breaking news
Suryapet District News
-
ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఓటర్ల జాబితాపై వెల్లువెత్తిన అభ్యంతరాలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 1వ తేదీన మున్సిపాలిటీ వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయి జాబితాలపై ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఓటు హక్కు పక్క వార్డులో ఉందని, తాము ఉంటున్న వార్డుకు మార్చాలని, ఇంటి నంబర్లు మార్చాలంటూ అభ్యంతరాలు పలువురు వ్యక్తం చేశారు. అయితే అందులో కొన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, పరిష్కరించారు. మరికొన్నింటిని మాత్రం తిరస్కరించారు. ఇలా జిల్లాలో ఐదు వందలకు పైగా అభ్యంతరాలు తిరస్కారానికి గురయ్యాయి. ఇక, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కల తేలింది. 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,68,437 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో పురుషులు 3,23,647 మంది, మహిళలు 3,44,661 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 129 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను, 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 16న ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకటించారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అలాగే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఫొటోలో కూడిన జాబితాల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసేందుకు మూడు రోజుల సమయం ఇ చ్చారు. వాటన్నింటిని సరిచేసి, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అధికారులు మున్సిపాలిటీ వార్డుల వారిగా ప్రచురించనున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దం కావడంతో ఎన్నికల సంఘం ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనుంది. ఆ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోనే షెడ్యూల్ రావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ మొత్తం నల్లగొండ 68874 73507 56 142437 మిర్యాలగూడ 45128 47878 14 93020 దేవరకొండ 11629 12200 1 23830 హాలియా 6270 6529 2 12801 నందికొండ 6475 7027 1 13503 చండూరు 5652 5717 1 11370 చిట్యాల 5930 6188 1 12118 సూర్యాపేట 52170 56664 14 108848 కోదాడ 28069 30520 12 58601 హుజూర్నగర్ 14257 15731 8 29996 నేరేడుచర్ల 6629 7116 1 13746 తిరుమలగిరి 7638 7817 0 15455 భువనగిరి 23037 24793 1 47831 చౌటుప్పల్ 13553 13663 0 27216 యాదగిరిగుట్ట 6760 7046 16 13822 పోచంపల్లి 7799 8028 0 15827 మోత్కూర్ 7106 7277 0 14383 ఆలేరు 6671 6960 1 13632 మొత్తం 323647 344661 129 668437 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నల్లగొండలోని మున్సిపాలిటీల పరిధిలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో నకిరేకల్ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో 3,09,080 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,49,958 మంది పురుషులు, 1,59,046 మంది మహిళలు, 76 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఫ 18 మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా ప్రకటన ఫ ఉమ్మడి జిల్లాలో 6,68,437 మంది మున్సిపల్ ఓటర్లు ఫ నేడు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ఫ 16వ తేదీన ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితా ప్రదర్శన -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : పోటీ పరీక్షలకు సూర్యాపేటలోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏదేని డిగ్రీ ఉతీర్ణులైన ఉండాలని, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ భాస్కర్ను నేరుగా లేదా 8555814776, 9704752077 నంబర్లను సంప్రదించాలన్నారు.వయోవృద్ధులకు ‘ప్రణామ్ డే కేర్ సెంటర్’ సూర్యాపేట : వృద్ధుల కోసం సూర్యాపేటలోని ఇందిరా హాస్పిటల్ వెనుకాల ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రణామ్ డే కేర్ సెంటర్’ను సోమవారం జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోభారంతో ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారికి కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వివిధ రకాల ఇండోర్ గేమ్స్, దినపత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, వీటిని సద్వినియోగం చేసుకొని మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ ఇరిగి కోటీశ్వరి, సంస్థ సభ్యులు గుండా రమేష్, తోట శ్యాంప్రసాద్, న్యాయవాదులు రమాదేవి, డాక్టర్ దుర్గాబాయి, జె.శశిధర్, సీనియర్ సిటిజన్లు హమీద్ఖాన్, జి. విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన పోక్సో కోర్టు పీపీచివ్వెంల(సూర్యాపేట) : పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా నియమితులైన కోణం రఘురామయ్య సోమవారం ఎస్పీ నరసింహను కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. పోక్సో కేసుల వివరాలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా కృషి చేద్దామన్నారు. ‘గృహజ్యోతి’తో విద్యుత్ బిల్లులు ఆదా కోదాడరూరల్ : గృహజ్యోతి పథకంతో విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ కామేష్ సూచించారు. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క జారీ చేసిన గ్రీటింగ్స్ను సోమవారం కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు కూడా గృహజ్యోతి పథకానికి ధరఖాస్తు చేసుకోవాలని, తద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కిందికి రాని లబ్ధిదారులు కూడా విద్యుత్ను పొదుపుగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్రెడ్డి, సర్పంచ్ మందుల నాగయ్య, ఏడీఈ వెంకన్న , రూరల్ ఏఈ ఎస్కే సైదా, ఉపసర్పంచ్ ఇర్ల జయంసింహారెడ్డి, ఇర్ల నరసింహారెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా పండుగ వచే్చస్తోంది
చిలుకూరు: పల్లెల్లో క్రీడా సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నెల 17నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సీజన్ –2 సీఎం కప్ –2025 పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యం. ‘రూరల్ టు గ్లోబల్’ నినాదంతో..గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చేందుకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రూరల్ టు గ్లోబల్ (గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ చాంపియన్స్) నినాదంతో క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఐదు దశల్లో క్రీడా పోటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో 29, రాష్ట్రస్థాయిలో 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్(బాల,బాలికలు) విభాగాలతో పాటు ఓపెన్ రిక్రియేషన్ గేమ్స్ (పిల్లలు, ఇతరులు)కు ప్రాతినిథ్యం ఉంటుంది. విజేతలకు నగదు బహుమతులుగ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి పంపుతారు. ఇక్కడ ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ రూ.75 వేలు, తృతీయ బహుమతి కింద రూ.50 వేల నగదు పోత్సాహకం అందజేస్తారు. వ్యక్తిగత క్రీడాంశాల్లో ప్రథమ రూ.20 వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10వేలు ఇస్తారు. 3,614 మంది నమోదుహెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సీఎం కప్పై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ పేర్లు https:///satg. telangana. gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుంటున్నా రు. జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 3,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ అంశాల్లో పోటీలు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సిమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కానోయింగ్– కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, పుట్బాల్, మల్లకంబ్, పారాగేమ్స్, రిక్రియేషన్ అంశాల్లో క్రీడా పోటీలు ఉంటాయి. 17 నుంచి సీఎం కప్ ఐదు స్థాయిలు, 44 అంశాల్లో పోటీలు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులుసీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాం. ఇప్పటి వరకు 3,614 దరఖాస్తులు వచ్చా యి. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. గ్రామీణ క్రీడాకారులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలి. –వెంకట్రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారిక్రీడా పోటీల షెడ్యూల్.. గ్రామస్థాయి : 17 నుంచి 22 మండలం : 28నుంచి 31 నియోజకవర్గం : ఫిబ్రవరి 3నుంచి 7 జిల్లా : 10 నుంచి 14 రాష్ట్రస్థాయి : 19 నుంచి 26 (హైదరాబాద్లో) -
రోడ్డు భద్రతపై ‘అరైవ్–ఎలైవ్’
సూర్యాపేటటౌన్ : రోడ్డు భద్రతపై అరైవ్ – ఎలైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్పీ నరసింహ తెలిపారు. రహదారి భద్రత నియమాలు, ప్రమాదాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డీజీపీ శిశధర్రెడ్డి ప్రారంభించిన ‘అరైవ్ – ఎలైవ్’ కార్యక్రమం పోస్టర్ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అరైవ్ –ఎలైవ్ ఉద్దేశం, లక్ష్యాలు ప్రతి పౌరుడికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, మండలాల పరిధిలో గ్రామల వారీగా రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని రహదారి హీరోగా గుర్తించి, వారికి నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు ఎస్పీ వెల్ల డించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, నా గారం సీఐ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. చైనా మాంజా అమ్మితే జైలుకే.. సూర్యాపేటటౌన్ : చైనా మాంజాలు విక్రయించినా, వినియోగించనా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది విస్త్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజా అమ్ముతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణజిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు అందజేసి సమస్య తెలియజేశారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లకు ఫోన్చేసి ఫిర్యాదుదారుల వివరాలు, సమస్యను తెలియజేసి విచారణకు ఆదేశించారు. ప్రతి కేసు పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి ఎస్పీ నరసింహ -
ఇంకెన్నాళ్లకు గృహయోగం..
కోదాడ: మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఉద్దేశపూర్వకంగానే పంపిణీ చేయడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో కలిసి సోమవారం కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 560 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేశామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు పొజిషన్ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. అధికారులు స్పందించి తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కోదాడ పట్టణ అద్యక్షుడు ఎస్.కె. నయీం, నాయకులు పి.సత్యబాబు, కర్ల సుందర్బాబు, అల్వాల వెంకట్, ఉపేందర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యధికంగా భూ సమస్యలపైనే..
భానుపురి (సూర్యాపేట) : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో వివిధ సమస్యలపై 47 అర్జీలు వచ్చాయి. వీటిలో 25 వరకు భూ సమస్యలకు సంబంధించినవి ఉండటం గమనార్హం. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా అధికారులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యనిచ్చి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఉద్యోగి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు.ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వైద్యసేవలు ఎలా ఉన్నాయి సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిని సోమవారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎస్పీ నరసింహతో కలిసి తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. మందుల స్టాక్ను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజవాణిలో 47 వినతులు -
సవరణలతో మరిన్ని ప్రయోజనాలు
సూర్యాపేట : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టంలో చేసిన మార్పుల వల్ల ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. ఉపాధిహామీ పథకం పేరు మార్పిడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆదివారం సూర్యాపేటలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఒంటెద్దు శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఉపాధిహామీ పథకం వేరే రూపంలో కొనసాగగా, ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా మార్పులు చేసి, వికసిత్ భారత్ గ్రామీణ ఆజీవిక మిషన్ గ్యారంటీగా అమలు చేస్తున్నామని తెలి పారు. అనంతరం ఒంటెద్దు శ్రీనివాస్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, దోసకాయల ఫణినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగాచారి, ఆకుల భిక్షమయ్య, కోశాధికారి తాళ్ల నరేందర్రెడ్డి, సెక్రటరీ శోభారెడ్డి, మేడబోయిన యాదగిగి, ఐటీ సెల్ కన్వీనర్ కర్ణాకర్, తుక్కాని మన్మథరెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, గజ్జల వెంకటరెడ్డి, రుక్మారావులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి -
ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతుంటారు. ఊరెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.. పోలీసులు. గత ఏడాది 360 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలు ఇవీ.. ● ఇంటి చిరునామా, ఫోన్న్ నంబర్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని ఇళ్లపై నిఘా ఉంచుతారు. ● కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. కెమెరాలను సెల్ఫోన్లను అనుసంధానం చేసుకోవాలి. ● పక్కింటివారికి సమాచారమివ్వాలి. ● విలువైన వస్తువులు ఇంటిలో ఉంచరాదు. విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత, ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. బంగారం, నగదు, విలువైన వవస్తువులు ఉంటే లాకర్ భద్రపరుచుకోవాలి. ● బీరువా తాళాలను తమతో పాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం కనబడకుండా డోర్ కర్టెన్న్ వేయాలి. ఇంట్లో లైటు వేసి ఉంచాలి. ● టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. హోం సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచైనా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ● స్థానిక పోలీస్స్టేషన్ నంబర్, పోలీస్ కంట్రోల్రూం నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ● అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఫ సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు ఫ గత ఏడాది 360 చోరీ కేసులు సమాచారమివ్వాల్సిన నంబర్లు 100, 87126 86026 -
సాఫీగా.. హ్యాపీగా
ఫ ఆంధ్రాకు సాఫీగా సాగుతున్న వాహనాల ప్రయాణం ఫ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు సూర్యాపేటటౌన్ : ట్రాఫిక్ జామ్లు, టోల్ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణ.. ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగుతోంది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు వాహనాలు రయ్.. రయ్మని వెళ్తున్నాయి. వేలకొద్ది వాహనాలు వెళ్తున్నప్పటికీ ఎక్కడా ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు ఆస్కారం ఉండకుండా డైవర్షన్, యూటర్న్లను మూసివేసి సూర్యాపేట మండలం మొదలుకొని కోదాడ మండలం వరకు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తూ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. బ్లాక్ స్పాట్లపై స్పెషల్ ఫోకస్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా పరిధిలో 24 బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు.. అక్కడ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సైన్బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు రాత్రివేళ తడబడకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో రేడియంతో కూడా తెలుపు రంగు వేశారు. ప్రత్యేక విద్యుత్ లైట్లు, సీసీ కెమెరాలు అమర్చారు. గుంతలు పడిన చోట మరమ్మతులు చేపట్టారు. స్పీడ్ కంట్రోల్ బోర్డులు, బారికేడ్లను తొలగించారు. సూర్యాపేట మండలం టేకుమట్ల జంక్షన్, పిల్లలమర్రి, జనగాం క్రాస్రోడ్డు, అంజనాపురి కాలనీ, అంబేద్కర్నగర్, జమ్మిగడ్డ క్రాస్రోడ్డు, ఎఫ్సీఐ గోదాం ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. కోదాడ పరిధిలో ఇలా..కోదాడరూరల్ : కోదాడ పరిధిలో కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వరకు 16 కిలో మీటర్ల మేర పోలీసు శాఖ, నేషనల్ హైవే ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జంక్షన్లు, క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొమరబండ వై జంక్షన్, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్న దృష్ట్యా సర్వీస్ రోడ్డు విశాలంగా ఉండే విధంగా అడ్డుగా ఉన్న మట్టికుప్పలు, పనులకు సంబంధించిన మెటీరియల్ తొలగించారు. రేడియం స్టిక్కర్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్ల పరి ధిలో ఉన్న వైజంక్షన్, రామాపురం క్రాస్ రోడ్డు వరకు 50 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. -
తెలంగాణ ప్రజలకు తొలి శత్రువు కాంగ్రెస్సే
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రజలకు తొలి శత్రువు కాంగ్రెస్సేనని.. రెండేళ్ల పాలనలో కబ్జాలు, బెదిరింపులు, అరాచకాలు, అక్రమ కేసులు పెరిగిపోయాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా? ప్రజలే తేల్చుకోవాలని, అందుకు సమయం అసన్నమైనదన్నారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు తెలంగాణ ఎట్లున్నది.. కాగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉన్నదో ప్రజలకు అర్థమవుతుందన్నారు. రెండేళ్లలో జనం విసిగిపోయారని.. మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టి, అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు కంకణబద్దులై ఉన్నారని పేర్కొన్నారు. సంక్రాతికి ముందే పట్టణాల్లో పండుగ వాతావరణం మొదలైని, కేసీఆర్ రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో కనబడుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒంటెద్దు నరసింహరెడ్డి, వై.వి.నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, అన్నపూర్ణ, పుట్ట కిషోర్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా ప్రజలే తేల్చుకోవాలి ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి -
యూరియా వాడకం డబుల్!
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతాంగం మోతాదుకు మించి యూరియా వాడుతోంది. వరి ఏపుగా రావడం లేదని చెప్పి కొందరు ఎకరానికి నాలుగు బస్తాల దాకా వాడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అంచనాలు తారుమారై కొరత ఏర్పడుతోంది. రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్ నుంచి సొసైటీల ద్వారా కార్డుల ద్వారా యూరియాను పంపిణీ చేస్తున్నా.. రైతుల్లో మార్పు రావడం లేదు. యాప్తోనైనా సమస్య తీరుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. వాడాల్సింది రెండు బస్తాలు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం 5,94,944 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 4,94,470 ఎకరాల్లో వరి వేశారు. జిల్లా పరిస్థితులు, భూముల తీరును బట్టి ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా వాడాల్సి ఉంది. అదీ కూడా రెండు లేదా మూడు విడతల్లో పంటకు ఇవ్వాలి. మొదటగా నాటు పెట్టిన 15 రోజులకు ఎకరానికి ఒక బస్తా, తిరిగి 45 రోజులకు చిరు పొట్టదశలో ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి అందించాలి. లేదంటే 45 రోజులకు ఒకేసారి బస్తా యూరియా ఇచ్చినా సరిపోతుంది. ఈ లెక్కన యూరియాను పంటకు అందిస్తే నత్రజని సకాలంలో సమృద్ధిగా అంది పంట పచ్చగా, ఏపుగా ఉంటుంది. యాప్ బుకింగ్ ద్వారా రెండు బస్తాలే పంపిణీ మోతాదుకు మించి యూరియా వాడడంతో అధికారుల అంచనాలు తారుమారు అవుతున్నాయి. యూరియా కొరత ఏర్పడి వానాకాలం రైతులు ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా పాస్ పుస్తకాలున్న రైతులకే ఇస్తున్నారు. అధికంగా యూరియా వాడే రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాపొంది.. తిరిగి పీఏసీఎస్ల వద్ద మళ్లీ తీసుకుంటున్నారు. ఇలా అధిక బస్తాలను పొంది వరి పంటకు అందిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యాప్ బుకింగ్ విధానం విజయవంతమైతే విచ్చలవిడిగా యూరియా వాడకానికి చెక్ పెట్టినట్లు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.వరి తొందరగా పచ్చపడాలని కొందరు రైతులు దమ్ములోనే ఎకరానికి అర బస్తా వరకు యూరియా చల్లుతున్నారు. తదనంతరం 15 రోజులకు రెండు బస్తాల లెక్కన వేస్తున్నారు. అయితే చలికాలంలో వరి అంతగా పెరగదు. అగ్గి తెగులుకూ అవకాశం ఉంటుంది. జింక్ లోపం తలెత్తుతోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నివారణ చర్యలు తీసుకోకుండానే వరి పైరు పెరగడం లేదని యూరియాను మోతాదుకు మించి వాడుతుంటారు. రెండోదఫాలోనూ ఇదే విధంగా ఎకరానికి రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. మోతాదుకు మించి వినియోగిస్తున్న రైతులు ఫ ఎకరానికి నాలుగు బస్తాలకు పైనే.. ఫ కార్డులు ఇచ్చినా అంతే.. ఫ యాప్ ద్వారా బుకింగ్ విధానంతోనైనా అడ్డుకట్ట పడేనా.. జిల్లాలో యూరియా కొరత లేదు. వరి పంటకు మోతా దుకు మించి యూరియా వాడొద్దు. ఇలా వాడితే రైతులే నష్టపోతారు. రానున్న రోజుల్లో భూమిసారం కోల్పోతుంది. పంటలకు చీడపీడలు ఆశించి దిగుబడి తగ్గుతుంది. పెట్టుబడులు పెరుగుతాయి. వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలి. –శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : 2026–27 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 5వ తరగతికి నూతన విద్యార్థులు, 6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 25 పాఠశాలల్లో బాలబాలికలు ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తు గడువు ఈనెల 21వ తేదీతో ముగియనుందని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు విద్యార్థులు దరఖాస్తులను tgcet.cgg. gov. in, tgswreis.telangana.gov.in, t gtw gurukulam.telangana.gov.in, వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. కులం, ఆదాయం, ఆధార్, బర్త్ సర్టిపికెట్, పాస్ ఫొటో దరఖాస్తుకు సమర్పించాల్సి ఉంటుంది. సూర్యక్షేత్రంలో వైభవంగా సౌరహోమం అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని దివ్యమనోహరంగా అలంకరించి అభిషేకం చేశారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. 25 నుంచి ఐద్వా మహాసభలు సూర్యాపేట అర్బన్ : అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)14వ జాతీయ మహాసభలు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరగనున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. ఆదివారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో మహా సభల వాల్ పోస్టర్ను ఐదా నాయకురాళ్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి జాతీయ మహా సభలు జరుగుతున్నాయని, మహిళలు లక్షలా దిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, నాయకురాళ్లు కోట సృజన, వీరబోయిన ఉపేంద్ర, రజియా, ఫాతిమా పాల్గొన్నారు. -
పండుగ పూట.. కూరల మంట
తిరుమలగిరి (తుంగతుర్తి) : కూరగాయల ధరలు తగ్గి నట్టే తగ్గి అమాంతం పెరిగాయి. ఇరవై రోజుల వ్యవధిలోనే 20 నుంచి 30 శాతం రేట్లు పెరిగాయి. తిరుమలగిరి మార్కెట్లో ప్రస్తుతం టమాట, ఆలుగడ్డ మినహా మిగతావన్నీ రూ.60 – 80 మధ్య పలుకుతున్నాయి.పెరిగిన ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగ్గిన దిగుమతి గతంలో తిరుమలగిరి పరిసర గ్రామాల్లో కూరగాయలు ఎక్కువగా పండించేవారు. వాటిని రైతులు తిరుమలగిరిలోని వారాంతపు సంత, దుకాణాలకు విక్రయించేవారు. కొంతకాలంగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్చి, టమాట కర్నూల్ నుంచి, ఇతర కూరగాయలు హైదరాబాద్ నుంచి వస్తుంటాయి. కొంతకాలంగా అక్కడి నుంచి కూడా దిగుమతి పడిపోయింది. ఇదే అదనుగా దళారులు రేట్లను పెంచడం స్థానికంగా ధరలపై ప్రభావం పడింది. దళారులు నుంచి కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు కొంత లాభం చూసుకొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. హోల్సేట్ మార్కెట్లో కాస్త తక్కువగా ఉన్నా.. రిటైల్, బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ధరలు పెంచిన కర్రీ పాయింట్లు గతంలో కూరలు ప్యాకెట్ ధర రూ.20 ఉంటే ఇప్పుడు చాలా చోట్ల రూ.30 చేశారు. కొన్ని చోట్ల ఇది రూ.40 కూడా అయింది. గతంలో రూ.15, 20కి లభించే సాంబారు ఇప్పుడు రూ.30కి చేరింది. ఉల్లి, టమాట, అల్లం, వెల్లుల్లి ధరలు బాగా పెరగడంతో పెంచక తప్పలేదని కర్రీ పాయింట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చి వసతి గృహాల్లో, అద్దెకు ఉంటున్న ఎంతో మందికి కర్రీ పాయింట్లే ఆధారం. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండటంతో జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు.ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ౖపైపెకి.. ఫ 20 రోజుల్లో 30 శాతం వరకు పెరుగుదల ఫ ఏది ముట్టుకున్నా కిలో రూ.60 నుంచి రూ.80 ఫ సామాన్య, మధ్య తరగతి ఆందోళన ధరలు ఇలా.. కూరగాయలు కిలో మిర్చి 60.00 టమాట 40.00 వంకాయ 40.00 కాకర 60.00 గోరు చిక్కుడు 60.00 బీరకాయ 60.00 క్యారెట్ 80.00 బీట్ రూట్ 80.00 20 రోజుల క్రితం కాకర ధర కిలో రూ.30 నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.60కి చేరింది. టమాట రూ.25 పలకగా రూ.40కి చేశారు. మిగతా కూరగాయలు కూడా కిలో రూ.60కి పైనే పలుకుతున్నాయి. ఆకుకూరలు సైతం సామన్యుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాలకుర, మెంతికూర, చుక్క కూర.. మూడు కట్టలు రూ.20కి విక్రయిస్తున్నారు. గతంలో రూ.500 తీసుకొని సంతకు వస్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవని, పెరిగిన ధరల వల్ల అందులో సగమే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నట్లు విని యోగదారులు వాపోతున్నారు. -
క్షేమంగా.. గమ్యం చేరు
అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన నంబర్లు 100, 8712686057, 8712686026 సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి. వాహనదారులు అతివేగం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయొద్దు. విధిగా జాగ్రత్తలు పాటించాలి.. అని ఎస్పీ నరసింహ సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు. వాహనాలు కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. చలి ప్రభావం, పొగమంచు ఉంటుంది. రాత్రి సమయంలో డ్రైవర్లకు అప్రమత్తత అవసరం. అత్యవసర సమయంలో నేషనల్ హైవే అధికారులను లేదా డయల్ 100కు ఫోన్ చేసి సహాయం పొందాలి. రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు. భారీ వాహనాలు ఒక క్రమంలో వెళ్లాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై విస్తరణ పనులు, మరమ్మతులు జరుగుతున్నాయి. అవసరమైన చోట డైవర్షన్లు ఏర్పాటు చేసి గమనిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటిని పాటిస్తూ వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవారు నార్కట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా వెళ్లాలి. రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లేవారు నకిరేకల్ వద్ద జాతీయ రహదారి వైపు తీసుకుని అర్వపల్లి, బంగ్లా, ఖమ్మం మీదుగా వెళ్లాలి. రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం వైపు వెల్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద నుంచి ఖమ్మం జాతీయ రహదారి వైపు మళ్లించాం. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి సూర్యాపేట పట్టణం మార్గంలోకి మళ్లించి సూర్యాపేట పట్టణం మీదుగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చు. జాతీయ రహదారిపై పోలీసు సిబ్బంది 24 గంటలు గస్తీ నిర్వహిస్తారు. సీఐల పర్యవేక్షణలో నిరంతరం పెట్రోలింగ్ ఉంటుంది. రహదారి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లినా, రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపినా కేసులు నమోదు చేస్తాం. నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ నిరోధించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చేశాం. ఫ జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపవద్దు ఫ డైవర్షన్ బోర్డులను గమనించండి సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు ఎస్పీ నరసింహ సూచనలు జాతీయ రహదారి వెంట గల సూర్యాపేట రూరల్, చివ్వెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు రాంగ్రూట్లో వాహనాలపై వెళ్లడంతో పాటు పశువులను తీసుకెళ్తుంటారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. పండగకు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రహదారిపై పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నాం. ప్రధానంగా బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సంభవించకుండా స్థానిక ప్రజలను అప్రమత్తం చేశాం. బ్లాక్ స్పాట్లు గుర్తించిన ప్రాంతాల్లో వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
అల్పాహారం 16 రోజులే..
