Suryapet District Latest News
-
క్రమబద్ధీకరణకు నిరీక్షణ!
మఠంపల్లి: జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 70 మంది కంప్యూటర్ ఆపరేటర్లు తమ సర్వీస్ క్రమబద్ధీకరణకు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా.. పాలకులు చేస్తామని చెబుతున్నారే తప్ప ఫలితం ఉండడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. పదేళ్ల నుంచి విధులు.. జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో 2015 సంవత్సరం నుంచి ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున 70 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా ప్రారంభంలో రూ.6వేల వేతనంతో విధుల్లో చేరారు. కాగా వీరి వేతనాన్ని మధ్యలో మూడు పర్యాయాలుగా మొదటిసారి రూ.8వేలుగా, తర్వాత రూ.12వేలుగా, రూ.17,500గా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నేరుగా రూ.22,500లకు పెంచింది. దీంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆపరేటర్లు ఎంతో సంతోషించారు. అయినప్పటికీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను రూ.22,500 నుంచి రూ.19,500కు తగ్గించింది. ఉద్యోగుల వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం పట్ల కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్లు సేకరించి.. ఇదిలా ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను మూడు మాసాల క్రితం గ్రీన్చానల్ అనే పద్ధతి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లు సేకరించింది. కానీ జిల్లా వాప్తంగా ఆపరేటర్లకు టీఎస్బీపాస్ ద్వారా ఒకనెల వేతనం ఇచ్చారు. ఇంకా కొన్ని మండలాల్లో ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు అందాల్సి ఉంది. ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 10గంటలకు వచ్చి సాయంత్రం 5గంటలకు ఇంటికి వెళతారు. కానీ ప్రభుత్వం తమతో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఓటర్ల జాబితా తదితర సర్వేలు ఆన్లైన్ చేయిస్తూ ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పనులు చేయించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రకాల పనులు చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమకు కనీస వేతనం అందించాలని కంప్యూటర్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫ ఎంపీడీఓ ఆఫీసుల్లో పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఫ మధ్యలో వేతనం పెంచి తగ్గించడంపై ఆవేదన ఫ పెండింగ్ వేతనాలు కూడా అందించని ప్రభుత్వం ఫ జిల్లాలో 70 మంది సిబ్బంది -
క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
సూర్యాపేట టౌన్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైనందున యువత బెట్టింగ్లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ కూడా క్రికెట్ బెట్టింగ్లు పెట్టవద్దని పేర్కొన్నారు. బెట్టింగ్లు పెట్టి నష్టోయి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని పేర్కొన్నారు. బెట్టింగ్ ముఠాల నుంచి బెదిరింపులు వస్తాయని, జీవితం విచ్ఛిన్నం అవుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యాయని, విద్యార్థులు సెలవుల దృష్ట్యా ఖాళీగా ఉంటారని, ఒక్కపూట బడులతో మిగతా చిన్నారులు కూడా ఇళ్ల వద్ద ఉంటారని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అవసరానికి మించి విద్యార్థులకు డబ్బులు సమకూర్చవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్కు మరమ్మతులు అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం శివారు కుడితిగుట్ట వద్ద గండి పడిన ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్ కాలువకు ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్కు గండి శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నీటిపారుదల శాఖ ఏఈ హరిస్వరూప్ వెంటనే గండిపడిన చోటకు వెళ్లి పరిశీలించారు. మట్టిపోయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. దీంతో నీళ్లు వృథాగా పోవడం ఆగాయి. ఇందుకు కృషిచేసిన ‘సాక్షి’కి, అధికారులకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మట్టపల్లిలో నిత్యారాధనలు మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు, నిత్యారాధనలు కొనసాగాయి. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, తలంబ్రాలతో అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. నారసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు మేల్కొలుపులో భాగంగా స్వయంభూవులకు సుప్రభాత సేవ చేపట్టారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్లకు ఆరాధన, నిజాభిషేకం, అర్చన సేవలు గావించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహాహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వేద ఆశీర్వచనం, తదితర కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఉగాది పర్వదినాన సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ సీఈ రమేష్బాబు, ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యరగాని నాగన్న, లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, కోతి సంపత్రెడ్డి, శివరాంయాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ఉగాదికి సన్న బియ్యం
ఫ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న పథకం ఫ రేషన్కార్డుదారులందరికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఫ ఇప్పటికే మూడు నెలలకు సరిపడా సీఎంఆర్ సేకరణ ఫ సందిగ్ధంలో కొత్త రేషన్కార్డుదారులుప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రేషన్కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇందిస్తాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మిల్లర్ల నుంచి 14వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్గా తీసుకున్నాం. మండల స్థాయి స్టాక్ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్దుకాణాలకు సరఫరా చేసి ఏప్రిల్ నుంచి అందిస్తాం. – ప్రసాద్, సివిల్ సప్లయ్ డీఎం, సూర్యాపేట భానుపురి (సూర్యాపేట): రేషన్కార్డుదారులకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా పర్యటలో మాట్లాడుతూ వచ్చేనెల నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పడంతో పేదల్లో ఆనందం నెలకొంది. సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది పర్వదినాన హుజూర్నగర్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పారరంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెట్కు.. జిల్లాలో 3,24,158 రేషన్కార్డులు ఉండగా 610 రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నెలనెలా రేషన్ అందిస్తోంది. ఇప్పటి వరకు నెలకు సుమారుగా 5వేల మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తుండగా.. ఈ బియ్యం తినలేక చాలామంది కిలో రూ.10 చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అవే బియ్యం తిరిగి దళారుల ద్వారా మిల్లర్లు తమ కోటా సీఎంఆర్కు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అందించే దొడ్డురకం బియ్యం బ్లాక్ మార్కెట్కే చేరుతుండడంతో లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఇచ్చిన హామీ మేరకు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ వానాకాలంలో సన్నరకం వడ్ల సాగును పెంచేందుకు బోనస్ చెల్లించింది. ఈ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నరకం వడ్లను రెండుమాసాలుగా మర ఆడించి మిల్లర్ల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 14వేల మెట్రిక్ టన్నుల సన్నరకం బియ్యం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రేషన్దారులకు నెలకు 5వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ప్రస్తుత నిల్వలు 3నెలలకు సరిపడా ఉన్నాయి. అయితే జిల్లాలో నూతన రేషన్ కార్డులకు మాత్రం ఈ సన్నబియ్యం అందుతాయా లేదా అన్నది సందిగ్ధత నెలకొంది. అలాగే ఇప్పటికే రేషన్కార్డులు ఉండి పిల్లల పేర్లను చేర్పించిన దాదాపు 52వేల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. పిల్లల పేర్ల కోసం వచ్చిన దరఖాస్తులకై నా ఈ నెల చివరి నాటికి మోక్షం కల్పించి సన్నబియ్యం అందిస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే. రేషన్ దుకాణాలు 610రేషన్కార్డులు 3,24,158ప్రతినెలా ఇచ్చే బియ్యం 5 వేలమెట్రిక్ టన్నులు ప్రస్తుతం బియ్యం నిల్వలు 14వేల మెట్రిక్ టన్నులు -
అవగాహనతోనే ‘క్షయ’ అంతం
బాధితులకు ప్రత్యేక చికిత్స జిల్లాలో క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకిన వారికి ఆరు నెలల పాటు ఉచితంగా ప్రత్యేక చికిత్స అందిస్తూ.. మందులు పంపిణీ చేస్తున్నాం. క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో పెద్దలకు కూడా బీసీజీ టీకాలు వేస్తాం. – డాక్టర్ నజియా, క్షయ నిర్మూలన అధికారి ఫ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మేలు ఫ మూడు వారాలకు మించి దగ్గు ఉంటే టెస్ట్ తప్పనిసరి ఫ వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు చికిత్స ఫ గ్రామాల్లో ముగిసిన ప్రత్యేక శిబిరాలు ఫ నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం తిరుమలగిరి (తుంగతుర్తి): అవగాహనతోనే క్షయ వ్యాధిని అంతం చేయవచ్చని ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తోంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధి బాధితులను గుర్తిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడక పోవడంతో ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు మందులు అందజేస్తూ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ప్రతిఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వంద రోజుల ప్రోగ్రామ్ పూర్తి జిల్లాలోని 23 మండలాల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు వంద రోజుల ప్రోగ్రామ్ను డిసెంబర్ 7 నుంచి ఈనెల 18వ తేదీ వరకు అమలు చేశారు. ఇందులో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్షయ లక్షణాలు ఉన్నవారిని గుర్తించా రు. అనంతరం వారిని జిల్లా ఆసుపత్రిలో సిబినాట్ యంత్రంతో తెమడ పరీక్షలు, ఎక్స్రే ఆధారంగా వ్యాధిగ్రస్తులుగా నిర్ధారిస్తున్నారు. పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ జరిగితే బాధితులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు చికిత్స అందిస్తారు. 1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు జిల్లాలో ఇప్పటి వరకు 1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8వేల మందికి ఎక్స్ రే తీసి 475 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా పౌష్టికాహారం కూడా పంపిణీ చేస్తున్నారు. బీసీజీ టీకాలు పెద్దలకు కూడా వేయడానికి ఇప్పటికే అర్హులను గుర్తించి ఆన్లైన్ చేశారు. క్షయ లక్షణాలు, నివారణ చర్యలు మూడు వారాలకు మించి దగ్గు ఉండడం, దగ్గినప్పుడు రక్తం లేదా తెమడ (కఫం) పడడం, చాతీలో నొప్పి రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, అధిక ఉష్ణోగ్రతతో జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఆయాసంగా ఉండి అనారోగ్యంగా అనిపించడం వంటివి క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. వ్యాధివ్యాప్తి చెందకుండా చేతులను తరచూ శుభ్రంగా కడగాలి. దగ్గినప్పుడు మోచేయి లేదా రుమాలును నోటికి అడ్డంగా పెట్టాలి. వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలి. -
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
భానుపురి: రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరేలా కృషిచేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ కోరారు. ఆదివారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తరఫున ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.ఏకాంబరం బెల్లి నర్సయ్య, జక్కుల వెంకటేశ్వర్లు జి.వెంకన్న ఎ.శ్రీవర్ధన్రాజు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
హుజూర్నగర్, పాలకవీడు: ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన కందూరు కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం స్థానిక డక్కన్ సిమెంట్ పరిశ్రమ అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వెంకట్రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ, డిండి, నెల్లికల్లు, నాగార్జునసాగర్ ఎడుమ కాల్వ, ఏఎంఆర్కు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. గంధమల్ల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ప్రజాపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. రోడ్ల అభివృద్ధిలో నంబర్ వన్గా ఉంచుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిరోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్గా ఉంచుతామని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రైల్వే బ్రిడ్జ్లు, రూ.140 కోట్లతో దామరచర్ల వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర మంత్రి అనుమతి ఇచ్చారన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం పదేళ్లు పెండింగ్లో ఉంచిందని, మేము అధికారంలోకి రాగానే పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దక్షిణ తెలంగాణలో 36 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ 32 గెలిచిందని..ప్రజలు మావైపు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయని వారు పన్నెండు నెలలకే కొంపలు మునిగినట్లు మామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని రోడ్లు బీటీగా మారుస్తామని, ఏప్రిల్ రెండవ వారంలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. జాతీయ రహదారులను సైతం విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భూక్యాగోపాల్, మాళోతు మోతీలాల్, సుబ్బారావు పాల్గొన్నారు. ఫ ప్రజా పాలనతో విప్లవాత్మక మార్పులు ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ జాన్పహాడ్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష -
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ధర్మదర్శనానికి సుమారు రెండు గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారికి నిత్యాదాయం రూ.49,28,666 సమకూరిందని ఆలయ ఈఓ భాస్కర్రావు తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతిమద్దిరాల: విద్యుదాఘాతానికి గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం చిన్ననెమిలా గ్రామానికి చెందిన యాట సైదులు(51) తన వ్యవసాయ పొలం వద్ద శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ కల్వల శ్రీనివాస్ తెలిపారు. మృతుడి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఎన్నికల్లో ఇచ్చినహామీలను అమలు చేయాలి
రామన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో సీపీఎం మండలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎన్నికల వాగ్దానాలను ఎలా అమలు చేస్తాయాని ప్రశ్నించారు. డ్రైపోర్ట్ పేరుతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో భాగంగా రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంను పునరుద్ధరించాలని, రామన్నపేట ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తిచేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్లుగా కాలువల పనులు కాంట్రాక్టర్లకు వరప్రదాయినిగా మారాయని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పార్టీ పోరాడుతుందని తెలిపారు. పాదయాత్రకు పార్టీలకతీతంగా సంఘీభావం తెలపాలని కోరారు. పాదయాత్రలో భాగంగా సీపీఎం నాయకులు ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, బూర్గు కృష్ణారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, పాదయాత్ర బృందం సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, గన్నెబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, గొరిగె సోములు, బొడిగె రజిత, మేడి గణేష్, కొమ్ము అంజమ్మ, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
ఆత్మకూర్(ఎస్): కాంగ్రెస్ ప్రభుత్వం చేయని రుణమాఫీ చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేటలో మాజీ సర్పంచ్ పొన్నాల సంజీవరెడ్డి విగ్రహాన్ని ఆయనఆవిష్కరించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రశ్నిస్తుంటే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. బ్యాంకులు చెప్పిన దానికి, కేబినెట్, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పేసరికి 30 శాతం రుణమాఫీ కూడా కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారని, మంత్రులు సంక్షేమం మరిచి జేబులు నింపుకుంటున్నారని, అసమర్ధ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో కుట్రలు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, డీలిమిటేషన్ విషయంలో బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనీయమని, తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, నాయకులు గోపగాని వెంకటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ముద్దం కృష్ణారెడ్డి, బత్తుల ప్రసాద్, పన్నాల అలివేల, కసగాని బ్రహ్మం, జీడి భఇక్షం, ముద్దం మధుసూదన్రెడ్డి, గోపగాని మల్లయ్య తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
రూ.230.84 కోట్లకు చేరుకున్న డిపాజిట్లు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు రూ.230.84 కోట్లకు చేరుకొందని బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత టై అండ్ డై భవనంలో బ్యాంక్ 50వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ను ఆమోదించారు. అలాగే బ్యాంకు ఆర్థిక పరిస్థితి, వాయిదా మీరిన బాకీలపై నివేదిక చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు రైతులు, వ్యాపారులు, ప్రజలకు రూ.164.08 కోట్ల మేర రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం 10 బ్రాంచ్ల ద్వారా బ్యాంక్ సేవలందిస్తున్నామని, త్వరలో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కల్వకుర్తిలో నూతన బ్రాంచ్లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మరో 8 బ్రాంచ్లకు ఆర్బీఐ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ సీత శ్రీనివాస్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి వెంకటబాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూరెపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ, సీత హరినాథ్, సీత సత్యనారాయణ, రంగయ్య, కుడికాల బాల్నర్సింహ, సిద్దిరాములు, కొండ శంకరయ్య, భోగ విష్ణు, బండి యాదగిరి, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, మేనేజర్ రచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ -
ఫాంపాండ్లో మునిగి ఇద్దరు యువకులు మృతి
చిట్యాల: ఫాంపాండ్లో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ పనిచేసే నలపరాజు రాములు కుమారుడు నవీన్కుమార్(23), రసూల్పూర్ గ్రామానికి చెందిన హోంగార్డు చింతపల్లి లింగరాజు కుమారుడు రాఘవేంద్ర(20), నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామానికి చెందిన కడెం తరుణ్ స్నేహితులు. వీరు ముగ్గురు నల్లగొండలోని మార్కోని ఐటీఐ కాలేజీలో చదువుకున్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత ఏడాది క్రితం వీరు ముగ్గురు కలిసి చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఎలక్ట్రికల్ విభాగంలో అప్రెంటిస్గా చేరారు. అప్రెంటిస్ పూర్తిచేసి అదే పరిశ్రమలోని ఎలక్ట్రికల్ ప్యానెల్ మోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు పరిశ్రమలో విధులు నిర్వహించిన వీరు రాత్రి పరిశ్రమలో ఉండిపోయారు. ఫాంపాండ్లోకి దిగి.. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా పరిశ్రమలోనే ఉన్న నవీన్కుమార్, రాఘవేంద్ర, తరుణ్ మధ్యాహ్నం 12గంటల సమయంలో పరిశ్రమ ఆవరణలోని ఓ చివరలో నిర్వహిస్తున్న గోశాల సమీపంలో నీటి అవసరాల కోసం తీసిన ఫాంపాండ్ వద్దకు చేరుకున్నారు. మొదట నవీన్కుమార్ ఫాంపాండ్లోకి ఒకస్కారిగా దూకాడు. వెంటనే ఈత రాకపోయినప్పటికీ రాఘవేంద్ర ఫాంపాండ్లోకి దూకి నవీన్కుమార్ను పట్టుకున్నాడు. ఇద్దరు నీటిలో మునిగిపోతుండటంతో ఒడ్డున ఉన్న తరుణ్ తన షర్ట్తో వారిద్దరిని బయటికి లాగే ప్రయత్నం చేయగా.. ఇతడు కూడా ఫాంపాండ్లోకి జారి పడిపోబోయాడు. తరుణ్ తేరుకుని ఫాంపాండ్ చివరలో దొరికిన ప్లాస్టిక్ పట్టా అంచును పట్టుకుని బయటికి వచ్చి.. కొద్ది దూరంలో ఉన్న ఇతర కార్మికులకు విషయం తెలియజేశాడు. వారు వచ్చి నీటిలో మునిగిపోతున్న నవీన్కుమార్, రాఘవేంద్రను బయటికి తీయగా.. అప్పటికే వారిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబాలకు డీఈసీ పరిశ్రమ యజమాన్యం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బందువులు కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు చిట్యాల మండలం ఏపూరు గ్రామ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఘటన -
మల్చింగ్ పద్ధతిలో సాగు.. లాభాలు బాగు
తీసుకోవాల్సిన జాగ్రత్తలుమల్చింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. భౌగోళిక పరిస్థితులను, నేల స్వభావాన్ని బట్టి మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్తో పాటు సూక్ష్మనీటి పద్ధతులను అవలంబిస్తే నీటి వనరులు వృథాకాకుండా సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు. సాగు చేసే పంటలను బట్టి మల్చింగ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ విస్తీర్ణంలో మల్చింగ్ను చేయదలిస్తే అందుబాటులో ఉండే వనరులను మల్చింగ్ పదార్ధాలుగా ఉపయోగించడం మేలు. నడిగూడెం: ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి కారణంగా పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. బోర్లు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్ధవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ పద్ధతి తోడ్పడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల ఉద్యానవన పంటలకు సరిపడేంత నీటిని అందించడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. దీని నుంచి బయట పడేందుకు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించినట్లయితే అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకొని పంటలను సమర్ధవంతంగా సాగు చేసుకోవచ్చని సీనియర్ హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్కుమార్ చెబుతున్నారు. మల్చింగ్ అంటే ఏమిటి.. సారవంతమైన మట్టిని పట్టి ఉంచడంతో పాటు నేలలోని తేమను ఎక్కువ కాలం ఉంచేలా మొక్క చుట్టూ పలు రకాలైన పదార్ధాలను పరచి ఉంచడాన్నే మల్చింగ్ అంటారు. దీని వలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. మల్చింగ్కు ప్లాస్టిక్ పట్టాలతో పాటు కాగితపు ముక్కలు, సేంద్రియ పదార్ధాలు, వరి గడ్డి, వ్యవసాయ వ్యర్ధాలు తదితర వాటిని ఉపయోగిస్తారు. మల్చింగ్ విధానంతో లాభాలు పంట కాలంలో మల్చింగ్ చేయడం వలన నేలలోని తేమ ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు మొక్క మొదలు భాగంలో ఉంటుంది. తేమను పరిరక్షించడమే కాకుండా ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారవంతాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ మొక్కలు తీసుకొనేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్ధవంతంగా తట్టుకొనే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కన్పిస్తుంది. -
పిడుగుపాటుతో రెండు ఆవులు మృతి
దేవరకొండ: పిడుగు పడి రెండు ఆవులు మృతి చెందాయి. దేవరకొండ మండలం కాసారం గ్రామానికి చెందిన రైతు అబ్బనోని నాగయ్య తనకున్న రెండు పాడి ఆవులను శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు కట్టేసి ఉంచాడు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడి రెండు ఆవులు మృతిచెందాయి. ఆవుల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. నకిలీ కరెన్సీ నోట్ల చలామణినడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నకిలీ రూ.100 నోట్లు చలామణి అవుతున్నాయని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ నోట్లు నీటితో తడిస్తే మరకలు పడవని, కానీ తమ వద్దకు వచ్చిన కొన్ని రూ.100 నోట్లపై నీటితో తడిస్తే ఏర్పడిన మరకలు ఉన్నట్లు చిరు వ్యాపారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నకిలీ నోట్లు చలామణి కాకుండా చూడాలంటున్నారు. చెరువులో మునిగి యువకుడి మృతి తిరుమలగిరి: చెరువులో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి అనంతారంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అనంతారం గ్రామానికి చెందిన శీల శ్రీకాంత్(28) గేదెలను మేపడానికి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు దగ్గరకి వెళ్లాడు. గేదెలు చెరువులోకి వెళ్లడంతో వాటిని బయట తోలుకురావడానికి చెరువులోకి వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. వైజాగ్ కాలనీలో ఈతకు వెళ్లి.. చందంపేట: నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలోని పుష్కర ఘాటు వద్ద నీట మునిగి హైదరాబాద్లోని బోడుప్పల్కి చెందిన శ్రీరామోజు ఉదయ్కిరణ్(22) మృతిచెందాడు. శనివారం నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వచ్చిన ఉదయ్కిరణ్ ఆదివారం ఉదయం కాచరాజుపల్లి పుష్కర ఘాటు వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి తండ్రి రాజేష్ కన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నేరేడుగొమ్ము ఎస్ఐ సతీష్ తెలిపారు. రైతులను ఢీకొట్టిన లారీ● ఒకరికి తీవ్ర గాయాలు మిర్యాలగూడ అర్బన్: ధాధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. దామరచర్ల మండలం కేశవాపురం గ్రామానికి చెందిన రైతులు జానకిరాములు, బచ్చు శ్రీను ట్రాక్టర్లో ధాన్యం లోడుతో మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో గల రైస్ మిల్లు వద్ద నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై నిలిపారు. హోటల్లో భోజనం చేసిన అనంతరం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ వారిద్దరిని ఢీకొట్టింది. జానకిరాములుకు తీవ్ర గాయాలు కాగా, బచ్చు శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్లో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జానకిరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ప్రకటించాలి
