Tamilnadu Rains
-
హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్
-
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
-
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ దీపక్ మిశ్రా గురువారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకూ రాకపోకలు రద్దు చేసినట్లు తెలిపారు. భద్రత, రన్ వే లను పరిశీలించాకే విమానాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. వరదలతో 350 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని దీపక్ మిశ్రా వెల్లడించారు. ఇక విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 1500 మంది ప్రయాణికులను వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. -
తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు
చెన్నై : భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తమిళనాడు నుంచి పుదుచ్చేరి, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు నేడు రద్దు చేసినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్పైకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పాడైంది. నేడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.