సూర్యాపేటటౌన్ : పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందజేసేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు సాయంత్రం సమయంలో అల్పాహారం అందజేయనుంది. ఇందుకోసం రూ.10,80,615 విడుదల చేసింది. 3,539 మందికి.. జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఇతర రెసిడెన్షియల్స్ కాకుండా ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత పాఠశాలలు 170 ఉన్నాయి. ఇందులో 3,539 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. కాగా ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ రెండు విడతల కార్యాచరణ రూపొందించింది. మొదటి విడతలో భాగంగా అక్టోబర్ నెల నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ క్లాస్లతో పాటు ప్రతి రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15గంటల వరకు గంట పాటు డిసెంబర్ వరకు ఒక పూట ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం రెండో విడత కింద 52 రోజుల ప్రణాళిక తయారు చేసి ఈ నెల 1నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చే విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపులతో, సాయంత్రం ఆకలితో హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. స్నాక్స్ అందించాలని డిసెంబర్ నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ అందిస్తున్నారు. పరిమిత రోజులకే.. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది 38 రోజులకు అల్పాహారం అందించగా ఈ ఏడాది సగానికి కుదించారు. సుమారు నెల తర్వాత అల్పాహారం అమల్లోకి రానుంది. ఈ నెల రోజులు అర్ధాకలితోనే విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటి నుంచే అల్పాహారం అందిస్తే బాగుండేదని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,539 మంది టెన్త్ విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రూ.15 చొప్పున రూ.10,80,615 విడుదలయ్యాయి. ఈ నిధులతో పోషక విలువలతో కూడిన చిరుతిళ్లను విద్యార్థులకు అందించనున్నారు. ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకో రకం చొప్పున అందించనున్నారు. ఫ టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఫ రూ.10,80,615 విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ ఫ గత సంవత్సరంతో పోలిస్తే సగం రోజులకు తగ్గింపు టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు అల్పాహారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. 3,539 మంది విద్యార్థులకు రూ. 10,80,615 విడుదలయ్యాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలి. –అశోక్, డీఈఓ -
గాంధీ పేరు తొలగింపు అన్యాయం
భానుపురి (సూర్యాపేట) : మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం అన్యాయమని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. సూర్యాపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత గాంధీ పేరును తొలగించి, రాంజీ పేరు పెట్టడం.. ఉపాధిహామీ పథకం ఉద్దేశాన్ని దెబ్బ తీయడమేనన్నారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగా చేతినిండా పనికల్పించి వలసలను అరికట్టేందుకు అప్పటి యూపీఏ సర్కార్ ఉపాధిహామీ పథకాన్ని తీసుకురాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలని మార్పులు చేయడం వల్ల పథకం రాష్ట్రాలకు భారంగా మారి, రద్దు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అంజలి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ఎస్సీ సెల్ విభాగం వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు, అక్కినపల్లి జానయ్య, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్గౌడ్, ధారవత్ రాగునాయక్, శబరి తదితరులు పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 11 నుంచి (నేడు) 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు డీఐఈఓ బానునాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కాలేజీలు నడపవద్దని, ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. సూర్యక్షేత్రాన్ని సందర్శించిన రిటైర్డ్ ఎస్పీ అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రాన్ని శనివారం రిటైర్డ్ ఎస్పీ రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు సన్మానించారు. రాజేంద్రప్రసాద్ గతంలో సూర్యాపేట జిల్లా ఎస్పీగా పని చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు రజితజనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివా రం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. మూలవిరాట్కు పంచామృతాబిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని వధూవరులుగా దివ్యమనోహరంగా అలంకరించి ఎదుర్కోళ్లు నిర్వహించి, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణతంతు పూర్తి చేశారు. కల్యాణమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గోదాదేవికి ప్రత్యేక పూజలు ధనుర్మాసం సందర్భంగా మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుప్పావై సేవాకాలం, పాశురాలు, పారాయణాలు తదితర కైంకకర్యాలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మ ట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. గోదావరి జలాల పెంపు అర్వపల్లి : శ్రీరాంసాగర్ రెండోదశ పరిధిలో జిల్లాకు గోదావరి జలాలను పెంచారు. 1000 క్యూసెక్కుల నీళ్లు వదలగా శనివారం 1,510 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69,70,71 డీబీఎంలకు పంపిణీ చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. గుట్టలో నిరాటోత్సవాలు యాదగిరిగుట్ట : యాదగిరీశుడి క్షేత్రంలో నిరా టోత్సవాలకు అర్చకులు శనివారం శ్రీకారం చుట్టారు. ఉదయం గోదాదేవిని అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీరంగనాథుడిని కొలుస్తూ పాశురాలు పఠించారు. మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాత్రి గోదాదేవి అమ్మవారి కల్యాణం ఉంటుందని అర్చకులు తెలిపారు. -
మహిళా సమాఖ్యలకు భవనాలు
భానుపురి (సూర్యాపేట) : స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఊరూరా పక్కా భవనాలు నిర్మించాలని సంకల్పించిన ప్రభుత్వం.. తొలి విడతలో 175 భవనాలు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. 579 గ్రామ సమాఖ్యలు జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 16,809 స్వయం సహాయక సంఘాలు, 579 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. మొత్తం 1,69,976 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పొదుపు చేస్తూ, రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అయితే సమావేశాల నిర్వహణకు సొంత భవనాలు లేక సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గ్రామంలో శాశ్వత భవనం అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు మొదలయ్యాయి. స్థలాల గుర్తింపు కూడా పూర్తవడంతో గ్రామ సభల్లో పంచాయతీలు తీర్మానం చేయాల్సి ఉంది. తీర్మానాన్ని ఎంపీడీఓకు అందిస్తే, అక్కడి నుంచి జిల్లా గ్రామాభివృద్ధి అధికారికి, తర్వాత కలెక్టర్కు చేరుతుంది. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు మహిళా సమాఖ్య భవనాలను మహాత్మాగాంధీ ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు పోగా, మిగతావి కూలీలతో పనులు చేయించనున్నారు. భవనాన్ని 200 చదరపు గజాల్లో నిర్మించనున్నారు. 500 చదరపు అడుగుల్లో పెద్ద హాల్ ఉండనుంది. ఈ హాల్లో సమావేశాలు, శిక్షణలు జరిగేలా అనువుగా ఉండనుంది. అలాగే టాయిలెట్ నిర్మించనున్నారు. సంకాంత్రి పండుగ తర్వాత అనుమతులు వచ్చిన భవనాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.మంజూరైన భవనాలు ఇలా..తొలి విడతలో 175 మంజూరు ఫ ఉపాధిహామీ నిధులతో నిర్మాణం ఫ సంక్రాంతి తరువాత పనులు ప్రారంభం మండలం భవనాలు అనంతగిరి 05 గరిడేపల్లి 20 హుజూర్నగర్ 03 కోదాడ 06 మేళ్లచెర్వు 06 ఆత్మకూర్ (ఎస్) 22 చివ్వెంల 14 పెన్పహాడ్ 28 సూర్యాపేట 18 జాజిరెడ్డిగూడెం 08 మద్దిరాల 05 నాగారం 08 నూతనకల్ 14 తిరుమలగిరి 13 తుంగతుర్తి 05 -
ఇళ్ల మధ్యనే మురుగు
స్నేహనగర్ కాలనీలో అంతర్గత రోడ్లు లేవు. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్లన్నీ తవ్వి, తిరిగి పూడ్చకపోవడంతో కాలనీవాసులు నరకం చూస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లోకి మురుగు నీరు చేరి కుంటలను తలపిస్తోంది. జమ్మి పుట్టి దోమలు, విష పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇక మిషన్ భగీరథ పైప్లైన్లు వేసినా కొన్ని చోట్ల నల్లాలు బిగించలేదు. కొత్తగా మళ్లీ పనులు చేపడుతున్నారు. డ్రెయినేజీలు ఉన్న చోట నిర్వహణ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తాచెదారం చేరి పూడుకుపోయాయి. వీధి దీపాలు కూడా సరిగా లేవని, ఉన్న చోట వెలగడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శివారు ప్రాంతాల్లో అధ్వానం
తిరుమలగిరి( తుంగతుర్తి) : తిరుమలగిరి నుంచి నందపురం, నందపురం నుంచి అనంతారం వెళ్లే రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా మారింది. రోడ్డుపై కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు కోటి లింగాల కాలనీ, బీసీ కాలనీ, సుందరయ్య నగర్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా నెలకొంది. సీసీ రోడ్లు లేకపోవడంతో వానాకాలం బరదగా మారి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంటుంది. ఇక శివారు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణం చేయాలంటేను చుక్కలు కనిపిస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని అధికారులు చెబుతున్నారే తప్ప.. పనులు మాత్రం ప్రారంభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. -
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆగమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అర్థమైందని, అందుకే అడ్డూఅదుపు లేని పాలన సాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టడం లేదన్నారు. సాగునీరే కాదు.. తాగు నీరు కూడా సక్కగ ఇస్తలేరని విమర్శించారు. పెంచుతామన్నా పింఛన్లు ఇంకా ఎన్నడు పెంచి ఇస్తారని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కేసీఆర్ పెట్టిన రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తరని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినయని ప్రశ్నించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని, కాంగ్రెసోళ్లు ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలన్నారు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఎవ్వరూ అధైర్య పడవద్దని, ఐక్యతతో విజయాలు సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి -
కోదాడను అగ్రగామిగా నిలుపుతా
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ: అభివృద్ధిలో కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కోదాడలో నిర్మాణంలో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్హౌస్, కోర్టుల సముదాయం, నీటిపారుదలశాఖ కార్యాలయ భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. శాంతినగర్, రెడ్లకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తయితే నియోజకవర్గంలో కాల్వ చివరి భూములు వేలాది ఎకరాలకు నీరు అందుతుందన్నారు. వంద పడకల వైద్యశాల భవనం పనులు కూడా త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 100 శాతం ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వేనేపల్లి చందర్రావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవేటి రామారావు, గాలి శ్రీనివాస్, చింతలపాటి శ్రీనివాస్, ఈదుల కృష్ణయ్య, ఉయ్యాల నర్సయ్య, మేకల వెంకట్రావ్, కేఎల్ఎన్ ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే సీసీ రోడ్లు
కోదాడ: మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్న సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడంతో మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు మిషన్ భగీరథ పేరుతో సీసీ రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా వీటిని పూడ్చక పోవడంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. 35 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల నయానగర్వాసులు వినాయకచవితి చందా డబ్బులు మిగిలితే వాటితో రోడ్లపై గుంతలను పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ● మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాలకవర్గం లేకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో హడావుడిగా పట్టణంలో సీసీ రోడ్లు వేయించారు. నాణ్యత పాటించకపోవడం, ఇసుకకు బదులు డస్ట్ వాడడంతో కొద్దిరోజులకే పాడైపోయాయి. ఇంకా పలుచోట్ల సీసీ రోడ్లపై మళ్లీ సీసీ రోడ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వేసిన సీసీ రోడ్లు చెక్కు చెదరకుండా ఉండగా.. రెండు, మూడేళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయి. శివారు కాలనీలలో ఇప్పటికీ మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. ● కూడళ్ల వద్ద డ్రెయిన్లు ఉన్న ప్రాంతాల్లో పద్ధతి ప్రకారం రోడ్లు నిర్మించకపోవడంతో గుంతలు పడి మురుగు నీరు బయటకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లకన్నా డ్రెయిన్లను ఎత్తులో నిర్మాణం చేయడంతో వర్షం వచ్చిన సమయంలో నీరు డ్రెయిన్లోకి వెళ్లకుండా రోడ్లపైకి వస్తుంది. దీంతో రహదారులు పాడైపోతున్నాయి. -
పరిశ్రమల నిర్వాహకులు సహకరించాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులు క్షేమంగా రాకపోకలు సాగించేందుకు పరిశ్రమల నిర్వాహకులు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల అధికారి సీతారాంనాయక్తో కలిసి సిమెంట్ కంపెనీలు, రైస్ మిల్లర్స్, లారీ ఓనర్స్ ప్రతినిధులతో వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పైనుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రజలు పెద్దసంఖ్యలో వెళ్తారని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు సాఫీగా వెళ్లేలా హైవేపై భారీ లోడ్ వాహనాల రాకపోకలను తగ్గించాల్సిందిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు నేటినుంచి ఈనెల 18వ తేదీ వరకు లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉండొద్దు : ఎస్పీకోదాడ రూరల్ : సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రజానీకం సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా జాతీయ రహదారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ వైజంక్షన్ వద్ద జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా సర్వీస్ రోడ్లు, క్రాసింగ్ల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐలు శివశంకర్, రామారావు, ఎస్ఐలు సుఽధీర్, గోపాల్రెడ్డి, అంజిరెడ్డి ఉన్నారు. -
నూరుశాతం ఫలితాలు సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ప్రతి ఎంఈఓ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అభ్యాసనన పుస్తకాలు అందించాలని, 2 ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పరీక్షప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేలు ఇవ్వాలని ఎంఈఓలకు స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ ఆశోక్, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి దయానంద రాణి, కోఆర్డినేటర్లు రాంబాబు, జనార్దన్ పాల్గొన్నారు. లైసెన్స్ తప్పనిసరి చివ్వెంల(సూర్యాపేట) : లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని సూర్యాపేట జిలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. రాంగ్ రూట్లో వెళ్లరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాల పోస్టర్ను ఆటోపై స్వయంగా అతికించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయ ప్రకాశ్రెడ్డి, టౌన్ సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు. జాతీయ సైన్స్ ప్రదర్శనకు ఎంపిక చివ్వెంల(సూర్యాపేట) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సైన్స్ ఫెస్ట్–2025లో చివ్వెంల మండల పరిధిలోని ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ విద్యార్థి మెరిశాడు. విద్యార్థి కొల్లు మహిదర్ రూపొందించిన ‘స్మార్ట్ స్టీరింగ్ విత్ హెల్త్ అలర్ట్స్ టు రెడ్యూస్ ది అక్సిడెంట్’ ఉత్తమ ఎగ్జిబిట్గా నిలిచి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. విద్యార్థిని డీఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు. బాల్య వివాహాలు చేయడం నేరం చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల వల్ల తలెత్తే అనర్థాలపై వారికి అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని, సాధించేందుకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల విషయంలో సంబంధిత శాఖల అధి కారులు కఠినంగా వ్యవహరించాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, కె.ప్రియదర్శిని, ఎస్ఐ ఐలయ్య, హెచ్ఎం నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాలు వస్తున్నాయ్..
భానుపురి (సూర్యాపేట) :భానుపురి (సూర్యాపేట) : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యవసాయ పరికరాలు త్వరలోనే అందనున్నాయి. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. యాంత్రీకరణ పథకానికి జిల్లాలో 2,462 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రూ.4.47 కోట్లు మంజూరు చేసింది. సంక్రాంతి వరకు రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ వైపు సాగా లన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించేవారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకం నిలిచిపోయింది. దీంతో రైతులు సొంతంగానే వ్యవసాయంలో అవసరమైన వివిధ రకాల పనిముట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పరికరాల ధరలు అమాంతంగా పెరగడంతో వీటి కొనుగోలు రైతులకు భారంగా మారింది. అంతేకాకుండా వరి సాగులో ఆధునాతనమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఖర్చుతో కూడుకోవడంతో వీటి ని సమకూర్చుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. తద్వారా పెట్టుబడులు అధికమవుతున్నాయి. ఎన్నికల కోడ్తో నిలిచిన ప్రక్రియ నిలిచిన వ్యవసాయ సబ్సిడీ పరికరాలపై ఆశలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొదటి ఏడాదే వివిధ రకాల పనిముట్లను అందించాలని చూసినా.. పలు కారణాలతో అమలు సాధ్యపడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రూపొందించిన ఈ పథకానికి రూ.4.47 కోట్లు విడుదలయ్యాయి. తొమ్మిది నెలల క్రితం రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ 17లోగా పరికరాలు రైతులకు అందించాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్తో ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు సంక్రాంతి వరకు రైతులకు యంత్ర పరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో పంపిణీ చేస్తాం.ఇందుకోసం ప్రభుత్వం రూ.4.47 కోట్లు మంజూరు చేసింది. –శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిసంక్రాంతికి యాంత్రీకరణ పరికరాల పంపిణీకి సన్నాహాలు ఫ జిల్లాలో 2,462 దరఖాస్తులు ఫ రూ.4.47 కోట్లు విడుదల మంజూరైన పరికరాలు ఇవీ.. పరికరం యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో) బ్యాటరీ జమ్యానవల్ పంపులు 4,366 43.66 పవర్ నాప్సాక్ స్ప్రేయర్ అండ్ పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ 647 64.70 రోటేవేటర్ 195 97.50 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 46 13.80 కల్టివేటర్లు, ఇతర పరికరాలు 290 58.00 గట్లువేసే మిషన్ (పీటీఓ కానిది) 15 2.25 గట్లు వేసే మిషన్ (పీటీఓ) 20 30.00 పవర్ వీడర్ 25 8.75 బ్రష్ కట్టర్ 50 17.50 పవర్ టిల్లర్లు 33 33.00 మొక్కజొన్న షెల్లర్లు 20 20.00 స్ట్రా బేలర్లు 29 58.00 మొత్తం 5,736 447.16 గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద పెద్ద ట్రాక్టర్లు ఇచ్చేవారు. ఇవి పెద్ద రైతులకే ఉపయోగకరంగా ఉండేవి. చిన్న,సన్నకారు రైతులకు సైతం మేలు జరిగేలా యంత్రాలు ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగళ్లు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డికట్టలు కట్టే బేలార్ యంత్రాలు, రొటేవేటర్లు తదితర చిన్నచిన్న పరికరాలను సైతం అందించనుంది. జిల్లాకు వివిధ రకాల యూనిట్లు 5,736 మంజూరయ్యాయి. -
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల గురుకుల పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో సత్తా చాటారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆర్ట్ నేషనల్ లెవెవల్ కాంపిటీషన్ పోటీల్లో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల జోనల్ అధికారి విద్యారాణి చేతుల మీదుగా బహుమతులు స్వీకరించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించగా 12 కేటగిరీల్లో 16 అవార్డులు దక్కించుకున్నారు. అదే విధంగా పాఠశాలకు ఆర్ట్ ఆఫ్ ఇండియా గ్లోబల్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఆర్ట్ ఉపాధ్యాయుడు చింతల పాటి ప్రవీణ్కుమార్కు కళా తపస్వి అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, బి.రమేష్. జూనియర్ లెక్చరర్ యాదయ్య, పీడీ క్రిష్ణారెడ్డి, పీఈటీ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితం గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద పిలుపునిచ్చారు. గురువారం జాతీయ యువజన దినోత్సవం, డ్రగ్స్ ఫ్రి ఇండియా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని కలెక్టర్, ఎస్పీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు బంగారు భవిష్యత్ నిర్మించుకునేందుకు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మనసు, శరీరం, వ్యక్తిత్వం నిర్వీర్యం చెంది తప్పుడు మార్గాల్లో పయనించేలా ప్రేరేపిస్తాయన్నారు. డ్రగ్ ఫ్రి ఇండియా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థుల ప్రవర్తన గమనించండి : కలెక్టర్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిఘా ఉంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నారని, అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్య తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరమికొడదాం : ఎస్పీ డ్రగ్స్ మహమ్మారిని తరమికొడదామని ఎస్పీ నర్సింహ పిలుపునిచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సమాజం నుంచి కూకటి వేళ్లలతో తొలగించాలన్నారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో ఎస్పీ ప్రతిజ్ఞ చేపించారు. అలాగే ఫ్లెక్సీపై సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద విద్యార్థులచే బాల్య వి వా హాల వల్ల జరిగే అనర్థాలపై నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ చైతన్య పేర్కొన్నారు. గురువారం సూర్యాపేటలోని ఓ హోటల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం నిర్వాహకులు వినోద్, భవ్య తదితరులు పాల్గొన్నారు. గుట్ట మాజీ ప్రధానార్చకుడి సందర్శన అర్వపల్లి: అర్వపల్లిలోని ప్రసిద్ధ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను గురువారం రాత్రి యాదగిరిగుట్ట దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు ఎన్.లక్ష్మీనర్సింహాచార్యులు సందర్శించారు. జాజిరెడ్డిగూడెం దేవాలయంలో జరిగిన ధనుర్మాస వేడుకల్లో పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహాచార్యులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, స్థానిక అర్చకులు రాంబాబుఅయ్యంగార్, పవన్కుమార్, అనంద్ దీక్షితుల పాల్గొన్నారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణ తంతు పూర్తిచేశారు. అదే విధంగా శ్రీస్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ధనుర్మాసంను పురస్కరించుకుని గోదా దేవికి తిరుప్పావై సేవాకాలం, పాశురాలు, పారాయణాలు పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు. -
చైనా మాంజాలకు ఏదీ చెక్...
సూర్యాపేట టౌన్ : సంక్రాంతి పండుగ ప్రత్యేకతల్లో పతంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చిన్నలతో పాటు పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారానికి బదులు.. రసాయనాలతో తయారు చేసి చైనా దారాన్ని (మాంజా) ఉపయోగిస్తుంటారు. మాంజాపై నిషేధించినప్పటికీ కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ప్రమాదకర రసాయనాల వినియోగం చైనా మాంజాల్లో ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తుంటారు. గాజుపొడి, అల్యూమినియం ఆకై ్సడ్ కలుపుతారు. దారం తెగకుండా గట్టిగా ఉండేందుకు వివిధ రంగుల మిశ్రమంతో సింథటిక్ ఫైబర్ వినియోగిస్తున్నారు. మాంజా వల్ల మనుషులతో పాటు పశుపక్ష్యాధులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పతంగులను ఎగురవేస్తుండగా కొన్నిసార్లు తెగిపోయి చెట్లు, అపార్ట్మెంట్లకు చిక్కుకుని గాలికి వేలాడుతుంటాయి. ఆ మార్గంలో ద్విచక్ర వాహనదారులు వెళ్లినప్పుడు వారి మెడకు చిక్కుకొని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలున్నాయి. పక్షులు కూడా వాటికి చిక్కుకొని చనిపోతున్నాయి. అంతేకాకుండా మాంజా దారం నీరు, భూమిలో కరగదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2016లో చైనా మాంజా వాడకాన్ని నిషేధించింది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. సూర్యాపేట తదితర పట్టణాల్లో కొందరు వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో మాంజాలను ఉంచి విక్రయిస్తున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. యువకులు, చిన్నారులు గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా చైనా మాంజాపై నిషేధం ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు చైనా మంజా కొనియ్యొద్దు. సంక్రాంతి పండుగ వేళ జిల్లాలో చైనా మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష తప్పదు. చైనా మాంజా విక్రయం, వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచి రౌండ్స్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686057, 8712686026 నంబర్కు సమాచారం ఇవ్వాలి. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట పతంగులు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ శాఖ విడుదల చేసిన కార్టూన్లుఫ నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు ఫ సంక్రాంతి వేళ పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి ఫ మాంజాలతో పొంచి ఉన్న ముప్పు -
‘పేట’లో యూజీడీ కొన్ని ప్రాంతాల్లోనే..
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో పట్టణం మొత్తం అండర్గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మించాలన్న ప్రణాళిక ఉంది. కానీ, కొన్ని చోట్లనే నిర్మిస్తున్నారు. ఓపెన్ డ్రైనేజీలు శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మురుగు నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో నడవలేని పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాళాలు ఆక్రమణకు గురై చిన్నవిగా మారడంతో వర్షాకాలంలో నాలాల పొంగి ఆర్కే గార్డెన్, ఎస్వీ కాలేజీ వెనుక వైపు ఉన్న పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. అధికారులు తరచూ వెళ్లి చూడడమే తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదు. -
పత్తా లేని కాంట్రాక్టర్
నేరేడుచర్ల : మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డుల్లో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రెయిన్లు పూడిపోవడంతో మ్యాన్హోళ్ల నుంచి మురుగునీరు బయటకు వచ్చి రోడ్ల వెంట ప్రవహిస్తోంది. పద్మావతి వెంచర్ ఏర్పాటు చేసిన సమయంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో పైపులు జామ్ కావడంతో మురుగునీరు బయటకు వస్తుంది. వెంచర్లో నివాసం ఉంటున్న ప్రజల విజ్ఞప్తి మేరకు స్పెషల్ ఫండ్ నుంచి రూ.20లక్షలు మంజూరు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం లేదు. -
పండుగ ప్రయాణం సురక్షితం చేద్దాం
సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయినిగూడెం యూ టర్న్, 7స్టార్ హోటల్, పిల్లలమర్రి యూ టర్న్, జనగామ రోడ్డు, అంజనాపురి జంక్షన్, కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు చౌరస్తా, ఈనాడు ఆఫీస్ జంక్షన్, ఎఫ్సీఐ గోదాం జంక్షన్ వద్ద రోడ్డు భద్రత ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. హైదరాబాద్లో ఉంటున్న ప్రజానీకం సూర్యాపేట జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వెళ్తారని, ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. రోడ్డు వెడల్పు చేయడం, బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నందున వా హనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. కా ర్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ సీతారాములు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, ఎస్సైలు సాయిరాం, బాలునాయక్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి భానుపురి (సూర్యాపేట) : విద్యార్థులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అనీమియా తగ్గించేందుకు అవసరమైన సేవలు, పోషక పదార్థాలు అందించాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ వెంకటరమణ తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కోటి రత్నం, డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ -
చెత్తను కాలుస్తూ.. పొగ పెడుతూ!