సూర్యాపేటటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు. టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను మార్చి నెల చివరి నాటికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గాను మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా, ప్రధానోపాధ్యాయులు అదనంగా ఉండేలా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహించాలన్నారు. డిటెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్కుమార్, అరుణభారతి, జి. వెంకటయ్య, నాగేశ్వరరావు, బి. ఆడం, బి. రమేష్, డి. శ్రీనివాసాచారి, ఎన్. వెంకటేశ్వర్లు, ఆర్. శీనయ్య, అభినవ్, ఆర్. శ్రీను, పి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం
హుజూర్నగర్రూరల్: హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా లీలావతి చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి ఆమెకు సీ్త్రశక్తి జాతీయ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మీనగ గోపిబోయ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అశ్వవాహన సేవమేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని మైహోం సిమెంట్ పరిశ్రమలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి 27వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఐదో రోజు తిరువీధి ఉత్సవం, అశ్వవాహన సేవ, దోపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో త్రిదండి రామానుజ చినజీయర్ స్వావి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు,శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహన్రావు,అరుణ దంపతులు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యభువనగిరి: చేయని తప్పుకు నింద మోపారని మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన ఎలకొండ సంజీవరెడ్డి కుమారుడు నవీన్రెడ్డి(45) సంజీవరెడ్డి సోదురుడి బావి వద్ద పైపులైన్ పగులగొట్టాడని శనివారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తాను పైపులైన్ పగులగొట్టలేదని నవీన్రెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, తన బంధువులు తప్పుడు ఆరోపణ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫోన్తో మెసేజ్ పెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది
కోదాడ: ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోదాడకు చెందిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండీ జబ్బార్ నివాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు చెందిన మైనార్టీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. కోదాడలో ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయంచానని పేర్కొన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, పారా సీతయ్య, అల్తాఫ్ హుస్సేన్, మునావర్, కందుల కోటేశ్వరరావు, బాగ్దాద్, బాజాన్, కేఎల్ఎన్. ప్రసాద్, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీఓఏల ధర్నా
నల్లగొండ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.20 వేల వేతనం అమలు చేయాలని వీఓఏల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిలుముల దుర్గయ్య, సులోచన, పోలె సత్యనారాయణ, కె.చంద్రకళ పాల్గొన్నారు. -
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
సూర్యాపేట టౌన్: సోషల్ మీడియాపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెల్, ఐటీ సెల్, కమాండర్ కంట్రోల్ సెంటర్, సోషల్ మీడియా మానిటరింగ్ యూ నిట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, మానిటరింగ్ యూనిట్లను బలోపేతం చేశామన్నారు. సామాజిక మాధ్యమాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. చాలా మంది యువత, ప్రజలు అవగాహన లేకుండా సోషల్ మీడియాలో అనవసరంగా అసభ్యకర పోస్టులు, ఇతరులను కించపరిచేలా సమాచారం పంపిస్తున్నారని, ఇలాంటివి చట్టరీత్యా నేరమన్నారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పుడు పోస్టులు పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ప్రతిఒక్క రూ కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట ఏఆర్ఎస్పీ జనార్దన్రెడ్డి, ఆర్ఐ నర్సింహ, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
జూన్ నాటికి యూనిఫామ్ అందించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ నాటికి యూనిఫామ్ తయారీ పూర్తిచేసి అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, లత, డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలో 1,853 మందికి ప్రొసీడింగ్స్ ఎల్ఆర్ఎస్–2020 స్కీమ్ క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1,853 మందికి ప్రొసీడింగ్స్లు ఇచ్చామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో మొత్తం 58,990 దరఖాస్తులు అందగా 2,569 మంది రూ.12కోట్ల చెల్లించారని తెలిపారు. ఇందులో 1.853 మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్న్స్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ శ్రీనివాస్, డీపీఓ యాదయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మోదీ పాలనలో దేశం తిరోగమనం
భానుపురి (సూర్యాపేట): ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కక్షగట్టి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ కేంద్రమే పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫలమైందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్ సీట్ల సంఖ్యను కుదించే ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి -
టెన్త్ ప్రశ్నపత్రం లీక్పై గోప్యంగా విచారణ
నకిరేకల్, శాలిగౌరారం : పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకై ంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్పేపర్లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్కు చేరుకొని నకిరేకల్లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 45 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు బయటకు.. పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకై న పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్లో లీకై న పేపర్ సీరియల్ నెంబర్ను, మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాతా ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. -
తొలి రోజు 11,882 మంది హాజరు
సూర్యాపేట టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,904 మంది విద్యార్థులకు గాను 11,882 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు ఎనిమిది మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. విద్యార్థులకు ఈ ఏడాది అడిషనల్ పేపర్లకు బదులుగా 24పేజీల ఆన్సర్ బుక్లెట్ను ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. అలాగే నాలుగు స్క్వాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభం ఫ జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులు గైర్హాజరు ఫ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, ఎస్పీ -
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారులు
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. ఫ మే 12న నాగార్జునసాగర్కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రానున్న ప్రపంచ సుందరీమణులు ఫ ఇక్కడి ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికవిజయ విహార్లో విడిది ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న యాదగిరి క్షేత్రంలో క్రిస్టినా పిస్కోవా మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. ఆధ్యాత్మిక నగరికి.. -
లాంగెస్ట్ రోడ్ నెట్వర్క్లో రెండో స్థానంలో నల్లగొండ
రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ నుంచి నార్కట్పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది. -
దేశానికి కేసీఆరే దిక్సూచి
ఫ గుంటకండ్ల జగదీష్రెడ్డి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేసి దేశం మొత్తం చూసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మంత్రి రెండు నియోజకవర్గాలకే మంత్రి అని, ఆయన రావాలంటే హెలికాప్టర్ ఉండాలన్నారు. హెలికాప్టర్ లేనిది ఆ మంత్రి ఎక్కడకి పోరని విమర్శించారు. అంతకు ముందు జనగామ క్రాస్రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, చెరుకు సుధాకర్, గుజ్జా దీపిక, నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ డ్యాం సందర్శించిన సీఈ
సాగర్ డ్యాం ఎడమ వైపున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ సందర్శించారు. బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలం రాష్ట్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. - IIలోటీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఒక్క సంవత్సరంలోనే..2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది. విద్యుత్ కనెక్షన్లలో టాప్ పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు -
ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 32 కేంద్రాల్లో ప్రారంభమైన ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో పరిసమాప్తం అయ్యాయి.చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో మొత్తం 6,082 మంది విద్యార్థులకు గాను 5,893 మంది హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,184 మంది విద్యార్థులకు గాను 1,084 మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. పలు సెంటర్లలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ 11 మంది విద్యార్థులు బోర్డు స్క్వాడ్కు దొరకడంతో వారిని డీబార్ చేసినట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలి సూర్యాపేట : సూర్యాపేట మండలం కేసారం–2 వద్ద గల డబుల్ బెడ్రూం ఇళ్లను ఏప్రిల్ రెండో వారంలోగా గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కేసారం–2 వద్ద కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 480 ఇళ్ల పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్అండ్బీ డీఈ పవన్ కుమార్ పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా రేఖ అర్వపల్లి: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన డాక్టర్ బోయలపల్లి రేఖ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని గురువారం హైదరాబాద్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు నుంచి అందుకున్నారు. కాగా రేఖ ఇప్పటికే రేఖ చారిటబుల్ ఫౌండేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షురాలు అల్క లాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలు మరింత పెంపుఅర్వపల్లి: యాసంగి సీజన్కు చివరి విడతగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను మరింత పెంచారు. 1,429క్యూసెక్కులు వస్తుండగా వాటిని 1,650 క్యూసెక్కులకు పెంచారు. ఇందులో 69డీబీఎంకు 500, 70డీబీఎంకు 70, 71 డీబీఎంకు 1,080 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు
14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు ఫ బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతుండు ఫ సూర్యాపేటలో సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ వరంగల్ సభకు భారీగా తరలిరావాలని పిలుపుసూర్యాపేటటౌన్ : ‘కేసీఆర్.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని, స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవమని, ప్రసాద్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో తమ పాత్ర కూడా ఉందన్నారు. శాసనసభ మన అందరిదీ అన్న జగదీష్రెడ్డిని సస్పెండ్ చేశారని, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఒవైసీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు. -
మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం
భానుపురి (సూర్యాపేట) : వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా రైతాంగ సమస్యలు– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు హాజరయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన దాడులను, ఘర్షణలు హత్యల నుంచి పార్టీ క్యాడర్ ను కాపాడారన్నారు. అంతకకు ముందు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, శేఖర్, ఎల్గూరి గోవింద్, పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ -
నేడు బీఆర్ఎస్ జిల్లా సమావేశం
ఫ హాజరు కానున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట టౌన్: వరంగల్లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ బహిరంగ సభ విజయవంతానికై గురువారం సూర్యాపేటలో ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బహిరంగ సభ విజయవంతంతోపాటు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలంతా విధిగా హాజరు కావాలని కోరారు. గోదావరి జలాలు 1,429 క్యూసెక్కులకు పెంపుఅర్వపల్లి: యాసంగి సీజన్కుగాను చివరి విడతగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను బుధవారం 1,429 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీళ్లు 69డీబీఎంకు 500, 71డీబీఎంకు 850 క్యూసెక్కులు, మిగిలిన నీటిని 70డీబీఎంకు వదులుతున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నెలాఖరులోగా వంద రోజులు పని పూర్తి చేయించాలి ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఈనెలాఖరులోగా వంద రోజులు పని పూర్తి చేయించాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కూలీలకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. వడదెబ్బబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు నెమ్మికల్లో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ హసీం, ఏపీఓ ఈశ్వర్, ఈసీ మెంబర్ అరుణ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ అంజమ్మ ఉన్నారు. ఎన్జీ కాలేజీలో యూత్ పార్లమెంట్ ఎంపికరామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో వికసిత్ భారత్ చైర్మన్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నోడల్ యూత్ పార్లమెంట్ జిల్లాస్థాయి ఎంపికలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించడం వల్ల జరిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిచారు. నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వికసిత్ భారత్ తెలంగాణ కోఆర్డినేటర్ శివ, పర్యావరణ వేత్త సురేష్ గుప్త, దుశ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ విజయ్కుమార్, ఏచూరి శైలజ, నెహ్రూ యువకేంద్రం జిల్లా అధికారి బి.ప్రవీణ్ సింగ్, ఎన్జీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, సుధాకర్, ఎం.వెంకట్రెడ్డి, బి.అనిల్ కుమార్, ఎన్.కోటయ్య, ఏ.మల్లేశం, కె.శివరాణి, ఎం.సావిత్రి, శిరీష, అంకుశ్, వాసు, దినేష్, కొండానాయక్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : మహాత్మాజ్యోతిరావుపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లోని ఖాళీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ప్రవేశపరీక్షకు ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ గురుకులాల ఆర్సీఓ ఇ.స్వప్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు అర్హత గల విద్యార్థులుwww.mjptbcwreis.telangana.go v.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. -
టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
ఫ పరీక్ష కిట్ల పంపిణీ ఫ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేత ఫ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఫ జిల్లాలో 6,968 మందికి ప్రయోజనంసూర్యాపేటటౌన్, అనంతగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సాహించడంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక చొరవ చూపారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వారికి బాసటగా నిలిచేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక నిధులతో పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లో పరీక్ష ప్యాడ్తో పాటు జామెట్రిక్ బాక్స్, ఐదు బ్లూ పెన్నులు, ఒక బ్లాక్ పెన్ను, ఒక రెడ్ పెన్ను, ఒక పెన్సిల్, ఒక స్కేల్ ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,968 మంది పదో తరగతి విద్యార్థులు జిల్లాలో మొత్తం 11,912 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా అందులో ప్రభుత్వ యాజమాన్య విద్యార్థులు 6,968 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 180 పాఠశాలల్లో 3,997 మంది , 18కేజీబీవీల్లో 597 మంది , తొమ్మిది మోడల్ స్కూళ్లలో 672 మంది, 25 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,702 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్ష కిట్లకు ఒక్కో విద్యార్థికి రూ.147 చొప్పున ఖర్చు చేయగా మొత్తం సుమారు రూ.10,24,296 కేటాయించారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సంసిద్ధం చేశారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అల్పాహారం సైతం ఇస్తుండటంతో విద్యార్థులు శ్రద్ధతో ప్రత్యేక తరగతుల్లో పాల్గొని పరీక్షలకు సిద్ధమయ్యారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ ఈ ఏడాది ప్రత్యేక చొరవ తీసుకొని పదో తరగతి విద్యార్థులకు తన ప్రత్యేక నిధులతో పరీక్ష కిట్ పంపిణీ చేశారు. ఈ కిట్ విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – అశోక్, డీఈఓ కలెక్టర్ నిర్ణయం గొప్పది జిల్లాలో మొదటిసారి పపదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ పరీక్ష సామగ్రిని కానుకగా అందించారు. పేద విద్యార్థులకు మేలు కలగనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కలెక్టర్సార్ తీసుకున్న నిర్ణయం గొప్పది.గతంలో దాతలు ఇస్తేనే తప్ప విద్యార్థులు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది. – సలీం షరీఫ్, ఎంఈఓ మాకు కిట్లు ఇవ్వడం సంతోషంగా ఉంది జిల్లా కలెక్టర్ సార్ మాకు పరీక్ష కిట్లు ఇస్తున్నారని వినగానే సంతోష పడ్డాను. పరీక్షలు రాసేందుకు మనోఽఽఽ ధైర్యం కలిగింది. మాఽథ్స్ , సైన్స్ పరీక్షల్లో ఈ వస్తులు ఎక్కువగా ఉపయోగ పడతాయి. – మీసాల వశీకర్, పదో తరగతి, జెడ్పీహెచ్ఎస్, అమీనాబాద్ పరీక్షలంటే భయం పోయింది మాది పేదకుటుంబం. పరీక్షలు అనగానే సాధారణంగా కొంత భయం ఉంటుంది. జిల్లా కలెక్టర్ సార్మాకు పరీక్ష సామగ్రి అందించడం ఆనందంగా ఉంది. పరీక్షలపై ఉన్న భయం పోయి మంచిగా రాయాలనే భావనలోకి వెళ్లిపోయాం. – వడ్డే రాజేశ్వరి, పదవ తరగతి, అమీనాబాద్ -
యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు
సాక్షి, యాదాద్రి : తిరుమల తిరుపతి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి(వైటీడీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్ట ఆలయానికి పాలక మండలిని 18 మందితో ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టిన బిల్లులో వెల్లడించారు. పాలకమండలి పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవు. టీఏ, డీఏ ఇస్తారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు చేసిన ప్రకటన మేరకు యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయిలో పాలకమండలి ఏర్పాటుకు చట్ట సవరణ కోసం బిల్లును శాసనసభలో పెట్టారు. చైర్మన్ తోపాటు, వివిధ అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన ట్రస్టీలను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం ఆలయ చైర్మన్తో పాటు 18 మంది సభ్యులు ఉంటారు. ఫౌండర్ ట్రస్టీతోపాటు ఒక ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులతోపాటు మరో నలుగురు సభ్యులను నియమిస్తారు. పాలక మండలిలో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. టీటీడీ బోర్డు మాదిరిగా వైటీడీ బోర్డుకు ఐఏఎస్ అధికారి ఈఓగా ఉంటారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం చేస్తుంది. టీటీడీబోర్డు తరహాలో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించవచ్చు. టెంపుల్ సిటీకి స్వయం ప్రతిపత్తి యాదగిరిగుట్ట ఆలయానికి 1,241 ఎకరాల భూమి ఉంది. బిల్లు తరువాత ఈ ప్రాంతం అంతా కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన టెంపుల్ సిటీగా మారుతుంది. ఇందులో దేవాలయ ప్రాంతం ప్రత్యేక టౌన్ షిప్గా మారనుంది. నూతనంగా ఏర్పాటయ్యే టెంపుల్ సిటీలో భిక్షాటన నిషేధం. మద్యం అమ్మకాలు, జంతువధ కూడా నిషేధిస్తారు. లైసెన్స్లు లేని వ్యాపారాలు చేయవద్దు. -
మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
భానుపురి: మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది మోడల్ స్కూళ్లలో సదుపాయాలు, ఉపాధ్యాయులకు ఉన్న అర్హతలు, చదువులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు మోడల్ స్కూళ్లలో చేరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూర్ (ఎస్)లో పనులు సరిగా జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఉండ్రుగొండలో కలెక్టర్ పూజలు చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఉండ్రుగొండలో మంగళవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్, బందకవి కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2024–25 రబీ సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. 2024–25 రబీ యాక్షన్ ప్లాన్ పై మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ లక్ష్యం చేరుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా అరికట్టాలని ఆదేశించారు. తూనికలు కొలతల శాఖ అధికారులు వేయింగ్ మిషన్స్, వేయింగ్ స్కేల్స్ అన్నీ తనిఖీ చేసి స్టాంపింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి డి. రాజేశ్వర్, మేనేజర్ ప్రసాద్, డీఆర్డీఓ అప్పారావు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మ, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
బడ్జెట్లో మనకు ఎంత?
నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి ఏ మేరకు నిధులు వస్తాయో బుధవారం తేలనుంది. నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టబోయే బడ్జెట్పై జిల్లా ప్రజలు ఆశతో ఉన్నారు. 3.11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఆశలు నెలకొన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తీసుకునేందుకు ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1800 కోట్లతో దానికి సంబంధించిన పనులను చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు డిండి కింద నిర్మిస్తున్న ఏడు రిజర్వాయర్లకు, కాలువలకు నిధుల అవసరం ఉంది. గత బడ్జెట్లో వాటికి రూ.300 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో వాటికి అధిక కేటాయింపులు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. ఏఎంఆర్పీ లైనింగ్కు.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఏఎమ్మార్పీ) పరిధిలోని కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సాగునీటిపారుదల శాఖ కూడా దాదాపు రూ. 400 కోట్లతో ప్రధాన కాలువ లైనింగ్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతినడంతోపాటు కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ లేకుండాపోయింది. కాలువలు కంపచెట్లతో నిండిపోయి చివరి ఆయకట్టు నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే బ్రాహ్మణవెల్లెంల కాలువల పూర్తికి, నాగార్జునసాగర్ పెండింగ్ పనులకు, పాత ఎత్తిపోతల పథకాలకు నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం, మూసీ కాల్వలకు.. యాదాద్రి జిల్లాల్లో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులన ఇస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్లో ఈ మేరకు వస్తాయనేది తేలనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గందమళ్ల రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులపై ఆశలు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ రెండోదశ చివరి ఆయకట్టు భూములకు నీరందించేందుకు కాల్వల అధునీకరణకు చర్యలు చేపడుతుందా? లేదా? తేలనుంది. వీటితోపాటు ఆస్పత్రుల అప్గ్రెడేషన్, జూనియర్, డిగ్రీ కాలేజీల మంజూరు వంటి అంశాలపై జిల్లా ప్రజలు డిమాండ్లు ఉన్నాయి. యూనివర్సిటీకి నిధులు వచ్చేనా? మహత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి ఈసారైనా అధిక మొత్తంలో ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందా? లేదా చూడాలి. గత ఏడాది కేవలం నిర్వహణ పద్దు కింద రూ.34.08 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈసారి రూ.309 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్ కేటాయిస్తుందో బుధవారం తేలనుంది.ఫ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కేనా.. ఫ డిండి, ఏఎమ్మార్పీ, మూసీ కాలువలకు నిధులు వచ్చేనా.. ఫ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశాభావం ఫ టన్నెల్ పనులపై స్పష్టత వచ్చే అవకాశం టన్నెల్ పనులపై.. జిల్లాలో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్ఎల్బీసీ సొరంగమార్గం ప్రాజెక్టు పనులపై ఈ బడ్జెట్లో కొంత స్పష్టత రానుంది. ఇటీవల టన్నెల్ ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తుందా? లేదా అన్నది తేలనుంది. గత బడ్జెట్లో మాత్రం ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రూ.798 కోట్లు కేటాయించింది. గ్రీన్ చానల్ ద్వారా నిధులను ఇచ్చి పూర్తి చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి, రీడిజైన్ వంటి అంశాలపై స్పష్టత వస్తుందని సాగునీటి శాఖ అధికారులు భావిస్తున్నారు. -
ఉపాధి పనుల జోరు..!
