Thudarum Movie
-
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు
మలయాళంలో ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన చిత్రం తుడరుమ్ (Thudarum Movie). మోహన్లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్ నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరణ్ (Sanal Kumar Sasidharan) తుడరుమ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్ రాశాను. తుడరుమ్ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్లో వాడుకున్నారు.ఓవర్ కాన్ఫిడెన్స్ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్లో ఈ డైలాగ్ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్, టోవినో థామస్, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 30 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి రావడం విశేషం. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరుమ్ లాంటి క్రేజీ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్)వీటితో పాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, చంద్రహాస, డీమన్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్ కూడా కచ్చితంగా చూడాలి అనే ఆత్రుత కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ ఇంట్లోనే మూవీస్ చూద్దామనుకుంటే వీటిలో ఆప్షన్ చూసుకోండి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మే 30)నెట్ఫ్లిక్స్రెట్రో - తెలుగు డబ్బింగ్ సినిమాఏ విడోస్ గేమ్ - స్పానిష్ మూవీలాస్ట్ ఇన్ స్టార్ లైట్ - కొరియన్ సినిమాద హార్ట్ నోస్ - స్పానిష్ మూవీహిట్ 3 - తెలుగు సినిమాడిపార్ట్మెంట్ క్యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్మ్యాడ్ యునికార్న్ - థాయ్ సిరీస్ద బెటర్ సిస్టర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్మాన్స్టర్ హై సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్యా బాయ్ కాంగ్ మింగ్ - జపనీస్ సిరీస్అమెజాన్ ప్రైమ్అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - తెలుగు మూవీవీర చంద్రహాస - కన్నడ సినిమాచోర్ చోర్ - గుజరాతీ మూవీమై హీరో - కన్నడ సినిమాద లాస్ట్ స్టాప్ ఇన్ యమ కంట్రీ - ఇంగ్లీష్ మూవీట్రెజర్ - ఇంగ్లీష్ సినిమాఏన్ ఎండ్ లెస్ వెడ్డింగ్ - ఫ్రెంచ్ మూవీహాట్స్టార్తుడరుమ్ - తెలుగు డబ్బింగ్ మూవీక్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్ - హిందీ సిరీస్ఫైండ్ ద ఫర్జీ విత్ కరీష్మా - హిందీ గేమ్ షోఏ కంప్లీట్ అన్ నోన్ - ఇంగ్లీష్ సినిమా (మే 31)ఆహానిళర్ కుడై - తమిళ సినిమావానిళ్ తెడినన్ - తమిళ సిరీస్డీమన్ - తెలుగు డబ్బింగ్ మూవీసోనీ లివ్కంఖజురా - తెలుగు డబ్బింగ్ సిరీస్సన్ నెక్స్ట్బిగ్ బెన్ - మలయాళ సినిమానిమిత్త మాత్ర - కన్నడ మూవీజీ5ఇంటరాగేషన్ - హిందీ మూవీఆపిల్ ప్లస్ టీవీబోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ - ఇంగ్లీష్ సినిమాలులు ఈజ్ ఏ రైనోసిరోస్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్) -
ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా 'తుడరుమ్'. మోహన్ లాల్, శోభన జంటగా నటించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఎల్ 2: ఎంపురాన్' సినిమా మార్చి చివరన రిలీజైంది. చాలా హడావుడి చేశారు గానీ జస్ట్ ఓకే అనిపించుకుంది. సరిగ్గా నెల తర్వాత మోహన్ లాల్ నుంచే 'తుడరుమ్' రిలీజైంది. ప్రమోషన్ లాంటివేం లేకుండానే దీన్ని రిలీజ్ చేశారు. బడ్జెట్ కూడా చాలా తక్కువే. అలాంటిది ఇది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)పెట్టిన బడ్జెట్ వచ్చిన వసూళ్ల బట్టి చూస్తే చాలా లాభాలు అందుకున్నట్లే. ఇప్పుడీ ఈ చిత్రాన్ని హాట్స్టార్లో మే 30 నుంచి తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే వీకెండ్ లో రీసెంట్ చిత్రాలు హిట్ 3(మే 29), రెట్రో (మే 30) ఓటీటీల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అంటే ఈ వీకెండ్ మూవీ లవర్స్కి పండగే పండగ.తుడరుమ్ విషయానికొస్తే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఓ ట్యాక్సీ డ్రైవర్. భార్య(శోభన), ఇద్దరు పిల్లలతో ఆనందంగా బతికేస్తుంటాడు. ఊహించని విధంగా ఓ పోలీసు కేసులో ఇరుక్కుంటాడు. దీన్నుంచి బయటపడేసరికి కొడుకు కనిపించకుండా పోతాడు. దీంతో వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో బెంజ్కి ఊహించని విషయాలు తెలుస్తాయి? ఇంతకీ ఏంటవి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్న థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా
కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ టైంలో అలా ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'తుడరమ్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.మార్చి చివర్లో ఎల్ 2:ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ లాల్ కాస్త నిరాశపరిచాడు. ఇది వచ్చిన నెలరోజులకే 'తుడరమ్' చిత్రంతో వచ్చారు. ఊహించని విధంగా ఇది సక్సెస్ అయింది. ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వసూళ్లుతో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)అసలు ప్రచారమే లేకుండా తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.2 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందట. లెక్క ప్రకారం గత వారం స్ట్రీమింగ్ కావాలి. కానీ థియేటర్లలో ఇంకా ఆదరణ వస్తున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరికొన్నాళ్లు ఆలస్యం కానుందట. అంటే జూన్ లో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.తుడరమ్ విషయానికొస్తే.. బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్. అతడి భార్య లలిత. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు. అదే కథని మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్) -
మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద.. ఏకంగా టూరిస్ట్ బస్సులోనే!
మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్గా కనిపించింది. మలయాళంలో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో అభమానులు క్యూ కడుతున్నారు.సినీ ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న పైరసీ భూతం ఈ సినిమాను వదల్లేదు. గతంలో గేమ్ ఛేంజర్ మూవీలాగే ఈ చిత్రాన్ని కూడా ఓ టూరిస్ట్ బస్సులో ప్రదర్శించారు. కేరళలోని మలప్పురం నుంచి వాగమోన్కు వెళ్తున్న టూరిస్ట్ బస్సులో ఈ మూవీ ప్రదర్శించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ఈ మూవీ నిర్మాత ఎం రంజిత్ లీగల్ చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన వెంటనే సైబర్ సెల్ ప్రధాన కార్యాలయంలో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ మంత్రి సాజి చెరియన్.. సరైన ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 10 రోజుల్లోపు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ సక్సెస్గా కొనసాగుతోంది. అంతేకాకుకండా ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతకుముందే మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రూ. 246 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తుడరుమ్.. ఎల్2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్, 2018 చిత్రాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది.Piracy .... Thudarum 😐🚶#Thudarum pic.twitter.com/ArCOgwsrT6— Deepu (@deepuva24) May 5, 2025 -
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మోహన్ లాల్ సినిమాలకు టాలీవుడ్లోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఎల్2: ఎంపురాన్తో మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్..ఇప్పుడు ‘తుడరుమ్’(Thudarum Movie Review) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నటి శోభన మరోసారి మోహన్లాల్కు జోడీగా నటించింది. నిన్న(ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 26) అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్ డూప్గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా సినిమాలను వదిలిపెట్టి తన మాస్టర్ (భారతీ రాజా) కొనిచ్చిన కారుతో కేరళలో సెటిల్ అవుతాడు. భార్య లలిత(శోభన), పిల్లలు(కొడుకు, కూతురు)..వీళ్లే అతని ప్రపంచం. టాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా తను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్ కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు బెంజ్ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఇంజనీరింగ్ చదివే తన కొడుకు పవన్ కనిపించకుండాపోతాడు. పవన్కి ఏమైంది? బెంజ్ కారును పోలీసులు ఎందుకు జప్తు చేశారు? పోలీసులు సీజ్ చేసిన కారును తిరిగి తెచ్చుకునే క్రమంలో బెంజ్కి ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి తప్ప చేయని బెంజ్ని సీఐ జార్జ్(ప్రకాశ్ వర్మ) హత్య కేసులో ఎందుకు ఇరికించాడు? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? తన ఫ్యామిలి అన్యాయం చేసినవారిపై బెంజ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ(Thudarum Movie Review). ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తుడరుమ్ కూడా అలాంటి కథే. కోర్ పాయింట్ అదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ మూర్తి ఈ కథను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రారంభించి.. రివేంజ్ డ్రామాగా ఎండ్ చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న మోహన్లాల్ని సింపుల్గా పరిచయం చేయడమే కాదు.. ఫస్టాఫ్ మొత్తం అంతే సింపుల్గా చూపించారు. హీరోకి భార్య, పిల్లలే ప్రపంచం అని తెలియజేయడం కోసం ప్రతి విషయాన్ని డీటేయిల్డ్గా చెప్పడంతో ఫస్టాఫ్ సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్తో క్రైమ్ జానర్లోకి వెళ్తుంది. హిరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. అక్కడ ఓ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇక్కడే కథనం కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. తన ఫ్యామిలీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. పోలీసులు తన కుటుంబం వేసిన నిందను పోగొట్టడానికి ప్రయత్నించకుండా..పగను తీర్చుకోవడానికి వెళ్లడం ఎందుకో పొసగలేదు అనిపిస్తుంది. ‘దృశ్యం’ ఛాయలు కపించకూడదనే దర్శకుడు కథను ఇలా మలిచాడేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిత్రం గుర్తొస్తూనే ఉంటుంది. అలాగే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథనం మళ్లీ సాగినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పటికీ దర్శకుడు ఎలివేషన్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దీంతో ప్రేక్షకుడు ఎమోషనల్ సీన్లకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించలేదు కానీ.. ముగింపు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టాక్సీడ్రైవర్ బెంజ్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. బాత్రూంలో కూర్చొని ఏడిచే సీన్ హైలెట్. ఇక మోహన్ లాల్ తర్వాత బాగా పండిన పాత్ర ప్రకాశ్ వర్మది . మంచితనం ముసుగు వేసుకొని క్రూరంగా ప్రవర్తించే సిఐ జార్జ్ అనే పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా ఏళ్ల తర్వాత మోహన్లాల్తో తెర పంచుకున్న శోభనకు మంచి పాత్రే లభించింది. నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కడా నటించింది. బిను పప్పు, థామస్ మాథ్యూతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జేక్స్బిజోయ్ తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. నైట్ షాట్స్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్