హుజూర్నగర్ : హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో దాదాపు 30 వేల వరకు జనాభా ఉంది. పట్టణంలో చెత్త సేకరణ రోజువిడిచి రోజు సుమారు 28 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా పట్టణ శివారులోని రామస్వామిగుట్ట దగ్గర సింగర్ బెడ్రూమ్ ఇళ్లకు సమీపంలో ఉన్న దాదాపు 10 ఎకరాల స్థలంలో డంపింగ్ చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డుకు ప్రహరీ లేదు. అక్కడ వేసిన చెత్తను కాల్చడంతో వస్తున్న పొగకు సమీపంలోని నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త సేకరణకు 42 మంది పారిశుద్ధ్య కార్మికులు.. తొమ్మిది ఆటోల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. సరిపడా సిబ్బంది, వాహనాలు లేక శివారు కాలనీల్లో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ జరగడం లేదు. చెత్త రీసైక్లింగ్ ఒక డీఆర్సీసీ యూనిట్, ఒక కంపోస్ట్ యూనిట్ ఉంది. రెండు వర్కింగ్లోనే ఉన్నాయి. విలీన గ్రామాల్లో చెత్త సమస్య పెద్దగా లేదు. -
ఉప సర్పంచ్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
సూర్యాపేట : ఉప సర్పంచ్లకు గౌరవ వేతనం ఇవ్వాలని తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు సురేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ కార్యాలయంలో లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన ఉపసర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన ఉప సర్పంచ్ల రాష్ట్ర అధ్యక్షుడిగా బానోతు సురేష్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా కమిటీలను ఎన్నుకుంటామన్నారు. గ్రామాలో చేపట్టే అభివృద్ధి పనులు, అధికారి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం ఉప సర్పంచ్లకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనఉప సర్పంచ్లు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరావు నాయక్, విజయ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్, గిరిజన నాయకులు పాల్గొన్నారు. -
రీసైక్లింగ్ లేక ఇబ్బందులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో చెత్త సేకరణకు మొత్తం 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి కానీ 32 మందే ఉన్నారు. దీంతో ప్రధాన రోడ్లు మినహా, పలు వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తుండడంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోంది. ఫ ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు మూడు ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా 5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 1వ వార్డులోని పాత నేరేడుచర్లలో ఉన్న ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. ఫ డంపింగ్ యార్డు చుట్టూ ప్రహరీ, యార్డులో రీసైక్లింగ్ యూనిట్ లేక చెత్తకు నిప్పంటిస్తుండడంతో పొగతో పాత నేరేడుచర్ల, కమలానగర్ వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. -
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా
హుజూర్నగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల్లో భరోసా, ధైర్యాన్ని నింపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మిస్తున్న 2,160 ఇళ్లను రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం, అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తెజస్ నంద్లాల్ పవార్, అధికారులు, కాంట్రాక్టర్తో నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. హుజూర్నగర్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు రోడ్లు, విద్యుత్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాళ్లుల్, ప్లే గ్రౌండ్, తాగునీటి వంటి మౌలిక సదుపాలన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మోడల్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి త్వరగా పూర్తిచేసి మార్చి 31లోగా అర్హులకు ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ను ఆదేశించారు. గత ప్రభుత్వం కాలేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు కొల్లగొడితే ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లను నిర్మిస్తోందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందని ఆలోచించిందే తప్ప పేదవాడికి ఇళ్లు కట్టించలేదన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించిన మోడల్ కాలనీ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా వదిలేసిందన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ నరసింహ, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఫ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పేదలకు ఇళ్లు అందలేదు ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
గోదావరి జలాలు విడుదల
తిరుమలగిరి (తుంగతుర్తి) : జనగామ జిల్లా కొడకండ్ల వద్ద బయన్నవాగు రిజర్వాయర్ నుంచి బుధవారం ఆర్డీఆర్ ఎస్సారెస్పీ కాల్వ ద్వారా జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గోదావరి జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలు విడుదల చేయడం వల్ల జిల్లాలో 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాగా బయన్నవాగు రిజర్వాయర్ నుంచి మొదటి రోజు 531 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా జిల్లాలోని వెలిశాలకు 70 డీబీఎం ద్వారా చేరాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, కొడకండ్ల మార్కెట్ చైర్పర్సన్ అండాలు, అధికారులు పాల్గొన్నారు. -
ఉర్సుకు రావాలని మంత్రి ఉత్తమ్కు ఆహ్వానం
పాలకవీడు : మండలంలోని జాన్పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బుధవారం హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉర్సులో భాగంగా ఈ నెల 23న శక్రవారం జరిగే గంథం ఊరేగింపు కార్యక్రమానికి రావాలని దర్గా ముజావర్ జానీ కోరారు. ఆయన వెంట నాయకులు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాలోతు మోతీలాల్, బెల్లంకొండ నరసింహారావు, ప్రేమ్కుమార్, దర్గా ఉత్సవ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తాం భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఓటరు జాబితా తయారీలో వార్డుల్లో మ్యాపింగ్ చేసేటప్పుడు బౌండరీ పరిధిలో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా, మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్న్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హనుమంత్రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి, మున్వర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరంచివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహల చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని పీఎంశ్రీ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. బాల్య వివాహం జరిపిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, ఎస్ఐ వెంకన్న, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యురాలు ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులే పంటకు మేలుగరిడేపల్లి : సేంద్రియ ఎరువులే పంటకు మేలని కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) రాజేంద్రనగర్ వారి ఆర్థిక సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమం మూడో రోజైన బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ పంటల్లో వాడాల్సిన సేంద్రియ ద్రావణాలు, కషాయాల తయారీ విధానం, వాటి వినియోగ పద్ధతులపై రైతులకు ప్రయోగిక శిక్షణ అందించారు. అనంతరం రిటైర్డ్ శాస్త్రవేత్త బి.లవకుమార్ పలు విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు పి.అక్షిత్సాయి, 50మంది రైతులు పాల్గొన్నారు. -
సబ్సిడీ గ్యాస్ పక్కదారి
కోదాడ : జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలు సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మకై ్క సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి ఆయా ప్రదేశాల్లో వాణిజ్య అవసరాలకు వాడాల్సిన (కమర్షియల్) సిలిండర్ల స్థానంలో సబ్సిడీ గ్యాస్ను బహిరంగంగా వాడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొన్ని హోటళ్లలో ఒకేసారి నాలుగైదు సిలిండర్లను వాడుతున్నారంటే గ్యాస్ బ్లాక్ దందా ఎలా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా గడిచిన రెండు, మూడు సంవత్సరాల్లో అధికారులు ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. బ్లాక్ మార్కెట్కు ఎందుకు తరలిస్తున్నారంటే.. సాధారణంగా ఇంటి అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.925 ఉంటుంది. వాణిజ్య అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,931 ఉంది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో హోటల్ యజమానులు వాణిజ్య సిలిండర్లను ఉపయోగించకుండా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను ఏజెన్సీల నిర్వాహకులకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించి తీసుకుంటున్నారు. రూ.లక్షల్లో దందా.. జిల్లావ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లు వాడాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లు 1,200 నుంచి 1,400 వరకు ఉండగా.. వీటిలో 70 శాతం సబ్సిడీ సిలిండర్లే వాడుతున్నారు. ఒక్క ఏజెన్సీ సగటున రోజుకు 20 నుంచి 30 సిలిండర్ల వరకు పక్కదారి పట్టిస్తూ ఒక్కో సిలిండర్కు రూ.400 చొప్పున నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆర్జిస్తోంది. ఏజెన్సీలకు చెందిన వాహనాల్లోనే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్కు సరఫరా చేస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ దందా రూ.కోట్లలో జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఏజన్సీలో భారీగా ఉజ్యల కనెక్షన్లు కోదాడకు చెందిన ఓ గ్యాస్ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అందించే ఉజ్వల కనెక్షన్లను వందల్లో ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఖాతరు చేయకుండా సదరు ఏజెన్సీ నిర్వాహకులు పట్టణంలోని ఒకే ప్రదేశంలో వందల కనెక్షన్లు ఇచ్చారని అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టడంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలో విచారణ చేయిస్తామని చెప్పినట్లు సమాచారం. ఫ ఏజెన్సీల నుంచే నేరుగా సిలిండర్ల సరఫరా ఫ 70శాతం హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం ఫ వాణిజ్య సిలిండర్లు వాడాల్సి ఉన్నా నిబంధనలు బేఖాతరు ఈ చిత్రంలో కనిపిస్తున్నవి కోదాడలోని ఓ టీస్టాల్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు. ఇంటి అవసరాలకు వాడే సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు విక్రయిస్తూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భారీగా దండుకుంటున్నారు. -
‘పేట’లో రోజుకు 50 టన్నుల చెత్త సేకరణ
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను మొత్తం 353 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతిరోజూ చెత్త సేకరణ చేసి బాలెంల సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సరిపడా సిబ్బంది ఉండడంతో చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తుండడంతో చెత్తను రోడ్ల మీద పోయడం లేదు. శివారు కాలనీల్లోనూ సక్రమంగానే.. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రతిరోజూ 50 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. అందులో 30 టన్నుల తడి చెత్త 15 టన్నుల పొడి చెత్త, 5 టన్నుల మిక్స్డ్ వెస్ట్ చెత్త ఉంటోంది. చెత్త రీసైక్లింగ్ యూనిట్లు అన్ని సరిపడా అందుబాటులో ఉండి సక్రమంగానే పనిచేస్తున్నాయి. తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు. పొడి చెత్తను టెండర్ సిస్టం ద్వారా అమ్మకం జరిపి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి నెలకు రూ.లక్షల్లోనే అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక, విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కూడా చెత్త సేకరణ దాదాపు 90 శాతం సక్రమంగానే జరుగుతుంది. -
మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా చెత్త సేకరణ
మున్సిపాలిటీల్లో వీధులు చెత్తమయంగా దర్శనమిస్తున్నాయి. సూర్యాపేట మినహా మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్త పేరుకుపోవడంతో సిబ్బంది నిప్పు పెడుతున్నారు. దీంతో సమీపంలో ఉండే ప్రజలు దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులు ఉన్నా రీసైక్లింగ్ యూనిట్లు లేవు. కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో చెత్తసేకరణ జరగడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోయి వీధులు దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థాన్టికులు ఆరోపిస్తున్నారు. కోదాడ : ఎనభై వేలకుపైగా జనాభా ఉన్న కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కొరతతో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటింటి చెత్త సేకరణ నాలుగైదు రోజులకోసారి చేస్తున్నారు. దీంతో తడి చెత్తను ఇంట్లో ఉంచుకోలేక ఇళ్లపక్కన ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట పడేస్తున్నారు. డంపింగ్ యార్డుకు తరలించాల్సిన చెత్తను ఇలా ఎక్కడ పడితే అక్కడే వేస్తుండడంతో పట్టణం చెత్తకుప్పలా మారి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సగం సిబ్బందితో సతమతం కోదాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 35 వార్డులున్నాయి. వార్డుకు ఐదుగురు సిబ్బంది, ఒక వాహనం, ఒక డ్రైవర్తో కలిసి ఆరుగురు పారిశుద్ధ్య సిబ్బంది చొప్పున మొత్తం 210 మంది ఉండాలి. కానీ, ప్రస్తుతం సగం వార్డులకు ఇద్దరు.. సగం వార్డులకు ముగ్గురు చొప్పున మాత్రమే సిబ్బంది ఉన్నారు. 35 చెత్త సేకరణ ఆటోలు కావాల్సి ఉండగా కేవలం 18 ఆటోలు మాత్రమే ఉన్నాయి. చెత్తను డంపింగ్ యార్డ్లకు తరలించడానికి 8 ట్రాక్టర్లు అవసరం కాగా ప్రస్తుతం నాలుగే పనిచేస్తున్నాయి. రెండేళ్ల క్రితం రెండు కొత్త ట్రాక్టర్లను రూ.16 లక్షలు పెట్టి కొనుగోలు చేసినా అధికారులు వాటిని సెగ్రిగేషన్ షెడ్డులో పడేశారు. అసలే సిబ్బంది కొరత ఉంటే ఎక్కువ మంది పనిచేయడం మానేసి పనిచేయించే జవాన్లుగా కాలం గడుపుతున్నారు. సిబ్బంది ఇలా.. కోదాడలో పారిశుద్ధ్య సిబ్బంది (అవుట్సోర్సింగ్) 146 ఉన్నారు. ఎన్ఎంఆర్లు 11, రెగ్యులర్ కార్మికులు 21, చెత్త ఆటోలు 18, ట్రాక్టర్లు 4, జేసీబీ 01, వైకుంఠధామం వాహనం ఒకటి ఉన్నాయి. ఫ సిబ్బంది కొరతతో ఎక్కడి చెత్త అక్కడే.. ఫ పడకేసిన పారిశుద్ధ్యం.. ఇబ్బందుల్లో పట్టణ జనం ఫ ఒక్క సూర్యాపేటలోనే 90 శాతం వీధులు పరిశుభ్రంగా.. ఫ కోదాడలో సిబ్బంది కంటే పనిచేయించే జవాన్లే అధికం ఫ మిగతా మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే చెత్త సేకరణ -
పట్నంలో ఓటుకు పాట్లు
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో మున్సిపాలిటీల్లో అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పులు చేస్తుండగా.. కొందరు ఓటర్లు పల్లె నుంచి పట్నం వచ్చేందుకు యత్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఓటు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇందుకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరుత్సాహం చెందుతున్నారు. ఇక్కడా ఓటేద్దాం జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానమై ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు చాలామంది తమ పిల్లల చదువు, ఉద్యోగం, వ్యాపార రీత్యా సమీప మున్సిపాలిటీ కేంద్రాలకు వెళ్లి నివాసం ఉంటున్నారు. సొంతూరిలో వ్యవసాయం చూసుకుంటు గ్రామంతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని చాలా మందికి పల్లెల్లో, మున్సిపాలిటీల్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒకచోట ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వేరువేరుగా జరగడంతో పట్టణంలో, పల్లెలో ఓటు వేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు ప్రకటించిన ముసాదా జాబితాలో తమ పేరు ఉందా అని పరిశీలించుకుంటున్నారు. ఫ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు నమోదుకు ప్రయత్నాలు ఫ పల్లెల్లో ఉన్న ఓటును మార్చుకునేందుకు ఆపసోపాలు ఫ ఓటరు తుదిజాబితాలో చోటుకోసం యత్నం ఫ ఓటు మార్పునకు అవకాశం లేకపోవడంతో నిరుత్సాహంపల్లె నుంచి పట్టణం వచ్చి అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ సొంతూరిలో ఓటు వేశారు. తిరిగి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఓటు వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆయా వార్డుల్లోని వివిధ పార్టీల నాయకులు సైతం సహకరిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందడం, లేదంటే ఓటు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు 2025 అక్టోబర్ 1వ తేదీన రూపొందించిన ఓటరు జాబితా ప్రకారం జరగనున్నాయి. అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా సైతం ఇదే. మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినా అది కూడా మున్సిపాలీటీల్లో ఉన్న ఓటర్లకే. ముసాయిదా జాబితాలో పొరపాటుగా పక్కపక్క వార్డులకు మారిన వాటిని మాత్రమే గుర్తించి మార్పు చేయనున్నారు. దాంతో పల్లె నుంచి పట్నంకు ఓటు బదిలీ, కొత్తగా ఓటు పొందాలన్న వారి ఆశలు ఫలించడం లేదు. -
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
నేనూ, మా ప్రాంతం వాళ్లు చాలా ఏళ్లుగా దర్గాకు వస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేందుకు సౌకర్యాలు లేవు. సత్రాలు, వంట గదులు లేక కందూరు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేటు గదుల వాళ్లు ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు. యాటలు కోసిన దగ్గర నుంచి పాతెహాలు సమర్పించే వరకు ప్రతి దానికీ డబ్బులు వసూలు చేస్తున్నారు. సైదామస్తాన్, కారంపూడి, ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆదేశాల మేరకు దర్గా వద్ద కాంట్రాక్టు పద్ధతి లేదు. బోర్డు నిర్ణయాల ప్రకారం వారాని రూ. 2 లక్షలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాం. వీరు దర్గాలో కొన్నింటికి ధరలు నిర్ణయించి భక్తుల వద్ద నుంచి తీసుకుంటున్నరు. నేను ఉద్యోగిని మాత్రమే. వక్ఫ్ బోర్డు అధికారులు చెప్పినట్లు నడుచుకోవడమే నాపని. దర్గా వద్ద కొన్ని అసౌకర్యాలు ఉన్న మాట వాస్తవమే, ఉర్సు ఉత్సవాలకు కల్పించాల్సిన వసతులపై ఎస్టిమేషన్ వేసి బోర్డుకు నివేదించా. –మహమూద్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పాలకవీడు : సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గా.. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు సైదన్నా అని పిలుచుకునే ఆధ్యాత్మిక క్షేత్రం జాన్పహాడ్దర్గా. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యల్లో భక్తులు తరలివస్తారు. అయితే దర్గా వద్ద సరైన సౌకర్యాలు లేక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్గాకు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం వస్తున్నా, అభివృద్ధిపై వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల పాటు ఉర్సు ఈ నెల 22, 23, 24 తేదీల్లో జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. 23న నిర్వహించే గంధం ఊరేగింపునకు లక్షల సంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్ల కోసం అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపినట్లు అధికారులు చెప్పారు. వసతులు కరువు జాన్పహాడ్ దర్గా నుంచి వక్ఫ్ బోర్డుకు ప్రతి సంవత్సరం రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా దర్గా వద్ద మౌలిక వసతులు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తలదాచుకోవడానికి కనీసం కాటేజీలు లేవు, ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. కందూరు, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు వంట గదులు, స్నానాల గదులు లేక అన్నీ ఆరు బయటే చేయాల్సి వస్తున్నది. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు కాటేజీ నిర్వాహకులు భక్తుల వద్ద నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. భూములు అన్యాక్రాంతం దర్గా చుట్టూ ఉన్న సుమారు 15 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఆక్రమణలకు గురవుతున్నా వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కళ్లముందే భూములు అన్యాక్రాంత మవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని పేర్కొంటున్నారు. దర్గా భూముల్లో ఆక్రమణలు తొలగించి విశ్రాంతి గదులు, కాటేజీలు, భోజనశాలలు, వంట గదులు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల నిలువు దోపిడీ.. దర్గాకు వచ్చే భక్తుల నుంచి కాంట్రాక్టర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. కందూరుకు యాటల సమర్పన, జెండాలు, దట్టీలు, కొబ్బరికాయలు, వాహన పూజ ఇలా ప్రతి దానికీ ప్రైవేటు వ్యక్తులు ధరలు నిర్ణయించి బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు హుండీలో వేయాల్సిన డబ్బును సైతం నిర్వాహకులు బలవంతంగా తీసుకుంటున్నట్లు భక్తులు వాపోతున్నారు. ఇక్కడ విక్రయించే సుమారు 17 రకాల వస్తువులపై వక్ఫ్బోర్డు కాంట్రాక్టు పద్ధతిన వేలం నిర్వహించేది. కొందరు ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. బహిరంగ వేలంపై కోర్టు స్టే విధించినా వక్ఫ్ బోర్డు అధికారులు దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దర్గాకు వచ్చే భక్తుల కోసం తగిన సౌకర్యాలు కల్పించాలని, వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వసూళ్లను అరికట్టి దర్గా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. తాగునీటి ట్యాంకుల వద్ద అపరిశుభ్రతశిథిలమైన కాటేజీలు ఫ జాన్పహాడ్ దర్గా వద్ద కనీస సదుపాయాలు కరువు ఫ శిథిలావస్థలో వసతి గదులు ఫ వంటశాలలు, స్నానాల గదులు లేక భక్తుల అవస్థలు ఫ 22 నుంచి ఉర్సు ఫ లక్షల్లో తరలిరానున్న భక్తులు -
ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు
చిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ నాయకులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని, అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే పార్టీ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి సాహెబ్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు నంద్యాల రామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెమిడాల రాజు, జెర్రిపోతులగూడెం సర్పంచ్ గుగులోతు లలిత, ఉప సర్పంచ్ ఉద్దండు దుర్గ నాయకులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణుడిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ది వీరహనుమాన్, రామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేశ్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. గుంత పూడ్చమంటే రాళ్లేశారుకోదాడ : పట్టణంలోని బొడ్రాయి బజార్కు వెళ్లే మార్గంలో ప్రధాన కూడలి వద్ద రోడ్డు మధ్యలో గుంత ఏర్పడింది. దాంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో సమీపంలో ఓ ఇంటి స్లాబ్ను కూల్చగా మిగిలిన వ్యర్థాలు, రాళ్లను తీసుకొచ్చి మున్సిపల్ సిబ్బంది అందులో పోశారు. ఇన్నిరోజులు గుంతతో ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు సిమెంట్ రాళ్ల మధ్య నుంచి వేళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లైయినట్లు అయ్యింది రోడ్డు పరిస్థితి అని వాపోతున్నారు. ధనుర్మాస పూజలుసూర్యాపేట : పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో దనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలను నల్లాన్ చక్రవర్తుల మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనము అందజేశారు. కక్కిరేణి శేఖర్, మోహన్, వెంకన్న పాల్గొన్నారు. -
అసెంబ్లీలో కృష్ణా నీళ్లపై చర్చించాలి
చివ్వెంల(సూర్యాపేట), హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణానది నీళ్ల అంశంపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల, హుజూర్నగర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లకు చిత్త శుద్ధి ఉంటే ఎగువ తుంగభద్రకు జాతీయ హోదా, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి –నారాయణపేట–కొడంగల్కు ఉమ్మడి రాష్ట్రంలో 77.5 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు. దీని వల్ల పాలమూరు ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ఎప్పటికీ క్షమించరన్నారు. హరీష్రావును తిడితే సమావేశాలను బహిష్కరించడం బీఆర్ఎస్ డ్రామానా అని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సభ జరిగిందన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇస్టానుషారంగా ప్రసంగం కొనసాగించరన్నారు. నిజానికి అసెంబ్లీలో కృష్ణానది నీళ్లమీద చర్చ అన్నారు. అలాంటప్పుడు నదీ పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ,కర్ణాటకల గురించి మాట్లాడాలన్నారు. కర్ణాటక ఆల్మట్టిని 5 మీటర్లు పెంచుతూ ఉంటే సభలో దాని పై సీఎం మాట్లాడాలన్నారు. సూర్యాపేటలో మల్లుస్వరాజ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రోడ్డు వెడల్పు పేరుతో 300 షాపులు కూల్చేశారని, 8 ఏళ్లు అవుతున్నా వారికి పరిహారం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జగదీశ్రెడ్డి మంత్రిగా ఉన్నా సూర్యాపేట పరిస్థితులు మారలేదన్నారు. హుజూర్నగర్, కోదాడలో నియోజకవర్గాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1450 కోట్లతో మెగా లిఫ్ట్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే అప్పట్లో ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యతిరేకించి, ఇప్పుడు రూ.500 కోట్లు పెంచి లిఫ్ట్ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ మెగా లిఫ్ట్లో ఆయన వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు క్రిష్ణవేణి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఫ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
పొగమంచులో వాహనదారులు జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : ప్రస్తుతం చలితీవ్రత పెరగడంతో పాటు రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా కురుస్తున్నదని, దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పొగమంచు ప్రభావం వల్ల రోడ్లపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రహదారుల వెంట నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ వాహనదారులు లైటింగ్ కండిషన్ సరి చూసుకోవాలి. ఫ తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి, మ్యూజిక్ పెట్టుకోవద్దు. ఖచ్చితమైన మార్గంలో ఒకే లైన్లో వాహనం నడపాలి. ఫ ద్విచక్రవాహదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హై–భీమ్ కాకుండా, లో–భీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి. ఫ వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి. ఫ రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వినియోగించాలి. ఫ సడన్ బ్రేకులు వేయవద్దు. ఇలా వేస్తే రోడ్డు తడిగా ఉంటే స్కిడ్ అయ్యో ప్రమాదం ఉంటుంది. ఫ టర్నింగ్ అయ్యో ముందు ఇండికేటర్ వేయాలి. వాహన వేగాన్ని తగ్గించాలి. ఫ రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఉంటుంది. అందుకే ఆ సమయాల్లో ప్రయాణాలు చేయక పోవడమే మంచిది. ఫ చేతులకు గ్లౌజ్లు తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది. ఫ కార్లు, పెద్ద వాహనాల డ్రైవర్లు ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరంగా ఉండాలి. ఫ డిఫాగర్ ఉపయోగించాలి, విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి. ఫ హాజర్డ్ లైట్లు విజిబులిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి. ఫ పొగమంచు ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు. లైన్ మార్కింగ్ను గమనిస్తూ నడపాలి. ఫ వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది ముందుగానే తనిఖీ చేసుకోవాలి.ఫ ఎస్పీ నరసింహ -
పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
కోదాడ : అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలనడం అన్యాయమని, పేదలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోనని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడ పెద్దచెరువు ఎఫ్టీఎల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఇటీవల అధికారులు నోటీసులు ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆదివారం బాధితులతో కలిసి మాట్లాడారు. పేదలు ఈ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని చెప్పారు. అధికారులు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట నాయకులు ఎస్కే. నయీం, చింతల నాగేశ్వర్రావు, కర్ల సుందర్బాబు ఉన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య -
హుజూర్నగర్లో కాషాయ జెండా ఎగురవేస్తాం
హుజూర్నగర్ : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో హుజూర్నగర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అన్ని వార్డులలో పోటీ చేస్తుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పట్టణంలో ఒక్కరికై నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండా హరీశ్గౌడ్, నాయకులు ఉమామహేశ్వరరావు, నరేందర్రెడ్డి, కోటిరెడ్డి, రవి, శ్రీనివాస్, గోపి, లక్ష్మణ్, నాగరాజు, విజయ్, నాగేంద్రాచారి, బలవంత్ సింగ్, నరసింహ, మురళి పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేవాలయంలో గల గోదాదేవికి తిరుప్పావై సేవాకాలం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
వార్డుల కూర్పుపై అసంతృప్తి
కోదాడ : కోదాడ మున్సిపల్ అధికారులు తయారు చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో పాటు వార్డుల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి ఒక చివరన ఉన్న ఓటరు పేరు మరో చివర ఉన్న వార్డులో చేర్చారని, కొన్ని వార్డులను కలకూరగంపగా మార్చారని, ఆయా ఓటర్లు పట్టణంలో ఏ ప్రదేశంలో ఉన్నారో తెలుసుకోవడం కూడ కష్టంగా ఉందని పలువురు నాయకులు అంటున్నారు. దీంతోపాటు వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో చాలా తేడాలున్నాయని ఒక్కో వార్డులో మూడు, నాలుగు వందల మంది తేడా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది అవుతుందని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక వార్డులో 2,300 మంది ఓటర్లు ఉంటే మరో వార్డులో కేవలం 1,300 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని దీన్ని బట్టే మున్సిపల్ అధికారులు పట్టణంలోఇ అన్ని వార్డుల విభజన ఎంత అశాసీ్త్రయంగా చేశారో అర్థం అవుతుందని వారు ఆరోపిస్తున్నారు. వార్డుల పరిధి ఇలా చేశారు.. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. వీటిలో 1, 2 వార్డులు లక్ష్మీపురం, ఇందిరమ్మ కాలనీకి, 3, 4 వార్డులు తమ్మర గ్రామానికి చెందినవి కాగా.. 5, 6 వార్డులు శ్రీరంగాపురానికి చెందినవి. 7, 8 వార్డులు బాలాజీనగర్కు, 9వ వార్డు సాలార్జంగ్పేట, 10, 11 కొమరబండకు, 12వ వార్డు రామిరెడ్డిపాలెం, 13 నుంచి 17 వార్డుల వరకు నయానగర్, 18వ వార్డు ఖమ్మం క్రాస్రోడ్డు, 19 భవానినగర్, 20 బంజర కాలనీ, 21 శ్రీమన్నారాయణ కాలనీ, 22 పెరిక హాస్టల్ నుంచి రెడ్చిల్లి వరకు, 23 లాల్బంగ్లా నుంచి వర్తక సంఘం వరకు, 24 మున్సిపాలిటీ నుంచి సాయికృష్ణ థియేటర్ వరకు, 25 చెరువుకట్ట బజార్కు, 26వ వార్డు సుధాబ్యాంక్ నుంచి బస్టాండ్ వరకు, 27వ వార్డు ఎంఎస్ కాలనీ, మాతానగర్, 28 రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏర్నేనిబాబు ఇంటి వరకు, 29 సంత ఎదురు బజార్ నుంచి పారా సీతయ్య ఇంటి వరకు, 30 వెంకటేశ్వర థియేటర్ వెనుక బజార్, 31 శ్రీనివాసనగర్, 32 బాలికల పాఠశాల నుంచి గొల్లబజార్ వరకు, 33 బొడ్రాయి బజార్, 34, 35వ వార్డుల్లో గాంధీనగర్, ఎస్సీ కాలనీ, మాలపల్లి ఉన్నాయి. ఫ వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదంటున్న ప్రజలు ఫ గందరగోళంగా కోదాడ మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితా ఫ వార్డుల్లో ఓటర్ల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసముందని ఫిర్యాదులు ఫ స్పల్ప మార్పులే చేశామంటున్న మున్సిపల్ అధికారులు పట్టణంలో ఉన్న 35 వార్డుల్లో 2 వేలకుపైగా ఓటర్లు ఉన్న వార్డులు 3 ఉండగా, 1,500 నుంచి 2వేల ఓటర్లు ఉన్న వార్డులు 25 ఉన్నాయి. 1,500 కన్నా తక్కువ ఓట్లు ఉన్న వార్డులు 7 ఉన్నాయి. నయానగర్లో ఉన్న 16వ వార్డులో అతి తక్కువగా 1,298 మంది ఓటర్లు, దీని పక్కనే ఉన్న 17వ వార్డులో 1,440 మంది ఓటర్లు ఉన్నారు. కానీ వీటి పక్కనే ఉన్న 18వ వార్డులో మాత్రం 2,378 మంది ఓటర్లను ఉంచారు. కలిసి ఉన్న ఈ మూడు వార్డుల ఓటర్లను సమానంగా విభజించే వీలున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు చేశారని పలువురు అంటున్నారు. ఇక పట్టణానికి చెందిన ఓ నాయకుడు మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్ సాయంతో తన సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లను ఈ వార్డులో వేయించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ముసాయిదా జాబితాపై ఫిర్యాదులుంటే తమ కు చెప్పవచ్చని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని చెబుతున్నారు. -
‘కోఆప్షన్’పై ఆశలు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఇటీవలే కొలువుదీరాయి. నూతన సర్పంచ్లు పాలనపై దృష్టి పెట్టగా.. ఇప్పుడు అందరిచూపు కోఆప్షన్ పదవులపై పడింది. అయితే కోఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యులతో సమాన హోదా ఉండడంతో అన్ని గ్రామాల్లో రాజకీయ పార్టీలు, సర్పంచ్ల మద్దతుదారులు, ఓడిపోయిన అభ్యర్థులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా కోఆప్షన్ సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యేలు, సర్పంచ్లే కీలకం కావడంతో వారి మద్దతుదారులు ఆ పదవులు దక్కించుకునేందుకు పైరవీలకు తెరలేపారు. రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ కోఆప్షన్ పదవి కీలకం కానుంది. 2018 పంచాయతీ చట్టం మేరకు.. 2018 ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతోపాటు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించవచ్చు. చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులుగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని తప్పక చేర్చాలి. మరో కోఆప్షన్ కోసం పంచాయతీ భవన నిర్మాణానికి భూమి దానం చేసిన వ్యక్తికి కూడా ఇవ్వవచ్చు. గ్రామ సంక్షేమానికి కృషిచేసిన ఎవరినైనా ఎంచుకోవచ్చు. ప్రధానంగా వీరి నియామకంలో సర్పంచ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటుహక్కు లేకపోయినా, వార్డు సభ్యుల స్థాయి అధికారాలు వీరికి లభిస్తాయి. పంచాయతీ సమావేశాలకు ఆహ్వానం ఉంటుంది. ఫ ప్రతీ పంచాయతీలో ముగ్గురికి చాన్స్ ఫ వార్డు మెంబర్లతో సమాన హోదా ఫ ఎలాగైనా దక్కించుకోవాలని ఆశావహుల పైరవీలు ఫ ఎంపికలో ఎమ్మెల్యేలు, సర్పంచ్లే కీలకం ఫ జిల్లాలో 1,458 కోఆప్షన్ స్థానాలు జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్కో పంచాయతీలో ముగ్గురు చొప్పున 1,458 మంది కోఆప్షన్ సభ్యులు నియమితులు కానున్నారు. జిల్లాలో అధిక స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీనే ఈ పదవులను దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే ఎమ్మెల్యేల మద్దతుతో ఇతర పార్టీల మద్దతుదారులు సర్పంచ్లు ఉన్నచోట తమ మద్దతుదారులకే కోఆప్షన్ల పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అక్రమాలకు తావులేకుండా..