జిల్లాలో 53.19లక్షల పనిదినాలు పూర్తి 759 కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు జిల్లాలో జాబ్కార్డులు కలిగిన వారికి పనులు కల్పించడంలో లక్ష్యానికి చేరువై రాష్ట్రంలోనే 6వ స్థానంలో జిల్లా నిలిచింది. అయితే ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలను కల్పించడంలో ప్రస్తుతం కాస్త వెనుకబడ్డారు. గతేడాదిలో దాదాపు 1,600 కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 759 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలు పూర్తయ్యాయి. మరో 4వేల కుటుంబాలకు 90 నుంచి 99 పనిదినాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 12 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ కుటుంబాలకు కూడా 100 రోజుల పనిదినాలను కల్పిస్తే ఏకంగా 3వేల మంది దాకా 100రోజుల పనిదినాలు కల్పించినట్లవుతుంది. భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వలసలు నివారించి ఉన్న ఊరిలో పనులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏటా వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ 2004–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 57.40 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. మరో 12 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో 93 శాతం పూర్తయింది. ఇప్పటికే 53.19 లక్షల పనిదినాలను కల్పించగా.. మరో 4వేల పనిదినాలను మాత్రమే ఉపాధి హామీ కూలీలకు చూపించాల్సి ఉంది. గతేడాదితో పోల్చితే ఉపాధి పనిదినాల లక్ష్యం పెరిగినా అడిగిన వారందరికీ పని కల్పించి టార్గెట్కు చేరువయ్యారు. పొలాలకు బాటలు వేసే పనులు.. గత ఆర్థిక సంవత్సరం జిల్లాకు 55.01లక్షల పనిదినాలను లక్ష్యం పెట్టుకోగా ఏకంగా 58.18లక్షల పనిదినాలు కల్పించారు. ఈ క్రమంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యాన్ని జిల్లాకు భారీగా పెంచి 57.40 లక్షల పనిదినాలుగా నిర్దేశించారు. జిల్లాలో ఉన్న 475 పాత గ్రామ పంచాయతీల్లో గ్రామపంచాయతీకి 500 మంది చొప్పున రోజూ 21వేల మందికి ఎలాంటి వ్యవసాయ పనులు లేని ప్రస్తుత సమయంలో ఉపాధి హామీ కల్పించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానంగా రైతుల వ్యవసాయ బావులు, పొలాల వద్దకు బాటలు వేసేందుకు ఈ పనులను వినియోగించాలని ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న పనుల్లో చాలావరకు రైతుల పొలాలకు బాటలు వేయడానికి ఈ పనులను కేటాయించారు. ఇప్పటి వరకు 53.19లక్షల పనిదినాలకు గాను రూ.115.28 కోట్ల బిల్లులు చేశారు.ఫ రోజూ 21వేల కుటుంబాలు ఉపాధి పనిలో.. ఫ మరో 4వేల పనిదినాలతో నెరవేరనున్న లక్ష్యం అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నాం జిల్లాలో ఉపాధి హామీ జాబ్కార్డులు కలిగి ఉన్న వారిలో అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నాం. గత ఏడాది కంటే పనిదినాల లక్ష్యాన్ని పెంచినా.. తప్పకుండా లక్ష్యానికి మించి పనులను కల్పిస్తాం. గతంలో కంటే ఎక్కువ కుటుంబాలకు ఈ యేడు 100 పనిదినాలు కల్పిస్తాం. –అప్పారావు, డీఆర్డీఓ -
రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతా
అయ్యా.. నీళ్లులేక పంటలు ఎండిపాయ్కలెక్టర్ను కలిసిన నూతన ఏజీపీభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో నూతన ఏజీపీ (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ )గా నియమితులైన ఎండి షఫి ఉల్లా మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టులో సివిల్ వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వానికి కక్షిదారులకు మధ్యవర్తిగా ఉంటూ భూసమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సూర్యాపేట బార్ అసోసియేషన్ కార్యదర్శి డప్పుకు మల్లయ్య, సీనియర్ న్యాయవాది సీనేపల్లి సోమేశ్వర్, జూనియర్ న్యాయవాది పల్లా పరమేష్ ఉన్నారు. సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలిసూర్యాపేటటౌన్ : ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించే జిల్లా ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. చివరి విడత గోదావరి జలాల పునరుద్ధరణఅర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు గోదావరి జలాలను చివరి విడతగా మంగళవారం పునరుద్ధరించారు. ఈ విడతలో వారబందీ విధానం ద్వారా సోమవారమే గోదావరి జలాలను పునరుద్ధరించాల్సి ఉంది. కానీ ఒకరోజు ఆలస్యంగా నీటిని విడుదల చేశారు. తొలిరోజు 750 క్యూసెక్కులను జిల్లాకు వదిలారు. ఈ నీటి సామర్థ్యాన్ని అంచెలంచెలుగా రెండు రోజుల్లో పెంచనున్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ నీళ్లు ఈ నెల 24 వరకు జిల్లాకు రానున్నాయి. పంటలు మరో 20రోజుల్లో చేతికందనున్నాయని అప్పటి వరకు గోదావరి జలాలను కొనసాగించాలని అన్నదాతలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. డీఎల్ఎస్ఏ సభ్యులుగా మధు, వెంకటేశ్వర్రావుచివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావులను నియమిస్తూ తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండు సంవత్సరాల పాటు వీరు సేవలు అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.చరిత్రలో నిలిచిపోయే రోజుభానుపురి (సూర్యాపేట) : అసెంబ్లీలో విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే రోజుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లులను ఆమోదించడం పట్ల ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అది ఆమోదం పొందే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడంసంతోషకరమని పేర్కొన్నారు. కోదాడ: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా ఉండడంతో పాటు శాసన మండలిలో రిటైర్డ్ ఉద్యోగుల గొంతుకనవుతానని తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పబ్లిక్క్లబ్ ఆవరణలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ఆరు పదుల వయస్సులో కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెన్షనర్లు క్రీడా పోటీల్లో తలపడడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించే వరకు పోరాడుతానన్నారు. పీఆర్సీ, డీఏల పెండింగ్ బిల్లుల విషయం కూడా తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, చంద్రశేఖర్, ఉమా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రెడ్డి, బొల్లు రాంబాబు, జితేందర్రెడ్డి, తీగల నరేష్, వీరబాబు, అక్కిరాజు వెంకట్రావ్, భ్రమరాంబ, రఘు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మూడురోజులుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో షటిల్లో ప్రథమస్థానంలో కామారెడ్డి జిల్లా, ద్వితీయ స్థానంలో నిజామాబాద్ జిల్లా, టెన్నికాయిట్లో సూర్యాపేట జిల్లా ప్రథమస్థానం, యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయస్థానంలో నిలిచాయి. క్యారమ్స్లో కామారెడ్డి ప్రథమ, ఖమ్మం జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. చెస్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ, కరీంనగర్ జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. మహిళా వాకింగ్ పోటీల్లో ప్రథమస్థానంలో జనగామ, ద్వితీయస్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది. మ్యూజికల్ చైర్ విభాగంలో కూడా ప్రథమస్థానంలో జనగామ, ద్వితీయస్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది.ఫ శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి ఫ 18 మంది సభ్యుల నియామకం ఫ పాలక మండలికి రెండేళ్ల పదవీ కాలం ఫ శాశ్వత సభ్యునిగా ఫౌండర్ ట్రస్టీ న్యూస్రీల్ఫ పింగిలి శ్రీపాల్రెడ్డి ఫ ముగిసిన రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు -
రైతాంగానికి అండగా ఉంటా
భానుపురి (సూర్యాపేట): ఈ ప్రాంత రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సూర్యాపేటలోని రవి మహల్లో సూర్యాపేట ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డైరెక్టర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దామోదర్రెడ్డి మంత్రి ఉన్నప్పుడు ఆర్యవైశ్యుల వ్యాపారాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. తమపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆర్యవైశ్య, వాసవీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజలు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి వారి సమస్యలు చెప్పడానికి ప్రజావాణికి వస్తున్నారని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి కచ్చితమైన సమాధానం తెలుపుతూ పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్లోని మహాత్మాజ్యోతి రావుపూలే భవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జిల్లాకు చెందిన 36 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే జిల్లాస్థాయిలో ఉన్న 630 అర్జీలను సత్వరమే పరిష్కంచాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబుసకాలంలో హాజరు నమోదు చేసుకోవాలి కలెక్టరేట్ సిబ్బంది పేస్ రికగ్నైజేషన్ (బయోమెట్రిక్) ద్వారా తప్పనిసరిగా ప్రతిరోజూ ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం 5గంటల తర్వాత ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు మున్సిపల్, గ్రామ పంచాయతీలకు ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలన్నారు. మార్చి 21 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్స్ను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీటీడీఓ శంకర్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి, కోదాడ మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. సోమవారం సూర్యాపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఉపయోగించే పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. స్పీకర్ను జగదీష్రెడ్డి అవమానించి మాట్లాడినట్లు ఏ వీడియోల్లో లేదన్నారు. పదే పదే దళిత స్పీకర్ అంటూ కాంగ్రెసోళ్లే అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరిపొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు చేయవద్దనడం దారుణమన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగసభ విజయవంతంపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, బండారు రాజా, బూరబాల సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ -
నీటి తిప్పలు తీర్చేలా..
యుద్ధప్రతిపాదికన పాతబోర్లు, చేతి పంపుల మరమ్మతులుభానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఎండలు ముదరడంతో నెలకొన్న మంచినీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ఒక్క ప్రాంతంలో నీటి సమస్య లేకుండా ఉండేందుకు గాను జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ప్రధానంగా జిల్లాలో మంచినీటి వనరులైన మిషన్ భగీరథ పైపులైన్లు, చేతి పంపులు, బోర్లతో పాటు, చిన్న పైపులైన్ల మరమ్మతులను అధికారులు యుద్ధప్రతిపాదికన చేయిస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలం ఒక్కసారి మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. తదనంతరం వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితికి వచ్చాయి. మార్చి ప్రారంభంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయాయి. మిషన్ భగీరథ నీళ్లు చాలా ప్రాంతాలకు రావడం లేదు. ఈ నేపథ్యంలో యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ఇప్పటికే అధికారులు గుర్తించారు. జిల్లాలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటీవలే నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ నీటి ఎద్దడి నివారణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సైతం ఇచ్చారు. పాతవాటిని బాగుచేయిస్తూ..ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంటుంది..? అక్కడ ఏ విధంగా సమస్యను అధిగమించవచ్చో అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ పథకం అమలైన తర్వాత జిల్లాలోని కొన్ని పట్టణాలు, గ్రామాల్లో బోరుబావులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న పాత బోరుబావులు, చేతిపంపులను సైతం పనిచేసేలా మరమ్మతులు చేస్తున్నారు. ఆవాసాల వారీగా నీటి సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తూ.. పైపులైన్లు పగిలిపోయిన చోట మరమ్మతులు చేపడుతున్నారు.జిల్లావ్యాప్తంగా ఇలా..జిల్లా వ్యాప్తంగా 475 పంచాయతీల్లో బోరుబావులు, పైపులైన్లు, మోటార్లు, చేతిపంపులను గుర్తించి మరమ్మతులు ప్రారంభించారు. గుర్తించిన పనులన్నింటికీ దాదాపు రూ.4.35 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో చేతిపంపులు 658, సింగిల్ పేస్ మోటార్లు 82, 147 త్రీఫేస్ మోటార్లకు, 16 ఓపెన్ బావులు, 200 ప్రదేశాల్లో పైపులైన్లకు మరమ్మతులు అవసరమని గుర్తించారు. గుర్తించిన మరమ్మతుల్లో ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగం గుర్తించిన సమస్యలు 108.. పరిష్కరించినవి 54 -
పది పరీక్షలకు 67 కేంద్రాలు
సూర్యాపేట టౌన్: ‘ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. జిల్లావ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు వివరాలు ఆయన మాటాల్లోనే.. అన్ని సౌకర్యాలు కల్పించాం..జిల్లాలో మొత్తం 11,912 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలను గుర్తించి వాటిల్లో 67 సెంటర్లను ఏర్పాటు చేశాం. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్ఎస్ ద్రావణం, వడదెబ్బ, ఇతర అనారోగ్య కారణాలకు చికిత్సనందించేందుకు సెంటర్కు ఇద్దరు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. కేంద్రాల్లోనూ గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా గదులను కేటాయించాం. కేంద్రాల్లో విద్యుత్, మరుగుదొడ్లు, మంచినీటి వసతి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలుపరీక్షలను పకద్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బందిని నియమించాం. మొత్తం 67 సెంటర్లకు 67 చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో పాటు 702 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. అలాగే పరీక్షలో విద్యార్థులు ఎలాంటి మాస్ కాఫీయింగ్కు పాల్పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 67 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరు ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీజిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లో ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు..ఈ నెల 21వ తేదీ నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. మొత్తం ఏడు పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే రెండు పేపర్లు ఉంటాయి. అలాగే ఈ ఏడాది అడిషనల్ షీట్స్ కాకుండా 24పేజీలతో కూడిన బుక్లెట్ను ఇవ్వనున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రత్యేక పోలీస్ సిబ్బందితో ప్రశ్నపత్రాల చేరవేత, సమాధాన పత్రాల భద్రత చర్యలు చేపట్టనున్నాం. విద్యార్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను చూసుకొని సమయానికి గంట ముందే చేరుకుంటే మంచిది.21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ అన్ని సౌకర్యాలున్న స్కూళ్లలోనే సెంటర్లు పరీక్ష రాయనున్న 11,912 మంది విద్యార్థులు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్సందేహాలు ఉంటే టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయొచ్చు విద్యార్థులు పరీక్షలకు సంబంధించి, ఇతర సమస్యలు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 8247809660కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు అనుమతి లేదు. -
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేట టౌన్: వివిధ సమస్యలపై పోలీస్ గ్రీవెన్స్ వచ్చే బాధితులకు భరోసా కల్పించి, న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కె.నర్సింహ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్ డేను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ నర్సింహ -
ఆర్టీసీ సూర్యాపేట డిపో మేనేజర్ బదిలీ
● కొత్త మేనేజర్గా లక్ష్మీనారాయణ భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ ముషీరాబాద్ డిపో–2కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలోకి భూపాలపల్లి డిపో మేనేజర్గా పనిచేస్తున్న జి.లక్ష్మీనారాయణ బదిలీపై వచ్చారు. ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డిపో పరిధిలో బస్సులు నడుపుపామన్నారు. పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలిసూర్యాపేట: తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు యథావిధిగా కొనసాగించాలని ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ కోరారు. సోమవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్రావు, బచ్చు పురుషోత్తం, నాయకులు బజ్జూరి శ్రీనివాస్, శీలా శంకర్, ఓరుగంటి సంతోష్, బిక్కుమల్ల సంతోష్, యామా సంతోష్, పాలవరపు నరసింహారావు, బెలిదె నాగేందర్, ఇమ్మడి సందీప్ పాల్గొన్నారు. గోదావరి జలాలు ఏవీ?అర్వపల్లి : యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో చివరి విడతగా సోమవారం నుంచి గోదావరి జలాలు విడుదల చేసామని నీటి పారుదల శాఖ అధికారులు ప్రటించినా పునరుద్ధరించలేదు. రాత్రి వరకు కూడా నీటి విడుదల జరగలేదు. దీంతో రోజంతా గోదావరి జలాల కోసం అన్నదాతలు ఎదురు చూశారు. మంగళవారం కూడా నీళ్లు వచ్చే అవకాశం లేదని సమాచారం. నీటి పారుదలశాఖ అధికారులు ప్రకటించినా నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వరిపంటలు నీళ్లు చాలక ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. హామీలు అమలు చేయాలి భానుపురి (సూర్యాపేట): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ వన్ టౌన్, టూటౌన్, త్రీటౌన్ కమిటీల ఆధ్వర్యంలో ఇటీవల పట్టణంలో నిర్వహించిన సర్వేలో తాము గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహార దీక్షను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. దీక్షకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య మాదిగ, జిల్లా నాయకులు ఎర్ర వీరస్వామిమాదిగ సంఘీభావం ప్రకటించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈ దీక్షలో పార్టీ జిల్లా నాయకులు కోట గోపి, మట్టిపల్లి సైదులు, ఎల్గూరి గోవింద్, శేఖర్, మద్దెల జ్యోతి, రవి, వన్టౌన్ కార్యదర్శి సాయికుమార్, టూటౌన్ కార్యదర్శి నాగమణి, త్రీటౌన్ కార్యదర్శి యాదగిరి, రూరల్ మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, సైదమ్మ, మందడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్ అర్చకులు పాల్గొన్నారు. -
భయాన్ని తొలగిస్తూ.. ఉత్సాహం నింపుతూ..
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో భయం తొలగించి పైతరగతులు చదవాలనే ఆసక్తి పెంచుతూ వారిలో నూతనోత్సాహాన్ని నింపేలా రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్త బడి వాతావరణానికి అలవాటు పడడానికి ‘ట్వీనింగ్ ఆఫ్ స్కూల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఉన్నత, ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలను సందర్శించి పరిశీలించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలల్లో అమలు చేస్తోంది. పరిశీలన, అవగాహన..ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అక్కడి తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ విద్యాబోధన, లైబ్రరీ, విద్యా శాఖ కార్యక్రమాల అమలు, క్రీడలు, క్రమశిక్షణ తదితరాలపై అవగాహన కల్పించనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలను పరిశీలించనున్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు చేరే పాఠశాలలను సందర్శించడంతో అక్కడి స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. బోధన విని.. భోజనం చేసి..ప్రారంభం నుంచి ఒకే బడిలో చదివి మరో పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. వారిలో భయం పోగొట్టి ఉన్నత పాఠశాలల్లో వసతులు, బోధనపై ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లి ఒకరోజు మొత్తం అక్కడే ఉంచుతున్నారు. ఉపాధ్యాయులు బోధిస్తుండగా విద్యార్థులు ప్రత్యక్షంగా వింటున్నారు. అక్కడే మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తున్నారు. గతేడాది నుంచి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొనసాగిస్తున్నారు.అవగాహన పెరుగుతుంది పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించడం వల్ల ఆయా పాఠశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు, వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. ఉపాధ్యాయులపై నమ్మకం కలగడంతో అడ్మిషన్లు పెరగనున్నాయి. తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. – మురళి, హెచ్ఎం, తొండ ప్రాథమిక పాఠశాల హైస్కూళ్ల సందర్శనకు పీఎస్, యూపీఎస్ విద్యార్థులకు అవకాశం చదువబోయే బడుల స్థితిగతులపై అవగాహన కల్పించేందుకు.. ‘ట్వీనింగ్ ఆఫ్ స్కూల్స్’ పేరుతో విద్యాశాఖ కొత్త కార్యక్రమం74 పాఠశాలల గుర్తింపుఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలలను గుర్తించారు. ఇందులో ప్రాథమిక స్థాయి తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.50 చొప్పున రవాణా చార్జీలు విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థులు సందర్శించనున్న పాఠశాలల్లో చిత్రాలు, బ్యానర్ డాక్యుమెంటేషన్ కోసం రూ.500 చొప్పున సమగ్ర శిక్ష అభియాన్ నుంచి నిధులు సమకూరాయి. -
ఘనంగా శ్రీజయరాం స్వామి జాతర
చివ్వెంల : మండల పరిధిలోని జయరాంగుడి తండాలో శ్రీ జయరాం స్వామి జాతరను ఆదివారం గిరిజనులు ఘనంగా నిర్వహించారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర గల ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వందలాది మంది గిరిజన భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర రెండు రోజులపాటు జరగనుంది. జాతర సందర్భంగా వెలిసిన దుకాణాల వద్ద మొదటి రోజుల భక్తుల రద్దీ భారీగా ఉంది. వేడుకల్లో మాజీ ఎంపీపీ ధరావతు కుమారి బాబు నాయక్, గ్రామ మాజీ సర్పంచ్లు హాలవత్ సుశీల, కె.శారదదేవి, ధరావత్ పద్మమంగ్త్యా నాయక్, మాజీ ఎంపీటీసీ బానోతు లచ్చిరాం నాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగులోతు చీనానాయక్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తప్పని తాగునీటి కష్టాలు.. దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలలో జాతరకు వచ్చిన భక్తులకు తాగునీటి కష్టాలు తప్పలేదు. ప్రతి సంవత్సరం జాతరకు వేలాది రూపాయల ఆదాయం వస్తున్నా నిర్వాహకులు కనీస వసతుల కల్పనలో అలసత్వం వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పొలాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల్గొన్న వేలాది మంది భక్తులు -
ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాం
తుంగతుర్తి: ఎస్సీ రిజర్వేషన్ శాతం పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో నిర్వహించనున్న జనాభా లెక్కల ప్రకారం కచ్చితంగా పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్స్ పార్టీ కృతజ్ఞత సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మొదటి బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, రెండో బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్, మూడో బిల్లు ఎస్సీల్లోని 15శాతం రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉపకులాలకు పంచేలా ఉపకోటా నిర్ణయిస్తామన్నారు. ఈనెల 17న ఎస్సీ ఉప వర్గీకరణ బిల్లుపై, 18న బీసీ రిజర్వేషన్, కుల సర్వే అంశంపై ప్రభుత్వం చర్చలు జరపనుందన్నారు. నా నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, న్యాయమూర్తి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషనన్ను నియమించడం ఇందుకు నిదర్శనమని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోందని తెలిపారు. 1931 తర్వాత తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి కుల ఆధారితంగా సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించిందని వివరించారు. తుంగతుర్తి అభివృద్ధికి కృషి తుంగతుర్తి తన స్వస్థలమని, ఈ ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తుంగతుర్తికి ఎస్సారెస్పీ ఫేజ్–2, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామనానరు. అంతేకాకుండా తుంగతుర్తికి గోదావరి, మూసీ నదుల నీటిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభలో మంత్రలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొర్రె పిల్లలు, గొంగళ్లు, డప్పులను బహూకరించి సన్మానించారు. ఈ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేషం, లక్ష్మీకాంత్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్రావు టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, కడియం పరమేశ్వర్, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్, గిరిధర్రెడ్డి, చింతకుంట్ల వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఫ రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ తుంగతుర్తిలో కాంగ్రెస్ కృతజ్ఞత బహిరంగ సభ ఫ హాజరైన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల తదితరులు -
నేడు పోలీస్ గ్రీవెన్స్ డే
సూర్యాపేట టౌన్: సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్టు ఎస్పీ నర్సింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివరి విడతగా నేటి నుంచి గోదావరి జలాలుఅర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాలోని ఎస్సారెస్పీ రెండోదశ పరిధిలోని ఆయకట్టుకు వారబందీ విధానంలో చివరి విడతగా సోమవారం గోదావరి జలాలను పునరుద్ధరించనున్నారు. ఈ నీళ్లు ఈనెల 24 వరకు రానున్నాయి. అయితే ఈ యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ పద్ధతిలో జనవరి 1 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు తడులలో నీటిని ఇచ్చారు. ఆరవ తడికి గాను సోమవారం విడుదల చేయనున్నారు. ఇది ఆఖరి విడత అని నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజామున ఉషా పద్మిని ఛాయసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆతర్వాత యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు, సౌర ఆరాధకులు జనార్దన్స్వామి, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, ఇంద్రారెడ్డి, కాకులారపు రజిత, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్పాండే, భక్తులు పాల్గొన్నారు. నేడు, రేపు జాతీయ సెమినార్ మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ, మంగళవారాల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీగ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాస్పెక్ట్ అండ్ చాలెంజెస్శ్రీ అనే అంశంపై తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషనల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, ప్రొఫెసర్లు జి.యాదగిరి, ఎం.రాములు, ముత్యంరెడ్డి, ఇంద్రకాంత్, పున్నయ్య, కొప్పుల అంజిరెడ్డి, వాసుదేవశర్మ ప్రసంగించనున్నారు. చివరి రోజున ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ బి.సుధాకర్రెడ్డి సందేశంతో సెమినార్ ముగియనుంది. -
భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
భానుపురి (సూర్యాపేట): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర కోశాధికారి ధరావత్ రవి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన భగత్సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సభలను ఈనెల 23 నుంచి గ్రామగ్రామాన నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, ఉపాధ్యక్షుడు వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి, సభ్యులు గిరి, అశోక్, గణేష్ పాల్గొన్నారు. -
వినయ్భానురెడ్డి యాదిలో..
బొమ్మలరామారం : మండల కేంద్రానికి చెందిన దివంగత లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్భానురెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న వినయ్ భానురెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ భానురెడ్డి సతీమణి స్పందనారెడ్డి, తల్లిదండ్రులు ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మి, దంతపల్లి వంశీరెడ్డి పాల్గొన్నారు. ఒంటిపూట బడుల వేళల్లో మార్పు సూర్యాపేట టౌన్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.05 గంటలకు రెండో గంటతో పాటు ప్రార్థన చేసి 8.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని మొదట ఆదేశాలు ఇచ్చింది. ఈ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ఉదయం 7.45కు మొదటి గంట, 7.50కి రెండో గంటతో పాటు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సవరించిన వేళలను అమలు చేయాలని డీఈఓ అశోక్ ఆదేశించారు. -
కొత్త సార్లు వచ్చేశారు!
