యనటులు అప్పారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు. -
● జయహో రాజమ్మ తల్లి
గార: చినవత్సవలస గ్రామంలోని రాజరాజేశ్వరి (రాజమ్మ తల్లి) సంబరాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది ఏడో వారం ఉత్తరాంధ్ర కాకుండా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి శనివారం సాయంత్రానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు గ్రామ పరిసరాలకు చేరుకున్నారు. రాత్రి జాగరణ చేసి ఉదయం సమీప సముద్రంలో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం గ్రామంలోని రాజమ్మ తల్లి, భూలోకమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోనే వంటా వార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. సముద్ర తీరంలో ఎస్ఐ హరికృష్ణ, మహాలక్ష్మి ఆధ్వర్యంలో మైరెన్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గార ఎస్ఐ ఆర్.జనార్ధన్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు. -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
బూర్జ: మండలంలోని కొల్లివలస జంక్షన్లో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైంది. సింగన్నపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ నారాయణపురం జంక్షన్ వైపు నుంచి గడ్డి లోడుతో విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గడ్డి కుప్పకు విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వచ్చి మంటలు అదుపుచేశారు. ట్రాక్టర్ ఇంజిన్ నుంచి ట్రాలీ వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫీజుల వసూలుపై ఫిర్యాదు శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిబంధనలు, సూచనలకు వ్యతిరేకంగా ఫీజు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ప్రతినిధులు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు ఆయన చాంబర్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని, విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని ఇటీవల ప్రకటన చేశారని, అయితే ఆ కళాశాల యాజమాన్యం ఆ ప్రకటన నమ్మడం లేదని, సకాలంలో ఫీజులు కట్టలేని వారికి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది చదువులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. పూర్తి ఫీజులు కట్టిన వారికే హాల్టికెట్లు ఇస్తున్నారని తెలిపారు.జిల్లాలో పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్వో సంబంధిత కళాశాల డైరెక్టర్తో మాట్లాడి ఆరా తీశారు. -
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
రమేష్బాబుకు ఉత్తమ సేవా పతకం.. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐ బి.రమేష్బాబుకు ఉత్తమ సేవా పతకం దక్కింది. 1990 కానిస్టేబుల్ బ్యాచ్కు చెందిన రమేష్బాబు 2011లో హెచ్సీగా, 2017లో ఏఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. 2024లో కూడా సేవాపతకం వరించింది. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసులు వారి సర్వీసులో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభకు గాను ఉగాది – 2025 పురస్కారాల్లో సేవా పతకాల పంట పండింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి శుక్రవారం వెలువడ్డాయి. సేవా పతకాలు వరించిన వారిలో.. జిల్లా ట్రాఫిక్ రికార్డ్ బ్యూరో (డీటీఆర్బీ) ఎస్ఐ వి.నేతాజీ, సీసీఎస్ ఎస్ఐ ఎస్ గఫూర్, ఓడలరేవు(మైరెన్) సీఎస్పీఎస్ ఎస్ఐ జి.విలియమ్స్, ఏఆర్ ఏఎస్ఐ వై.రామారావు, ఏఆర్ హెచ్సీ సీహెచ్ విశ్వనాథం, జి.సిగడాం హెచ్సీ కె.నాగేశ్వరరావు, సీసీఎస్ పీసీ ఎ.విశ్వనాథం, ఏఆర్ పీసీ ఆర్.మీరాబాబు, భావనపాడు సీఎస్పీఎస్ పీసీ యు.లక్ష్మీపతి ఉన్నారు. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐకి ఉత్తమ సేవా పతకం విజిలెన్సులో ముగ్గురికి, ఫైర్ విభాగంలో ముగ్గురికి పతకాలు జిల్లా అగ్నిమాపక విభాగంలో.. పలాస స్టేషన్ అధికారి బి.సోమేశ్వరరావు, శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మేన్ బి.శృంగారినాయుడు, డ్రైవింగ్ ఆపరేటర్ షేక్ రహీమ్లకు సేవా పతకాలు వరించాయి. విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్లో.. ఎస్ఐ ఎన్.అశోక చక్రవర్తి, కానిస్టేబుళ్లు ఇజ్జాడ ఈశ్వరరావు, పి.లక్ష్మీనారాయణలకు ఏపీ పోలీస్ సేవా పతకాలు వరించాయి. -
రచ్చబండ ధ్వంసంపై ఆరా
ఇచ్ఛాపురం రూరల్: సుమారు ముఫ్పై ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను టీడీపీ నాయకుడు అధికార అహంతో కూలదోస్తున్నట్లు గురువారం సాక్షి దినపత్రికలో ‘రెచ్చిపోయిన పచ్చ తమ్ముడు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు శుక్రవారం వీఆర్వో రాజారావు, విలేజ్ సర్వేయర్ మీనాకుమారీలు కె.శాసనాం గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన సొంత ఆస్తికి ఎదురుగా రచ్చబండ ఉండటంతో దాన్ని అడ్డు తొలగించేందుకు కూలదోసినట్లు అధికారుల ఎదుట టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఒప్పుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో కొలతలు తీయడంతో అసలు రహస్యం బట్టబయలైంది. రచ్చబండతో పాటు మరో పది అడుగుల వరకు ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉందని, రచ్చబండను తొలగించే అధికారం ఫకీరుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు లేదని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు సైతం పచ్చ తమ్ముడికి చీవాట్లు పెట్టడంతో వెనుదిరిగాడు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దు
శ్రీకాకుళం క్రైమ్/పాతపట్నం/హిరమండలం : వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మినా.. గడువు ముగిసిన మందులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు మెడికల్ దుకాణదారులను హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు, డ్రగ్ కంట్రోల్, ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్కడెక్కడ అంటే.. శ్రీకాకుళం కేంద్రంగా డేఅండ్నైట్ సమీప శ్రీనివాస మెడికల్స్, అమరావతి మెడికల్స్, ఇలిసిపురం రైతు బజారు సమీప మహలక్ష్మి మెడికల్స్, గుజరాతీపేట కూడలి సమీప నీలిమ మెడికల్స్, యునైటెడ్ మెడికల్స్ (చిత్తరంజన్ వీధి), పలాసలో తర్లాన వాసుదేవరావు మెడికల్స్, కాశీబుగ్గలో శ్రీ మెడికల్స్, పాతపట్నంలో మధు మెడికల్స్, హిరమండలంలో విజయశంకర్ మెడికల్స్ దుకాణాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. గుజరాతీపేట నీలిమ మెడికల్స్తో పాటు పలాస, కాశీబుగ్గ, పాతపట్నం, హిరమండలం మెడికల్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు, గడువు దాటిన మందుల అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. మిగతా చోట్ల చిన్న చిన్న లోపాలున్నట్లు గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం సరిలేనివారు, నిద్రపట్టని వారికి ఇచ్చే మందులకు ప్రిస్క్రిప్షన్ ఉన్నవీ లేనివీ గుర్తించమని డీజీ హరీష్కుమార్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ దాడులు జరిపామన్నారు. సైక్రియాట్రిక్, హ్యాబిక్యులర్, షెడ్యూల్డ్– హెచ్ డ్రగ్లు ఈ జాబితాలోకి వస్తాయని వివరించారు. ఈయనతోపాటు జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఏడీ చంద్రరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాయుడు, విజిలెన్సు ఎస్ఐ అశోక చక్రవర్తి,,హెచ్సీ కామేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దాడులు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పాతపట్నం మండల కేంద్రంలోని పలు మందుల దుకాణాలను యాజమానులు ముందుగానే మూసివేశారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు దాడులు -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
అరసవల్లి: విద్యార్ధి దశ నుంచే అడవులు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి శంబంగి వెంకటేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అరణ్య భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన కె.షర్మిళకు ప్రథమ బహుమతి, టీపీఎం పాఠశాలకు చెందిన నూకరాజుకు ద్వితీయ బహుమతి, ఏవీఎన్ పాఠశాలకు చెందిన శ్రీవల్లి, భరత్లకు తృతీయ బహుమతులు లభించాయి. వీరికి డీఎఫ్వో వెంకటేష్, ఏపీఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ పూజారి గోవిందరావులు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఉపఖజానా అధికారిగా పదోన్నతి శ్రీకాకుళం పాతబస్టాండ్: జోన్–1 ఖజానా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సీనియర్ అకౌంటింగ్ అఽధికారులకు ఉప ఖజానా అధికారులుగా పదోన్నతి లభించింది. వీరిలో జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న జి.వి.ఎస్.ఎన్.మూర్తిని పార్వతీపురం మన్యం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప ఖజానా అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లూకలాపు ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డాక్టర్ ధర్మారావు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రసన్నకుమార్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించగా రెగ్యులర్ హెచ్ఓడీగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ పేడాడ రాము పిల్లల విభాగాధిపతిగా నియమితులయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం రెగ్యులర్ హెచ్ఓడీగా బాధ్యతలు స్వీకరిచారు. విద్యుత్శాఖ ఏఈలకు పదోన్నతులు అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలోని శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఏఈలుగా పనిచేస్తున్న పలువురు ఇంజినీర్లకు డిప్యూటి ఈఈ క్యాడర్లో పదోన్నతులు కల్పిస్తూ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఏఈగా పనిచేస్తున్న జి.వి.సురేష్కు నరసన్నపేట ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా, ఎంఆర్టీ ఏఈగా పనిచేస్తున్న టి.వి.శంకర్ శ్రీనివాస్కు సీటీఎం శ్రీకాకుళం డిప్యూటి ఈఈగా, విశాఖపట్నం మురళీనగర్లో ఏఈగా పనిచేస్తున్న ఎం.రాజేష్కు రణస్థలం ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా పదోన్నతులు కల్పించారు. ఇంతవరకు నరసన్నపేట డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న కె.ఇందిరకు టీఆర్ఈ శ్రీకాకుళం డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా..విజిలెన్స్ అధికారులు మెడికల్ షాపులు తనిఖీ చేశారు. చీటీ లేకుండా మందులు అమ్మరాదన్నారు. –8లో
‘నన్ను చూడగలవా..?’ అంటూ ఓ బంకులో రీడింగ్ బోర్డు సవాల్ విసురుతూ ఉంటుంది. ‘అంకెలు లెక్క పెట్టగలవా..?’ అని మరో బంకులో రీడింగ్ చూపులకు అందనంత స్పీడులో పరుగులు పెడుతూ ఉంటుంది. ‘ఏం పోశావురా.. బాబూ’ అంటూ ఇంకో బంకులో ఆయిల్ పోసిన వెంటనే సైలెన్సర్ సాయంతో బండి ఏడుస్తూ ఉంటుంది. మోసపోవడం సామాన్యుడి జన్మహక్కు అన్నట్లు బంకుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. రీడింగు నుంచి పెట్రోల్ నాణ్యత వరకు ఏదో ఒక దశలో మోసాలకు పాల్పడుతున్నాయి. వీరి వైఖరి వల్ల నిజాయితీగా ఉండే బంకులకు కూడా చెడ్డపేరు వస్తోంది. ‘సాక్షి’ శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో పలు విషయాలు వెలుగు చూశాయి. ● -
లారీ చోరీకి విఫలయత్నం
ఇచ్ఛాపురం: పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ చేసిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీ చేశారు. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగడంతో తిరిగి లారీని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం లారీ కోసం వచ్చిన యజమాని పైల వాసుదేవరావుకు పార్కింగ్ ప్రదేశంలో వాహనం కనిపించలేదు. తోటి డ్రైవర్లను, చుట్టుపక్కల వారిని అడిగినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో లారీ యజమాని ఫిర్యాదుచేశాడు. పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఒడిశా పరిధిలోని పితాతోళి గ్రామంలో లారీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరికి పాల్పడింది కటక్ చెందిన వ్యక్తిగా అనుమానించి నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లేంద్ర(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగాం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కురాడ కరువులుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఢిల్లేంద్ర జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుశీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న తమ్ముడు భుజంగరావును ష్యూరిటీగా పెట్టి భార్య సుశీల పేరిట రూ.3 లక్షల లోన్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా లోన్ డబ్బులు కట్టకపోవడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య సుశీల సారవకోట మండలం కుమ్మరిగుంటలో ఉన్న కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లేంద్ర శుక్రవారం ఉదయం టెక్కలి వెళ్లాడు. అటు నుంచి బస్సులో బెండిగేటు వరకు టికెట్ తీసుకొని తురకల కోట వద్ద దిగాడు. అక్కడినుంచి మాదిగాపురం సమీపంలో ఉన్న తమ జీడి తోటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో హిట్ దోమల కాయిల్స్, మద్యం బాటిల్ ఉండటంతో మందులో కాయిల్స్ కలిపి తాగి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి తమ్ముడు తోటలో జీడి పిక్కలు ఏరేందుకు వెళ్లగా అక్కడ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
65 ఏళ్ల వయసులో పరీక్ష కేంద్రానికి..
చదువుకు వయస్సు అడ్డురాదు. కొంత మందికి న్యాయ విద్యలో డిగ్రీ అన్నది దీర్ఘకాలిక కల. 65 ఏళ్ల వయస్సులో బీకే కళావతి అనే మహిళ శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఎల్ఎల్బీ చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు రాష్ట్రం. బార్ కౌన్సిలాఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది. – ఎచ్చెర్ల క్యాంపస్ ఉద్దండపాలెం విద్యార్థికి కోటి రూపాయల కొలువు సంతబొమ్మాళి మండలంలోని పాలతలగాం పంచాయతీ ఉద్దండపాలెం గ్రామానికి చెందిన ఆర్ట్స్ విద్యార్థి హనుమంతు సింహాచలం భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సు మేనేజ్మెంట్ (ఎంహెచ్ఆర్ఎం) పూర్తిచేసిన సింహాచలం రూ. 1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలాండ్కు చెందిన ప్రముఖ డెయి రీ సంస్థ కోవైస్కోలో హెచ్ఆర్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించాడు. సింహాచలం తల్లిదండ్రులు హనుమంతు భీమారావు, కమలకుమారి వ్యవసాయం చేస్తుంటారు. సింహాచలం విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో సాగింది. 2022 ఎంహెచ్ఆర్ఎం కోర్సులో చేరినప్పటి నుంచి అధ్యాపకులు, ప్లేస్మెంట్ ఆఫీసర్ సలహా మేరకు కమ్యూనికేషన్ స్కిల్పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2024లో కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్లో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్లో రూ.3.6లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అక్కడే పనిచేస్తూ మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో పోలాండ్లోని డెయిరీ సంస్థ తమ హెచ్ఆర్ విభాగంలో పోస్టుల భర్తీకి యూనివర్సిటీ అధికారుల ను సంప్రదించగా ప్లేస్మెంట్ ఆఫీసర్ తనకు సమాచా రం ఇచ్చారని సింహాచలంతెలిపారు. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో సంస్థ హెచ్ఆర్ అసిస్టెంట్గా ఎంపిక చేసింది. మే నెలలో విధులకు సిద్ధం కావాలని సమాచారం ఇచ్చిందని హనుమంతు సింహాచలం తెలిపారు. – సంతబొమ్మాళి -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ఎచ్చెర్ల: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని లావే రు తహశీల్దార్ జోగారావు సిబ్బంది ని ఆదేశించారు. శుక్రవారం తామా డ, బుడతవలస పంచాయతీల రెవె న్యూ పరిధిలో అక్రమంగా చదును చేస్తున్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చదునుచేసిన భూ ముల్లో సర్వే చేపట్టి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈయనతో పాటు ఆర్ఐ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
సారవకోట: మండలంలోని బుడితి గ్రామానికి చెందిన చిత్తిరి ఆర్య (21) శుక్రవారం రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్య వ్యక్తిగత పనిపై శుక్రవారం చీపురుపల్లిలో రైలు ఎక్కి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడి నుంచి జాజ్పూర్ వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి దగ్గరున్న ఆధార్ కార్డు, ఫోన్ సహాయంతో అక్కడి రైల్వే పోలీసులు విజయవాడలో ఉంటున్న తల్లిదండ్రులు బుజ్జి, మహాలక్ష్మిలకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బుడితికి చెందిన కొందరితో కలిసి భువనేశ్వర్ బయల్దేరారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
యువతిని మోసగించిన యువకుడు అరెస్టు
జి.సిగడాం: యువతిని మోసగించిన కేసులో దేవరవలస గ్రామానికి చెందిన సిగటాపు కిరణ్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రణస్థలం సీఐ అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. దేవరవలసకు చెందిన కిరణ్ అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరడంతో నిరాకరించాడు. పెద్దలను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ వై.మధుసూదనరావు, ఏఎస్ఐ కె.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధనం.. మోసాలే ఘనం..
● పెట్రోల్ బంకుల్లో చాలా విధాలుగా మోసాలు జరుగుతున్నాయి. కొన్ని బంకుల్లో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా.. చాలా బంకుల్లో మాత్రం బహిరంగంగానే మోసాలకు పాల్పడుతున్నారు. ● బంకుల్లో పంప్ నుంచి పెట్రోల్ విడుదల చేసే మిషన్ డిజిట్ను ఎక్కువగా వాడుతున్నారు. మీటరుపై చూపించే సరికే ఈ ఆయిల్ విడుదల జరుగుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ● ఈ డిజిటల్ మీటర్ ఫీడింగ్ ప్రైవేటు టెక్నీషియన్లతో చేయించుకుంటారు. పెట్రోల్ పంపింగ్ వేగం ఆధారంగా చేసే ఈ ప్రక్రియలో లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ● దీనికి తోడు పంపింగ్ జరిగినప్పుడు ఆ పంపు ఆపరేటర్లు చేతివాటం ఉంటుంది. ● పెట్రోల్ కల్తీ కూడా చాలా చోట్ల జరుగుతోంది. ట్యాంకులో పెట్రోల్ను ఫిల్లింగ్ చేసేటప్పుడు పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా వెళ్తుంది. దీంతో పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా పంపింగ్ జరిగి వాహనాలు పాడవటం, ఇంధనం తక్కువగా రావడం వంటివి జరగుతున్నాయి. ఎక్కువగా వర్షాకాలం శీతాకాలంలో ఈ సమస్యలు ఉంటాయి. ● ఇక బంకుల్లో ముందుగా చెల్లించిన డబ్బుకి ఫీడ్ చేసి ఆయిల్ కొడతారు. ఇక్కడ కూడా సాంకేతిక సాకుతో తప్పిదాలు జరుగుతున్నాయి. -
పైడిభీమవరం హైస్కూల్లో సీసీ కెమెరాలు చోరీ
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8 సీసీ కెమెరాలు, వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల కిందట దొంగిలించారు. ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పాఠశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగులను ప్రోత్సహిద్దాం శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన ది వ్యాంగుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారులను కూర్చోబెట్టి మంచినీళ్లు, టీ, స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు. -
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు
పాలకుల్లో చలనం లేదు.. అధికారులు పట్టించుకో వడం లేదు. పాలకుల్లో చలనం లేదు. దీంతో మాకు ఇబ్బందులు తప్పడం లేదు. నది పక్కన ఉన్నామే తప్ప నీరు మాత్రం లేకుండా పోతోంది. – ఇద్దుబోయిన ఆదిలక్ష్మి, హిరమండలం హిరమండలం: అక్కడ రోజూ ‘పానీ’పట్టు యుద్ధమే. ఊరు వంశధార గట్టు కిందే ఉన్నా.. నీటి బొట్టు కూడా దొరకని వింత పరిస్థితి వారి ది. వేసవి కాలం వచ్చిందంటే బిందెలు పట్టుకుని గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి. చుక్క చుక్క నీటి బొట్లు రాలుస్తూ వెక్కిరించే కుళాయిలు, ఎప్పుడు వస్తాయో తెలీని ట్యాంకర్లపై విసుగెత్తిపోయిన హిరమండలం మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలు పట్టుకుని అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై నిరసన తెలిపా రు. రహదారి గుండా ఎలాంటి వాహనాల రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు. హిరమండలం మేజర్ పంచాయతీలో సుమారు 18 వేల మంది జనాభా ఉంది. ప్రతి మనిషికి రోజుకు సగటున 20 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన 3,60,000 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్, మంచినీటి పథ కం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. వేసవికి ముందస్తు చర్యలు లేవు. ఇటీవల ఒకే సారి నీటికి ఇబ్బందులు రావడంతో అప్పటికప్పుడు బోర్లు తవ్వి పథకానికి అనుసంధానం చేశారు. అయినా తాగునీరు అందని దుస్థితి. కుళాయిల ద్వారా అంతంత మాత్రమే నీరు అందిస్తున్నారు. రోజువిడిచి రోజు నీరు రావడంతో మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఉంటుందని తెలిసినా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై ఆర్డబ్లూఎస్ డీఈ వెంకటప్పలనాయుడు వద్ద సాక్షి ప్రస్తావిస్తే మేజర్ ఇప్పటికే అదనంగా బోర్లు తవ్వామని వాటి నుంచి నీటిని పథకానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. గుక్కెడు నీటి కోసం .. ఏటా వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటి కోసం చా లా ఇబ్బందులు పడతాం. నది చెంతనే ఉన్నామన్న మాటే కానీ.. గుక్కెడు నీటి కోసం కూడా పాట్లు పడాల్సిన పరిస్థితి. – కొటివాడ లీలావతి, స్థానిక మహిళ, హిరమండలం -
చూచి రాతల దోషి ఎవరు..?
సస్పెండైన వారు వీరే.. 1.కుప్పిలి బి–కేంద్రంలో సీఎస్గా వ్యవహరించిన పీవీ దుర్గారావు– హెచ్ఎం, జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయినిపాలెం (లావేరు మండలం) 2. కుప్పిలి ఏ– కేంద్రంలో సీఎస్గా వ్యవహరించిన ఎం.లక్ష్మణరావు–హెచ్ఎం, జెడ్పీహెచ్ స్కూల్ కొత్తపేట (ఎచ్చెర్ల మండలం) 3. కుప్పిలి బి–కేంద్రం డీఓగా వ్యవహరించిన బీవీ సాయిరాం (ఎస్ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్స్కూల్ కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం) 4.కుప్పిలి ఎ–కేంద్రం డీఓగా వ్యవహరించిన పి.హరికృష్ణ (ఎస్ఏ), జెడ్పీహెచ్స్కూల్ ధర్మవరం (ఎచ్చెర్ల మండలం) 5. జె.పద్మకుమారి– హెచ్ఎం, జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 6. ఎం.కనకరాజు (ఎస్ఏ ఇంగ్లీషు)–జెడ్పీహెచ్స్కూల్ బుడగట్లపాలెం 7. ఎస్.కృష్ణ (ఎస్ఏ హిందీ) జెడ్పీహెచ్స్కూల్ కొయ్యాం 8. పి.నాగేశ్వరరావు (ఎస్ఏ మ్యాథ్స్) జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 9. కె.కామేశ్వరరావు (ఎస్ఏ హిందీ) జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 10. కారు కస్టోడియన్ కమ్ సిట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన ఎంవీ కామేశ్వరరావు (ఎస్ఏ) జెడ్పీహెచ్స్కూల్ అదపాక (లావేరు మండలం) 11. ఏ.శ్రీరాములునాయుడు (ఎస్ఏ తెలుగు) జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయునిపాలెం 12. ఎస్.శ్రీనివాసరావు (ఎస్ఏ మ్యాథ్స్), ఎంపీయూపీ స్కూల్ బడివానిపేట 13. బి.రామ్మోహనరావు (ఎస్ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయినిపాలెం 14. పి.ఫల్గుణరావు (ఎస్ఏ పీఈ), జెడ్పీహెచ్స్కూల్ మురపాక. ● కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంలో చూసి రాస్తూ అధికారులకు దొరికిపోయిన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖలో సంచలనం నమోదైంది. ఎచ్చెర్ల మండలం కుప్పి లి మోడల్ స్కూల్ ఏ,బీ కేంద్రాలుగా జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఐదుగురు విద్యార్థులు డీబారయ్యారు. జిల్లా చరిత్రలో ఓ పరీక్ష కేంద్రంలో ఒకే రోజు ఇంతమందిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికి తోడు ఏకంగా 14 మంది టీచర్లను సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇంగ్లిషు పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేటు కలిపి మొత్తం 28,323 పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 160 మంది గైర్హాజరయ్యారు. ఏమైందంటే..? కుప్పిలి ఏ, బీ కేంద్రాల్లో కాపీయింగ్పై నిఘా వర్గాల పక్కా సమాచారంతో అధికారులు శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్వయంగా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యతోపాటు విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్, ఎచ్చెర్ల ఎంఈఓ–2 గాలి రాజ్కిశోర్, లావేరు ఎంఈఓ–1 ఎం.వాగ్దేవిలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో రెండు కేంద్రాల్లో యథేచ్ఛగా కాపీయింగ్లు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీ చేయగా రెడ్హ్యాండెడ్గా ఐదుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిని డీబార్ చేశారు. కేంద్రాల సీఎస్లు, డీఓల ప్రోత్సాహంతో ఇన్విజిలేటర్ల వద్ద కూడా జవాబుపత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నట్టు గుర్తించారు. కార్యాలయ సిబ్బంది, బయట నుంచి సహకరించిన వ్యక్తులను సైతం అధికారులు గుర్తించారు. 14 మంది టీచర్లపై వేటు మొత్తం ఈ రెండు కేంద్రాల్లోని సీఎస్లు, డీఓలు, ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్పై శాఖాపరమైన ఆదేశాలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. డీఈఓ కూడా నోట్ తయారు చేసి కలెక్టర్కు ఇచ్చారు. దీంతో కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్ ఏ, బీ రెండు పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైన 14 మంది టీచర్లు ఏకకాలంలో సస్పెన్షన్కు గురికావడం చర్చనీయాంశమైంది. వీరిలో 11 మంది టీచర్లను డీఈఓ, ముగ్గురు హెచ్ఎంలను ఆర్జేడీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాపీ వెనుక ఉన్నదెవరు..? గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కాపీయింగ్కు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాధించిన ఫలితాల కంటే అధికంగా సాధించాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకే మాస్ కాపీయింగ్లు జరుగుతున్నాయని పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, స్క్వాడ్లు ఎంపికచేసుకున్న కేంద్రాల్లో మాత్రమే ‘అతి’గా ఫోకస్ చేస్తున్నారని, మిగిలిన కేంద్రాల సంగతేంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కుప్పిలి మోడల్ స్కూల్విద్యాశాఖ చరిత్రలో సంచలనం 14 మంది టీచర్ల సస్పెన్షన్ 5మంది విద్యార్థుల డీబార్ -
నేత్రదానం స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని విశాఖ– ఏ కాలనీలో నివాసముంటున్న పొట్నూ రు ధర్మరాజు(71) మృతి చెందడంతో ఆయన కుమారుడు పి.వెంకటరమణ, కుమార్తె ఎ.ప్రవీణ, అల్లుడు రమణమూర్తి నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్క్రాస్ ప్రతినిధి తవుడు ద్వారా విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావుకు తెలియజేయగా నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, పి.సునీతలు హాజరై ధర్మరాజు కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్ అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు డీఎంఈ రాక శ్రీకాకుళం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలను పరిశీలించి వైద్యులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం జిల్లాలోని మరికొన్ని ఏరియా ఆస్పత్రులను పరిశీలించే అవకాశం ఉంది. పేకాట శిబిరంపై దాడి కవిటి: మండలంలోని మాణిక్యపురం సమీప కొబ్బరితోట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడిచేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.8600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. టీజీఐ పరిశ్రమలో అగ్ని ప్రమాదం గార: మండలంలోని సతివాడ జంక్షన్లో ట్రాన్స్వర్డ్ గార్నెట్ ఆఫ్ ఇండియా(టీజీఐ) ఇసుక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్ బ్లాక్ పక్క ఉన్న స్టాకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో సాయంత్రం వరకు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. ఇసుక లోడింగ్ చేసే బ్యాగులు కాలిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అదనపు వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయండి శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ సరఫరా సమయంలో సిబ్బంది అధిక మొత్తం వసూళ్లు చేస్తే పౌర సర ఫరా అధికారులకు ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజె న్సీ నుంచి వినియోగదారులు ఇంటికి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటే రవాణా చార్జి నిమిత్తం ఒక్కో సిలిండర్కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. 15 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం (ఆయుష్ శాఖ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత విభాగంలో దరఖాస్తుదారుకు కనీస వయసు 40 ఏళ్లు ఉండాలని, 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నాలు గు అవార్డులను జూన్ 21న ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31తో దరఖాస్తు నమోదు గడువు ముగుస్తుందని తెలిపారు. -
గేట్ ర్యాంకులపై హర్షం
ఎచ్చెర్ల క్యాంపస్: ఇంజినీరింగ్ పూర్తి చేసి జాతీయ విద్యా సంస్థల్లో పీజీ (ఎంటెక్) చదివేందుకు ఉద్దేశించిన అర్హత పరీక్ష ‘గేట్’లో శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) విద్యార్థులు ర్యాంకులు సాధించటం పట్ల క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకటగో పాల ధన బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. అధికారు లు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి గురువారం కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కొమరాల శేతశ్రీ ఈసీఈ విభాగంలో 241వ ర్యాంకు, అప్పాన శ్రీనివాస్ సీఎస్ఈలో 663వ ర్యాంకు సాధించారు. సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈలలో 60 మంది వరకు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ వంటి ప్రభుత్వ సంస్థ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పరిపాలన అధికా రి ముని రామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ కొర్ల మోహన్కృష్ణ చౌదరి, ఎఫ్వో వాసు, డీన్ ఆఫ్ వెల్పేర్ గేదెల రవి, సీఎస్ఈ హెచ్వోడీ రమేష్కుమార్, పీఆర్వో మామిడి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. అదరగొట్టిన నివాస్ శ్రీకాకుళం న్యూకాలనీ: గేట్ ఫలితాల్లో శ్రీకాకుళం నగరంలోని వాంబేకాలనీకి చెందిన అడ్డూరి నివాస్ ప్రతిభ కనబర్చాడు. ఆలిండియా స్థాయిలో 204వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. తండ్రి వెంకట్ మృతిచెందడటంతో తల్లి అనూరాధ టైలరింగ్ చేస్తూనే పిల్లలను చదివిపిస్తుంది. సోదరి ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. నివాస్ ప్రతిభ కనబరచడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. -
కూటమి నేతలు కక్షగట్టారు
● అధికారులకు ఫిర్యాదు చేసిన అల్లాడపేట సర్పంచ్ చిన్నమ్మడు జలుమూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాని కి చెందిన టీడీపీ నాయకులు అలజడులు, వివాదా లు సృష్టిస్తున్నారని జలుమూరు మండలం అల్లాడ పేట సర్పంచ్ కల్యాణం చిన్నమ్మడు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లాడపేట ఫీల్డ్ అసిస్టెంట్ పంగ వెంకటరమణపై గ్రామానికి చెంది న మెండ శిమ్మయ్య, ఎం.రాంబాబు, కల్యాణం జనార్దనరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టేందుకు గురువారం నరసన్నపేట క్లస్టర్ ఏపీడీ పూడి లోకేశ్ గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయంలో వేతనదారులతో మాట్లాడారు. గ్రామంలో లేనివారికి ఉపాధి హాజరు వేస్తున్నారని, తమకు పనులు కల్పించడం లేదని ఓ వర్గం చెప్పగా.. అందరికి పనులు కల్పిస్తున్నారని గ్రామానికి చెందిన మెండ అప్పారావు, నేతింటి చిన్నమ్మడు, మెండ ఆరుద్ర, మెండ రామచంద్రరా వు, కల్యాణం సూర్యారావు తదితరులు వివరించా రు. ఈ నేపథ్యంలో సర్పంచ్ చిన్నమ్మడు అధికారి తో మాట్లాడుతూ తన భర్త కల్యాణం అచ్చెన్నను హత్య చేసిన వారే మళ్లీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదు లు చేస్తున్నారని చెప్పారు. వీరిపై పలు కేసులు కూడా నడుస్తున్నాయని తెలిపారు. వంట ఏజెన్సీ, అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా అందరినీ బెది రిస్తున్నారని అధికారి దృష్టికి తీసుకొచ్చారు. నిత్యం గొడవలు సృష్టిస్తున్న వీరిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యా దు చేశామన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ సాను భూతిపరులపై కుట్ర పన్నుతున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. కా ర్యక్రమంలో ఏపీఓ శేఖర్, వైఎస్సార్సీపీ నాయుకు లు కల్యాణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉగాది కవితా పురస్కారాల విజేతలు వీరే
శ్రీకాకుళం కల్చరల్ : వేమన కవితా నిలయం (శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో విశ్వావసు నామ ఉగాది (2025) పురస్కార కవితా సంపుటాల విజేతలను నిర్వాహకులు మహ్మద్ రఫీ (ఈవేమన), నిమ్మగడ్డ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 23న కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో పద్మావతి రాంభక్త (మెతుకు వెలుగులు), యాములపల్లి నరసిరెడ్డి (శిలావృక్షం), వైరాగ్యం ప్రభాకర్ (ఆకాశమంత), బగాది వెంకటరావు (బగాది బాసలు), వైతాళీయ కుచేలోపాఖ్యానం (మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ), కడలి కవితా ప్రసూనాలు (కడలి ప్రకాశరావు) విజేతలుగా నిలిచారని ప్రకటించారు. స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపు సరికాదు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విశాఖపట్నం మధురవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం బోర్డులో వైఎస్సార్ పేరును తొలగించడం సరికాదని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో ఒక పేజీని ఇలా పేర్లు మార్పుకే కేటాయించడం దారుణమన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో ఓ జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని గుర్తు చేశారు. ఇటువంటి నిస్వార్థ రాజకీయాలు చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబమేనని స్పష్టం చేశారు. కుల్లు, కుతంత్రా లు, మోసాలతో రాజకీయం చేసేది చంద్రబాబు, లోకేష్లని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేడియం పేరు మార్చలేదని, ఇప్పుడే ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