సూర్యాపేట టౌన్ : ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలను ఈ ఏడాది పూర్తిస్థాయి నిఘా వ్యవస్థలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానించారు. ఈ ఏడాది నిఘా వ్యవస్థకు అనుసంధానమైన కళాశాలలకే ఇంటర్ ప్రయోగ పరీక్ష కేంద్రాలను కేటాయించారు. సీసీ కెమెరాలు లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను సమీపంలోని నిఘా వ్యవస్థ ఉన్న కళాశాలలకు తరలిస్తారు. ఒక్కో కళాశాలకు 16 నుంచి 20 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 86 జూనియర్ కళాశాలలు.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 86 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎనిమిది, ప్రైవేట్ కళాశాలలు 30, మోడల్ స్కూల్స్ తొమ్మిది, సోషల్ వెల్ఫేర్ ఎనిమిది, బీసీ వెల్ఫేర్ ఎనిమిది, కేజీబీవీలు 15, మైనార్టీ వెల్ఫేర్ నాలుగు, ట్రైబల్ వెల్ఫేర్ మూడు, రెసిడెన్షియల్ ఒకటి చొప్పున ఉన్నాయి. వీటిల్లో ఫస్టియర్ విద్యార్థులు 8,500 మంది, సెకండియర్ విద్యార్థులు 8వేల మంది ఉన్నారు. ప్రయోగ పరీక్షల సెంటర్లు ఇలా.. జిల్లాలో మొత్తం 86 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 41 కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిలో సెంటర్లను ఏర్పాటు చేశారు. 26 జనరల్ విద్యార్థులకు, 15 ఒకేషనల్ విద్యార్థులకు సెంటర్లను కేటాయించారు. ఈ సెంటర్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండనున్నాయి. గతంలో 50 మంది విద్యార్థులున్న కళాశాలకు ప్రాక్టికల్స్ సెంటర్లను కేటాయించారు. ఈ ఏడాది సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలకు మాత్రమే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. సీసీ కెమెరాల నీడలో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను అధికారులు ఓపెన్, సీల్ చేయనున్నారు. జిల్లాలో 8వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్ష రాయనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే ఇప్పటికే కళాశాలల్లో సిలబస్ పూర్తిచేసి రివిజన్ చేస్తున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలే సెంటర్లుగా గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 41 సెంటర్లను ఏర్పాటు చేశాం. – భానునాయక్, డీఐఈఓ ఫ సీసీ నిఘాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు సన్నాహాలుఫ కొత్త నిబంధన తెచ్చిన ఇంటర్ బోర్డు ఫ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఫ పరీక్షలకు హాజరుకానున్న 8 వేల మంది విద్యార్థులు -
ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించాలి
తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) : ఎస్సారెస్పీ 2 దశ కాల్వలను ఆధునీకరించాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జాగృతి జనం బాటలో భాగంగా ఆమె తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో పర్యటించారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రుద్రమ్మ చెరువును, తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల బాగోగులు తెలుసుకున్నారు. కర్విరాల కొత్తగూడెంలో మారోజు వీరన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అర్వపల్లిలో కేజీబీవీకి వెళ్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎస్ఓ నాగరాణితోపాటు టీచర్లను సన్మానించారు. శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం అర్వపల్లి శివారులో ఎస్సారెస్పీ 71డీబీఎం కాల్వను పరిశీలించారు. అనంతరం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన సామాజిక జేఏసీ కమిటీ అధ్యక్షుడు భూపతి రాములు, కర్ణాకర్, జలగం మల్లేశ్, జంగా జానయ్య, మేడి కృష్ణ, గంపల కృపాకర్, నాగరాజు, సుందర్, సైదులు, జల్ల రాములును శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో కవిత మాట్లాడుతూ రుద్రమ్మ చెరువును రిజర్వాయర్గా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిన తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. మారోజు వీరన్న ఆశయాల సాధనకు జాగృతి కృషిచేస్తుందన్నారు. నూతనకల్లో మహిళలకు బాత్రూమ్లు, అలాగే బస్ షెల్టర్ నిర్మించాలన్నారు. ప్రజా సమస్యలతు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేసేందుకు జనంబాటచేపట్టామన్నారు. సాయుధ పోరాటానికి పెట్టింది పేరు సూర్యాపేట జిల్లా అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, నాయకులు డాక్టర్ నిర్మల్ కుమార్, భిక్షం, లింగయ్య, లింగంపల్లి రమణ, పంది యాదగిరి, దుగ్యాల రవీందర్రావు, నకిరేకంటి చిరంజీవి, మహేష్ పాల్గొన్నారు. ఫ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ‘జాగృతి జనం బాట’ -
బాధితులకు భరోసా కల్పించాలి : ఎస్పీ
నూతనకల్ : వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కృషిచేయాలని సూచించారు. పండుగ సందర్భాల్లో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, ఎస్ఐ నాగరాజు, సిబ్బంది ఉన్నారు. -
పుర పోరులో సైనికుల్లా పనిచేయాలి
సూర్యాపేట టౌన్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే మన ఆయుధమని అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, అధికారం చేపట్టిన కొద్దిరోజుల నుంచే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. అందుకు నిదర్శనం పంచాయతీక ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన అద్భుత ఫలితాలేనన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల కృషి ఎనలేనిదన్నారు. గుర్తులు లేకుండానే అత్యధిక సీట్లు సాధించుకున్నామని, ఇక గుర్తులు ఉండే ఎన్నికలయితే.. కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలి
నేరేడుచర్ల : మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచేలా సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి తాళ్ల నరేందర్రెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ చిలకరాజు కరుణాకర్, నాయకులు సంకలమద్ది, సత్యనారా యణరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఏమిరెడ్డి శంకర్రెడ్డి, కా లం నాగయ్య, ఉపాధ్యక్షులు జూలూరు అశోక్, సినియర్ నాయకులు మెట్టు శ్రీనివాస్రెడ్డి, రామ్మూర్తి, బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, చెరుకు రాము, మలిగిరెడ్డి రఘునాధరెడ్డి, దేవిరెడ్డి, నాగిరెడ్డి, సైదులు, చంద్రయ్య, విమల, కృష్ణవేణి, నాగమణి పాల్గొన్నారు. వైభవంగా గరుడ వాహన సేవమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి నిత్యకల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కూలీల పొట్టగొట్టేందుకు కొత్త బిల్లుసూర్యాపేట అర్బన్ : ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టేందుకే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజిక మిషన్ (గ్రామీణ) బిల్లు 2025ను కేంద్రం తీసుకొచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య ఆరోపించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఆఫీస్ బేరర్స్ పులుసు సత్యం, సోమపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, జంపాల స్వరాజ్యం, గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, అంజపల్లి లక్ష్మయ్య, ఉయ్యాల పారిజాత పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్ –స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్)ను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం హైదదరాబాద్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి, అర్హులైన ప్రతి పౌరుని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె..సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్లు రవితేజ, అనూష, తహసీల్దార్ కృష్ణయ్య, సూపరింటిండెంట్లు సంతోష్ కుమార్, శ్రీలత రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ముందస్తు చర్యలు సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎస్పీ నరసింహతో కలిస వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వివిధ రూట్లలో పండగ ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు పక్కాగా చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ కె.నరసింహ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, జాతీయ రహదారి అధికారి శ్రవణ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
3 సెంటర్లు.. 2,565 మంది అభ్యర్థులు
సూర్యాపేట టౌన్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టీజీ టెట్) శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కాగా ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే డిసెంబర్ 27 నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్లో విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్న నేపథ్యంలో అభ్యర్థులు పావుగంట ముందస్తుగా సెంటర్లలోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో కేటాయించిన మూడు కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 2,565 మంది అభ్యర్థులు వివిధ జిల్లాలకు చెందిన 2,565 మంది అభ్యర్థులు సూర్యాపేట జిల్లాలో టెట్ రాయనున్నారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు ఇతర జిల్లాల్లో పరీక్ష రాయనున్నారు. రోజుకు రెండు సెషన్లలో జరగనుండగా మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9గంటల నుంచి ఉదయం 11.30గంటల వరకు, రెండవ సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరగనుంది. మూడు సెంటర్లలో పరీక్షలు టెట్ నిర్వహణకు జిల్లాలో మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల, కిట్స్, సన ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అనురాగ్లో 340 మంది అభ్యర్థులు, కిట్స్ కళాశాలలో 90 మంది, సన కళాశాలలో 50 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఒక్కో సెషన్కు మొత్తం 340 మంది చొప్పున అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ టీచర్లకు ఇక్కట్లే.. బీఈడీ, టీటీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి చేశారు. దీంతో జిల్లాలో 1,500 మంది వరకు టీచర్లు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇతర జిల్లాల్లో సెంటర్లు పడిన మన జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. నేటి నుంచి టెట్ ఫ కోదాడలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఫ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు ఫ ప్రభుత్వ ఉపాధ్యాయులకు తప్పని పరీక్ష తిప్పలు -
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్–163 అమలు
పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్–163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్–2023 అమలులో ఉంటుంది. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దు. పరీక్ష సమయంలో కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – నరసింహ, ఎస్పీ సూర్యాపేట -
17 మందికి ‘కుష్టు’ లక్షణాలు
సూర్యాపేట టౌన్ : జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా 1,042 మందిని అనుమానితులుగా గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కుష్టు లక్షణాలు ఉన్నట్టు తేల్చామని డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి నిర్థారణ చేసిన వారికి బహుళ ఔషధ చికిత్స ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఎవరికైనా శరీరంపై ఎలాంటి మచ్చలు ఉన్నా వైద్య సిబ్బందిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ‘చలో అసెంబ్లీ’కి తరలిరావాలికోదాడ రూరల్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెన్ఫిట్స్ కోసం ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని 2024 రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పోనుగోటి కోటయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు బాలేమియా, అమృతారెడ్డి, జగన్, వరప్రసాద్, భ్రమరాంభ, పుల్లయ్య, లక్ష్మి, నర్సయ్య, కోటయ్య, లక్ష్మీనర్సయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి చట్టం రద్దు ప్రజా వ్యతిరేక చర్య మునగాల : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీరాంజీ పేరుతో నూతన చట్టం తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రజా వ్యతిరేక చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంలగాణలోని ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం ద్వారా పదవులు భర్తీచేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు ములకపల్లి రాములు, బచ్చలకూరి స్వరాజ్యం, షేక్ సైదా, బుర్రి శ్రీరాములు, చందా చంద్రయ్య, వీరబోయిన వెంకన్న, అనంతు గుర్వయ్య, తుమ్మ సతీష్, సోంపంగు నర్సయ్య, మొగిలిచెర్ల సీతారాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మామిడి గోపయ్య, సోంపంగు జానయ్య, బట్టు నాగయ్య, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 30న ఎన్జీ కాలేజీలో గాంధీ విగ్రహాల ప్రదర్శన రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఈ నెల 30న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చీఫ్ అడ్వైజర్ ఎంవీ.గోనారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యానాల ప్రభాకర్రెడ్డి, నీరుడు దయాకర్రెడ్డి, కె.కరుణాకర్రెడ్డి, పాముల అశోక్, గిరిబాబు పాల్గొన్నారు. -
గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం
కోదాడ పెద్దచెరువు ఆక్రమణదారులకు నోటీసులు ఫ వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం ఫ 372 మంది కబ్జాదారులను గుర్తించిన అధికార యంత్రాంగం ఫ కబ్జా స్థలాల్లో వెలసిన అపార్టుమెంట్లు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలుకోదాడ : కోదాడ పెద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి సీరియస్ అయ్యింది. పెద్దచెరువు ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై సుమోటోగా (కేసు నెం:125/2023) కేసు నమోదు చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, చైన్నె (సౌత్జోన్) ఆక్రమణదారులకు తాజాగా నోటీసులు జారీచేసింది. వీరంతా నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. గతేడాది దీనిపై రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదలశాఖ అధికారులతో సంయుక్త సర్వే చేయించారు. రిపోర్టు ప్రకారం చెరువులో ఉన్న శిఖం, ఎఫ్టీఎల్, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి వీరందరికి నోటీసులు జారీచేశారు. అయితే ఆక్రమించుకున్న స్థలంలో అపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు, కళాశాలలు, పాఠశాలలు, క్లబ్లు నిర్మించారు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ పెద్దచెరువు మొత్తం 727 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 413.27 ఎకరాలు శిఖం భూమిగా, 107.37 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్డ్ల్యాండ్ 49.04 ఎకరాలు, ఇనాం భూములు 34.32 ఎకరాలు, పట్టా భూములు 121.36 ఎకరాలున్నాయి. దీని కింద 938 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కోదాడ, అనంతగిరి, ఖానాపురం రెవెన్యూ పరిధిలో ఉంది. ఈ చెరువు కోదాడ పట్టణానికి ఆనుకుని ఉండడంతో ఆక్రమణలు జోరుగా సాగాయి. ప్రస్తుతం ఈ చెరువులో 200 ఎకరాలకుపైగా ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణలపై అనేక సంవత్సరాలుగా పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆక్రమణదారులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. ఆక్రమణదారులు ఎంత మందంటే.. కోదాడ పద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కోదాడ మున్సిపాలిటీ అధికారులు ఒక రిపోర్టు (నెం:జీ1/530/24 తేదీ 06–01–25)ఇచ్చారు. అదేవిధంగా కోదాడ ఆర్డీఓ మరో రిపోర్టు (నెం ఈ/954/2020 తేదీ 0–01–2025) ఇచ్చారు. దీని ప్రకారం 2010కి ముందు 319 మంది, ఆ తరువాత 53 మంది మొత్తం 372 మంది పెద్ద చెరువులో వివిధ రకాలుగా ఆక్రమణలు పాల్పడ్డారని తేల్చారు. పట్టణ పరిధిలో చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని రిపోర్టు ఇచ్చారు. ఆక్రమ నిర్మాణాలుగా అధికారులు పేర్కొన్న వాటిలో రామిరెడ్డిపాలెం రోడ్డులో ఉన్న ఇండోర్ సబ్స్టేషన్, మినీ మోటార్ వెహికిల్ స్టాండ్, రిక్రియేషన్ క్లబ్, దాని సమీపంలోని అపార్టుమెంట్, కల్యాణమండపం, కళాశాలలు, స్కూళ్లు, పార్టీ కార్యాలయాలతోపాటు నివాస గృహాలు, కోదాడ పబ్లిక్క్లబ్ నూతన భవనం ఉన్నాయి. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణ విషయంలో ప్రభుత్వ అధికారులు పనితీరు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. చెరువు ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు నివేదిక ఇచ్చిన అధికారులే సదరు ఇళ్లు నిర్మాణం చేసిన శిఖంలోకి మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు, మంచినీటి పైప్లైన్స్, విద్యుత్ సౌకర్యం, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. కోర్టుకు ఇచ్చిన నివేదికలో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోదాడ పెద్దచెరువు కట్టపైనే పక్కా గృహాల నిర్మాణం జరిగినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా అక్కడ సీసీ రోడ్డు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. కాని కోర్టుకు మాత్రం తాము 2010 తరువాత ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రిపోర్టు ఇచ్చారు. -
ప్రజల మధ్య ఉండే వారికే ప్రాధాన్యం
భానుపురి : ప్రజల మధ్య ఉంటూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సూర్యాపేటకు న్యాయం.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. పార్టీ విధేయులు, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. టికెట్ ఆశించి రాకుంటే పార్టీకి మద్దతుగానే ప్రచారం చేయాలని, వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి, ఆ గెలుపును దివంగత నేత రాంరెడ్డి దామోదర్రెడ్డికి అంకితం ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్రావు, అంజద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్, రహీం,వేణు, వేములకొండ పద్మ, నర్సయ్య, రెబల్ శ్రీను, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట టౌన్ : సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ‘ఫ్రాడ్ కాల్ ఫుల్ స్టాప్’ పేరుతో రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. బహుమతులు ఇస్తామని ఫోన్ కాల్స్ వస్తే అవి సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించాలన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్లను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. జన సమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రత పట్ల, డిఫెన్సివ్ డ్రైవింగ్, అరైవ్–అలైవ్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నెలంతా పోలీస్ యాక్ట్ అమలు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31వ తేది వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీస్ అధికారుల అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్విహిసే చర్యలు తప్పవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను పోస్టు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫ ఎస్పీ నరసింహ -
ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు
భానుపురి (సూర్యాపేట) : మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తయారు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటరు జాబితా తయారుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించి గురువారం వార్డుల వారీగా ప్రకటించామన్నారు. ఈ ముసాయిదా జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో 5వ తేదీన మున్సిపాలిటీలు, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 10వ తేదీన మున్సిపాలిటీ వారీగా తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ప్రొవిషన్ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, డీపీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, మున్వర్అలీ, సీ సెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పవర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పనులపై జిల్లాలోని ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, డీపీఎంలు, ఇసీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్వల తవ్వకాలు, ఇందిరమ్మ ఇళ్లలో మరుగుదొడ్లు గడువులోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఇన్చార్జి డీఆర్డీఓ శిరీష, డీపీఓ యాదగిరి, పీఆర్ డీఈ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ప్రజావాణి దరఖాస్తులపై రాష్ట్ర ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షకు సూర్యాపేట నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి దరఖాస్తులను కూడా పరిశీలిం పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెనన్స్కు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, రషీద్ హాజరయ్యారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, పంచామృతాబిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం తర్వాత నిత్య కల్యాణం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం జరపాలి
కోదాడ: పోలీసుల చిత్రహింసల వల్లే దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందాడని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజేష్ మృత దేహానికి రీ పోస్టుమార్టం జరిపి కారణమైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలోని గాంధీ నగర్లో కర్ల రాజేష్ ఇంటి వద్దకు వచ్చిన ఆయన రాజేష్ తల్లి లలితమ్మ, తమ్ముడు కర్ల కమల్ను పరామర్శించారు. అనంతరం రాజేష్పై కేసు నమోదైన చిలుకూరు పోలీస్స్టేషన్, రాజేస్ రిమాండ్ ఖైదీగా ఉన్న హూజూర్నగర్ జైల్ను సందర్శించి అక్కడ వివరాలను సేకరించిన అనంతరం కోదాడలో విలేకరులతో మాట్లాడారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలన్నారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మానవ హక్కుల వేదిక అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక ప్రతినిధులు అక్కనపల్లి వీరస్వామి, అద్దంకి దశరథ, ప్రసాద్, వెంకటరమణ, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ఓటర్లే అధికం
18 మున్సిపాలిటీల్లో తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి జిల్లా పరిధిలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 6,65,585 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 3,42,873 మంది ఉన్నారు. పురుషులు 3,22,617 మంది, ట్రాన్స్జెండర్లు 95 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు జరగబోయే 18 మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా (20,256) ఉన్నారు. అందులోనూ నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,806 మంది ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత సూర్యాపేట మున్సిపాలిటీలో పురుషుల కంటే ఎక్కువ మంది (4,473) మహిళలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కమిషనర్లు డిసెంబర్ 30 నుంచే కసరత్తు ప్రారంభించారు. వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు రూపొందించి గురువారం ప్రకటించారు. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం రాత్రి వరకు ఆయా జాబితాలను ప్రకటించారు. ఆయా మున్సిపాలిటీల్లో మొత్తంగా 6,65,585 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు కసరత్తు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నకిరేకల్ మున్సిపాలిటీకి గతంలో ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో దాని పాలకవర్గం కాల పరిమితి ఇంకా పూర్తికాలేదు. దీంతో మిగతా 18 మున్సిపాలిటీలకే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించనుంది. ఆయా మున్సిపాలిటీల్లో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాలను మున్సిపల్ కమిషనర్లు ప్రకటించారు. నాలుగేళ్లలో పెరిగింది తక్కువే.. 2020 జనవరిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కోసం 2019 చివరలో ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం నిర్వహించబోయే ఎన్నికల కోసం 2023 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాల ఆధారంగా ప్రస్తుతం ముసాయిదా జాబితా రూపొందించారు. 2020లో ఉమ్మడి జిల్లాలోని నకిరేకల్ మినహా మిగితా 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ ఓటర్ల సంఖ్య 6,65,585కు పెరిగింది. అంటే 31,902 మంది ఓటర్లు పెరిగారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది పెరిగారు. ఈ నాలుగేళ్లలో పురుష ఓటర్లు 13,107 పెరిగారు. మహిళా ఓటర్లు 18,722 మంది పెరిగారు. ట్రాన్స్జెండర్లు 73 మంది పెరిగారు.ఫ పురుషుల కంటే 20,256 మంది మహిళలు ఎక్కువ ఫ ముసాయిదా ఓటరు జాబితాల ప్రకటన ఫ నాలుగేళ్లలో పెరిగింది 31,902 మంది ఓటర్లే.. ఫ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 6,65,585 మంది ఫ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ మున్సిపాలిటీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల్లోని వివరాలు.. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ మొత్తంఓటర్లు నల్లగొండ 67,235 72,041 25 1,39,301 చిట్యాల 5,929 6,188 01 12,118 చండూరు 5,652 5,717 01 11,370 హాలియా 6,270 6,529 02 12,801 నందికొండ 6,441 7,079 01 13,521 దేవరకొండ 11,702 12,258 01 23,961 మిర్యాలగూడ 45,128 47,878 14 93,020 సూర్యాపేట 52,205 56,679 13 1,08,897 హుజూర్నగర్ 14,257 15,731 08 29,996 కోదాడ 28,560 30,031 10 58,601 నేరేడుచర్ల 6,629 7,116 01 13,746 పోచంపల్లి 7,808 8,031 – 15,839 చౌటుప్పల్ 13,553 13,663 – 27,216 తిరుమలగిరి 7,638 7,817 – 15,455 యాదగిరిగుట్ట 6,762 7,039 16 13,817 ఆలేరు 6,691 6,978 01 13,670 భువనగిరి 23,040 24,799 01 47,840 మోత్కూరు 7,117 7,299 – 14,416 మొత్తం 3,22,617 3,42,873 95 6,65,585రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పకనకు 2023 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. వాటి ఆధారంగానే ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను తయారు చేసి వార్డుల వారీగా ప్రకటించారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పేర్లు, వార్డుల మార్పు, పేర్లలో తప్పులు దొర్లినా కూడా వాటిని సరిచేసుకునేందుకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. ఆయా జాబితాలపై రాజకీయ పార్టీల నేతలతో 5వ తేదీన మున్సిపాలిటీ స్థాయిలో, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఈనెల 10న మున్సిపాలిటీ వారీగా తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. -
వేగం కన్నా గమ్యం ముఖ్యం
భానుపురి (సూర్యాపేట) : వేగం కన్నా గమ్యం ముఖ్యమని, ఇదే విషయాన్ని ఆర్టీసీ పాటిస్తుందని ఆర్టీసీ నల్లగొండ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట డిపో ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం నల్లగొండ రీజియన్ లో 0.04శాతం యాక్సిడెంట్ రేట్ నమోదైందని, దీన్ని పూర్తిగా తగ్గించేందుకు డ్రైవర్లందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ పి. రవికుమార్, డిపో మేనేజర్ జి.లక్ష్మీనారాయణ, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు మారోజు వీరన్న పేరు పెట్టాలితుంగతుర్తి : తెలంగాణ రాష్ట్రం కావాలని మొట్టమొదట నినదించిన సీపీయూఎస్ఐ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి మారోజు వీరన్న పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో మారోజు వీరన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కుల వర్గ పోరాటాల సిద్ధాంతకర్త మారోజు వీరన్న అని పేర్కొన్నారు. ములుగు జిల్లా ను సమ్మక్క సారక్కగా ప్రకటించాలని, అలాగే మహబూబాబాద్కు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీయూఎస్ఐ నేతలు మట్టపల్లి లింగయ్య, మట్టపల్లి యాదయ్య ,వెంకట్ రాములు ,ఉపేందర్ , రాజేష్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని పట్టు వస్త్రాలంకరణతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణ తంతు ముగించారు. -
రైతు భరోసా ఏది..!
ఫ యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం ఫ పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న రైతాంగం ఫ సాగు భూములకు మాత్రమే ఇస్తుందని ప్రచారం ఫ పెట్టుబడి సాయం ఎప్పుడందుతోనని ఎదురుచూపులు యాసంగి పంట సాగు సమయం పూర్తి కావొస్తోంది. పంటల సాగు పెట్టుబడులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా విడుదల చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఆలస్యం కాకుండా సీజన్ ప్రారంభంలోనే ఇవ్వాలి. – తొట్ల ఉపేందర్, రైతు, కొత్తగూడెం రైతుభరోసా డబ్బులు ఈ యాసంగికి ఇంకా ఇవ్వలేదు. ఈ డబ్బులు ఇస్తే రైతులకు పెట్టుబడులకు ఉపయోగపడుతాయి. ఓవైపు ధాన్యం అమ్మినా డబ్బులు కొందరికి పడలేదు. ఈ రైతుభరోసా రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద పెట్టుబడులకు అప్పు చేయాల్సి వస్తోంది. – కడపర్తి శ్రీను, రైతు, ఆత్మకూర్ (ఎస్) భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి పంటల సాగు ముమ్మరంగా కొనసాగుతోంది. మరో 10 నుంచి 15 రోజుల్లోనే సాగు పనులు పూర్తి కానున్నాయి. ప్రధానంగా వరి నాట్ల పనులు పూర్తయి సీజన్ ముగియనుంది. అక్కడక్కడా వరి కాకుండా ఇతర పంటలను సైతం రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏటా రెండు విడతల్లో అందించే రైతుభరోసా.. ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఇంకా విడుదల చేయలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటల పెట్టుబడులకు డబ్బులు సమయానికి అందడం లేదని వాపోతున్నారు. కాగా ప్రభుత్వం యాసంగి సీజన్లో రైతుభరోసా డబ్బులు జమ చేయడంలో మార్పులు తీసుకొచ్చి.. శాటిలైట్ ఆధారంగా సాగు భూములకు మాత్రమే డబ్బులు జమ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు రైతుభరోసా డబ్బులు వస్తాయో.. రావోనన్న ఆందోళనలో కర్షకులు ఉన్నారు. జిల్లాలో 2,70,853 మంది రైతులు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 8,95,680 ఎకరాల సాగు భూమి ఉంది. 2,70,853 మంది రైతులు ఈ భూమిని సాగు చేస్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేల చొప్పున రెండువిడతల్లో పెట్టుబడిసాయం అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎకరానికి రూ.15వేలను రెండుసార్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ నిధులను ప్రతిఏటా పెంచుతామని మొదటగా ఎకరానికి రూ.6వేలుగా రెండు విడతల్లో రూ.12 వేలను రైతుల ఖాతాలో జమచేస్తామని చెప్పి గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,44,423 మంది రైతుల అకౌంట్లలో రూ.232.92 కోట్లను జమ చేసింది. ఈ సమయంలో పది ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులను ప్రభుత్వం జమచేయలేదు. వివిధ కారణాలతో పది ఎకరాల లోపు ఉన్న రైతులకు కొందరికి ఈ పథకం కింద నిధులు జమ కాలేదు. ఈ వానాకాలం సీజన్లో పంటలను సాగు చేసిన ప్రతి రైతును ఈ పథకాన్ని వర్తింప జేయగా.. 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను అందించారు. పనులు ముమ్మరం.. పత్తాలేని నిధులు.. జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 3.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 10, 15 రోజుల్లో సాగు అంచనా 4.80 లక్షలను చేరుకోనుంది. ఇతర పంటల్లో కూరగాయలు, వేరుశనగ, పెసర పంటలను రైతులు అంతంత మాత్రంగానే సాగు చేశారు. ఈ సాగు పనుల నిమిత్తం ఒక్కో రైతు వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. నవంబర్ 15నుంచే విత్తనాల కొనుగోలు నుంచే రైతులకు పెట్టుబడికి డబ్బులు అవసరం కాగా.. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులకు వానాకాలం వరి ధాన్యం అమ్మిన డబ్బులు పడకపోవడంతో ఈ యాసంగి సీజన్ పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ స్పందన కరువు రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ యాసంగి సీజన్ డబ్బులను ఏ సమయంలో ఇస్తారో చెప్పకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శాటిలైట్ మ్యాప్ ఆధారంగా కేవలం పంటలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ నిధులు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమకు ఈ యాసంగి సీజన్ రైతుభరోసా అందుతుందా..? లేదా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ?మొత్తం భూమి విస్తీర్ణం : 8,95,680 ఎకరాలు రైతులు : 2,70,8532024– యాసంగి రైతులు : 2,44,423 మంది రూ.232.00 కోట్లు 2025 – వానాకాలం రైతులు : 287234 రూ.366.50 కోట్లు -
అర్హులందరికీ పథకాలు అందేలా కృషిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులు గత సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరంలోనూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలపై అవగాహన తెచ్చుకుని ఎలాంటి లోటు పాట్లు లేకుండా అర్హతలను బట్టి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలనూ అధికారులు అందరూ కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా ఉద్యోగులందరూ సమష్టిగా ఒక టీం లాగా ఏర్పడి దాని ఆశయాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. విధుల్లో అలసత్వం, లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.పరిపాలనలో ఉద్యోగులే బలం, బలగమని అన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా సూర్యాపేట జిల్లాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలిప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2026 జనవరిని రోడ్డు భద్రత మాసంగా గుర్తించినట్లు తెలిపారు. కలెక్టరేట్లో రెండు వారాలపాటు హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదన్నారు. అనంతరం జరిమానా కూడా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గుట్ట ఈఓ రాజీనామాపై సర్వత్రా చర్చ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ (రిటైర్డ్ ఐఏఎస్) తన విధులకు రాజీనామా చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాజీనామా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వం నూతన ఈఓగా ఎవరిని నియమిస్తుందనే చర్చ సైతం ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజల్లో నెలకొంది. ఏప్రిల్ 27న ఈఓగా నియామకం యాదగిరీశుడి ఆలయానికి ఐఏఎస్ హోదాలో మొదటి ఈఓగా వెంకట్రావ్ గతేడాది ఏప్రిల్ 27న నియామకమై 30న బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 31న వెంకట్రావ్ పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందుగా ఆగస్టు 30న యాదగిరి ఆలయానికి ఈఓగా కొనసాగించడంతోపాటు అదనంగా శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆలయ ఈఓగా అనేక కార్యక్రమాలు చేపట్టిన భక్తుల మన్ననలు పొందారు. గరుడ ట్రస్టు.. ఉచిత ప్రసాద వితరణ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చెందుతున్న యాదగిరీశుడి ఆలయంలో నూతన సేవలను తీసుకొస్తే బాగుంటుందని వెంకట్రావ్ భావించి, వైదిక కమిటీ సమీక్షలు నిర్వహించారు. ప్రధానంగా గరుడ ట్రస్టు, యాదగిరి మాస పత్రిక, ఈ ఆఫీస్, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొనే భక్తులకు దేవుడి ప్రతిమ, చెల్లా, కనుమ, శ్రీస్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ధర్మ ప్రచారంలో భాగంగా ప్రచార రథానికి మరమ్మతులు చేయించి, గ్రామాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రసాద కౌంటర్లు, ఆలయ పరిసరాల్లో వద్ద క్రియోస్క్ మిషన్లు పెట్టించి, ఆన్లైన్ సేవలను విస్తరించారు. ఫ ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు వెల్లడించిన వెంకట్రావ్ ఫ రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్న స్థానికులు ఫ నూతన సంస్కరణలు, సమీక్షలతో భక్తులకు దగ్గరైన ఈఓయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత రాజీనామా చేసినట్లు వెల్లడించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపించామని, తిరుమల తరహాలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
రోబోటిక్స్ తయారు చేసేలా తీర్చిదిద్దాలి
హుజూర్నగర్ : రాబోయే 10 ఏళ్ల తర్వాత విద్యార్థులు నూతన ఆలోచనలతో రోబోటిక్స్ తయారు చేసే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. హుజూర్నగర్లోని వీవీఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన 53 వ జిల్లా స్థాయి విద్యా, బాల వైజ్ఞానిక ప్రదర్శన–2025 బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన చిన్నారులు ఇప్పుడే పరికరాలను ఉపయోగించి కోతుల బెడదలాంటి సమస్యను పరిష్కరిస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సజనాత్మకత, పరిశోధనా దక్పథం పెంపొందించేందుకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఉపయోగ పడుతుందన్నారు. విద్యార్థులు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, వినోదాత్మక గణిత నమూన నిర్మాణం, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ తదితర అంశాలపై నూతన ఆలోచనలతో ఎగ్జిబిట్లు రూపొందించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. 2026లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టర్.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఈఓ ఆశోక్, తహసీల్దార్ కవిత, ఎంపీడీఓ సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, ఛత్రూ నాయక్, వెంకటాచారి, సత్యనారాయణ రెడ్డి, కాటయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, గురవయ్య, కాంప్లెక్స్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్లో ఇన్స్పైర్ ప్రాజెక్టులు 64, సైన్స్ ఫెయిర్కు సంబంధించినవి 254 ఇలా మొత్తం 318 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్ ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీ ఉత్తమ ఎగ్జిబిట్లను ఎంపిక చేసింది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఇన్స్పైర్ ప్రాజెక్టులు 6, సెన్స్ ఫెయిర్లో సీనియర్ విభాగం నుంచి 7, జూనియర్ విభాగం నుంచి 7, టీచర్ ఎగ్జిబిట్ ఒకటి చొప్పున, సెమినార్ ఒకటి మొత్తం 22 ఎగ్జిబిట్లను ఎంపిక చేశారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఫ రాష్ట్రస్థాయికి 22 ఎగ్జిబిట్లు ఎంపిక -
రిజర్వేషన్లు పాతవేనా?
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సందిగ్ధత ఫ అధికారులు, ముఖ్యనేతల వద్ద ఆరా తీస్తున్న ఆశావహులు ఫ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం ఫ నేడు నోటీసు బోర్డుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రకటన ఫ అభ్యంతరాలను స్వీకరించనున్న అధికారులు ఫ 5, 6 తేదీల్లో మున్సిపల్, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై సందిగ్ధత నెలకొంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లను కొత్తగా మారుస్తారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకపక్క ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలింగ్ బూతుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. వాటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించి పదో తేదీన తుది ఓటర్ల జాబితా విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలకు ఒకే రిజర్వేషన్ విధానం ఉండేలా నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పక్కన పెడుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ వంద శాతం ఎస్టీ గ్రామాలను మినహాయించి మిగితా వాటిల్లో రొటేషన్ పద్ధతిని అవలంబించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు జనరల్కు, జనరల్ బీసీకి, ఎస్సీ స్థానాలు బీసీ, బీసీగా మారినవి చాలా ఉన్నాయి. అయితే అదే పద్ధతిని మున్సిపల్ ఎన్నికల్లో అవలంబిస్తుందా లేక 2020 ఎన్నికల సమయంలో అమలు చేసిన రిజర్వేషన్లనే కొనసాగిస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఆశావహుల్లో ఆసక్తి మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం, ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహుల్లో ఆసక్తి మొదలైంది. సంవత్సర కాలంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్న వారంతా ప్రస్తుతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, ముఖ్య నేతల వద్ద రిజర్వేషన్లు మారుతాయా, లేక పాత వాటినే కొనసాగిస్తారా అనే దానిపై ఆశావహులు ఆరా తీస్తున్నారు. వార్డుల వారీగా తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వార్డుల్లో బుధవారం రాత్రి ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. వాటిని పునఃపరిశీలన చేస్తున్నారు. గురువారం ఉదయం జాబితాలను నోటీసు బోర్డులపై ఉంచనున్నారు. అభ్యంతరాల స్వీకరణ మున్సిపాలిటీల్లో గురువారం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ జాబితాల్లో మార్పులు, చేర్పులపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పేర్ల మార్పు, వార్డుల మార్పు తదితర అంశాలకు సంబంధించి కూడా అభ్యంతరాలను అధికారులు స్వీకరించి వాటన్నింటినీ సరిచేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 5వ తేదీన మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో 6వ తేదీన ఆయా పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారు సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్ నల్లగొండ ఓసీ జనరల్ చిట్యాల జనరల్ హాలియా జనరల్ దేవరకొండ జనరల్ చండూరు బీసీ మహిళ నందికొండ జనరల్ మహిళ మిర్యాలగూడ జనరల్ సూర్యాపేట జనరల్ హుజూర్నగర్ జనరల్ మహిళ కోదాడ జనరల్ మహిళ నేరేడుచర్ల ఎస్సీ జనరల్ తిరుమలగిరి ఎస్సీ మహిళ భువనగిరి బీసీ జనరల్ ఆలేరు బీసీ జనరల్ భూదాన్పోచంపల్లి బీసీ మహిళ చౌటుప్పల్ బీసీ జనరల్ మోత్కూరు జనరల్ మహిళ యాదగిరిగుట్ట బీసీ మహిళ -
మరింత మెరుగైన సేవలు అందిస్తాం
సూర్యాపేటటౌన్ : కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందిస్తాం. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యాం. బాధితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. గతంతో పోలిస్తే 2025లో 82 శాతం ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. 2026లోనూ ఇది కొనసాగిస్తాం. డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి, రోడ్డు ప్రమాదాలు నిర్మూలించడానికి, సైబర్ నేరాలు నిరోధించడానికి, మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి పని చేస్తూ ముందుకెళ్తాం. 2026లో ప్రజలందరికీ శుభం కలగాలి. జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – నరసింహ, జిల్లా ఎస్పీ -
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
భానుపురి (సూర్యాపేట) : కోదాడలో దళితుడు కర్ల రాజేష్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని డిస్మిస్ చేయాలన్నారు. సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని, నిపుణులతో రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని కోరారు. జైభీమ్ సినిమా మాదిరిగా పోలీసుల కుట్రలు ఉన్నాయని, రాజేష్ను చిత్రహింసలు పెట్టి ఎలాగైనా చనిపోయేలా ఉన్నాడన్న తొందరలో కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. చిలుకూరు ఎస్ఐని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ కేసును కనుమరుగయ్యేలా చేయాలని చూస్తున్నారని, మరింత ప్రజా ఉద్యమంలా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. జనవరి 10వ తేదీన కోదాడలో కర్ల రాజేష్ సంతాపసభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. తమ విన్నపాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెపన్పారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ పాల్గొన్నారు.ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ -
కొత్త ఆశయాలతో..
సూర్యాపేట జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం –2026 శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను జనంలోకి తీసుకెళ్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడడమే ధ్యేయం. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రత్యేకంగా లక్ష్యాలంటూ ఏమీ లేకున్నా.. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు మేలు చేయడం కోసం నిరంతరం పనిచేస్తా. వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తా. – కె.సీతారామారావు, అదనపు కలెక్టర్ నూతన ఏడాదిలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు జిల్లాలో 100 శాతం అమలు చేసేందుకు నావంతు కృషి చేస్తా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజలు పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు ముందుంటాం. గ్రామాల్లో కొలువు దీరిన సర్పంచులను ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపిస్తాం. – యాదగిరి, డీపీఓ ఫ నూతన సంవత్సరంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నిలుపుతాం ఫ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక ఫఅధికారుల మనోగతం -
భవిష్యత్కు బాలమేధస్సు ఎంతో అవసరం
హుజూర్నగర్ : భవిష్యత్కు బాలమేధస్సు ఎంతోఅవసరం అని జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని వీవీఎం ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శనను అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డి. రాధిక అరుణ్ కుమార్ .. జ్యోతి ప్రజ్వలన చేయగా డీఈఓ అశోక్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ కోతి సంపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్లతో కలిసి సైన్స్ఫెయిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ఫెయిర్ ఎంతో దోహద పడతుందన్నారు. సైన్స్ ఫెయిర్లో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో అనువర్తించుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక త వైజ్ఞానిక ప్రదర్శన వల్ల బయటపడుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అవగతం చేసుకొని మానవాళి వికాసానికి తోడ్పడాలని సూచించారు. తిలకించిన 2వేల మంది విద్యార్థులు సెన్స్ ఫెయిర్లో దాదాపు 246 వైజ్ఞానిక ప్రదర్శనలు, 47 ఇన్స్పైర్ ప్రాజెక్టులు కలిపి 293 ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. ఇందులో 500 మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా సుమారు 2 వేల మంది విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, ఛత్రూ నాయక్, వెంకటాచారి, సత్యనారాయణ రెడ్డి, కాటయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, గురవయ్య, వివిధ మండలాల కాంప్లెక్స్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెచ్ఎంలు, జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ డీఈఓ అశోక్ ఫ హుజూర్నగర్లో అట్టహాసంగా జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభం ఫ 293 ఎగ్జిబిట్ల ప్రదర్శన -
పుర పోరుకు అడుగులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ కేంద్రాల ఖరారుకు నోటిపికేషన్ విడుదల చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. గురువారం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. 11 నెలల కిందటే ముగిసిన పాలక వర్గాల గడువు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిల్లో నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు అదే నెల 25వ తేదీన వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ ఏడాది జనవరి 27వ తేదీతోనే పాలకవర్గాల కాలపరిమితి ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 11 నెలల తరువాత ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుంది. 2023 అక్టోబరు1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మున్సిపల్ కమిషనర్లు మంగళవారం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజించారు. బుధవారం పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇక జనవరి 1వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణను ఆ రోజు నుంచి 4వ తేదీ వరకు చేపట్టనున్నారు. 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపాలిటీల్లో, 6వ తేదీన జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు.10వ తేదీన తుది ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేస్తారని రాజకీయ పార్టీల నేతలు భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. 18 మున్సిపాలిటీలకే ఎన్నికలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉంటే 18 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2011 ఆగస్టు 24వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నకిరేకల్ను ఆరు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ నుంచి తమ గ్రామాలను తొలగించాలని కోర్టుకు వెళ్లారు. 2013 సెప్టెంబర్ నెలలో విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించడమే కాకుండా, ఆ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగింది. 2015లో గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా నిర్వహించింది. అయితే ఆ తర్వాత 2020 డిసెంబరు 16వ తేదీన మళ్లీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2021 ఏప్రిల్ 30వ తేదీన మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం మే 7న కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఆ పాలక వర్గమే 2026 మే 6వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 407 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పోటీ చేయాలనుకున్న వారంతా ఎన్నికల కోసం సిద్దమవుతుండటంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. మున్సిపాలిటీ వార్డులు మిర్యాలగూడ 48 హాలియా 12 దేవరకొండ 20 భూదాన్పోచంపల్లి 13 చిట్యాల 12 నల్లగొండ 48 సూర్యాపేట 48 మోత్కూర్ 12 భువనగిరి 35 ఆలేరు 12 చండూరు 10 నేరేడుచర్ల 15 హుజూర్నగర్ 28 తిరుమలగిరి 15 కోదాడ 35 నందికొండ 12 యాదగిరిగుట్ట 12 చౌటుప్పల్ 20 ఫ ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు.. 407 వార్డులకు ఎన్నికలు ఫ అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాతోనే.. ఫ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని ఖరారు చేసిన మున్సిపల్ కమిషనర్లు ఫ రేపు ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రకటన -
పని ప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం
భానుపురి (సూర్యాపేట) : పని ప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయమని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు పేర్కొన్నారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టంపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ శిరీష, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి నరసింహారావు, కమిటీ సభ్యులు దయానందరాణి, శంకర్ నాయక్, జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, టీఎన్జీవోస్ జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్ పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు
సూర్యాపేటటౌన్ : మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 104 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం 1334 మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. మన విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు మొదలైనవి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నామని, మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు. మొబైల్ పోయినా, దొంగలించినా సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ బాధితులకు 104 మొబైల్స్ అందజేశాం ఫ సెల్ఫోన్ రికవరీ మేళాలో ఎస్పీ నరసింహ -
సైనస్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి
ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బుల రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి – అంజయ్య, సూర్యాపేటసమాధానం : బీపీ, షుగర్, గుండె జబ్బు ఉన్న వారు చలిలో తిరగొద్దు. చలి ప్రభావంతో రక్తనాళాలు మూసుకపోయి రక్తప్రసారంలో ఇబ్బందులు ఏర్పడటం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు, వృద్ధులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. చలిలో బయటకు వెళ్లకపోవడం మంచిది. సూర్యాపేటటౌన్ : ‘కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులు, కాలుష్యం ప్రభావంతో చిన్నారులు, వృద్దులు, గర్భిణులు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమయంలో జనం అప్రమత్తంగా ఉండాలి. స్వీయరక్షణతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు’ అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించింది. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానాలు ఇచ్చారు. తగిన సలహాలు, సూచనలు చేశారు. ప్రశ్న: చలి తీవ్రత ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి –పిచ్చయ్య, మేళ్లచెరువు సమాధానం : నవంబర్ నెల నుంచి చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకూడదు. శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. లో దుస్తులు ధరించి వెచ్చదనానికి ఉన్ని దుస్తులు ధరించాలి. అనారోగ్య సమస్య వస్తే మెడికల్ షాపుల్లో ఇష్టమొచ్చిన యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. ప్రశ్న: వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయాలి – మోత్కూరి వీరభద్రాచారి, గణపవరం, మునగాల మండలం సమాధానం : మునగాల మండల కేంద్రంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయాలంటే మా పరిధిలో ఉండదు. కలెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేందుకు నావంతు కృషి చేస్తా. ప్రశ్న: సైనస్ సమస్య వల్ల విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి – మల్లెపాక యాకయ్య, లక్ష్మాపురం, నాగారం మండలం సమాధానం : ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి సైనస్ సమస్య ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మెదడు చురుకుదనం తగ్గి కళ్లు తిరుగుతాయి. ఉదయం, రాత్రి వేళల్లో నిండు దుస్తులు వేసుకొని గాలి తలగకుండా ఉన్ని దుస్తులు ధరించాలి. సమస్య తీవ్రంగా ఉంటే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చెవి, ముక్కు వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రశ్న: సూర్యాపేటలో కేన్సర్ ఆసుపత్రి ఉందా? – వెంకటేశ్వర్లు, సూర్యాపేటసమాధానం : సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేన్సర్ సెంటర్ను ప్రారంభించాం. మొదట హైదరాబాద్లోని ఆసుపత్రిలో టెస్టులు చేయించుకొని నిర్ధారణ అయితే ఇక్కడ చికిత్స అందిస్తారు. ప్రశ్న: గొంతు నొప్పి వస్తోంది.. ఏం చేయాలి – ప్రమీల, సూర్యాపేటసమాధానం : ప్రతి రోజు ఉదయం గోరు వెచ్చని నీరు తాగాలి. అలాగే వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. ఇవి చేయడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ ఉదయం బాగా ఆవిరి పట్టినా ఉపశమనం ఉంటుంది. ఫ చలిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు బయటికి వెళ్లొద్దు ఫ అస్వస్థతకు గురైతే డాక్టర్ను సంప్రదించాలి ఫ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అన్ని పీహెచ్సీల్లో అందుబాటులో మందులు ఫ ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి – శ్రవణ్, కోమటిపల్లి, అర్వపల్లి మండలంసమాధానం : వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి , కూల్ డ్రింక్స్, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్థాలు తీసుకోవాలి. ప్రశ్న: మా పిల్లలకు జ్వరం, దగ్గు విపరీతంగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి – పిట్టల జానయ్య, అడివెంల, అర్వపల్లి మండలండీఎంహెచ్ఓ : చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల అశ్రద్ధ చేయొద్దు. బయటకు వెళితే కాళ్లకు గాలి తగలకుండా సాక్స్లు, చేతులకు గ్లౌజులు వేయాలి. అలాగే ముక్కులోకి చలిగాలి వెళ్లడం ద్వారా ద్రవాలు గడ్డ కట్టి రక్తం పడే అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిని తాగించాలి. అలాగే ఆవిరి పడితే తుమ్ముల నుంచి ఉపశమనం పొందుతారు. చల్లటి పదార్థాలు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. -
3.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
భానుపురి (సూర్యాపేట ) : ఈ సంవత్సరం ఖరీఫ్ ధాన్యం సేకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో 62,887 మంది రైతుల నుంచి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు 2025– 26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ,మెప్మా, ఎఫ్ పీఓల ఆధ్వర్యంలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 62,887 మంది రైతుల ద్వారా 2,27,320.560 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 1,00258.720 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మొత్తం కలిపి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందుకుగాను రైతులకు రూ.782.59 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే బోనస్ కింద మరో రూ.113.65 కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సరిపడా ఎరువులుసూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎవరూ అధైర్య పడవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిల్లలమర్రి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయవద్దని సూచించారు. యాసంగి 2025 సీజన్కు ప్రస్తుతం జిల్లాలో 10,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే 32,910 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఓ కృష్ణ సందీప్, పీఏసీఎస్ సిబ్బంది వెంకన్న, రైతులు శివరాత్రి బుచ్చి రాములు, బీరెల్లి రామచంద్ర రెడ్డి, వెంకట్ రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు. 3, 4న సూర్యాపేట జిల్లాలో జనం బాటహుజూర్నగర్ : జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనవరి 3,4 తేదీల్లో సూర్యాపేట జిల్లాకు రానున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ వెల్లడించారు. మంగళవారం హుజూర్నగర్లో జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. 3వ తేదీన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు, 4న హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జనం బాట కార్యక్రమం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు కేఎల్ఎన్ రావు, ఎస్కే మస్తాన్, కె. గోవర్ధన్, కేఎస్ఎన్ రెడ్డి, నర్సింహా రావు, ఉదారి వేణు, సతీష్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
సూర్యాపేట : అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలూ అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా రూ.42వేల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు.. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీరాంజి పేరు పెట్టడం మహాత్ముడిని అవమానించడమేనని అన్నారు. గ్రామాలలో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కుతూ అప్రజా స్వామిక పరిపాలన కొనసాగిస్తోందన్నారు.ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న మతోన్మాద చర్యలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఎన్కౌంటర్ల ద్వారా అణిచివేస్తోందన్నారు. ఇటీవల సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి,, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‘పాలమూరు –రంగారెడ్డి’కి రెండు ప్రభుత్వాలూ అన్యాయం చేశాయి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి
మునగాల: నూతనంగా ఎన్నికై న మునగాల సర్పంచ్ నల్లపాటి ప్రమీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 1,2,3,12,14 వార్డులలో ఆమె పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుక్కలు, కోతుల బెడదను నివారించాలని పలువురు .. సర్పంచ్ దృష్టికి తీసువచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కారస్ల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు కొప్పుల జైపాల్రెడ్డి, నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకిరెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, ఉప్పుల యుగంధర్రెడ్డి, ఎండి.రషీద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తు వేగవంతం కానుంది. వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి 10న ప్రకటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 30న మున్సిపాలిటీల వారీగా వివరాలు సరిచూసుకోవాలని, 31వ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. జనవరి 1న పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల ముసాయిదా ప్రకటించాలని స్పష్టం చేసింది. 5వ తేదీన మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని వివరించింది. 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రకటించాలని వెల్లడించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా 2011 ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలను కూడా జారీచేసింది. డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా బాధ్యతల స్వీకరణ నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సీఈఓ శంకర్రావు, అధికారులు నర్మద, సంపత్రెడ్డి, శ్రీనివాస్, మైపాల్రెడ్డి పాల్గొన్నారు. ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలి సూర్యాపేటటౌన్ : ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి సూచించారు. సోమవారం సూర్యాపేట లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేశులతో కలిసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ భవాని, కాకతీయ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మధు, పీపీటీసీటీ డివిజన్ కౌన్సిలర్ ఎన్.లక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు సింగ్ మధు, సృజన పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు వేళాయే..
