Suryapet District News
-
రేపు జాబ్మేళా
భువనగిరి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో వివిధ ఉద్యోగాల కల్పనకు ఈనెల 29న ఉదయం 11గంటలకు భువనగిరి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్మేళా కం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రోఫిన్ కంపెనీలో 37 కస్టమర్ రిలేషన్ ఆఫీసర్, బ్రాంచి రిలేషన్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ అర్హతతో రూ.16 వేల నుంచి రూ.22 వేలు, డిగ్రీ ఉత్తీర్ణతతో రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారు భువనగిరి, జనగామ, గజ్వేల్, సిద్దిపేట, రామాయంపేట, హుజూరాబాద్, భూపాలపల్లి, పరకాల బ్రాంచీల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి గలవారు బయోడేటాతో పాటు, విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయానికి ఈనెల 29న ఉదయం 11 గంటల లోపు రావాలని కోరారు. -
రైల్లో నుంచి దూకి పారిపోయిన బాలిక
నల్లగొండ క్రైం: ముంబై పోలీసులు ఓ బాలికను రైల్లో సోమవారం విజయవాడకు తీసుకెళ్తుండగా.. నల్లగొండలో రైలు ఆగిన సమయంలో ఆమె రైలులో నుంచి దూకి పారిపోయింది. సదరు బాలిక అక్కడ నుంచి పారిపోయి నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలోని అంధుల పాఠశాల సమీపంలో తిరుగుతుండగా స్థానిక యువకులు గుర్తించి కాంగ్రెస్ నాయకుడు అల్లి సుభాష్యాదవ్ సమాచారం ఇచ్చారు. ఆయన బాలిక నుంచి వివరాలు రాబడుతుండగా.. రైల్లో నుంచి పారిపోయినట్లు తెలపడంతో వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించారు. సదరు బాలిక మానసిక స్థితి సరిగ్గా లేక ముంబైలో తిరుగుతుండగా జూలైలో అక్కడి శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు గుర్తించి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ బాలికను కుటుంబ సభ్యుల వివరాల గురించి ప్రశ్నించగా చెప్పలేకపోయింది. ఆమె తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా అని చెప్పడంతో మొదట బాలికను పోలీసులు కర్నూల్కు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి మిస్సింగ్ కేసులు, బాలిక చెప్పిన వివరాలు సరిపోలకపోవడంతో విజయవాడ చైల్డ్ కేర్ అఽధికారులకు అప్పగించేందుకు రైలులో తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లగూడ సమీపంలో తిరుగుతుండగా రైల్వే పోలీసులకు అప్పగించిన స్థానికులు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
దేవరకొండ: బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలో జరిగింది. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గిరిజానగర్తండాకు చెందిన ఇస్లావత్ నరేష్(21), సబావత్తండాకు చెందిన రాహుల్(18) డీజే ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం డిండి మండలంలో ఓ శుభకార్యానికి డీజే తీసుకెళ్లారు. శుభకార్యం పూర్తయిన తర్వాత వారిద్దరు బైక్పై తూర్పుపల్లి మీదుగా స్వగ్రామాలకు వెళ్తుండగా.. దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నరేష్, రాహుల్కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో వారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా నరేష్ మార్గమధ్యలో మృతిచెందాడు. రాహుల్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పాతకక్షలతో ఇద్దరిపై దాడిఆత్మకూరు (ఎస్): పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులపై మద్యం సీసాలతో మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్మికల్ గ్రామానికి చెందిన పెద్దింటి సైదులు, వేల్పుల వంశీపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన భరత్, కొడిదల వంశీ మధ్య ఏడాది క్రితం గొడవ జరిగింది. ఆదివారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా భరత్, కొడిదల వంశీ మద్యం తాగడానికి సాయంత్రం ఆత్మకూర్(ఎస్) శివారుకు వచ్చారు. అదే సమయంలో సైదులు, వేల్పుల వంశీకి ఫోన్చేసి మాట్లాడుకుందాం అని పిలిపించారు. వారిద్దరు అక్కడకు రాగానే భరత్, కొడిదల వంశీ మద్యం సీసా పగులగొట్టి సైదులు, వేల్పుల వంశీపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట చేసినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతమద్దిరాల: అక్రమంగా తరలిస్తున్న 23క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండల కేంద్రానికి చెందిన కాసం వీరభద్రయ్య నకిరేకల్ చుట్టపక్కల గ్రామాలు, తండాల్లో 23క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి డీసీఎంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో గల రాజరాజేశ్వరీ రైస్ మిల్లు వద్ద మేకపోతుల గోవర్ధన్రెడ్డికి అధిక ధరకు అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మద్దిరాల మండలం కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు డీసీఎంలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డీసీఎంను, రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. కాసం వీరభద్రయ్యతో పాటు మేకపోతుల గోవర్ధన్రెడ్డి, డీసీఎం డ్రైవర్, డీసీఎం యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలునాగారం: కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రానికి చెందిన నూక నర్సమ్మ ఇంట్లోకి సోమవారం కోతుల మంద చొరబడి వండిన ఆహార పదార్థాలు తింటున్నాయి. ఇది గమనించిన నర్సమ్మ కర్రతో కోతుల మందును వెళ్లేగొట్టే ప్రయత్నం చేయగా కోతుల మంద ఒక్కసారిగా ఆమైపె దాడి చేశాయి. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి కోతుల మందును వెళ్లగొట్టారు. నర్సమ్మ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం నాగారం మండల కేంద్రానికే చెందిన చలమందు, ముత్తమ్మ దంపతులపై కోతులు దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
చందంపేట: విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం మృతిచెందింది. చందంపేట మండలం పొగిళ్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీన హనుమాన్ ఊరేగింపు నిర్వహిస్తుండగా గ్రామానికే చెందిన జటావత్ లక్ష్మి(45) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గ్రామస్తులు వెంటనే ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించే లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
● మృతురాలిది సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెండోర్నకల్: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడుకు చెందిన యువతి అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. అందనాలపాడు గ్రామానికి చెందిన కనకం మహేందర్కు సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడేనికి చెందిన మౌనిక(26)తో ఏప్రిల్ 4న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.10లక్షల ఒప్పుకుని రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల అనంతరం అదనపు కట్నం కోసం భర్త మహేందర్, అత్త సత్యవతి, ఆడబిడ్డతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మౌనికను వేధిస్తున్నారు. ఈ నెల 22న మౌనిక పుట్టిరోజు కాగా అత్తింటివారు రూ.30 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేశారు. అత్త సత్యవతి మాత్రలు మింగి చావమంటూ బీపీ మాత్రలు మౌనికపై విసిరింది. మనస్తాపానికి గురైన మౌనిక వాటిని తీసుకుని అధిక మోతాదులో మింగడంతో అపస్మాకర స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు మొదట ఖమ్మం తరలించి అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి తండ్రి నవిలె కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మౌనిక భర్త కనకం మహేందర్, అత్త సత్యవతి, ఆడబిడ్డ స్వప్న, ఆమె భర్త తిరుపతయ్య, బంధువు గోవిందు ఏసు, ఆయన భార్య జయమ్మపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి. రాజేశ్ సోమవారం తెలిపారు. -
మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణాలతో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా పూర్తిగావించారు. ఆలయ ప్రవేశానంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు. పంచనారసింహుడికి ప్రత్యేక పూజలుయాదగిరిగుట్ట: పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. అర్చకులు ఉదయం సుప్రఽభాతం, ఆరాధన జరిపించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8300 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 100 ఫీట్ల రోడ్డు నుంచి గాంధీ విగ్రహం వరకు పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సింహాద్రి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాన్నారు. పీడీఎస్యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, మమత, సంధ్య, నవ్య, శైలజ, వనజ, శివ, సందీప్, మహేష్, నవీన్, వినయ్, వేణు, సాయిరాం, ఉదయ్, గోపి పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి
నాగారం : మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పాం పంట సాగు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి ప్రభుత్వం రూ.4200 చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇస్తుందని, గరిష్టంగా ఒక రైతుకు 12.50 ఎకరాల వరకు డ్రిప్ రాయితీ వర్తిస్తుందన్నారు. రుణమాఫీ కానీ రైతులు మండలంలోని వ్యవసాయ అధికారులకు, ఏఈఓలకు వివరాలు ఇచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి టి.నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారులు ఎం.మహేష్, ప్రమిత, మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్, ఆయిల్ సీడ్స్ ఆఫీసర్ శ్రీకాంత్, ఉద్యాన శాఖ సిబ్బంది నరహరి, నరేష్, పతంజలి ఆయిల్ పామ్ డీజీఎం యాదగిరి, మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, కరుణాకర్, రైతులు కమటం జయమ్మ, పిలిప్స్, రవీందర్, అశోక్ రెడ్డి, మల్యాల అశోక్, జలెండర్రెడ్డి, జగదీష్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతులకు సబ్సిడీలు పెంచాలి
నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాముల నిర్మాణాల కోసం రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు పెంచాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి కోరారు. శుక్రవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన నాబార్డు సమావేశానికి డీసీసీబీ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాబార్డు చైర్మన్ కేవీ.సాజి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుంభం మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులందరికీ సబ్సిడీలు సులభతరంగా అందేలా నాబార్డు పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని విన్నవించారు. నాబార్డుకు సబ్సిడీ పత్రాలను అప్లోడ్ చేయడానికి మొదట రుణ పంపిణీ తేదీని మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం ఇచ్చే పథకాలపై డీసీసీబీల సాయంతో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పప్పుధాన్యాల సేకరణ ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులను ప్రభుత్వానికి సరఫరా చేయడానికి డీసీసీబీల ద్వారా ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఫ నాబార్డు చైర్మన్ సాజికి విన్నవించిన డీసీసీబీ చైర్మన్ కుంభం -
నాణ్యమైన ఆహారం అందించండి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన నాణ్యమైన ఆహారం అందించాలని సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ద్రోణాచార్యులు అన్నారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం, బియ్యం నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో బియ్యాన్ని పద్ధతి ప్రకారం భద్రపరచాలని ఆదేశించారు. ఎక్కడైనా బియ్యం నాణ్యతలో లోపాలు ఉంటే జిల్లా మేనేజర్, సివిల్ సప్లయ్ అధికారులకు తెలిపి వాటిని వెంటనే మార్చి మంచి బియ్యం తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలను తనిఖీ చేశారు. మిగిలిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని సంబంధిత స్కూల్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి క్లాస్ రూం తనిఖీ చేసి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ప్రసాద్, డీఎస్ఓ రాజేశ్వర్, సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ సభ్యులు, ఇన్చార్జ్ హెచ్ఎం సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ పరిధిలో..హుజూర్నగర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం ఇవ్వాలని స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఓఎస్డీ ఎం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ పరిధిలోని మైనారిటీ గురుకుల పాఠశాలతోపాటు పలు గురుకుల వసతి గృహాలు, పాఠశాలలను టాస్క్ ఫోర్స్ టీం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టాస్క్ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, ఎస్ఐ జంగయ్య, కోదాడ డీటీసీఎస్ రాంరెడ్డి ఉన్నారు. చిలుకూరు : మండల కేంద్రంలోని పలు గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో మౌలిక వసతులు, భోజనం పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎం.ప్రభాకర్, టాస్క్ఫోర్స్ ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి, ఎస్ఐ జంగయ్య, కోదాడ డీటీసీఎస్ ఎం.రామిరెడ్డి తదితరులు ఉన్నారు. ఫ సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ద్రోణాచార్యులు -
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అదనపు డీఆర్డీఓ సురేష్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి కార్యాక్రమంలో భాగంగా పాడి పశువుల పెంపకంపై మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళల కోసం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు పి.సంతోష్కుమార్, రాజశేఖర్, డీపీఎంలు గోవిందు, రత్తయ్య, ఆంజనేయులు, ఏపీఎం రాంబాబు, సీ్త్రనిధి మేనేజర్ సతీష్, ఉపేందర్, సీసీలు ఉపేందర్, వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ధర్నా సూర్యాపేట టౌన్ : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తూ 23 ఆగస్టు 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28 కు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి సరెండర్భానుపురి (సూర్యాపేట) : జిల్లా ఉపాధి కల్ప న అధికారి అక్బర్ హబీబ్ను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్బర్ హబీబ్పై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అనంతరం సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ప్రజా పాలన’ సవరణలకు అవకాశం