సూర్యాపేట టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త అధ్యాపకులు వచ్చేశారు. ఇన్నాళ్లూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో ఏటా గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీశారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన పోటీ పరీక్షలో జూనియర్ లెక్చరర్లు ఎంపికై న వారికి ప్రభుత్వ ఇటీవల నియామక పత్రాలు అందజేసింది. దీంట్లో భాగంగా జిల్లాకు కొత్తగా 14 మంది జూనియర్ లెక్చరర్లను కేటాయించింది. వీరిలో 11 మంది శనివారం విధుల్లో చేరినట్టు డీఐఈఓ కార్యాలయ వర్గాలు తెలిపారు. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత కొత్తగా లెక్చరర్లు రావడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బోధనా పరంగా మరింత బలోపేతం కానున్నాయి. ఇన్నాళ్లూ పదోన్నతులు మాత్రమే.. గత 2014, 2016, 2019, 2021 సంవత్సరాల్లో పదోన్నతులు మాత్రమే కల్పించగా ఇంటర్ బోర్డు మూడేళ్ల క్రితమే జూనియర్ కళాశాలల్లో ఖాళీలను గుర్తించి 2022 డిసెంబర్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2023లో పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది జూన్ లో ఫలితాలు వెల్లడించినా పలు కారణాలతో వీటి నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ప్రస్తుతం ఇంటర్ విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో కొత్త వారికి శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించనున్నారు. ఖాళీలను బట్టి ఐదు కళాశాలలకు.. జిల్లాలోని ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను బట్టి కొత్తవారిని కేటాయించారు. నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐదుగురు అధ్యాపకులను కేటాయించారు. ఇందులో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ , మ్యాథ్స్ సబ్జెక్టులకు ఒక్కొకరు చొప్పున అధ్యాపకులు విధుల్లో చేరారు. అలాగే నేరేడుచర్లలో ఒక మ్యాథ్స్ లెక్చరర్, కోదాడ కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఒకరి చొప్పున ముగ్గురిని కేటాయించారు. హుజూర్నగర్ జూనియర్ కళాశాలలో తెలుగు, సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులకు ఒకరు చొప్పున అధ్యాపకులు విధుల్లో చేరారు. వీరితో పాటు మరో ముగ్గురు అధ్యాపకులు వచ్చే వారంలో విధుల్లో చేరనున్నారు. అధ్యాపకుల కొరత తీరనుంది జిల్లాలోని ఏడు జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం 14 మంది లెక్చరర్లను కేటాయించింది. ఆయా కళాశాలల్లో ఇప్పటి వరకు 11 మంది అధ్యాపకులు విధుల్లో చేరారు. మరో ముగ్గురు అధ్యాపకులు వచ్చే వారంలో జాయిన్ కానున్నారు. వీరి రాకతో కొంత మేర అధ్యాపకుల కొరత తీరి విద్యార్థులకు మెరుగైన బోధన అందనుంది. – భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట ఫ జిల్లాకు 14 మంది జూనియర్ లెక్చరర్లు ఫ నెమ్మికల్ కళాశాలకు ఐదుగురు కేటాయింపు ఫ మిగతా వారు ఇతర కళాశాలలకు.. ఫ ఇప్పటికే విధుల్లో చేరిన 11 మంది తొలగనున్న ఇబ్బందులు జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో ప్రస్తుతం 80మంది వరకు రెగ్యులర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరు సరిపోకపోవడంతో గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నారు. దీంతో బోధనాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా ఏడు జూనియర్ కళాశాలలకు గాను ఐదింటికి కొత్తగా రెగ్యులర్ అధ్యాపకులను కేటాయించారు. దీంతో ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత తీరవడంతోపాటు ఇబ్బందులు తొలగనున్నాయి. -
క్షయ వ్యాధి నియంత్రణే లక్ష్యం
నేరేడుచర్ల: క్షయ వ్యాధిని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం అన్నారు. శనివారరం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రధాన మంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్, విక్షయ మిత్ర ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతి గంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకే పౌష్టికాహారం కిట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వైద్యాధికారులు, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నజియా మాట్లాడుతూ క్షయ బాధితులకు పౌష్టికాహారం కిట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయ న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోరి, పీహెచ్సీ వైద్యాధికారులు పున్నా నాగిని, బ్రౌజ్, విక్షయ మిత్ర వ్యవస్థాపపక అధ్యక్షుడు వెంకట శ్రీధర్, వలంటీర్లు అనంద్కుమార్, మట్ట శ్రీనివాస్, సీహెచ్ఓ శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్వర్లు, ధనమ్మ, నర్సయ్య, హరిసాగర్, ఆశాలు సునిత, తులసి, జానకమ్మ పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ కోటాచలం -
కృత్రిమ మేధతో బోధన ప్రారంభం
హుజూర్నగర్: ప్రాథమిక పాఠశాల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన ‘సీ’ గ్రేడ్ విద్యార్థుల్లో మెరుగైన విద్యాసామర్థ్యాల సాధనకు తీసుకొచ్చిన కృత్రిమ మేధ (ఏఐ)తో విద్యాబోధన శనివారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 13 పాఠశాలలను ఎంపిక చేయగా ఆయా పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు చెందిన 616 మంది విద్యార్థులకు గాను 130 మంది ‘సీ’ గ్రేడ్ విద్యార్థులకు పాఠాలు మొదలు పెట్టారు. వారికి 70 కంప్యూటర్ల ద్వారా తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో పాఠాలు బోధించారు. కాగా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్లో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈఓ అశోక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిద మండలాల్లో ఎంఈఓలు, ఎంఎన్ఓలు, ఆయాపాఠశాలల హెఎంలు ప్రారంభించారు. ఫ ఎంపిక చేసిన పాఠశాలల్లో తొలి రోజు పాఠాలు ఫ పర్యవేక్షించిన అదనపు కలెక్టర్, డీఈఓ -
దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం
తుంగతుర్తి: భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరగనున్న కాంగ్రెస్పార్టీ కృతజ్ఞత సభ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేపట్టినందుకు కృతజ్ఞతా పూర్వకంగా సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఆదివారం జరిగే సభలో మంత్రులను కోరతానన్నారు. స్పీకర్ను అవమానించేలా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫోన్ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు కేసీఆర్, జగదీశ్రెడ్డిల దిష్టిబొమ్మలను ఆదివారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దహనం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఎంపీలు కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డిలు, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరవుతారని తెలిపారు. అనంతరం డీఎస్పీ రవితో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చెర్మన్ తీగల గిరిధర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఆయా మండల పార్టీల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, ఎల్సోజు నరేష్, అభిషేక్రెడ్డి అవిలమల్లు, తోడుసు లింగయ్య, నాయకులు రాంబాబు, నాగరాజు తదితరులుపాల్గొన్నారు. ఫ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు -
జాతీయ మార్కెట్ విధానాన్ని రద్దుచేయాలి
హుజూర్నగర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా రైతులకు వ్యతిరేకమైనదని, దీన్ని వెంటనే రద్దుచేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా నాలుగో మహాసభలు శనివారం హుజూర్నగర్లో కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, మోరకొండ లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుగా మూరగొండ లక్ష్మయ్య, కొప్పోజు సూర్యనారాయణ, అధ్యక్షుడిగా దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొల్లు ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కంబాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా పాపిరెడ్డిలతో మరో 27 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ధనుంజయ్ నాయుడు, కౌలు రైతుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొల్లు ప్రసాద్, పాపిరెడ్డి మహిళా సమాఖ్య నాయకులు మల్లీశ్వరి, ఉమా తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ పదవికి డిమాండ్!
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై నేతల నజర్పార్టీ అధికారంలోకి రావడంతో పోటీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో డీసీసీ పదవులకు పోటీ ఏర్పడింది. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పదవీ కాలం ముగియగానే పటేల్ రమేష్రెడ్డిని అధ్యక్షుడిని చేయాలని అనుకున్నారు. అయితే దామోదర్రెడ్డి వర్గానికి, రమేష్రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వెంకన్ననే కొనసాగిస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరడంతో అప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అండెం సంజీవరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నల్లగొండ జిల్లాలో మాత్రం శంకర్నాయక్ జిల్లా అధ్యక్షుడిగా బొంతు వెంకటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే కొత్త డీసీసీ అధ్యక్ష నియామకాలు ఇప్పుడున్న సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటాయా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఫ శంకర్నాయక్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మరొకరికి ఛాన్స్ ఫ రేసులో పలువురు సీనియర్ నేతలు ఫ కార్పొరేషన్ పదవి ఇవ్వలేనివారికి డీసీసీతో సరిపెట్టే వ్యూహంలో పీసీసీ ఫ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ సమీకరణలపై దృష్టి సాక్షి, ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులపై పీసీసీ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత డీసీసీ అధ్యక్షుల మార్పులతోపాటు, పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ పదవులను ఇవ్వలేని వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఇచ్చి సరిపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రెండు మూడేళ్లకోసారి డీసీసీ కార్యవర్గం మార్పు చేయాల్సి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాలు కుదరక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మధ్యలో సూర్యాపేట జిల్లాలో మార్పులు చేయాలని భావించినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. వెంకన్నకు రైతు కమిషన్ సభ్యుడిగా ఇవ్వడం, తాజాగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆశావహుల దృష్టి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది. -
సీఎంఆర్ అప్పగింతపై అలసత్వం
భానుపురి (సూర్యాపేట): కస్టమ్ మిల్లింగ్ రైస్ను ప్రభుత్వానికి అప్పగించడంపై మిల్లర్లు మొండికేస్తున్నారు. గడువు దాటినా తమకు కేటాయించిన లక్ష్యాన్ని తిరిగి ఇవ్వడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ప్రతి సీజన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం ఇవ్వకుండా సొంత వ్యాపారం చేయడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. 2023–24 యాసంగికి సంబంధించి ఇంకా 35 శాతానికి పైగా బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్ల వైఖరి కారణంగా జిల్లాలో నాలుగైదు నెలలుగా బియ్యం నిల్వలు లేక.. రేషన్ పంపిణీ కూడా ఆలస్యమవుతోంది. లక్ష్యం 1,62,140 మెట్రిక్ టన్నులు 2023–24 యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి 49 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మూడునెలల లోగా మర ఆడించి తిరిగి పౌరసరఫరాల శాఖకు అందించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,62,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ధాన్యాన్ని కేటాయించి ఏడాది కావొస్తున్న లక్ష్యంలో ఇంకా 35 శాతం మేర బకాయి ఉంది. ఇప్పటి వరకు 1,04,143 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తిరిగి ఇచ్చేయగా.. మరో 57,997 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడ్డారు. ఫ గడువు పొడిగిస్తున్నా.. బియ్యం అందించని మిల్లర్లు ఫ గత యాసంగి సీజన్ బకాయి 57వేల మెట్రిక్ టన్నులకు పైగానే.. ఫ రేపటితో ముగియనున్న గడువు 2023–24 యాసంగి సీఎంఆర్ లక్ష్యం 1,62,140 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఇచ్చింది 1,04,143 మెట్రిక్ టన్నులు పెండింగ్లో ఉన్నది 57,997 మెట్రిక్ టన్నులు గడువు పొడిగిస్తున్నా.. జిల్లాలో సీఎంఆర్ విషయంలో ప్రతి సీజన్లో మిల్లర్లు మాయాజలం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని సమయానికి మర ఆడించి బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం ఇచ్చిన మూడునెలలకే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2023–24 యాసంగి సీజన్కు ఇప్పటివరకు ప్రభుత్వం మూడుసార్లు గడువును పొడిగించింది. అయినా జిల్లాలోని 11 మిల్లులు మాత్రమే పూర్తిస్థాయిలో బియ్యాన్ని ఇచ్చేశాయి. మిగతా వాటిలో 38 మిల్లులు 90 శాతానికి పైగా ఇవ్వగా.. మరో 11 నుంచి 12 మిల్లుల నుంచి పెద్ద ఎత్తున సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. సీఎంఆర్ సేకరణలో అధికారులు నిత్యం తనిఖీలు, సమీక్షలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. కాగా ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉండడంతో గడువులోగా సీఎంఆర్ అప్పగింతపై అనుమానాలు ఉన్నాయి. -
వీక్లీ పరేడ్తో సంపూర్ణ ఆరోగ్యం
సూర్యాపేట టౌన్: వీక్లీ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ కె.నర్సింహ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. సమయం దొరికినప్పుడల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యాయామం చేయడం చాలా ముఖ్యమన్నారు. పోలీసులు తమ ఫిట్నెస్ను నిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నర్సింహాచారి, ఆర్ఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ ఎస్పీ కె.నర్సింహ -
రేపటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల
భానుపురి (సూర్యాపేట): జిల్లాలోని శ్రీరాంసాగర్ రెండోదశ ఆయకట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరవ తడి కింద ఎనిమిది రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ సీఈ శివధర్మతేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో ఇప్పటికే ఐదు తడులకు నీరిచ్చామని పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి వచ్చే నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలిచివ్వెంల: వరిలో తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులు వ్యవసాయ అధికా రులు, సలహాలు సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్రెడ్డి అన్నారు. శనివారం చివ్వెంల మండలం గాయంవారిగూడెం గ్రామంలో వరిపొలాలను పరిశీలించి మాట్లాడారు. వరిలో అగ్గితెగులు, సుడిదోమ, కంపునల్లి, ఇతర తెగుళ్లను గుర్తించామన్నారు. వాటి నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల నుంచి రాత్రి ఉష్తోగ్రతలు తగ్గి చలి పెరగడం వల్ల అగ్గితెగులు ఎక్కువ అయిందన్నారు. వెంటనే నివారణకు యూరియా వేయటం ఆపేయాలని, అదేవిధంగా గట్ల మీద ఉన్న కలుపు మొత్తాన్ని తీసివేయాలన్నారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ డి.వెంకటేశ్వర్లు, ఏఈఓ బి.శైలజ, రైతులు బానోతు సోమాని, హేమ, వెంకన్న, జమ్లా తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలుభానుపురి (సూర్యాపేట): కోదాడ పట్టణంలో ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య సారథ్యంలో జరిగే ఈ పోటీలను ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాలువకు బీఎన్ పేరు పెట్టాలి నాగారం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే భీంరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) పేరును ఎస్సారెస్సీ రెండోవ దశ ప్రధాన కాలువకు పెట్టాలని ఆయన అభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి 103వ జయంతి సందర్భంగా శనివారం నాగారం మండలం ప్రగతినగర్లోని బీఎన్ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య, పోరెళ్ల లక్ష్మయ్య, కందుకూరి సోమయ్య, బెట్టెం రాజు, భిక్షం పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించా రు.అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో బసచేసి తెల్లవారుజాముననే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు చివ్వెంల: కృతిమ మేధ (ఏఐ) బోధనతో విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో కృతిమ మేధ (ఏఐ) బోధన ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం ఏఐ బోధన పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ఏ, బీ’ గ్రేడ్లకు మార్చేలా బోధించాలన్నారు. నాలుగవ తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంఈఓ రమణ, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గోలి శ్రీనివాస్, పీఎస్ హెచ్ఎం దయామణి, ఉపాధ్యాయులు పూర్ణ చంద్రశేఖర్, సీహెచ్.వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు. -
తూకాల్లో గోల్మాల్!
సూర్యాపేట: నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇప్పటికే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సందట్లో సడేమియాలాగా ఏదీ కొనుగోలు చేసినా వినియోగదారులను కొందరు వ్యాపారులు తూకాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. తూనికలు, కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, రేషన్్ షాపు దగ్గర నుంచి పండ్లు, మాంసం, కూరగాయలు, వస్త్రాలు, చివరకు బంగారం వస్తువులు కూడా కొలతల ప్రకారం అమ్మాల్సిందే. అయితే వీటి అమ్మకాల్లో నమ్మకం కొరవడుతోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు వచ్చినా మోసాలు చేసే వ్యాపారుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో మోసాలపై జిల్లా కేంద్రంలో పలు దుకాణాలను ‘సాక్షి’ విజిట్ చేసి వాస్తవాలను పరిశీలించింది. పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు ● జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో తూకంలో తేడాలు కనబడలేదు. కాలం చెల్లిన సరుకులు కూడా కనబడలేదు. ● కూరగాయలు, చేపల మార్కెట్లలో మాత్రం ఆమోదిత తూనిక రాళ్లకు బదులు సాధారణ రాళ్లను వినియోగిస్తున్నారు. ● జిల్లా కేంద్రంలో పలు దుకాణాల్లో ప్యాకింగ్ వస్తువులు కాకుండా లూజ్గా వస్తువులను విక్రయిస్తున్నారు. ముద్రలు లేవు.. నామమాత్రంగా కేసులు జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 1.10 లక్షల వరకు ఉన్నాయి. రెండేళ్లకోసారి కాంటాలు, తూకం రాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాంటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే కనిపించడం లేదు. జిల్లాలో తూనికలు, కొలతల పరికరాలు అమ్మడానికి కేటగిరీ–1 కింద సూర్యాపేటలో మూడు దుకాణాలకు అనుమతి ఉండగా, కేటగిరీ–2 సూర్యాపేటలో ఒక దుకాణం, కోదాడలో ఒక దుకాణం అనుమతులు పొందాయి. ఇక తూనికలు పరికరాలకు స్టాంపింగ్ వేసేందుకు సూర్యాపేటలో నలుగురు, కోదాడలో ఇద్దరు అనుమతి పొంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి కేవలం 96 కేసులే నమోదయ్యాయి. అసలు ఈ శాఖలో సిబ్బంది ఎవరూ లేకపోవడం, జిల్లా అధికారి పోస్టు కూడా గతంలో మూడు నెలల పాటు ఖాళీగా ఉండడం గమనార్హం. ఫ కొలతల్లోనూ అదేతీరు ఫ దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో నిత్యం మోసమే.. ఫ నిలువు దోపిడీకి గురవుతున్న వినియోగదారులు ఫ ‘సాక్షి’ విజిట్లో వాస్తవాలు బట్టబయలు నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సూర్యాపేట పట్టణంలోని కూరగాయల దుకాణంలో ఓ వ్యక్తి అరకిలో వంకాయలు కొనుగోలు చేశాడు. అయితే అవి వెయింగ్ మెషిన్లో కాకుండా చేతి కాంటాలో తూకం రాయి కాకుండా మాములు రాయితో జోకాడు. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి మరో దుకాణంలో వెయింగ్ మిషన్పై జోకడంతో 400 గ్రాములే వచ్చింది. దీంతో ఆ వ్యక్తి సదరు కూరగాయాల వ్యాపారి వద్దకువెళ్లి గొడవ చేయగా తొందరలో జోకాను అని చెప్పి మళ్లీ కొలత రాయితో జోకి అరకిలో నిండుగా ఇచ్చాడు. ఇలాంటి మోసాలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నా.. మోసం జరిగినట్లు గుర్తించినా వినియోగదారులు మా శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వినియోగదారులకు మోసాలు జరిగితే సహించేది లేదు. – చిట్టిబాబు, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి, సూర్యాపేట -
నేత్రపర్వం.. ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. -
భవిత కేంద్రాలకు భరోసా
నాగారం: భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భవిత కేంద్రాలకు భరోసా కల్పిస్తూ నిధులు విడుదల చేసింది. జిల్లాలో 27 భవిత కేంద్రాలు ఉండగా సొంత భవనాలు కలిగిన ఏడు కేంద్రాలకు వివిధ పరికరాలు, సామగ్రి కొనుగోలుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.14లక్షలు మంజూరు చేస్తూ... సమగ్ర శిక్షా ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. సుమారు పదేళ్ల తరువాత భవిత కేంద్రాలకు నిధులు కేటాయించడంతో విద్యార్థుల సమస్యలు తీరుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక కమిటీ ద్వారా.. జిల్లా వ్యాప్తంగా 2,900 మందికిపైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. ఒక్కో భవిత కేంద్రంలో 20 నుంచి 30 మంది చొప్పున చిన్నారులకు ఐఈఆర్పీలు రోజూ ఫిజియోథెరపీ చేసి ఆటాపాటలతో కూడిన విద్యనందిస్తున్నారు. కేంద్రాలు లేనిచోట నాన్ ఐఈఆర్సీ కేంద్రాల్లో విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పాత భవిత కేంద్రాలకు మంజూరైన నిధులతో ప్రత్యేక కమిటీ ద్వారా సౌకర్యాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, భవిత కేంద్రం అనుసంధానంగా ఉన్న హెచ్ఎం నేతృత్వంలో వీటిని సమకూర్చనున్నారు. 115 రకాల సామగ్రి అందుబాటులోకి.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వచ్చిన నిధులతో 115 రకాల సామగ్రి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఐఈఆర్పీలకు కుర్చీలు, చికిత్స అందించే బల్లలు, మసాజ్బాల్, డంబెల్స్, రౌండ్ టేబుల్, బీరువాలు తదితర సామగ్రిని అందిస్తారు. వీటి కొనుగోలు, వినియోగంపై మార్గనిర్దేశం చేశారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధన, చికిత్స అందిస్తారు. ప్రత్యేక విద్యార్థులకు ఎంతో మేలు ప్రభుత్వం సమగ్ర శిక్షా నుంచి భవిత కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవరమయ్యే బోధనోపకరణాలు అందుబాటులోకి తీసుకొస్తాం. తద్వారా విద్యానైపుణ్యాల పెంపొందించడంతో ప్రత్యేక విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – అశోక్, డీఈఓ, సూర్యాపేట ఫ సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ఫ ఒక్కో కేంద్రానికి రూ.2లక్షలు ఫ ఏడు సెంటర్లకు రూ.14లక్షలు ఫ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 2,900 మంది -
ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి
నాగారం: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని ఐఈఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 లెక్కల ప్రకారం 81వేల మంది దివ్యాంగ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారని, వీరికి 790 మంది ఉపాధ్యాయులు గత 19 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ఈ సమవేశంలో ఐఈఆర్పీలు పోరెడ్డి కవిత, మైనేని మురళీధర్రావు, రంగారావు, బాషా, ఉపేందర్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యారాధనలుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామివార్ల ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. మూసీ కాల్వలకు నీటి నిలిపివేత కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. యాసంగిలో పంటల సాగుకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. అందులోభాగంగా మూడవ విడతగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు 22 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. గడువు సమయం ముగియడంతో శుక్రవారం కుడి, ఎడమ కాల్వలకు నీటిరి నిలిపివేశారు. ఐదు రోజుల విరామం తర్వాత ఈ నెల 20 తేదీ నుంచి నాలుగో విడత నీటిని విడుదల చేయనున్నారు. 645 అడుగుల గరిష్ట నీటమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 630.50 (1.46 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ అనర్థాలపై వినూత్న ప్రచారం వేములపల్లి: యువత డ్రగ్స్కు బానిసై తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ శుక్రవారం ఆమనగల్లు జాతరలో యువతకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్ బారిన పడడం వల్ల పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి పౌరులుగా ఎదగాలన్నారు. యాదగిరి క్షేత్రంలో హోలీ సేవ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హోలీ సేవ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేసి, పారాయణం పఠించారు. ప్రధానార్చాకులు హోలీ సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఆ తరువాత భక్తులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలో ఆచార్యులు, అధికారులు పాల్గొన్నారు. -
కృత్రిమ మేధతో బోధన
నేటి నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు 20 నిమిషాల వ్యవధిలో.. ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. 11 మండలాల్లో 13 పాఠశాలలు ఎంపిక చదువులో వెనుకబడిన 3, 4, 5వ తరగతి పిల్లలకు ప్రత్యేకం ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం చర్యలు ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తి హుజూర్నగర్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ (ఆర్టిిఫీషియల్ ఇంటలిజెన్స్–కృత్రిమ మేధ) హవా నడుస్తోంది. ఈ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం సాయంతో ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టారు. ఆయా జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఇదే విధానాన్ని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఏఐ బోధనపై శిక్షణ ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది. మెరుగైన సామర్థ్యాల సాధనకు.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ‘సి’ గ్రేడ్ పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లోని ‘సి’ గ్రేడ్ పిల్లలకు ఏఐ భోధన ఉపయుక్తంగా ఉంటుంది. 3, 4, 5వ తరగతుల్లోని సీ గ్రేడ్ పిల్లలు బేసిక్ మాథ్స్ నేర్చుకోవడంతోపాటు వారిలో విద్యా సామర్థ్యాల మెరుగునకు ఏఐ బోధన ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. – కె.అశోక్, డీఈఓ, సూర్యాపేట -
నేటి నుంచి ఒంటిపూట బడి