నేటి నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ● హుజూర్నగర్లోని విజయ విద్యామందిర్లో ఏర్పాట్లు ● రెండు రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్న విద్యార్థులు ● కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిసూర్యాపేటటౌన్ : విద్యార్థులు సృజనాత్మకతకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే వైజ్ఞానిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. 2025–26 విద్యా సంవత్సరం జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ను మంగళ, బుధవారాల్లో హుజుర్నగర్లోని విజయ విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధి కారులు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈసైన్స్ ఫెయిర్ను ఉదయం 10గంటలకు నీటిపారుదల పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో ఏడు జూనియర్, ఏడు సీనియర్ ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఎగ్జిబిట్ల అంశాలు 1. సుస్థిర వ్యవసాయం 2. వ్యర్థ పదార్థాల నిర్వహణ 3. ప్రత్యామ్నాయ మొక్కలు 4. హరితశక్తి(పునరుత్పాదక శక్తి) 5. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదభరిత గణిత నమూనాలు 6. ఆరోగ్యం, పరిశుభ్రత 7. నీటి సంరక్షణ – నిర్వహణ 300 సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన..జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 180, ప్రైవేట్ పాఠశాలలు 250, ప్రాథమికోన్నత 70, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్స్ తొమ్మిది, అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ 12 ఉన్నాయి. వీటిలో ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు ప్రాజెక్టులు తీసుకురానున్నారు. అయితే జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మనక్ పోటీల్లో ఎంపికై న 64 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల ప్రాజెక్టులు 10తో పాటు మొత్తం 300 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలిహుజూర్నగర్ : హుజూర్నగర్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈఓ అశోక్ కోరారు. వీవీఎం స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించే ఎగ్జిబిట్లను తిలకించటానికి జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఎగ్జిబిట్లను తిలకించడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస, శాస్త్రవిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, వివిధ మండలాల కాంప్లెక్స్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు. 23 పర్యవేక్షణ కమిటీల ఎంపిక సైన్స్ఫెయిర్ నిర్వహణకు ఉపాధ్యాయులతో 23 కమిటీలను నియమించి బాధ్యతలు అప్పగించారు. వీరు ఎప్పటికప్పుడు సైన్స్ ఫెయిర్ నిర్వహణ చూసుకుంటారు. సైన్స్ఫెయిర్లో ఏర్పాట్లు, విద్యార్థులకు వసతి, భోజన, మంచినీరు, ఇతర సౌకర్యాలు ఈ కమిటీల సభ్యులకు అప్పగించారు. కమిటీలో మొత్తం 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. -
విద్యకు ఊతం
నీళ్లకు నిధులు...భానుపురి (సూర్యాపేట) : జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 2025 సంత్సరం.. జిల్లాలకు కలిసొచ్చింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల, విద్యతో పాటు పలు రంగాలకు భారీగా నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకాలంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల వరద పారించారు. ఎత్తిపోతల పథకాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు, నవోదయ, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. ఇక రాజధాని నుంచి హైదరాబాద్ – విజయవాడ హైవే ఆరులేన్ల పనులకు ఈ ఏడాదే మోక్షం లభించింది. నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున.. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది. ఈ నిధులు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను సూర్యాపేట మినహా మూడు నియోజకవర్గాలకు వచ్చాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులు చేయాల్సి ఉంది. ఇందులో పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులతో కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు.. పాలేరు జలాలను ఎత్తిపోసి ఎస్సారెస్పీ 24 కెనాల్, 36 కెనాల్లతో ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు గాను రూ.244 కోట్లను ఈ ఏడాదే విడుదల చేసింది. దీంతో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు ఢోకా లేకుండా సాగునీరు అందుతుంది. ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే కోదాడ నియోజకవర్గ పరిధిలో రెడ్లకుంట లిఫ్ట్కు రూ.25 కోట్లు, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు మరో రూ.50 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది నిధులను మంజూరు చేసింది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఐదారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సైతం చింతలపాలెం, పాలకవీడు, మఠంపల్లి మండలాల్లో సుమారుగా రూ.250 కోట్ల నిధులు వచ్చాయి. సీఎం చేతుల మీదుగా.. రెండు సంక్షేమ పథకాలు జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. జూలై 14న తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డులను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల మందికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. విద్యకు అధిక ప్రాధాన్యం.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2025లో విద్యకు అధిక ప్రాధాన్యత దక్కింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి నవోదయ స్కూల్ మంజూరు కాగా.. కోదాడ పరిధిలోని బాలాజీనగర్లో రూ.34 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. చిలుకూరు, గరిడేపల్లి మండలాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో పాఠశాలలో 2,500 మందికి వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. గరిడేపల్లి మండలంలో హార్టికల్చర్ కొండాలక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీకి అనుబంధంగా 40 సీట్లతో హార్టికల్చర్ కళాశాల మంజూరైంది. హుజూర్నగర్ శివారులో రూ.100 కోట్లతో వ్యవసాయ కళాశాల, అడ్వాన్స్డ్ట్రైనింగ్ సెంటర్ను టాటా కంపెనీతో కలిసి ప్రారంభించారు. కోదాడలో వంద పడకల ఆస్పత్రి కోదాడ పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని రూ.26 కోట్లతో వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు.అలాగే 3.5 కోట్లతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా రోగుల అవసరం నిమిత్తం సమకూర్చారు. హుజూర్నగర్లోని ఏరియా ఆస్పత్రిలో నూతన ఓపీ బ్లాక్ నిర్మాణంతో పాటు పాత ఓపీ బ్లాక్ మరమ్మతులకు రూ.3.60కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.కోటితో ఈ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్, రూ.3కోట్లతో సీటీ స్కాన్ సెంటర్ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరిన కల.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత పేదలకు సొంతింటి కల నెరవేరింది. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలను దశలవారీగా ఇస్తూ పథకాన్ని ప్రారంభించగా.. వివిధ దశల్లో జిల్లావ్యాప్తంగా 4వేల ఇళ్లు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మోతె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు రూ.244 కోట్లు హుజూర్నగర్లో వ్యవసాయ కళాశాల కోదాడలో నవోదయ.. గరిడేపల్లి, చిలుకూరు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరురూ.300 కోట్ల నిధులుప్రత్యేక అభివృద్ధి నిధులే కాకుండా ఇతర నిధుల విషయంలోనూ సూర్యాపేట నియోజకవర్గం చిన్నబోయింది. హుజూర్నగర్ నియోజకవర్గంలో లింక్ రోడ్లను తారురోడ్లుగా, మండల కేంద్రం నుంచి జిల్లాకేంద్రానికి డబుల్ రోడ్లుగా మార్చే ప్రక్రియ ఈ ఏడాది మరింత ముందుకు సాగింది. ఈ క్రమంలో ఒక్క హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోనే రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల నిధుల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పెద్దగా నిధులు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి సైతం పాలకులు పాటుపడాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. -
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా వాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. వివిధ శాఖల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రైవేటు భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వివరాలను సమర్పించాలన్నారు. ఈ భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చుకోవాలని, లేదంటే 2026జనవరి 1 నుంచి ఆయా కార్యాలయాలకు అద్దె చెల్లింపులు నిలిపివేస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, జిల్లా అధికారులు సతీష్, కె.నర్సింహారావు, సిద్ధార్థ, శిరీష, దయానంద రాణి, కిషన్ నాయక్, అశోక్, భానునాయక్, వెంకట రమణ పాల్గొన్నారు. యూరియా కొరత లేదుభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ .. జిల్లాలో యూరియా పంపిణీ పై అధికారులతో సమీక్షించారు. 2025 యాసంగిలో జిల్లాలో ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసేందుకు వివిధ సొసైటీలు, డీలర్లు,ఎన్డీసీఎం ఎస్, ఏ ఆర్ ఎస్ కే, మార్క్ఫెడ్ గోదాములలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో ఈ సీజన్ లో రైతులకు 32,910 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 544 సెంటర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య, జిల్లా ఉద్యాన శాఖ డీడీ కె .సుభాషిణి పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డీఎంహెచ్ఓతో నేడు ఫోన్ఇన్
దేవరకొండ ఖిలా సందర్శన దేవరకొండ ఖిలాను తెలంగాణ హెరిటేజ్(పురావస్తు శాఖ) డిపార్ట్మెంట్ డైరెక్టర్ అర్జున్రావ్ సందర్శించారు. - 8లోచలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణతో మంగళవారం సాక్షి ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేది. 30.12.2025 మంగళవారం సమయం: ఉదయం 11–00 నుంచి మధ్యాహ్నం 12–00 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 98493 09022 -
కొత్త సంవత్సర వేడుకల్లో ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దని సూచించారు. ఫామ్ హౌస్, క్లబ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దని కోరారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దని, వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్ లాంటివి చేయొద్దని, ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా వేడుకలు నిర్వహించుకోవడం మంచిదని కోరారు. చైనా మాంజా ఉపయోగించొద్దు గాలిపటాలు ఎగురవేయడానికి చైనా మాంజా ఉపయోగించవద్దని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ దారం గాలిపటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఫ్యాన్సీ షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రహస్యంగా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100 కు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. ఎస్పీ నరసింహ -
పేద ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా
సూర్యాపేట అర్బన్ : స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి కార్మిక హక్కుల పోరాటం వరకు ఎర్రజెండా ఎప్పుడూ పీడిత ప్రజల పక్షాన నిలిచిందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందేళ్లుగా శ్రామిక వర్గం వైపు నిలబడి పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీకి జేజేలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగయ్య, లక్ష్మయ్య, శంకర్, సైదులు, సంధ్య, కిరణ్, నరసింహారావు, నాగమల్లు, బొల్లె వెంకన్న, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు -
విలపించిన పుల్లెంల
గట్టుప్పల్,చండూరు : పుల్లెంల కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ హనుమంతు ఎటుపోయిండని బోరున విలపించింది. ఒడిశా రాష్టంలో ఈనెల 25న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు ఆలియాస్ గణేష్ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన పుల్లెంలకు చేరుకుంది. ఆయన కడసారి చూపు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామాన్ని ముందుగానే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నా.. ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉదయం నుంచే గ్రామంలో ఎదురు చూశారు. అంబులెన్స్లో ఆయన పార్థివదేహం వచ్చాక ప్రజలు ఎర్ర జెండాలు చేతబూని అంబులెన్స్పై పూలు చల్లుతూ ర్యాలీగా హనుమంతు ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా హనుమంతు ఇంటి దగ్గరకు పరుగులు పెట్టారు. ఆయన పార్థివదేహాన్ని చూపిన జనం బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ఆయనకు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ‘జోహార్ హనుమంతు’ నినాదాలతో ఆయన అంతిమయాత్ర గ్రామంలో మూడు గంటలపాటు సాగింది. ఫ అశ్రునయనాలతో మావోయిస్టు నేత హనుమంతుకు అంతిమ వీడ్కోలు -
ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుందాం
కోదాడరూరల్ : ఫొటో, వీడియోగ్రాఫర్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు షేక్.హుస్సేన్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో ది కోదాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. కుటుంబ భరోసా పథకాన్ని ఏర్పాటు చేసుకొని ఆపదలో ఉన్న ఫొటో, వీడియో గ్రాఫర్ల కుటుంబాలకు రూ.3.50 కోట్ల మేర ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ.. కోదాడలో ఫొటోగ్రాఫర్ల భవన నిర్మాణ సమస్యను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షుడు వనపర్తి వర్మ, ప్రధాన కార్యదర్శి కరిశ స్వామి, కోశాధికారిగా నక్క సురేష్బాబు ప్రమాణాస్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కూకుట్ల లాలు, గౌరవ అధ్యక్షులు బొమ్మల వెంకన్న , జూలురు బసవయ్య, జెమిని నరేష్ పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓతో రేపు ఫోన్ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణతో మంగళవారం సాక్షి ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేది. 30.12.2025 మంగళవారం సమయం: ఉదయం 11–00 నుంచి మధ్యాహ్నం 12–00 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 98493 09022 -
యాసంగి సాగు జోరు
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సాగు జోరుగా సాగుతోంది. ప్రధానంగా వరినాట్లు ముమ్మరం అయ్యాయి. బోరుబావులతో పాటు సాగర్, మూసీ ఆయకట్టులకు నీటిని విడుదల చేయడంతో సాగు పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు సాగు అంచనాలో 90 శాతం పూర్తి కానుంది. ఇక వేరుశనగ, పెసర పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే సాగు పనులు ముమ్మరం కానున్నాయి. ఈ ప్రాంతంలోనే చివరగా నాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. నెలరోజులుగా బిజీబిజీ నవంబర్ 15 నుంచే జిల్లాలో యాసంగి సీజన్ పనులను రైతులు ప్రారంభించారు. వానాకాలం అత్యధికంగా వరి సాగు చేయగా.. యాసంగిలోనూ ఇదే పంట కోసం రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. వరి గడ్డి పోగు చేయడమే కాకుండా (ఎలగడ) దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. విత్తనాల కొనుగోలు, నారుమడులు సిద్ధం చేసుకోవడం.. ఇలా ఒక్కో పనులను పూర్తి చేసుకుని ఈనెల 15 నుంచి వరినాట్లు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లోని బోరుబావుల కింద జోరుగా నాట్లు సాగుతున్నాయి. చాలామంది రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు డ్రమ్సీడర్, వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. రైతులంతా ఒకేసారి నార్లు పోయడంతో కూలీల కొరత మొదలైంది. నాట్లు సకాలంలో వేయకుంటే ముదిరిపోయి దిగుబడి తగ్గుతుందనే ఆందోళనలో ఉన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం.. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు దాదాపు 2.20 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల వరకు ఈ ఆయకట్టు కింద వరి సాగు జరుగుతోంది. అయితే నీటి విడుదల కోసం ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నీటి షెడ్యూల్ విడుదల చేయడంతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. తెలిసిన వారి వద్ద నార్లు అడగడం, లేదంటే డ్రమ్సీడర్ విధానంలో సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ ఆయకట్టుకు నీటి విడుదల చేస్తే సాగు పనులు ముమ్మరం కావడమే కాకుండా కూలీల కొరత రానుంది. దాదాపు సంక్రాంతి వరకు కూడా ఈ ప్రాంతంలో వరి నాట్లు కొనసాగే అవకాశం ఉంది. వానాకాలం సీజన్లో రైతులు యూరియా కోసం చాలా తిప్పలు పడ్డారు. ఇలాంటి పరిస్థితి యాసంగి సీజన్లో రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతాంగానికి సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే యాసంగి సీజన్ నిమిత్తం దాదాపు 31వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశారు. మరో 30వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు జిల్లాకు అందుతోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న యూరియా మొదటి సారికి సరిపోతుందని, రానున్న రోజుల్లో వచ్చే యూరియాతో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం రావని అధికారులు పేర్కొంటున్నారు. ఫ ఇప్పటివరకు 2.80 లక్షల ఎకరాల్లో నాట్లు ఫ బోరుబావుల కింద జోరుగా వ్యవసాయం ఫ మూసీ, సాగర్ ఆయకట్టులోనూ ముమ్మరంగా పనులు ఫ యాసంగి సాగు అంచనా 4.82 లక్షల ఎకరాలు -
కబడ్డీ చాంపియన్గా సూర్యాపేట జిల్లా జట్టు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్ షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయస్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అమిత్ కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. -
నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాక
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలోని జీవీవీ గార్డెన్లో సోమవారం నిర్వహించే సీపీఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరుకానున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతోపాటు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు కార్యకర్తలకు అవసరమైన సూచనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. అనంతరం ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సీపీఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యక్షేత్రంలో వైభవంగా మహా సౌరహోమంఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. ముకువారు నవల ఆవిష్కరణ అనంతగిరి: మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గల గీతా మందిరంలో ఆదివారం సాహితీ కళాపీఠం ఆధ్వర్యంలో ముకువారు నవల పుస్తకాన్ని సర్పంచ్ గోపతి లలితమ్మ ఆవిష్కరించారు. నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత దాసరి లింగస్వామి ఈ నవలను రచించడం అభినందనీమన్నారు. కార్యక్రమంలో సాహితీ కళాపీఠం అధ్యక్షుడు లింగమూర్తి, కృష్ణమూర్తి, గోపతి లక్ష్మణ్, సతీష్, హుస్సేన్, ఉపేందర్, బొంకురి భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడే కార్యకర్తలకే పదవులు
ఫ పీసీసీ పరిశీలకులు బిజ్జి చత్రురావు, మానాల మోహన్రెడ్డి భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కష్టపడే ప్రతి కార్యకర్తకూ పదవులు వస్తాయని, అన్ని మండలాల నుంచి డీసీసీ కార్యవర్గాన్ని కూర్పు చేస్తున్నామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చత్రురావు, మానాల మోహన్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గానికి ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు జనరల్ సెక్రటరీలు, మండలానికో సెక్రెటరీని నియమించి జనవరి ఒకటో తేదీ వరకు డీసీసీ నూతన కమిటీ ఎన్నికను పూర్తిచేస్తామన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడకుండా నూతన కార్యవర్గానికి బాసటగా నిలవాలన్నారు. అందరి సహకారంతోనే జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలను గెలుపొందామని, గెలుపునకు కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేయకుండా కార్యకర్తలతో గులాంగిరి చేయించుకుందని, మన పార్టీకి అన్ని రకాల కార్యవర్గాలు ఉన్నాయన్నారు. నూతన కార్యవర్గం అందరిని కలుపుకుని పనిచేస్తూ రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని కోరారు. పదేళ్లలో జరిగిన అవినీతిలో జగదీష్రెడ్డికి కూడా భాగం ఉందని ఆరోపించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, డీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కాలం కలిసొచ్చినా..!
భానుపురి (సూర్యాపేట) : రైతులకు 2025 సంవత్సరం కలిసొచ్చింది. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. అయినప్పటికీ రైతులు పడరాని పాట్లు పడ్డారు. ప్రధానంగా యూరియా కోసం తెల్లవార్లూ జాగారం చేసిన సందర్భాలు ఉన్నాయి. వరికోత దశలో కురిసిన అకాల వర్షాలతో కొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక పత్తి విక్రయంలో ప్రభుత్వాలు తెచ్చిన విధానాలతో రైతులు కొత్త సమస్యలను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రకృతి సహకరించినా.. ప్రభుత్వ విధానాలు, అమలు కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇక రైతులందరికీ రైతు భరోసా నిధులు ఆర్థికంగా ఊరట కలిగింది. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందించిన బోనస్ కారణంగా సన్నరకాల వరిసాగు పెరిగింది. సాగు ఇలా సాగింది.. 2025వ సంవత్సరంలో మొదటగా వచ్చిన 2024 యాసంగి సీజన్లో 4,98,864 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 99 శాతం మేర వరి 4,96,068 ఎకరాల్లో సాగైంది. బోరుబావులతోపాటు నాగార్జున సాగర్, మూసీ, ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని అందించారు. 2025 వానాకాలం 4,94,470 ఎకరాల్లో వరి, 96,823 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇతర పంటలన్నీ కలిపి మొత్తంగా జిల్లాలో 5,94,944 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్లో ఎస్సారెస్పీ ఆయకట్టుకు సమృద్ధిగా నీటి విడుదల లేకపోవడంతో చాలావరకు వరిపొలాలు ఎండిపోయాయి. యాసంగి సీజన్లో అకాల వర్షాలతో 1,104 ఎకరాల్లో 662 మంది, ఈ ఏడాది అక్టోబర్లో మోంథా తుపాన్తో 3,099.89 హెక్టార్లలో 8195 మంది రైతులు పంట నష్టపోవాల్సి వచ్చింది. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో కొనసాగించింది. 2024 యాసంగిలో 2,44,423 మంది రైతులకు రూ.232.92 కోట్లు అందాయి. 2025 వానాకాలంలో 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను పెట్టుబడి సాయం అందింది. 2024లో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. రైతుబీమా కింద 272 మంది రైతులకు రూ.10.05 కోట్లు విడుదల చేసింది. యూరియా కోసం పడిగాపులు ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా యూరియా కోసం ఇబ్బందులు పడని రైతంటూ ఎవరూ లేరు. దాదాపు నెలరోజుల పాటు సమస్య తీవ్రంగా ఉంది. రైతులు మిగతా పనులు మానుకుని రాత్రి పగలు క్యూలైన్లలో వేచిఉండి యూరియా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రాప్బుకింగ్, ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు విధానాలతో పంట విక్రయానికి ఇక్కట్లు పడుతున్నారు. బోనస్తో సన్నాలసాగు వైపు.. వరిలో సన్నరకాలకు క్వింటాకు ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇవ్వడంతో ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత యాసంగిలో 2,63,250 ఎకరాల్లో సన్నాలను సాగు చేయగా.. ఈ వానాకాలం 3,86,093 ఎకరాల్లో సాగుచేశారు. ప్రభుత్వం 2025 వానాకాలం కింద ఇప్పటి వరకు 41,519 మంది రైతుల వద్ద కొనుగోలు చేయగా, వీరికి రూ.100.49 కోట్ల బోనస్ రావాల్సి ఉండగా రూ.49.64 కోట్లు చెల్లించింది. వరిసాగులో రైతులు డ్రమ్సీడర్, వెదజల్లే పద్ధతులు అవలంబించారు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో వర్షాలకు దెబ్బతిన్న వరిపొలం (ఫైల్) యూరియా కోసం అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రోడ్డుపై క్యూకట్టిన రైతులు (ఫైల్) మొత్తం 4,98,864 వరి 4,96,068 దిగుబడి 12,05,396 మెట్రిక్ టన్నులు మొత్తం 5,94,944 వరి 4,94,470 పత్తి 96,823 వరి దిగుబడి 11,96,887 మెట్రిక్ టన్నులు పత్తి దిగుబడి 9.70 లక్షల క్వింటాళ్లు 2025లో రైతులను వెంటాడిన కష్టాలు ఫ యూరియా కోసం పడరాని పాట్లు ఫ పత్తి అమ్మకంలోనూ ఇబ్బందులే.. ఫ రైతు భరోసా నిధులతో ఊరట ఫ బోనస్తో పెరిగిన సన్నాల సాగుసీజన్ రైతుల సంఖ్య విడుదలైన నిధులు యాసంగి–2024 2,44,423 రూ.232.92 కోట్లు వానాకాలం–2025 2,87,234 రూ.366.50 కోట్లు -
మున్సిపోల్స్కు రెడీ..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది. పదవీ కాలం ముగిసి 11 నెలలు.. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పునర్విభజన లేకపోతే జనవరిలోనే షెడ్యూల్ ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తంహుజూర్నగర్ 14,143 15,643 00 29,786 కోదాడ 28,560 30,192 00 58,752 నేరేడుచర్ల 6,689 6,822 01 13,512 సూర్యాపేట 47,740 50,913 00 98,653 తిరుమలగిరి 6,943 6,844 00 13,787 ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,32,291 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 64,900 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ఫ ముందుగా మున్సిపాలిటీ.. ఆ తరువాతే పరిషత్ ఎన్నికలు! ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు -
టాప్రా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో శనివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టాప్రా) జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా టాప్రా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా యరమాద వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా బెడద సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా మన్నె యాదగిరి, ఉపాధ్యక్షులుగా వెంకట్రాంరెడ్డి, ముషం నరసింహ, శివ రామయ్య, దేవశెట్టి పద్మ, కార్యదర్శులుగా బీఆర్ భూషణం, జె.దేవరాజు, ప్రసాద్రావు, సత్యనారాయణ, కోశాధికారిగా ఆర్.సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా కమ్మంపాటి అంజయ్య, జమాలుద్దీన్, రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతారాం, ఎల్.రాణి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఎదగాలి కోదాడరూరల్ : ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఎర్ర శ్రీనివాస్ శనివారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, పైడిమర్రి సత్తిబాబు, నారాయణరావు, వెంకటనారాయణ, ఓరగంటి ప్రభాకర్, నీలా సత్యనారాయణ, ఇమ్మడి రమేష్, రాయపూడి వెంకటనారాయణ, వెంపటి మధు, ఓరుగంటి కిట్టు, కుక్కడపు బాబు, యాదా సుధాకర్, అశోక్ పాల్గొన్నారు. రాజేష్ కుటుంబానికి అండగా ఉంటాంకోదాడ : అనుమానాస్పద స్థితిలో మరణించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డపుకు మల్లయ్య అన్నారు. శనివారం కోదాడలోని కర్ల రాజేష్ ఇంటికి వచ్చిన ఆయన రాజేష్ తల్లి లలితమ్మను పరామర్శించి మాట్లాడారు. రాజేష్ మృతికి కారకులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీస్ అధికార ప్రతినిధి ఏపూరి రాజు, కోదాడ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దావీద్, మందుల శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, నవీన్, అంజిబాబు, వంశీ, కర్ల కమల్, కుడుముల వెంకటయ్య ఉన్నారు. -
వాజ్పేయి ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆదర్శం
సూర్యాపేట : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతి బీజేపీ కార్యకర్తకు మార్గదర్శకమని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి, సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ తూటుపల్లి రవి, చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాజ్పేయి ప్రవేశపెట్టిన సుపరిపాలన విధానాలే నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత బలంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికై న జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, తుక్కాని మన్మథరెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, రంగినేని రుక్మారావు, నూనె సులోచన, దండం మురళీధర్ రెడ్డి, బాల వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి నూతన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
42 ఏళ్లకు నిర్జీవిగా..