అరసవల్లి: విద్యుత్ మీటర్ల రీడింగ్ బాధ్యతలను నుంచి క్రమక్రమంగా తప్పించేలా యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు దారుణమని, ఈ చర్యలతో వేలాది మంది మీటర్ రీడర్లు రోడ్డున పడనున్నారని బాధిత సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేళ్లుగా నాట్ స్కాన్ మీటర్లు ఉన్నప్పటికీ, వాటిని మార్చకుండా వెరిఫై చేయకుండానే..మేమే స్కాన్ చేయడం లేదన్న సాకుతో భారీగా జీతాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన మొబైల్స్ కూడా రీడర్లుకు ఇవ్వకుండా ప్రణాళికబద్ధంగా వేటు వేసేలా కుట్రలు చేస్తున్నార ని ఆరోపించారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను ఇవ్వాలని తామంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నామని.. తక్షణమే యాజమాన్యం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఎస్.అఖిల్, జి.తేజ, ఎల్.భాస్కర్, ఆర్.రమేష్, ఎన్.గోవిందరావు, పి.సంతోష్, బి. దేవీవరప్రసాద్ తదితరులున్నారు. అనంతరం విద్యుత్ శాఖ సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులకు వినతిపత్రాలు అందజేశారు. -
నిమ్మాడలో పట్టపగలే చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రధాన రహదారిలో మంత్రి సోదరుడి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న శిమ్మ కృష్ణారావు ఇంట్లో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. కోట బొమ్మాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణారావు తన భార్య లక్ష్మీతో కలిసి పొలం పనికి వెళ్తూ ఇంటి తాళం చెవిని ఆవరణలో పెట్టి వెళ్లిపోయారు. కుమారుడు, కోడలు పనుల నిమిత్తం నరసన్నపేట వెళ్లారు. తాళం చెవి ఇంటి ఆవరణలో పెట్టడం గమనించిన దుండగులు దర్జాగా తాళం తీసి ఇంట్లో ప్రవేశించి 6 తులాల బంగారం, కొంత నగదు అపహరించుకుపోయారు. కృష్ణారావు పొలం పనులు ముగించి ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం, నగదు పోయినట్లు గుర్తించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం కల్చరల్: క్రైస్తవ సమాజానికి సేవలు అందించడమే లక్ష్యంగా క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్(సీఎస్ఎస్) ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెర్సి చర్చిలో సీఎస్ఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ బర్నబాస్ బింకం(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా ఓంపూరు రమేష్ (శ్రీకాకుళం), కోశాధికారిగా పాస్టర్ ఎం.షక్ర్బాబు (రావాడపేట), ఉపాధ్యక్షులుగా పాస్టర్ జి.ఇ.శామ్యూల్ అరుణ్కుమార్(ఆమదాలవలస), పాస్టర్ టి.పేతురు(ఎచ్చెర్ల), సహాయ కార్యదర్శిగా పాస్టర్ ఆర్.శామ్యూల్ (కొయ్యాం), సహాయ కార్యదర్శిగా పాస్టర్ టి.సూరిబాబు (రణస్థలం), గౌరవాధ్యక్షులుగా పాస్టర్ ఇ.శామ్యూల్ జాన్ (సరుబుజ్జిలి), గౌరవ సలహాదారులుగా పాస్టర్ ఎ.ఎ.పాల్ (సొట్టవానిపేట), కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సీహెచ్.మోజేష్ (గార), పాస్టర్ కె.వి.జాషువ (పాతపట్నం), పాస్టర్ బి.చిన్నారావు (సారవకోట), ప్రచార కార్యదర్శిగా పాస్టర్ అల్లు ఇమ్మానుయేలు (లావేరు), ప్రేయర్ కో–ఆర్డినేటర్గా పాస్టర్ ఆశిర్ కుమార్ (ఆమదాలవలస), యూత్ వింగ ప్రెసిడెంట్గా పాస్టర్ అహరోన్ నియమితులయ్యారు. -
ఆత్మగౌరవం
● మాతృ భాషను మృతభాషగా మార్చొద్దు ● జూనియర్ కాలేజీల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలి ● ఇంటర్ స్పాట్ కేంద్రం వద్ద అధ్యాపకుల నిరసన శ్రీకాకుళం స్పాట్ కేంద్రం వద్ద నిరసన చేపడుతున్న జూనియర్ కళాశాలల తెలుగు అధ్యాపకులు శ్రీకాకుళం న్యూకాలనీ: దేశభాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు.. కీర్తించారని, కానీ తెలుగుభాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మాతృభాషను స్వయంగా ప్రభుత్వమే మృతభాషగా మార్చుతుండటం బాధాకరమని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియెట్ విద్యలో తెలుగు సబ్జెక్టునే లేకుండా నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటాన్ని తెలుగు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. సంస్కరణల పేరిట తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని జూనియర్ కళాశాలల తెలుగు అధ్యాపకు ల సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ పేడాడ రాజేశ్వరరా వు, హనుమంతు సుధాకర్, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, డి.గిరిబాబు, బి.రామలక్ష్మి, తదితరులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సంఘం పిలుపు మేర కు ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వం తీరును, ఇంటర్ విద్య ఉన్నతాధికారుల దుందుడుకు చర్యలకు ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంటర్ విద్యలో తప్పనిసరి గా ద్వితీయభాషగా ఉన్న తెలుగును.. సంస్కరణల పేరిట ఐచ్ఛిక (ఆప్షనల్)సబ్జెక్టుగా చేయడం ద్వారా భవిష్యత్తులో తెలుగుభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి మాతృభాషను వేరుచేయడమంటే.. తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని మండిపడ్డారు. ఆర్ఐఓకు వినతిపత్రం అందజేత.. అనంతరం స్పాట్ కేంద్రం నుంచి జిల్లా ఆర్ఐఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఆర్ఐఓ ప్రగడ దుర్గారావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి, ఇంటర్ విద్య ఉన్నతాధికారులకు తమ గోడును తెలియజేయడమే కాకుండా తెలుగు భాష ఉనికిని, తెలుగు సబ్జెక్టు మనుగడను, తెలుగు అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులతోపాటు అన్నెపు లక్ష్మణరావు, ఎన్.సంతోష్కుమార్, కె.లక్ష్మి, పైడి హేమలత, తారకేశ్వరరావు, వెంకటరమణ, కె.అసిరినాయుడు, ఎం.రమేష్, పైలా శశిధర్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. నాడు గొప్పన్నారు..? ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యలో భాగమే నని.. అలాంటి పాఠశాల విద్యలో గత ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొ స్తే.. పూర్తిగా వ్యతిరేకించి తెలుగు మీడియం కో సం పట్టుబట్టిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సబ్జెక్టే ఉండకూడదని భావించడం ఎంతమాత్రం తగదు. – హనుమంతు సుధాకర్, తెలుగు అధ్యాపకుడు తెలుగు ఆప్షనల్ కాదు.. -
దివ్యాంగులకు తప్పని పాట్లు
ఇచ్ఛాపురం టౌన్: వైకల్య ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి గురువారం వచ్చిన దివ్యాంగులకు అధికారుల తీరు కారణంగా ఇబ్బందులు తప్పలేదు. కంచిలి మండలం బెల్లుప డ గ్రామానికి చెందిన దివ్యాంగులు బి.సీతమ్మ, సీహెచ్ పాపారావు, కె.హరికృష్ణ, సీహెచ్ లత, నర్తు గీతలు అంగవైకల్య ధ్రువపత్రం కోసం దరకాస్తు చేసుకున్నారు. వైద్య పరిశీలనకు గురువారం ఇచ్ఛాపురం సీహెచ్సీకి హాజరుకావాలని నమోదుపత్రంలో సమయం కేటాయించారు. తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి దివ్యాంగులు రాగా.. పరిశీలకులు రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారులు ముందుగా చెప్పకపోవడంతో సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో రావాల్సి వచ్చిందని వాపోయారు. కా గా, దివ్యాంగులకు బుధవారం మాత్రమే వైద్య పరిశీలన చేస్తారని వైద్యాధికారి దేవేంద్రరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ఆయా మండల అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. -
పల్లె గూటికి పండగొచ్చింది
● నేటి నుంచి పోలవరంలో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు ● తొమ్మిదేళ్ల తర్వాత ఉత్సవాల నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు టెక్కలి: ఆ పల్లెకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత పండగొచ్చింది. టెక్కలి మండలం పోలవరంలో తొమ్మిదేళ్ల అనంతరం పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 25 వర కు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. 2016లో జరిగే ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ సభ్యు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి బంధువులు పోలవరం చేరుకోవడంతో గ్రామం కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిరిమానోత్సవం ఇలా.. గ్రామానికి ఆనుకుని వంశధార ప్రధాన కాలువ గట్టుపై గల రావిచెట్టు వద్ద వెలసిన పాశిపోలమ్మ గ్రామదేవతకు సిరిమానోత్సవాలను తొమ్మిదేళ్లకో సారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో నాయుడుగా పిలవబడే బగాది గంగాధ ర చౌదరి సిరిమానుపై ఆశీనులై అమ్మవారికి పూజ లు చేస్తారు. ప్రతీ ఇంటి నుంచి కొత్త చీరను సిరిమానుకు (చింత కర్రకు) కడతారు. ఆ మానుపై గంగాధర చౌదరి ఆశీనులయ్యాక ఊరేగింపు నిర్వహిస్తా రు. రావిచెట్టు వద్ద పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు. ఉత్సవ కార్యక్రమాలివే.. ●శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారి గుడి నుంచి మేళ తాళాలతో దేవర తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ●22న ఉదయం 8 నుంచి పగటి వేషాలతో అమ్మ వారి ఊరేగింపు ఉంటుంది. రణస్థలం, తాడేపల్లిగూడేం కళాకారులతో కోలాటం, తలకాయ డ్యాన్స్, చిన్నారులతో కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తారు. ●23న అమ్మవారి ఊరేగింపు, తాడేపల్లిగూడేం కళాకారులతో కాంతార, లేడీస్ స్పెషల్ గ్రూప్ డ్యాన్స్ లు, మెగా ఈవెంట్స్ జరుగుతాయి. ●24న ఉదయం అమ్మవారి ఊరేగింపు, బాడసూర న్న బృందం జాలారి నాటకం, మధ్యాహ్నం విశాఖ పట్నం కళాకారులతో దాండియా నృత్యాలు, ఇచ్ఛాపురం కళాకారులతో కోయి డ్యాన్స్లు, రాత్రి 7 గంటలకు గుంటూరు, రాజమండ్రి కళాకారులతో సినీ సూపర్ డూప్స్ కార్యక్రమాలు, రాత్రి 10 గంటలకు రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు. ●25న ఉదయం ఒడిశా కళాకారులతో ధూమ్ ధడాకా, సాయంత్రం బిందెల డ్యాన్స్లు, తీన్మార్, అమ్మవారి వేషాలు, సాయంత్రం మేళ తాళాలతో సిరిమానోత్సవం (అంజలి రథోత్సవం అనుపు పండగ) నిర్వహించనున్నారు. అందరి సహకారంతో... గ్రామస్తుల సహకారంతో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. తొమ్మిదేళ్ల తర్వాత జరిగే ఈ వేడులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. – గురుబెల్లి చిన్నంనాయుడు(బాలకృష్ణ), సర్పంచ్, పోలవరం, టెక్కలి మండలం -
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి
● ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలు ● సాక్షి కథనానికి స్పందనశ్రీకాకుళం క్రైమ్: ‘డే అండ్ నైట్.. వెరీ టైట్..’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. నగరంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ సీఐ నాగరాజు గురువారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆటోయూనియన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో ఎక్కడి పడితే అక్కడ ఆటోలు పార్కింగ్ చేస్తూ ఉంచరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సీఐ సూచించగా దానికి ఆటో యూనియన్ వారు తమ యూనియన్ పరిధిలో ఎవరూ అలా పార్కింగ్ చేయరని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే అలా చేస్తుంటారన్నారు. ఆర్టీసీకి లెటర్ పెట్టాం.. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ నాగరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ డే అండ్ నైట్ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేస్తున్న విషయంపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి లెటర్ పెట్టామని, జంక్షన్ సమీపంలో టీవీఎస్ షోరూం వద్ద ఆపమని చెప్పామన్నారు. ఆటోలు కూడా రన్నింగ్లో ఉంటే ట్రాఫిక్ ఏర్పడదని వారికి సూచనలు అందించామన్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్ మార్గంలోను, సింధూర జంక్షన్లో ఇప్పటికే బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. -
గంజాయి నిర్వీర్యం
7,378 కిలోలనిర్వీర్యానికి సిద్ధంగా ఉంచిన గంజాయి ●సాధారణంగా గంజాయి నిర్వీర్యం అంటే చాలా చోట్ల కాల్చివేస్తారు. ● కానీ పాతకుంకాం రెయిన్బో ఇండస్ట్రీలో మాత్రం పోలీసులు శాసీ్త్రయ పద్ధతిలో గంజాయిని నిర్వీర్యం చేశారు. ● ఈ పరిశ్రమలో ఈ ప్రక్రియ నిర్వహించడం ఇదే మొదటిసారి. ● ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాలు నిర్వీర్యం చేస్తారు. ● గంజాయిని తగల బెట్టటం, గోతుల్లో వేసి పూడ్చటం వల్ల కాలుష్య సమస్యలు రావచ్చు. ● అందుకే ఈ పరిశ్రమను ఎంచుకున్నారు. ఇక్కడ పొగ కూడా బయటకు రాకుండా ఏకంగా 16 గంటల పాటు గంజాయిని నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ● కాలుష్య రహిత నిర్వీర్య ప్రక్రియ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదని పోలీసులు వివరించారు. ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం (మన్యం) జిల్లాల్లో 2024 నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 7378 కిలోల గంజాయిని గురువారం పోలీసులు నిర్వీర్యం చేశారు. లావేరు మండలం పాతకుంకాంలో ఉన్న రెయిన్బో పరిశ్రమలో ఈ ప్రక్రియ చేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్ జిందాల్, ఎస్వీ మాధవ్ రెడ్డి పర్యవేక్షించారు. మూడు జిల్లాల నుంచి గంజాయిని ఇక్కడకు వాహనాల్లో తీసుకువచ్చి తూకం వేసి.. శాసీ్త్రయ పద్ధతిలో నిర్వీర్యం చేశారు. మొత్తం మూడు జిల్లాల్లో 226 కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నియంత్రణపై ప్రత్యేక నిఘా: డీఐజీ గోపీనాథ్ జెట్టి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మేర కు రాష్ట్రంలో గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. పాతకుంకాంలో గంజాయి నిర్వీర్య కార్యక్రమంలో భాగంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. 2025లో మూడు దశల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. మొదటి దశలో అనకాపల్లిలో జనవరిలో 3449 కిలోల గంజాయి, 39.04 లీటర్ల హాషిష్ అయిల్, రెండో దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3075 కిలోల గంజాయి, 25.05 లీటర్ల హాషిష్ ఆయిల్, మూడో దశలో ప్రస్తుతం పాత కుంకాంలో 7378 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమంగా సరఫరా అవుతోందని గుర్తించామన్నారు. ఆపరేషన్ గంజా ఇలా..ఎందుకు కాల్చలేదంటే..? -
ఇసుక అక్రమ తరలింపుపై ఆగ్రహం
నరసన్నపేట: గోపాలపెంట ఇసుక ర్యాంపు నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలింపు జరుగుతోందని పోతయ్యవలస గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి ఇసుకతో వెళ్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, లారీ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి లారీలను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో ఇసుక లారీలు అధికంగా వస్తున్నాయని, దీంతో ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తరలింపు నిలుపు చేయాలని కోరుతున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. యాప్ అమలు తప్పనిసరి ఆమదాలవలస: అంగన్వాడీ వర్కర్లు తమకు ఇచ్చిన ఫోన్లో గల పోషణ ట్రాకర్ అనే యాప్లో ప్రతి ఒక్క లబ్ధిదారుని ఫేస్ క్యాప్చర్ చేయాలని జిల్లా ఉమెన్ అండ్ చైర్డ్ డెవలప్మెంట్, సాధికారత అధికారి బి. శాంతిశ్రీ సూచించారు. ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ ఎస్.అనురాధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ భీ పడాయి భీ 3 రోజుల శిక్షణలో మొదటిరోజు గురువారం ఆమె పరిశీలించారు. కార్యకర్తలకు సదుపాయాలు ఉన్నాయా లేదా అన్న అంశాలు తొలుత అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు వచ్చే చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని కార్యక్తలకు సూచించారు. శిక్షణలో అందించే అంశాలు క్షుణ్ణంగా నేర్చుకొని అంగన్వాడీ కేంద్రాల్లో వాటిని విధిగా నిర్వహించాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ‘కూటమి’ చేసిన మేలేంటి? కవిటి: జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో చెప్పాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. ఆయన గురువారం శాసనమండలి సమావేశాల సందర్భంగా మీడియాపాయింట్ వద్ద ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.700 కోట్లు ఖర్చుపెట్టి హిరమండలం నుంచి ఉద్దానం ప్రాంతానికి తాగునీరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రూ.79 కోట్లు వెచ్చించి 200 పడకలతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం కిడ్నీ రోగులను ప్రస్తుతానికి గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఒక డెత్ జరిగితే గానీ మరో బాధితుడికి డయాలసిస్ కేంద్రాల్లో బెడ్ ఇచ్చే దుస్థితి దాపురించిందన్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఈ సెంటర్ను తక్ష ణం ప్రారంభించాలన్నారు. సోంపేట, కవిటి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సెంటర్లలో డయాలసిస్ బెడ్స్ యూనిట్లు పెంచాలని డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మరింత వైద్య సదుపాయాలు సమకూర్చాలని కోరారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రూ.10వేల పింఛన్ ఇచ్చారని, దానికి మరో రూ.5వేలు కలిపి కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. -
శ్రీకాకుళం
కాలువ భూమి సమర్పయామిశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025లావేరు మండలం బుడతవలస, తామాడ రెవెన్యూ పరిధిలో అన్నీ ఆక్రమణలేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చేసిన కబ్జాపై ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన ‘కాలువ భూమి.. సమర్పయామి’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. చదును చేసిన ఆక్రమిత భూములను రెవెన్యూ అఽధికారులు గురువారం పరిశీలించారు. కొలతలు వేసి ఆక్రమణలను గుర్తించారు. ఆక్రమణలివే.. ● లావేరు మండలం బడుతవలస, తామాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను, రస్తాను, గెడ్డ పోరంబోకు ఆక్రమించినట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు తేల్చారు. ● బుడతవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు గల 113/1, 113/2, 113/3, 113/4, 113/5లో గతంలో పలువురికి డీ పట్టాలు ఇచ్చారు. వీటిని సాగు చేయడం లేదు. సమగ్ర భూ సర్వే చేసినప్పుడు వీరంతా అందుబాటులో కూడా లేరు. దీంతో అవన్నీ ప్రభుత్వ భూములే (గయాలు) అని రికార్డుల్లో పేర్కొన్నారు. ● ఇప్పుడా 4.57 ఎకరాల భూములను టీడీపీ నాయకుడు ముళ్ల సాయి ఆక్రమంగా చదును చేసేసి అనుభవంలోకి తెచ్చుకున్నారు. ● అదే విధంగా ఈ భూములకు ఆనుకుని ఉన్న 28 సెంట్ల ప్రభుత్వ రస్తాను కూడా ఆక్రమించి చదును చేసేశారు. ● అదేవిధంగా తామాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105–1లో సాగునీటి కాలువ ఉంది. దాన్ని కూడా కొందరు ఆక్రమించారు. దీంట్లో కొమ్మి నీలవేణి పేరుతో ఎకరా వరకు, కొమ్మి శాంతి పేరుతో 15సెంట్లు, పురుషోత్తపు ఆదినారాయణ అనే వ్యక్తి పేరుతో 10సెంట్లు ఆక్రమించారు. ఇవన్నీ ‘సాక్షి’లో కథనం వచ్చాక పరిశీలించి, ఆక్రమణలని తేల్చారు. చదును చేసిన ముళ్ల సాయి స్టేట్మెంట్ రికార్డు ప్రభుత్వ భూములను అక్రమంగా చదును చేసిన దానిపై టీడీపీ నాయకుడు ముళ్ల సాయిని రెవెన్యూ అధికారులు విచారణ చేశారు. మీరెలా చదును చేస్తున్నారని, మీకు సంబంధమేంటి? అని, మీకెలా భూములొచ్చాయని ఆరాతీశారు. దానికి ఆయన తెలివిగా వ్యవహరించి, డీ పట్టా దారులు చదును చేయమని చెబితే చేశానని, దాని కోసం తమకు సొమ్ము ఇస్తున్నారని వివరణ ఇచ్చారు. పక్కనే ఉన్న రస్తాను ఎలా చదును చేశారని అడిగితే దానికి తనకు తోచిన సమాధానం ఇచ్చారు. ఇదంతా రికార్డు చేసి తహసీల్దార్కు అందించేందుకు నివేదిక సిద్ధం చేశారు. అసైన్డ్దారులకు పిలుపు సమగ్ర భూసర్వేలో ప్రభుత్వ గయాలు 4.57ఎకరాలు చూపిస్తుండగా, వాటిలో తమ పట్టా భూములు ఉన్నాయని కొందరు సమాచారం ఇవ్వడంతో వారంతా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పట్టాలు చూపించాలని, సక్రమంగా ఉంటే అప్పగించడానికి, లేదంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించడానికి, ఒకవేళ అమ్ముకుంటే పీఓటీ కింద స్వాధీనం చేసుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఏదైనా శుక్రవారం జరిగే పట్టాల పరిశీలనలో తేలుతుంది. ఇదిలా ఉండగా, ఇదే భూమిలో కొంత రహదారి కూడా ఉంది. అది కూడా ఆక్రమణకు గురైంది. దీని బాగోతం కూడా బయటపడనుంది. న్యూస్రీల్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి రెవెన్యూ అధికారులు బయటపడిన టీడీపీ నాయకుడి నిర్వాకం 4.57 ఎకరాల ప్రభుత్వ భూములు దర్జాగా చదును 28 సెంట్ల దారి సైతం కబ్జా -
వెరీ టైట్
Traffic Jamపద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు తిరిగి వస్తాడేమో గానీ.. జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ జంక్షన్కు రద్దీ వేళ వెళ్లి తప్పించుకోవడం అంత సులువు కాదు. నిన్న కాక మొన్న ఓ నిండు గర్భిణి ఇదే దారిలో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు అలవాటైపోయిన చెవులు ఆ ఆర్తనాదాలను అప్పుడే మర్చిపోయాయి. ఒక శ్మశానం, పక్కనే పెద్ద స్కూల్, పదుల సంఖ్యలో ఆస్పత్రులు, ల్యాబ్లు, వందల సంఖ్యలో ప్రయాణికులు, ఆపై ఆటోస్టాండ్.. అన్నీ ఇక్కడే ఉండడంతో ట్రాఫిక్కు నిరంతరం ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అవే కొందరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మనసు పెడితే దీనికీ పరిష్కార మార్గాలున్నాయి. – శ్రీకాకుళం క్రైమ్ బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్ వైపు పాఠశాల విద్యార్థులు.. మరో వైపు అత్యవసరం వైద్యం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు.. మరో వైపు అంత్యక్రియలకు హాజరయ్యే వారితో పాటు సాధారణ ప్రజానీకం.. చాలా క్లిష్టమైన పరిస్థితే. గంటల కొద్దీ వాహనాలు నిలిచి చికాకుకు కలిగించే పరిస్థితులు రోజుకీ కో కొల్లలు. దీనిపైన ట్రాఫిక్ వ్యవస్థ.. బాగా స్టడీ చేయాలి. పరిమిత వేళల్లోనైనా సరే ఒన్ వే ఏర్పాటు చేయాలి. వెళ్లడం వరకు ఓకే గానీ తిరిగి మాత్రం కేఎల్నాయుడు ఆస్పత్రి మీదుగా పాత సీఎంఆర్ వెనుక వైపు నుంచి విజయగణపతి ఆలయం చౌరస్తా నుంచి వాహనాలు వెళ్లే విధంగా చూస్తే కొంత సమస్యకు పరిష్కారం దక్కుతుంది. బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్, శ్మశాన వాటిక, కొన్ని ల్యాబ్లు, ఆస్పత్రులు ఉండడంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. కేవలం 10 నుంచి 12 అడుగుల ఇరుకై న దారిలో ఇటు ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. బ్రిడ్జి నుంచి డే అండ్ నైట్ సిగ్నల్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. 7 -
● ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు ఆదేశించారు. ఇటీవల యువత పోరు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబులను అభినందించారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు స్పందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నియోజకరవర్గంలోనూ నాయకులంతా కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అండగా ఉండాలని సూచించారు. కార్యకర్తలకు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలతో వైఎస్ జగన్ -
కాలువ భూమి సమర్పయామి
● సాగునీటి కాలువపై టీడీపీ నేత కన్ను ● ఆక్రమణకు గురైన ఐదు ఎకరాలు ● భూమి విలువ రూ.రెండు కోట్లు పైమాటే ● యంత్రాలతో చదును చేస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఇప్పటికే ఎచ్చెర్లలో రోజుకొకచోట ఆక్రమణకు పాల్పడుతున్నారు. అవన్నీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడా జాబితాలోకి లావేరు మండలం చేరింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు సాగునీటి కాలువలను కబ్జా చేసేస్తున్నారు. దానిలో భాగంగా తామాడ, బుడతవలస పంచాయతీల రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేస్తున్నారు. బుడతవలస రెవెన్యూ పరిధిలోని 113/1, 113/2, 113/3, 113/4, 113/5, 113/7 సర్వే నంబర్లులో ప్రభుత్వ భూమిని, తామాడ రెవెన్యూ పరిధిలో 105 సర్వే నెంబర్లో ఉన్న సాగునీటి కాలువను మొత్తం 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి బుడతవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పూనుకున్నాడు. నెలరోజులుగా చదునుచేసే పనులు ప్రారంభించేశాడు. ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు, డోసర్లు ద్వారా ముందుగా బుడతవలస రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని సాగుచేసేశాడు. అంతటితో ఈయన దాహం తీరలేదు. పక్క పంచాయతీ తామాడ రెవెన్యూ పరిధిలోని తిమ్మప్ప చెరువు నుంచి తాతమానుచెరువు, తూటిబంద, పాతరౌతుపేట చెరువులకు కలుపుతూ ఉన్న కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేసే పనులు చేపట్టాడు. ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే.. తన అనుచరులతో కేసులు పెట్టిస్తామని తిరిగి బెదిరిస్తున్నాడు. దీంతో స్థానికులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తామాడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రౌతు నారాయణరావు ఈ విషయమై జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని విన్నవించారు. లావేరు మండలం తామాడ రెవెన్యూ పరి ధిలోని 105 సర్వే నంబర్లలో తాజాగా సాగు చేసి న భూమి ఇది. ఇక్కడ సాగునీటి కాలువ ఉండేది. ఇప్పుడా కాలువను కప్పేసి సమతలంగా చదును చేసేసి కబ్జాకు పాల్పడుతున్నారు. వాస్తవంగా బుడతవలస, తామాడ రెండు పక్కపక్క గ్రామాలు. ఈ రెండు గ్రామాల పరిధిలోని భూములు కలిసే ఉంటాయి. ఈ రెండింటిమధ్య ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలు ఉన్నాయి. వాటిపై టీడీపీ నాయకుడు కన్నుపడింది. పట్టపగలు జేసీబీలు, ట్రాక్టరు డోసెర్లు పెట్టి చదును చేసేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా ఏ అధికారీ ఆపే ప్రయత్నం చేయలేదు. చర్యలు తీసుకోవాలి లావేరు మండలం బుడతవలస, తామాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములను, సాగునీటి కాలువను సాయి అనే వ్యక్తి ఆక్రమించుకుని చదును చేస్తున్నారు. ఇక్కడ సాగునీటి కాలువ కూడా ఉంది. దీన్ని సైతం కబ్జా చేసి చదును చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. – రౌతు నారాయణరావు, తామాడ, లావేరు మండలం నోటీసులు ఇచ్చాం.. తామాడ, బుడతవలస రెవెన్యూ పరిధిలో ఆక్రమణలు చేపడుతున్నవారికి నోటీసులు ఇచ్చాం. ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తప్పవు. – జోగారావు, లావేరు తహశీల్దార్ -
గ్రామ బహిష్కరణలు పునరావృతమైతే కఠిన చర్యలు
● గెద్దలపాడు గ్రామపెద్దలను హెచ్చరించిన ఆర్డీఓ కృష్ణమూర్తి టెక్కలి: గ్రామ బహిష్కరణ సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి హెచ్చరించారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ చంద్రమ్మ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటనపై బుధవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో గ్రామపెద్దలు, యూనియన్ నాయకులు, బాధితులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉద్యోగాల అమ్మకాలు, బలవంతపు రాజీనామాలు చేయించడం, కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయడం వంటి సంఘటనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బాధితురాలు చంద్రమ్మ, కుటుంబ సభ్యులు కలిసి టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్వీఎస్ఎన్.మూర్తికి ఫిర్యాదు చేశారు. తన ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన శిర్రాకిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. దేవరవలసలో అగ్ని ప్రమాదం జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామంలో అప్పారావు, అప్పలదాస్, సూర్యారావులకు చెందిన సుమారు వంద బస్తాల ధాన్యం కట్టలు, ఐదు ఎకరాల గడ్డివాములు బుధవారం రాత్రి 2 గంటల సమయంలో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల మేరకు నష్టం చేకూరింది. రాత్రి సమయంలో ఎవరైనా దుండగులు నిప్పుపెట్టారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
‘ఉపాధి’లో వెలుగు చూసిన అక్రమాలు
కంచిలి: మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల్లో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు 31 పంచాయతీల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. చివరిగా బుధవారం ఈ నివేదికలు వెల్లడించే ప్రజావేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 31 పంచాయతీల పరిధిలో ఏడాదిపాటు చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించి నాణ్యత, కొలతలు, వేతనదారులకు అందిన బిల్లులు, హాజరు పట్టిక పరిశీలన, రశీదుల పంపిణీ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ సిబ్బంది సేకరించిన వివరాలను నివేదించారు. అవకతవకలు బయటకు ఏడాది కాలంలో ఉపాధి హామీ, హౌసింగ్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఆర్వీఎం విభాగాల్లో మొత్తంగా 1,783 పనులు చేపట్టారు. వీటికి సంబంధించి సోషల్ ఆడిట్ చేపట్టిన నేపథ్యంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చాయి. దీంతో ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.64,446లు రికవరీకి అధికారులు ఆదేశించడంతో పాటు రూ.38,500లు జరిమానాగా విధించారు. మొత్తంగా రూ.1,01,946లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీలవారీగా సోషల్ ఆడిట్ నివేదికలు చదివిన సందర్భంగా చాలా వరకు పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు చేపట్టినచోట కనీసం మస్టర్లలో హాజరు కూడా సక్రమంగా వేయడం లేదని, వేతనదారుల బిల్స్కు సంబంధించి రశీదు పత్రాలు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. హాజరు పట్టికలో సంతకాలు, వేలిముద్రలు కూడా లేవని సోషల్ ఆడిట్ డీఆర్పీలు నివేదించారు. అంతేకాకుండా మెటీరియల్ కాంపొనెంట్ పనులకు సంబంధించి పూర్తిగా చేపట్టని నిర్మాణాలకు సైతం బిల్లులు విడుదల చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల కొలతల్లో కూడా తేడాలు ఉన్నట్లు తెలిపారు. ఇలా అడుగడుగునా పర్యవేక్షణ లోపం, పనుల్లో డొల్లతనం అనేవి ఈ ప్రజావేదిక సాక్షిగా వెల్లడయ్యాయి. సమావేశంలో డ్వామా పీడీ సుధాకరరావు, స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో వి.తిరుమలరావు, విజిలెన్స్ డీవో స్వరూపారాణి, ఏపీడీ పంచాది రాధ, విజిలెన్స్ అధికారి శ్రావణ్, ఏపీవో జి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. రూ.64,446ల రికవరీకి అధికారుల ఆదేశం రూ.38,500ల జరిమానా విధింపు -
రెచ్చిపోయిన పచ్చ తమ్ముడు
ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చనివాటిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అడ్డు తొలగించుకుంటున్నారు. మండలంలోని కొత్త శాసనం గ్రామంలో 30 ఏళ్ల క్రితం అప్పటి గ్రామపెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో సొంత నిధులతో రచ్చబండను నిర్మించాడు. రచ్చబండ మధ్యలో రావి చెట్టు, పక్కనే త్రినాథ స్వాములవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తులు వేసవి విడిది చేయడం, సమావేశాలు నిర్వహించడం, బాటసారులు విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు. అయితే రచ్చబండకు వెనుకన స్థానిక టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరుకు చెందిన భూమి ఉంది. దీంతో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో తన భార్య జానికమ్మతో కలిసి బుధవారం గునపాలతో రచ్చబండను పెకిలించే ప్రక్రియకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అడ్డుకున్నవారి అంతు చూస్తానంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సర్పంచ్ కారంగి త్రినాథ్రెడ్డి తహసీల్దార్కు, రూరల్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. రచ్చబండ ధ్వంసం చేసిన భాగాలకు మరమ్మతులు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రచ్చబండ తొలగింపునకు యత్నం -
ఆక్రమణ స్థలం పరిశీలన
కవిటి: మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని టీడీపీ నేత చదును చేయించడంపై సాక్షి పత్రికలో ‘చదును ఇదే అదును..!’ శీర్షికతో బుధవారం ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ మురళీమోహనరావు స్పందించారు. ఈ మేరకు మండల సర్వేయర్ మల్లికార్జున పాణిగ్రాహి, ఆర్ఐ రమణమూర్తి, వీఆర్వో ఎస్.నారాయణతో కలిసి సంబంధిత స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ స్థలం చుట్టూ ఉన్న రైతులతో ఆయన మాట్లాడి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వాస్తవానికి ఇది రోడ్డు పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది ప్రభుత్వ స్థలమని అందువలన చదును చేసిన ఖాళీ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఎలా చదును చేశారని చదును చేయించిన వజ్జ రంగారావును ప్రశ్నించారు. అయితే తన కొబ్బరి తోటకు ఆనుకొని ఉండడంతో వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు చదును చేసినట్లు ఆయన తెలిపారు. రైలు ఢీకొని ఆవు మృతి టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. మంగళవారం రాత్రి గుణుపూర్ నుంచి నౌపడ వైపు వెళ్లే రాజారాణి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన ఆవుని బుధవారం జేసీబీ సాయంతో తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే మృతి చెందిన ఆవు ఎవరిది అనేది తెలియలేదు. ఆవు మృతదేహాన్ని తొలగిస్తున్న సిబ్బంది -
ఆందోళన వద్దు.. అండగా ఉంటా..
పొందూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అనునిత్యం అండగా ఉంటానని ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్ అన్నారు. రాజకీయ కక్షలతో మండలంలోని ఖాజీపేట గ్రామంలో జరిగిన కొట్లాటలో 42 రోజులుపాటు రిమాండ్లో ఉండి బెయిల్పై వచ్చిన బాధితులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు చింతాడ వెంకట సత్యప్రసాద్, తమ్మినేని మురళి, బొమ్మాళి గిరి, పైడి నాగభూషణం, సూర ఆనందరావు, పైడి లోకనాథం, సింగూరు తేజేశ్వరరావు, కూటికుప్పల రాజు, కిల్లి సన్యాసిరావు, గురుగుబెల్లి శేఖర్ ఉన్నారు. -
కేజీబీవీ
లుపిలుస్తున్నాయ్..! కేజీబీవీ అందుబాటులోని కోర్సు ఆమదాలవలస(తాళ్లవలస) ఎంపీసీ బూర్జ(కొల్లివలస) బైపీసీ ఎచ్చెర్ల(పొన్నాడ) ఎంపీసీ జి.సిగడాం ఎంపీసీ గార(శాలిహుండం) బైపీసీ హిరమండలం(పాత హిరమండలం) బైపీసీ ఇచ్ఛాపురం(బెల్లుపాడ) సీఈసీ జలుమూరు ఎంపీసీ కంచిలి(జాడుపుడి) ఎంపీసీ కవిటి(కొత్తపాలెం) ఎంపీసీ కోటబొమ్మాళి(కొత్తపేట) బైపీసీ కొత్తూరు(వసప) ఎంపీసీ ఎల్ఎన్పేట ఎంఎల్టీ లావేరు(మురపాక) ఎంపీసీ మందస(జీఆర్పురం) ఎంఎల్టీ మెళియాపుట్టి బైపీసీ నందిగాం(మదనాపురం) ఎంపీసీ పాతపట్నం(ఇందిరమ్మకాలనీ) ఎంపీసీ పోలాకి(గంగివలస) బైపీసీ పొందూరు(లోలుగు కాలనీ) బైపీసీ రణస్థలం(లంకపేట) ఎంపీసీ సంతబొమ్మాళి ఎంపీసీ సారవకోట(మెయిన్రోడ్) ఎంపీసీ సోంపేట(రాజాం) బైపీసీ శ్రీకాకుళం(సింగుపురం) ఎంపీసీ ఇంటర్మీడియట్ కోర్సులు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కో కోర్సును ప్రభుత్వం అందుబా టులోకి తీసుకొచ్చింది. వాటి వివరాలు పరిశీలిస్తే... ● ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● 6వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ● ఈనెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ● మొత్తం 2,224 సీట్ల భర్తీకి చర్యలు శ్రీకాకుళం న్యూకాలనీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు వేళయ్యింది. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చు. 25 కేజీబీవీల్లో ప్రవేశాలు పునర్విభజన అనంతరం 30 మండలాల శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1,000 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించడంతో కేజీబీవీకి 40 చొప్పున మొత్తం 1,000 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 7, 8, 9, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను సైతం భర్తీ చేపట్టనున్నారు. ఇందులో 7వ తరగతిలో 34, 8వ తరగతిలో 11, 9వ తరగతిలో 4, 12వ తరగతి ఇంటర్ సెకండియర్లో 172 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద కొత్త విద్యా సంవత్సరంలో 2,224 సీట్లను భర్తీ చేయనున్నారు. పేద, అనాథ పిల్లలతో పాటు బడిబయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు టెన్త్క్లాస్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జ్ట్టిఞ:// ్చఞజుజఛఠి. ్చఞఛిజటట. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన ఫలితాలు కేజీబీవీలు 2004లో ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు, సదుపాయాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ఏటా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేవిధంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 2018 నుంచి ఇంటర్మీడియట్ కోర్సులను కూడా అందిస్తున్నారు. 2018లో జిల్లాలో జి.సిగడాం, కోటబొమ్మాళి కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టగా, 2019లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరో 19 కేజీబీవీల్లో ప్రవేశాలకు గత రాష్ట్ర ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. 2021 నుంచి అన్ని చోట్ల ఇంటర్మీడియట్ కోర్సులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థినుల భద్రతకు పెద్దపీట ● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం. ఉపాధ్యాయులు (టీజీటీ/ పీజీటీలు) సైతం మహిళలే. ● అలాగే ప్రహరీ, గేటు, వాచ్మ్యాన్లతో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది. ● అధికారుల తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు అవకాశం లేదు. ● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ● మనబడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు. ● అత్యద్భుతమైన మెనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు. ● సైన్స్ ప్రాజెక్టులు, యోగా, క్రీడలు, ఆటపాటలు నిర్విరామంగా ఉంటాయి. నీట్, జేఈఈ, ఏపీఈఏపీసెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా విద్యార్థినులను సన్నద్ధం చేస్తున్నారు. ● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక వంటి పథకాలకు వీరంతా అర్హులు. హెల్ప్లైన్ కేంద్రం ఏర్పాటు కేజీబీవీల్లో ఆన్లైన్లో దరఖాస్తుల సమయంలో ఏర్పడే సందేహాలు, సమస్యల నివృత్తి కోసం ప్రభుత్వం టోల్ఫ్రీ నంబర్ 18004258599ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సందేహాల కోసం సమగ్రశిక్ష జీసీడీవో 94401 12221 నంబర్ను సంప్రదించవచ్చని ఏపీసీ డాక్టర్ శశిభూషణ్ సూచించారు. మంచి అవకాశం కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రత్యేకంగా బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశమని చెప్పాలి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదు వు, వసతి కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. స్టేట్ ఎస్పీడీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. – డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, సమగ్ర శిక్ష ఏపీసీ, శ్రీకాకుళం -
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాల, రెల్లి, వాటి అనుబంధ కులాల నేతలు కోరారు. ఈ మేరకు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అందువలన ఆ ఆలోచనను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 14 ఏళ్ల క్రితం జనాభా లెక్కలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. జేసీని కలిసినవారిలో తైక్వాండో శ్రీను, కంఠ వేణు, అర్జి కోటి, అర్జీ ఈశ్వరరావు, జలగడుగుల గోవిందరావు, జలగడుగుల శ్రీరామ, గొల్లపల్లి మోహన్, అర్జి రామ్మోహన్రావు, అర్జి చిన్న, కె.కూర్మారావు, కల్యాణి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదుపులోకి రాని మంటలు మందస: మండలంలోని చీపి గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం చెలరేగిన అగ్నికీలలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అటవీ ప్రాంతంలోని ఔషధ వనరులు, వన్యప్రాణులు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. బుధవారం నాటికి రుక్కి పర్వత ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. అటవీ శాఖ అధికారులు ఈ ప్రమాదంపై స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడు అరెస్టు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారంపురంలో భార్య గాలి నాగమ్మను అతి కిరాతకంగా హత్యచేసి, ఎచ్చెర్ల పోలీస్స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయిన అప్పలరెడ్డిని జేఆర్పురం సీఐ ఎం.అవతారం బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని అంపోలు సబ్జైల్కు తరలించారు. సోమవారం రాత్రి మద్యం మత్తులో అనుమానంతో భార్యను దారుణంగా కత్తితో నరికాడు. హత్యలో ఒకడికి మాత్రమే ప్రమేయం ఉండడం, నిందితుడు లొంగిపోవడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు ఎస్ఐలు వి.సందీప్కుమార్, నక్క కృష్ణారావు సహకరించారు. గ్రేట్ అనిపించారు..! కవిటి: దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యూయే ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)– 2025 ఫలితాల్లో కవిటి మండలం బల్ల ఎర్రగోవిందపుట్టుగకు చెందిన బల్ల తనూజ మెరిసింది. బుధవారం విడుదల చేసిన ఫ లితాల్లో జాతీయ స్థాయిలో 396వ ర్యాంకు కై వసం చేసుకుంది. సాయి తనూజా తండ్రి జానకిరావు సోంపేట మండలంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సత్తాచాటిన పూజిత ఎల్.ఎన్.పేట: మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పనిచేస్తున్న పైడి శ్రీనివాసరావు కుమార్తె పైడి పూజిత గేట్–2025లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 25వ ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు. ఎచ్చెర్ల క్యాంపస్: టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్యూటేషన్పై అధ్యాపకునిగా పనిచేస్తున్న కొండ వినోద్ కుమార్కు గేట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో 28 ర్యాంకు వచ్చింది. అతను శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2012–15 మధ్య పాలిటెక్నిక్, అనంతరం టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తిచేసి పాలిటెక్నిక్ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. జాతీయ విద్యా సంస్థల్లో ఎంటెక్ చేయాలన్న ఆకాంక్షతో గేట్ రాయగా మంచి ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేసి, బోధన రంగంలో అత్యున్నత స్థాయికి చేరడమే తన లక్ష్యమన్నారు. -
కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురు
కాశీబుగ్గ: పేకాట రాయుళ్లను పట్టుకోవడానికి వెళ్లి పొరపాటున ఒడిశా భూభాగంలోకి వెళ్లిన కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురైంది. ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు ఒడిశా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సోమ వారం అర్ధరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడం వివాదాస్పదమైంది. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వాహనాలలో ఎక్కించి త రలించగా స్థానికులు అడ్డుకున్నారు. గజపతి జిల్లా ఎస్పీకి కాశీబుగ్గ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బృందంతో పాటు రెండు వాహనాలను ఒడిశా సరిహద్దులో గురండి పోలీసుస్టేషన్ సమీపంలో స్థానికులు అడ్డుకున్నారు. -
చదును.. ఇదే అదును!
కవిటి : మండల కేంద్రం కవిటిలో ప్రభుత్వ భూమిని కవిటి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వజ్జ రంగారావు భారీ ఖర్చుతో చదును చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చదును పేరిట స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఇటువంటి పనులు చేస్తున్నారని పరిసర ప్రాంత రైతులు చెబుతున్నారు. కవిటి నుంచి రాజపురం వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన రంగారావుకు కొబ్బరి తోట ఉంది. రోడ్డుకు, తోటకు మధ్య కొంత ప్రభుత్వ స్థలం కూడా ఉంది. ఈ స్థలంలో ఇటీవల ట్రాక్టర్తో మట్టి లోడ్లు లేశారు. మట్టి వేయ డం జేసీబీతో వేసిన చదును చేయడం ఏకకాలంలో చేపట్టారు. ట్రాక్టర్ వెళ్లడానికి స్థలాన్ని చదును చేయిస్తున్నానని చెబుతున్నా స్థలం అంతటినీ చదును చేయిస్తుండడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తోటకే వెళ్లేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకోవాలంటే అంత ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంత భారీ మొత్తం ఖర్చు పెట్టి చదును చేయాల్సిన అవసరం ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండానే.. ప్రభుత్వ స్థలం చదును చేయించాలంటే అధికారుల ఆమోదం పొందాలి. సుమారు 40 సెంట్ల వరకు అక్కడ స్థలం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడే విద్యుత్ స్టబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేశారు. అప్పట్లో రంగారావు అభ్యంతరం తెలపడంతో ఆ ప్రయత్నాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు స్థలం చదును చేయించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అధికారాన్ని, స్థానికంగా ఉన్న ప్రభుత్వ విప్ బి.అశోక్ అండదండలతోనే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను కవిటి–రాజపురం రోడ్డుపక్కన స్థలాన్ని జేసీబీతో చదును చేయించిన వైనం స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్న స్థానిక రైతులు పరిశీలించాం.. స్థలం చదును విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. తన తోటకు వెళ్లడానికే మాత్రమే స్థలాన్ని చదును చేయిస్తున్నానని, ఆక్రమణకు కాదని రంగారావు చెప్పారు. ఒకవేళ స్తంభాలు వంటివి పాతితే శాఖాపరమైన చర్యలు చేపడతాం. – ఎస్.నారాయణ, వీఆర్ఓ -
ఏప్రిల్ 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఏప్రిల్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు మంగళవారం తెలిపారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 7221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: అనుమతులకు వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహంపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన జూమ్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విండోకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని జీఎంను అడిగారు. 15 దరఖాస్తులు రాగా 13 ప్రాసెస్లో ఉన్నట్లు జీఎం విజయరత్నం చెప్పారు. ిపీఎంఈజీపీలో 69 లక్ష్యం కాగా 90 మంజూరు చేశామని ఇందుకు రూ.4.39 కోట్లు మంజూరు చేసినట్లు జీఎం తెలిపారు. ఏప్రిల్ 13 న జిల్లాస్థాయి మేధా సమ్మాన్ పరీక్ష కవిటి: జిల్లాలోని అన్ని ఒడియా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్(అపోటా) ఆధ్వర్యంలో మేధా సమ్మాన్ ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్టు అపోటా ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి తెలిపారు. మంగళవారం సహలాలపుట్టుగ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన వివరాల్ని వెల్లడించారు. ఈ నెల 25 లోగా ఏ పాఠశాల నుంచి ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారన్న సమాచారాన్ని ఆయా మండలాల అపోటా అధ్యక్ష,కార్యదర్శులకు నివేదించాలన్నారు. ఐదో తరగతి చదువుతున్న వారు ప్రతి పాఠశాల నుంచి 5 మందికి మించకుండా బాలబాలికలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు కవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిపై కవిటి పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు మంగళవారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై ఈ వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా విచారణ చేశారు. ఈ వ్యక్తి ఈ నెల 11న బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. మళ్లీ 14వ తేదీన కూడా అలాగే ప్రవర్తించినట్లు గ్రామంలో జరిపిన విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణను కాశీబుగ్గ రేంజి డీఎస్పీ కె.వెంకట అప్పారావు పర్యవేక్షణలో చేపడుతున్నామని చిన్నంనాయుడు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించామన్నారు. రిమ్స్లో అత్యవసర సమాచార సేకరణకు ఫోన్ నంబర్ శ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, ప్రసూతి విభాగంలో అత్యవసర సమాచార సేకరణ కోసం ఓ నూతన కార్యక్రమాన్ని ప్రారభించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ అన్నారు. రిమ్స్లో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.పార్వతి ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం చేతుల మీదుగా మంగళవారం మొబైల్ నంబర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పార్వతి మాట్లాడుతూ.. ప్రసూతి విభాగంలో అత్యవసర సేవలకు ఈ ఫోన్ నంబర్ వాడుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్ను డీఎంహెచ్ఓ కార్యాలయం ద్వారా అన్ని పీహెచ్సీలకు అందిస్తామని డీసీహెచ్ఎస్ డాక్టర్ కల్యా ణ్ బాబు తెలిపారు. -
● ఎందుకింత అడ్డుగోలు తనం...
సాఽదారణంగా పంచాయతీల్లో ఏ పనులు చేపట్టినా సర్పంచ్ల నేతృత్వంలో పంచాయతీ కార్యవర్గం ఆధ్వర్యంలో జరగాలి. మండల పరిషత్ నిధులతో చేపట్టే పనులు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీల తీర్మానంతోనే ఏదైనా జరగాలి. కానీ, ప్రస్తుతం తీర్మానాల వరకే సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలని, పనులు వచ్చేసరికి తమ పార్టీలకు చెందిన నాయకులకేనని చెప్పేస్తున్నారు. సర్పంచ్లు కేవలం తీర్మానాలకే పరిమితమని తెగేసి చెప్పేస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నట్టుగా ఇప్పుడు వెండర్ పేరుతో గ్రామస్థాయిలో కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను ఎంపిక చేసి, వారి పేర్లనే జిల్లా జల యాజమాన్య సంస్థ(డ్వామా)లో రిజిస్ట్రేషన్ చేసి, వారికే గ్రామస్థాయి పనులు కాంట్రాక్ట్ అప్పగించి, వారి పేరున బిల్లులు మంజూరు చేస్తున్న పరిస్థితులు నెలకొ న్నాయి. వెండర్స్ పేరుతో కూటమి నాయకుల పేర్లు శిలాఫలాకాల్లోనూ వేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న వారిని మాత్రం విస్మరిస్తున్నారు. -
పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ‘పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి, పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది‘ అని కలెక్టర్ హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ పై సమీక్షించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్పై ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కష్ణమూర్తికి సూచించారు. సమీక్షకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీఓ ప్రసన్న లక్ష్మి, టెక్కలి ఆర్డీవో కృష్ణ మూర్తి, ఐసీడీఎస్ పీడీ బి.శాంతి శ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. -
వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్ టెండర్
స్థానిక సంస్థల ప్రతినిధులను డమ్మీలుగా మార్చేశారు.. టెండర్లు పిలవకుండానే పనులు కట్టబెడుతున్నారు.. వెండర్స్ ముసుగులో సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాధనం దోచి పెడుతున్నారు.. సర్పంచ్లు, ఎంపీటీసీలను గౌరవిస్తామని చెప్పి.. వారికి అధికారమన్నదే లేకుండా చేస్తున్నారు.. వెరసి కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. దీంతో తమ హక్కులు, గౌరవం కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోరాడాల్సి వస్తోంది. ● కూటమి ప్రభుత్వం తీరుపై స్థానిక సంస్థల ప్రతినిధుల నిరసన ● అడ్డగోలుగా మెటీరియల్ కాంపోనెంట్ పనుల కేటాయింపు ● రాజ్యాంగానికి తూట్లు పొడిచిన పాలకులు ● వెండర్స్ ముసుగులో రూ. 700కోట్ల మేర టీడీపీ నేతలకు పంపకాలు ● టెండర్లు పిలవకుండానే పనుల అప్పగింత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను డమ్మీ చేసి పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులకు పనులు అప్పగించడంపై నాయకులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాల్లో గట్టిగా నిలదీస్తున్నారు. పంచాయతీ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. మండల పరిషత్ సమావేశాలను వాకౌట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి, నిరసనలు కూడా చేస్తున్నారు.. ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్టాలకు భిన్నంగా ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఉమ్మడి జిల్లాలోని లక్ష్మీపురం, మునకలవలస, గుల్లపాడు తదితర పంచాయతీలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కూడా ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనుల్లో కనీసం 50శాతానికి తక్కువగా కాకుండా పనులు గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ తీర్పులు పట్టించుకోకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపేందుకు కూటమి ప్రభుత్వం అడ్డదారిలోనే వెళ్తోంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తానొక ప్రత్యేకమని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానమేంటో కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. కానీ దీనిపై తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం స్థానిక నేతలను అవమానిస్తోంది. వారితో పని లేదన్నట్టు వ్యవహరిస్తోంది. దీంతో స్థానిక సంస్థల నాయకులు స్థానికంగా ఆందోళనలతో మొదలుపెట్టి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 2014–19 సమయంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, ఆ సభ్యులతోనే పనులన్నీ చేయించింది. ఇప్పుడా జన్మభూమి కమిటీ స్థానంలో వెండర్స్ అనే కొత్త పేరుతో టీడీపీ నాయకులను రంగంలోకి దించింది. ముందుగా గ్రామాల వారీగా వెండర్స్గా ఆ పార్టీ నాయకుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసి, ఆ వెండర్స్ రూపంలో ఉన్న నాయకులతో గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులను చేయిస్తోంది. ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామసభలు పెట్టి రికార్డు సృష్టించామని ప్రజల్ని మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం.. ఆ రోజు సర్పంచ్లు, ఎంపీటీసీలతో తీర్మానాలు చేసి, పని అయ్యాక వారందరినీ పక్కన పెట్టేసి వెండర్స్ ముసుగులో టీడీపీ నాయకులకు ఏకపక్షంగా పనులు కట్టబెట్టేసింది. వాస్తవంగా మెటీరియల్ను సరఫరా చేసేవాళ్లని వెండర్స్ అంటారు. కానీ, కూటమి ప్రభుత్వం దానికి కొత్త భాష్యం చెప్పింది. వెండర్స్ అంటే కాంట్రాక్టర్స్ అన్నట్టుగా పనులు చేయించుకునిపోతోంది. చట్టంతో మాకేంటి పని..! రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం పంచాయతీలో చేపట్టే పనులను ఆయా పాలకవర్గాలే చేపట్టాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 16లో 5వ ఉప అంశం ప్రకారం గ్రామ పంచాయతీ వెచ్చించే నిధుల్లో 50శాతం పనులు పంచాయతీల ద్వారా చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి వెండర్స్తో పనులు చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా ఎంపీడీఓలు డైరెక్ట్గా వెండర్స్ రిజిస్ట్రేషన్ చేయించి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేయిస్తున్నారు. అలాగే పంచాయతీ తీర్మానం లేకుండా చేపట్టే పనులకు చట్టబద్ధత కూడా ఉండదు. కానీ, కూటమి ప్రభుత్వంలో అదేమీ పాటించడం లేదు. జిల్లాలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర శిక్ష అభియాన్, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పనులకు శ్రీకారం చుట్టింది. వాస్తవంగా ఈ నిధులేమీ రాష్ట్ర ప్రభుత్వానివి కావు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధుల్లో 60శాతం వేతనాల రూపంలో ఖర్చు పెట్టాల్సి ఉండగా, మిగతా 40శాతం నిధులను మెటీరియల్ కాంపోనెంట్ కింద నిర్దేశిత అభివృద్ధి పనులు చేపట్టాలి. అంటే కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తదితర ఇంజినీరింగ్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధుల్లో 40శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 699.57కోట్లతో 5310పనులు మంజూరు చేసింది. ఇవన్నీ పంచాయతీల తీర్మానాల ద్వారా, పాలక వర్గాలు చేపట్టాలి. నేతలకు పంచి పెట్టిన పనులు.. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీలతో చేప హక్కులు కాలరాసి, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇటీవల నందిగాం మండల పరిషత్ సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ట్టాల్సిన పనులను టీడీపీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టేసింది. టెండర్లు పిలిచి, పనులు చేయించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఆ పార్టీ నాయకులకు వెండర్స్ ముసుగులో ఏకపక్షంగా కేటాయించేసింది. పర్యవేక్షక అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 183 కోట్ల పనులు చేసేసినట్టు రికార్డుల్లో చూపించేశారు. -
కుటుంబాలను వెలివేయడం అనైతికం
టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో అనైతికంగా కుటుంబాలను వెలివేసే సంఘటనలు జరగడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ కుటుంబంపై జరిగిన దుశ్చర్యను మంగళవారం తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతా ఎంతోమంది చిన్న స్థాయి ఉద్యోగులను బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేశారని, దీనికి గెద్దలపాడులో జరిగిన ఘటనే తార్కాణమని తిలక్ గుర్తు చేశారు. గ్రామాలను, పాఠశాలలను శుభ్రం చేసే గ్రీన్ అంబాసిడర్లు మొదలుకొని మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బందిని బలవంతంగా తొలగించడమే కాకుండా కూటమి నాయకులంతా ఆయా ఉద్యోగాలను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. గెద్దలపాడు ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలన్నారు. సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం కేవలం ఆయా పార్టీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తున్నారనే విషయం తేటతెల్లంగా మారిందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇటువంటి బెదిరింపులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
పోలీసులకు దొరికిపోయాడు
తుఫాన్లా వచ్చాడు.. ● 21 కేజీల గంజాయితో తుఫాన్ అనే వ్యక్తి అరెస్టు ఇచ్ఛాపురం: ఒడిశా రాష్ట్రం డెంకానాల్ జిల్లా నువా గ్రామానికి చెందిన తపన్ సమాల్ అలియాన్ తుఫాన్ అనే యువకుడు గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తుఫాన్కు గుంటూరులో ఓ డాబా వద్ద తమిళనాడుకి చెందిన ముతురాజ్, సుందర్రుధిర సమితో ‘గంజాయి’ పరిచయం ఏర్పడింది. రూ.15 వేలకు కేజీ గంజాయి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామం సమీపంలోని గలపాడు నుంచి కేజీ రూ.7500 చొప్పున 21.040 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. ఒడిశా నుంచి బస్సులో బయలుదేరి ఇచ్ఛాపురం మంగళవారం చేరుకున్నాడు. అనంతరం రైలు కోసం వెళ్తుండగా రత్తకన్న ఎల్సీ రైల్వే గేట్ వద్ద రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఓ యువకుడు.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని 80 ఫీట్ రోడ్డు సమీప ఏపీహెచ్బీ కాలనీ గ్రౌండ్లో రెండు కిలోల గంజాయితో ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తోటపాలెంకు చెందిన లొట్టి సురేష్ ఏపీహెచ్బీ కాలనీ గ్రౌండ్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో పాటు వెళ్లి సురేష్ను అదుపులో తీసుకోగా అతని వద్ద రెండు కిలోల గంజాయి ప్యాకెట్ లభించింది. సీఐ పైడపునాయుడు ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం సురేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. -
విద్యుత్ మీటర్ రీడర్లను ఆదుకోవాలి
కాశీబుగ్గ: విద్యుత్ శాఖలో తీసుకొస్తున్న మార్పుల వల్ల సుమారు ఐదు వేల మీటర్ రీడర్ కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ పలాస డివిజన్ నాయకులు చాపర వేణుగోపాల్, జిల్లా మీటర్ రీడర్స్ అధ్యక్షుడు ఆర్.కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం మీటర్ల రీడర్లతో కలిసి పలాస విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా కేటీరోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లు విద్యుత్ బిల్లులు తీస్తున్న సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఐఆర్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్ల బిగిస్తున్న నేపథ్యంలో జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం పలాస విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మీటర్ రీడర్ల సంఘ జిల్లా కార్యదర్శి దూగాన భాస్కరరావు, పలాస డివిజన్ అధ్యక్షుడు బి.ఓంకార్, పలాస డివిజన్ కార్యదర్శి కె.నరేష్, సోంపేట, పలాస సబ్ డివిజన్ మీటర్ రీడర్లు పాల్గొన్నారు. -
ఆర్టీసీ యాజమాన్యం తీరు సరికాదు
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో యాజమాన్యం ఎంప్లాయిస్ యూనియన్కే కొమ్ము కాయడం అన్యాయమని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ జిల్లా సెక్రటరీ ఎంఎన్ రావు మాట్లాడుతూ యాజమాన్యం ఒక యూనియన్కే కొమ్ముకాస్తూ వారు ఎలా చెపితే అలా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక కండక్టర్ వేరే డిపోలో పనిచేస్తూ శ్రీకాకుళం –1 డిపోకి రిలీవింగ్ డ్యూటీకి వచ్చారని, వారి ఆర్డర్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి కాలపరిమితి ముగిసిందన్నారు. అయినప్పటికీ అతనిని శ్రీకాకుళం 1వ డిపోలోనే కొనసాగిస్తూ కండక్టర్, డ్రైవర్ డ్యూటీ చార్ట్ కౌన్సిలింగ్లో అతనికి ప్రాధాన్యమిస్తూ సీనియారిటీ జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. అతనికి, ఎంప్లాయిస్ యూనియన్కు ఆర్టీసీ యాజమాన్యం, డిపో యాజమాన్యం అన్ని విధాలా సహాయపడుతూ తమ ఎన్ఎంయూను చులకనగా చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే పంథా కొనసాగితే సహించేది లేదన్నారు. నిరసన కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు కె.నరసింహులు, నవీన్, ఎంఎస్ రాజు, కె.టి.రావు, వి.డి.రావు, ఆర్ఎస్ చలం తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని కోల్పోయి.. తల్లి ఆస్పత్రి పాలై..