సూర్యాపేట టౌన్: ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ(శనివారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 950 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా స్కూళ్లలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు రోజూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో 67 సెంటర్లలో 17,912 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలు కేటాయించిన స్కూళ్లలో మధ్యాహ్నం పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఫ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు స్కూళ్లు ఫ పదవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం వేళ బడి ఫ వచ్చేనెల 23వ తేదీ వరకు అమలు మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుంది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను శనివారం నుంచి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఒంటిపూట నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లోనూ కచ్చితంగా ఒంటిపూట బడులు నిర్వహించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
మహిళా ఆరోగ్యానికి భరోసా
తిరుమలగిరి (తుంగతుర్తి): మహిళల ఆరోగ్యానికి భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, చేతుల శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఫుడ్ సైన్స్ అండ్ హ్యూమన్ వెల్నెస్ (ఎఫ్ఎస్హెచ్డబ్ల్యూ) పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొన్నిరోజులుగా జిల్లాలోని స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లలోని సభ్యులైన మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన ఎందుకంటే.. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. అప్పుడే వారిలో పని సామర్థ్యం పెరిగి ఎంచుకున్న రంగాల్లో మెరుగైన ఉత్పత్తి సాధిస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది మహిళలు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా ఆర్థికంగా ఎదగాలంటే మొదట పేదరికాన్ని జయించాలి. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఒకవేళ అనారోగ్యానికి గురైతే వైద్యానికే సంపాదనలో అగ్రభాగం ఖర్చవుతుంది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆహారంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. గ్రామీణ ప్రాంతంలో ప్రతి పది మందిలో నలుగురు మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా తరచూ వారిని అనారోగ్యసమస్యలు బాధిస్తున్నాయి. ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం తయారీపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. దీంతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యంపైనా అవగాహన పెంపొందిస్తున్నారు. జాతీయజెండా రంగులే ఆహార ఎజెండా.. జాతీయజెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఆయా వర్ణాలలోని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా కాషాయం రంగులో ఉండే గుమ్మడి, బెల్లం, నారింజ, క్యారట్, పప్పు, బీట్ రూట్, దానిమ్మ తినాలి. అలాగే తెలుపు రంగులోని బియ్యం, జొన్నలు, సజ్జలు, అటుకులు, చిరు ధాన్యాలు, కోడి గుడ్డు తినాల్సి ఉంది. ఇంకా ఆకు పచ్చ రంగులో లభించే కాయగూరలు, మునగ, కాకర, సోర మొదలైన వాటితో పాటు పప్పులు, కంది, వేరుశనగ, బాదం, జీడి పప్పు, శనగలు ఆహారంగా తీసుకోవాలి. ఫ ఎఫ్ఎస్హెచ్డబ్ల్యూ పేరుతో పోషకాహారంపై అవగాహన ఫ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకం ఫ గ్రామాల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు స్వయం సహాయక సంఘాలు 17,669 సంఘ బంధాలు579సభ్యులు 1,84,281 -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అయ్యేదాకా పోరు ఆగదు
సూర్యాపేట: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అయ్యేంత వరకూ పోరాటం ఆగదని మహాజన సోషలిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 9 నుంచి సూర్యాపేటలో నిరవధిక దీక్షలు చేపట్టారు. 5వ రోజైన గురువారం నిర్వహించిన దీక్షల్లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. దీక్షకు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గంట భిక్షపతి, పనికేర గణేష్, వల్దాసు నాగేంద్రబాబు, సిరపంగి లింగస్వామి, నాగార్జున, చింత మధు, పంతం లింగన్న, బీసీ నాయకులు పవన్ పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ఆరోపించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పర్చాలని, పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఏటా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి వినయ్, దీపక్, నాని, వీరబాబు, అజయ్ గోపి, మేఘన, నవ్య, జ్యోతి, కావ్య పాల్గొన్నారు. -
జగదీష్రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలి
సూర్యాపేటటౌన్ : శాసనసభలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జగదీష్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. జగదీష్రెడ్డికి క్షమాపణలు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మల శ్రీని వాస్గౌడ్, వై.వి, ఆకుల లవకుశ, జీడి భిక్షం పాల్గొన్నారు. -
ఉద్యోగం.. ప్రజలకు సేవ చేసేలా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : ఎంచుకున్న ఉద్యోగం ప్రజలకు సేవ చేసేలా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గ్రూప్ – 2 ఫలితాల్లో జిల్లా నుంచి ప్రతిభ కనబర్చి ఎంపికై న నలుగురు అభ్యర్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. ఉద్యోగం ఆశయాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఎక్కడ నుంచి వచ్చామని కాకుండా ఏమి చేయాలనుకున్నామనేది ముఖ్య మని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామం నుంచి గ్రూప్– 2 పరీక్షల్లో నాలుగో ర్యాంకు సాధించిన శ్రీరామ్ మధు, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం నుంచి 63వ ర్యాంకు సాధించిన మద్దిడి శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 293వ ర్యాంకు సాధించిన మాణిక్యం వేణు, మహ్మదాపురం గ్రామం నుంచి 326వ ర్యాంకు సాధించిన శ్రీరామ్ నవీన్ లతో వారి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నలుగురు రైతు కుటుంబాలను నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉందని, తమ తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చిన వారయ్యారని కలెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఆర్డీఓ వి.వి. అప్పారావు కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
భూగర్భ జలవనరులను పెంచాలి
జిల్లాలో భూగర్భ జలవనరులు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో భూగర్భ జల కేంద్రబోర్డు నీటిపారుదల, వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భూగర్భ జల అభివృద్ధి, నిర్వహణ విధానాలపై టైర్ – 3లో భాగంగా టీఏ, టీసీలకు భూగర్భజల కేంద్రబోర్డు ప్రాంతీయ సంచాలకుడు జి.కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల వనరులను పెంచడానికి, వాననీటిని సంరక్షించడానికి ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్లు, రీచార్జి స్ట్రక్చర్స్ నిర్మించాలన్నారు. నరేగా కింద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్లు, ఇంకుడు గుంతలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కృష్ణా, మూసీ నదుల ప్రవాహం, నాగార్జున సాగర్, ఎస్సారెస్పీల ద్వారా సాగునీరు, తాగునీటి లభ్యత ఉన్నా గ్రౌండ్వాటర్ చాలా మండలాల్లో తగ్గిపోతోందని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని కొన్నిమండలాల్లో భూపొరల్లో మార్పులు, బండల కారణంగా నీరుభూమిలోకి ఇంకడం లేదన్నారు. అలాంటి చోట్ల వీలైనన్ని చెక్డ్యాంలు, రీచార్జి స్ట్రక్చర్లు కట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీనియర్ సైంటిస్టులు డాక్టర్ ఎస్ఎస్ విఠల్, టి.రాజబాబులు సూర్యాపేట జిల్లా ఆక్విఫర్ మ్యాపింగ్, నిర్వహణ ప్రణాళికలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ వి.వి అప్పారావు, జిల్లా భూగర్భ జల అధికారి బాలు, భూగర్భ జలబోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మండలిలో మనది అగ్రస్థానం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్యాపరంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా ప్రత్యక్షంగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవారే. ఇక బీఆర్ఎస్ నుంచి ఎన్నికై న దాసోజు శ్రవణ్కు రాజకీయంగా నల్లగొండ జిల్లాతో పెద్దగా సంబంధం లేకపోయినా, పుట్టి పెరిగిందీ నల్లగొండ జిల్లా కేంద్రమే. దీంతో శాసన మండలిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరుకుంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్సీలు గురువారం ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఇదే మొదటిసారి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శ్రావణ్ కాకుండా ఆరుగురు ఎమ్మెల్సీలు శాసన మండలిలో జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన కోటిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు కేతావత్ శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్కుమార్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఈ స్థాయిలో ప్రాతినిథ్యం దక్కడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో గుత్తా సుఖేందర్రెడ్డి పదవీకాలం 2027 నవంబరు 21వ తేదీతో ముగియనుండగా, తీన్మార్ మల్లన్న పదవీకాలం అదే సంవత్సరం మార్చి 29వ తేదీతో ముగియనుంది. మంకెన కోటిరెడ్డి పదవీ కాలం 2028 జనవరి 4వ తేదీతో ముగియనుండగా, కేతావత్ శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్కుమార్ పదవీ కాలం 2029 మార్చి 29వ తేదీన ముగియనుంది.ఫ శాసన మండలిలో ఉమ్మడి జిల్లాకు పెరిగిన ప్రాతినిధ్యం ఫ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు.. తాజాగా మరో ముగ్గురు ఎన్నిక ఫ పుట్టిన స్థలం పరంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ది కూడా ఇక్కడే ఫ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారికంగా ప్రకటన -
మూడేళ్లలో 329 మంది..
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025సూర్యాపేట టౌన్: ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైతే ఎక్కువగా తలకు గాయాలై విగతజీవులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి బైకులు నడపాలని పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ, జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల తీరుమారడం లేదు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బైకులు నడుపుతూ ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. మూడేళ్లలో బైకుల ప్రమాదాల్లో 329 మృత్యువాతపడ్డారు. పోలీసులను చూసి.. రోడ్డు ప్రమాదాల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడుతున్నవారే అధికంగా ఉంటున్నారు. అయితే హెల్మెట్ ధరిస్తే 70శాతం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్పులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో అకస్మాత్తుగా ఊడిపోయి తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొందరు మాత్రం ట్రాఫిక్ చలానాలకు భయపడి పోలీసులను చూసి హెల్మెట్ ధరించడం వంటివి చేస్తున్నారు. ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బైకుపై బయటకు వెళ్లేటప్పుడు విధిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. హెల్మెట్ ధరించకపోవడంతో.. మూడు సంవత్సరాల్లో జరిగిన బైకు ప్రమాదాల్లో జిల్లా వ్యాప్తంగా 329 మంది మృతి చెందారు. ఈ మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువమంది మృతి చెందారు. ఇందులో 50శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందారని పోలీసులు అధికారులు చెబుతున్నారు. న్యూస్రీల్సూర్యాపట్టణానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఫిబ్రవరి 27న రాత్రి తన కారును ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పార్కింగ్ చేసి 60 ఫీట్ల రోడ్డులో గల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాళ్లగడ్డ సమీపంలో మరో ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న కారు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఢీ కొట్టిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరికీ హెల్మెట్ లేకపోవడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. మూడేళ్లలో జరిగిన బైకు ప్రమాదాలు..సంవత్సరం ప్రమాదాలు మృతులు 2023 327 165 2024 320 151 2025 53 13 -
జిల్లా ప్రజలకు ఎస్పీ హోలి శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా ప్రజలు ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో హోలి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ అందరూ కలిసిమెలసి పండుగ జరుపుకోవాలని కోరారు. సంప్రదాయ రంగులు ఉపయోగించడం మంచిదని, ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్100 కు ఫోన్ చేసి పోలీసు సేవలు వినియోగించుకోవాలని కోరారు. పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మద్యం సేవించి, అతివేగంతో వాహనాలు నడపవద్దని, డీజేలు, బాణసంచా నిషేధమని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవం ముగించుకోవాలని కోరారు. పారదర్శకతకే సామాజిక తనిఖీ తిరుమలగిరి: గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు సామాజిక తనిఖీ నిర్వహించి సమీక్షిస్తున్నట్లు జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష తెలిపారు. గురువారం తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ విడత ప్రజా వేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా నివారించి వారు నివసిస్తున్న గ్రామాల్లోనే పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అంబుడ్స్మెన్ లచ్చిరాంనాయక్, విజిలెన్స్ అధికారి ఆశరాణి, ఎస్ఆర్పీ పాండురంగ, ఎంపీడీఓ లాజరస్, ఏపీఓ లక్ష్మి పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. దానిలో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కళ్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామును సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి
కోదాడరూరల్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్రోడ్లో వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో నగదు చోరీ నేరేడుచర్ల: కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.2.50లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం నేరేడుచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని జాన్పహాడ్ రోడ్డులో గల గంగోత్రి ఆస్పత్రి ఎండీ కనకపూడి మహేష్ తన కారును ఆస్పత్రి ఎదుట నిలిపాడు. బ్యాంకులో నగదు వేసేందుకుగాను కారులో రూ.3లక్షలు ఉన్న బ్యాగును ఉంచి ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. తిరిగి మహేష్ వచ్చేసరికి బ్యాగులో రూ.50వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.2.50లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో నేరేడుచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హోలి.. కావాలి ఆనందాల కేళి
రామగిరి(నల్లగొండ): హోలి పండుగ అనగానే అందరిలో ఉత్సాహం వస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు హుషారుగా రంగులు చల్లుకుంటారు. హోలి పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదాలకు తావులేకుండా ఆనందాలు నిండుతాయి. రసాయన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిలో లభించే పదార్ధాలతో తయారుచేసిన రంగులను వినియోగించితే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనిక రంగుల్లో అల్యూమినియం బ్రొమైడ్, లెడ్ ఆకై ్సడ్, మెర్క్యూరీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటివి ఉంటాయని, వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒకవేళ కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సహజ రంగులతో మేలు... ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకులతో రంగులను తయారు చేసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మోదుగు పువ్వు, గోగు పువ్వులను నీటిలో మరిగించడంతో రంగు ద్రావణంగా మారుతుంది. ఇలాంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జాగ్రత్తలు తప్పనిసరి హోలి పండుగ రోజు రంగులు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు వాటిని తీసి హోలి ఆడాలి. కంట్లో రంగులు పడకుండా అద్దాలు వాడాలి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. ఒకవేళ కంట్లో రంగులు పడితే చల్లని నీటితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో మంటగా అనిపిస్తే కంటి డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ తాటిపల్లి ప్రనూషరితేష్, కంటి వైద్యురాలు మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి హోలి ఆడటానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్ వాడాలి. తద్వారా రసాయన రంగులు శరీరానికి అంటుకోవు. చర్మం మొత్తం కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెదవులు, కళ్ల చుట్టూ పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఆర్గానిక్ రంగులు వాడితే ఉత్తమం. హోలి పూర్తయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మంపై ఇరిటేషన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. – సీహెచ్. వెంకటకృష్ణ, చర్మవ్యాధి వైద్యుడు ఫ కళ్లలో, చర్మంపై రంగులు పడకుండా జాగ్రత్తలు వహించాలి ఫ రసాయనిక రంగులతో ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు ఫ సహజమైన రంగులు వాడితే మేలు అని సూచన -
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక బజార్లు ఏర్పాటు
శాలిగౌరారం: ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలకు అందించేందుకు మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎంబీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ నది నుంచి ఇసుక రవాణా, ఇసుక స్టాక్ పాయింట్, వేబ్రిడ్జిలను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులోని ఇసుకను నిర్ణీత సమయంలో వెలికితీసి స్టాక్ పాయింట్కు తరలించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇసుక బజార్లకు ఇసుక రవాణా చేసే వాహనాలు ఇసుక స్టాక్పాయింట్ వద్ద వేచిచూడకుండా త్వరితగతిన లోడింగ్ జరిగేలా యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత రీచ్ నిర్వాహకులకు సూచించారు. ఇసుక వాహనాలను తూకం వేసే వేబ్రిడ్జిని పరిశీలించారు. వేబ్రిడ్జిలో ఏర్పడిన రిపేర్లను తక్షణమే సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చడాలని సిబ్బందికి సూచించారు. తూకం కోసం ఇసుక వాహనాలు వేచిచూడకుండా అదనంగా మరో వేబ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో ఇసుక స్టాక్పాయింట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఆయా ఇసుక బజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఇసుక రీచ్ల నుంచి ఇసుక బజార్లకు ఇసుకను తరలించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుకను విక్రయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మైనింగ్శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలు, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ సుశీల్కుమార్ -
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి: పట్టణంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిమిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలో గల ఫంక్షన్హాల్లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడుఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిభువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో జరిగింది. భువనగిరి ఆర్పీఎఫ్ ఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్ను బయటకు లాగాడు. దీంతో అతడికి ఎటువంటి గాయాలు కాలేదు. బైక్ చోరీ కేసులో జైలు శిక్షచివ్వెంల (సూర్యాపేట): బైక్ చోరీ కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత గురువారం తీర్పు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన చౌడం పవన్ కుమార్ గత సంవత్సరం ఫిబ్రవరి 29న పట్టణంలోని విద్యానగర్లో తన ఇంటి ఎదుట రాత్రి సమయంలో బైక్ను పార్క్ చేశాడు. తెల్లవారుజామున లేచి చూసేవరకు బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ మహేంద్రనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అపహరణకు పాల్పడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు సీతారాములు జిల్లా, యాటపాక మండలం బుట్టయ్య గూడెం గ్రామానికి చెందిన వాసం మనోహర్గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పీపీ హేమలత నాయుడు వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 7 నెలల 27 రోజులు జైలు శిక్ష విధించారు. పీపీకి కోర్టు కానిస్టేబుల్ సీహెచ్, రవికుమార్ సహకరించారు. -
భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులు
త్రిపురారం: పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుందని, భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులతో సాధించవచ్చని త్రిపురారం మండంలోని కంపాసాగర్లో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కంపాసాగర్ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. వరితో పాటు వివిధ రకాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేవీకే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని పోషకాలు మొక్కలకు సమపాలల్లో అందాలంటే సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలన్నారు. చీడపీడల నివారణకు అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. వరి పొలంలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి పెరుతుతుందన్నారు. ప్రస్తుతం వరి పైరులో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, సుడిదోమను గమనించామని శాస్త్రవేత్తల సలహాలతో పురుగు మందులు సకాలంలో పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లింగయ్య, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, యంగ్ ప్రొఫెషనల్స్, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు. ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఫ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కిసాన్ మేళా -
గిరిజన రైతులకు నాబార్డు చేయూత
దేవరకొండ: నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. నాబార్డు మంజూరు చేస్తున్న నిధులతో గిరిజన రైతులు జలసంరక్షణ పనులతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దేవరకొండ మండల పరిధిలోని ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాను ఐదేళ్ల కిత్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాబార్డు డబ్ల్యూడీఎఫ్ (వాటర్షెడ్ డెవలప్మెంట్ ఫండ్) ఆయా గ్రామాల్లో భూ అభివృద్ధి పనులు చేపట్టింది. తద్వారా ఇక్కడ ఏర్పాటైన వాటర్షెడ్ కమిటీలు రైతుల కోసం వివిధ పనులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసుల ఉపాధి కల్పనకు కూడా బాటలు వేశాయి. నాలుగు గ్రామాల్లో చేపట్టిన పనులు.. ● నాబార్డు ఎంపిక చేసిన ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాల్లో అర్హులైన రైతుల పొలాల్లో మొదటగా లోతట్టు ప్రాంతాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, ఫాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణాలు చేపట్టారు. ● నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరు రీచార్జ్ కావడం వంటి జలసంరక్షణ పనులు చేశారు. ● ఈ నాలుగు తండాల్లోని 1,100 హెక్టార్ల భూములకు సంబంధించి అర్హులైన రైతులను ఎంపిక చేసి నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(ఏఆర్డీఎస్) ఆధ్వర్యంలో స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్లు అందించారు. ● దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైప్లైన్ వంటి పనులు చేపట్టి ప్రోత్సహించారు. ● నిధుల విషయంలో రైతుల వాటా 30శాతం ఉండగా నాబార్డు 70శాతం నిధులు మంజూరు చేసింది. ● మొత్తంగా ఐదేళ్లలో గిరిజన రైతుల పొలాల్లో అభివృద్ధి పనులకు నాబార్డు రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తూ కొంతమేర ఆర్థిక స్వావలంబన సాధించారు. ఫ దేవరకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో డబ్ల్యూడీఎఫ్ నిధులతో భూ అభివృద్ధి పనులు ఫ ఏఆర్డీఎస్ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, పైప్లు, డ్రిప్లు అందజేత ఫ ఉపాధికి బాటలు వేస్తున్న వాటర్షెడ్ కమిటీలు -
భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానా
భువనగిరి: భూ వివాదం కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన జిట్టా శ్రీనివాస్రెడ్డికి అదే గ్రామానికి చెందిన వనం రమేష్, అతని సోదరుడు వనం సుమన్ల మధ్య భూ పంపకాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో వారు 2020 మే 18న శ్రీనివాస్రెడ్డిపై దాడికి పాల్పడారు. దీంతో ఆయన భువనగిరి రూరల్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై శంకరయ్య విచారణ చేసి కోర్టుకు పంపించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగానే వనం సుమన్ 2022లో అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. గురువారం భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి వనం రమేష్కు సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు భువనగిరి ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీని ఢీకొట్టిన టిప్పర్.. డ్రైవర్కు గాయాలు హుజూర్నగర్: ముందు వెళ్తున్న లారీని మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు నుంచి హుజూర్నగర్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ హుజూర్నగర్ పట్టణ పరిధిలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ కొండా వర్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన లారీపాలకవీడు: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకెళ్లడంతో 8 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం పాలకవీడు మండల కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అంజిరెడ్డి గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం కూడా గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా.. పాలకవీడు మండల కేంద్రం సమీపంలో లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. పోలీసులు ఘటనా స్దలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూదరుల అరెస్ట్అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1430 నగదు. రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక డంపులు సీజ్ సూర్యాపేటటౌన్: అక్రమంగా డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. గురువారం ఎస్సై బాలు నాయక్, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కేటీ అన్నారంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు కేటీ అన్నారానికి చెందిన బైరెడ్డి చిన్నారెడ్డి నాలుగు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక, కప్పల సంజీవకు చెందిన 26 ట్రాక్టర్ ట్రిప్పులు, కప్పల సైదులు ఆరు ట్రిప్పుల ఇసుక, నంద్యాల రాంరెడ్డికి చెందిన 8 ట్రిప్పుల ఇసుక, కప్పల గురుమూర్తి 2 ట్రిప్పుల ఇసుక, శరభ చారి 4 ట్రిప్పుల ఇసుక.. మొత్తం 50 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఖేలో ఇండియా పోటీలకు అవకాశం కల్పించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవికి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్రీడా ప్రాంగణాల ప్రత్యక్ష పరిశీలన కోసం ఎంజీ యూనివర్సిటీని సందర్శించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సోమలింగం, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి తదితరులు ఉన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’కు భారీగా దరఖాస్తులు
సూర్యాపేట: ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులు భారీగా వస్తున్నాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 961 మంది ఫీజు చెల్లింపులు పూర్తి చేశారని, ఎల్ఆర్ఎస్ కింద రూ.4.88 కోట్ల రుసుము వసూలు అయిందని, బుధవారం ఒక్కరోజే రూ.19.66లక్షల రుసుము వసూలైందన్నారు. బఫర్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలు వంటి నిషేధిత జాబితాలోని ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆన్లైన్లో సులభంగా అనుమతి లభిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్కు అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజు 90 శాతం రిఫండ్ అవుతుందని 10శాతం ప్రాసెసింగ్ చార్జెస్ కింద తీసుకుంటారన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కలిగి గతంలో ఎల్ఆర్ఎస్కు రూ.వెయ్యి చెల్లించిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్ లాగిన్ ద్వారా ఫీజు చెల్లించి ఫీజులు 25 శాతం రిబేటు పొందాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సబ్ రిజిస్టార్ అంబేద్కర్, టీపీఓ సోమయ్య, ఎస్.శశికుమార్, ఆర్ఓ కళ్యాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సూర్యాపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్, సభ్యులుగా ధరావత్ వీరన్ననాయక్, దాసరి తిరుమలరావు, నకిరేకంటి బాలకృష్ణ, పి.వెంకన్న, గోపగాని పెదవెంకన్న, ఎం.దామోదర్రెడ్డి, ఏ.కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ కరీం, ఉప్పల సత్యనారాయణ, మాడ్గుల నవీన్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో రైతులు ఎదుర్కొనే ప్రతి సమస్యను మాజీ మంత్రి దామోదర్రెడ్డి ఆశీస్సులతో పరిష్కరిస్తామన్నారు. పాలకవర్గ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్రెడ్డి, ఎంపీ రఘువీర్రెడ్డి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రణయ్ కేసు తీర్పు మార్పునకు నాంది కావాలి
రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీన ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్థంగా కోర్టులో సమర్పించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ పాత్ర కీలకం. ఈ కేసు విచారణ జరిగిన తీరును బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? కేసు జరుగుతున్న సమయంలో సాక్ష్యాధారాలు ఎలా సేకరించారు? తదితర వివరాలను ఆయన వెల్లడించారు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్య జరిగింది. నిందితులపై కేసు నమోదు కావడం కోర్టులో హాజరు పరిచారు. నిందితులు బెయిల్పై విడుదల అయ్యారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ వి.చంద్రశేఖర్ 2019డిసెంబర్ 2న ఈ కేసుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. అప్పటికే పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు తన కూతురు అమృతవర్షిణిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో చార్జిషీట్ ఈ కేసులో 2020డిసెంబర్ 20న కోర్టు చార్జిషీట్ నమోదు అయింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తల్లి ప్రేమలత స్టేట్మెంట్, 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కోవిడ్ తర్వాత కేసు విచారణలో కొంత జాప్యం జరిగింది. 2022జూలై 26న జడ్జి బి.తిరుపతి బాధ్యతలు తీసుకున్నాక నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2024 జూలైలో జడ్జిగా ఎన్.రోజారమణి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో కేసు విచారణ వేగంగా కొనసాగింది. కేసులో కోర్టుకు 102 మంది సాక్షుల పేర్లను సమర్పించగా 78 మంది సాక్షులను విచారించారు. 293 పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాం. పరువు హత్యలు ఆగాలి ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలను, ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కోర్టుకు సమర్పించా. 523 పేజీలతో కోర్టు తీర్పు ఇచ్చింది. డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను సమర్థంగా తిప్పికొట్టి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అనేక డిబేట్లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. కుల హత్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు కనువిప్పునిస్తుంది. ఇప్పటికీ కుల పరమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ తీర్పుతో ఆగాలి. ఫ ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థనతో స్పెషల్ పీపీగా నియమించారు ఫ ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించా ఫ ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను అందజేశా ఫ కుట్రలన్నీ కోర్టులో నిరూపణయ్యాయి ‘సాక్షి’తో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ -
అక్రమ రవాణాను అడ్డుకోవాలి
కోదాడ రూరల్: రాష్ట్రంలోకి అక్రమంగా సరుకు రవాణా కాకుండా పోలీసులు అడ్డుకోవాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్డులో జాతీయ రహదారిపై ఉన్న అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును బుధవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే రాష్ట్రంలోకి అనుమతించాలన్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. స్టేషన్కు వచచే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆయ న వెంట కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి ఉన్నారు. హోలీ వేడుక ప్రశాంతంగా జరుపుకోవాలి సూర్యాపేట టౌన్: హోలీ పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ జరుపుకునేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని తెలిపారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని, ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దని కోరారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మహిళలను వేధింపులకు గురిచేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ బకాయి రికవరీ చేయండి ఫ అదనపు కలెక్టర్ రాంబాబుభానుపురి (సూర్యాపేట): జిల్లాలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బకాయి పూర్తిగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మిల్లుల వారీగా ఎంత బకాయి పంపిస్తున్నారో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ రాజేశ్వర్, డీఎం ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
‘ఎల్ఆర్ఎస్’కు భారీగా దరఖాస్తులు
సూర్యాపేట: ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులు భారీగా వస్తున్నాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 961 మంది ఫీజు చెల్లింపులు పూర్తి చేశారని, ఎల్ఆర్ఎస్ కింద రూ.4.88 కోట్ల రుసుము వసూలు అయిందని, బుధవారం ఒక్కరోజే రూ.19.66లక్షల రుసుము వసూలైందన్నారు. బఫర్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలు వంటి నిషేధిత జాబితాలోని ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆన్లైన్లో సులభంగా అనుమతి లభిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్కు అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజు 90 శాతం రిఫండ్ అవుతుందని 10శాతం ప్రాసెసింగ్ చార్జెస్ కింద తీసుకుంటారన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కలిగి గతంలో ఎల్ఆర్ఎస్కు రూ.వెయ్యి చెల్లించిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్ లాగిన్ ద్వారా ఫీజు చెల్లించి ఫీజులు 25 శాతం రిబేటు పొందాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సబ్ రిజిస్టార్ అంబేద్కర్, టీపీఓ సోమయ్య, ఎస్.శశికుమార్, ఆర్ఓ కళ్యాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట టౌన్: దివ్యాంగులకు ఇచ్చే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కె.అశోక్ అన్నారు. బుదవారం సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 147 దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్యా సమన్వయకర్త యర్రంశెట్టి రాంబాబు, హెచ్ఎం గోలి పద్మ, విశ్వజ్ఞాచారి తదితరులు పాల్గొన్నారు. డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయాలిహుజూర్నగర్: ప్రస్తుత వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ ఏ.కామేష్ అన్నారు. బుధవారం హుజూర్నగర్లోని టీచర్స్ కాలనీలోని విద్యుత్ ఓవర్ లోడ్ ట్రాన్ఫార్మర్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ ఫ్రాంక్లిన్, డీఈ వెంకట కిష్టయ్య, ఏడీఈ నాగిరెడ్డి, ఏఈ రాంప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎండిన పొలాలకు పరిహారం ఇవ్వాలిమోతె: ఎండిన వరి పొలాలకు ప్రభుత్వమే ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు, లాల్తండా, బళ్లుతండా, బీక్యతండాలో ఎండిన వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకపోవడాన్ని ఖండిస్తూ రైతులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ తెలచ్చిన కరువని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు,నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,నూకల యుగంధర్రెడ్డి, కారింగుల శ్రీనివాస్గౌడ్, గుండాల గంగులు, జానిపాషా, ముత్తయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డీఏఓహుజూర్నగర్ రూరల్: తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి, వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు పాటిస్తూ అవసమైన మందులు పిచికారీ చేయాలని డీఏఓ శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు తెగుళ్లు సోకిన పంటపొలాలను ఏఓ రావిరాల స్వర్ణతో కలిసి ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఈఓ ముస్తాఫా, ప్రణయ్ పలువురు రైతులు ఉన్నారు. -
బావులు అడుగంటుతున్నాయి
వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం గ్రామాల పరిధిలోని బావులు, బోర్లు అడుగంటుతున్నాయి. బావుల్లో చుక్కనీరు లేదు. దీంతో నిమ్మ తోటలకు నీరందకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. సాగర్ నీటితో మండలంలోని చెరువులను నింపి నిమ్మ రైతులను ఆదుకోవాలి. – కిట్టయ్య, నిమ్మ రైతు, వేణుగోపాలపురం, నడిగూడెం మండలం నిమ్మ చెట్లు ఎండిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి ప్రస్తుత వేసవిలో నిమ్మ తోటలు ఎండిపోకుండా రైతులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ట్యాంకర్ల ద్వారా నీటినందిస్తూ చెట్లను కాపాడుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించాలి. మల్చింగ్ షీట్లు లేదా వరి పొట్టును కూడా చెట్ల మొదళ్ల వద్ద పోసి ఉంచుకోవాలి. దీంతో నీటితేమ ఆవిరి కాకుండా ఉండి చెట్లు ఎండకుండా ఉంటాయి. – తీగల నాగయ్య, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, సూర్యాపేట -
పునాది రాళ్లు పడేనా..!
ఇందిరమ్మ ఇళ్లకు లభించని మోక్షం ఇప్పటికే గ్రామసభలు పూర్తి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగా జనవరి 26నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సమయంలో 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 26 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో దరఖాస్తుదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో పేర్లు రానివారి నుంచి కొత్తగా మరో 28,225 దరఖాస్తులు స్వీకరించారు. పైలట్ పథకం కింద జిల్లాలోని 23 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించగా.. జిల్లాలో 4,140 మంది అర్హులుగా తేల్చారు. భానుపురి (సూర్యాపేట): ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల సాకారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. దరఖాస్తుల నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాళ్లు ఎప్పుడు పడతాయోనని లబ్ధిదారులు కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయి.. తీరా ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసే సమయానికి నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు అవుతున్నా ఈ పథకం అమలుపై ఇటు అధికారులు, అటు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కోడ్ కూసి.. పథకం నిలిచి.. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు పూర్తవ్వగా.. మిగిలిన గ్రామాల్లో అర్హుల గుర్తింపునకు చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఎల్–1 కింద స్థలం ఉండి ఇళ్లు లేనివారు, ఎల్–2 కింద సొంతభూమి లేని వారిని, ఎల్–3 కింద అద్దెకు ఉండడం, సొంత ఇళ్లు ఉండి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారీగా గుర్తించి ఆయా జాబితాలో చేర్చాల్సి ఉంది. మొదటగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభాల్సి ఉంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారికి సమాచారం ఇచ్చి ముగ్గు పోయాల్సి ఉంది. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పథకం అమలు నిలిచిపోయింది. మార్చి 3న కౌంటర్ జరిగి కోడ్ ముగిసి ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పథకంపై ఊసెత్తిన దాఖలాలు లేవు. దీంతో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు, ఇతర ప్రాంతాల్లో అర్హులు ఇళ్ల పథకం అమలు కోసం వేయి కళ్లలో ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద అసలు ఇళ్లు మంజూరవుతాయా.. లేదా అని లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఫ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా ఊసెత్తని అధికారులు ఫ నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోని పథకం ఫ అయోమయంలో లబ్ధిదారులు -
నిమ్మకు నీరందట్లే..
జిల్లావ్యాప్తంగా ఎండుతున్న నిమ్మతోటలు ఫ భూగర్భ జలాలు అడుగంటడమే కారణం ఫ ఆందోళనలో రైతులు ఫ సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరందించాలని వేడుకోలు ఫ జిల్లాలో 3,500 ఎకరాలకుపైగా నిమ్మసాగు నడిగూడెం: గతంలో ఎన్నడూలేని విధంగా ఫిబ్రవరి నెలఖారు నుంచే ఎండల తీవ్ర పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా నిమ్మతోటలకు సరిపడా నీరందక చెట్లు ఎండిపోతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా నడిగూడెం మండల కేంద్రంతోపాటు మండలంలోని బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, వెంకట్రాంపురం, కరివిరాల, నారాయణపురం, కాగితరామచంద్రాపురం, రామాపురం, ఎకలాస్ఖాన్పేట, ఎకలాస్ఖాన్పేట తండా, తెల్లబల్లి గ్రామాల పరిధిలో అత్యధికంగా 2వేల పైచిలుకు ఎకరాల్లో నిమ్మతోటలు సాగులో ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు లోలోతుకు పడిపోతున్నాయి. ఫలితంగా వ్యవసాయ బావులు పూర్తిగా అడుగంటాయి. కొన్ని గ్రామాల్లో బోర్లు పిక్కిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో కొద్దిపాటి నీరందిస్తున్నప్పటికీ తోటలకు సరిపోవడం లేదు. దీంతో వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న నిమ్మ తోటలు ఎండుతున్నాయి. ఇప్పటికే నిమ్మ తోటల సాగుకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామని, నిమ్మకు మంచి డిమాండ్ లభించే వేసవిలో సాగు నీరు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీటితో చెరువులు నింపితే మేలు జిల్లాలో నిమ్మతోటలు సాగులో ఉన్న గ్రామాల్లోని చెరువులను సాగర్ ఎడమ కాలువ నీటితో నింపితే తోటలు ఎండిపోకుండా ఉంటాయని నిమ్మ రైతులు అంటున్నారు. ముఖ్యంగా నిమ్మతోటలు అత్యధికంగా సాగులో ఉన్న నడిగూడెం మండలంలోని గ్రామాల పరిధిలో గల చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు కొంతైనా పెరిగే అవకాశం ఉందని అక్కడి రైతులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రస్తుత వేసవిలో సాగర్ నీటితో చెరువులను నింపాలని నడిగూడెంతోపాటు ఇతర మండలాల రైతులు కోరుతున్నారు. -
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పెన్పహాడ్: రబీలో రైతులు నీటి కొరతను అధిగమించేందుకు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన బొబ్బెర్లు, ఉలవలు వేసుకోవాలని, ఈ దిశగా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. పెన్పహాడ్ మండల పరిధిలోని ధర్మాపురం, మేగ్యాతండా, భక్తాళాపురం గ్రామాల్లో ఎస్సార్ఎసీ కాల్వ ద్వారా సాగు చేస్తున్న వరి పొలాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. సాగునీటి లభ్యత, బోరు, బావుల ద్వారా ఎంత మేర సాగు అవుతుందో క్షేత్రస్థాయిలో తిరిగిచూశారు. బోరుబావుల్లో నీరు సరిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు నీరు సరఫరా చేస్తే పంటలు చేతికి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. 20రోజులు కాల్వల ద్వారా సాగునీరు వచ్చేలా చూస్తే బోరుబావుల్లో నీరు ఉంటుందని పంటలు కూడా చేతికి వస్తాయని రైతులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ లాలు, ఇరిగేషన్ ఏఈ లింగయ్య, ఏఓ అనిల్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు పేరు వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు
సూర్యాపేటటౌన్ : ‘కాళేశ్వరం ఒక పిల్లర్ కూలితే దాన్ని రిపేరు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బాగు చేయిస్తే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని దుర్బుద్ధతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నాడు’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని, ముఖ్యంగా వ్యవసాయం పూర్తిగా నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేక లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని, జిల్లాలో ఎస్సారెస్పీ కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పంటలు పండక పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేకుంటే పంట నష్టం అంచనా వేసి పరిహారం ఎకరానికి రూ.30,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఆకుల లవకుశ, జీడి భిక్షం, తూడి నరసింహారావు పాల్గొన్నారు. -
సూర్యాపేట
ఇఫ్తార్ 6–31 (బుధవారం సాశ్రీశ్రీ) సహర్ 5–04 (గురువారం ఉశ్రీశ్రీ)ఐదుగురి అరెస్ట్ గంజాయి తరలిస్తున్న ఐదుగురిని కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 7విద్యా ప్రమాణాలు పాటించాలి విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలని ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. - 8లోబుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025 -
మట్టపల్లి ఆలయంలో చలువ పందిర్లు ఏర్పాటు
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణానదీ తీరంలో గల స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు వేసవి తాపం నుంచి బయట పడేందుకు ఆలయ పాలక వర్గం చలువ పందిర్లు ఏర్పాటు చేస్తోంది. ప్రధాన రాజగోపురం నుంచి ఆలయ సింహద్వారం వరకు, క్యూలైన్ల నుంచి ముఖమండపం వరకు మంగళవారం చలువ పందిర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. కృష్ణానదీతీరం నాపరాయితో నిక్షిప్తమై ఉండడంతో ఇక్కడ కాస్త వేడి ఎక్కువగానే ఉంటుంది. నదిలో నీరు తగ్గిపోతుండటంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇందులోకి దిగేందుకు భక్తులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పైభాగంలోనే వాటర్షవర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆల య పరిసరాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ అనుశంవశిక ధర్మకర్తలు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్ తెలిపారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇందులో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం ,రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. -
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన సమీక్షలో చైర్మన్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములపై ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. పీఎం అజయ్ పథకం కింద లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి వారి బోర్ల ద్వారా సాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల జిల్లాలో పరువు హత్యకు గురైన మాల బంటి అలియాస్ కృష్ణ కేసుపై ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ కేసు విషయంలో కలెక్టర్ బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు రాని అర్హులైన ఎనిమిది కుటుంబాలకు వెంటనే అందేలా చూడాలన్నారు. ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవం జరపాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెలా చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలన్నారు. అంతకుముందు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్ చైర్మన్కు వివరించారు. మాల బంటి కేసును వివరిస్తూ భార్గవి విద్యార్హత మేరకు సర్టిఫికెట్ పరిశీలించి ఉద్యోగం కల్పిస్తామని, కేసారంలో డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పోలీస్ భద్రతతో పాటు వారి ఇంటి వద్ద 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, శంకర్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, ఎస్టీ అభివృద్ధి అధికారి శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్నాయక్, ఎల్డీఎం బాపూజీ, జీఎం సీతారాం నాయక్, డీఎస్పీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
రవాణా చార్జీలు వచ్చేశాయ్..
హుజూర్నగర్: దూరప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రవాణా చార్జీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ముందు వరకు విద్యార్థులకు రవాణా చార్జీలు అందించిన ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిలిపివేసింది. దీంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆటోలు, బస్సుల్లో, కొందరు నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని పేదబాలికలు బడి మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు కిరాయిలు భారంగా మారి సక్రమంగా పాఠశాలలకు రాలేక పోతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం గతంలో మాదిరిగా రవాణా చార్జీలను నాలుగేళ్ల తర్వాత పునరుద్ధరించింది. జిల్లాకు రూ.67.56 లక్షలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా చార్జీల కింద ప్రభుత్వం మొత్తం రూ.67.56 లక్షలు విడుదల చేసింది. వాటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1,042 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున రూ 62.52 లక్షలు మంజూరు చేసింది. అంతే కాకుండా పీఎంశ్రీ పేజ్ –1 కింద 22 పాఠశాలల్లో ఎంపికై న 77 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు రూ.4.20 లక్షలు మంజూరు చేసింది. పీఎంశ్రీ పేజ్–2 కింద ఎంపికై న 9 పాఠశాలల్లోని 14 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు కింద రూ.84 వేలు విడుదల చేసింది. తప్పనున్న ఆర్థికభారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరుకు పైగా, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి ఒక విద్యార్థికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఇందుకు విద్యార్థి హాజరు ప్రతినెలా 80 శాతం ఉండాలి. ప్రస్తుతం రవాణా చార్జీలు విడుదల కావడంతో తమకు ఆర్థికభారం తప్పనుందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వనిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తీపికబురు ఫ ఒక్కో విద్యార్థికి రూ.6 వేల చొప్పున రూ.62.52 లక్షలు విడుదల ఫ పీఎం శ్రీ ద్వారా అదనంగా మరో రూ.5.04 లక్షలు ఫ జిల్లాలో 1,133 మందికి ప్రయోజనంనేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తాం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన రవాణా చార్జీలు చెల్లింపుల కోసం సీఆర్పీల ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తాం. ఆయా విద్యార్థుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ) ద్వారా జిల్లా కార్యాలయం నుంచే రవాణా చార్జీలు జమ చేస్తాం. – కందిబండ శ్రవణ్కుమార్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్, సూర్యాపేట -
గోదావరి జలాలు నిలిపివేత
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో విడుదల చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం నిలిపివేశారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 1న విడుదల చేయాల్సి ఉండగా రెండు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే వారం రోజులు కావడంతో నీటిని నిలిపివేశారు. కాగా వారబందీ విధానంలో నీటిపారుదలశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ వారం గడిచాక వచ్చేవారం నీటిని జిల్లాకు పునరుద్ధరించనున్నారు. రైతులు మాత్రం పంటలు చేతికొచ్చే వరకు నీటిని నిరంతరాయంగా ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాలిచివ్వెంల : పదోతరగతిలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మహిళా సాధికారత కేంద్ర జిల్లా కో ఆర్టినేటర్ చైతన్య సూచించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో బేటి పడావో–బేటి బచావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. బ్యాడ్ టచ్– గుడ్ టచ్ పై విద్యార్థినులకు వివరించారు. బాల్య వివాహాలు, 18సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, అక్రమ రవాణా వంటి సమస్యలపై 1098 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా మహిళలకు ఇబ్బందులు ఎదురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చని, సఖీ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వయోవృద్ధులకు ఇబ్బందులు ఎదురైతే 104567నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అందిస్తున్న పథకాలను, అదే విధంగా పని ప్రదేశాల్లో, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులపై వివరించారు. ఈ సందర్భంగా 9,10 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించారు. కార్యక్రమంలో రేవతి, వినోద్, ఎం.క్రాంతికుమార్, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు సీఐల బదిలీ నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్కుమార్ను హైదరాబాద్ సిటీ కమిషరేట్కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేశారు. నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం వరకు నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆలయాధికారులు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభిస్తామని అర్చకులు వెల్లడించారు. -
నీడలేదు.. నీళ్లు లేవు!
ఉపాధి హామీ పనిప్రదేశంలో కనీస వసతులు కరువు నాగారం : ఉపాధి పనుల నిర్వహణకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పనిప్రదేశంలో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండలోనే సేదదీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు అందుబాటులోలేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. కూలీల వలసలు నిరోధించి ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని విజయవంతంగా చేపట్టేందుకు నూతన సాంకేతికతను సైతం వినియోగిస్తోంది. కూలీల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వచ్చిన వారి ఫొటోను ఉదయం పని ప్రదేశం నుంచే తీసి పోర్టల్లో నమోదు చేయడం, పనులు పూర్తయిన తరువాత మళ్లీ ఫొటో తీసి నిక్షిప్తం చేయడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేపడుతున్న పనులు ఇవీ.. జిల్లాలో 23 మండలాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణకు తదితర పనులను చేపడుతున్నారు. పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు జిల్లాలో పని ప్రదేశాల్లో వడదెబ్బ తగిలి ఏటా ఆరెడు గురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పుడు కూలీల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. ఉపాధి కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేద దీరడానికి ప్రభుత్వం గతంలో షామియానాలు (టెంట్లు) పంపిణీ చేసేది. కానీ కొన్నేళ్లుగా టెంట్లు అందించడం లేదు. సరఫరా కాని మెడికల్ కిట్లు పనులు చేసే సమయంలో కూలీలకు గాయాలైన సందర్భంలో ప్రాథమిక చికిత్స కిట్లు సమకూర్చాలి. కిట్లో అయోడిన్, బ్యాండేజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉంచాలి. కొన్నేళ్లుగా వీటి సరఫరా నిలిచిపోయింది. సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నాం పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా దృష్టి సారిస్తున్నాం. పని చేసేచోట సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించాం. వేసవిలో ఉపాఽధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట. ఇంటి నుంచే తాగునీరు.. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం లేదు. కూలీలు ఇళ్లనుంచే నీటిని డబ్బాలు, బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. గతంలో కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక కూలీని నియమించేవారు. ఈ విధానాన్ని తొలగించి గ్రామ పంచాయతీ వారే ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని నిబంధనలు విధించారు. కానీ ఎక్కడ కూడా నీటి వసతి కల్పించిన దాఖలాలు కన్పించడంలేదు. గ్రామ పంచాయతీలు 475మొత్తం జాబ్ కార్డులు 2.62 లక్షలు నమోదైన కూలీల సంఖ్య 5.71లక్షలు ఉపాధి పనులకు వెళ్లేవారు 1.47లక్షలుప్రస్తుతం పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య 18,775100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలు 596ఫ అందుబాటులో లేని టెంట్లు, మెడికల్ కిట్లు, తాగునీరు ఫ ఎండలకు ఇబ్బందులు పడుతున్న కూలీలు చెట్లను ఆశ్రయిస్తున్న కూలీలు రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉపాధి పనులు చేసేచోట కనీస వసతులు లేక కూలీలు ఎండలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీడ కోసం గతంలో సమకూర్చిన టెంట్లు పనికిరాకుండా పోయాయి. మళ్లీ వాటి మంజూరుపై మూడేళ్లుగా ఎలాంటి స్పష్టత లేదు. పనిచేసే చోట నీడ లేక ఎండలకు కాస్త సేదదీరడానికి చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. -
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఆలయంలో ఉదయం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. ఈ నెల 1న స్వస్తి వాచనంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అంతకు ముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులకు, పారాయణీకులకు, అధికారులకు, సిబ్బందికి సన్మానించారు. నిత్యారాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాల సంకీర్తన గావించారు. ఫ యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
ఒకరి ప్రేమ.. మరొకరి అహం..
ప్రణయ్ హత్యతో రెండు కుటుంబాల్లోనూ విషాదం సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని అనుకున్న ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ప్రణయ్ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి. కడుపుతో ఉన్నా కరుగని మనస్సు.. కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ కలలు చెదిరిపోయి, ఊరు విడిచి వెళ్లిపోయిన అమృత ఫ కొడుకు లేక విలపిస్తున్న ప్రణయ్ తల్లిదండ్రులు -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి వేడుక నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీచక్రతీర్థం.. మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవంనిర్వహించారు. మహోత్సవంలో దోఽషములు తొలగించేందుకు పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. -
కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.నరసింహ సోమవారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, కేసుల్లో నేరస్తులకు శిక్ష అమలు, అక్రమ రవాణా నిరోధం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, పోలీసు సేవలు తదితర అంశాలపై చర్చించారు.దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి బోయినపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె.శంకర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2025 ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయస్సు ఉండి ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న జిల్లాలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను పొంది ఈనెల 17వ తేదీ లోగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 7,424 మంది హాజరుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షను 32 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 7,704 మంది విద్యార్థులకు 280 మంది గైర్హాజరు కాగా 7,424 మంది హాజరైనట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు చెప్పారు. ప్రణయ్ హత్యకేసు తీర్పు చెంపపెట్టు లాంటిదిభానుపురి (సూర్యాపేట) : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు లాంటిదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. ప్రణయ్ హత్యకేసు తీర్పుపై సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రణయ్ కేసు తీర్పు ఉందన్నారు. రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. ఇటీవల సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణను అతి కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ల హస్సన్, సీనియర్ జర్నలిస్ట్ బంటు కృష్ణ, పల్లె మనిబాబు, శిరంషెట్టి ఆనంద్, వెంకన్న, జె.నరసింహారావు, వెంకట్ రెడ్డి, నాగయ్య, దేవయ్య, వెంకటనరసయ్య, బోయిల్ల అఖిల్ , సుధాకర్, సతీష్ పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్డేలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పాఠశాలు, హాస్టల్స్లో ఫ్యాన్లు వాడుకోనేలా సిద్ధం చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి ఎద్దడి రాకుండా చిన్నచిన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా శాఖ సభ్యులు తల్లిదండ్రుల వయోధికుల పోషణ, సంక్షేమ చట్టం 2007 నియమావళి – 2011 తెలిపే పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, సీపీఓ ఎల్.కిషన్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఈఓ అశోక్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ అధికారి జగదీశ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ పీడీ శ్రీనివాస్నాయక్, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీసీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, మెప్మా పీడీ రేణుక పాల్గొన్నారు. సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలుభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పాల్గొని మాట్లాడారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరందేలా చూస్తామన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
సూర్యాపేటటౌన్ : జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నూతన ఎస్పీ కె.నర్సింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా ఆయన సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గత ఎస్పీ, డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పేకాట, గంజాయి తరలింపు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. వేగంగా పోలీస్ సేవలుఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విలువైన సేవలు వేగంగా అందిస్తామన్నారు. మహిళల పట్ల, పిల్లల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవ్టీజింగ్ చేసే వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. సైబర్ మోసాల పై ప్రణాళికతో పని చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నర్సింహ -
ఖాళీలతో అవస్థలు..!
ఈ ఫొటోలో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం ఇస్తున్నది ఆత్మకూర్ (ఎస్) మండలం మక్తాకొత్తగూడెంలోని అంగన్వాడీ సెంటర్లోనిది. ఈ సెంటర్ అంగన్వాడీ టీచర్ నాలుగేళ్ల క్రితం సూపర్వైజర్గా పదోన్నతి పొందారు. ఇక ఆయాకు 65 ఏళ్లు నిండడంతో పది నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు. దీంతో సెంటర్లో 15 మందికి పైగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇలా మొత్తం 40 మంది వరకు పౌష్టికాహారం ఇచ్చేందుకు బొప్పారం, శెట్టిగూడెం తండాకు చెందిన అంగన్వాడీ టీచర్లకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతినెలా ఒకరోజున లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇదీ జిల్లాలో చాలా సెంటర్లలో అదనపు బాధ్యతలతో టీచర్లు, ఆయాలు, సమయానికి పౌష్టికాహారం అందక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఏళ్లు తరబడి టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఇద్దరి పనిని ఒక్కరే చేయడం, సెలవు దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి పలుమార్లు ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదు. దీంతో కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వివిధ కారణాలతో ఖాళీ..సూర్యాపేట జిల్లాలో ఐదు ప్రాజెక్టుల కింద 1,209 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో 30వేల మంది దాకా చిన్నారులు, మరో 20వేల మంది దాకా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్న కొందరు వివిధ ఉద్యోగాలు పొందడం, అంగన్వాడీల్లోనే సూపర్వైజర్లుగా పదోన్నతి పొందడంతో టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన ఆయాలకు పదవీ విరమణ కల్పించడంతో ఆ పోస్టులు సైతం భారీగా ఖాళీ అయ్యాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 61 అంగన్వాటీ టీచర్, 200 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు గతంలోనే గుర్తించారు. భర్తీకి నోచుకోకపోవడంతో..ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయాలు ఉన్నచోట టీచర్ లేకపోవడంతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు. ఇక టీచర్ ఉండి ఆయా లేనిచోట పిల్లలను తీసుకురావడం, తీసుకెళ్లడం, ఆలనాపాలనా చూడడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ పథకం భోజనం వండిపెట్టడం వంటివి అందడం లేదు. ఇందులోనే ఇటీవల ఆయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంతో కొన్నిచోట్ల టీచర్తో పాటు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయాలు, టీచర్లపైనా పనిభారం అధికమైంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయా, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.ఏళ్లుగా భర్తీకాని అంగన్వాడీ పోస్టులు ఆయా ఉంటే టీచర్ లేక.. టీచర్ ఉంటే ఆయా లేక ఇబ్బందులు ఉన్న టీచర్లు, ఆయాలపైనా పనిభారం లబ్ధిదారులకు సక్రమంగా అందని పౌష్టికాహారంత్వరలోనే భర్తీ కానున్నాయి జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలోనే ఈ ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – నరసింహారావు, సంక్షేమాధికారి -
తాగునీటి సమస్య రావొద్దు
ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి ఫ నీటి సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించాలి ఫ అందుకు కలెక్టర్ వద్ద నిధులు ఉంచుతాం ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్లగొండలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నల్లగొండ : వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు మనసు పెట్టి పనిచేయాలని ఉమ్మడిజిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో సాగు, తాగునీరు, విద్యుత్పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నా రు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదా వరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై అధి కారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కాల్వల నిర్వహణ సరిగాలేదు : గుత్తా శాసనమండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీటిని లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. నీరు వదిలి పంటను కాపాడాలి ఎస్సారెస్పీ నీరు సరిగా అందక పంట పొలాలు ఎండిపోయి. మా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీటిసి సక్రమంగా విడుదల చేసి ఆ పంటలను కాపాడాలి. అడ్డగూడూర్లో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ చేయడం లేదు. మోత్కూర్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. – తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ అధికారుల మధ్య సమన్వయం లేదు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నీటి విడుదల విషయంలో స్పష్టత లేదు. అధికారులు ఒకరికొకరు సహకరించుకుని సమస్యలు పరిష్కరించాలి. – కోదాడ ఎమ్మెల్యే పద్మావతి -
లో వోల్టేజీ సమస్యల పరిష్కరించాలి : మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నంద్లాల్ పవార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిలాల్, సీఈ అజయ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి మహాక్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాలా ర్చన, సుప్రభాతసేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నూతన పట్టు వస్త్రాలతో వధువరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్య, శాశ్వత కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక దర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. మహిళలపై దాడులను వ్యతిరేకించాలి భానుపురి: మహిళలపై మనువాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ)రాష్ట్ర అధ్యక్షురాలు డి.స్వరూప, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుంచి గాంధీ పార్కు వరకు మహిళల భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ పార్కులో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారాసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు రాజకీయ విధానాల వల్ల మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో కారింగుల వెంకన్న, కొత్తపల్లి రేణుక, శిరీష, జయమ్మ, పద్మ, లక్ష్మి, పావని, రేష్మ, శ్యామల, మరియమ్మ, సత్తెమ్మ, మాలంబి, పద్మ, పేర్ల మల్లమ్మ, గౌనమ్మ, లక్ష్మి, కల్పన, రేణుక, చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ విద్యకు డిమాండ్సూర్యాపేట: ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మసీ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఎ.రామకిషన్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్స్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా తర్వాత ఫార్మసీ విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ముందుగా బీ ఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థులకు బంగారు పతకాలు, యూనివర్సిటీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెయిన్ బో ఆసపత్రుల ఉపాధ్యక్షులు డాక్టర్ నీరజ్భాయ్, ఎస్బీ లైఫ్ సైన్స్స్ సీఈఓ హరీష్రెడ్డి, కిష్ట్రాన్ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ జె. క్రిష్ణప్రసాద్, రాష్ట్ర ఫార్మసీ కళాశాలలో సంఘం అధ్యక్షుడు కె.రాందాస్, కళాశాల కరస్పాండెంట్ సాధినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఆడెపు రమేష్, పరిపాలన అధికారి దేవులపల్లి వినయ్, కిషోర్, నీలమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థికి బంగారు పతకంచివ్వెంల: తెలగాంణ స్టేట్ 11వ యూత్ అఽథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చివ్వెంల బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి జి.విశాల్ ప్రతిభ కనబర్చాడు. ఇటీవల హైదరాబాలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన అండర్–14 (60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్) విభాగాల్లో విశాల్ సత్తాచాటి బంగారు పతకం సాధించాడు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విశాల్ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, పీడీ కృష్ణారెడ్డి, పీఈటీ రహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయానికే లోక్ అదాలత్
చివ్వెంల: పెండింగ్ కేసులను పరిష్కరించి కక్షిదా రులకు సత్వర న్యాయం అందించేందుకే మెగాలోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొడవలు జరిగినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్లో రాజీ పడటం వల్ల పైకోర్టుకు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా వీడిగా ఉంటున్న భార్యభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు హాల్లో ఒక్కటి చేశారు. ఈ సందర్భంగా క్రిమినల్, సివిల్, వెహికల్ యాక్టు, విద్యుత్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి 5,708 కేసులను పరిష్కరించారు. కోర్టులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, పిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.వెంకటరమణ, బార్అసోసియేషన్ అధ్యక్షుడు నూ కల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, సీనియర్, జూని యర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జడ్జీలతోపాటు జ్యుడిషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి మధు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, ఏపూరి సంజయ్, ఎల్గూరి మహేశ్వర్, జునైద్, శ్రీకాంత్, నాగంజనేయులు, శ్రీకాంత్రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి శ్యామ్శ్రీ ఫ లోక్ అదాలత్లో 5,708 కేసులు పరిష్కారం -
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో రాత్రి 8.30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి 9 గంటలకు ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానార్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవితం) గావించారు. ఆ వెంటనే నృసింహుడు అమ్మవారికి, అమ్మవారు నృసింహుడికి జీలకర్ర బెల్లం పెట్టే తంతు పూర్తి చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీటీడీ తరఫున, భూదాన్పోచంపల్లి తరపున, భక్తుల తరపున తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో అలంకార సేవలో ప్రజాప్రతినిధులు, ఆలయాధికారులు, భక్తులు నడిచారు. ఉదయం శ్రీరాముడిగా దర్శనం శనివారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటచార్యులు తదితరులు పాల్గొన్నారు.ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణమహోత్సవం బ్రహ్మోత్సవాల్లో నేడు ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. -
కాంగ్రెస్ కక్షసాధింపు వల్లే రైతులకు నీటికష్టాలు
నూతనకల్: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను, శ్రీరాంసాగర్ కాల్వలను శనివారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్.. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రాజెక్టులో లోపాలున్నాయని నీటిని లిప్టు చేయకుండా రైతులను అరిగోస పెట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాళేశ్వరం పంప్లను నడిపి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్, మద్దిరాల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్య, ఎస్ఏ రజాక్, గుజ్జ యుగేంధర్రావు, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్నాయక్, బత్తుల సాయిలుగౌడ్, బిక్కి బుచ్చయ్య, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, ఇమ్మారెడ్డి రవీందర్రెడ్డి, బాణాల సత్యనారాయణరెడ్డి, కనకటి మహేష్, పంతం యాకయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
నేడు జాతీయ మెగా లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట): జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి శ్యామ్శ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటార్ వెహికల్ యాక్టు, విద్యుత్ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంతోపాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి పాల్గొన్నారు. -
బీడు భూములు సేద్యానికి అనువుగా మార్చుకోవాలి
అర్వపల్లి: రైతులు తమ బీడు భూములను ఉపాధి హామీ పథకం ద్వారా సేద్యానికి అనువుగా మార్చుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన బీడు భూముల అభివృద్ధి (ఎల్డీపీ) పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ టి. గోపి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాములు ఉన్నారు. ఉపాధి పనులు పారదర్శకంగా నిర్వహించాలినాగారం: ఉపాఽధిహామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచుతూ, పనిలో నాణ్యత పాటించాలని సూచించారు. జాబ్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ మారయ్య, ఏపీఓ రవి, ఆర్ఐ అల్లావుద్దీన్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఈసీ ముక్కంటి ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
భానుపురి (సూర్యాపేట): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, పారిశ్రామిక, వ్యాపార రంగాలు, కళల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. అనంతరం మహిళా అధికారులను సన్మానించారు. ఆటలపోటీల్లో గెలిచిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి నరసింహారావు, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి కే.లత, మెప్మా పీడీ అధికారిణి రేణుకాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారిణి మాధవి, జిల్లా లీగల్ కౌన్సిల్ అడ్వకేట్ వాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ మాధవి పాల్గొన్నారు. పూర్తి నివేదికలతో రావాలి ఈనెల 11వ తేదీన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన ఉన్నందున అధికారులు పూర్తి నివేదికలతో కమిషన్ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు తమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి నివేదికలు సోమవారంలోగా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, ఎస్సీ అభివృద్ధి అధికారి లత పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో కలెక్టర్ దంపతులు, ఈఓ యాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందస్తుగా పెళ్లిచూపుల పర్వం జరుపుకున్న శ్రీస్వామివారు శుక్రవారం ఉదయం జగన్మోహిని రూపం దాల్చారు. రాత్రి అశ్వవాహనంపై ఎదుర్కోలు జరుపుకున్నారు. ఎదుర్కోలు మహోత్సవం సాగిందిలా.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నేడు లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు నుంచి గజవాహన సేవపై ఊరేగింపుగా కల్యాణమండపానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. -
అసమానతలు అంతరించాలి
మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకంకథనాలు పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ.. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు. న్యాయ సహాయం అందిస్తాం.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు. నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తివివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం బాధిత మహిళలకు అండగా ఉండాలి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా విధులు రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది అంతరించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకమ న్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు. సమాన అవకాశాలు ఉండాలి మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. సమాజంలో అంతరాలు రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. -
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025 సమాజంలో సగభాగమైన మహిళలు మాత్రం ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలో కూడా పురాతన పోకడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 7 పట్టణాల్లో 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలపై నిర్వహించగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ మగ వివక్షను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంది లేదు45ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది చెప్పలేము– సాక్షి, నెట్వర్క్ -
జిల్లాలో రెండు టీమ్స్
మహిళల రక్షణకు షీ టీమ్ నిఘాసూర్యాపేటటౌన్ : మహిళల రక్షణకు షీటీమ్స్ పని చేస్తున్నాయి.. రద్దీ ప్రాంతాల్లో నిరంతం వీటి నిఘా ఉంటుంది.. అమ్మాయిలను ఎవరైనా ఈవ్టీజింగ్ చేసినా.. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని షీ టీమ్ ఎస్ఐ నీలిమ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో షీటీమ్స్ పనితీరు, మహిళలకు సంబంధించి ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై ఆమె సాక్షితో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 45 రద్దీ ప్రదేశాలను గుర్తించి సిబ్బందిని ఏర్పాటు చేశాం. వారు నిత్యం ఆ ప్రాంతంలో గస్తీ చేస్తుంటారు. అమ్మాయిల పట్ల ఎవరైనా అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తాం. వరుసగా మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా మారకపోతే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో సూర్యాపేట, కోదాడ డివిజన్ పరిధిలో రెండు టీమ్లు పని చేస్తున్నాయి. మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీటీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. డయల్ 100కు కాల్ చేయవచ్చు. లేదా సెల్ నంబర్ 8712686056కు ఫోన్చేయవచ్చు. ముఖ్యంగా విద్యార్థినులు ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటివి చేయకుండా మాకు ఫిర్యాదు చేస్తే వారి భరతం పడతాం. షీటీమ్కు జిల్లాలో 2024లో మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 176 అవగాహన సదస్సులు నిర్వహించాం. ఆకతాయిలపై 102 కేసులు బుక్ చేశాం. అందులో 21 కేసులు ఎఫ్ఐఆర్ చేశాం. 145మంది ఫ్యామిలీ మెంబర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాం. 2025లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మొత్తం 10 పిట్టీ కేసులు బుక్ చేయగా అందులో ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 16 మంది కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం.జిల్లాలో కేసులు ఇలా.. ధైర్యంగా షీటీమ్కు ఫిర్యాదు చేయాలి షీ టీమ్ నంబర్ : 87126 86056 ఫ జిల్లా వ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిరంతరం గస్తీ ఫ ‘సాక్షి’ తో షీ టీమ్ ఎస్ఐ నీలిమ -
వేలంపాటను అడ్డుకొని
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మద్యం విక్రయాలు జరగలేదు. -
మద్యంపై.. మహిళల సమరం
బెల్టు షాపులు బంద్ చేయించిన అతివలు ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిదీ. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్టు దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు. – చిట్యాల, రాజాపేటనెలరోజులుగా మద్యం అమ్మడం లేదు మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్ట్ దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మాణించాం. నెల రోజులుగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. – బొంగు శ్రీలత, మహిళా సంఘం ప్రధానకార్యదర్శి, ఏపూరు ఫ మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయించారు ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంటచిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. బెల్టు దుకాణాలు మూసివేయాలని హెచ్చరిక.. ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్టు దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మానించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. -
వేలంపాటను అడ్డుకొని
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మద్యం విక్రయాలు జరగలేదు. -
నేడు మంత్రుల రాక
నల్లగొండ : జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిలు శనివారం నల్లగొండకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్కు చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. నూతన ఎస్పీగా నరసింహసూర్యాపేటటౌన్: సూర్యాపేట నూతన ఎస్పీగా కె.నరసింహ నియామకమయ్యారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్ప్రీత్ సింగ్కు డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడి ఎస్పీ బదిలీ కావడంతో సూర్యాపేట జిల్లాకు ఈయన బదిలీపై రానున్నారు. -
రూ.2వేల కోట్లకు చేరువలో రుణాల పంపిణీ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరుకుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.580కోట్ల బంగారు రుణాలు, రూ.571 కోట్ల పంట రుణాలు, రూ.405 కోట్ల మార్టిగేజ్ రుణాలు, రూ.379 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.3వేల కోట్లకు చేరువలో ఉండగా, రూ.50 కోట్ల లాభాల దిశలో డీసీసీబీ పయనిస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలను సులభతరం చేశామని, పౌల్ట్రీ రుణాల చెల్లింపు కాల పరిమితిని పెంచామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అదనపు రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీఈఓ శంకర్రావు, డైరెక్టర్లు లింగం యాదవ్, పాశం సంపత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సైదయ్య, కోడి సుష్మ తదితరులు పాలొగన్నారు. ఫ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
ఫ ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్ నల్లగొండ టూటౌన్: విశ్వ ఉనికి రహస్యం భౌతికమే అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకొని జీవన విధానములో అన్వయించుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సైన్స్ ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే విశ్లేషించగలిగారని అన్నారు. మానవుల్లో కొంత శాతం మేర జంతువుల జన్యులతో పోలిన జన్యువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని వివరించారు. మానవ స్వభావాలు అనేకం జన్యు ప్రేరేపితంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్రెడ్డి, అన్నపూర్ణ, దోమల రమేష్, కళ్యాణి, రూప, రామచందర్గౌడ్, జ్యోతి, శివరాం పాల్గొన్నారు. లేఖా రచనలో కోదాడ వాసికి ప్రథమ బహుమతికోదాడ: భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘లేఖా రచనలో ఆనందం–డిజిటల్ యుగంలో లేఖా రచన ఆవశ్యకత’ అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖా రచన పోటీల్లో కోదాడ పట్టణానికి చెందిన ఉస్తేల సోమిరెడ్డి ప్రథమ బహుమతి(రూ.25 వేలు) సాధించారు. సోమిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో తన కుమారుడికి రాసిన ఉత్తరాలను ‘ఇట్లు నాన్న’ పేరుతో సంకలనాన్ని ప్రచురించారు. తన భార్య రమకు రాసిన ఉత్తరాలతో ‘రమణీయం’ పేరుతో మరో సంకలాన్ని ప్రచురించారు. లేఖా రచనలో తనకు ఉన్న అభిరుచికి బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మూడేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకొని అతడి చెర నుంచి బాలుడిని విడిపించి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన షమీమున్సీసా, హైమద్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరు గత మూడేళ్లుగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వాటర్ ట్యాంక్ కింద నివాసముంటూ అక్కడే ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తింటూ జీవనం సాగిస్తున్నారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన సీతారాములు చెల్లెలికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మగ పిల్లలు లేరని ఆమె బాధపడుతుండడంతో చూడలేక సీతారాములు వారం క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న హైమద్ కుటుంబాన్ని చూశాడు. వారితో పరిచయం పెంచుకొని వారి కుమారుడిని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి నకరేకల్లో ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో హైమద్ దంపతులు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలించి సీతారాములు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు నకరేకల్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఫ రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు ఫ మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు ఫ నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్కుమార్(26) దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన పెట్రోల్ బంక్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ రోజు బంక్లో డబుల్ డ్యూటీ చేసిన అరుణ్కుమార్ ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోవడంతో బంక్ నిర్వాహకులు అరుణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్లో డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద యువకుడు ఉరేసుకుని మృతిచెందినట్లు గురువారం ఉదయం పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడంతో.. ఆ మృతదేహం అరుణ్కుమార్దిగా గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు గంధం వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునప్నట్లు ఎస్ఐ తెలిపాడు. అరుణ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన.. అరుణ్కుమార్ ఆత్మహత్యకు పెట్రోల్ బంక్ యాజమానే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో గురువారం దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ ెపెట్రోల్ బంక్ వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బంక్ యాజమాని తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆదోళనను విరమింపజేశారు. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో యూపీ సీఎం సురక్ష టీం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు చెందిన పోలీసు బృందం గురువారం సందర్శించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణ తీసుకుంటున్న యూపీ సురక్ష టీంకు చెందిన 51 మంది పోలీసు బృందం.. ఆలయాల్లో భద్రత, సీఎంతో పాటు ప్రముఖులు ఆలయాలను సందర్శించిన సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై శిక్షణలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. ప్రముఖులు వచ్చిన సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలకు ఎలా పంపించాలి, ఆలయ పరిసరాల్లో ప్రముఖులు పర్యటిస్తున్న సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు వివరించినట్లు సీనియర్ ఆర్ఎస్ఐ శివలాల్ తెలిపారు. వీరి వెంట అధికారులు సాయికుమార్, గణేష్, శంకర్రెడ్డి ఉన్నారు. -
పరీక్షలు సరిగా రాయలేకపోతున్నానని..
కోదాడ రూరల్: పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన బచ్చలకూర శంకర్ కుమార్తె నవ్య పెన్పహాడ్ మండలం అనాజిపురంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నవ్య.. ఇంటి వద్ద నుంచే బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మొదటి పరీక్షకు హాజరై తిరిగి వచ్చింది. జ్వరంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెందిన నవ్య గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు అరెస్ట్
వేములపల్లి(మాడ్గులపల్లి): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని గురువారం మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన నక్క వెంకన్న, సరిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకన్న పలుమార్లు సరితను కాపురానికి రావాలని అడిగగా ఆమె రాకపోవడమే కాకుండా కుక్కడం గ్రామానికి చెందిన ఊరుబిండు మల్లయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త వెంకన్నను ఇబ్బందులకు గురిచేశారు. సరిత మేనమామ మన్నెం శ్రీను సైతం ఆమెకు సహకరించడంతో మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీను వేధింపుల కారణంగానే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకన్న సూసైడ్ లెటర్ సైతం రాశాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వెంకన్న భార్య సరితతో పాటు మల్లయ్య, శ్రీనును అరెస్ట్ చేసి మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
అమ్మ భాష తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. కొంత మంది విద్యార్థులు తెలుగు వ్యాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాతృ భాష అయిన తెలుగును కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. – రాజు, తెలుగు ఉపాధ్యాయుడు, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష (తెలుగు) సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈతో పాటు ఇతర సిలబస్ను అమలు చేస్తూ మాతృభాషను పక్కన పెడుతున్నారు. దీంతో విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోవడమే కాదు కనీసం చదవడం కూడా రావడం లేదని గ్రహించిన ఎన్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా బోధించేలా చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక మార్కుల కోసం..ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం లేదు. సీబీఎస్ఈ, ఐబీహెచ్ఈ తదితర సిలబస్ను అమలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు భాష ఎంపిక స్థానంలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా సంస్కృతం, అరబిక్ బోధిస్తున్నారు. దీంతో తెలుగులో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను కోల్పోతున్నట్లు భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ముందు తొమ్మిదవ తరగతికి.. ఇప్పటి వరకు ఉన్నత తరగతులకు తెలుగు పాఠ్యాంశాలు అమలు చేయని పాఠశాలలకు తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2026–27 నుంచి 10వ తరగతికి అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించాల్సిందే.. ఎన్సీఈఆర్టీ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం -
ఉండ్రుగొండ గుట్టల్లో చెలరేగిన మంటలు
ఫ భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులోని గుట్టల్లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో గుట్టలకు సమీపంలో ఉన్న ఉండ్రుగొండ, దురాజ్పల్లి, వల్లభాపురం, మహ్మదాపురం, ఇమాంపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హెచ్పీ పెట్రోల్ బంక్ ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలు తీవ్రంగా ఉండడంతో రాత్రివేళ చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ను వివరణ కోరగా.. పశువుల కాపరులు చుట్ట లేదా బీడీలు తాగి పడేయడంతో ఎండిన ఆకులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవచ్చని పేర్కొన్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలు వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు వీలుకావడం లేదన్నారు. -
అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అకాడమీలో మొదటి సంవత్సరం డిఫెన్స్ కోర్సు చదువుతున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎన్. అభిషేక్, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కె. ప్రదీప్ జూలై నెలలో నిర్వహించిన ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకండరీ జాతీయస్థాయి పరీక్షలో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులను అకాడమీ డైరెక్టర్ రామయ్య, శ్రీనివాస్, అధ్యాపకులు నగేష్, బొమ్ము శంకర్ అభినందించారు. పాడి ఆవులు విక్రయిస్తామని టోకరాఫ వాట్సాప్లో ఆవుల ఫొటోలు పెట్టి రూ.85,500 కొట్టేసిన దుండగుడు భువనగిరి: వాట్సాప్లో ఫొటో పెట్టిన ఆవులను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.85వేలు పంపి మోసపోయాడు. ఈ ఘటన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్కు ఈ నెల 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పాడి ఆవుల ఫొటోలు పెట్టి వాటిని అమ్ముతామని చెప్పాడు. వాట్సాప్లో పెట్టిన ఆవులలో మూడు మాత్రమే ఎంపిక చేసుకుని ఫోన్పే ద్వారా రూ.1,05,000 పంపాలని సూచించాడు. గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ముత్తిరెడ్డిగూడెం వాసి మూడు ఆవులను ఎంపిక చేసుకుని ఫోన్ పే ద్వారా రూ.85,500 పంపాడు. డబ్బులు పూర్తిగా పంపితేనే ఆవులను పంపిస్తామని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు గేదెలు, ఆవులను అమ్ముతామని ఫోన్ చేస్తే నమ్మవద్దని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్పై విచారణ వేగవంతం ఫ నిందితులను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్కు వెళ్లిన నకిరేకల్ పోలీసులు నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నంబర్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్కు పయనయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు ఢీకొని యువకుడు మృతిబీబీనగర్: బైక్పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బీబీనగర్ మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో జరిగింది. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల సూర్యప్రసాద్(24) బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బీబీనగర్ నుంచి బైక్పై బ్రహ్మణపల్లికి వెళ్తుండగా.. నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో హిందుస్థాన్ శానిటరీ వేర్ పరిశ్రమ గోడౌన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాష్ట్రపతి భవన్లో చండూరు చేనేత వస్త్రాల ప్రదర్శన
చండూరు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి తాము తయారుచేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎంపికై న 20 మందిలో తాము ఉండడం, రాష్ట్రపతి భవనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గంజి యాదగిరి, చిలుకూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. -
గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు
సింహ వాహనంపై ఊరేగుతున్న నృసింహుడుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం శ్రీస్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష
ఫ బాలికపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన సూర్యాపేట జిల్లా కోర్టు చివ్వెంల(సూర్యాపేట): బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ఎం. శ్యామ్శ్రీ గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గుంజ వెంకన్న అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిన్న కుమార్తైపె అతడి కన్నుపడింది. బాలికపై పలుమార్లు వెంకన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చి 31న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు. అదే రోజు మళ్లీ అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్కు తీకెళ్తుండగా మార్గమధ్యలో కడుపునొప్పి ఎక్కువై కడుపులోంచి పిండం బయటపడింది. బాలికను తల్లి నిలదీయగా.. గుంజ వెంకన్న తనపై అత్యాచారం చేస్తున్నాడని విషయం చెప్పింది. బాలికకు చికిత్స చేయించిన అనంతరం 2021 ఏప్రిల్ 2న ఆమె తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి డీఎస్పీ మోహన్కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రాంరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. -
అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి
అర్వపల్లి: వరిలో అగ్గితెగులు నివారణకు రైతులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి కోరారు. అర్వపల్లి, రామన్నగూడెం, వేల్పుచర్ల తదితర గ్రామాల్లో వరి పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పొలాల్లో ప్రస్తుతం అగ్గితెగులు, కాండం తొలుచు పురుగును గుర్తించినట్లు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడం వల్ల అగ్గితెగులు వృద్ధి ఎక్కువ అయినట్లు తెలిపారు. అగ్గితెగులు నివారణకు టైప్లోక్సీ ట్రోబిన్, టేబ్యు కొనజోల్ లేదా ట్రైసైక్లోజోల్, కాండం తొలుచుపురుగు నివారణకు కార్టైఫెడ్రాక్రై ్లడ్ ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, ఏఈఓ శోభారాణి, ఖమ్మంపాటి నరేష్ పాల్గొన్నారు. -
ఇళ్ల మార్కింగ్ వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ఎంపిక చేసిన 23 గ్రామ పంచాయతీల్లో 3,103 ఇళ్ల మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన అన్ని గ్రామపంచాయతీలో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. సూర్యాపేట మండలంలోని 26 మంది మేసీ్త్రలకు ఈ నెల 10న టెక్నాలజీతో ఇంటి నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ లో 20 మంది మేసీ్త్రలకు మాస్టర్ ట్రైనీలతో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. గ్రామపంచాయతీలో ఉపాధి పనులకు వందమంది కూలీలు వచ్చేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డుల కోసం 9 కేటగిరీల్లో ఇప్పటి నుంచే ఆ దిశగా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం ఈజీఎస్ ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పదిరోజుల్లో సుమారుగా 30 ఇళ్లను గ్రౌండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండలాల్లో ఎంపిక చేసిన మోడల్ హౌస్ల పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ, డీఆర్డీఓ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, డీఎల్పీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఇంటర్ సెకండ్ ఇయర్కు 7,416 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. జనరల్ విభాగంలో 6,306 మందికి 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 6,134 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,389 మంది విద్యార్థులకు 107 మంది గైర్హాజరు కాగా 1,282 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద సెకండ్ ఇయర్ తొలి రోజు పరీక్షకు 7,416 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను గురువారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్పవార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్య ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్థ్యాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య క్లోజ్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సెల్ ఫోన్న్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
రెండు నూతన జాగిలాలు వచ్చాయ్
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు ట్రాకర్ డాగ్ లూసీ , ఎక్స్–ప్లోజివ్ డాగ్ బ్రూనో అనే రెండు నూతన జాగిలాలను కేటాయించారు. ఈ సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన డాగ్ షెల్టర్ రూంలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి ట్రాకర్ డాగ్ లూసీ పూలబొకే తో స్వాగతం పలికింది. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధుల నిర్వహణ, కేసుల ఛేదనలో జాగిలాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టడంలో డాగ్స్ బాగా పని చేశాయని, హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ ప్లోజివ్ ఇలా 6 విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ (పేరు లూసీ) ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుందని, మరో డాగ్ ఎక్స్ ప్లోజివ్ (పేరు బ్రూనో) ఇది పేలుడు సామగ్రిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఐలు నారాయణ రాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. ఫ డాగ్ షెల్టర్ రూమ్లను ప్రారంభించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ -
కోదాడకు నవోదయ స్కూల్ !
కోదాడ: కోదాడలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యాసంవత్సరమే ఈ విద్యాసంస్థ ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇది ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు నవోదయ స్కూల్ను మంజూరు చేసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సరైన స్థలం కోసం అన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలో కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి దాదాపు 40 ఎకరాల ఖాళీ స్థలం అధికారుల దృష్టికి వెళ్లింది. వారం రోజుల క్రితం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఈ స్థలాన్ని పరిశీలించారు. గురువారం కోదాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ రాంబాబు డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లి ఖాళీగా ఉన్న స్ధలాన్ని పరిశీలించారు. కోదాడ ఆర్డీఓ, తహసీల్దార్ సర్వేయర్తో కలిసి ఆయన ఈ స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించినట్లు సమాచారం. స్వాగతిస్తున్న విద్యా వేత్తలు.. కోదాడలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి కొండపల్లి రాఘవమ్మ, రంగారావులు ఇచ్చిన విరాళంతో బాలాజీనగర్ వద్ద దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కేఆర్ఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిగ్రీ, జూనియర్ కళాశాలలు కలిపి 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 35 ఎకరాల స్థలం ఖాళీగా ఉంటుంది. దీని చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కళాశాలకు చెందిన ఖాళీ స్థలంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో మేలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థల కోసం దాతలు భూమిని ఇచ్చారని దీని ఏర్పాటు వల్ల వారి ఆశయం కూడ నెరవేరుతుందని కళాశాల పూర్వ విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే కోదాడ ప్రాంతం విద్యాహబ్గా మారుతుందని వారు అంటున్నారు. ఫ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసే అవకాశం ఫ స్ధలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ ఫ స్వాగతిస్తున్న విద్యావేత్తలు స్థలాన్ని పరిశీలించాం జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సరైన స్థలం కోసం చూస్తున్నాం. కేఆర్ఆర్ కళాశాల వద్ద ఖాళీ స్థలం ఉందనే సమాచారంతో పరిశీలించాం. అదనపు కలెక్టర్ కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పరిస్థితులు బాగున్నాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి. – సీహెచ్. సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ. -
గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశకు గోదావరి జలాలను గురువారం 1700 క్యూసెక్కులకు పెంచినట్లు నీటి పారుదల శాఖ బయ్యన్నవాగు డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. ఇందులో 69,70,71 డీబీఎంలకు గోదావరి జలాలను వదులుతున్నట్లు చెప్పారు. అర్హులకు పనులు కల్పించాలి నడిగూడెం : అర్హులైన కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. గురువారం నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం – మునగాల మండలం కలకోవ గ్రామాల కొనసాగుతున్న లింక్ రోడ్డు పనులను ఆయన పరిశీలించిన అనంతరం సంబందిత అధికారులతో మాట్లాడారు. కూలీల హాజరు, జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాలపురం వద్ద హరితహారం నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓ సంజీవయ్య, ఎంపీఓ విజయకుమారి, కార్యదర్శులు నారాయణరెడ్డి, విజయలక్ష్మి, ఈసీ శ్రీను ఉన్నారు. అభివృద్ధి పనులకు రూ.49.59కోట్లుహుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధిలో తనదైన మార్కు చూపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఇటీవల అభివృద్ధి పనులకు రూ 49.59 కోట్లు మంజూరు చేయించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఏర్పాటుచేసే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్లేందుకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు , హుజూర్నగర్ – చిలుకూరు మార్గ మధ్యలో నిర్మించతల పెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేయించారు. హుజూర్నగర్ పట్టణంలోనీ రాజీవ్ గాంధీ జంక్షన్ నుంచి పట్టణ శివారులోని హౌసింగ్ కాలనీ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధికి రూ 6.50 కోట్లు, పట్టణంలో నిర్మించ తలపెట్టిన నీటిపారుదల డివిజనల్ కార్యాలయానికి రూ 7.99 కోట్లు, కోదాడలో నీటిపారుదల సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ కార్యాలయానికి రూ 5.10 కోట్లు మంజూరు చేయించారు. ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆమె సందర్శించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలు, ఆహారం, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ సుధాకర్రెడ్డి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్, పెండెం వాణి పాల్గొన్నారు. చైర్పర్సన్గా చామంతి బాధ్యతల స్వీకరణ తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా ఎల్సోజు చామంతిరమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్గా చింతరెడ్డి రాజగోపాల్రెడ్డి, డైరెక్టర్లుగా దేశగాని రాములు, ఆంగోతు రాములు, ఉప్పలయ్య, బైరబోయిన సైదులు, అంజయ్య, వేణుగోపాల్రావు, ఎం.డి.హఫీజ్, జలేందర్, వాసుదేవరెడ్డి, రాపాక సోమేష్, దొడ్డ రమేష్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న మార్కెట్ కార్యదర్శి అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కష్టాలకు చెక్
సర్వే ఇలా.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తాగు నీటి పైపుల లీకేజీలు, పగుళ్లు, ట్యాంకుల నుంచి పట్టణానికి సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ పరిస్థితి, కాలనీలో ఉన్న నీటి ట్యాంకులు, బోర్లు, చేతి పంపులు, నల్లాలకు బిరడాలు లేక పోవడం తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వివరాలను సేకరిస్తున్నారు. ముందుగా సమస్య ఎక్కువగా ఉండే శివారు కాలనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. సమస్య ఉన్న చోట క్షేత్ర స్థాయిలో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రజలతో చర్చించి పరిష్కారానికి మార్గాలు నమోదు చేస్తున్నారు. సమస్యతో పాటు దాని పరిష్కార మార్గాన్ని చూపుతూ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : వేసవి కాలంలో మున్సిపాలిటీల్లో తాగు నీటి ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. నీటి సరఫరా కోసం ఏ ఏ మరమ్మతులు అవసరమో గుర్తించాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి మున్సిపాలిటీల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తేనే సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. బృందాలుగా ఏర్పడి.. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను బట్టి అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఒక్కో బృందంలో ఏఈ స్థాయి అధికారి, ముగ్గురు వార్డు అధికారులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను సరిగ్గా గుర్తించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. గత వేసవిలో మున్సిపాలిటీలకు పాలక వర్గాలు ఉండేవి. వాటి గడువు తీరడంతో అధికారులే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్యలపై సర్వే ఫ బృందాలుగా ఏర్పడి వివరాల సేకరణ ఫ సమస్యలు.. పరిష్కారమార్గాలతో ప్రభుత్వానికి నివేదికమున్సిపాలిటీ వార్డులు సూర్యాపేట 48కోదాడ 35హుజూర్నగర్ 28తిరుమలగిరి 15నేరేడుచర్ల 15 -
సూర్యాపేట
ఇఫ్తార్ 6–30 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 5–08 (శనివారం ఉశ్రీశ్రీ)అమ్మభాష తప్పనిసరి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7రూ.2వేల కోట్లకు చేరువలో.. డీసీసీబీ ద్వారా రైతులకు రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025- 8లో -
ఇద్దరు ఆర్ఐలు సస్పెన్షన్
భానుపురి, మోతె : మోతె తహసీల్దారు కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు గాను ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోతె మండల ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలాదేవి, అదనపు ఆర్ఐ షేక్ మన్సూర్అలీలు పాత పహాణీ రికార్డుల్లో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ల కింద 11 దరఖాస్తులు చేయించి భూమి ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించారు. ఈ విషయమై మోతె తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం రాత్రి రికార్డులను కలెక్టర్ పరిశీలించి ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన మోతె మండల ఆర్ఐ నిర్మలాదేవి, అదనపు ఆర్ఐ షేక్ మన్సూర్అలీలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనట్లు ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలు పునరుద్ధరణఅర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇవ్వాల్సిన గోదావరి జలాలను ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే మంగళవారం 500 క్యూసెక్కులు వదలగా బుధవారం 1,002 క్యూసెక్కులకు పెంచారు. కాగా 1500క్యూసెక్కులకు పెంచితేనే చివరి భూములకు చేరడంతోపాటు తూములకు సాఫీగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. నీటిని పెంచి, వారబందీ విధానం కాకుండా పంటలు చేతికొచ్చే వరకు వదలాలని అన్నదాతలు నీటి పారుదలశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలిచివ్వెంల(సూర్యాపేట) : చిన్నారుల ఆహారం, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని బాల సదన్ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఆహారం సమయానికి పెడుతున్నారా అని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. విద్యార్థులు బయటి తిను బండారాలు ఎక్కువగా తినకూడదని, వేసవి కాలం దృష్ట్యా నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి పాల్గొన్నారు. పొన్నవాహనంపై నృసింహుడి విహారం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్శర్మ పాల్గొన్నారు. -
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. -
భానుడు భగభగ
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయ్. వేసవి కాలం ప్రారంభమైన కొద్దికాలానికే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. మరో రెండునెలల పాటు వేసవి కాలం ఉండగా.. ప్రస్తుత ఉష్ణోగ్రతలను చూస్తే జనం బిత్తరపోతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలను దాటాయి. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. బుధవారం జిల్లాలోని పది ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా, మరో 4 ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ఎండలు ముదరడం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులులో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణానికి మించి.. జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా నమోదవుతూ ఉంటుంది. మార్చి రెండోవారం నుంచి 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40లకు అటుఇటుగా నమోదవుతుంది. ఈనెల 4న ఏకంగా 39.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. అంతకు ముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండలు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2వ తేదీన రెండు డిగ్రీలు పెరిగి 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. 4వ తేదీన ఏకంగా 40 డిగ్రీలకు చేరువై 39.9 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం నాలుగు మండలాల్లో 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండలను చూసిన జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న భయంతో ఉన్నారు. ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో..)ఫ మూడురోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ బుధవారం నాలుగు ప్రాంతాల్లో 38 డిగ్రీలకుపైగా నమోదు ఫ గతేడాదితో పోల్చితే ముందుగానే మండుతున్న ఎండలు