నల్లగొండ, చండూరు : ఒడిషాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు 1983లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నది కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. 42 ఏళ్ల తరువాత ఎన్కౌంటర్లో హనుమంతు మరణించారన్న వార్తతో ఆయన స్వగ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. హనుమంతు మృతదేహాన్ని ఊరికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, పాపమ్మకు ఆరుగురు సంతానం. వారిలో పెద్ద పాక హనుమంతు. ఆయన తర్వాత పాక అశోక్, యాదమ్మ, లింగమ్మ, సత్తయ్య, పద్మ జన్మించారు. కుటుబంలో పెద్దవాడైన హనుమంతు 1960లో జన్మించారు. ఆయన స్వగ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో పదో తరగతి చదివి తరువాత నల్లగొండ పట్టణానికి చేరుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఎన్జీ కాలేజీలో డిగ్రీ చేస్తుండగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటికి వచ్చింది కూడా లేదు. కుటుంబ నేపథ్యం ఇదీ.. మనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయాక, తండ్రి చంద్రయ్యకు ఉన్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో 2 ఎకరాలు అమ్మేసి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. ఆ తరువాత ఇద్దరు కుమారుల వివాహం చేశారు. ఉన్న రెండెకరాల్లో వారికి చెరొక ఎకరం ఇచ్చారు. మొదట్లో కుటుంబం గడవకపోవడంతో అశోక్ ఊరిలోనే కొన్నాళ్లు జీతం ఉన్నాడు. ఆ తరువాత ఆయనతోపాటు కొంతవరకు చదవుకున్న రెండో తమ్ముడు సత్తయ్య నల్లగొండకు వచ్చి స్థిరపడ్డారు. పెద్ద తమ్ముడు పాక అశోక్ బట్టషాపుల్లో పనిచేస్తుండగా, చిన్నతమ్ముడు పాల వ్యాపారం చేస్తున్నారు. 2016లో వారి తండ్రి చంద్రయ్య, 2021లో తల్లి పాపమ్మ మరణించే వరకు పుల్లెంలలోనే నివసించారు. హనుమంతు తల్లిదండ్రులను కలిసిన అప్పటి ఎస్పీ దుగ్గల్ పాక హనుమంతు మావోయిస్టు ఉద్యమంలో రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకుడిగా మూడు రాష్ట్రాల ఇంచార్జిగా ఎదిగారు. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 5 సార్లు హనుమంతు ఎన్కౌంటర్లలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనని లొంగిపోవాలని చెప్పాలని గతంలో నల్లగొండ ఎస్పీగా పనిచేసిన విక్రమ్జిత్ దుగ్గల్ పుల్లెంలకు వచ్చి హన్మంతు తల్లితండ్రుల ద్వారా చెప్పించారు. వారికి దుస్తులు, నిత్యావసరాలు ఇచ్చి పరామర్శించారు. చదువులో, ఆటల్లో మేటి హనుమంతు చిన్నప్పుడు చదువులో ఆటల్లో మేటిగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఎక్కువగా కబడ్డీ ఆడేవాడని, చదువులో కూడా ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా ఉండేవాడని, నిత్యం ఆటపాటలతో ఊ రంతా కలియ తిరిగేవారమని చెబుతున్నారు. హనుమంతు 10 తరగతి చదువు కునేంత వరకు విప్లవ భావజాలం అతనిలో కనిపించలేదని, నల్లగొండకు వెళ్లిన తర్వాత ఇక తాము కలవలేదని పలువురు మిత్రులు తెలిపారు. హనుమంతు అంత్యక్రియలు స్వగ్రా మం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు శుక్రవారం ఉదయం వారు ఒడిషాకు వెళ్తున్నారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు. చిన్నప్పుడు హనుమంతు గ్రామంలో ఉన్నంత వరకు బాగా ఆడుకునేవాళ్లం. తన చేతిరాత చాలా బాగా ఉండేది. కాలేజీకి నల్లగొండకు వచ్చాక ఆయన నక్సలిజం భావాలకు మళ్లాడు. ఆర్ఎస్యులో కళాశాల సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నాను. ఏచూరి శ్రీను హత్య కేసులో హనుమంతు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. – బొబ్బల మురళిమనోహర్రెడ్డి, పుల్లెంల ఫ విద్యార్థి దశలో ఊరు విడిచి వెళ్లిన హనుమంతు ఫ మావోయిస్టు ఉద్యమంలో అంచలంచెలుగా ఎదిగిన పుల్లెంల వాసి ఫ ఎన్కౌంటర్లో మృతితో గ్రామంలో విషాద ఛాయలు ఫ కుటుంబ సభ్యుల కడసారి చూపునకు స్వగ్రామానికి చేరుకోనున్న మృతదేహం -
తుదిదశకు కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ తుదిదశకు చేరుకుంది. ఇప్పటివరకు దాదాపు 3.12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించింది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం దొడ్డురకం, సన్నరకం వరిధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరికోతలు ఆలస్యంగా జరిగిన ఆత్మకూర్ (ఎస్), మోతె, పెన్పహాడ్ మండలాల్లో 10వేల మెట్రిక్ టన్నుల నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. మిగతా చోట్ల దాదాపు పూర్తయ్యాయి. 348 కొనుగోలు సెంటర్లు వానాకాలం సీజన్లో జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. సుమారు 10.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని, ఇందులో రైతుల అవసరాలు, ప్రైవేట్ అమ్మకాలు పోగా ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు 4,30,880 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం భావించింది. ఇందులో దొడ్డురకం 1,94,591 మెట్రిక్ టన్నులు, సన్నరకం 2,36,289 లక్షల మెట్రిక్ టన్నులు ఉండనుందని అంచనా వేసింది. ఈ మేరకు 121 దొడ్డురకం సెంటర్లు, 227 సన్నరకం వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది. రైతుల ఖాతాల్లో రూ.615 కోట్లు జమ గత వానాకాలం సీజన్లో సన్నరకాలకు తోడుగా దొడ్డురకం వరికి సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఈసారి దొడ్డురకానికి అంతగా డిమాండ్ లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. గతేడాది కంటే ఈ వానాకాలం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. గత వానాకాలం సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ సారి ఇప్పటికే 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం 17,588 మంది రైతుల నుంచి 99,173 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఇక 30,537 మంది రైతుల నుంచి 2,13,450 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.746 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని 48,125 మంది రైతుల నుంచి సేకరించగా.. మరో 10 నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సిద్ధంగా ఉంది. ఇక.. రూ.615 కోట్ల ధాన్యం బిల్లులను రైతుల అకౌంట్లలో జమ చేశారు.ఫ జిల్లాలో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఫ కోతలు ఆలస్యమైన మండలాల్లో తప్ప మిగతాచోట్ల పూర్తయిన కొనుగోళ్లు ఫ సేకరించిన ధాన్యం విలువ రూ.746 కోట్లు -
దళితులపై అగ్రవర్ణాల దాడి అమానుషం
మునగాల: ఇటీవల మునగాల మండలం నారాయణగూడెంలో పంచాయతీ ఎన్నికల అనంతరం అగ్రవర్ణాలకు చెందిన కొందరు నాయకులు దళితులపై దాడి చేయడం అమానుషమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమళ్ల చెన్నయ్య అన్నారు. గురువారం నారాయణగూడెంలోని మాల కాలనీవాసులను ఆయన పరామర్శించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో మాల కులస్థులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై పోలీసు యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం సబబు కాదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మిట్టగణుపుల జగన్నాథం, మిట్టగణుపుల శ్రీను, కన్నెకంటి శైలజ, సుగుణ, కోదాడ నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ యాదవ్, లింగయ్య పాల్గొన్నారు. -
ల్యాబ్ టెక్నీషియన్లు వస్తున్నారు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు గ్రేడ్– 2 ల్యాబ్ టెక్నీషియన్లు వస్తున్నారు. గతేడాది గ్రేడ్– 2 ల్యాబ్ టెక్నీషన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవంబర్లో విడుదల చేసింది. ఇందులో ఎంపికై న వారికి జోన్ల వారీగా పోస్టులు కేటాయించారు. యాదాద్రి జోన్కు 149 పోస్టులను కేటాయించగా ఇటీవల జరిగిన కౌన్సిలింగ్లో 52 మంది సూర్యాపేట జిల్లాకు వచ్చారు. దీంతో ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత తీరనుంది. అందనున్న మెరుగైన సేవలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పీహెచ్సీల్లో 40 మంది వరకు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. చాలా పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేక ఏదైనా అనారోగ్యం పాలైతే రక్త పరీక్షకు సూర్యాపేట పట్టణానికే వస్తున్నారు. ఇప్పుడు ప్రతి పీహెచ్సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ను పూర్తి స్థాయిలో కేటాయించనున్నారు. జిల్లాకు 52 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించగా.. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 20 మంది, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి 14, పీహెచ్సీలకు 10, డీఎంహెచ్ఓ ఆఫీస్కు ఒకటి, తెలంగాణ వైద్య విధాన పరిషత్కు 8 మంది చొప్పున కేటాయించారు. వీరు మరో రెండు, మూడు రోజుల్లో నియామకపత్రాలు తీసుకుని విధుల్లో చేరనున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే వారితో పాటు రెగ్యులర్గా నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ఖాళీగా ఉన్న పీహెచ్సీల్లో కేటాయించనుండటంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఫ జిల్లాకు 52 మంది కేటాయింపు ఫ రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలు అందుకోనున్న ఉద్యోగులు -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేడు నిరసన
సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కందాల శంకర్రెడ్డి గురువారం తెలిపారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతుల మనుగడకే ప్రమాదం వాటిల్లిందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలకు రద్దు చేసి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతాంగం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభను జయప్రదం చేయండి సూర్యాపేట : సూర్యాపేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించే తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మహాసభలో పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వెంకటేశ్వర్లు, బి.సోమయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ మహాసభకు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు హాజరు కానున్నారని వివరించారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని గురువారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు.. అమలు చేశారుఫ గోదాం నిర్మాణానికి సొంత స్థలం విరాళంగా ఇచ్చిన సర్పంచ్ కోదాడరూరల్ : కోదాడ మండలంలోని మంగలితండాలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన తొలి హామీని సర్పంచ్ ధారవత్ బాబ్జీ గెలిచిన వెంటనే అమలు చేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రైతుల కోసం ఎరువుల గోదాం, రైతుల సమావేశానికి కావాల్సిన స్థలానికి తన సొంత భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు గురువారం రెండు గుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చి తొలి హామీని నెరవేర్చారు. మిగిలిన హామీలను కూడా త్వరలో అమలు చేస్తానని ఆయన తెలిపారు. -
కేసులు సత్వరం పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన వినియోగదారుల కేసులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినియోగదారుడు మార్కెట్లో వస్తువు కొనుగోలు చేసే సమయంలో ఏది మంచో ఏది చెడో గ్రహించాలన్నారు. వ్యాపారులు తమ లాభార్జన కోసం తప్పుడు ప్రకటనలు, ఆఫర్లు ప్రకటిస్తారని, వాటిని చూసి అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం డిజిటల్, ఆన్లైన్ నేరాలు పెరిగిపోయాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారుడు మోసపోయినట్లయితే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి సత్వర న్యాయం పొందాలన్నారు. డీసీఐసీ కమిషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా కేసును దాఖలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా అధికారి మోహన్బాబు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, సివిల్ సప్లయ్ మేనేజర్ రాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, కమిషన్ సభ్యుడు ప్రేమ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
బిల్లులిస్తారా సారూ!
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పాలకవర్గాలు కొలువు దీరాయి. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆశలు చిగురించాయి. కానీ రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో అప్పులు చేసి గ్రామాభివృద్ధిలో నిధులు ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ఈ ఎన్నికలు ఆర్థిక భారాన్ని మిగిల్చాయి. పంచాయతీ ఎన్నికల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు రూ.15నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు మాత్రం రూ.5నుంచి రూ.7వేల వరకే చెల్లించారు. మిగతా డబ్బంతా తాము జేబు నుంచి పెట్టుకోవాల్సివచ్చిందని కార్యదర్శులు వాపోతున్నారు. ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయకుండా బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో మొదటి విడత 159 జీపీలు, రెండోవిడతలో 181, మూడోవిడతలో 146 జీపీల చొప్పున ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులదే. పోలింగ్ కేంద్రాల్లో శానిటేషన్ నుంచి విద్యుత్, తాగునీరు, పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు, టేబుళ్లు.. ఇలా ప్రతిదీ పంచాయతీ కార్యదర్శులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పోలింగ్కు ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికితిరిగి వెళ్లే వరకూ టీ నుంచి టిఫిన్లు, భోజనాల బాధ్యతలూ వీరివే. ఓటర్ల ఆధారంగా సిబ్బంది.. గ్రామంలో ఉండే ఓటర్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తోంది. పోలింగ్ స్టేషన్లో 200 మంది ఓటర్ల కన్నా తక్కువ ఉంటే ఇద్దరు, ఎక్కువ ఉంటే ముగ్గురు చొప్పున పీఓ, ఏపీఓలను నియమించారు. ఇలా చిన్న గ్రామపంచాయతీలో 6 వార్డులు ఉంటే పీఓలు, ఏపీఓలే కాకుండా వెబ్ కాస్టింగ్, స్టేజ్ –2 అధికారి, పోలీస్ సిబ్బంది ఇలా 25 మంది దాకా ఎన్నికల విధుల్లో ఉంటారు. అదే మేజర్ గ్రామపంచాయతీ అయితే ఒక్కో గ్రామంలో 12 వార్డులైతే 48 మంది, 14 వార్డులైతే 60 మంది ఉంటారు. ఎన్నికల నిర్వహణ లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లోవసతులు కల్పించ డం, పోలింగ్ సిబ్బందికి భోజనాల, స్నాక్స్ ఖర్చుల కింద ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రానికి రూ.500 చొప్పున కేటాయించారు.జిల్లాలోని 486 గ్రామపంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రధానంగా లైటింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంది. అలాగే శానిటేషన్, టెంట్లు, మంచినీరు, టేబుళ్లు ఇలా ఇవే దాదాపు రూ.10వేల వరకు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ రోజుకు ముందు రాత్రి వచ్చే ఎన్నికల సిబ్బందికి రాత్రి భోజనం, ఉదయం ఆరుగంటలకే టీ, టిఫిన్, తిరిగి 11 గంటలకు టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5గంటలకు బిస్కెట్స్, టీ అందించారు. ఈ భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్ ఖర్చు భారీగా వచ్చినట్లు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చిన్న గ్రామపంచాయతీలకు రూ.10వేల దాకా, మేజర్ గ్రామపంచాయతీలకు రూ.20నుంచి రూ.30వేల వరకు వీటికే ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం వార్డుకు రూ.500ల చొప్పున లెక్క కట్టి రూ.6నుంచి రూ.7వేల వరకు ఎంపీడీఓల చేతుల మీదుగా కార్యదర్శులకు అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపై దాదాపు రూ.10 నుంచి రూ.20వేల వరకు అదనపు భారం పడినట్లయింది. ఫ పంచాయతీ ఎన్నికల్లో రూ.15వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు ఫ మౌలిక వసతుల కల్పన, భోజనాలు, టీ, స్నాక్స్కు వినియోగం ఫ చేతినుంచి పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శులు ఫ ఒక్కో పంచాయతీకి కేవలం రూ.5వేలు చెల్లింపు ఫ ఇప్పటికే అప్పుల పాలయ్యాం.. మిగతావి చెల్లించాలని వేడుకోలు -
సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరం
కోదాడ: సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరమని పాలక ప్రభుత్వాలు ఈ రెండింటినీ ఉచితంగా అందించాలని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పబ్లిక్క్లబ్ ఆవరణలో వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యలో అంతరాలకు పాలకుల విధానాలే కారణమన్నారు. కవులు, రచయితలు ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కొరవడిందన్నారు. సమాజాని నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి పౌరస్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. దీనికి రచయితలు, కవులు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. పలువురు కవులు, రచయితలు కవితలను వినిపించారు. ఈ సమావేశంలో పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్. ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఏ. మంగ, రమణ, రామ్మూర్తి, అనిల్కుమార్, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, ఆంజనేయులు, పుప్పాల కృష్ణమూర్తి, వీరాచారి, ఖాజామియా, దండాల మధుసూధన్రెడ్డి, హమీద్ పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జగదీష్రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్శాంతి, సామరస్యాలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరారు. ప్రశాంతవతావరణంలో ఐక్యతతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం సూర్యాపేట సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, మధ్యాహ్న భోజనం, ఖైదీల గదులను పరిశీలించారు. అనంతరం వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీలు డీఎల్ఎస్లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు.ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు ,పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ సీఈకి ఈఎన్సీగా పదోన్నతిఖమ్మంఅర్బన్ : సూర్యాపేట జిల్లా జలవనరుల శాఖ సీఈగా, ఖమ్మం ఇన్చార్జి సీఈగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమేష్బాబుకు పదోన్నతి లభించింది. ఆయనకు జల వనరుల శాఖలో ఈఎన్సీ(అడ్మిన్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన పదోన్నతితో రెండు జిల్లాల సీఈ పోస్టులు ఖాళీ కాగా, త్వరలోనే మరో అధికారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడిచివ్వెంల(సూర్యాపేట) : మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడి చేశాడు. ఈ ఘటన చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకటేశ్వర్లు జి.తిర్మలగిరి గ్రామంలోని సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఏఎన్ఎం పట్ల మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. కొంతమంది స్థానికులు గమనించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో మండల వైద్యాధికారి జి. భవాని జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి పెండెం వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ తెలిపారు. -
ఏరు.. తోడేస్తుండ్రు
మోతె: ఇసుక దందా ఆగడంలేదు. కొందరు అక్రమార్కులు కూడలి గ్రామంలోని ఏరును తోడేస్తున్నారు. ఇసుకను యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కూడలి గ్రామ సమీపంలో.. కూడలి గ్రామం సమీపంలో ఏరు ఉంది. ఇందులో నీరు నిల్వ ఉన్నప్పటికీ కొందరు అక్రమార్కులు అందులోకి దిగి ఇసుకను తవ్వుతున్నారు. ఏరుకు చుట్టు పక్కల ఉన్న నర్సింహాపురం, రంగాపురంతండా, సర్వారం, రావికుంటతండా తదితర గ్రామాలకు చెందిన కొందరు ఇసుకదందాకు అలవాటు పడి ప్రకృతి సందపను దోచుకుంటున్నారు. మోతె మండలానికి సరిహద్దున ఉన్న జిల్లాలకు.. కొందరు ఈ ఇసుకను ఏరు ఒడ్డున కుప్పగా పోసి ఆ తర్వాత ట్రాక్టర్లలో నింపుతుండగా ఇంకొందరు డైరెక్ట్గా ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు. రోజూ 90 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. మోతె మండలానికి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, వరంగల్ పరిధిలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పట్టణానికి ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు మాత్ర హడావుడి చేసి నామమాత్రంగా రెండు, మూడు ట్రాక్టర్లు పట్టుకొని కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే. అతివేగంతో ట్రాక్టర్లు కూడలి–సూర్యాపేట రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై ఇసుక ట్రాక్టర్లు తీవ్ర వేగంతో ప్రయాణించడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ చూపి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి కూడలి ఏరు నుంచి అక్రమంగా ఇసుక తరలించకుండా ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇసుకను ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలంటున్నారు.ఫ కూడలి గ్రామంలోని ఏరు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా ఫ రోజూ 80 ట్రాక్టర్ల వరకు తరలింపు ఫ ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.7వేలకు విక్రయం కూడలి గ్రామంలోని ఏరులో ఇసుక రీచ్ల ఏర్పాటుకు కృషి చేస్తాం. తద్వారా వినియోగదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా చేయడానికి సులువు అవుతుంది. ఇసుక రీచ్ల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం నుంచి గానీ మైనింగ్ శాఖ నుంచి గానీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు – ఎం. వెంకన్న, తహసీల్దార్, మోతె -
యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత
యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్మోహన్రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనానికి ఆలయాధికారులు, దాతలు సుభాషిని, వెంకట్రాంరెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ బ్యాటరీ వాహనాన్ని వినియోగించాలని దాత ఆలయాధికారులను కోరారు. అనంతరం వారు యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వెండి ఆరాధన పాత్రలు బహూకరణ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం సికింద్రాబాద్లోని వారాసిగూడకు చెందిన బూస కృష్ణ, కుటుంబ సభ్యులు వెండి ఆరాధన పాత్రలను బహూకరించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రూ.2.50లక్షలు (2 కిలోల 106 గ్రాములు) విలువ చేసే 5 పాత్రలతో పాటు ఒక ప్లేట్ను ఆలయ అర్చకులు, అధికారులకు అందజేశారు. అంతకుముందు బూస కృష్ణ, కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయంరామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టుకు ఏఎస్పీ జి.రమేష్ టోర్నీ కప్ అందజేశారు. -
మహిళా సౌరభం
మోత్కూరు : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజరు భూములతో లీజు ఒప్పందం చేసుకొని పరస్పర అంగీకారంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో దేవాదాయ భూములను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. ఈ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వీరారెడ్డి, ఆర్డీఓ ఎం. కృష్ణారెడ్డి, డీఆర్డీఓ కె. నాగిరెడ్డితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే బుజిలాపురం సోలార్ పవర్ ప్లాంట్ మొదటిదని అధికారులు చెబుతున్నారు. బుజిలాపురంలోని 8 ఎకరాల దేవాదాయ భూమిలో రూ.6 కోట్లతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ ద్వారా ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఎకరాకు రూ.15వేల చొప్పున డీఆర్డీఏ ద్వారా చెల్లించడానికి మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో జమవుతాయి. జిల్లా మహిళా సమాఖ్య, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల మహిళా సమాఖ్యలు కలిసి రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక మెగావాట్కు రూ.3 కోట్ల చొప్పున 2 మెగావాట్లకు కలిపి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 10 శాతం అనగా రూ.60 లక్షలు, మహిళా సంఘాల వాటా 1 మెగావాట్ యూనిట్కు రూ.కోటి ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల యూనిట్లకు గాను రూ.2కోట్ల రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల ద్వారా సంవత్సరానికి రూ.16.60 లక్షల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1 యూనిట్ విద్యుత్కు రూ.3.13 చెల్లించి తెలంగాణ రెడ్కో కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.52 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణం, వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాం బుజిలాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ అధికారుల సహకారంతో 8 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని లీజుకు తీసుకున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వాటా ధనం చెల్లించాం. అన్నిరకాల ఒప్పందాలను కంపెనీతో కుదుర్చుకున్నాం. సోలార్ పవర్ ప్లాంట్తో మహిళా సంఘాలకు పెద్దఎత్తున ఆదాయం చేకూరనుంది. – టి. నాగిరెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా జీవనోపాధి పొందుతాం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో జీవనోపాధి పొందుతాం. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నాం. దీంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పడం సంతోషంగా ఉంది. – మిడిదొడ్డి శైలజ, మోత్కూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలుఅదృష్టంగా భావిస్తున్నాం యాదాద్రి జిల్లా మహిళా సమాఖ్యకు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బుజిలాపురంలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఆర్డీఓ అధికారుల కృషి ఎంతో ఉంది. జిల్లా అధికారులకు మహిళా సంఘాల పట్ల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. – కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, యాదాద్రి భువనగిరి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం రాష్ట్రంలోనే రప్రథమంగా మోత్కూరు మండలం బుజిలాపురంలో శంకుస్థాపన -
అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఫ అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వరశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మహంకాళి కిరణ్శర్మ, లహరి నరసింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్శర్మ, ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంతాచార్యులు, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్, సహాయ కార్యదర్శులుగా ఫణికుమారాచార్యులు, వలివేలు, విద్యాధరశర్మ, హరీష్శర్మ, ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశ గోపాలచార్యులతో పాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫ ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడిగా జినుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా రాజ్యలక్ష్మి, అధ్యక్షుడిగా అలుగుబెల్లి సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్రెడ్డి, కోశాధికారిగా కె. ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్. అంజనేయులు, కొండారెడ్డి, డి. శ్రీనివాస్, సమన్వయ సభ్యులుగా ఎన్. రమణ, గోవిందరెడ్డి, వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్బీవీ యోగానందంతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డీవీకే శర్మ, ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శ్రవణ్కుమారాచార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్శర్మ, అర్చక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్శర్మ, బండారు శ్రీనివాస్, అనిల్కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న యలగందుల వెంకన్న(50) తన కుమారుడు రాకేష్తో కలిసి స్థానికంగా మిల్క్ సెంటర్ నడుపుకుంటున్న తన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 21న రాత్రి వెళ్లారు. వెంకన్న కూమారుడు రాకేష్ శ్రీకాంత్ వద్ద పాల వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ షాపులోనే అతడి స్నేహితుడైన చీమలగడ్డకు చెందిన పుట్ట కిరణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. వెంకన్న తన కుమారుడు రాకేష్కు రావాల్సిన జీతం డబ్బుల గురించి శ్రీకాంత్ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అసభ్య పదజాలంతో వెంకన్నను దూషిస్తూ డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. దీంతో వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్పై చేయి ఎత్తడానికి ప్రయత్నించగా.. రాకేష్ అడ్డుగా వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మరింత ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ పక్కనే ఉన్న పాల ట్రేతో రాకేష్పై దాడి చేయబోగా.. వెంకన్న అడ్డురావడంతో అతడి తలపై పాల ట్రేతో కొట్టి గాయపర్చాడు. అంతేకాకుండా సిమెంట్ ఇటుకతో వెంకన్న ముఖంపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వెంకన్న కుమారుడు రాకేష్, పుట్ట కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి వెంకన్నను అంబులెన్స్లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకన్న కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గట్టు శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్రెడ్డి, వెంకటేశం, ఎస్ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
భువనగిరి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన శ్రీరాం కుమార్ మూడో కుమారుడు రామకృష్ణ(22) బుధవారం ఉదయం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ గేదెలకు పాలు పితికి ఇంటికి వెళ్లి పాలు పెట్టిన తర్వాత మళ్లీ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద పశువులను మేత కోసం వదిలి వాటి వెనుక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు కిందపడి ఉండటాన్ని సోదరుడు గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి ● మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చిట్యాల : హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్ని గతేడాది మేడ్చల్లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది. పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలిఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి నాగార్జునసాగర్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగార్జునసాగర్లో నూతనంగా నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 30, 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించి తాము దాచుకున్న డబ్బులను అవసరాల మేరకు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షన్ అనేది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సేవకు పొందే లబ్ధి హక్కు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గానోతుల వెంకట్రెడ్డి, శ్రీశైలం, నారాయణరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, గోవర్థన్రెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు. చిట్యాలలో పత్తి రైతుల ఆందోళన చిట్యాల : పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని చిట్యాల పట్టణ శివారులో సీసీఐ ఏర్పాటు చేసిన క్రిష్ణ కాటన్ మిల్లు వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ మిల్లు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర పత్తి లోడు ట్రాక్టర్లు ఉండడంతో చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇదే సమయంలో పత్తి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు చిట్యాల–ఉరుమడ్ల రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు సీసీఐ కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐదు క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకుని అదనంగా పత్తిని రైతులు తీసుకురావడంతో కొనుగోళ్లలో ఆలస్యమై ట్రాక్టర్లు బారులదీరినట్లు తెలుస్తోంది. పోలీసులు కాటన్ మిల్లు వద్దకు చేరుకుని రైతుల ఆందోళనను విరమింపజేశారు. సీసీఐ కేంద్రం అధికారి కోటేశ్వరరావు, కాటన్ మిల్లు నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో శాంతించారు. సాంకేతిక సమస్యలతో అదనంగా స్లాట్ బుక్ అయినట్లు సీసీఐ కేంద్రం అధికారి పేర్కొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంకోదాడరూరల్ : బైక్పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని దోరకుంటకు చెందిన జక్కుల శివ(45) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోదాడ బస్టాండ్ వద్దకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా. ఖమ్మం క్రాస్రోడ్ వద్ద మేళ్లచెర్వు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తమ్ముడు కొండలు ఫిర్యాదు మేరకు సీఐ కె. శివశంకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలి
● జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీరామగిరి(నల్లగొండ) : కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమియత్ ఉలేమాయే హింద్ కోరిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన హామీని నెరవేర్చాలన్నారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ప్రజల నుంచి వేరుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జమియత్ ఉలేమాయే హింద్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ. హఫీజ్ఖాన్, జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, అబ్దుల్ రెహమాన్, జియాఉద్దీన్, హఫీజ్ ఫుర్ఖాన్, సమీ, హఫీజ్ శంషుద్దీన్, హఫీజ్ అయూబ్ పాల్గొన్నారు. -
సరికొత్తగా సాగు.. దిగుబడులు బాగు
నడిగూడెం : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సాగు నీటి లభ్యత ఎక్కువగా పెరగడంతో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో నారుమడి అవసరం లేకుండా పంట కాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో, డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నారు పోయడం, నీరు పెట్టడం, నాట్లు వేయించడం.. ఇవన్నీ పాత తరం వరి సాగు పద్ధతులు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు సాగుపై చేసే ఖర్చు పెరగడం, మరో వైపు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రమ్సీడర్ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో నడిగూడెం మండల వ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 శాతం డ్రమ్సీడర్, 70 శాతం వెదజల్లే పద్ధతిలోనే పంట సాగు చేపట్టారు. డ్రమ్సీడర్ను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్సీడర్తో విత్తనాలు వెదజల్లడంతో నిర్ధిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. డ్రమ్సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. 3 నుంచి 4 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులపై రైతుల్లో పెరుగుతున్న అవగాహన -
పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి సరికాదు
మిర్యాలగూడ అర్బన్: పెన్షనర్లపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాజ్యాగం ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలు పాటించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విద్యారంగాన్ని సంస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఉచిత పథకాల వలన ప్రయోజనం లేదని వాటి స్థానంలో ఉత్పాదక శక్తిని పెంచే పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరారు. పెన్షనర్లకు 5 డీఏలు పెండింగ్లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రెండో పీఆర్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పాదూరి విద్యాసాగర్రెడ్డి, వి. బంగారయ్య, నూకల జగదీష్చంద్ర, అనుముల మధుసూదన్రెడ్డి, ఎం. జనార్దన్రెడ్డి, కడారి ప్రేమ్చంద్, వెంకటేశం, రాఫెల్, శ్యాంసుందర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి, ప్రకాశరావు, రామావతారం, శంకర్రెడ్డి, శ్రీనిసరెడ్డి, అంజిరెడ్డి, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
టెట్ వాయిదా వేయాలి
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, కొందరు ఉపాధ్యాయులు మూడు దశల ఎన్నికల విధులను కూడా నిర్వర్తించారని తెలిపారు. ఈ ఎన్నికల విధుల కారణంగా టెట్కు సన్నద్ధమయ్యే సమయం దక్కలేదని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెట్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులు ప్రిపేర్ అయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలని విన్నవించారు. విద్యారంగాన్ని రక్షించుకుందాంతుంగతుర్తి : ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని షేక్ సయ్యద్ ప్రాంగణం (బండారు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో)లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన సోమయ్య అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ విస్త్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు భీమిరెడ్డి సోమిరెడ్డి, జోగునూరి దేవరాజు, ఓరుగంటి అంతయ్య, సీహెచ్.రాములు, సిరికొండ అనిల్కుమార్, పి.వెంకటేశం, ఎడ్ల సైదులు, పి.శ్రీనివాస్రెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, జె.కమల, ఇతర సంఘాల నాయకులు వై.వెంకటేశ్వర్లు, కేఏ.మంగ, ఆర్.ధనమూర్తి, బుర్ర శ్రీనివాస్, టి.యాదగిరి, ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, ఎస్.సోమయ్య, వి.రమేష్, బి.ఆడమ్, సీహెచ్.రమేష్ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. నృసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రబాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
చిన్నారుల్లో దృష్టిలోపం నివారించేలా..