నాగారం : ప్రజా పాలన దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ఆప్షన్ను అందుబాటులో ఉంచింది. ప్రజాపాలన దరఖాస్తులను కొందరు ఆపరరేటర్లు సరిగా ఆన్లైన్ చేయకపోవడం, మరికొందరు అవగాహన లేక ఆరు గ్యారంటీల్లో కొన్నింటికి టిక్ చేయలేదు. ఇలా ఎవరైతే కంప్యూటర్లో గ్యారంటీల కాలం ఎదుట టిక్ చేయలేదో వారికి మొన్నటివరకు శ్రీనాట్ అప్లయ్శ్రీఅనే సమాచారం వచ్చింది. దీంతో అర్హులు ఏడు నెలలుగా గృహజ్యోతి పథకానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నాట్ అప్లయ్ అనే సమాచారం వచ్చిన గడులను సవరించే అవకాశం లేకపోవడంతో అర్హులు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి అప్లయ్ చేసుకోవడానికి కొత్త అప్షన్ను అందుబాటులోకి తీసుకురావడంతో అర్హులైన వారు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి వివరాలు సమర్పిస్తున్నారు. పత్రాలు వెంట తీసుకెళ్లాలి.. ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం జనవరి నెలలో పేద, మధ్య తరగతి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీనిలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాయితీపై గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. కానీ కొంతమంది దరఖాస్తుల్లో తప్పులు దొర్లడంతో వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయి. దీంతో వారికి ప్రయోజనం చేకూరేలా ప్రజాపాలన కేంద్రాలను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. గతంలో దరఖాస్తుదారులు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి తమ వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన పత్రం, రేషన్ కార్డు, ఆధార్కార్డు, విద్యుత్ బిల్లులోని యూఎస్సీ నంబర్ను వెంట తీసుకెళ్లి వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. వివరాలు అప్డేట్ అయితే గృహజ్యోతి పథకానికి అర్హత లభిస్తుంది. ఇదివరకు దరఖాస్తు చేసుకుని విద్యుత్ జీరో బిల్లు రాని వారైతే మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసిన రశీదు చూపించి సరిచేసుకోవచ్చు. అద్దె ఇంటిని ఖాళీ చేసి మరో ఇంట్లో ఉంటే మీటరు నంబర్ మార్చుకునే ఎడిట్ ఆప్షన్ ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు గృహజ్యోతి లబ్ధిదారులు 1,69,372 మంది ఉన్నారు. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించినట్లయితే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాలు అప్డేట్ చేసుకోవాలి అర్హులై ఉండి గృహజ్యోతి పథకం వర్తించని వారు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి తమ వివరాలు అప్డేట్ చేయించుకోవాలి. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన పత్రం, రేషన్ కార్డు, ఆధార్కార్డు, విద్యుత్ బిల్లులోని యూఎస్సీ నంబర్ను వెంట తీసుకెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలి. – శ్రీనివాస్, విద్యుత్శాఖ డీఈఈ, సూర్యాపేట ఫ కొత్త ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఫ గృహజ్యోతి అందని అర్హులకు ఊరట ఫ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు -
కాలం తీరినా
విద్యార్థులు సైంటిస్ట్లుగా ఎదగాలిప్రతి విద్యార్థి గొప్ప సైంటిస్ట్గా ఎదగాలని ఇస్రో శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ అన్నారు. శనివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2024- 8లోఫ జిల్లాలో 12వేల వాహనాలు 15 ఏళ్లు పూర్తయినవే.. ఫ రీ వ్యాలిడిటీ చేయించుకోని వాహనదారులు ఫ ఫిట్నెస్ చేయించుకోవాలంటున్న రవాణా శాఖ అధికారులు సూర్యాపేట టౌన్ : పదిహేనేళ్లు దాటితే వాహనాలకు వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్లీ వాటిని ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కాలపరిమితి తీరిన వాహనాలు జిల్లావ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ సదరు వాహనాల యాజమానులు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిప్పుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాల పరిమితి పెంచుకునేందుకు ఫీజులు కట్టకపోవడంతో జిల్లా రవాణా శాఖ ఆదాయానికి భారీ గండి పడుతోంది. 15 ఏళ్లు దాటితే జరిమానా చెల్లించాల్సిందే.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా జూలై 31 వరకు కార్లు, బైక్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జీపులు, కంప్రెషర్ వాహనాలు, లారీలు, ఆటోలు తదితర వాహనాలు వ్యాలిడిటీ తీరినవి రవాణా శాఖ లెక్కల ప్రకారం 12 వేల వరకు ఉన్నాయి. కార్లకు సంబంధించి 15 ఏళ్లు దాటిన తర్వాత మరో ఐదేళ్లు వ్యాలిడిటీ పొడిగించుకోవడానికి గ్రీన్ ట్యాక్స్ రూ.5వేలు, రిజిస్ట్రేషన్ రూ.5435 మొత్తం రూ.10 వేల పైనే అవుతుంది. ద్విచక్ర వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ రూ.వేయి, ఫీజు రూ.2435 మొత్తం రూ.3445 చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ రీ వ్యాలిడిటీ చేసుకోవడానికి జాప్యం చేస్తే నెలనెలా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవకాశం కల్పించినా..వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకపోవడంతో అటు ప్రమాదకర ప్రయాణాలతోపాటు సదరు వాహనాలు వెదజల్లే కాలుష్యంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు గడువు పొడిగింపే లేదు. వాటిని తుక్కు కింద విక్రయిస్తారు. ఇక్కడ కాల పరిమితి పెంచుకునే అవకాశం కల్పించినా వాహనదారులు శ్రద్ధ చూపడం లేదు. న్యూస్రీల్జిల్లాలో 2024 జూలై 31 వరకు వ్యాలిడిటీ పూర్తయిన వాహనాలు ద్విచక్ర వాహనాలు 6700కార్లు 2340మిగతా వాహనాలు 2960మొత్తం వాహనాలు 12000 -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని మంత్రి క్యాంప్ కార్యాలయ అధికారి కె.వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి రోడ్డుమార్గం ద్వారా హుజూర్నగర్కు బయలుదేరుతారు. మధ్యాహ్నం హుజూర్నగర్ పట్టణంలో శ్రీ విజయ హాస్పిటల్, శ్వేత హాస్పిటల్, అను శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చౌటపల్లిలో శ్రీ వేణుగోపాలస్వామి మందిర రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన, 7: 30 గంటలకు రఘునాథపాలెం పీఏసీఎస్ గోడౌన్కు మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. మాజీ కో ఆప్షన్ సభ్యుడు మౌలానా మృతిచెందడంతో రాత్రి 8:00 గంటలకు కిష్టాపురంలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి ఉత్తమ్ పరామర్శిస్తారని పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారానికే నూతన రెవెన్యూ చట్టం
భానుపురి (సూర్యాపేట) : భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయులు, నిపుణులతో ఆర్ఓఆర్ చట్టం ముసాదాయి బిల్లుపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు అందించాలని కోరారు. నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను, మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్షాప్లు నిర్వహించాలని ఆదేశించిందని అన్నారు. నూతన రెవెన్యూ చట్టం–2024 బిల్లు అంశాలు, తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. చట్టం మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, ప్రతి సంవత్సరం పహానీలో నూతన పేర్లు నమోదు చేయాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, కపొజిషన్ కాలం ఉండాలని సూచించారు. గ్రామాలవారీగా ఉన్న సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని, దానిని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్తో రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసివేయాలని కోరారు. ఈ సమావేశానికి రానివారు నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ror2024&rev@telan gana.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ సభ్యులు సోమేశ్, తహసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, రిటైర్డ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పహాణీలు విడుదల చేయాలి పాత పద్ధతిలోనే ప్రతి సంవత్సరం పహాణీలను విడుదల చేయాలి. శిస్తు అమలు చేయకపోవడంతో రైతు ఎవరో తెలియడం లేదు. పాత రికార్డులను పునరుద్ధరించి ధరణి పోర్టర్ను సవరించి అమలు చేయాలి. –సామ వెంకట్రెడ్డి, మోతె తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలి గతంలో మాదిరిగానే 16 రకాల రికార్డులను నమోదు చేయాలి. పహాణీలను ప్రతి సంవత్సరం విడుదల చేయాలి. కాస్తు కాలం, కబ్జాకాలం ఉండాలి. రెవెన్యూ కోర్టులను అమలుపరచాలి. తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలి. –ఎల్.భద్రయ్య రిటైర్డ్ తహసీల్దార్ కాస్తు కాలం ఉండాలి ధరణి పోర్టర్లో కాస్తు కాలం, కబ్జాకాలం లేకపోవడంతో ఇష్టానుసారంగా పట్టాలు జరుగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టంలో కాస్తూ కాలం తప్పనిసరి చేయాలి. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో భూ రికార్డుల వివరాలు నోటీస్ బోర్డుపై ఉంచాలి. –కాకి కృపాకర్రెడ్డి, ఆత్మకూర్ (ఎస్) భూముల సర్వే చేయాలి ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకురావాలంటే ముందుగా భూముల సర్వే చేయాలి. రికార్డులు సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పాస్పుస్తకాల్లో ఉన్న సర్వే నంబర్కు, రైతు కబ్జాలో ఉన్న సర్వే నంబర్లకు పొంతన లేదు. –నంద్యాల కృష్ణారెడ్డి, నంద్యాలవారిగూడెంఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం దాడులు
