breaking news
starved
-
మానవత్వమా నీవేక్కడ..?
న్యూఢిల్లీ : మానవత్వం, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. బిడ్డలకు కన్న తల్లిదండ్రులు బరువవుతున్న కాలం ఇది. కడపున పుట్టిన వారే కడవరకూ చూస్తారనే నమ్మకంలేని కాలంలో తోడబుట్టిన వారి నుంచి ఇలాంటి ఆప్యాయతను ఆశించడం అత్యాశే అవుతోంది. మతి స్థిమితం లేని సోదరి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడో అన్న. తోబుట్టువుగా కాదు కదా కనీసం మనిషి అనే విషయాన్ని మరిచి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. చివరకూ ఢిల్లీ మహిళా కమీషన్ చొరవతో బాధితురాలు ఆ నరకం నుంచి బయటపడ్డారు. హృదయవిదారకమైన ఈ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇద్దరూ సొదరులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు మరణించే వరకూ వారితో పాటు ఉన్న బాధితురాలిని రెండేళ్ల క్రితం ఆమె సోదరుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడు తన భార్యతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆమెకు సరైన తిండి కాదు కదా అసలు భోజనం పెట్టడమే మానేశారు. నాలుగు రోజులకు ఒకసారి ఒక బ్రెడ్డు మాత్రమే ఇస్తున్నారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె తన పనులను స్వయంగా చేసుకోలేదు. సోదరుడు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె తన మలమూత్రాల మధ్యనే అత్యంత జుగుప్సాకరమైన పరిసరాల్లో జీవనం గడుపుతోంది. బాధితురాలికి మరో సోదరుడు ఉన్నాడు. కానీ ఆమె ప్రస్తుతం ఉంటున్న సోదరుడు ఆమెను చూడటానికి ఎవ్వరిని అనుమతిచ్చేవాడు కాదు. దాంతో బాధితురాలి రెండో సోదరుడు ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్కు సమాచరం అందించాడు. అధికారులు బాధితురాలి సోదరుని ఇంటికి వచ్చినప్పుడు, అతడు వారిని తిట్టడమే కాక ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో సదరు అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి అక్కడ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బాధితురాలిని అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ ‘బాధితురాలి వయసు కేవలం 50 ఏళ్లు ఉండోచ్చు.. కానీ సరైన పోషణ అందకపోవడంతో 90 ఏళ్ల వయసు వ్యక్తిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చాం. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆశ్రమానికి మారుస్తాం. ప్రజలు కూడా తమ చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. బాధితులకు సాయం చేయండి’ అని కోరారు. -
ఆకలితో సౌదీ నుంచి 10వేల మంది వెనక్కు..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తిండి లేక ఆకలి బాధలు పడుతున్న 10 వేల మందికి పైగా భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ఓ మినిష్టర్ ను పంపనున్నట్లు విదేశాంగ శాఖ(ఈఏ) మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తీసివేసిన కార్మికులు అక్కడి ఖర్చులకు తగిన డబ్బులు లేక ఆకలితో అల్లాడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయంపై సౌదీ ప్రభుత్వం చర్చించేందుకు వచ్చే వారం మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఈఏఎమ్ వీకే సింగ్ తో పాటు ఎమ్ అక్బర్ సౌదీకు వెళ్లనున్నారు. ఉద్యోగాలు కోల్పోయి ఆకలి బాధలు పడుతున్న భారతీయులకు సౌదీలోని భారతకాన్సులేట్ జనరల్ శనివారం రాత్రి భోజన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. సౌదీ రాజధాని జెడ్డాలో దాదాపు 800ల మందికి పైగా భారతీయులు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, సాయం చేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మాస్వరాజ్ ను కోరాడు. స్సందించిన సుష్మా కాన్సులేట్ జనరల్ ద్వారా భోజన ఏర్పాట్లు చేయించారు. గంటకు ఒకసారి ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఆహార సదుపాయాన్ని కల్పించాలని రియాద్ లోని ఇండియన్ ఎంబసీని కోరినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. సౌదీ, కువైట్ లలో చాలా మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారని చెప్పారు. కంపెనీలను మూసివేసిన వారందరూ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్డును పడ్డారని వివరించారు. సౌదీ, కువైట్ ల ప్రధాన ఆదాయవనరైన ఆయిల్ రేట్లు భారీగా పతనం కావడంతో గత ఏడాది నుంచి అక్కడ పరిస్థితులు బాగాలేవు. నిర్మాణ రంగం బాగా దెబ్బతింది. దీంతో విదేశీ వర్కర్లకు కంపెనీలు వేతనాలు చెల్లించలేక, స్వదేశానికి టిక్కెట్లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు మొత్తానికే చేతులు ఎత్తేసి, ఉద్యోగి వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు. కాగా, ఈ పరిస్థితిపై స్పందించిన సౌదీ ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి ఆపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. Indian Consulate n Indian Community Jeddah food stuff distribution mission accomplished at 245 AM today morning. Kudos to all. @123nrs — India in Jeddah (@CGIJeddah) 31 July 2016 Excellent efforts by CCWA members of Taif. Distributed food stuff 2 Indians in Taif after advice by CGI Jeddah pic.twitter.com/HiK1bPtndC — India in Jeddah (@CGIJeddah) 31 July 2016 -
భారిగా పెరిగిన నాగార్జునసాగర్ నీటీమట్టం