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రభుత్వం పాఠశాలల్లోని చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య దశ నుంచే పిల్లల్లో వచ్చే అంధత్వ నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) సమన్వయంలో రెండు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంత మందికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మూడో విడతగా.. ప్రస్తుతం మూడో విడతగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మరోసారి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందం రోజుకు సుమారు 500 నుంచి 1000 మంది వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలు ఎవరికంటే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం దృష్టి లోపుం ఉన్నట్లు గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వనున్నారు. తద్వారా ఆయా పాఠశాల్లో మొత్తం 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థుల్లో దృష్టి లోపం గుర్తించేందుకు నేటి నుంచి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు ప్రత్యేకంగా నాలుగు వైద్య బృందాలను నియమించాం. రోజూ పాఠశాలలకు వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తాయి. అవసరమైన విద్యార్థులకు కళ్లజోళ్లు అందిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫ రోజూ 500 నుంచి వెయ్యి మంది విద్యార్థులకు.. ఫ పరీక్షల నిర్వహణకు నాలుగు వైద్యబృందాలు ఫ 50 వేల మందికి ప్రయోజనం -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను సవరించాలి
సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యామ రమేశ్, జూలకంటి వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పరీక్షల టైం టేబుల్ ప్రకారం ప్రతి రెండు సబ్జెక్టుల పరీక్షల మధ్య నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధి ఉందన్నారు. దాంతో పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని, విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రెండు పరీక్షల మధ్య వ్యవధిని రెండు రోజులకు తగ్గించాలని కోరారు. -
సల్లోనిగూడెం, వంకమామిడిలో విషాదఛాయలు
భూదాన్పోచంపల్లి : మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట సమీపంలో ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూదాన్పోచంపల్లి మండలం సల్లోనిగూడెం, వంకమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. సల్లోనిగూడేనికి చెందిన సామ లింగారెడ్డి బోరు బండిపై అదే గ్రామానికి చెందిన అంతటి శ్రీనివాస్గౌడ్(50), వంకమామిడి గ్రామానికి చెందిన మచ్చ సురేశ్(36) డ్రైవర్ కమ్ డ్రిల్లర్గా పనిచేస్తున్నారు. శనివారం బోరు బండిపై కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. శామీర్పేట సమీపంలో ఔటర్ రింగ్రోడ్డు పైన కొద్ది దూరం రాగానే బోరు బండి కింద శబ్దం వస్తుండగా బండిని రోడ్డు పక్కన ఆపారు. కిందికి దిగి టార్చిలైట్ వేసుకొని చెక్ చేస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బోరు బండిని ఢీకొట్టడంతో మచ్చ సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంతటి శ్రీనివాస్గౌడ్ రెండు కాళ్లు విరిగిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వారిద్దరి మృతదేహాలను మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అంతటి శ్రీనివాస్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. వంకమామిడి గ్రామానికి చెందిన మృతుడు మచ్చ సురేశ్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి సురేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బోరు బండి యజమాని సామ లింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.18లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు పెద్దమనుషుల సమక్షంలో అంగీకారం తెలిపాడు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి -
గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
కోదాడ: కొత్త సర్పంచ్లు శక్తివంచన లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తేనే చిరస్థాయియిగా పేరు నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కోదాడ నియోజవకర్గ పరిధిలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మానం కార్యక్రమం ఆదివారం కోదాడలోని డేగబాబు పంక్షన్హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతితిగా హాజరైన మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి తాను, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శక్తిమేర కృషి చేస్తున్నామన్నారు. ఇదేస్ఫూర్తితో కొత్త సర్పంచ్లు కూడా పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికల అనంతరం అందరిని కలుపుకొని పోతూ అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలని సూచించారు. కోదాడ ఎమ్మల్యే పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించడం అభినందనీయమని, వచ్చే పరిషత్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లను మంత్రి, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, కందుల కోటేశ్వరరావు, బుర్రా సుధారాణి, చింతలపాటి శ్రీనివాస్, వరప్రసాదరెడ్డి, డేగ కొండయ్య, ముస్కు శ్రీనివాసరెడ్డి, జైపాల్రెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, మాతంగి బసవయ్య, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దాతలకు, ఆర్మీ అధికారులకు కల్పిస్తున్న ప్రొటోకాల్ దర్శన సదుపాయాలు, దర్శనం సమయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శనాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ప్రొటోకాల్ విభాగం సిబ్బంది పూర్తిస్థాయి బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అన్ని దర్శనాలు నిబంధనల ప్రకారం ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. అనంతరం వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే వైకుంఠద్వారం స్థలం వద్ద నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన అద్దెలు, లీజులు తదితర ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, జి. రఘు, రాజన్బాబు, ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
56 ఏళ్ల అ‘పూర్వ’ సమ్మేళనం
హుజూర్నగర్ : హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1969లో ఎస్ఎస్సీ మొదటి బ్యాచ్ చదివిన విద్యార్థులు 56 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయుడైన అర్వపల్లి రంగారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముడుంబ జగన్నాథచార్యులు, వర్ర వెంకట్రెడ్డి, మూసం సత్యనారాయణ, కోట హరిప్రసాద్, కె. నాగేశ్వరరావు, వీర్లపల్లి రామారావు, ఓరుగంటి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకోవాలి
భువనగిరిటౌన్ : బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. జయ రాజు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో వంద రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి అందుకు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, పోఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ,, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, ప్రధాన జూని యర్ సివిల్ జడ్జి జి. స్వాతి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు సాయి శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
4,146 కేసులు పరిష్కారం
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదచివ్వెంల (సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టుల్లో ఏర్పాటు చేసిన లోక్అదాలత్లలో మొత్తం 4,146 కేసులు పరిష్కంచామన్నారు. ఇందులో ఒక్క సూర్యాపేటలోనే కోర్టులో 2,226 కేసులు ఉన్నాయన్నారు. ఒక్కసారి లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల్లో అప్పీల్కు అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొద్దికాలంగా వేరుగా ఉంటున్న భార్యభర్తలు కోర్టు ద్వారా కలిశారు. వీరిచే కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటించారు. సీనియర్ న్యాయవాది ఈశ్వర్ కుమార్ సహకారంతో లయన్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో 500 మంది కక్షిదారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రీట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఐలో నార్కట్పల్లి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల యాదవరెడ్డి, రజిత దంపతుల కుమారుడు జయచందర్రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు. గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్రెడ్డి తెలిపారు. -
10 నుంచి 13వరకు టీసీసీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ)కు సంబంధించి లోయర్, హయ్యర్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్న 2 నుంచి 4.30గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి వెంట కుట్టు మిషన్ తీసుకొని రావాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 23న గడ్డిపల్లి కేవీకేలో కిసాన్ మేళాగరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్, హెడ్ డి. నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, హైదరాబాద్లోని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జోన్ –10 డైరెక్టర్ షేక్ ఎన్. మీరా, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు వివరించారు. వివిధ కంపెనీల ఉత్పత్తులు, నూతన యాంత్రీకరణ పరికరాలు, క్షేత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో రైతులు, రైతు సంఘాలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మట్టపల్లి హుండీల ఆదాయం రూ.16.35లక్షలుమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీలను నల్లగొండ ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. రూ.16,35,064 ఆదాయం వచ్చింది. వివరాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూ రు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి స్థానికంగా విలేకరులకు వెల్లడించారు. 2025 సెప్టెంబర్ 9 నుంచి 19 డిసెంబర్ వరకు 101 రోజులకు సంబంధించి హుండీలను లెక్కించినట్లు తెలిపారు. ప్రధాన హుండీల ద్వారా రూ.15,25,604, అన్నదాన హుండీ ద్వారా రూ.1,09,460 ఇలా మొత్తం రూ.16,35,064లు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీసాయిసేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదలరామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలను ఎంజీ యూనివర్సిటీ సీఓఈ జి.ఉపేందర్రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్తో కలిసి శనివారం విడుదల చేశారు. 2025 నవంబర్లో డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడవ సెమిస్టర్ 31శాతం, ఐదవ సెమిస్టర్ 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, అంతటి శ్రీనివాసులు, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ఎం.శ్రీనివాస్రెడ్డి, జే.నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్.. అలర్ట్
●రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు ● ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ● హై–బీమ్ వాడకండి, లో–బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి. ● రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి. ● సడెన్ బ్రేకులు వేయవద్దు. ● టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్ ఇవ్వాలి. ● గ్లౌజెస్ తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది. ● ఫాగ్ ల్యాంప్స్ లేదా లో–బీమ్ లైట్లు వాడాలి. ● వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి. ● ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి. ● డిఫాగర్ ఉపయోగించాలి. విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి. ● కర్వ్ ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు. ● లైన్ మార్కింగ్లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి. ● వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట -
యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్. రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. శనివారం సూర్యాపేట పట్టణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, హోలి క్రాస్ ఫౌండేషన్–జనబంధు పౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ డీ– అడిక్షన్పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు చెడుఅలవాట్లతో తల్లి దండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని హితవుపలికారు. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు. డ్రగ్స్, మద్యపానంతో యువత జీవితాలు చెడిపోవద్దన్నారు. సోషల్ మీడియా, సినిమాలు వంటి వాటితో యువత ఆకర్షితులు కావడం బాధాకరమన్నారు. మాదక ద్రవ్యాల జోలికి పోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పర్హీన్ కౌసర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సత్యనారాయణ పాల్గొన్నారు.ఫ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ -
జాగ్రత్తలు పాటిద్దాం..
చలిలో బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా రోగులు శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ● చలికి చర్మం పొడిబారి చర్మ వ్యాధులు వస్తాయి. ● ఉదయం, రాత్రి వేళల్లో చర్మం పొడిబారకుండా కోల్డ్ క్రీములు లేదా కొబ్బరి నూనె రాయాలి. ● ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలి. ● ఉదయం పూట పది నిమిషాలైనా ఎండలో ఉండాలి. ● ఉదయం 7 గంటల తర్వాతే వ్యాయామం చేయాలి. ● చలికి మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించి బయటకు రావాలి. – డాక్టర్ వూర రామ్మూర్తి, జనరల్ ఫిజీషియన్ , సూర్యాపేట -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాల నివారణకు వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ ప్రత్యక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు –2026కు సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్ లతో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 26శాతం మరణాలు, 9శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ సీతారామయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జీఎం సీతారాం, వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
క్రమశిక్షణ రాహిత్యం సహించేది లేదు
హుజూర్నగర్ : ‘పంచాయతీ ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయి నాయకుల అనైక్యత వల్ల కొంత ఇబ్బంది పడ్డాం.. నాయకుల్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదు’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (కాంగ్రెస్ బలపరిచిన) గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం హుజూర్నగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ ఓడిన వారికి తన అండదండలు ఉంటాయన్నారు.గ్రామపంచాయతీల్లో అత్యధిక శాతం గెలిచామని ఓడిన చోట నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసినా ఓడి పోయామని ఈ విషయాన్ని గమనించాలన్నారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. బీడు భూములకు నీరందించేందకు పలు చోట్ల లిఫ్టులు, పేదలకు ఉన్నత విద్య అందించేందుకు జూనియర్, డిగ్రీ కాలేజీ బిల్డింగ్లు, ఐటీఐ, ఏటీసీ (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్), యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆధునికి వైద్య సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు సర్పంచ్లు కలిసిరావాలిహుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నూతన సర్పంచ్లు అందరూ కలిసి రావాలని ఉత్తమ్ కోరారు. సర్పంచ్లు శాంతిభద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని హితవుపలికారు. తొలి విడతగా కొత్త సర్పంచ్లకు గ్రామానికి 25 నుంచి 30 ఇళ్లను మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. వాటిని అర్హులైనవారికి ఇవ్వాలని కోరారు. మరి కొన్నింటిని మార్చి, ఏప్రిల్లో మంజూరు చేస్తామన్నారు. తన జీవితంలో మరువలేని సంఘటన ఏదంటే రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీని సీఎం చేతుమీదుగా హుజూర్ నగర్ నుంచి ప్రారంభించుకోవడం అని మంత్రి పేర్కొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
– సాక్షి నెట్వర్క్
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, చల్లని గాలులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు వణుకు పుట్టిస్తోంది. మంచు కురుస్తుండడంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. చలి నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చల్లదనంతో ఆస్తమా కూడా పెరుగుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా జరిగి నిమోనియా కేసులు నమోదవుతాయి. రద్దీగా ఉండే విహార యాత్రలకు వెళ్లవద్దు. రోగులు సక్రమంగా మందులు వేసుకోవాలి. ఏమైనా సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రాఘవేందర్రెడ్డి, పల్మనాలజిస్ట్, నల్లగొండ చలి కాలంలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్, రాగి జావ, సూప్లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, బత్తాయి పండ్లతో పాటు ఆకు కూరలు తినాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఉత్తమం. విటమిన్–డి అందేలా సూర్యరశ్మిలో నిల్చోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఐస్క్రీమ్లకు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. విటమిన్–సి, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. – ఎం. శ్రీనివాసరావు, డైటీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండవృద్ధులు మరింత జాగ్రత్త -
యూరియా.. ఇక సులువయా
తిరుమలగిరి (తుంగతుర్తి): గత సీజన్లో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇక నుంచి రైతులకు ఇలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. కొత్త విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలా నమోదు చేసుకోవాలంటే.. యాప్ను ఓపెన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, భూమి లేని కౌలు రైతులైతే ఆధార్ నంబర్ సహాయంతో లాగిన్ కావాలి. అందులో నమోదు చేసే సెల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాని సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పంటల వివరాలు నమోదు చేయాలి. సాగు భూమిని బట్టి ఎన్ని బస్తాల యూరియా రైతుకు ఇవ్వాలో యాప్ చూపిస్తుంది. ఆన్డ్రాయిల్ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువ రైతుల్లో ఆన్డ్రాయిడ్ సెల్ ఫోన్ వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వీరికి యూరియా ఎలా సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ఎక్కడి వారు అక్కడే.. సాగు భూమి ఉన్న జిల్లా నుంచే బుక్ చేసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మళ్లీ 15 రోజుల వరకు అవకాశం ఉండదు. సమీపంలో ఉండే డీలర్ల పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకరిని ఎంపిక చేసుకుంటే 48 గంటల్లోపు బస్తాలు తీసుకోవచ్చు. ఈ సమయం దాటితే మాత్రం రైతు పేరు తొలగి పోతుంది. మరోసారి బుక్ చేసుకోవాల్సిందే. కౌలు రైతులు బుక్ చేసుకుంటే సదరు భూమి యజమాని సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. 0–1 ఎకరం వరకు ఒకసారి 1–5 ఎకరాల వరకు 2 సార్లు 5–20 ఎకరాలు 3 సార్లు 20 ఎకరాల పైన 4 సార్లు వినియోగం ఇలా.. వరి ఎకరాకు 3 బస్తాలు మొక్కజొన్న ఎకరానికి 4 బస్తాలు మిగతా వాటికి ఎకరాకు 2 బస్తాలు ఫ ఆన్లైన్లో బుకింగ్ ఫ అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్ ఫ 22 నుంచి నూతన విధానం అమలు ఫ అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ -
చిన్నారులను ఉదయం ఎండలో ఉంచాలి
● చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, శాస కోశ సంబంధిత సమస్యలు, జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. ● చిన్న పిల్లలకు స్వెటర్లు వేసి చెవులకు మంకీ క్యాపు పెట్టాలి. కాళ్లకు చేతులకు సాక్సులు, గ్లౌజ్లు వేయాలి. ● పాలు తాగే నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ● ఉదయం ఎండలో ఉంచాలి. ● చిన్నారులతో ఉదయం సమయంలో ప్రయాణం చేయొద్దు. ● రాత్రి వేళల్లో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచి.. వెచ్చదనం కోసం వేడినిచ్చే హైవోల్టేజీ బల్బులు వేయాలి. ● కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. వేడి ఆహారం తినిపించాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయం తాగించొద్దు. – డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, పిల్లల వైద్యుడు, నల్లగొండ -
లెక్కలు చెప్పాల్సిందే
నాగారం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చులను అధికారులకు సమర్పించాల్సి ఉంది. అందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు బుక్లెట్లో పొందిపర్చిన ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. గెలిచినా.. ఓడినా లెక్కలు ఇవ్వాలి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి. గెలిచినా, ఓడినా ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆమేరకు ఎంపీఓలు ఇప్పటికే అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. జనాభా ఆధారంగా ఖర్చులు 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి 45 రోజుల లోపు సర్పంచ్, వార్డు మెంబర్కు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓకు లెక్కలు చెప్పాలి. ఆలా చెప్పని వారికి మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గెలిచిన వారు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. బాధ్యతలు గుర్తెరగాలి సర్పంచ్లు తమ బాధ్యతలను గుర్తెరిగి ఆ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలల కోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్త మవుతున్నారు. మొదట వారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. ఫ అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదుకు ‘టీఈ–పోల్’ ఫ నూతన విధానం తెచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఫ గడువులోపు పంపాలని అభ్యర్థులకు ఆదేశాలు -
గోదారి.. నీరేది!
ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలపై కొరవడిన స్పష్టతశనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భానుపురి (సూర్యాపేట), అర్వపల్లి : యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటి విడుదలపై స్పష్టత రాలేదు. యాసంగి పంటల సాగుకు నీళ్లిస్తారా లేదా తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోవడంతో నార్లు పోసుకోవాలా.. వద్దా అనే విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు. యాసంగి సాగు షురూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 5,19,220 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 4,96,100 ఎకరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎస్సారెస్సీ ఆయకట్టు కిందే 2 లక్షల ఎకరాల వరకు వరి సాగు ఉండనుంది. ప్రస్తుతం బోరుబావుల కింద అక్కకక్కడ నాట్లు వేస్తున్నారు. చాలావరకు నార్లు పోయడంతో పాటు దుక్కులు కూడా సిద్ధం చేసే పనిలో రైతులు ఉన్నారు. జిల్లాలోని మూసీ ఆయకట్టుకు సైతం ఇటీవలే సాగు నీటిని విడుదల చేయడంతో అక్కడ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. షెడ్యూల్ ఊసెత్తని అధికారులు జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు కోదాడలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాల వరకు ఎస్సారెస్పీ ఆయకట్టు వ్యాపించి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ ఆయకట్టు కింద పంటల సాగుకు నీటిని విడుదల చేస్తారా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయడం లేదు. తరి పంటలకు నీటిని విడుదల చేస్తే ఇప్పటికే రైతులు నార్లు పోసుకోవాల్సి ఉంటుంది. అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించక పోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి బోర్ల కింద నారు పోసుకున్నారు. మరికొందరు నీటి విడుదల తేలకుండా నార్లు పోస్తే ఆగం అవుతామనే భావనలో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎస్సారెస్పీ నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ గోదావరి జలాల కోసం రైతుల ఎదురుచూపు ఫ సీజన్ ప్రారంభమైనా షెడ్యూల్ ప్రకటించని అధికారులు ఫ జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు -
కళలకు పుట్టినిల్లు పేట
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అని, జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగి వారి ప్రతిభతో పేటకు వన్నె తెచ్చారని డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా జ్ఞాన సరస్వతి కళావేదిక ఆధ్వర్యంలో జిల్లా బాలభవన్ ఆవరణలో శుక్రవారం రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను పాటలు వినడం వల్ల కొంత వరకు తగ్గించుకోవచ్చన్నారు. సంగీతంతో కొన్ని రకాల మానసిక రోగాలు నయమవుతాయనే మాటలో వాస్తవం ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 50 మంది కళాకారులు పాల్గొని పాటలు పాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపతి రాములు, జైలర్ సుధాకర్రెడ్డి, చిన్న శ్రీరాములు, డాక్టర్ రంగారెడ్డి, హమీద్ఖాన్, నన్నెపంగు సైదులు, బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ పాల్గొన్నారు. -
విపత్తు సమయంలో సేవలందించాలి
భానుపురి (సూర్యాపేట) : విపత్తు సమయంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ఈ నెల 22న నిర్వహించనున్న ముందస్తు ప్రణాళికపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ సుధీర్బాల్, రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. వరదలు, విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి తగిన విధంగా సాయం అందించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లాలి, ఉపశమన శిబిరం ఎక్కడ పెట్టాలనేది ముందుగానే చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అదనపు ఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, పరిశ్రమలశౠఖ జీఎం సీతారాం, ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఎస్ఓ శోభన్బాబు, డీఎం రాము, పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఈఈలు సీతారామయ్య, వెంకటయ్య, మాధవి, డీవైఎస్ఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు హుజూర్నగర్కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి శనివారం హుజూర్నగర్కు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికై న నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యలను పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్హాల్లో మంత్రి ఉత్తమ్ పఆర్ఓ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్య క్రమానికి కాంగ్రెస్ బ్లాక్, మండల, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా మొదటి అదనపు న్యామూర్తి బదిలీచివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహన్ సికింద్రాబాద్ జ్యూడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆయన పదోన్నతిపై హుజూర్నగర్ కోర్టు నుంచి సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా అకాడమీకి వెళ్లారు. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించనున్నారు. సీఐ సస్పెన్షన్కోదాడ రూరల్ : కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా.. చిలుకూరు ఎస్సై సురేష్రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజేష్ కేసులో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చినందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ మృతికి కారకులైన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయాలిమోతె : ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏల బకాయిలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి.లాలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మోతె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో సంఘం సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 21న తుంగతుర్తిలో జరిగే టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో విద్యారంగా సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు డి.నరేందర్, ఉపాధ్యక్షులు యాదయ్య, సాయిశ్యాం, ఉషారాణి, గురులక్ష్మి, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు శోభాబాయి పాల్గొన్నారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు భానుపురి (సూర్యాపేట) : అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) వారు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం’ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎల్.శ్రీనివాస్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో చదువుకునేందుకు ఈ స్కాలర్షిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటి జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 మధ్య కాలంలో (ఫాల్ సీజన్ 2025) అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయములో అందించాలన్నారు. విద్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన విద్యార్థికి స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు రెండు విడతల్లో ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. విమాన చార్జీలు రూ. 60వేలకు మించకుండా చెల్లిస్తుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20 నుంచి వచ్చేనెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
త్వరలో సహకార ఎన్నికలు!
డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుత పాలవర్గాల గడువును ఈసారి గడువును పొడగించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్ ఇన్చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు వీరి ఆధ్వర్యంలో డీసీసీబీ, సహకార సంఘాలు పని చేస్తాయి. గతేడాది కాంగ్రెస్ చేతికి వచ్చిన డీసీసీబీ జిల్లాలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్ఎస్ పాలనలో డీసీసీబీ చైర్మన్గా గొంగిడి మహేందర్రెడ్డి వ్యవహరించారు. అయితే ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీసీసీబీలోని కొందరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్కు చెందిన డైరెక్టర్లు కూడా మద్దతు పలికారు. 20 మంది డైరెక్టర్ల సహకారంతో కుంభం శ్రీనివాస్రెడ్డి డీసీసీబీ చైర్మన్గా గతేడాది జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాదిన్నర పాటు చైర్మన్గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి ఆగస్టు 14వ తేదీన గడువు పొడిగించింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో మన డీసీసీబీ నల్లగొండ డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అధునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీలోనూ ముందంజలో ఉంది.ఫ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలుగా సీఈఓలు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠికి నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు జిల్లాల వారీగా పీఏసీఎస్లు ఇలా.. సూర్యాపేట 47 నల్లగొండ 42యాదాద్రి 21 మొత్తం 110 -
ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్ : ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే కొత్త బిల్లు తీసుకొచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన పార్టీ జిల్లా, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన 30 కోట్లమందికి పైగా పేదలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. ఇప్పుడున్న చట్టంలో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా, దానిని 60 శాతానికి తగ్గించి 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని బిల్లులో పేర్కొన్నారని అన్నారు. దాంతో నిధుల కొరత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, శేఖర్రావు, మట్టిపెల్లి సైదులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు విడతల్లో 23 మండలాల్లో జరిగిన ఎన్నికలకు పోలీస్ సిబ్బంది ఒక జట్టుగా సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. సిబ్బంది ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. సహకరించిన ఇతర శాఖల అధికారులు, ఓటర్లకు పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు రూ.1.20 లక్షల నగదుతో పాటు, 144 కేసుల్లో సుమారు రూ.10.53 లక్షలు విలువ గల 1,740 లీటర్ల మద్యాన్ని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్నిక సందర్భంగా లెసెన్స్ కలిగి ఉన్న 79 తుపాకులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు, గతంలో ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ముందస్తుగా 429 కేసుల్లో 1488 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. మట్టపల్లిలో ధనుర్మాస పూజలుమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామికి, గోదాదేవి అమ్మవారికి గురువారం తెల్లవారుజామున పాశురాలు పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కుమ్మరికుంట్ల బదరీనారాయణాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, కృష్ణమాచార్యులు , పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, చైన్నెకి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు. యువజన సంఘాల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి: 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రీడా సామగ్రి పంపిణీ కోసం యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి గంట రాజేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెహ్రూ యువ కేంద్రంలో అనుసంధానమైన యువజన సంఘాల వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు గత 5 సంవత్సరాల నుంచి సంఘాలు చేసిన కార్యక్రమాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాపీని జత పర్చాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 91338 96009, 90597 98602 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అధ్యయనోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి గురువారం ఆవిష్కరించారు. పోస్టర్లను గర్భాలయంలో, ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులందరిని ఆహ్వానించేందుకు ప్రచార పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్థిష్ట తేదీల్లో శ్రీస్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు రఘు, రాజన్బాబు, ఆర్ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు–2 సురేంద్రచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు తదితరులున్నారు. -
వచ్చేనెలలో పోరాటం ఉధృతం
సూర్యాపేట అర్బన్: మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జనవరి నెలలో అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేయనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందని మండిపడ్డారు. దేశంలో నయా ఫాసిస్టు విధానాలు అమలు చేస్తూ కార్మికులను మతం పేరుతో విభజిస్తూ లౌకిక విధానాలను తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకూ 12 గంటల విధానాన్ని ప్రవేశ పెట్టి వేతనాలు పెంచకుండా కార్మికుల నిజ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. దేశంలో స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయనిది మోదీ ప్రభుత్వమని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, చెరుకు ఏకలక్ష్మి,ఎం. రాంబాబు, శీలం శ్రీను, వటేపు సైదులు పాల్గొన్నారు. ఫ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు