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మండల కేంద్రంలో గురువారం టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు, టమాటలతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. అసలేమైందంటే.. ఎలాంటిషరతులు లేకుండా అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ నేతృత్వంలో తిరుమలగిరి ఎక్స్రోడ్డులోని మోత్కూరువెళ్లే మార్గంలో టెంట్వేసి ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు పోటీగానే కాంగ్రెస్ శ్రేణులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని చేసినందుకు హర్షిస్తూ ఎక్స్రోడ్డులోని మహాత్మా జోతిబాఫూలే విగ్రహం వద్ద సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ సమయంలో ధర్నాలో గాదరి కిషోర్ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వలకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. అదేసమయంలో శిబిరంలోఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శిబిరంపైకి వెళ్లడానికి మూకుమ్మడిగా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తప్పించుకొని బీఆర్ఎస్ శిబిరంపైకి వెళ్లారు. ఈ దశలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం కోడిగుడ్లు, రాళ్లు, టమాటలు, టపాసులు విసురుకున్నారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. చౌరస్తాలో అరగంటపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన ఆరుగురికి స్పల్పగాయాలయ్యాయి. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పరిశ్రమల ఏర్పాటుకు సహకారమందిస్తా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందజేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చెప్పారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల స్థాపనకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి తక్షణమే మంజూరు చేయాలన్నారు. సంబంధిత శాఖలు ఎవరి పరిధిలోని అనుమతులు వారు సకాలంలో ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన టీ ప్రైడ్ పథకం కింద 67 యూనిట్లు మంజూరు చేస్తూ కమిటీ తీర్మానం చేసిందని, టీఎస్ ఐపాస్ కింద 8 యూనిట్లకు గాను 19 అప్రూవల్స్పై కమిటీతో చర్చించినట్లు తెలిపారు. ఐటీ హబ్పై రెండు రోజుల్లో పూర్తి వివరాలు అందించాలని టీజీఐఐసీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగరాజును కలెక్టర్ ఆదేశించారు. ఆటోనగర్కు సంబంధించిన పూర్తి నివేదికను శుక్రవారం సాయంత్రం వరకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ మేనేజర్ టి. సీతారాం, ఎల్డీఎం బాపూజీ, సీపీఓ కిషన్, ఫైర్ ఆఫీసర్ జానయ్య, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎ. ఆదిత్య, ఇతర అధికారులు యాదగిరి, మాధవి, బాలు, శంకర్, పి. వెంకటేశ్వర్లు, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు
సూర్యాపేట టౌన్: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్వారు చూస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ వారు దానిని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారని విమర్శించారు.తిరుమలగిరి ఘటనపై విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వై.వి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, భిక్షం, సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్, పుట్టా కిషోర్, తాహేర్, ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు. తిరుమలగిరికి వెళ్లొద్దంటూ.. అర్వపల్లి: తిరుమలగిరిలో గురువారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన మాజీ మంత్రి జగదీష్రెడ్డి .. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ తదితరులతో కలిసి సూర్యాపేట నుంచి తిరుమలగిరికి బయలు దేరారు. కాగా సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు అడివెంల సమీపంలో జగదీష్రెడ్డి వాహనాలను నిలిపివేశారు. తిరుమలగిరిలో ఘర్షణ వాతావరణం నెలకొన్నందున అక్కడికి వెళ్లవద్దని మాజీ ఎమ్మెల్యే కిశోర్ను తామె సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ వరకు తీసుకొస్తామని డీఎస్పీ రవి జగదీష్రెడ్డికి తెలియజేశారు. తాను ఘర్షణలకు పోవడం లేదని కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ శ్రేణులను పరామర్శించడానికి వెళుతున్నానని జగదీష్రెడ్డి సమాధానం చెప్పారు. కొద్ది సేపు వాగ్వాదం జరిగాక చివరికి పోలీసులు బందోబస్తు మధ్య జగదీష్రెడ్డిని తిరుమలగిరిలోని కిశోర్ క్యాంప్ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రైతు ధర్నా ఉద్రిక్తత
పోటాపోటీ కార్యక్రమాలతోరుణమాఫీపై తిరుమలగిరి, ఆలేరులో బీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుమలగిరిలో బీఆర్ఎస్కు కౌంటర్గా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, ఆ తరువాత బీఆర్ఎస్ ధర్నా శిబిరం వద్దకు వెళ్లడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఇక ఆలేరుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్రావు.. రుణమాఫీపై సీఎం మాట తప్పారని యాదాద్రిలో పాప ప్రక్షాళన పూజ చేయించగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవస్థానం ఈఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు యాదాద్రిని అపవిత్రం చేశారంటూ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలయాన్ని శుద్ధి చేశారు. ఫ తిరుమలగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణ ఫ రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్న ఇరువర్గాలు ఫ పలువురికి స్వల్ప గాయాలు ఫ యాదాద్రిలో హరీష్రావు పాప ప్రక్షాళన ఫ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఈఓ ఫిర్యాదు ఫ ఆలయాన్ని శుద్ధి చేసిన బీర్ల అయిలయ్య -
పాపప్రక్షాళన పూజలు.. ఆలయ శుద్ధి
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొనడానికి హరీష్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆగస్టు15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారని స్వామి సమక్షంలో ప్రైవేట్ అర్చకుడితో ఆలయ మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజ చేయించారు. సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాట ప్రకారం గడువులోపు రూ,2 లక్షల రుణమాఫీ చేయకుండా మాటతప్పడం వల్లే యాదాద్రిలో పాప ప్రక్షాళన పూజ చేయించినట్లు హరీష్రావు పేర్కొన్నారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టమని, అందుకే ప్రజలకు పాపం కలగవద్దని, సీఎంను క్షమించాలని స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు. రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలను కాపాడేందుకు, రైతులకు రుణమాఫీ, పంటలకు బోనస్ ఇచ్చేవరకు తనకు పోరాడే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు చెప్పారు. -
దాడులకు భయపడం
తిరుమలగిరి (తుంగతుర్తి): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులకు భయపడేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరిలో జరిగిన ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో బీఆర్ఎస్ శిబిరంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. రుణమాఫీపై ఇచ్చిన హామీలను తప్పి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను మోసం చేసిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. మొన్న సిద్దిపేటలో హరీష్రావు ఇంటిపై ఇప్పుడు తిరుమలగిరిలో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్, యుగేందర్రావు, తిరుమలగిరి, నాగారం, తుంగతుర్తి మండల పార్టీల అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్రెడ్డి, ఉప్పలయ్య, తాటికొండ సీతయ్య, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, గుండగాని రాములు, చిప్పలపల్లి మహేందర్, ప్రవీణ్, బాబు, సందీప్నేత, దయాయాదవ్, నాని పాల్గొన్నారు. -
కత్తి వీరయ్య
కోదాడ రూరల్ ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదుకోదాడరూరల్ : మండల పరిధిలోని కూచిపూడిలో పలు కేసుల్లో రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన శెట్టి సురేష్తోపాటు మరికొందరు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అయ్యప్ప మాలధారులు నిర్మించుకున్న గోశాల కూల్చివేసిన వారిపై స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వారిపై కేసు నమోదు చేయకుండా తమనే సంబఽంధిత భూ పత్రాలు తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటుగా గ్రామానికి చెందిన మహిళను వేధించిన కేసులో సదురు వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఇద్దరిపై కేసు పెట్టాల్సి ఉంటుందని తమను బెదిరించారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో శెట్టి చంద్రయ్య, శెట్టి రమేష్, పలువురు గ్రామస్తులు ఉన్నారు. ఈ విషయంపై ఎస్ఐ అనిల్రెడ్డిని వివరణ కోరగా.. కూచిపూడి గ్రామంలో జరిగిన సంఘటనలో ఎవరిని ఇబ్బందులు పెట్టలేదన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులు నిర్వహిస్తున్న తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాడు పశువుల కాపరి.. నేడు డాక్టరేట్మునగాల : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు విజయరాఘవపురంకు చెందిన ఓ యువకుడు. నాడు పశువుల కాపరిగా ఉన్న ఆ యువకుడు నేడు డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. వివరాలు.. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన కత్తి చంద్రయ్య–ముత్తమ్మ దంపతుల కుమారుడు కత్తి వీరయ్య బడికి వెళ్లే సమయంలో పదేళ్ల పాటు పశువుల కాపరిగా ఉంటూ తన అన్న ప్రోద్బలంతో మూడో తరగతిలో చేరాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు ఉద్యమాల్లో పాల్గొంటూ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ తర్వాత వివాహమైంది. కొన్నాళ్లు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తిరిగి తన చదువును ప్రారంభించిన వీరయ్య.. పీజీ పూర్తిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీ నుంచి ప్రొఫెసర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ‘అప్లికేషన్ ఆఫ్ జి.ఐ.ఎస్ అర్బన్ ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ సూర్యాపేట మున్సిపల్ ఏరియా’అనే అంశంపై ఇటీవల డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. -
భువనగిరి ఆస్పత్రిలో ప్రపంచ బ్యాంకు బృందం
భువనగిరి : గ్లోబల్ ప్రాక్టీస్ ఫర్ హెల్త్, న్యూట్రిషన్ పాపులేషన్, సౌత్ ఏషియా ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను సందర్శించింది. డయాగ్నోస్టిక్ సెంటర్లోని పరికరాలు, వైద్య పరీక్షలు చేసే యంత్రాలు, పీహెచ్సీల నుంచి వస్తున్న రక్త నమూనాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, రక్త పరీక్షల రిపోర్టు రోగులకు చేరే విధానంపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల వైద్యులతో మాట్లాడారు. ఫ రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా ఫ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరికరాల పరిశీలన -
పర్యాటకులను ఆకర్షించేలా ‘సాగర్’ అభివృద్ధి
నాగార్జునసాగర్: బుద్ధవనంతోపాటు నాగార్జునసాగర్ జలాశయ తీరంలో ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. టూరిజం మాజీ సీఎండీ, మార్గదర్శకులు(మెంటర్)చెన్నూరి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో టూరిజం, యువజన సర్వీసులు, సాంస్కృతిక, రాష్ట్ర పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ ఈలా త్రిపాటి, బుద్ధవనం కన్సల్టెంట్, చారిత్రక పరిశోధకుడు ఈమని నాగిరెడ్డి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నారాయణ, నాగరాజు, తెలంగాణ టూరిజం చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ, టూరిజం హోటల్స్ జనరల్ మేనేజర్ నాదన్, టూరిజం వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ ఇబ్రాహీం, బుద్ధవనం ఓఎస్డీ సుదన్రెడ్డి, ఎఫ్డీఓ సంగీతలతో కలిసి లాంచీలో జలాశయం మధ్యలో 415 ఎకరాల్లో ఉన్న చాకలిగట్టుకు వెళ్లారు. ఐలాండ్గా ఉన్న దీనిపై అటవీశాఖతో కలిపి ఏకోటూరిజం అభివృద్ధికి గల అవకాశాలపై చర్చించారు. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్, రిసార్ట్స్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు వారు తెలిపారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి త్వరలో సర్వే నిర్వహించి, రెండు శాఖల సమన్వయంతో పర్యాటకంగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏలేశ్వరంపై ఉన్న శివాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలు తయారు చేసేందుకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం బుద్ధవనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బుద్ధవనంపై ఈమని నాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధవనంలో ధ్యానవనం కాంపోనెట్స్, మిగిలిపోయిన పనులు చేసేందుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలిపారు. బుద్ధవనాన్ని త్వరలోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వీరి వెంట బుద్ధవన డిజైనర్ శ్యాంసుందర్రావు, ఏఈ నజీష్, విజయవిహార్ మేనేజర్ కిరణ్కుమార్, లాంచీ యూనిట్ మేనేజర్ హరి ఉన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి నాగార్జునసాగర్లో పలు ప్రదేశాల పరిశీలన చాకలిగట్టు, ఏలేశ్వరం ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు -
బత్తాయి తోటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
గుర్రంపోడు : తిరుపతి యూనివర్సిటీ అందించిన అంటు మొక్కలు నాటిన తోటల్లో నాణ్యతాలోపాలు పరిశీలించేందుకు నాగ్పూర్ శాస్త్రవేత్తల బృందం గురువారం గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో గల బత్తాయి తోటలను పరిశీలించారు. తిరుపతి యూనివర్సిటీ రంగాపూర్ బత్తాయి అంటు మొక్కల్లో నాణ్యత లోపించి నష్టపోయామని పలువురు రైతులు ఇటీవల ఉద్యానవన కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగపూర్ శాస్త్రవేత్తల బృందం మూడు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాధిత రైతుల తోటలను పరిశీలించి వివరాలు సేకరించింది. బత్తాయి కాయ సైజు తగ్గిపోవడంతోపాటు, క్షీణించిపోవడం, పక్వానికి రాకముందే రాలిపోతున్నాయని రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు. అంటు మొక్కల నాణ్యతను డీఎన్ఏ పరీక్షల ద్వారా తేల్చాలని శాస్త్రవేత్తలను కోరారు. రైతులు సాగు చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కొత్తగా కొన్ని రకాల బ్యాక్టీరియాల ద్వారా తెగుళ్లు సోకుతున్నట్లు గుర్తించామన్నారు. యూనివర్సిటీ ల్యాబ్లలో పరిశీలించి నివారణ మందులు సూచిస్తామన్నారు. బత్తాయి మొక్కల ఆకులు, కాయలు, మట్టిని శాస్త్రవేత్తలు సేకరించారు. నాగ్పూర్ యూనివర్సిటీలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత లోపాల కారణాలను నిర్దారించి ప్రభుత్వానికి నివేదించడంతోపాటు రైతులకు సరైన దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ఉద్యానవన శాస్త్రవేత్తలు డాక్టర్ దర్సన్ కడెం, నరేష్, తిరుగునాన్నావెల్, కిరణ్కుమార్, వెంకట్, రమేష్, సురేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ బాబు, జిల్లా ఉద్యానవన అధికారి సాయిబాబా, హాలియా, నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారులు మురళి, అనంతరెడ్డి, రైతులు గుర్రం శ్రీనివాస్రెడ్డి, వేణు, రఘుమోహన్రెడ్డి, కేసాని అనంతరెడ్డి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.