st funds
-
‘ఏ అర్హత ఉందని లోకేశ్కు మంత్రి పదవి’
-
‘ఏ అర్హత ఉందని లోకేశ్కు మంత్రి పదవి’
అనంతపురం: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ముగింపు సభలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ అర్హత ఉందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... మైనార్టీలు, గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎందుకు మనసు రావడం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకే పెద్దపీట వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ రైతులు భిక్షాటన చేస్తున్నా బాబు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదన్నారు. టీడీపీ నేతల వద్ద వందల కోట్ల అవినీతి డబ్బు ఉందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల నిధులను సీఎం చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, కేరళ వ్యవసాయ మంత్రి సునీల్ కుమార్, సినీగేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ,ఎస్టీ జనాభాకు అనుగుణంగా నిధులు: అమిత్షా
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం 42 శాతం నిధులు కేటాయించిందని, అందువల్ల రాష్ట్రాలు తమ ప్రణాళికా వ్యయంలో ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నేత మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, మాజీ ఉన్నతాధికారులు మాధవరావు, కృష్ణన్ తదితరులు ఈరోజు అమిత్ షాను కలిశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని ఈ ప్రతినిధి బృందం ఆయనను కోరింది. ఈ సారి రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున కోత పడిన విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రాలకు కేటాయించన నిధుల వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. అనంతరం మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సబ్ప్లాన్ తీసుకువచ్చే విషయంపైనా ఆలోచన చేస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలిపారు.