Tanishq Thief Kiran
-
'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు'
హైదరాబాద్ : హైదరాబాద్లో కలకలం సృష్టించిన తనిష్క్ జ్యూయలరీ చోరీ కేసు మిస్టరీ వీడింది. చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు తేల్చారు. తనిష్క్ జ్యూవెలరీలో తానే దొంగతనానికి పాల్పడినట్లు కిరణ్ అనే యువకుడు గత రాత్రి బంజరాహిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. కిరణ్తో పాటు అతని స్నేహితుడు ఆనంద్కు కూడా చోరీలో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆనంద్ను గుర్తించారు. కాగా జనంలో కన్పించాలనే ఉద్దేశంతోనే తనిష్క్ నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ చెప్పిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. మరోవైపు తన కొడుకు దొంగతనం చేశాడని తాము నమ్మడం లేదని కిరణ్ తల్లి అంటోంది. తన కొడుకు ఎంతో మంచివాడని, కష్టపడే తత్వమని ఆమె చెప్తోంది. -
'సంచలనం కోసమే తనిష్క్లో చోరీ'
-
అవాక్కయిన ఈపూరు వాసులు
ఈపూరు: సంచలనం సృష్టించిన తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం కేసులో కిరణ్ అనే యవకుడు లొంగిపోయాడు. దీంతో కిరణ్ సొంతూరు గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరులో కలకలం రేగింది. కిరణ్ ఈ దొంగతనం చేశాడంటే ఆ ఊరి జనం నమ్మలేపోతున్నారు. దీని గురించి తెలియగానే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కిరణ్ ఇలాంటి పని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అయితే తన కొడుక్కి ఏమీ తెలియదని, అతడి వెనుక ఎవరోవుండి ఈ పని చేయించి వుంటారని కిరణ్ తల్లి అనుమానం వ్యక్తం చేశారు. ఐదో సంతానంలో నాలుగో వాడయిన కిరణ్ సంవత్సరం క్రితం హైదరాబాద్ వెళ్లాడు. బేగంపేటలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కిరణ్ తాతయ్య సైన్యంలో పనిచేసినట్టు తెలిసింది. అయితే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే అతడీ దొంగతనం చేసినట్టు కనబడుతోంది. జనం కోసమే బతకాలనిపిస్తోందని అతడు చెప్పాడు. అదే సమయంలో తక్కువ సమయంలో జనంలో గుర్తింపు పొందాలన్న ఆతృత అతడి మాటల్లో వ్యక్తమయింది. అయితే కిరణ్ మాటల్లో వాస్తమెంత అనేది కనుక్కునే పనిలో పోలీసులున్నారు. -
సంచలనం కోసమే తనిష్క్లో చోరీ చేశా: కిరణ్
హైదరాబాద్: జనంలో కన్పించాలన్న ఉద్దేశంతోనే తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ అనే యువకుడు తెలిపాడు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. ఐదు నిమిషాలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపడానికే దొంగతనం చేసినట్టు కిరణ్ తెలిపాడు. దొంగతనానికి, రాజకీయానికి తేడా లేదన్నాడు. తాను ఒక రాత్రి దొంగ అయితే, రాజకీయ నాయకులు ఐదేళ్ల దొంగలని విమర్శించాడు. వ్యవస్థలో మార్పు రావాలని అతడు ఆకాంక్షించారు. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే తనను అవహేళన చేశారని చెప్పాడు. ప్రెసిడెంట్గా పోటీ చేసి ఊరిని బాగుచేయాలనుకున్నా అవకాశం ఇవ్వలేదన్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడం, సమాజంలో మంచితనం లేకపోవడం వల్లే దొంతనం చేశానన్నాడు. తన వెనుక ఎవరూ లేరన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. చనిపోయే హక్కు తనకు లేదని విరమించుకున్నట్టు చెప్పాడు. ఏదోక సంచలనం చేసి జనం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో తనిష్క్లో చోరీ చేసినట్టు చెప్పాడు. జనం, రాజకీయం, సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించాడు. తనకు అవకాశమిస్తే వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. ప్రజలను బాగు చేయగలన్న నమ్మకం తనకుందన్నాడు. తనిష్క్ లో తానే చోరీ చేశానని కిరణ్ చెబితే పోలీసులు మొదట నమ్మలేదు. తన గదిలో దాచిన దొంగిలించిన సొమ్మును చూపించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు చెబుతున్న మాటల్లో వాస్తమెంత, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.