● దిక్కుతోచని స్థితిలో ముగ్గురు బాలికలు ● సాయం చేయాలని వేడుకోలు కాశీబుగ్గ : ఆ ముగ్గురు చిన్నారులు రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయారు. అదే ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైంది. ఇప్పుడు ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమకు దాతలు సాయం అందించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ ప్రాంతంలో బుట్ట గంగాధర్, సరళ దంపతులు ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉండేవారు. గంగాధర్ దివ్యాంగుడు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తులు లేవు. పదిరోజుల క్రితం ఒడిశా రాష్ట్రం గండహతి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు లోయలో పడిపోయారు. గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సరళకు కాలు, నడుము విరిగిపోయాయి. ఆస్పత్రిలో దిక్కుతోచని స్థితిలో ఉంది. వారి సంతానమైన ముగ్గురు బాలికలు అనాథలుగా మిగిలిపోయారు. దాతలు స్పందించి చిన్నారులకు చేదోడుగా నిలబడాలని అమ్మమ్మ జి.గౌరీ(8374708027) వేడుకుంటోంది. -
ఆక్రమణకు ఎత్తు‘గోడ’!
ప్రభుత్వ భవనాల ● పొన్నాంలో ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ భవనాల కబ్జాకు స్కెచ్ ● భవనాలకు గోడలు కట్టిస్తున్న విశ్రాంత వీఆర్ఓ ● గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు ● పట్టించుకోని రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పొన్నాం పంచాయతీ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ పోరంబోకు స్థలంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల ఆక్రమణకు రంగం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ విభాగం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్లాబ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాలపై అదే గ్రామానికి చెందిన ఓ రిటైర్ట్ వీఆర్వో కన్నుపడింది. తనకున్న పలుబడి, కూటమి నాయకుల సహయ సహకారాలతో వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం గోడలు సైతం కట్టేస్తున్నాడు. ఇదీ పరిస్థితి.. పొన్నాం పంచాయతీ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు సర్వేనెంబర్ 287లో 65 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ స్థలం ప్రభుత్వ పోరంబోకుగానే ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సైతం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రానికి రూ.21.80 లక్షలు, వెల్నెస్ సెంటర్కు రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ రెండు భవనాల నిర్మాణం శ్లాబ్ దశకు వచ్చి ఆగింది. భవన నిర్మాణం కొనసాగుతున్న కొద్ది రెండింటికి కలిపి ఇప్పటికి సుమారు రూ.20 లక్షల నిధులు కూడా ప్రభుత్వం విడుదలచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవనాలను అదే గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ వీఆర్వో తనకున్న పలుబడితో ఏకంగా వాటికి గోడలు కట్టేందుకు పూనుకున్నాడని అదే గ్రామానికి చెందిన దుడ్డు ముత్యాలనాయుడు, గొండు రమేష్, దుంగ సత్యం, గుండ రమేష్, తదితర గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భవనాల నిర్మాణం జరిగేటప్పుడు ప్రశ్నించని సదరు విశ్రాంత వీఆర్ఓ ప్రభుత్వం మారాక ఒక్కసారిగా శ్లాబ్ వేసిన బిల్డింగ్లకు నాలుగు వైపులా ఎలా గోడలు కడతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పునాదులు తీసినప్పుడు గానీ, పిల్లర్లు వేసినపుడు గానీ ఆభూములకు ఎటువంటి కాగితాలు, పత్రాలు అప్పట్లో చూపని సదరు వ్యక్తికి ఇప్పటికిప్పుడు భూమి పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయని వారు ప్రశ్నించారు. వారిదే బాధ్యత.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆ రెండు భవనాలను మాకు ఇంకా అప్పగించలేదు. నిర్మాణం చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులే ఆ భవనాలను చూసుకోవాలి. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నట్లు తెలిసింది. – బి.శైలజ, ఎంపీడీఓ, శ్రీకాకుళం -
కుటుంబాలను వెలివేయడం అనైతికం
టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో అనైతికంగా కుటుంబాలను వెలివేసే సంఘటనలు జరగడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ కుటుంబంపై జరిగిన దుశ్చర్యను మంగళవారం తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతా ఎంతోమంది చిన్న స్థాయి ఉద్యోగులను బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేశారని, దీనికి గెద్దలపాడులో జరిగిన ఘటనే తార్కాణమని తిలక్ గుర్తు చేశారు. గ్రామాలను, పాఠశాలలను శుభ్రం చేసే గ్రీన్ అంబాసిడర్లు మొదలుకొని మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బందిని బలవంతంగా తొలగించడమే కాకుండా కూటమి నాయకులంతా ఆయా ఉద్యోగాలను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. గెద్దలపాడు ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలన్నారు. సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం కేవలం ఆయా పార్టీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తున్నారనే విషయం తేటతెల్లంగా మారిందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇటువంటి బెదిరింపులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
పోయిన గొలుసు తిరిగొచ్చింది
● అర తులం బంగారు గొలుసును పోగొట్టుకున్న ప్రయాణికురాలు ● తిరిగి అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగులు శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు తన కుమార్తె మెడలో వేసిన అర తులం(6గ్రాములు) బంగారు గొలుసును పోగొట్టుకుంది. బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఆ గొలుసు దొరకడంతో ప్రయాణికురాలికి తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పలాస డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఇచ్ఛాపురం నుంచి విశాఖ బయలుదేరింది. పలాస చేరుకున్న తర్వాత కొత్తపల్లి మౌనిక తన కుమార్తెను తీసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు బస్సు ఎక్కింది. గమ్యస్థానమైన శ్రీకాకుళం కాంప్లెక్స్లో కుమార్తెతో సహా దిగిపోయింది. ఆ సమయంలో కుమార్తె మెడలో ఉన్న అర తులం బంగారు గొలుసును జారవిడుచుకుంది. ఈ విషయం గమనించని తల్లి, కుమార్తెలు బస్సు దిగి వెళ్లిపోయారు. ఇంతలో కండక్టర్ సీహెచ్ బెహరా, డ్రైవర్ పి.ఎస్.రావులకు ఆ గొలుసు దొరకడంతో స్టేషన్ మేనేజర్ ఎంపీ రావుకు అందజేశారు. కొద్దిసేపటి తర్వాత బంగారు గొలుసు పోగొట్టుకున్న మౌనిక బస్సు వద్దకు వచ్చి ప్రయాణికులకు చెప్పగా వారు కండక్టర్, డ్రైవర్లకు గొలుసు దొరికిందని, అధికారులకు అందజేయడానికి వెళ్లారని తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, కండక్టర్, డ్రైవర్ సమక్షంలో గొలుసును మౌనికకు అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్ను అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఏడీసీ మొజ్జాడ హాటకేశ్వరరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఎచ్చెర్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గ్రామీణ యువత కోసం సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్లో 13 రోజుల ఉచిత శిక్షణను ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తామని, పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలి అరసవల్లి: పెద్దపాడు సమీపంలో ఈ నెల 12న విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నారాయణరావుపై దాడికి పాల్పడిన స్థానిక టీడీపీ నేత కలగ శ్రీనివాసరావుపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. ఇంకో మూడు రోజుల్లో దీనిపై తేల్చకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని విద్యుత్ కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తిని మంగళవారం పలువురు కార్మిక ఉద్యోగ సంఘ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. దాడి చేయడమే కాకుండా మిగిలిన వారిపై పరుష పదజాలంతో దూషించినా పోలీసులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. ఇలాగైతే విధులు నిర్వర్తించడం కష్టమని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ఎస్ఈ తదితర ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఈని కలిసిన వారిలో ఎం.ప్రభాకరరావు, టి.వి.సుబ్రహ్మణ్యం (1104), కె.వైకుంఠం (తెలుగునాడు), సీహెచ్ పాపారావు (327), బి.గురునాథరావు (బహుజన) , విద్యుత్ కార్మిక యూనియన్ నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఖాతాల నిర్వహణపై శిక్షణ ఎచ్చెర్ల క్యాంపస్: స్వయం సహాయక సంఘాల ఖాతాల నిర్వహణ ఆన్లైన్ చేయాలని వెలుగు సంస్థ సంస్థాగత నిర్మాణం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్రావు అన్నారు. ఎచ్చెర్లలోని జిల్లా సాంకేతిక శిక్షణ కేంద్రంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం, కొత్తూరు, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి మండలాల ఏసీ, ఎల్ఎస్, ఏపీఎం, సీసీ, వీవోఏలకు లోకోస్ సాఫ్ట్వేర్, ఆన్లైన్ ఖాతాల నిర్వహణపై మంగళవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా స్వయం సహాయ సంఘాలు విజయవంతంగా ముందుకు సాగాలన్నారు. గ్రామైక్య, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఖాతాల నిర్వహణ పక్కాగా ఉండాలని చెప్పారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం భాగ్యలత, అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల వేళల్లో మార్పు శ్రీకాకుళం అర్బన్ : వేసవి దృష్ట్యా జిల్లా లోని అంగన్వాడీ కేంద్రాల సమయవేళల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శాంతిశ్రీ మంగళవారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. మే 31వ తేదీ వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయన్నారు. ప్రీ స్కూల్ చిన్నారులకు వండిన ఆహారం అందించి వారి గృహాలకు పంపించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలు గమనించాలని కోరారు. -
మొదలైన ఇంటర్ స్పాట్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా సోమవారం మొదటివిడత సబ్జెక్టుల జవాబుపత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. జవాబుపత్రాల దిద్దుబాటులో సీఈలు, ఏఈలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆర్ఐఓ/జిల్లా స్పాట్ క్యాంఫ్ ఆఫీసర్ ప్రగడ దుర్గారావు పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరు స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్ఐఓ పి.దుర్గారావు స్పష్టంచేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని బారువ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని బారువ గ్రామానికి చెందిన నెయ్యిల అశోక్ కుమార్ (43) సోమవారం మృతి చెందాడు. రైల్వేలైన్ దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య వసంత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆదిత్యాలయంలో అక్రమ వ్యవహారాలపై విచారణ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఇటీవల కాలంలో ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో వచ్చిన పలు కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లావణ్య సోమవారం సాయంత్రం అరసవల్లిలో అధికారులతో చర్చించి అక్రమ వ్యవహారాల అంశాల వారీగా వివరాలను సేకరించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ఆలయానికి చెందిన పలువురు దినసరి వేతనదారులతో పాటు ఇతర ఉద్యోగుల నుంచి లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. రిటైర్డ్ ఈఓ జగన్మోహనరావుపై వస్తున్న అనేక అవినీతి ఆరోపణలపై కూడా ఆరా తీశారు. రథసప్తమి నాడు నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ టిక్కెట్ల విక్రయాలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ ఆపరేటర్ యుగంధర్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే అన్నదాన ప్రసాదాల కౌంటర్లు నిర్వహణలో ఇబ్బందులు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా విచారణ చేశారు. -
దేశ భద్రతలో యువత భాగస్వాములవ్వాలి
రణస్థలం: దేశ భద్రతలో యువత భాగస్వాములవ్వాలని సీఐఎస్ఎఫ్ జవాన్లు పిలుపునిచ్చారు. సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పే, డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్ల ఆధ్వర్యంలో 80 మంది సభ్యుల సైకిల్ యాత్ర సోమవారం రణస్థలం చేరుకుంది. దీంతో వీరికి తహసీల్దార్ ఎన్.ప్రసాద్, వివిధ పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్పై సీఐఎస్ఎఫ్ విధులు, దేశ భద్రతలో పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప శ్చిమబెంగాల్లోని బకేలి నుంచి ఒక బృందం, గుజరాత్లోని లఖపథ్ నుంచి ఒక బృందం సైకిల్ యాత్ర ప్రారంభించామని తెలిపారు. 9 రాష్ట్రాల్లో 25 రోజుల పాటు 6,553 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి మార్చి 31న కన్యాకుమారిలో ముగిస్తామన్నారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం, ఆక్రమ ఆయుధాల నివారణ, తీరప్రాంత భద్రత, తీవ్రవాదుల చొరబాటు నివారణ, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. సమృద్ధ్ సంరక్షణ పేరుతో చేపట్టిన సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజలను భద్రతా సిబ్బందితో మమేకం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమాండెంట్లు ఏకే సింగ్, అమిత్ కుమార్, ఏకే మహాపాత్రో, షికార్ లోహియా, శ్రీనివాస్, ఎస్ఐ చిరంజీవి, మహిళ పోలీసు బమ్మిడి అమ్మోజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: తీరప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ సోమవారం ఉదయం విశాఖపట్నానికి బయల్దేరింది. జిల్లా మాజీ సైనిక సంఘ సభ్యులు కొత్తరోడ్డు జంక్షన్ వద్ద జెండా ఊపి ర్యాలీని సాగనంపారు. వీరితో పాటు ట్రాఫిక్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్ఐ రాము తదితరులున్నారు. -
కాశీబుగ్గలో భారీ చోరీ
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ గాంధీనగర్ ప్రాంతం వివేకానంద కాలనీలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మెట్ట సుదర్శనరావు, భానుమతి దంపతుల ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఈనెల 8వ తేదీన కాశీ పుణ్యక్షేత్రం వెళ్లి తిరిగి సోమవారం వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలుగొట్టినట్లు గమనించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా దేవుడి గదిలో ఉన్నటువంటి పన్నెండు తులాల బంగారం, ముప్పై తులాల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు తెలియజేయడంతో హుటాహుటిన క్లూస్ టీమ్ చేరుకుని వేలిముద్రలను సేకరించారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా వరుస దొంగతనాలతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ–బీలో చేర్చాలి కవిటి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో నివసిస్తూ గొల్లలుగా పిలవబడుతున్న యాదవులను ప్రస్తుతం ఉన్న బీసీ–డీ రిజర్వేషన్ కేటగిరీ నుంచి, బీసీ–బీలుగా మార్చాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. సోమవారం శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటులో ఉన్నారని, బీసీ కమిషన్ ద్వారా అధ్యయనానికి కమిటీ వేసి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ సిబ్బందికి కంప్యూటర్ శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ శాఖల సిబ్బందిని నేటి నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్, అడ్వాన్స్ టూల్పై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి, జిల్లా కేంద్రంలో ఉన్న ఆయా శాఖల సిబ్బందికి కలిపి 100 మంది ఉద్యోగులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ శిక్షణ ఉంటుందని తెలిపారు. మార్చి 20వ తేదీన టెక్కలి డివిజన్ కేంద్రంలో 40 మందికి, మార్చి 21న పలాస డివిజన్ కేంద్రంలో 30 మందికి, మార్చి 22న శ్రీకాకుళం డివిజన్ కేంద్రంలో 30 మంది ఉద్యోగులకు శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. శాసన మండలిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్తు రామారావు -
పట్టుబడిన పుస్తెలతాడు దొంగ
● మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచేసిన కేసు కొలిక్కి కాశీబుగ్గ: మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆపై బంగారు పుస్తెలతాడు దోచుకున్న కేసులో నిందితుడిని కాశీబుగ్గ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, సీఐ సూర్యనారాయణలు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పురుషోత్తపురం కాలనీకి చెందిన బంగారుబండి ప్రదీప్ ఈనెల 12వ తేదీన పలాస కిడ్నీ ఆస్పత్రి వద్ద ఆటో కోసం వేచి ఉన్న దుంపల యశోదకు తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె కోసంగిపురం కూడలి వద్ద దింపమని కోరుతుండగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆపి ఆమెను బంగారు పుస్తెలతాడును ఇవ్వమని కత్తితో బెదిరించాడు. కానీ ఆమె ఇవ్వకపోవడంతో తెంచుకొని తన ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని విశాఖపట్నంలో ఐటీఐ చదువుకున్న నిందితుడు చదువుమానేసి ఖాళీగా ఇంటివద్ద సెల్ఫోన్తో కాలం గడుపుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో అధిక సంపాదనకు ఆశపడి తన తల్లి ఖాతా నుంచి రూ.1.10 లక్షలు పోగొట్టుకున్నాడు. అవి తిరిగి రాకపోవడంతో చేసేదేమీలేక ఎలాగైనా తల్లికి తెలియకుండా డబ్బులు తిరిగి ఖాతాలో వేయాలని ఆలోచించాడు. దీనిలో భాగంగా బంగారం చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బంగారం పలాస రైల్వే కాలనీలో ఉన్నటువంటి తన బాబాయి రోశవ కిరణ్కుమార్ ఇంటికి వెళ్లి అమ్మమని చెప్పాడు. దీంతో సమీపంలోని రెల్లివీధిలో ఉన్న బంగారు వర్తకుడు పవర్ రంజిత్కు అమ్మారు. వచ్చిన డబ్బులో తన బాబాయి రూ.27 వేలు ఉంచుకొని, నిందితుడికి రూ.1.50 లక్షలు ఇచ్చాడు. అయితే బెట్టింగ్ యాప్లతో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోవని తన బాబాయి వద్ద రూ.10 వేలు కావాలని అడగడానికి వస్తుండగా, ప్రదీప్ను కాశీబుగ్గ పోలీసులు అక్కుపల్లి జంక్షన్ వద్ద స్కూటీ నంబర్ ఏపీ39డీబీ9839 గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారు. -
నేడు ఎస్బీఐ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం
శ్రీకాకుళం అర్బన్: ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ నాలుగో సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కె.రామచంద్రరావు తెలిపారు. నగరంలోని సన్రైజ్ హోటల్లో ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాను రెండు విభాగాలుగా ఎస్బీఐ ఇండియా, ఎస్బీఐ హైదరాబాద్, అమరావతి సర్కిల్స్గా విభజించారన్నారు. 2022లో గుంటూరులో ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడుచోట్ల సర్వసభ్య సమావేశం నిర్వహించామని, నాలుగో సర్వసభ్య సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,500 మందితో పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అతిపెద్ద సభ్యత్వం కలిగిన పెన్షనర్స్ యూనియన్గా దేశంలోనే నంబర్ వన్ అసోసియేషన్గా ఉందని వివరించారు. ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ అందుతుందని అనుకోవడం అపోహ మాత్రమేనని వెల్లడించారు. ఏ ద్వైపాక్షికంలో రిటైర్ అయితే ఆవిధంగానే పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు తాము సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు. విశ్రాంత ఎస్బీఐ పెన్షనర్స్ తరఫున రెడ్క్రాస్ సంస్థకు ఫ్రిజ్ను అందజేయడం జరిగిందని, అదేవిధంగా ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఎనిమిది మంచాలను అందించినట్లు వివరించారు. గత ఐదేళ్లలో పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు చేయడంలో శ్రీకాకుళం నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీఎస్వీఎస్ శర్మ, డీజీఎస్సీహెచ్ వెంకటేశ్వరరావు, సర్కిల్ ఉపాధ్యక్షుడు బాపయ్య పంతులు, ఏజీఎస్ శశిభూషణ్ రాజు, చైర్మన్ కోటేశ్వరరావు, వీఎస్పీ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. -
నా పరిస్థితి ఏంటి?
ప్రమాదంలో నా రెండు కాళ్లు పోయాయి. పూర్తిగా చచ్చుబడ్డాయి. వికలాంగ పింఛన్ వస్తుందన్న ఆశతో ఇప్పటికి పలుమార్లు గ్రీవెన్స్కు వచ్చా. ఫలితం లేదు. ఏమంటే నా తండ్రికి ప్రభుత్వ ఉద్యోగమంటున్నారు. నా జీవనం పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా ఫించను ఇవ్వాలి. – డి.రామ్కుమార్, హిరమండలం ఆరుసార్లు ఫిర్యాదు చేశా.. 1951లో 28 సెంట్లకు (సర్వే నెంబరు 49/10) రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. వెబ్ల్యాండ్లో మిస్సయిందని డాక్యుమెంట్లున్నా ఎస్ఎల్ఆర్లో ఎలా ఉంటే అలా పెట్టేశారు రెవెన్యూ వాళ్లు. ఇప్పటికి ఆరు సార్లు ఫిర్యాదు చేశా. పట్టించుకోవడం లేదు. – అల్లు రమణమూర్తి, రామదాసుపేట, జలుమూరు మండలం పట్టా కోసం.. 28 ఏళ్ల కిందటి నుంచి మా తాత డోల రామ్మూర్తికి 12 సెంట్ల స్థలం ఉంది. ఇందులో డీపట్టా 7 సెంట్లు తహసీల్దార్ ఖాళీ చేయించి వేరే వారికి ఇచ్చేశారు. ఉన్న ఐదు సెంట్లు జిరాయితీ. అందులో రేకుల షెడ్డు ఉంది. దానికై నా పట్టా ఇస్తారని కలెక్టర్కు విన్నవించుకుందామని వచ్చా. డోల రామ్మూర్తి పేరుతో ఫిర్యాదు చేసిన మనవడు, చెట్టు పొదిలాం, జి.సిగడాం మండలం ● -
ఉరుకులు.. పరుగులు
● మొదలైన పది పరీక్షలుఒక కేంద్రం బదులు.. మరో కేంద్రానికి మెళియాపుట్టి: చీపురుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థి ఎన్.ఈశ్వరరావు జాడుపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. వాస్తవానికి ఈశ్వరావు చాపర జెడ్పీ స్కూల్లో పరీక్ష రాయాల్సి ఉంది. ఆ విషయం అతని తండ్రికి తెలియక సదరు విద్యార్థిని తీసుకొని మెళియాపుట్టి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అయితే దివ్యాంగ విద్యార్థి తరపున పరీక్ష రాయాల్సిన యువకుడు (స్క్రైబ్) చాపర సెంటర్ వద్ద నిరీక్షిస్తున్నాడు. సమయం కూడా మించిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది హాల్ టికెట్ చూసి మళ్లీ చాపర పంపించారు. ఉపాధ్యాయులు అవగాహన కల్పించకపోవడంతోనే ఇబ్బంది పడ్డామని తండ్రి వాపోయారు. అనంతరం విద్యార్థి పరీక్ష రాశాడు.శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్కు రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లావ్యాప్తంగా 28,357 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 28,140 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 217 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలిరోజు ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ● విద్యార్థుల అవస్థలు పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో పోలీసులు 144 సెక్షన్ను పక్కాగా అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోకి ఎవరినీ అనుమతించలేదు. విద్యార్థులను సైతం కేంద్రాల్లోకి ప్రవేశించేటప్పుడు నిశితంగా పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించలేదు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేయడం, ట్రాఫిక్ కష్టాలు, నిర్దేశిత కేంద్రాలకు బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఎంపిక చేసిన రూట్లలో బస్సులు తిరగలేదని వాపోయారు. అలాగే కరెంట్ కోతలతో అటు అధికారులు, ఇటు విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం ఉక్కపోతల నడుమ విద్యార్థులు పరీక్షలు రాశారు. ● అధికారుల తనిఖీలు విస్తృతం ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ని సందర్శించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. ఫర్నీచర్ ఏర్పాట్లు, తాగునీరు, ఇతర వసతులను పరిశీలించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళంలోని గీతాంజలి స్కూల్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి అధికారులను ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తుపై పోలీసులకు పలు సూచనలు చేసి, 144 సెక్షన్ పటిష్టంగా అమలు కావాలని దిశానిర్దేశం చేశారు. టెన్త్ పరీక్షల జిల్లా పరిశీలకుడు, ఏపీఈర్ఈఐఎస్ డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య రాగోలు, ఆమదాలవలస, శ్రీకాకుళంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్లు సంయుక్తంగా అంపోలు, గార, కళింగపట్నం కేంద్రాలను తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, డీవైఈవోలు, ఇతర అధికారులు పరీక్ష కేంద్రాలను చుట్టుముట్టారు. కాగా సీ–సెంటర్లగా ఉన్న 65 కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తొలిరోజు విద్యార్థులతో సహా హాజరైన తల్లిదండ్రులు, బంధువులతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 149 కేంద్రాల్లో పరీక్షలు తొలిరోజు 217 మంది గైర్హాజరు పరీక్ష కేంద్రాల వద్ద పక్కాగా 144 సెక్షన్ అమలు ‘ఓపెన్ స్కూల్’ పరీక్షలు ఆరంభం అలాగే జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా చేపట్టే టెన్త్ పరీక్షలు సైతం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12.30 గంటల నుంచి వరకు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ టెన్త్ పరీక్షలు తొలిరోజు 59 మంది రాయాల్సి ఉండగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఇద్దరు ఫ్లయింగ్, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్స్లు పరీక్ష కేంద్రాలపై నిఘా పెట్టారు. -
కుంటిభద్రలో ఏనుగుల తిష్ట
శ్రీకూర్మం పరిధిలో పులి కలకలంకొత్తూరు: మండలంలోని కుంటిభద్ర గ్రామంలో సోమవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది. రాత్రి వంశధారలో నీటిని తాగుతూ పగలంతా అరటి, చెరుకు, మొక్కజొన్న పంటల్లో తిష్ట వేస్తున్నాయి. ఏనుగులను కవ్వించవద్దని తహసీల్దార్ రవిచంద్ర సూచించారు. గార: శ్రీకూర్మం, అంపోలు పంచాయతీల పరిధిలో పులి సంచరిస్తోందని పుకార్లు వెల్లువెత్తాయి. ఆది వారం ఉదయం శాలిహుండం పంచాయతీ పరిధి తంగుళ్లపేటలో చూశామని రైతులు తెలిపారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది శాలిహుండం, సతివాడ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పొలాలు, నీటి కాలువల వెంబడి పాదముద్రలు పరిశీలించారు. సోమవారం ఉదయం నుంచి శ్రీకూర్మం పంచాయతీ చల్లపేట, అంపోలు పంచాయతీ జెల్లపేట పరిధిలో పులి ఉందని పుకార్లు షికార్లు చేశాయి. -
క్యాంటిన్ కోసం టెండర్లు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో క్యాంటిన్ ప్రారంభం కోసం టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లుగా క్యాంటిన్ నిర్వహించడం లేదు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది అల్పాహారం కోసం ఎచ్చెర్ల గ్రామంలోకి వెళ్తున్నారు. దీంతో క్యాంటిన్ నిర్వహిస్తే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. క్యాంటిన్ వల్ల వర్సిటీ వర్గాలకు అల్పాహారం, స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. పేదల విద్యపై కక్ష తగదు ● వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేదల విద్యపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పదిమంది లోపు విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలలు మూసేవేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తే, కొన్ని గ్రామాల్లో దాదాపు 5 కి.మీ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నాడు–నేడు పేరుతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. అలాగే పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఇప్పటికే తల్లికి వందనం పథకానికి తక్కువ నిధులు కేటాయించి మోసం చేసేందుకు పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు 17కి గాను 7పూర్తి కాగా, మరో 10 కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీలను సక్రమంగా నిర్వహించాలి పలాస: అంగన్వాడీలను సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కె.అప్పారావు సూచించారు. మండలంలోని రంగోయి, పెంటిభద్ర అంగన్వాడీలు, బాలసదనం తదితర కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఉన్న బాలింతలు, బాలలు, గర్భిణులతో మాట్లాడి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. కేంద్రాల్లో మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెంటిభద్రలో శిథిలావస్థలో ఉన్న బావిని పూడ్చాలని ఎంఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. ఆయనతో పాటు బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ యు.శ్రీలక్ష్మి, సభ్యుడు ఎం.గన్నప్పుడు, జిల్లా బాలల రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు, జీసీడీవో ఎస్.నీరజ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు యు.లత, ఎస్.సరస్వతీ, గంగమ్మ తదితరులు ఉన్నారు. ఎస్పీ గ్రీవెన్స్కు 63 వినతులు శ్రీకాకుళం క్రైమ్ : ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే ప్రజల సమస్యల పట్ల పోలీసు అధికారులు ప్రాధాన్యతనివ్వాలని, చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన 63 వినతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ స్టేషన్లు చుట్టూ పలుమార్లు తిప్పించుకోవద్దని హితవు పలికారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి పొందూరు: చేనేత మహిళలు స్వయం శక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలని సిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.అప్పలనాయుడు ఆకాంక్షించారు. స్థానిక దేవాంగ సంఘ గ్రంథాలయంలో నాబార్డు ఆధ్వర్యంలోని ఆర్ట్సు స్వచ్ఛంద సంస్థ సోమవారం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ చేనేత, రైతు మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. తమ సంస్థలో చేనేత విభాగంలో 515 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు పొందిన జల్లేపల్లి కాంతమ్మతో పాటు మరో 60 మంది చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కుప్పిలి పద్మ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
184 వినతుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 184 అర్జీలు స్వీకరించారు. వినతుల్లో కొన్ని.. ● ఇంజినీరింగ్ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్నాయని, అయితే ఫీజు చెల్లించలే దని కళాశాల యాజమాన్యం హాల్ టిక్కెట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో పరీక్షలు రాయలేకపోతున్నామని, కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విద్యార్థి పి. శ్రీనివాసరావు కోరాడు. ● విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.సోమ సుందర రావు, జనరల్ సెక్రటరీ పీఎస్ ప్రసాదరావు, స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు కోరారు. ● ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారని గార మండలం శ్రీకూర్మం పంచాయతీకి చెందిన పలువురు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. బస్టాండ్ వద్ద 15 సెంట్ల స్థలం ఆక్రమించి బోరు వేసి గోడలు కడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ హక్కులను కాలరాస్తున్నారు శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ పంచాయతీ తీర్మానాలతో సంబంధం లేకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నేరుగా వెండర్ రిజిస్ట్రేషన్ చేయించి, జాతీయ ఉపాధి హామీ నిధులతో పనులు చేయిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. వెండర్ రిజిస్ట్రేషన్ విధానం కేవలం అధికార పార్టీకి అనుకూలంగా చేశారని ఆరో పించారు. ఉపాధి పనుల నిర్వహణకు ప్రత్యేకంగా చట్టం ఉందని గుర్తు చేశారు. పంచా యతీ రాజ్ చట్టం ప్రకారం ఒక సంవత్సరంలో ఒక గ్రామ పంచాయతీకి వెచ్చించే మొత్తం ఖర్చులో కనీసం 50 శాతం పనులు పంచాయ తీల ద్వారా చేపట్టాలని ఉత్తర్వులు ఉన్నాయని, దాన్ని ఈ పాలకులు ఆచరించడం లేదని విమర్శించారు. ఈ విధానాలపై విజయనగరం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలం, లక్ష్మీపురం, మునకలవలస, గుల్లపాడు గ్రామ పంచాయతీలు గత ఏడాది నవంబర్ నెల 26న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయని తెలిపారు. తుది తీర్పు ఈ ఏడాది ఫిబ్రవరి 5న వెలువడిందని, ఈ కోర్టు ఉత్తర్వులు ప్రకారం అభివృద్ధి పనులు మొత్తాన్ని గ్రామ పంచాయతీల ద్వారానే నిర్వహించాలని తెలిపిందని అన్నారు. ప్రస్తుతం పంచాయతీలు అన్నింటినీ వైఎస్సార్ సీపీ ప్రతినిధులు ఉన్నందున, ఆ అక్కసుతోనే కూటమి ప్రభుత్వం అలసత్వం చూపుతోందని తెలిపారు. -
ఎందుకీ పీజీఆర్ఎస్..
మాది పొందూరు మండలం కనిమెట్ట. మా నాన్న అప్పయ్య ఫ్రీడమ్ ఫైటర్ కావడంతో ఎచ్చెర్ల మండలం ముద్దాడలో 198/2 సర్వే నంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమికి పక్కనే వేరే వాళ్లకు స్థలం ఇచ్చారు. సర్వే సిబ్బంది సరిగా కొలవక ఎకరా భూమిని వారికే అప్పజెప్పారు. వెబ్ల్యాండ్లో మా నాన్న పేరుతో ఐదెకరాలు చూపిస్తున్నా ఫిజికల్గా నాలుగే ఉంది. ఇప్పటికి ఐదారుసార్లు కలెక్టర్ పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. చివరికి పీజీఆర్ఎస్ అండార్స్మెంట్లో హద్దులు చూసేందుకు వీలుపడలేదు అని నాకు పంపించారు. సమస్యలు తీర్చనప్పుడు మరెందుకుంది పీజీఆర్ఎస్. – కేవీ నర్సింహం, రిటైర్డ్ ప్రిన్సిపాల్, కనిమెట్ట, పొందూరు మండలం ప్రభుత్వ భూమి ఆక్రమణ లావేరు మండలంలోని తామాడ గ్రామంలో సర్వే నంబరు 105, 113లో 1, 2, 3, 7 సర్వే నంబర్లలో గల సుమారు 4 నుంచి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ముళ్ల సాయి అనే వ్యక్తి ఆక్రమించుకుని చదును చేసేశారు. ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుందే తప్ప ప్రశ్నించడం లేదు. ఈ భూమిలోనే చిన్న గెడ్డ కూడా ఉంది. ఆక్రమణ వల్ల గెడ్డ మూసివేతకు గురైంది. తక్షణమే అధికారులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. – రౌతు నారాయణరావు, లావేరు మండలం, తామాడ గ్రామం పెన్షన్ కోసం.. నా వయసు 55. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి అయిపోయింది. మరో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నాకు ప్రమాదం జరిగి 6 నెలలు అవుతోంది. ప్రమాదంలో చెయ్యి, కాలు దెబ్బతిన్నాయి. ఎక్కడికీ వెళ్లి పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పెన్షన్ కోసం ఊరిలో ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయాను. గ్రీవెన్స్లో అయినా ఫిర్యాదు చేస్తే వికలాంగ పెన్షన్ మంజూరు చేస్తారనే ఆశతో వచ్చాను. – ఎస్.అప్పారావు, రణస్థలం మండలం, సీతంవలస ● -
సమస్యలు పరిష్కరించాలి..
● ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వెల్లువెత్తుతున్న వినతులు ● అరకొరగానే సమస్యల పరిష్కారం ● రెవెన్యూ సర్వే శాఖల్లో ఎండార్స్మెంట్లకే పరిమితం ● దాన్నే పరిష్కారంగా చూపిస్తున్న వింత వైనం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొంగరాం గ్రామం వద్ద నిర్మించిన జగనన్న కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ సాయంత్రం అయితే సరి గంజాయి బ్యాచ్లు, మందుబాబుల వీరంగం అంతా, ఇంతా కాదు. జగనన్న కాలనీ వద్ద రోడ్డు ముందే మందుషాపు పెట్టారు. దీంతో మందుబాబులు పట్టపగలే ఇళ్ల వద్దకు వచ్చి చిందులు వేస్తున్నారు. ఇక్కడ ఇళ్లకు ఏర్పాటు చేసిన పైపులను, ఇంటిపై పెట్టిన వాటర్ ట్యాంక్లను దొంగతనం చేస్తున్నారు. ఇక్కడ ఉండేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యలను పరిష్కరించాలి. – కొంగరాం జగనన్న కాలనీ వాసులు శ్రీకాకుళం పాతబస్టాండ్/ శ్రీకాకుళం అర్బన్ / శ్రీకాకుళం క్రైం: ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్సెల్ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోంది. దీంతో వచ్చిన వారే పదే పదే వినతులు పట్టుకుని ప్రతి వారం లైనులో నిలుచోవాల్సి వస్తోంది. పలు శాఖలకు సంబంధించి 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 7,724 వినతులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 6,555 సమస్యలు పరిష్కారం జరిగినట్టు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ ఈ ‘పరిష్కారం’పైనే బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు క్షేత్రస్థాయికి చేరే సరికి ఎండార్సుమెంట్తో సరిపెడుతున్నారు. పైగా దీన్నే పరిష్కారంగా చూపిస్తూ.. పైన పేర్కొన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యేదెలా..? వాస్తవానికి పింఛను కావాలని ఒక వయోవృద్ధుడు వస్తే, ఆయనకు కలెక్టర్ పింఛను మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వంలో అసలు అవకాశమే లేదు. సంబంధిత సైట్ను ప్రభుత్వం ఎప్పుడో మూసివేసింది. అలాగే ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని, లేదా ఉన్న కార్డు నుంచి తొలగిపోవాలన్నా, చేర్పించాలన్నా ప్రస్తుతం ఆ పనులేవీ జరిగే పరిస్థితి లేదు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని అధికారులు చెబుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన వినతులన్నీ కేవలం పైకి ఎండార్స్ చేస్తూ ఫిర్యాదుదారులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సైట్లు లాక్ కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యుల సమస్యలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. కొత్త ఇల్లు రావడం లేదు. పింఛన్లు కూడా కొత్తగా ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ జోలికిపోవడం లేదు. ఉన్న పింఛన్లు కూడా తీసేస్తున్నారు. అధికారులను అడిగితే ‘అన్ని సైట్లు లాక్’అని సమాధానం చెబుతున్నారు. దీంతో ప్రజలు వినతి కాగితాలు చేతబట్టుకుని వారం వారం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు.. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటివరకు ఉన్న స్పందన పేరు మార్చి ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) పేరిట గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారుగా 78 రకాల ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఈ శాఖల నుంచి 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 7724 వినతులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 6555 సమస్యలు పరిష్కారం జరిగినట్టు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ సమస్యలు పరిష్కారం జరగడం లేదు. కేవలం అధికారులు ఎండార్సుమెంటు ఇచ్చి వినతి దారుల సమస్యలను వాయిదా వేస్తున్నారు. ఎవరైనా ఇంటి కోసమో, రేషన్ కార్డు కోసమే, పట్టా డివిజన్కోసమో వస్తే ‘ప్రస్తుతం ఆ ఆప్షన్ ప్రభుత్వం లాగిన్లో ఇవ్వలేదు. అనుమతి వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం’ అని చెప్పి సమస్య పరిష్కారం అయినట్టు ఆన్లైన్ రికార్డుల్లో చూపిస్తున్నారు. దీంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో ప్రజలు మళ్లీ మళ్లీ గ్రీవెన్స్కు వస్తున్నారు. ఇలా వచ్చిన వినతులు దాదాపు 473 వరకు ఉన్నట్లు గుర్తించి వాటి కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. కొన్నింటికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం, మరికొన్ని క్షేత్ర స్థాయి అధికారులు జాప్యం చేయడంతో పరిష్కారం లభించడం లేదు. భూ సమస్యలు, జిరాయితీని ప్రభుత్వ భూములుగా రికార్డు చేయడం, రీ సర్వేలో జాయింట్ ఎల్పీలు సరిచేయాలని ఫిర్యాదులు, రైతుల మధ్య గట్టు వివాదం, డి పట్టాలు సర్వే చేయకపోవడం వంటివాటిలో కొన్నింటిని పరిష్కరించే వీలున్నా.. ప్రభుత్వం చెబుతున్న ఇతర పనుల వల్ల వీటిని పరిష్కరించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. -
అన్నన్నా.. అచ్చెన్నా..!
అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు ● వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన కిడ్నీ ఆస్పత్రిపై అసత్యాలు ● మిషన్లు లేవు.. సిబ్బంది లేరంటూ విషం చిమ్మిన మంత్రి ● ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలు ● అప్పట్లోనే 154 మందికి పైగా సిబ్బంది నియామకం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు. పలాస కిడ్నీ రోగులకు ప్రాణం పోసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మారు. కిడ్నీ రోగుల కోసం పలాసలో కేవలం ఆస్పత్రి భవనం మాత్రమే కట్టారంటూ అసత్యాలు పలికారు. ఉద్దానంలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలు కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడి బాధితులు వైద్యం కోసం వ్యయ ప్రయాసలకు గురై విశాఖ వెళ్తుండేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం సుమారు రూ.85కోట్లతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ కమ్ హాస్పిటల్ నిర్మించింది. వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధునాతన పరికరాలు సమకూర్చింది. దానితో పాటు ఉద్దానం ప్రాంత ప్రజలకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించింది. కిడ్నీ రోగులకు అండగా నిలిచి వారికి ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు, రవాణా సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఇంత చేస్తే మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. సిబ్బంది లేరు.. మిషనరీ లేదని పాత డయాలసిస్ మిషన్లు సీహెచ్సీ నుంచి తెప్పించి, ప్రారంభోత్సవం చేసేసి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లిపోయారని గుక్క తిప్పకుండా బొంకారు. అసెంబ్లీ పలాస కిడ్నీ ఆస్పత్రిలో ఎంత మంది సిబ్బంది ఉన్నారో...ఎన్ని మిషన్లు ఉన్నాయో అచ్చెన్నాయుడుకు తెలుసో లేదో అని అక్కడి ప్రజలు అంటున్నారు. ఆస్పత్రిలో ఉన్న మిషన్లు ఇవి.. డయాలసిస్ కోసం పలాస కిడ్నీ ఆస్పత్రిలో వైఎస్ జగన్ ప్రభుత్వం నెఫ్రోప్లస్కు చెందిన 19మిషన్లు పెట్టింది. అందులో నెగెటివ్ మిషన్లు 16, పాజిటివ్ మిషన్లు మూడు ఉన్నాయి. వీటితో పాటు సీటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రొసెసర్, క్రయోస్టాట్, ఆటో మెటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సీ ఆర్మ్ మిషన్, 80 నుంచి 40 సెంటిగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటీ టేబుల్స్, హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్లు రీసెర్చ్ ల్యాబొరేటరీలు, వెంటిలేటర్లతో పాటు 25 అత్యాధునిక కంప్యూటర్ ప్రింటర్లు అందుబాటులో ఉంచింది. గత ప్రభుత్వంలోనే అన్ని రకాల పోస్టులు కలిపి 154 భర్తీ చేసింది. అంతేకాకుండా మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పలాస కిడ్నీ ఆస్పత్రిలోని డయాలసిస్ వార్డు -
సముద్రమార్గ ఉగ్ర చర్యలను అరికడతాం
శ్రీకాకుళం క్రైమ్ : సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించకుంటా అడ్డుకుంటామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికడతామని, ఆ దిశగా తీర ప్రాంత ప్రజలను అవగాహనపర్చడమే లక్ష్యంగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్) సైకిల్ ర్యాలీని కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు చేపడుతున్నట్లు విశాఖ పోర్టు ట్రస్టు కమాండెంట్ సతీష్కుమార్ బాజ్పాయ్ అన్నారు. 6553 కిలోమీటర్ల లక్ష్యంగా మొదలైన సీఐఎస్ఎఫ్ ర్యాలీ(50 మందితో) ఆదివారం శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకుంది. అనంతరం స్థానిక గోపి డ్యాన్స్ అకాడమీ నుంచి ఆర్మీ థీమ్, దేశ భక్తి గీతాలు ప్రదర్శన రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1100 కిలోమీటర్లు ప్రయాణించారని మార్చి 31 కల్లా కన్యాకుమారి చేరుకుంటారని చెప్పారు. గతంలో సముద్రమార్గం గుండానే ఉగ్రవాదులు భారత్లో చొరబడి పార్లమెంటుపై దాడిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు బయల్దేరి విశాఖపట్నం సాయంత్రం 5 గంటలకు చేరుతామన్నారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ డిప్యూటీ కమాండెంట్ వినీత్కుమార్ ప్రభాకర్, విశాఖ స్టీల్ప్లాంట్ సీనియర్ కమాండెంట్ ఏఎం హనీఫ్, అసిస్టెంట్ కమాండెంట్లు జి.శ్రీనివాస్, శ్రీకర్ లోహియా, మాజీ సైనికులు కటకం పూర్ణచంద్రరావు, వీర నారీలు అమ్మన్నమ్మ, వంజరాపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హాజరైన అధికారులు -
అగ్నివీర్ అవుతారా?
● ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు ● 13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ● ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ● విశాఖలో మరోసారి ర్యాలీ ● ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు తీపికబురు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కీలక మార్పులు.. ఈ సారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www.joinindian army.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 0891– 2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
డోర్ డెలివరీ చేసేదెప్పుడో?
పొందూరు: గత 20 రోజులుగా పొందూరు ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. డోర్ డెలివరీ జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక గొడౌన్కు వెళ్లి గ్యాస్ ద్విచక్రవాహనాలపైనే సిలిండర్లను తీసుకెళ్తున్నారు. మరికొందరు సైకిళ్లపై తీవ్ర ప్రయాసలకోర్చుతూ సిలిండర్లను పట్టుకెళ్తున్నారు. ఇంకొందరు మహిళలు ఏకంగా తలపైనే మోసుకెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఆటోలను ఆశ్రయిస్తే దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.200 వరకు అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దవుతున్న బుకింగ్ ఆర్డర్స్... ఆటోమేటిక్ రీఫిల్ బుకింగ్ సిస్టమ్లో ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ కావడం లేదు. పైగా మీరు బుక్ చేసుకున్న గ్యాస్ కాన్సిల్ అయ్యిందని మెసేజ్లు వస్తుండటంతో లబ్ధిదారులు అసహనానికి గురవుతున్నారు. ఎందుకు క్యాన్సిల్ అవుతుందో తెలియక సతమతమవుతున్నారు. పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలను వజ్రపుకొత్తూరు, రణస్థలం ఏజెన్సీలకు అప్పగించారు. రణస్థలం ఏజెన్సీ ఇప్పటికీ స్పందించలేదు. వజ్రపుకొత్తూరు ఏజెన్సీ మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. గ్యాస్ గొడౌన్ వద్దకు వచ్చిన కస్టమర్లకు మాత్రమే ఈ నెల 11 నుంచి సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రణస్థలం ఏజెన్సీ వారు కూడా గ్యాస్ సరఫరా ప్రారంభిస్తే చాలావరకు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. ఏరియా కోడ్ జోడించలేదా..? గ్యాస్ బుక్ చేసుకొన్న డోర్ డెలివరీ చేయకపోవడం, గ్యాస్ బుకింగ్ కాన్సిల్ అయినట్లు మెసేజ్లు వస్తుండటంపై వజ్రపుకొత్తూరు ఏజెన్సీ సిబ్బందిని ప్రశ్నించగా ఏరియా కోడ్ కస్టమర్ ఖాతాలకు అనుసంధానం కాలేదని చెప్పారు. బుక్ చేసుకున్న వారిలో కొందరికి బిల్లు జనరేట్ కావడం లేదన్నారు. గొడౌన్కు వచ్చి గ్యాస్ తీసుకున్న వారికి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయని తెలిపారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులు దాటిన వారివి కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. లేదంటే కస్టమర్ ఖాతా బ్లాక్ అవుతుందని తెలిపారు. మరో రెండు రోజుల్లోగా ఏరియా కోడ్ సర్దుబాటు జరుగుతుందని, తమ వజ్రపుకొత్తూరు కోడ్లో కనిపిస్తాయని ఆ రోజు నుంచి డోర్ డెలివరీ జరుగుతుందని పేర్కొన్నారు. పొందూరులో ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు తప్పని తిప్పలు గ్యాస్ బుక్ చేస్తే క్యాన్సిల్ మెసేజ్లు వస్తున్నాయని లబ్ధిదారుల ఆవేదన తప్పెవరిది.. శిక్ష ఎవరికి? -
తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాత సరికొత్త వెంచర్
కొమ్మాది : భూమాత గ్రూప్, ఎస్వీఎన్ గ్రూప్ సంయుక్తంగా తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాతాస్ ఎస్వీఎన్ స్వప్నలోక్ పేరుతో వెంచర్ వేస్తున్నట్లు భూమాత గ్రూప్ ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. బీచ్రోడ్డులోని ఓ రిసార్ట్లో ఆదివారం దీనికి సంబంధించిన బ్రోచర్ను ఎస్విఎన్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఎకరాల్లో 5 ఫేజ్ల్లో.. 1650 ఫ్లాట్లు వీఎంఆర్డీఏ అనుమతులతో అందరికి అందుబాటు ధరల్లో నిర్మించినట్లు తెలిపారు. ఈ వెంచర్లో ఇంతవరకు రియల్ఎస్టేట్ చరిత్రలో ఎవరు ఇవ్వని సౌకర్యాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్టుగా కస్టమర్లకు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఆంధ్రలో ఇదే మొదటిదని తెలిపారు. ఈ వెంచర్కు సమీపంలోని తాటిపూడి రిజర్వాయర్ను ప్రభుత్వం టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తుండడంతోపాటు 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ టూరిస్ట్ స్పాట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లూరి శివాజి, కిరణ్ శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేదికపై బ్రోచర్ను విడుదల చేస్తున్న ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తదితరులు -
● నేడు మదీనా దర్గా చందనోత్సవం
గార: కళింగపట్నం పరిధి నగరాలపేట వద్దనున్న కళింగ హజరత్ మదీనా బాబా దర్గా వద్ద సో మవారం ఉరుసు చందనోత్సవం జరగనుంది. ముందు బాబా సమాధి వద్ద అభిషేకాలను నిర్వహిస్తారు. అనంతరం గత ఏడాది సమాధిపై వేసిన చందనం పూతను తొలగిస్తారు. ఎదురుగా ఉన్న ప్రార్థనా స్థలం వద్ద ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాతే భక్తులకు దర్శనం ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారం హిందూ, ముస్లిం భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్న ఉత్సవంలో సాయంత్రం బాబా సమాధిని కప్పి ఉంచే ప్రధానమైన వస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధిపై ఉంచుతారు. -
20 కిలోల గంజాయి స్వాధీనం
పాతపట్నం: గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్సీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. ఆదివారం పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన సాగిపల్లి పవన్ అలియాస్ రోషన్ పాతపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ పెయింటింగ్ మేస్త్రిగా పనులు చేసేవాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా జాజిపూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ పాణిగ్రహి అలియాస్ సీతారాం వద్దకు వెళ్లి గంజాయి కొనేవాడు. 20.540 కిలోల గంజాయిని రూ.60 వేలు కొనేందుకు ఒప్పందం కుదిర్చుకొని, ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అశోక్కుమార్ ఒడిశా నుంచి పాతపట్నం మేజర్ పంచాయ తీ కాపుగోపాలపురం వైపు నడుచుకుంటూ వస్తు.. సాగిపల్లి పవన్కు అందజేసే క్రమంలో పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పవన్పై గతంలో ఆమదాలవలస, ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో కేసులు ఉన్నాయని, అశోక్కుమార్పై ఇచ్ఛాపురం పోలీసు స్టేషన్లో కేసు ఉందని డీఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో పాతపట్నం సీఐ వి.రామారావు, ఎస్ఐ బి.లావణ్య పాల్గొన్నారు. -
ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్
శ్రీకాకుళంపాతబస్టాండ్: జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిత్యుని సన్నిధిలో ప్రత్యేక పూజలు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులకు ఉచితంగా స్థానిక నేతలు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు సోదరులు ఉచితంగా మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు. ఇక ఒక్కరోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3,82,400, విరాళాలు, ప్రత్యేక పూజల ద్వారా రూ.73,523, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1,45 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు తెలియజేశారు. -
పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆయన సేవలు మరువలేనివని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నా రు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పొట్టి శ్రీరాములు నడుచుకున్నారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో అంతా హాయిగా ఉండగలిగామన్నారు. కార్యక్రమంలో కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, చింతాడ వరుణ్, అంబటి శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవి, ఎం.ఏ భేగ్, సాదు వైకుంఠరావు, రౌతు శంకరరావు, గుండ హరీ ష్, పీస గోపి, కర్రి రంగాజీదేవ్, మూకళ్ల తాతబాబు, ఎండ రమేష్, సనపల నారాయణరా వు, కోట గోవిందరావు, డాక్టర్ శ్రీనివాసపట్నా యక్, పొన్నాడ రుషి, తంగుడు నాగేశ్వరరావు, కర్నేనహరి, తారక్, వానపల్లి రమేష్, రావాడ జోగినాయుడు, త్రినాథరెడ్డి పాల్గొన్నారు. ప్రమాద స్థలం పరిశీలన ఎచ్చెర్ల: లావేరు మండలం, బుడుమూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11.15 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్సు సమీప జడ్జి బంగ్లా ఎదురుగా మురుగు కాలువలో బోర్లా పడివున్న వ్యక్తిని చూసి సమీప ఆటో డ్రైవర్లు బయకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందాడు. వివరాలు తెలిసిన వారు 6309990824, 6309990843 నంబర్లకు తెలియజేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ‘కులం పేరిట బెదిరిస్తున్నారు’ టెక్కలి: తనను కులం కార్డుతో బెదిరిస్తూ పోలీసులతో భయపెడుతున్నారని, వీటి నుంచి రక్షణ కల్పించాలని టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నేతాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కొంత మంది పేర్లను ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన క్రమంలో గ్రామంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆందోళన చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను కొలిక్కి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆన్లైన్లోనే ఐపీఎల్ టికెట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి విశాఖపట్నంలో జరిగే రెండు మ్యాచ్లకు అభిమానులు ఆన్లైన్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీవైఎన్ శాస్త్రి, హసన్రాజా, మెంటార్ ఇలియాస్ అహ్మద్, కోశాధికారి మదినా శైలానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం మధురవాడలోని ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండో క్రికెట్ మైదానంగా ఎంపిక చేసుకుందని చెప్పారు. ఈ నెల 24న సాయంత్రం 7.30 గంటలకు లక్నో సూపర్జెయింట్స్తో, 30న మధ్యాహ్నం 3.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్లకు ఏసీఏతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవడంతో మ్యాచ్లకు సంబంధించి ఎలాంటి టికెట్లు ఏసీఏ జిల్లా క్రికెట్ సంఘానికి సమకూర్చడంలేదని వారు స్పష్టంచేశారు. ఆసక్తి కలిగిన వారు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా నాజర్బాగ్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా పైడి వెంకటరమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా పొలుగుమటి గంగరాజు, ఉపాధ్యక్షులుగా మీసాల రమేష్నాయుడు, పేరాడ మన్మధరావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎం.షల్మ, కార్యదర్శిగా పుప్పాల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బోర శ్రీధర్, జాయింట్ సెక్రటరీలుగా చిట్టి చంద్రశేఖర్, పూలి సింహద్రిరాజు, మహిళా కార్యదర్శిగా మామిడి మీనాక్షి, ట్రెజరర్గా సలాడి సూర్యచంద్ర ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఖజానా ఉద్యోగులు బెండి మోహనరావు, సత్యనారాయణ తదితరులు అభినందించారు. పది కేజీల వెండి చోరీ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్లో పాడి చంద్రశేఖరరావు ఇంట్లో దొంగలు చొరబడి పది కేజీల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. స్వ గ్రామం నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి సంబరం నిమిత్తం ఈ నెల 14న వెళ్లి తిరిగి 15వ తేదీన ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలుకొట్టి కనిపించాయని, లోపలికి వెళ్లి చూడగా కెండి కంచం, అష్టలక్ష్మి చెంబులు, చిన్నచెంబులు, వెండి దీపం కద్దులు, వెండి ప్లేట్లు, పంచపాత్రి, వెండికప్పులు, బరినెలు, గిన్నెలు, పట్టీలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘనంగా తెరవే సాహితీ సమ్మేళనం శ్రీకాకుళం కల్చరల్: తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 102వ నెల సాహితీ సమ్మేళనం నగరంలోని శాంతినికేతన్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి నిర్వహణలో సంస్థ సభ్యులు కవులు, రచయితలు సామాజిక పరమైన కవితలను, పద్యాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఇద్ది పాపయ్య, పి.వి.దుర్గాప్రసాద్, కుప్పిలి త్రినాథరావు, తంగి ఎర్రమ్మ, ఐఎన్డీ ప్రసాద్, ఎల్.సత్యానందం, వి.రాజారావు, తోట గోపాలరావు, డాక్టర్ కోమలరావు, బి.మోహన్గాంధీ, కె.బి.రవికిరణ్, కిల్లాన శ్రీనివాస్, బి.జగన్నాథరావు పాల్గొన్నారు. -
ఇంటర్ స్పాట్
నేటి నుంచే ● సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సిబ్బంది నియామ కం పూర్తయింది. స్పెల్స్ను బట్టి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. సమయపాలన పాటించాలి. సెల్ఫోన్లకు అనుమతిలేదు. సీసీకెమెరాలను అమ ర్చి, స్ట్రీమింగ్ చేయిస్తున్నాం. బోర్డు ఉన్నతాధికారు లు కూడా పర్యవేక్షిస్తారు. – ప్రగడ దుర్గారావు, ఆర్ఐఓ/ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీకాకుళం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్)కు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల కేంద్రంగా సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఈ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు విడతల్లో జరిగే స్పాట్లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సివిక్స్ పేపర్లను దిద్దనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైంది. గత ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కింద శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించింది. సరికొత్త ఫర్నిచర్, ఫ్యాన్లు, లైటింగ్, మరుగుదొడ్లు ఇలా అన్ని వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో అధికారులు సైతం ప్రశాంతంగా ఉన్నారు. కాగా స్పాట్కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. జిల్లాకు చేరిన పేపర్లు.. శ్రీకాకుళం జిల్లాకు 2.45 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు ఉన్నాయి. ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పేపర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 709.66లు చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. నియామకాలు పూర్తి.. స్పాట్ వాల్యుయేషన్లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం 1200 మం యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్–1 గణపతి వెంకటేశ్వరరావు (ఇన్చార్జి ప్రిన్సిపాల్– జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్–2గా (ఫిజిక్స్ జేఎల్– శ్రీకాకుళం బాలురు)తోపాటు సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది. స్పాట్ ఆర్డర్ నియామక ఉత్తర్వులు ఆయా కాలేజీల బీఐఈఏపీ లాగిన్లో డౌన్లోడింగ్కు అందుబాటులో ఉన్నాయి. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా మూల్యాంకనం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ స్పెల్ మొదలయ్యే తేది దిద్దనున్న సబ్జెక్టులు 1వ స్పెల్ మార్చి 17నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, సివిక్స్ 2వ స్పెల్ మార్చి 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, జీఎఫ్సి 3వ స్పెల్ మార్చి 24 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ 4వ స్పెల్ మార్చి 26 నుంచి కామర్స్, బోటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్సులు -
సైకిల్ ర్యాలీ.. తీరాన్ని రక్షించాలి
సోంపేట: తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పిస్తూ దేశంలోని తీర ప్రాంతం గుండా సీఐఎస్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో మొట్టమొదటి సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ ఎం.అనిఫ్, డిప్యూటీ కమాండెంట్ వి.కె.ప్రభాకర్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ బకేలి నుంచి ఒక బృందం, గుజరాత్ లఖపథ్ నుంచి ఒక బృందం సైకిల్ ర్యాలీ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన బృందం 700 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం రాత్రి సోంపేటకు చేరుకుంది. ఈ రెండు బృందాలు మార్చి 31న కన్యాకుమారిలో కలిసి యాత్ర ముగించనున్నాయి. 9 రాష్ట్రాల్లో 25 రోజుల పాటు 100 మంది సభ్యులు 6553 కిలోమీటర్లు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 250 తీర ప్రాంత వ్యాపారకేంద్రాలు, 75 వ్యాపార కేంద్రాలను కలుపుకుంటూ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం, అక్రమ ఆయుధాల నివారణ, తీవ్రవాదుల చొరబాటు నియంత్రణ, తీరప్రాంత భద్రత, మహిళా సాధికారత, సముద్ర తీర ప్రాంత వృక్షజాలం, జంతుజాలం పరిరక్షణ కోసం సీఐఎస్ఎఫ్ కృషి చేస్తుందన్నారు. సోంపేటలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సోంపేట యువత ఘనస్వాగతం పలికారు. నటరాజ నాట్యకళామండలి సభ్యులు ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. -
పెద్దసాన పాఠశాలలో గందరగోళం
టెక్కలి: మండలంలోని పెద్దసాన గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం గందరగోళం చోటు చేసుకుంది. ఇటీవల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ప్రసాద్ పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ, లిఖితపూర్వకమైన ఫిర్యాదుతో డీఈఓ తిరుమలచైతన్య పాఠశాలకు చేరుకుని విచారణ నిర్వహించి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు నేతాజీకు, సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయుడు ప్రసాద్కు మధ్య విభే దాలు ఉండడంతో తమకు చెప్పకుండా తమ పిల్లలతో బలవంతంగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేయించారంటూ కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదురుగా నిరసన చేస్తూ ప్రధానోపాధ్యాయుడి తీరును తప్పుపట్టారు. తాజాగా శనివారం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మరోసారి పాఠశాల ఎదురుగా నిరసన చేస్తూ ప్రధానోపాధ్యాయుడి దిష్టిబొమ్మతో నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయు డు నేతాజీ ఎస్సీ సామాజిక వర్గంపై తప్పుగా మాట్లాడారని, అలాగే ఈ వ్యవహారంతో సంబంధం లేని ఓ మహిళా టీచర్ ప్రసాద్పై చేయి చేసుకున్నారనే వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కు లం పేరుతో దూషించడంపై ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యా య సంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు చల్లా రామారావు, కె.దాలయ్య, జె.బాబూరావు, ఎ.రాహుల్, వై.గోపి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎం నేతాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీకాకుళం
149 కేంద్రాలు..రేపటి నుంచే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. –8లోఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025పరీక్షలపై ప్రత్యేక నిఘా ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. చూసీ రాతల ఆరోపణల నేపథ్యంలో అధికారు లు అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్లు పక్కాగా తనిఖీ చేసి లోపలకు విడిచి పెడుతున్నారు. సబ్జెక్టు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇన్విజిలేట ర్లుగా నియామకం నిలిపివేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రమే డ్యూటీలు వేస్తున్నారు. అధికారులు నిరంతరం పరీక్షలు పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థు లు రాస్తున్న గదులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్ఓ చాంబర్లో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546 మంది హాజరు కానున్నారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళాశాల, శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల, కోర్ కళాశాలలో ఎఫ్ఆర్ఓ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పొట్టి శ్రీరాములు కూడలిలో ఆదివారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్ర మానికి పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమాను లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆసియా ఒలింపియాడ్కు దేవాది విద్యార్థి నరసన్నపేట: ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న ఫిజిక్స్ ఒలింపియాడ్కు మండలంలోని దేవాది కి చెందిన విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్ ఎంపి కయ్యాడు. మే నెల 4 నుంచి 12వ తేదీ వరకూ ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో 3వ స్థా యి సెమినార్ జరుగుతుందని, దీంట్లో రుత్విక్ పాల్గొననున్నట్లు తండ్రి ధర్మాన శంకర్నారాయణ తెలిపారు. ఇండియా నుంచి ఈ ఒలింపియాడ్కు 20 మంది విద్యార్థులు హాజరవుతుండగా ఏపీ నుంచి రుత్విక్ పాల్గొంటున్నాడని తెలిపారు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్లో 99.98 శాతం మార్కులు పొంది రుత్విక్ సాయి ప్రతిభ చాటిన విషయం విదితమే. ●జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ● నలుగురు మృతి ●ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ●ఇద్దరికి తీవ్ర గాయాలుపెద్దలోగిడిలో విషాద ఛాయలు పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి కాళిదాసు కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళిదాసు చిన్న కుమారుడు లక్ష్మీపతి వైజాగ్ మధురవాడలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. స్నేహితుడి పెళ్లి కోసం వచ్చిన లక్ష్మీపతి అన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబాన్ని కారులో విశాఖకు తీసుకెళ్లాడు. అదే అతని ఆఖరి ప్రయాణమైంది. ఈ కారుకు యాక్సిడెంట్ జరిగి లక్ష్మీపతితో పాటు తల్లి మీనమ్మ, బావ భాస్కరరావు చనిపోవడంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీపతి బావ ఉగ్రపల్లి భాస్కరరావు ఆటోడ్రై వర్గా పెద్దలోగిడి గ్రామంలో ఉంటున్నారు. ప్రమాదంలో దెబ్బతిన్న కారు ఎచ్చెర్ల క్యాంపస్/ఎచ్చెర్ల/రణస్థలం/పాతపట్నం/ శ్రీకాకుళం క్రైమ్: లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సా యంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు ప్రాణాలను గాల్లో కలిపేసింది. టైరు పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ కుటుంబంలో ఆదివారం బర్త్డే వేడుకలు జరగాల్సి ఉంది. మరొకరి ఇంటిలో దత్తత వేడుక జరిగింది. కానీ వీరి విధిరాత మరోలా ఉంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివ రాల మేరకు.. పాతపట్నం గ్రామం పెద్దలోడి గ్రామానికి చెందిన దువ్వారి లక్ష్మీపతి(31) విశాఖపట్నంలోని మధురవాడలో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరై శనివారం తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం తన అన్న కుమారుడి బర్త్ డే ఉండడంతో తన కారులోనే తల్లి మీనమ్మ (56), బావ ఉగ్రపల్లి భాస్కరరావు (45), మేన కోడలు కుసుమ, తండ్రి కాళిదాసుతో కలిసి బయల్దేరారు. కారులో విశాఖ వెళ్తుండగా లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పంక్చర్ అయ్యి బండి అదుపు తప్పింది. సరిగ్గా అదే సమయానికి తోలాపి శంకరరావు(41) రోడ్డు పక్కన తన స్కూటీని ఆపి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదుపు తప్పిన కారు అమాంతం శంకరరావును ఢీకొట్టి రోడ్డు పక్కనే ఆపిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి లేఅవుట్లోకి దూసుకుపోయి ంది. ఘటనలో శంకరరావు తీవ్రంగా గాయపడి అక్కడే ఊపిరి వదిలేశాడు. కారులో ఉన్న మీనమ్మ, భాస్కరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందా రు. లక్ష్మీపతి, కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ లో వీరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. అయితే లక్ష్మీపతి ఆస్పత్రిలో చేరుస్తుండగానే కన్ను మూశా రు. క్షతగాత్రులు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. లావేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొన్న లారీ కోసం పోలీసులు దృష్టి సారించారు. ఒంటరైపోయింది.. ఘటనలో చనిపోయిన శంకరరావు స్వగ్రామం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరిశంకరపేట. ఈయన రణస్థలంలోని యూబీ బేవరేజెస్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రణస్థ లంలోనే ఉంటున్నారు. ఏడాది కిందటే శంకరరావు కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అనంత రం ఆయన ఓ బాలికను దత్తత చేసుకున్నట్లు సమా చారం. ఆ బాలిక జనన ధ్రువీకరణ పత్రం కోసం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి, చేపలు పట్టుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో భార్య జీవన కుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె శ్రీకాకుళం రిమ్స్కు వచ్చారు. ఏడాది కిందటే కుమారుడిని కోల్పోయి తీరని శోకంలో ఉన్న ఆమెకు ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో గుండెలవిసేలా రోదించారు. రిమ్స్ ఆస్పత్రిలో లక్ష్మీపతి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులుప్రమాద స్థలంలో శంకరరావు మృతదేహం●రోడ్డు పక్కనే స్కూటీ ఆపి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి స్కూటీ ముక్కలైంది. వాహనంపై ఉన్న వ్యక్తి స్పాట్లోనే మరణించారు. ●కారు కుడిభాగం నుజ్జు కావడంతో.. ఎయిర్ బెలూన్ లు ఓపెన్ అయినా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సంఘటనా స్థలాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. ప్రమాద స్థలం: బుడుమూరు జాతీయ రహదారి ప్రమాదానికి కారణం: కారు టైర్ పేలడం! ప్రమాదం జరిగిన సమయం: సాయంత్రం 5.40 యాక్సిడెంట్ స్పాట్ వాచ్●అయినా కారు వేగం కంట్రోల్ కాలేదు. అంతే వేగంతో అక్కడే ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని డ్రైవర్ వైపు భాగం నుంచి బలంగా ఢీకొట్టింది. ●వెనుక వైపు కూర్చున్న వ్యక్తి ఒక్క ఉదుటన పక్కనున్న మహిళను ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ●వెనుక భాగంలో ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరు సీట్ బెల్ట్ ధరించినా రెండు ప్రాణాలు నిలిచేవి. ●వాహనం ముందు భాగంలోని ఎడమ వైపున్న టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పింది. న్యూస్రీల్ప్రమాదాల బుడుమూరు -
పరీక్షలు ముగిశాయి.. మూల్యాంకనమే తరువాయి
● ముగిసిన ఇంటర్మీడియెట్ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ● 12వ రోజు 365 మంది గైర్హాజరు ● జిల్లాలో ఈ ఏడాది రెండు మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రధాన పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక మూల్యాంకనమే మిగిలి ఉంది. ఈ నెల 13వ తేదీతో ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగియగా, శనివారంతో ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగిశాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జిల్లాలో అతితక్కువ కేంద్రాల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు రాసే పలు బ్రిడ్జ్ కోర్సు ల పేపర్లకు మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 17,452 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 17,087 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 365 మంది గైర్హాజరయ్యారు. ఈ ఏడాది రెండు మాల్ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయి. మూల్యాంకనానికి ఏర్పాట్లు ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుంది. నాలుగు విడతల్లో జరగనున్న ఈ స్పా ట్ వాల్యుయేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. -
రెవెన్యూ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగులకు సేవలు అందించడంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా రెవెన్యూ వసతి గృహం ఆధునికీకరణ, మెగా మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాకు చెందిన సీనియర్ రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, పి.జగన్మోహన్రావు, ఎం.కాళీప్రసాద్లను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం కార్యదిర్శ రామశెట్టి రాజేష్, జిల్లా అధ్యక్షుడు కె. శ్రీరాములు, కార్యదర్శి బి.వి.ఎస్.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, దిలీప్ చక్రవర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జెమ్స్లో అవగాహన సదస్సుశ్రీకాకుళం రూరల్ : రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాలు – శిక్షణా తరగతులపై ఈ నెలాఖరున అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు హాజరవుతారని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఏడాది శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా అందిస్తామని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్ను సంప్రదించాలని కోరారు. డయాలసిస్ యూనిట్లు ప్రారంభం కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో శనివారం ఎనిమిది నూతన డయాలసిస్ యూనిట్లను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాల ప్రారంభించారు. అనంతరం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ సెక్రటరీ వెంకన్న చౌదరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ పద్మజ, నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్రావు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లో వలస కూలీ మృతి వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వలస కూలీ వంక ప్రకాశ్ (36) గుజరాత్లో శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఆరు నెలల కిందటే మృతి చెందాడు. నిరుపేద కుటుంబంలో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రకాశ్కు తల్లి హేమలత, భార్య లలిత ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు ,స్థానికులు కోరుతున్నారు. చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి రణస్థలం: మండలంలోని జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నారాయణశెట్టి రవణమ్మ(63) అనే వృద్ధురాలి చీరకు నిప్పంటుకోవడంతో గాయాలపాలై మృతిచెందింది. జె.ఆర్.పురం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రవణమ్మ శుక్రవారం రాత్రి 9ః30 గంటల సమయంలో ఇంట్లో కరెంట్ పోవడంతో కొవ్వొత్తి వెలిగించగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని మోకాలి వరకు పూర్తిగా కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమెకు భర్త సత్యనారాయణ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోధు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు లభ్యం ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల మండలం జరజాం జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 13న తుప్పల్లో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా..మృతుడు ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన ఎరగడ రాముగా గుర్తించారు. -
నదుల పరిరక్షణ అందరి బాధ్యత
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నదులను కాలుష్యపు కోరల నుంచి పరిరక్షించాలని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కరుణశ్రీ అన్నారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో ఉన్న నాగావళి నదిలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ శ్రీకాకుళం– స్వచ్ఛ నాగావళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణశ్రీ మాట్లాడుతూ నదుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నదుల దురాక్రమణ పర్యావరణ వినాశనానికి, నీటి వనరుల క్షీణతకు కారణమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్, మంత్రి వెంకటస్వామి, ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిలెడ్ (ఏఓఎల్) ఎం.కృష్ణయ్య, అపర్ణ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ మేనేజర్ శ్యామ్బాబు, ఎపిటోరియా ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ లైజినింగ్ ఆఫీసర్ ప్రసాద్, మహాధన్ పరిశ్రమ హెచ్ఆర్ రాజేష్, సరాక కంపెనీ ప్రతినిధి ఎ.బ్రహ్మారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఎప్టోరియా కంపెనీ జనరల్ మేనేజర్ సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు పూర్తి చేశాం..
రేపటి నుంచి మొదలయ్యే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 65 సి–సెంటర్లను గుర్తించాం. 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చాం. – లియాఖత్ ఆలీఖాన్, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం జిల్లా విద్యాశాఖ శ్రీకాకుళం అందరూ సహకరించాలి.. పరీక్ష కేంద్రాలకు సీఎస్లు, డీవోలు, కస్టోడియన్లు, తనిఖీ బృందాలు, సిబ్బంది నియామకం పూర్తయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులంతా సహకరించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలి. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం ● -
పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దష్టిలో పెట్టుకొని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అతిథి గృహం ఆధునికీకరణను, వైద్య శిబిరాలను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయటం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం రూపొందుతోందని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె.శ్రీరాములు బి.వి.ఎస్.ఎన్.రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, కలెక్టరేట్ పరిపాలన అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన రెవెన్యూ సర్వీసులు సంఘం, డాక్టర్ శశిధర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అన్నెపు శశిధర్, కార్టియాలజిస్టులు డాక్టర్ సాయితేజ బరాటం, డాక్టర్ పూజారి హరిబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ చింతాడ గోవిందరావు, గైనకాలజిస్టు డాక్టర్ సనపల సుకన్య, ఆర్థోపెడిక్ డాక్టర్ కింతలికిషోర్, డాక్టర్ బమ్మిడి ప్రభులు వైద్య సేవలు అందించారు. ఆదివారం కూడా శిబిరం కొనసాగుతుందని డాక్టర్ శశిధర్ తెలిపారు. సీపీఆర్, బీఎండీ స్కాన్, థైరాయిడ్ పరీక్ష, డయాబెటిక్, యూరిక్ యాసిడ్, హిమోగ్లోబిన్, సర్వైకల్ కాన్సర్, బెస్టు క్యాన్సర్, ఈసీజీ, 2డీ ఎకో, జీఈఆర్డీ, బీఎంఐ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి అధికారి శశిభూషణ్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను కలెక్టర్ వివరించారు. బాహుదా ఓపెన్ హెడ్ చానల్, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, మూలపేట పోర్టు, నదుల అనుసంధానం, హిరమండలం రిజర్వాయర్ తదితర పనుల పురోగతిపై చర్చించారు. డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్బాబు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులకు సంబంధించి కొరత లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలా, ఎంవీఐ గంగాధర్, ఉపాధి పీడీ సుధాకర్, డీఎఫ్ఓ వెంకటేష్, మైన్స్ శాఖ డీడీ మోహనరావు, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కృష్ణమూర్తి, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, లక్ష్మణమూర్తి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, డీటీసీ ఎ.విజయ సారధి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, భూగర్భ గనుల శాఖ డీడీ మోహనరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీఎస్ఓ సూర్యప్రకాష్, డ్వామా పీడీ సుధాకర్, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, సీపీఓ లక్ష్మీప్రసన్న, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతి శ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాషా, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ఇచ్ఛాపురం రూరల్: విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొళిగాం గణేష్ బ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న రాజేష్ చవాన్(25) శనివారం స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పాయితారి వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు తీవ్ర గాయాలపాలవ్వడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించి ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు ఒడిశా, బీహార్ ప్రాంతాలకు చెందిన వారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఆప్కాస్ను కొనసాగించాలని ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ – ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్.చిన్నారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మురళీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆప్కాస్ను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ – స్థానిక సంస్థలలోని ఔట్సోర్సింగ్, యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీలు, విద్యుత్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్రశిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ –ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ముందుగా శ్రీకాకుళం ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ను రద్దు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభు త్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆప్కాస్లో వివిధ వి భాగాల ప్రతినిధులు నక్క శ్రీనివాసరావు, ధన్వంతరి, ప్రసాద్, గుజ్జల ఆదినారాయణ, రిమ్స్ ఉద్యోగు లు కె.తేజ, టి.కిరణ్, టి.సాయి, జి.ధర్మారావు, జ్యో తికుమారి, మౌనిక, ప్రత్యూష, శిరీష పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్.. పరీక్షలకు సన్నద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 807 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా.. వీరంతా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపికచేశారు. శ్రీకాకుళం నగరంలో నాలుగు, టెక్కలిలో రెండు, పలాసలో రెండు చొప్పున కేంద్రాలను కేటాయించారు. ఈ కేంద్రాలకు సీఎస్లు, డీవోలతో పాటు 8 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్ష నిర్వహణ మెటీరియల్స్ను సైతం చేరవేశారు. కాగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. మండుటెండల నేపథ్యంలోఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లో 144 సెక్షన్తోపాటు ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధమని , పరీక్ష కేంద్రాల సీఎస్లు, డీవోలతో ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలిచ్చామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు 83282 69673, 95056 78655 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో ఈ నెల 17 నుంచి ఎనిమిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు జరుగుతాయి. కలెక్టర్ ఆదేశాలు, డీఈఓ సూచనల మేరకు ఇప్పటికే అధికారులను నియమించాం. విద్యార్థులు హాల్టికెట్లను అధ్యయన కేంద్రాల నుంచి తీసుకోవాలి. ఏపీఓపెన్స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. – లియాకత్ ఆలీఖాన్, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ జిల్లాలో రేపటి నుంచే సార్వత్రిక పదో తరగతి పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహణ హాజరుకానున్న 807 మంది విద్యార్థులు ఎస్సైన్మెంట్ పరీక్షలను రాస్తున్న టెన్త్ విద్యార్థులు -
పాలిటెక్నిక్తో అపార ఉద్యోగావకాశాలు
ఎచ్చెర్ల క్యాంపస్: పదో తరగతి తర్వాత తక్కువ వయసులోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే పాలిటెక్నిక్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి గురుగుబెల్లి దామోదర్రావు అన్నారు. కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీఎస్://ఏపీఎస్బీటీఈటీ.ఏపీ.ఐఎన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో పది ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్లో 300, మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, సీతంపేట మోడల్ పాలిటెక్నిక్లో 120 సీట్లు ఉన్నాయని వివరించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఉచితంగా కోచింగ్ ఇచ్చి స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. -
స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం వైఎస్సార్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్కు ప్రభుత్వం కేటాయించిన ప్యాకేజీ కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమన్నారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణ విధానాలను, అక్రమ తొలగింపులు ప్రశ్నిస్తున్న కార్మిక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమకు అండగా ఉంటారో కార్పొరేట్ల పక్షంలో ఉంటారో తేల్చుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.ప్రకాశరావు, కె.సూరయ్య, కె.కళ్యాణి, డి.సుదర్శనం, హైమ, కె.అప్పారావు, బి.సంతోష్, కె.శ్రీనివాస్, పవిత్ర, హరీష్, ఆర్.రమేష్, పి.దుర్గాప్రసాద్ ఏ.సత్యనారాయణ, రవికుమార్, బి.వాసుదేవరావు, పి.జగ్గారావు, జనార్దణరావు, ప్రవీణ, ఢిల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 25 నుంచి అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు
ఆమదాలవలస: పట్టణంలో ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు సీఎంసీసీ అధ్యక్షుడు తమ్మినేని విద్యాసాగర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కె.సుదర్శన్, కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమదాలవలసలో టోర్నమెంట్ నిర్వహించనున్న మైదానాన్ని పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అనువైన ఏర్పాట్లపై చర్చించారు. త్వరలో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గంధం వేణు, సనపల మోహన సురేష్, కాట్ర సుధాకర్, నిమ్మగడ్డ శేషుకుమార్, సత్య బాల తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎంసీ తీర్మానాలపై రగడ
● బలవంతంగా వెనక్కు తీసుకునేలా కూటమి సర్కారు కుట్రలు ● చైర్మన్, గ్రామపెద్దలతో మంతనాలకు విద్యాశాఖ అధికారులు సిద్ధం ● తప్పుపడుతున్న విద్యా, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు ● పాఠశాల విద్యను నిర్యీరం చేస్తున్నారని మండిపాటు స్నేహితులకు ప్రైవేటు పాఠశాలలు ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేసే ఈ కుట్రలో భాగం కానున్నారని.. వారి వల్లే ప్రభుత్వ పాఠశాలలకు ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు అత్యుత్సాహంతో ఉన్నత స్థాయి అధికారుల వద్ద మెప్పు కోసం నిబంధనలను పక్కనపెట్టి.. భారీగా ఉన్నత తరగతులను సమీప పాఠశాలలకు తరలిస్తున్నారు. ఇక్కడ స్థూలంగా గమనిస్తే (నేచురల్ బేరియర్స్) భౌగోళిక అడ్డంకులను అధికారులు అసలు పట్టించుకోవడంలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తప్పుపడుతున్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు.. ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, పిల్లలకు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ రకంగా వ్యవహరించడాన్ని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. మూడో తరగతి కోసం 2, 3 కిలోమీటర్లు., ఆరో తరగతి కోసం 5, 6 కిలోమీటర్లు తమ పిల్లలను ప్రతిరోజు బడికి ఎలా పంపించాలని, వారు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్కు తలోగ్గి తమ పిల్లలకు చదువును దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలను కూటమి సర్కారు వీడాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తప్పుడు ఆలోచనలను విరమించుకొవాలని.. ప్రస్తుతం ఉన్న మాదిరిగానే పాఠశాలలను కొనసాగిస్తూ విద్య కొనసాగించాలని.. లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరిస్తున్నారు. తీర్మానాల కోసం అధికారులు బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తే వారిపై కూడా కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ : పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం గందరగోళానికి నెట్టేందుకు సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. తాము అనుకున్న కార్యాన్ని పూర్తిచేసేందుకు అధికారులనే అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తోంది. పాఠశాల విద్యాకమిటీ(ఎస్ఎంసీ) ఇచ్చిన తీర్మానాలను వెనుక్కి తీసుకునేలా అధికారుల నుంచే ఒత్తిళ్లు చేసేలా కుయుక్తులకు తెరతీసింది. కార్పొరేట్ వ్యవస్థకు తలొగ్గి.. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట దగా చేసేందుకు సిద్ధమౌతోంది. బలవంతంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను, ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి 6,7,8 తరగతులను దూరంతో సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా.. సమీప ఆవాస ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం న్యాయపరమైన అడ్డంకులు లేకుండా గతంలో తమ పాఠశాలలోని ఉన్నత తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్మానాలను వెనక్కి తీసుకోమని బలవంతం చేస్తోంది. తీర్మానాలను ఏ మార్చేలా.. వాస్తవానికి 117 సవరణ జీవో ద్వారా కూటమి సర్కారు తీసుకొచ్చిన దుర్మార్గపు విద్యా సంస్కరణలను తీవ్రంగా వ్యతరేకిస్తూ మార్చి 1న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) సమావేశాల్లో.. తమ పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని, పాఠశాలలోని ఉన్నత తరగతులు తరలించకూడదని పేర్కొంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. వాటిని అధికారులకు అందజేశారు. అయితే ఏయే కమిటీలు తరగతులను యథాతధంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయో.. ఆయా పాఠశాల లేదా ఆవాస ప్రాంత విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలను ఈ రెండు మూడు రోజల్లో ఎంఈఓ ఆఫీసులకు పిలిపించి తీర్మానాలను వెనక్కి తీసుకొని.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా తీర్మానాలు ఇమ్మని ఒత్తిడి తీసుకురానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అధికారుల ఒత్తిడికి తలొగ్గని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలతో ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ పెట్టి ఒప్పించే ప్రయత్నం చేయడానికి రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, అధికారుల అత్యుత్సాహం.. జిల్లాలో ఓ శాసనసభ్యుడికి సొంత ప్రైవేట్ పాఠశాల ఉండటంతో తన స్కూల్ అభివృద్ధి కోసం.. తెరవెనుక కుయుక్తులు పన్నతున్నట్టు ఆ మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు వారి బంధువులకు, -
20న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు మా ర్చి 20న శ్రీకాకుళంలోని రెల్లవీధిలో ఉన్న తపా లాశాఖ సూపరింటెండెంట్ వారి కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ ఆఫీస్ వి.హరిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపా రు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో చర్చి స్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు మార్చి 20వ తేదీ లోగా ‘తపాల అదాలత్’ అనే శీర్షికతో వి హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్–శ్రీకాకుళం 532001‘ అనే చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని అదాలత్కు హాజరు కావచ్చునని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించాలి నరసన్నపేట: జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ తెలిపారు. స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో ఆమె గు రువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉద యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు విద్యార్థుల దినచర్య పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్ డ్యూటీ డాక్టర్ల భోజనంలో పురుగులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లకు సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రాగా, రాత్రికి మంచి ఆహారం వస్తుందని వైద్యులు భావించారు. రాత్రి భోజనంలో కూడా పురుగులు కనిపించడంతో డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భోజనాలు మానేసి విధులు నిర్వహించారు. రిమ్స్లో విధులు నిర్వహించే డాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీల వద్ద ప్రస్తావించగా తాను మధ్యాహ్నం సమయంలో ఇక్కడే భోజనం చేస్తున్నానని, పురుగులు తన ఆహారంలో లేవన్నారు. ఇటీవలి కలెక్టర్ కూడా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో భోజనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో శుక్రవారం జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు సందడిగా నిర్వహించారు. శ్రీ త్రినాథస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఏటా ఈ జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. 80 కిలోల విసురుగుండు పోటీలలో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల వసంతరావు ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ, ఆవల గోవిందరావు మొదటి, ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు 160 కిలోలు ఎత్తి ప్రథమ, గుజ్జల ట్వింకిల్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో దూబ హేమశ్రీ 95 కిలోలు ఎత్తిడంతో ప్రథమ బహుమతి పొందగా తాలాడ కావ్య 80 కిలోలు ఎత్తి ద్వితీయ స్థానం సాధించారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను పీడీ ఈశ్వరరావు, పవర్ వెయిట్ లిఫ్టింగ్ గౌరవ అధ్యక్షుడు బి.తిరుపతిరావు సమక్షంలో నిర్వహించారు. విజేతలకు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, బగ్గు అర్చన, మెండ రాంబాబు తదితరులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి ఆంజనేయ ప్రసాద్, ఇప్పిలి వేణులతో పాటు నిర్వహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వసూల్ రాజాలపై విజిలెన్స్
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో కొన్నాళ్లుగా సాగుతున్న అవినీతి అక్రమాలతో పాటుగా తాజాగా మొదలైన వసూల్ రాజాల అక్రమాలపై ‘విజిలెన్స్’ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంతర్గత వ్యవహారాలపై ఈ నెల 5న వైద్య శాఖలో వసూల్ రాజాల పేరిట ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. అందుకు అనుగుణంగా కార్యాలయంలో పరిస్థితులుండటంతో సంబంధిత అధికారులపై నిఘా ఉంచారు. ఇప్పటికే రెండుసార్లు డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరిన విజిలెన్స్ బృందానికి పరిపాలన విభాగం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో నేరుగా డీఎంహెచ్వో డాక్టర్ బాలమురళీకృష్ణతోనే మాట్లాడి పరిస్థితులను అడి గి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేయనున్నారు. సాక్షిలో వరుస కథనాలు... డీఎంహెచ్వో కార్యాలయంలో వరుసగా జరుగుతున్న పలు అక్రమాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం, అక్రమంగా రూ.లక్షల్లో వసూళ్లు చేయడంతో పాటు ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు జారీ చేయడం వంటి అంశాలపై ఆధారాలతో సహా ప్రచురించిన సంగతి తెలిసిందే. వీటినే ప్రామాణికంగా తీసుకుని నిరుద్యోగ బాధితుల వివరాలతో పాటు అక్రమాలకు పాల్పడిన స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో కీలక సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై చర్యలుండేలా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలావరకు అక్రమాలతో పాటు ప్రస్తుతం ఏళ్ల నాటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల విద్యార్హత సర్టిఫికెట్లు కూడా ఫేక్ అనే కథనాలు రావడంతో దీనిపైన కూడా విజిలెన్స్ దృష్టి పెట్టింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చేసినట్లుగా ఆర్డర్లు జారీ చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో ఆన్లైన్లో జీతాలను జమ చేయడాన్ని విజిలెన్స్ అధికారులకు ఆశ్చర్యాన్ని కల్పించినట్లు సమాచారం. గత నెలలో విశాఖ డీఎంహెచ్వో జగదీశ్వరరావు చేపట్టిన విచారణాంశాలను కూడా విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే అక్రమాలు, వసూల్ రాజాల బండారాలను విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపించేలా సన్నద్ధమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా డీఎంహెచ్వో కార్యాలయంలో స్తబ్దత నెలకొందరు. కొందరు లాంగ్లీవ్లో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. డీఎంహెచ్వో కార్యాలయంలో కీలకాధికారులపై నిఘా సాక్షి కథనాలను ప్రామాణికంగా తీసుకుని విచారణ సాగిస్తున్న అధికారులు -
మిగులు ధాన్యం కొనుగోలు చేయాలి
ఇచ్ఛాపురం రూరల్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి మిగులు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల శాసన మండలి బడ్జెట్ సమావేశంలో సైతం తాను ధాన్యం విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ నిలిచి పోయిందని, ఇప్పటి వరకు 49,2000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సేకరించిందని, మిగతా ధాన్యం ఎప్పుడు సేకరిస్తారంటూ ప్రశ్నించగా.. అధికార యంత్రాంగం స్పందించి 45000 మెట్రిక్ టన్నులు వరకు కొనుగోలు చేసిందన్నారు. ఇంకా సుమారు 60వేలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కోరారు. ఉద్దానం విద్యార్థి ప్రతిభ కాశీబుగ్గ: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ ఢిల్లీ) ప్రతిభా పరీక్షలో మందస మండలం నాతుపురం బొడ్లూరుకు చెందిన బొడ్డు షణ్ముఖరావు సత్తాచాటాడు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వాహకుల చేతులమీదుగా ప్రశంసాపత్రం, మెడల్ అందుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. షణ్ముఖరావు నాలుగో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. అనంతరం ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్ష రాసి గుంటూరు జిల్లా తాడికొండ గురుకులంలో సీటు సాధించి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ప్రతిభ పట్ట ఉపాధ్యాయులు దాసరి ఈశ్వరరావు, తల్లిదండ్రులు బొడ్డు జీవనరావు, మోహిని, గ్రామస్తులు చేశారు. ఘనంగా బీఎస్ఎన్ఎల్ మహాసభలుశ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వీజీకె మూర్తి సభాప్రాంగణం వద్ద శుక్రవారం భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ 10వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఆలిండియా బీఎస్ఎన్ఎల్ ఈయూ ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాగర్, కృష్ణబాలాజీలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బీఎస్ఎన్ఎల్కు తక్షణమే 4జీ, 5జి ఎక్విప్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 2017 నుంచి పే రివిజన్, పెన్షన్ రివిజన్ అమలు చేయాలని కోరారు. అనంతరం ‘బీఎస్ఎన్ఎల్ మనుగడ–ఉద్యోగుల కర్తవ్యాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీఎస్ఎన్ఎల్ ఈయూ జిల్లా అధ్యక్షునిగా మాతల గోవర్ధనరావు, కార్యదర్శిగా పోలాకి వెంకటరావు, కోశాధికారిగా జి.అరుణశ్రీతో పాటు 18 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు, ఈయూ ప్రతినిధులు అభిమన్యు, ఆదినారాయణ, డి.శ్రీనివాసరావు, శివప్రసాద్, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు. మా ప్రమేయం లేకుండానే ఫిర్యాదు టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు డీఈఓ తిరుమల చైతన్య విచారణ చేపటిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు తెలియకుండానే హెచ్ఎం ఫిర్యాదు చేశారని చెప్పారు. హెచ్ఎం, ఉపాధ్యాయుడి మధ్య వివాదం ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో పాఠశాలకు సంబంధం లేని ఓ మహిళ పాత్ర ఉందన్నారు. ఉన్నతధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శివాలయంలో చోరీ రణస్థలం: పైడిభీమవరం శివాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీ, ఎలక్ట్రికల్ యాంప్లిఫయర్ పట్టుకుపోయారు. శుక్రవారం జె.ఆర్.పురం పోలీసులు ఆలయాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై ఎస్. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
సెల్ఫోన్ కొన్నారు.. కొన్నాళ్లకే రిపేరుకు వచ్చింది. మౌనంగా ఉండిపోకండి. ఆ మౌనమే మోసానికి ప్రోత్సాహం. పండ్లు కొన్నారు.. కొలతలో తేడా తెలుస్తోంది. నిశ్శబ్దంగా ఉండిపోకండి. ఆ నిశ్శబ్దమే హక్కులకు మరణశాసనం. వస్తువులు కొన్నారు.. ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నాడు. మనకెందుకులే అనుకోకండి. ఆ నిర్లిప్తతే అక్రమాలకు అసలు కారణం. డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు సేవలు పొందే అధికారం అందరికీ ఉంది. డబ్బుకు తగ్గ వస్తువు లేదా సేవ అందనప్పుడు మీ హక్కుకు భంగం వాటిల్లినట్టే. ఆ హక్కులను కాపాడేందుకే ఏటా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ హక్కులు కాపాడేందుకు ఓ పెద్ద వ్యవస్థే నడుస్తోంది. మనం చేయాల్సిందల్లా దానిపై అవగాహన పెంచుకోవడమే. – శ్రీకాకుళం పీఎన్ కాలనీ, శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం,అరసవల్లి, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్ తూకాల్లో తేడాలు, ధరల్లో వ్యత్యాసాలు, నాణ్యతలో మార్పులు.. కొనుగోలుదారుడు అను నిత్యం మోసపోతున్నాడు. చిన్న పాన్షాపు మొదలకుని పెద్ద షోరూమ్ వరకు జిల్లాలో ఈ తరహా మోసాలు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయి. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇలా మోసపోతున్న వారికి అండగా నిలిచేందుకు వినియోగదారుల రక్షణ చట్టం అంటూ ఒకటుంది. దీన్ని 1986లోనే ఏర్పాటు చేశారు. 2019లో కొత్త చట్టం కూడా వచ్చింది. దీని ప్రకారం మనం నిత్య జీవితంలో ప్రతి వస్తువు, సేవలు, కొనుగోలు, పొందడంలో ఎక్కడ లోపం, మోసం ఉన్నా వెంటనే వినియోగదారులు ఫోరం ద్వారా నష్టపోయిన వాటిని పొందవచ్చు. జిల్లాలో చాలా మంది ఈ ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందారు. అలాగే జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో రక్షణ మండలిలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా వినియోగదారులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హక్కులు తెలుసుకో.. ● వస్తువుల కొనుగోలు, వినియోగం విషయంలో వినియోగదారులకు కొన్ని రకాల హక్కులు ఉన్నాయి. ● వస్తువుల నాణ్యత, పనితీరు, సేవల గురించి పూర్తి సమాచారం పొందే హక్కు వినియోగదారులకు ఉంది. ● హక్కులు ఉల్లంఘిస్తే పరిష్కారం కోరే హక్కు వినియోగదారులకు ఉంది. ● తప్పుగా మార్కెట్ చేసే వస్తువులు, సేవల నుంచి రక్షణ కల్పించే హక్కు వినియోగదారులకు ఉంది. ● దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే ప్రదేశం, ఉద్యోగం చేసే జిల్లా పరిధిలో కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ● నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ (ఎన్సీహెచ్) మొబైల్ యాప్లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. ● వస్తు సేవలతో పాటు బీమా పాలసీలు, చిట్ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు, సేవింగ్లు, బ్యాంకు బీమాలు, అలాగే స్కీంల విషయంలో మోసం, లేదా నిర్లక్ష్యం చేస్తే వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. కోర్టు ఉంది జిల్లాలో వినియోగదారుల సమాఖ్య (కోర్టు) ఉంది. ఈ కోర్టులో ప్రతి రోజు కేసుల విచారణ ఉంటుంది. ఈ ఫోరంలో నేరుగా బాధితుడు ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫో రం సభ్యులను ఆశ్రయించి వారి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అందుబాటులో ఉన్న న్యాయవాది ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కేవలం నష్టం, ఇబ్బంది జరిగిందని రుజువులు ఉంటే చాలు. జిల్లాలో ప్రధానంగా వస్తు, సేవలకు సంబంధించి 107 కేసులు ఈ కోర్టులో ఉన్నాయి. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ యాప్ ఇలా ఫిర్యాదు చేయాలి.. 1915,1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారు. వస్తువు కొనేటప్పుడు ఇన్వాయిస్లు, ఐడీలను కచ్చితంగా నిక్షిప్తం చేయాలి. ఫిర్యాదు సమయంలో అవే ఆధారాలు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించినా, నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడినా నేరుగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ నంబర్ 88000 01915 లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది. తెలుసుకో హక్కు.. చట్టమే దిక్కు జిల్లాలో విచ్చలవిడిగా తూకాల్లో మోసాలు.. కొలతల్లో తేడాలు మోసపోతున్న కొనుగోలుదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు కొను‘గోల్మాల్’ శ్రీకాకుళం ఆర్టీసీ కాంపెక్స్కి సమీపంలో, ఎస్పీ కార్యాలయం పక్కన ఓ దుకాణం వద్ద కిలో నల్ల ద్రాక్షపండ్లు కొనుగోలు చేశా ను. ధర రూ.150 తీసుకున్నారు. ఆ పండ్లను నెహ్రూ యువ కేంద్రానికి సమీపంలో ఓ దుకాణం వద్ద మళ్లీ తూకం వేయించాను. అక్కడ 840 గ్రామలు మాత్రమే ఉంది. – సీహెచ్ రామకృష్ణ, ప్రొఫెసర్, ఏఎస్ఎన్కాలనీ, శ్రీకాకుళం నగరం టెక్కలి పాత బస్టాండ్లో ఓ కిరాణా దుకాణంలో పాత తరం తూకాలు, కొత్త తరం ఎలక్ట్రానిక్ తూకాలతో సామాన్లు విక్రయిస్తున్నారు. అయితే పాత తరం తూకాలకు వినియోగిస్తున్న గుండ్లు పూర్తిగా కాల పరిమితి దాటి ఉన్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో భాగంగా కిలో వస్తువులకు సుమారుగా 100 నుంచి 150 గ్రాముల వరకు తేడా కనిపిస్తోంది. వీటితో పాటు మొదటి రకం గ్రేడ్ పేరుతో నాశిరకమైన నిత్యావసర సామగ్రిను అసలు ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. టెక్కలిలో ఓ బంగారు దుకాణంలో అమ్మకాలు చేస్తున్న బంగారం, వెండి వస్తువుల విషయా న్ని పరిశీలించగా నాసిరకమైన వెండి వస్తువులకు అసలు ధరను వసూలు చేస్తున్నారు. అలాగే బంగారం బరువు తూచే క్రమంలో వినియోగిస్తున్న డిజిటల్ తూకాల్లో అంకెల గారడీ కనిపిస్తోంది. టెక్కలిలో ఓ మందుల దుకాణంలో ఓ వినియోగదారుడు కొన్ని రకాల మందులు కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలించగా అవి కాలం చెల్లినవిగా గుర్తించాడు. దీంతో ఆయా మందుల దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా వాటిని మార్పు చేసి కొత్త తేదీలతో ఉన్న మందులను ఇచ్చాడు. కొలతలో తేడా.. ఏసీబీ కార్యాలయం బలగ వద్ద చేపల మార్కెట్లో కిలోన్నర రొయ్యలు కొన్నాను. కానీ తూకం తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చింది. సమీపంలోగల ఓ చికెన్ షాపు వద్దకు వెళ్లి డిజిటల్ కాటాలో మళ్లీ తూయిస్తే 1.290 గ్రాములు ఉంది. ఇదేంటని అడిగితే నచ్చితే కొనండి అని సమాధాన మిస్తున్నారు. – ఎన్.శ్రీనివాసరావు, డీసీసీబీ కాలనీ, కొనుగోలుదారుడు -
ప్రాణం తీసిన నిద్రమత్తు!
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం జంక్షన్ ఫ్లై ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగాక లారీ ఆపకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కల్లుగీత కార్మికుడు వెంటనే స్థానికుల సాయంతో అత్యవసర విభాగాలకు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్టీరింగ్ వద్ద ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అతని వద్ద లభించిన ఆధారాల మేరకు తమిళనాడు రాష్ట్రం అవడి పట్టణానికి చెందిన ఆకాష్ (29)గా గుర్తించారు. ఇతను ఎల్అండ్టీ పరిశ్రమలో ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు సమచారాం. ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై నక్క కృష్ణారావు తెలిపారు. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా ఎచ్చెర్ల పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో తమిళనాడు వ్యక్తి మృతి జరజాం ఫ్లై ఓవర్ సమీపంలో ఘటన -
పెళ్లి వేడుకకు లైటింగ్ కడుతూ..
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీ ఎర్రన్నపేటకు చెందిన బలగ మణికంఠ(20) అనే యువకుడు విద్యుత్ షాక్కు గురై శుక్రవారం ఉదయం మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికంఠతో పాటు కూన లక్ష్మణరావు, మెట్ట వికాస్లు జోనంకి పంచాయతీ అబ్బాయిపేటలో ఓ వివాహ వేడుకకు లైటింగ్ వైర్లు కట్టేందుకు వెళ్లారు. వైర్లు అమర్చుతుండగా అదే రోడ్డులో భారీగా వాహనం రావడంతో వాటిని తప్పించే క్రమంలో 11 కె.వి.లైన్ తాకడంతో వైర్లు పట్టుకున్న మణికంఠ షాక్కు గురయ్యాడు. వెంటనే నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికందిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మణికంఠకు తల్లిదండ్రులు లచ్చన్న, కుమారి, తమ్ముడు జశ్వంత్ ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి ఎర్రన్నపేటలో విషాదచాయలు -
రైలు ఢీకొని రిక్షా కార్మికుడు దుర్మరణం
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ రిక్షా కార్మికుడు మృతిచెందాడు. బెల్లుపడ కాలనీకి చెందిన ఆసి బైరెడ్డి(50) ఎర్రచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా అప్లైన్ ట్రాక్లో తిరుపతి–పూరి ఎక్సప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని జీఆర్పీ ఎస్సై ఎస్కే షరీఫ్ తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు -
కస్టమరు.. గెలిచారు
ఫోరంను ఆశ్రయించా 2023లో ఓ మొబైల్ షోరూమ్లో రెండు ఫోన్లను మొత్తం రూ.20 వేలతో కొనుగోలు చేశాను. కొన్న నెల రోజుల్లోపే ఆ రెండు ఫోన్లు పాడైపోయాయి. షోరూమ్ వాళ్లను అడిగితే తమకు సంబంధం లేదన్నారు. దీంతో బిల్లులు, ఆధారాలతో సహా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాను. ఐదు నెలల్లోనే నాకు రెండు ఫోన్లకు నష్ట పరిహారంగా రూ.42 వేల వరకు కోర్టు ద్వారా వచ్చింది. ఎవరైనా నష్టపోతే నిరభ్యంతరంగా కోర్టును ఆశ్రయించవచ్చు. – కె.శ్రీనివాసరావు, వైద్యశాఖ ఉద్యోగి ఏసీ పోతే.. పొందూరు మండలంలోని గోరింట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది ఏప్రిల్లో ఏసీ మిషన్ను రూ.32వేలకు కొన్నారు. వారం రోజులు తిరగక ముందే ఆ మిషన్పోయింది. దీంతో ఆ య న సర్వీసు సెంటర్కు, ఏసీ కొన్న దుకాణానికి చాలాసార్లు వెళ్లి చూశారు. నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. విచారణ అనంతరం పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ ఇవ్వాలని, అన్ని ఖర్చులు కలిపి రూ.42వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. వినియోగదారుడికి ఉపశమనం టెక్కలిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఓ వినియోగదారుడికి విద్యుత్ సేవల్లో తీవ్రమైన జాప్యం కల్పించారు. అంతే కా కుండా ఆర్థికంగా, మానసికంగా వేధించారు. దీనిపై సీజీఆర్ఎఫ్ను ఆశ్రయిస్తే న్యాయం చేశారు. – కె.కిశోర్, స.హ.చట్టం ప్రతినిధి, టెక్కలి రెండుసార్లు గెలిచా.. 2011లో ఓ బ్యాంకులో నేను వేసిన డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సిన కాలం పూర్తయినా ఇవ్వకపోవడంతో శ్రీకాకుళం వినియోగదారుల ఫోరంలో అన్ని ఆధారాలతో కేసు వేసి నేనే వాదించాను. మూడు నెలల్లో నాకు నా రూ.లక్ష సొమ్ముతోపాటుగా బ్యాంకుకు 15శాతం వడ్డీ చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఇచ్చారు. అలాగే 2019లో నేను విజయనగరంలోని ఓ కొరియర్ సర్వీసులో ఒక అత్యవసర కవర్ పంపాను. అది వారికి చేరలేదు. అడిగితే నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. దీంతో విజయనగరం వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీంతో నిర్లక్ష్యానికి మూల్యంగా రూ.10వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఖర్చుల కోసం రూ.3వేలు ఇవ్వాలని సూచించింది. కానీ వారు ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశా. – కొమ్మాజ్యోస్యుల వసంతకుమార్, శ్రీకాకుళం -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని కోష్ట ఫ్లై ఓవర్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటా రోడ్లుపై తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 63099 90850, 6309990816 నంబర్లకు తెలియజేయాలని కోరారు. చైన్నెలో వలస మత్స్యకారుడు మృతి సోంపేట: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సీరాపు శ్యాంసుందరరావు(38) చైన్నెలో చేపల వేట సాగిస్తూ మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..శ్యాంసుందరరావు నెల రోజుల కిందట చైన్నె వలస వెళ్లాడు. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు బోటు బోల్తాపడటంతో శుక్రవారం మృతి చెందాడు. శ్యాంసుందరరావుకు భార్య భానుమతి, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. టెక్కలి రూరల్: మండలంలోని మోదుగువలస గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు బైక్ పైనుంచి పడి తీవ్రగాయాలకు గురైన విషయం తెలిసిందే. అయితే బాధితురాలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గ్రామం వద్ద రోడ్డుపై నిల్చుని ఉండగా పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడని, టెక్కలి జిల్లా ఆసుపత్రికని చెప్పడంతో తానూ అక్కడికే వెలుతున్నానంటూ బైక్ ఎక్కించుకున్నాడని పేర్కొంది. మార్గమధ్యలో గూడేం వైపు తీసుకెళ్తుండటంతో ఆపమని చెప్పినా వినలేదని, అందుకే గెంతేశానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి ఒంటి పూట బడులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒంటి పూట బడులకు వేళయ్యింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి ఉద యం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో వసతి గృహాలు మినహా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు వర్తించనున్నాయి. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలను ఇళ్లకు విడిచిపెడతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒంటిపూట సందర్భంగా బడుల్లో తగి నంత తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపయోగించాలని సూచించారు. -
వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
మందస: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్తో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాహుల్ మండల్ తమిళనాడు రాష్రం ఈరోడ్ పట్టణంలో టైలర్గా పనిచేస్తున్నాడు. అక్కడ రంజిత్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. అతని సూచన మేరకు ఒడిశా రాష్ట్రం పారదీప్ వెళ్లి భానోజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మందస రాగా రైల్వేస్టేషన్ వద్ద ఎస్ఐ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం పట్టుకున్నారు. రాహుల్ వద్ద 4 కేజిల 132 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనంలో తరలిస్తూ.. నరసన్నపేట: పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్ గుల్ఫాన్ నాలుగు కేజీల గంజాయితో గురువారం పట్టుబడ్డాడు. హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయివేటు వాహనాన్ని అనుమానంతో దేవాది వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
● పొందూరులో ఏజెన్సీ మార్చినా ఇళ్ల వద్దకు సరఫరా కాని వైనం ● ఇబ్బందుల్లో లబ్ధిదారులు పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ ఏజెన్సీని మార్చినా వినియోగదారుల ఇళ్లకు సిలిండర్లు చేరడం లేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లోని పలు పంచాయతీలకు పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యే ఆధారం. ఆయా పంచాయతీల్లో సుమారు 28 వేలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి సుమారు 25 కిలోమీటర్ల పరిధి వరకు కస్టమర్లు ఉన్నారు. వారందరూ పొందూరు ఏజెన్సీకి వచ్చి గ్యాస్ తీసుకెళ్లాల్సిన పరిస్థతి నెలకొంది. డోర్ డెలివరీ అయ్యేనా... ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు ఆదరాబాదరగా తమ విధి నిర్వహణలకు పరుగులు తీస్తున్నారు. సొంత పనులు చేసుకునేందుకు సైతం సమయం ఉండటం లేదు. ఈ క్రమంలో గ్యాస్ కష్టాలు మరింతగా వెంటాడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 10 వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 11వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నా గోదాము వద్దకు వెళ్లాల్సి వస్తోందని, ఇళ్లకు తెచ్చి ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయమై ప్రస్తుత వజ్రపుకొత్తూరు ఏజెన్సీ సిబ్బంది వద్ద ప్రస్తావించగా రెండు రోజుల్లో డోర్ డెలివరీ ప్రారంభిస్తామని చెప్పారు. తప్పెవరిది.. శిక్ష ఎవరికి? -
● రిమ్స్లో మద్యం మత్తులో రోగి ఆత్మహత్యాయత్నం ● భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం ● కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు
దగ్గరకొచ్చారో దూకేస్తా..! శ్రీకాకుళం: మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఫోన్ చేస్తే కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేయకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రి భవనం మూడో అంతస్థు పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే సకాలంలో ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గమనించి కాపాడారు. రిమ్స్ సిబ్బంది, రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన సనపల వరహానర్సింహం ఆనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మాన్పించేందుకు కుటుంబ సభ్యులు రిమ్స్లో చేర్పించారు. అక్కడి ఎన్ఎం వార్డులో ఉండి చికిత్స పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భవనంలోని మూడో అంతస్థుకు చేరిన వరహానర్సింహం ప్రహరీ గోడపై కూర్చున్నాడు. అతన్ని వారించగా కిందకి దూకే ప్రయత్నం చేయబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది, అక్కడే పనిచేస్తున్న తాపీమేసీ్త్రలు, కార్మికులు చాకచక్యంగా పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిబ్బంది పట్టుకుని పైకి తీసే క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి గాలిలోనే వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు, వైద్యులు, స్థానికులు చెబుతున్నారు. మద్యం తాగేందుకు తన వద్ద డబ్బులు లేవని కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే వారు ఫోన్ లిప్ట్ చేయకపోవటం వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని రిమ్స్ అధికారులకు చెప్పాడు. కాగా, వరహా నర్సింహం ఇన్పేషెంట్ కాదని ఆస్పత్రి సూపరెండెంట్ డాక్టర్ షకీల చెపుతుండగా.. ఎన్ఎం వార్డులో చికిత్స పొందుతున్నారని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఇసుక ర్యాంపులో తనిఖీలు
సరుబుజ్జిలి: పురుషోత్తపురం 1, 2 ఇసుక ర్యాంపుల్లో టెక్కలి గనుల శాఖ ఏడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్కు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గం ఇన్చార్జి చింతాడ రవికుమార్ ఇసుక ర్యాంపుపై ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలు మేరకు టెక్కలి గనుల శాఖ అధికారులు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టా రు. ఇసుక ర్యాంపు నిర్వహణ ఎంత విస్తీర్ణం మేరకు నిర్వహించారు, తవ్వకాలు ఎంత లోతులో చేపడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ర్యాంపు తీరం వరకు మైన్స్ అధికారులు బొలేరో వాహనం ద్వారా వెళ్లి తనిఖీ చేశారు. ర్యాంపులో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ర్యాంపులో సీసీ కెమెరాలు ఉండాలని, ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి బ్యానర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. తవ్వకాలు జరిగే ప్రదేశం వద్దకు వెళ్లకుండా అక్కడ ఉన్న కొంతమంది వద్ద నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు. మైన్స్ అధికారులు ర్యాంపు వద్దకు తనిఖీలు కోసం వచ్చే సమయంలో మండల స్థాయి అధికారులు ఎవ్వరూ లేకపోవడం గమనించదగ్గ విషయం. -
సకాలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం
● డివిజన్ అధికారుల సమీక్షలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ టెక్కలి: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని రెవెన్యూ శాఖలో వివిధ విభాగాల అధికారులతో గురువారం టెక్కలిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పీజీఆర్ఎస్కు వస్తున్న రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి అర్జీపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కార మార్గం చూపాలన్నారు. రీసర్వేకు సంబంధించి పైలట్ గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ల్యాండ్ బ్యాంకింగ్ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలన్నారు. కోర్టు వివాదాలు భూవ్యవహారాల్లో చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. అనంతరం రీసర్వేపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు ఎం.కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, జి.వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ల్యాండ్ సర్వే విభాగం ఏడీ విజయకుమార్, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సర్వేయర్లు, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
21 నుంచి జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుంచి 23 వరకు హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్రా కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ఆదరించి, వాటిని భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రపంచ రంగస్థళ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. 21న షిరిడిసాయి వెల్ఫేర్ అసోసియేషన్(అనకాపల్లి) ‘ఆశ కదరా శివ’, 22న చైతన్య కళాభారతి(కరీంనగర్) ‘స్వప్నం రాల్చిన అమృతం’, మణికంఠ ఆర్ట్స్(పిఠాపురం) ‘కొత్త తరం కొడుకులు’, ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) ‘కిడ్నాప్’, 23న అరవింద్ ఆర్ట్స్ (తాడేపల్లి) ‘అసత్యం’ నాటిక ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. ప్రముఖ సినీ, టీవీ, హాస్యనటులు అప్పారావు ఆధ్వర్యంలో హాస్యవల్లరి ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సమితి కార్యదర్శి గుత్తు చిన్నారావు, కోశాధికారి నక్క శంకరరావు, ఉపాధ్యక్షులు మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, మెట్ట పోలినాయుడు, కొమనాపల్లి సురేష్, కొంక్యాన మురళీధర్, పార్థసారధి, వరలక్ష్మీ, ఉషారాణి, యు.పూజ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఫుల్ టైమ్ ఫ్రాడ్
పార్ట్ టైమ్ జాబ్.. ● పార్ట్ టైమ్ జాబ్ పేరిట సైబరాసురుల వల ● అమాయకుల పేరిట బ్యాంకు ఖాతాలు, సిమ్లు ఓపెన్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం శ్రీకాకుళం క్రైమ్ : నరసన్నపేటలో ఓ వ్యక్తి తన ఇన్స్ర్ట్రాగామ్లో తెలియని లింక్ రావడంతో ఓపెన్ చేశాడు. ఓ వెబ్ పేజీ ఓపెన్ అయ్యింది. పార్ట్టైమ్ జాబ్ చేసుకోవచ్చని చేయాల్సిందల్లా టాస్క్లు క్లియర్ చేయడమేనని మెయిల్లో రావడంతో ఓకే చేశాడు. మొదట్లో తన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. తర్వాత రూ.7.50 లక్షల వరకు లాగేశారు. మోసపోయానని తెలుసుకున్నలోపే అంతకుముందు అతని నంబర్ను యాడ్ చేసిన గ్రూపు నుంచి తొలగించి బ్లాక్లిస్టులో పెట్టేశారు. ●శ్రీకాకుళం కేంద్రంగా టెలిగ్రామ్ యాప్లో ఓ యువతి పైన చెప్పిన తరహాలోనే రూ.2.80 లక్షలు మోసపోయింది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం విశేషం. ●ఇచ్ఛాపురానికి చెందిన ఓ యువకుడు వర్క్ఫ్రం హోం అంటూ ఆన్లైన్ టాస్క్ల పేరిట రూ.12.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఆఖరికి ఇంట్లో వాళ్లు అప్పు తీర్చాల్సి వచ్చింది. టాస్క్ బేస్డ్ పార్ట్ టైమ్ జాబ్.. మోసగాళ్ల సరికొత్త వల. డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశ చూసి ఖాతాలు ఖాళీ చేసేందుకు వేసిన తాజా ప్రణాళిక. జిల్లాలోనూ ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియని లింక్లు, పార్ట్టైం జాబ్ ఆఫర్స్ కొన్నిమార్లు వస్తుంటాయి. క్లిక్ చేశాక వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. మనకు తెలియకుండానే అవతలి వాళ్లు మనల్ని గ్రూపులో యాడ్చేస్తారు. కొన్ని టాస్క్లు (లైక్లు కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం) మీరు గెలుచుకుంటే సొమ్ము రెట్టింపు వస్తుందని నమ్మబలుకుతారు. మొదటి టాస్క్లో రూ. 1000 నుంచి రూ. 2 వేలు పెట్టుబడి పెడితే దానికి డబుల్ అమౌంట్ తర్వాత టాస్క్ రూ. 10 వేలు అని ఫినిష్ చేస్తే డబుల్ అంటారు.. సక్సెస్గా పూర్తి చేసినా మన ఖాతాలో డబ్బులు రావు. మన పేరుతో ఓ ఫేక్ యాప్ అకౌంట్ను వ్యాలెట్ రూపంలో చూపించి అందులో డబ్బులు యాడ్ అయినట్లు చూపిస్తారు. మనం విత్డ్రా చేయడానికి అవ్వదు. మళ్లీ మూడో టాస్క్ రూ. 50 వేలు అని పూర్తి చేస్తే రూ. 1 లక్ష వస్తుందని నమ్మిస్తారు. కంప్లీట్ అయ్యాక డబ్బులు విత్డ్రా చేద్దామంటే అవ్వకపోవడంతో వారిని మనం అడిగితే అందులో మొదట పంపిన రూ. 10 వేలకు రూ. 10 వేలు, తర్వాత పంపిన రూ. 50 వేలకు రూ. 50 వేలు చూపించి విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ అని చూపిస్తుందంటారు. టాస్క్లో మీరేదో తప్పు చేయడం వలనే ఇలా జరిగిందని అది ఎనేబుల్ చేయడానికి నాలుగో టాస్క్ చేయాలంటారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఆ టాస్క్ ఉంటుందంటారు. మనం నమ్మి ఆ డబ్బులు పంపిస్తే అక్కడికి కొద్ది క్షణాల్లోనే అకౌంట్ బ్లాక్ అయిపోయిందని మీ అకౌంట్లో రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలుందని అవి విత్డ్రా అవ్వాలంటే మరో రూ. 2లక్షలు, లేదా రూ. 3లక్షలు వేయాలని చెబుతారు. పైగా మనకు తెలియకుండానే వేరే బాధితుడి అకౌంట్కు సైతం రూ. 10 వేలు వేయించి మన చేతే ముందుగా ఫ్రాడ్ చేయించి ఉంటారు. డబ్బులు వేశాక గ్రూపు నుంచి రిమూవ్ చేసి నంబర్లు బ్లాక్ చేస్తారు. కాంబోడియా, చైనాలో.. ఈ తరహా మోసాలకు పాల్పడేవాళ్లు కాంబోడియా, చైనాలోనే ఉంటారని సైబర్ నిపుణులంటున్నారు. ఇక్కడి మధ్య వర్తులు అమాయక ప్రజల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారి పేరుతోనే ఫోన్ సిమ్లు కొనిపించి మోసపోయిన బాధితుల సొమ్మును వీరి ఖాతాలో పడేటట్లు చేసి తర్వాత అనేక ఖాతాలు మార్చి చివరికి వారికెళ్లేలా చేస్తారు. ఇదంతా ఓ లింక్ సిస్టమ్ మాదిరిగా జరు గుతుంది. ఇప్పటివరకు ఎన్నో సైబర్ కేసుల్లో మన జిల్లా పోలీసులు పక్క రాష్ట్రాల వరకు వెళ్లారు. బ్యాంకు ఖాతా చిరునామాలున్నవారికి, నడిపిన మధ్యవర్తులకు నోటీసులిచ్చారు. కొందరు ఇక్కడి కోర్టులకు సైతం వచ్చారు. కానీ మోసం చేసే కేటుగాళ్లు మాత్రం విదేశాల్లో దాక్కుని ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. తెలియని లింక్లు క్లిక్ చేయకూడదు. స్పామ్ కాల్స్, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. టాస్క్బేస్డ్ ఆఫర్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలను అరిక ట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యూహాత్మ కంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నాయి. జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
మందస: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్తో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాహుల్ మండల్ తమిళనాడు రాష్రం ఈరోడ్ పట్టణంలో టైలర్గా పనిచేస్తున్నాడు. అక్కడ రంజిత్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. అతని సూచన మేరకు ఒడిశా రాష్ట్రం పారదీప్ వెళ్లి భానోజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మందస రాగా రైల్వేస్టేషన్ వద్ద ఎస్ఐ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం పట్టుకున్నారు. రాహుల్ వద్ద 4 కేజిల 132 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనంలో తరలిస్తూ.. నరసన్నపేట: పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్ గుల్ఫాన్ నాలుగు కేజీల గంజాయితో గురువారం పట్టుబడ్డాడు. హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయివేటు వాహనాన్ని అనుమానంతో దేవాది వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
కిడ్నీ సమస్యతో యువకుడి మృతి
● కిడ్ని దినోత్సవం నాడు విషాదం టెక్కలి రూరల్: ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడే టెక్కలిలో డయాలసిస్ సేవలు పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీనివాస నగర్కు చెందిన ఎస్.భాస్కర్(30) కొంత కాలంగా కిడ్ని వ్యాధి తో బాధపడుతున్నాడు. గురువారం తీవ్ర అస్వస్థత రావడంతో కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందాడు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడు కిడ్ని వ్యాధితో యువకుడు మృతి చెంద డం బాధాకరమని పలువు రు ఆవేదన వ్యక్తం చేశారు. -
సెమిస్టర్ పరీక్షల్లో చూసిరాత‘లా’!
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో చూసిరాతలు జరగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. 1, 3, 5, 7, 9 సెమిస్టర్లకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ న్యాయ కళాశాలకు చెందిన 250 మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించడం వల్ల గూగుల్, వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్క్ మేటా ఏ–1ల ద్వారా చూసిరాతలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెక్టార్, చీఫ్ సూపరింటెండెంట్ అడ్డయ్య వద్ద ప్రస్తావించగా పూర్తిస్థాయి నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రం పరిశీలన ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల సెమిస్టర్ పరీక్షలను గురువారం రెక్టార్ అడ్డయ్య, పరీక్షల నిర్వహణ డీన్ ఉదయ్భాస్కర్, ప్రత్యేకాధికారి సామ్రాజ్యలక్ష్మి పరీక్షలు పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
బెల్ట్ బాదుడు
విశృంఖలంగాసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం మాఫియా జడలు విప్పింది. లిక్కర్ సిండికేట్ వ్యవహరం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుట్బాటిళ్లుగా వర్ధిల్లుతోంది. జిల్లావ్యాప్తంగా లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఎమ్మార్పీకి మించి మద్యం ధరలు పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అండగా నిలిచినందుకు ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు అందుతున్నాయి. కొన్నిచోట్ల షాపుకి నెలకు రూ.50 వేలు చొప్పున, మరికొన్ని చోట్ల అక్కడున్న అమ్మకాల దృష్ట్యా రూ.30వేల నుంచి రూ.70వేల వరకు తీసుకుంటున్నారు. పనిలో పనిగా అధికార వర్గాలు కూడా రెన్యువల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్కు షాపునకు రూ. 70 వేలు వసూలు చేయగా, ఈ నెలలో చేయాల్సిన మూడో రెన్యువల్కు రూ.30వేలు అడుగుతున్నాయి. రూ.10 అదనం జిల్లాలో బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అన్నీ నేతల కనుసన్నల్లోనే ప్రారంభమయ్యాయి. తమ టర్నోవర్ పెరగడం కోసం లైసెన్స్ దుకాణాలు బెల్ట్షాపులను ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కో గ్రామానికి కనీసం 10 బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేసే బాధ్యతను లైసెన్సు దుకాణాలు తీ సుకుంటున్నాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్కు రూ.10 పెంచి తీసుకోగా, ఆ బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో రూ.40వేసి రూ. 50 అధికంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం టౌన్, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో మినహా మిగతా అన్ని చోట్ల బెల్ట్షాపులకు ఒక్కో బాటిల్పై రూ. 10 పెంచి సరఫరా చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో బరితెగింపు పలాస నియోజకవర్గంలోనైతే మద్యం దుకాణాల కౌంటర్లో క్వార్టర్ బాటిల్కు రూ.10 అదనంగా వేసి విక్రయిస్తున్నారు. ఆ మధ్య జామి జాతరలోనైతే ఒక్కో బాటిల్కు రూ. 50 పెంచి విక్రయించారు. వాస్తవానికి జాతర సమయంలో దుకాణాలు తెరవకూడదు. కానీ బ్యాక్డోర్లో మొత్తం తతంగం నడిపేశారు. కీలక నేతల అనుమతి తీసుకుని దర్జాగా షాపుల కౌంటర్లలోనే ఎమ్మార్పీకి రూ.10 పెంచి విక్రయించేస్తున్నారు. ఎవరికెంత ముడుపులందుతున్నాయో గానీ ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గేట్లు ఎత్తేశారు. తిలాపాపం తలా పిడికెడు మద్యం దోపిడీలో నేతలు లాభాలు ఆర్జిస్తుంటే.. తామెందుకు వదులుకోవాలని అధికార వర్గాలు సైతం అక్రమ వసూళ్లు చేస్తున్నాయి. కాకపోతే, లైసెన్సుల రెన్యువల్ పేరుతో వసూళ్లు చేస్తున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్కు షాపుకి రూ. 70వేలు వసూలు చేయగా, ఈ నెలలో జరిగే మూ డో రెన్యువల్కు ఇప్పటికే రూ. 30వేలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతిభద్రతలు, మందుబాబుల రాకపోకలు తదితర వ్యవహారాలను కంట్రోల్ చేసేందుకు సంబంధిత అధికారులు షాపుకింత అని నెల వారీ ముడుపులు ఇప్పటికే తీసుకుంటున్నారు. జడలు విప్పిన లిక్కర్ సిండికేట్ పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్షాపులు నాలుగైదు మండలాల్లో మినహా జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు విక్రయాలు బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నందుకు క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ. 10 వసూలు పలాస నియోజకవర్గంలోనైతే లైసెన్సు దుకాణాల కౌంటర్లలో క్వార్టర్ బాటిల్పై రూ. 10 పెంచి విక్రయాలు దోపిడీకి కీలక నేతల అండ కీలక నేతలకు ముడుపులు జిల్లాలో జరుగుతున్న మద్యం దోపిడీపై కీలక నేత ముడుపుల ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో షాపుకి నెలకు రూ. 50 వేలు చొప్పున, మరికొ న్ని నియోజకవర్గాల్లో షాపు సామ ర్థ్యం మేరకు రూ.30వేల నుంచి రూ. 70వేలు ఇచ్చేందుకు నిర్ణయాలు జరిగిపోయాయి. ఇప్పటికే కొన్నిచోట్ల చెల్లింపులు జరిగిపోగా, మరికొన్ని చోట్ల వారం పది రోజుల్లో ఆ మేరకు చెల్లింపులు చేయడానికి సిండికేట్ సిద్ధం చేసింది. ఇక,లైసెన్సు షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్కు రూ.10 పెంచి విక్రయిస్తు న్న చోట ఈ ముడుపులు మరింత ఎక్కువగా ఉన్నాయి. నెలకి రూ. లక్షకు పైగా ముట్టచెబుతున్న షాపులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం టౌన్, శ్రీకాకుళం రూర ల్, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో విక్రయాలకు చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు సిండికేటైన చోట వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెంచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం 20 శాతాలు లాభాలు ఇస్తే ఈ ముడుపులు మరింత పెరగనున్నాయి. తక్కువ ధరల కు నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ధరలు పెంచేసి మందుబాబులను దోచుకుంటోంది. -
ప్రత్యేకం..పంచకర్మ వైద్యం
పంచకర్మ దశలు.. టెక్కలి: మారుతున్న కాలంతో పాటు విస్తరిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ఆదరణ ఉంది. ఆయుర్వేద వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023లో కేంద్ర ఆయుష్ విభాగం జిల్లాలో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రిలో ‘పంచకర్మ చికిత్స’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఈ పంచకర్మ వైద్యాన్ని వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఆయుర్వేద ఆసుపత్రులలో ఈ పంచకర్మ వైద్య సేవలు ఉండగా, అందులో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రి ఒకటి కావడం విశేషం. డాక్టర్ వివేకానంద ఆధ్వర్యంలో పంచకర్మ చికిత్సలతో పాటు ఆయుర్వేదిక్ మొక్కలతో హెర్బల్ గార్డెన్ పెంచుతున్నారు. బహుళ ప్రయోజనాలు... శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచడం, విష పదార్థాల విసర్జన చేయడం, జీవక్రియను వేగవంతం చేయడం, బరువు తగ్గడం, జీర్ణ అగ్ని బలాన్ని పెంచడం, మానసిక, శారీరక విశ్రాంతి, కణజాలాల పునరుజ్జీవనంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడిని తగ్గించడంలో ఈ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. వామన కర్మ: కఫాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడటానికి ప్రేరేపిత వాంతులు ఉంటాయి. దీని ద్వారా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులను నిరోధిస్తారు. విరేచన కర్మ: జీర్ణ సమస్యలను నియంత్రించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. కడుపులో పేరుకుపోయిన విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వస్తి కర్మ: వాతాన్ని సమతుల్యం చేయటానికి సూచించిన నూనెలు, కషాయాలను యానోరెక్టల్ మార్గం ద్వారా వైద్యం చేస్తారు. నశ్య కర్మ: నాసికా రంధ్రం ద్వారా వైద్యం అందజేస్తారు. మైగ్రేన్ సమస్యలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. రక్తమోక్షణ కర్మ: శరీరంలో ఉన్న అపరిశుభ్రమైన రక్తాన్ని తొలగించడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తారు. కొన్ని రకాల పరికరాలతో ఈ వైద్యం చేస్తారు. కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో చికిత్సలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరం రాష్ట్రంలో 13 ఆస్పత్రుల్లోనే ఈ రకమైన వైద్యసేవలు కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పంచకర్మ చికిత్సను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి. చికిత్సతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నాం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధిత సమస్యలకు వైద్యం అందజేస్తాం. –డాక్టర్ కె.వివేకానంద, ఎండీ, ఆయుర్వేదిక్, కోటబొమ్మాళి -
శ్రీకాకుళం
దగ్గరకొచ్చారో దూకేస్తా..! రిమ్స్లో ఓ రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. –8లోశుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025ఇన్విజిలేటర్కు దేహశుద్ధి ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఓ ఇన్విజిలేటర్కు దేహశుద్ధి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగ్గా, గురువారం క్యాంపస్లో చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో.. న్యాయ విద్య ఎల్ఎల్బీ మూడేళ్లు, ఎల్ఎల్బీ ఐదేళ్ల పరీక్షలు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీకాకుళానికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఇన్విజిలేటర్గా వర్సిటీకి చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యుడు వ్యవహరించారు. అయితే పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఫోన్ నంబర్ను అడిగి తీసుకున్న ఇన్విజిలేటర్ ‘నువ్వంటే నాకిష్టం.. చూసి పరీక్ష రాసుకో.. నీకోసం రూం మొత్తం విడిచి పెడతా’ అంటూ మెసేజ్పెట్టాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేసి విష యం చెప్పి కాలేజీకి రావాలని సూచించింది. పరీక్ష సాయంత్రం ఐదు గంటలకు అయిపో యాక ఆమె ఇన్విజిలేటర్ను తన కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో నలుగురు వ్య క్తులు ఇన్విజిలేటర్పై దాడికి దిగారు. అక్కడ ఏం జరుగుతుందో.. ఎందుకు దాడి చేస్తున్నా రో తెలీక విద్యార్థులంతా చూస్తూ ఉండిపోయా రు. తర్వాత వారికి కూడా విషయం తెలిసింది. మెసేజ్ పెట్టిన వ్యక్తి క్షమాపణ చెప్పటంతో అతడిని విడిచిపెట్టారు. అయితే పరీక్ష కేంద్రంలోనికి సెల్ఫోన్ను అనుమతించడం వల్లే ఈ తంతు జరగడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. టీచర్పై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్న త పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నేతాజీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంఈఓ దల్లి తులసిరావురెడ్డి ఉన్నతాధికారులకు తెలియజేశారు. డీఈఓ ఎస్.తిరుమల చైతన్య గురువారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులతో సైతం మాట్లాడారు. కిడ్నీ వ్యాధులపై జాగ్రత్త శ్రీకాకుళం: కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద జరిగిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరో ఐదు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. పలాసలో ఉన్న కిడ్నీ పరిశోధన కేంద్రం (ఆస్పత్రి)లో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కెరోలీనా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజి, ఐఏఎస్సీ బెంగళూరు యూనివర్సిటీలతో కలసి పరిశోధనలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మనిషి జీవన విధానంలో మార్పు రావాలన్నారు. ఎక్కువ నీరు తాగటం, వ్యాయామం చేయటం, ఒత్తిడికి గురికాకుండా ఉండటం, ఏటా పరీక్షలు చేయించుకోవటం వంటి పలు పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.శ్రీకాకుళం కల్చరల్: రంగుల వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్ను రంగులు ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలు కూడా నిర్వహిస్తారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందురోజు కామదహనోత్సవం జరుపుతారు. అనంతరం పడియ సందర్భంగా సముద్రస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, ప ద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామి రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులపైన వసంతం జల్లుతారు. శ్రీకూర్మంలో కూడా ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీకాకుళంలోని ఉమా రుద్రకోటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో స్వామి ఉత్సమూర్తులను డోలో మండపంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో సుమా రు 150 కుటుంబా లు ఉన్న మార్వాడీలు ఒకే చోట చేరి హోలీ ఉత్సవాన్ని రాజస్థానీ మిలన్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ●రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు. ●గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు. ●పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు. ●మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు. ●గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి ●హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి. ●రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు. ●హోలీ రంగుల్లో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ●రంగులు విపరీతంగా చల్లుకోవడం వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి. ●రసాయన రంగులు కళ్లల్లో పడగానే కంటి చికాకు, ఎరుపు, నీరుకారడం, తాత్కాలిక అంధత్వం కలిగిస్తుంది. కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. ●రంగుల వల్ల కొందరిలో ఎలర్జీ వస్తుంది. వారిని దూరంగా ఉంచాలి. ●హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ●రసాయన రంగుల వలన అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ●మూడు రోజులపాటు.. హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్స వం అని పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడి యా సందర్భంగా సముద్రస్నానాలు, మూడో రోజున స్వామిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం. – ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ●సహజ రంగులు వాడాలి కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే ఎర్రగా మారి నీళ్లు వస్తాయి. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి. – ఎంఆర్కే దాస్, ఆఫ్తాలమిక్ అధికారిప్రశాంతంగా పండగ చేసుకోండి: ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఈ మేరకు గురువా రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గొడవలు, అల్లర్ల జోలికి వెళ్లకుండా వేడుకలు జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆకతాయి చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. కలుషితమైన, ప్రమాదకరమైన రంగులు వినియోగించవద్దని పర్యావరణహితమైన రంగులు వాడాలని సూచించారు. పోర్ట్ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం మూల పేట గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్ నిర్వాసితులకు ప్లాట్లను టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి లాటరీ ద్వారా గురువారం కేటాయించారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాలకు గాను నౌపడలో 58 ఎకరాల్లో 596 కుటుంబాలకు ప్లాట్లను కేటాయించారు. పోర్టు నిర్మాణంతో గ్రా మాన్ని కోల్పోయిన విష్ణు చక్రం గ్రామస్తులకు ముందుగా 80 మందికి పునరావాస కాలనీలో పాట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో గ్రామాన్ని తరలించాల్సి వస్తుందని, అంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు పునరావాస కాలనీలో భూమి పూజ చేశారు. న్యూస్రీల్ఇంటి వద్దే రంగుల తయారీ ఇలా.. హోలీ వేడుకకు సర్వం సిద్ధం దేవాలయాల్లో డోలోత్సవాలు రసాయన రంగులు వద్దంటున్న నిపుణులు -
హాల్టికెట్ల పేరిట విద్యార్థులను వేధించొద్దు
శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లలో స్కూల్ ప్రిన్సిపాల్ సంతకాలు, స్టాంపులు ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జరీ చేసిందని గుర్తు చేశారు. ఎక్కడైనా హాల్ టికెట్ల జారీ పేరుతో యాజమాన్యాలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తుప్పల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం రోడ్డు పక్కన తుప్పల్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నక్క కృష్ణారావు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 30 ఉండవచ్చని భావిస్తున్నారు. ఇతను కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యం, ఆకలి వంటి సమస్యలతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నా రు. వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో తెలియజేయాలని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 08942 –281833, 63099 90853 నంబర్లకు సమాచా రం తెలియజేయాలని కోరారు. లారీని ఢీకొట్టిన కారు ● ఇద్దరు మహిళలకు గాయాలు నరసన్నపేట: జమ్ము ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన పి.సునీత, పి.పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. తాపీమేసీ్త్ర పి.గణపతి కాలికి గాయం కావడంతో శ్రీకాకుళంలో చికిత్స చేసిన అనంతరం తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న ఎన్హెచ్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫీడర్ అంబులెన్సులో ప్రసవం కంచిలి: మండలంలోని కుంబరినౌగాం గ్రామానికి చెందిన సునీత బెహరా అనే గర్భిణికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఎం.ఎస్.పల్లి పీహెచ్సి ఫీడర్ అంబులెన్స్ ఈఎంటీ అజయ్ వెంటనే గ్రామానికి వెళ్లారు. ఫీడర్ అంబులెన్సులో సునీతను తీసుకొస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించడంతో మగబిడ్డ జన్మించాడు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఈఎంటీ అజయ్ను గ్రామస్తులు అభినందించారు. మానవ అక్రమ రవాణా నిరోధించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్ : మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవా సదన్లో పోక్సో చట్టం, వెట్టి చాకిరి నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, మున్సిపల్ కమిషనర్ పి.వి.ఆర్.పి.ప్రసాదరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, డిప్యూ టీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, బాలల సంక్షేమ అధికారులు శ్రీలక్ష్మి, కె.వి.రమణ పాల్గొన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సుబలై గ్రామానికి చెందిన తుఫాన్ కరియా అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. తుఫాన్ కరియా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో రితీష్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారంతో మడపాం టోల్గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో తుఫాన్ కరియా ఒక వాహనంలో నుంచి దిగిపారిపోతుండగా వెంబడించి పట్టుకొని కేసు నమోదు చేశారు. బరంపురం నుంచి ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి సూరత్కు 10.31 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం ముమిదిహ గ్రామానికి చెందిన బురగాన సింహాచల పాత్రో, సంజయ బెహరాలను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. వీరిద్దరూ సూరత్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. వారికి అక్కడ గంజాయి వ్యాపారం చేసే గొల్ల అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తనకు గంజాయి అందిస్తే కిలోకు రూ.9 వేలు ఇస్తానని చెప్పడంతో ఒడిశా రాష్ట్రంలోని కొద్ద గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. గంజాయిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. సమావేశంలో సీఐ చిన్నమనాయుడు, ఎస్ఐ ముకుందరావు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాలకు అదనపు సాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను నిర్మించుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అదనపు సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2029 నాటికి ‘అందరికీ గృహ నిర్మాణం‘ అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సాయం అందిస్తామన్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు యూనిట్ ధర కంటే అదనంగా రూ.50,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75,000, పీవీటీజీ (పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబుల్ గ్రూప్) లబ్ధిదారులకు రూ.1,00,000 చెల్లించనున్నట్లు వివరించారు. 2024 డిసెంబర్ 10 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు. -
రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయం
● వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కళింగ జాతి అభివృద్ధికి బొడ్డేపల్లి రాజగోపాలరావు చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణరావు అన్నారు. బుధవారం బొడ్డేపల్లి రాజగోపాలరావు 102వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని సింహద్వారం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవి కావాలా.. ప్రాజెక్టు కావాలా అని అప్పట్లో ఆయనకు ఆఫర్ ఇస్తే ప్రాజెక్టు కావాలంటూ జిల్లా అభివృద్ధి కోరుకున్న మహనీయుడని కొనియాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కళింగ జాతికి బీసీ–ఏ రిజర్వేషన్ కల్పించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కృషి వలన నేడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించినా ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్, చింతాడ ప్రసాద్, పైడి నాగభూషణ్, సీపాన రామారావు, చాపర వెంకటరావు, పైడి శ్రీను, తిర్లంగి లోకనాథం, బొడ్డేపల్లి మోహన్, గురుగుబెల్లి శేఖర్, పప్పల సూర్యారావు, పొన్నాడ సత్యం, దుంపల గోవిందరావు, సీపాన హేమసుందర్, చింతాడ శ్రీను, మెట్ట రామారావు, బుడుమురు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిసెంబర్లో జరిగిన స్పెషల్ డ్రైవ్ డిగ్రీ–1, 2, 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జ్ఞానభూమి వెబ్సైట్, వర్సిటీ వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచామని యూజీ ఎగ్జామినేషన్స్ ఇన్చార్జి డీన్ పి.పద్మారావు తెలిపారు. రీ వాల్యుయేషన్కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ ● బీసీ సంక్షేమశాఖలో ఇద్దరు చిరుద్యోగుల నుంచి లంచం డిమాండ్ ● రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం శ్రీకాకుళం పాతబస్టాండ్ : చిరుద్యోగుల నుంచి లంచం తీసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, సీఐ కె.భాస్కరరావులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కుక్, అటెండర్లకు ఇంక్రిమెంట్లు, ఇతర ఎరియర్స్ బిల్లులు పెట్టేందుకు సీనియర్ అసిస్టెంట్ బాలరాజు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారు ఇచ్చి న సూచనల మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో బాధితుల నుంచి రూ.10,000, రూ.15,000 చొప్పున మొత్తం రూ.25,000బాలరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గాడితప్పిన ‘సంక్షేమం’ కాగా, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో పట్టుపడటం ఇది మూడోసారి. డీబీసీగా రవిచంద్ర ఉన్న సమయంలో ఉపకార వేతనాల కుంభకోణంలో అప్పటి అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. ఆరుగురు సస్పెండయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం బీబీసీగా శ్రీదేవి ఉన్న సమయంలో విద్యార్థుల యూనిఫారాల కుట్టు మజూరీలు చెల్లించేందుకు లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా బాలరాజు సైతం ఏసీబీకి చిక్కారు. అయితే ఈ ఘటనలన్నింటిలోనూ చిన్నస్థాయి ఉద్యోగులకే కాకుండా ఉన్నతాధికారుల భాగస్వామ్యం కూడా ఉండే అవకాశం ఉందంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం. నెల రోజులు క్రితం ఈ శాఖ అధికారులు, వార్డెన్లను ఏసీబీ అధికారులు కార్యాలయానికి పిలిపించారు. అవినీతి కార్యక్రమాలపై ఆరాతీశారు. వీటిలో ప్రధానంగా బీఆర్ (బొడ్డేపల్లి రాజగోపాలరావు) శతజయంతి ఉత్సవాలకు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్టు చూపించారని, అందులో భారీగా అవినీతి జరిగిందని, బదిలీలు, పదోన్నతులు, తదితర అంశాలపై ఆరాలు తీసినట్లు తెలిసింది. అయినా ఈ శాఖలోని కొందరు అవినీతి ఉద్యోగుల్లో మార్పు రాలేదు. పక్కాగా ‘పది’ పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
యువత పోరుకు విశేష స్పందన
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులుప్రభుత్వ తీరు దుర్మార్గం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్ సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కూటమి సర్కారు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది. మెడికల్ సీట్లు కూడా వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దురదృష్టకరం. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం తగదు. ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. – తమ్మినేని సీతారాం, మాజీ శాసన సభాపతి ● కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు ● వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● సర్కారు ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గని పరిస్థితి ● ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాల హోరు ● బాబు మోసం గ్యారెంటీ: పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ● బాబు ధ్యాసంతా అమరావతిపైనే: మాజీ మంత్రి సీదిరి ● నిరుద్యోగులను నట్టేట ముంచారు: మాజీ స్పీకర్ తమ్మినేని ●శ్రీకాకుళం(పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్ : కూటమి ప్రభుత్వ మోసాలపై యువత గర్జించింది. తమకు మద్దతుగా పోరు సాగిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించింది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న పాలకుల తీరును తీవ్రంగా ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో తొలుత బకాయి ఫీజులు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ.. బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి.. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామా రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాలకు సరిపడా నిధులను బడ్జెట్ కేటాయింపులు పెంచి సకాలంలో వాటిని విడుదల చేయాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి మోసాలపై భవిష్యత్లో ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్, తూర్పుకాపు, కళింగ వైశ్య కులాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి సత్యనారాయణ, డాక్టర్స్సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, కార్యదర్శి సీపాన వెంకటరావు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ధర్మాన కృష్ణచైతన్య, తమ్మినేని చిరంజీవినాగ్, మార్పు పృథ్వీ, ముంజేటి కృష్ణమూర్తి, ఎంఏ బేగ్, లోలుగు కాంతారావు, గొండు కృష్ణ, చిట్టి జనార్దన, సాదు వైకుంఠరావు, గొండు రఘు, శాడి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రత్తి అన్వేష్, బల్లాడ జనార్దన్ రెడ్డి, పిన్నింటి సాయి, రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, సీపాన రామారావు, రుప్ప దివ్య, వై.వి.శ్రీధర్, బొడ్డేపల్లి పద్మజ, బొడ్డేపల్లి రమేష్, గుండ హరీష్, టి.కామేశ్వరి, యజ్జల గురుమూర్తి, ఖండాపు గోవిందరావు, కోట గోవిందరావు, పప్పల రమేష్, పీస శ్రీహరి, పీస గోపి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమణ, పప్పల పారినాయుడు, సనపల బాబూరావు, తమ్మినేని మురళి, బెండి గోవిందరావు, తమ్మినేని శ్రీరామ్మూర్తి, బాడాన సునీల్, వాడన కృష్ణ, దుంపల గోవిందరావు, సీహెచ్ భాస్కరరావు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చింది. నిరుపేద విద్యార్థులను, నిరుద్యోగ యువతకు అమలుచేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎం చంద్రబాబునాయుడు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు రాసేందుకు యాజమాన్యాలు హాల్టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. నిరుద్యోగులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అరకొరగా కేటాయింపులు గత ఏడాది ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థులకు ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అధికారంలోకి వచ్చాక ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాలకు ఏటా రూ.3,900 కోట్లు కావాలి. ఇప్పటికే ఉన్న బకాయిలు రూ.3,200 కోట్లు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సింది మరో రూ.3,900 కోట్లు. మొత్తం కావాల్సింది రూ. 7,100కోట్లు. ఈ బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ 2,600 కోట్లే. నిరుద్యోగ భృతి పేరిట కూడా యువతను మోసగించారు. బాబు ధ్యాసంతా అమరావతిపైన తప్ప మెడికల్ కాలేజీలపై లేదు. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రిడీఆర్ఓకు వినతిపత్రం అందజేస్తున్న ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ, నర్తు రామారావు, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, పేరాడ తిలక్, చింతాడ ర వికుమార్ తదితరులుయువతరం ఉత్తుంగ తరంగమై కదం తొక్కింది. కూటమి సర్కారు మోసపూరిత వైఖరిని గొంతెత్తి గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలను విస్మరించిన చంద్రబాబు సర్కారు తీరుపై నిరసనలతో హోరెత్తించింది. వైఎస్సార్సీపీ పిలుపునకు యువత నుంచి లభించిన అనూహ్య స్పందన తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వంపై యువతలో పెరిగిన అసంతృప్తికి యువత పోరు ఉద్యమం దర్పణం పట్టింది. -
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
పాతపట్నం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు హెచ్చరించారు. మండల కేంద్రంలోని రేషన్ డిపోలు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(ఎండీయూఎస్), బూరగాంలోని రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనం సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్, సీడీపీవో టి.విమలారాణి, ఏఎస్డబ్ల్యూవో ఎం.శ్యామల, ఎస్ఎస్ఏ జీసీడీవో ఎస్.నీరజ, ఎంఈవో–2 సీహెచ్ తిరుమలరావు, సీఎస్డీటీలు ప్రసాదరావు, చక్రవర్తిలు, ఆర్ఐ బాబి, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు సూర్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అనూరాధ, ఉషారాణి తదితరులు ఉన్నారు. మెళియాపుట్టి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిటీ సభ్యుడు బి.కాంతారావు సూచించారు. మండలంలోని కేజీబీవీ, చాపర ఎస్సీ హాస్టల్, ఎఫ్సీఐ గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాపర ఎస్సీ వసతి గృహంలో రికార్డులు, నిల్వ ఉన్న సామగ్రిలో తేడాలున్నట్లు గుర్తించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, వార్డెన్కు మెమో జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ పాపారావు తదితరులు ఉన్నారు.