breaking news
Tirupati District Latest News
-
రెండేళ్లవుతున్నా సూపర్ సిక్స్ హామీలెక్కడ?
తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న దురాలోచనతో నోటికి వచ్చినట్లు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి రెండేళ్లవుతున్నా అమలు ఎక్కడ అని వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతి లక్ష్మీపురం వద్ద ఆయన ఆధ్వర్యంలో బుధవారం భోగి పండుగ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల ప్రతులను పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి తగులపెట్టారు. ఈ సందర్భంగా మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు అధికార దాహమే తప్ప, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న కనీస ఆలోచన లేదని మండిపడ్డారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దేశ రాజకీయాలకే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అందించిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. కూటమి నాయకులకు ఎందుకురా గెలింపించామని ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మనసుల్లోని మోసం, వంచన భోగిమంటల్లో కాలిపోవాలని, ఇక నుంచైనా ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నల్లాని బాబు, వాసుయాదవ్, మల్లం రవికుమార్, గీతాయాదవ్, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు, పార్టీ నాయకులు వెంకటేష్రాయల్, మునిరెడ్డి, కడపగుంట అమరనాధ్రెడ్డి, పసుపులేటి సురేష్, దినేష్రాయల్, అనీల్రెడ్డి, అంజూర్బాషా, పద్మజ, విజయలక్ష్మి, బాలాజీ, కోటి, స్వరూప్, రమణారెడ్డి, మురళీయాదవ్, లక్ష్మణ్రాయల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
భోగి మంటల్లో 590, 847జీఓ ప్రతులు
పెళ్లకూరు: చంద్రబాబు సర్కారు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన 590, 847 జీఓ నకలు పత్రాలతో భోగి మంటలు వేశామని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి అన్నారు. ఆయన నాయకులు కలిసి బుధవారం పుల్లూరులో సంబంధిత జీఓ నకలు పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు. ఈ సందర్భంగా చిందేపల్లి మాట్లాడుతూ వైద్యం, వైద్యవిద్య పేద కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టి గవర్నర్కు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్రెడ్డి, గురవయ్య, చెంగయ్య, రామయ్య, సునీల్, నరసింహులు, మురళి, గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి ఊసేది?
తారల తళుకు బెళుకులే.. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే.. తారల తళుకుబెళుకులే తప్ప, మంత్రులు పులికాట్ అభిృవృద్ధికి ఇచ్చిన హామీలు నీటి మూటలవుతున్నాయి. ఏటా వస్తున్నారు..వెళుతున్నారు.. విదేశీ వలస విహంగాల ఆవాసానికి వసతులు కల్పించిన దాఖలాలు శూన్యం. హామీలు అమలుకు నోచుకోక పులికాట్ జీవవైవిధ్యం కోల్పోతోంది. సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సుకు ఏటా శీతాకాలంలో విచ్చేసే విదేశీ వలస విహంగాలను ఆధారంగా చేసుకుని ఫ్లెమింగో ఫెస్టివల్ 2001 నుంచి నిర్వహిస్తున్నా సరస్సు అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత 25 ఏళ్లల్లో 21 సార్లు పండుగను టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించాయి. ఈ కాలంలో పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షులు రక్షితకేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఏటా పక్షులు పండుగ ప్రారంభోత్సవానికి, ముగింపు ఉత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి, అనేక రకాల హామీలు ఇచ్చేసి వెళుతున్నారు. 2001 నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా, అలాగే 2025 నుంచి ఇప్పటివరకు అఽధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పండుగను తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప పులికాట్ సరస్సు అభివృద్ధికి చేసేదిదేమీ లేదు. ప్రస్తుత పర్యాటక శాఖామంత్రి 2025లో పండుగ ప్రారంభోత్సవానికి విచ్చేసి సూళ్లూరుపేట ప్రాంతాన్ని పర్యాటక హబ్గా చేస్తానని హామీ ఇచ్చా రు. గత ఏడాది ముగింపు ఉత్సవానికి విచ్చేసిన ఆ యన అప్పుడూ ఇదే వ్యాఖ్యలు చేశారు. అదే వ్యాఖ్య లు ఈ ఏడాది కూడా చేశారు. పులికాట్ ముఖద్వారాల పూడికతీతకు రూ.142 కోట్లు సీఎం చంద్రబా బు మంజూరు చేశారని 2025లో చెప్పారు. ఈ ఏడా దీ అదే విషయం చెప్పారు. జీవ వైవిధ్య సరస్సుగా పులికాట్ ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని తిరుపతి జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 620 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తిరుపతి జిల్లా తడ, సూళ్లూరుపేట, దొర వారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్త రించి ఉంది. మిగిలిన 120 చదరపు కిలో మీటర్లు త మిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. బంగాళా ఖాతం నుంచి తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వ ద్ద ఒక ముఖద్వారం, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద రెండు ముఖద్వారాలు ఉ న్నాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినా, చిన్నపాటి వర్షాలు వచ్చినా స్వర్ణముఖి, కాళంగినది, తమిళనాడులో ఆరణియార్ నదులతో పాటు చిన్నా చితకా కా లువల నుంచి మంచినీరు సరస్సుకు చేరుతుంది. స ముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉఽధృతి పెరిగినపు డు కడలి నుంచి ఉప్పునీరు పులికాట్లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కావడంతో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. సుమా రు 20 వేలమంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడమే కాకుండా 204 రకాల 1.20 లక్షల విదేశీ వలసపక్షులకు ఆహారాన్ని అందిస్తూ జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు ఉంది. తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖ ద్వారాన్ని ఏటా సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. అందుకే దక్షిణవైపు సరస్సు ఎప్పుడూ జలకళతో కళకళలాడుతోంది. వాకాడుమండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకు పోవడంతో వేసవిలో ఉత్తరవైపు సరస్సు ఎడారిని తలపిస్తోంది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపా ళెం ముఖద్వారాలను పూడిక తీయిస్తే ఈ ప్రాంతంలో కూడా సరస్సు ఎప్పుడు జలకళతో కళకళలాడే ఆవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అటు మత్స్యకారులు, ఇటు పర్యావరణ ప్రేమకులు శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సింపోజియంలో కోరారు. వర్షాకాలంలో నిండుకుండలా పులికాట్ సరస్సు (పాతచిత్రం) కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర ఉత్సవం ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నపుడు కూడా ఎన్నో హామీలిచ్చారు. ఇలా ఎంతో మంది మంత్రులు వస్తున్నారు.. వెళుతున్నా రు. సరస్సు అభివృద్ధికి మాత్రం ఎవరూ కృషి చేయలేదు. అయితే పక్షులు పండుగను మాత్రం 2013లో టూరిజం క్యాలండర్లో చేర్చారు. ఆ తరువాత 2014లో స్టేట్ మెగా ఫెస్టివల్గా మార్చారు. పక్షుల పండుగ అంటే మూడు రోజులు పాటు సినీ తారల తళుకు బెళుకులు, సినీ యాంకర్లు, పాట కచ్చేరిలు, రక రకాల అర్ధనగ్నం డాన్స్లు, కామెడీ షోలు మిమిక్రీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సరిపెట్టేసి మమ అనిపించేస్తున్నారు. పక్షులు నివాసానికి వసతులేవీ? నేలపట్టులో పక్షులు నివాసానికి చెట్లు పెంచడం, పులికాట్ సరస్సులో నీళ్లు ఎప్పుడూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయించడం, భీములవారి పాళెం పడవల రేవు వద్ద రిస్టార్ట్స్ ఏర్పాటు, నిరంతర బోట్ షికారు తదితర పనులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ ప్రయత్నం చేయలేదు. పండుగ మూడు రోజులు రాజకీయ నాయకులు ఉత్తుత్తి హామీలు, అధికారులు హడావుడి తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. ఆనం రామనారాయణరెడ్డి పర్యాటకశాఖామంత్రిగా ఉన్న సమ యంలో భీములవారిపాళెం పడవల రేవు వద్ద రిసార్ట్స్ నిర్మాణానికి వేసిన శిలా ఫలకాలు ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి. -
జేసీగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆర్.గోవిందరావు బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సివిల్ సప్లయి కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ తిరుపతి జిల్లా ఇన్చార్జి జేసీగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ను ఆయన చాంబర్లో కలిశారు. అలాగే జేసీ చాంబర్కు వెళ్లి డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ రామాంజుల నాయక్ తదితరులు జేసీని మర్యాద పూర్వకంగా కలిశారు. అందరికి అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని జేసీ ఈ సందర్భంగా వెల్లడించారు. 21 నుంచి ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు తిరుపతి సిటీ: వచ్చేనెల 23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 21వ తేదీ నుంచి రెండో విడత ప్రీ ఫెనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్లో మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించామని, పబ్లిక్ పరీక్షల కు విద్యార్థులను సన్నద్ధం చేసే దృష్టితో మరోసా రి ప్రీ ఫైనల్ నిర్వహించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే మార్చి 16 నుంచి పది పబ్లిక్ జరగున్న నేపథ్యంలో పదో తరగతి విద్యా ర్థులకు వచ్చేనెల 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ ఫైనల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.టీటీడీకి రూ.10 లక్షల విరాళంతిరుమల: చైన్నెకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: శ్రీవారిని మంగళవారం సినీ డైరెక్టర్ తిరుమల కిషోర్, హీరోయిన్ ఆషికా రంగనాథ్, సినీ నటుడు విజయ్కుమార్, నటి ప్రీతి దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. ఎస్వీయూలో నూతన భవనాలు ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూలో పలు నూతన భవనాలను, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. బుధవారం నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలకు చెందిన శిలాఫలకాలను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్వీయూలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, రూ. 5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ప్రారంభించారు. అలాగే వర్సిటీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.6 కోట్లతో సెంట్రల్ అడ్వాన్డ్ పరిశోధన ల్యాబ్కు, విద్యా మౌళిక వసతులల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ రెండో అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే ప్రహరీగోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 16న విశ్వంలో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ మోడల్ టెస్ట్ తిరుపతి సిటీ: స్థానిక వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ ఇన్స్టిట్యూట్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూ ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ – 2026కు సంబంధించి ఈనెల 16న ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షకు ముందస్తు సాధన కల్పించేందుకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధం కావడంతో పాటు, సబ్జెక్టుల వారీగా తమ లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంద న్నా రు. మోడల్ పరీక్షకు ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదని స్పష్టం చేస్తూ, పరీక్షకు హాజర య్యే విద్యార్థులు తమ సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86888 88802/93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రూ,30 లక్షలు విలువ చేసే బంగారం చోరీ రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కో డూరులోని నగర్ లో తాళ్లపాక సురే ష్రెడ్డి, పూజితల ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో బీరువాలోని రూ.30 లక్షలు వి లువ చేసే 21 తు లాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు తమ కుమార్తె మొక్కుబడి తీర్చుకోవడానికి శుక్రవారం శ్రీశైలం దేవస్థానానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మంగళవారం ఇంటికి వచ్చి చూడగా గ్రిల్, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండడం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మందుచూపు!
చిత్తూరు అర్బన్: మద్యం విక్రయాలకు సంబంధించి బాటిల్పై రూ.10 పెంచుకోవడానికి మంత్రి వర్గంలో తీర్మానం అలా చేశారంతే. ఆ తీర్మానం తరువాత ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు వెళ్లాలి, ప్రభుత్వం వాటిలో లోటుపాట్లు గుర్తించి జీవో ఇవ్వాలి. ఇవేవీ తమకు పట్టదన్నట్లు జిల్లాలో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి వర్గం ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ రాగానే.. జిల్లాలో ఒక్కో క్వార్టర్ బాటిల్పై ఏకంగా రూ.10 చొప్పున పెంచేశారు. అక్రమ వసూళ్లు చిత్తూరు జిల్లాలో 113 మద్యం దుకాణాలు, ఏడు మద్యం బార్లు ఉంటే.. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం నుంచే 90 శాతం దుకాణాల్లో మద్యం ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ రోజు అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎకై ్సజ్ పాలసీలో పలు మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఇందులో ప్రతీ మద్యం బాటిల్పై రూ.10 పెంచడమనేది ప్రధాన నిర్ణయం. రూ.99 మద్యానికి ఇందులో మినహాయింపు ఇచ్చింది. మంత్రి వర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ధరలు అమాంతంగా పెంచేశారు. ప్రతీ క్వార్టర్ బాటిల్పై రూ.10 అక్రమంగా వసూలు చేసేస్తున్నారు. బీర్ విక్రయాలపై ధరల పెంపు లేకపోయినా.. జిల్లాలో యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇక ప్రీమి యం బ్రాండ్ల క్వార్టర్ బాటిల్పై రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐదు రోజులుగా ఈ దందా సాగిస్తున్నా అడిగే దిక్కులేదు. రోజుకు రూ.కోటికి పైగా సాగే మద్యం విక్రయాల నుంచి ఈ ఐదు రోజులకు అక్రమ వసూళ్ల ద్వారా రూ.కోటి వరకు ఆదాయం చేకూరింది. సోమవారం నుంచి రూ.10 పెంపు మద్యం బాటిళ్లపై రూ.10 పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సోమవారం రాత్రి జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మద్యం బాటిల్పై రూ.10 పెంచుతున్నట్లు పేర్కొంది. బీర్, వైన్బాటిళ్లు, రూ.99 మద్యంపై ఈ పెరిగిన ధరలు వర్తించవు. మద్యం విక్రయాల్లో చిలక్కొట్టుడు! భారీగా ఆఫ్ టేక్ మరోవైపు ప్రభుత్వం నుంచి ధరల పెంపు జీవో రాకమునుపే మద్యం డిపోల నుంచి భారీగా స్టాకును (ఆఫ్టేక్)కు దుకాణాలకు తరలిస్తున్నారు. ధరలు పెరిగిన తరువాత లాభం కోసం ఎదురుచూడడంకంటే.. అమల్లోకి రాకమునుపే మద్యం బాటిళ్లను భారీ మొత్తంలో తీసుకుంటూ రోజుకు రూ.లక్షలు ఆర్జిస్తు న్నారు. గతేడాది జనవరి 1–11వ తేదీ వరకు చిత్తూరు జిల్లా లో 37,973 మద్యం బాక్సులు, 13,269 బీరు బాక్సులు డిపోల నుంచి తరలించిన వ్యాపారులు రూ.25.92 కోట్లు చెల్లించారు. తాజాగా ఈ 11 రోజులకు చిత్తూరు జిల్లాలో ఏకంగా 57,463 బాక్సుల మద్యం (19,490 బాక్సులు అదనం), 15,748 బీరు బాక్సులు (2,479 బాక్సులు అదనం)తీసేసుకున్నారు. అంటే దాదాపు 51 శాతం స్టాకును అదనంగా తీసుకు న్నారు. కేవలం ధరల పెరుగుదల కారణంగానే ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటు ధరల పెంపునకు ముందు.. పెంపు తరువాత మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడ్డట్లయ్యింది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రేణిగుంట:శేషాచలం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున మామండూరు సమీపంలో రేణిగుంట–కడప రహదారిలో అటవీశాఖ అధికారు లు తనిఖీలు చేశారు. ముందుగా ద్విచక్ర వాహనం వేగంగా రావడానికి గమనించిన అధికారులు ఆపడానికి ప్రయత్నించగా వాహనాన్ని వదిలి ఓ వ్యక్తి అడవిలోకి పరారయ్యాడు. వెనుక వస్తున్న వారు ఈ విషయం గుర్తించి, కారుని ఆపి అడవిలోకి పారిపోయారు. కారుని పరిశీలించగా అందులో 249 కిలోల బరువున్న 15 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అటవీ క్షేత్రాధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్ఓ గౌస్కరీం, ఎఫ్బీఓ శరవణ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
పండక్కి ఊరెళుతూ పరలోకాలకు..
నాగలాపురం: పండక్కి ఊరెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగలాపురం మండలం, కృష్ణాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని దక్షిణపుకోట వీధికి చెందిన టి.శేఖర్ కుమారుడు టి.హర్షవర్ధన్(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన మేనమామ, అతని కొడుకుతో కలిసి ముగ్గురు ద్విచక్రవాహనంలో తిరుపతికి బయలు దేరారు. కృష్ణాపురం స్పీడ్ బేకర్ వద్ద వెనుక కూర్చుని ఉన్న హర్షవర్థన్ ద్విచక్ర వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయాడు, ఆ సమయంలో ఊత్తుకోట్టై వైపు వెళుతున్న టిప్పర్ హర్షవర్థన్ తలపై ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను సురుటుపల్లి సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. మృతుని తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. -
హోరాహోరీగా చెస్, క్యారమ్ పోటీలు
శ్రీకాళహస్తి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోని సంక్షేమ, విద్యా సహాయకులకు ఏ ఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో నిర్వహించిన చెస్, క్యారమ్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. చెస్ పోటీల్లో.. మహిళల విభాగంలో జి వినాయకమ్మ (తొట్టంబేడు) విన్నర్గా, ఏ మౌనిక (శ్రీకాళహస్తి) రన్నర్గా, పురుషుల విభాగంలో ఎస్ అశోక్ కుమార్ (రేణిగుంట)విన్నర్గా, వై గవాస్కర్ (శ్రీకాళహస్తి) రన్నర్గా నిలిచారు. క్యారమ్స్ పోటీల్లో.. మహిళల విభాగంలో ఏ మౌనిక (శ్రీకాళహస్తి), మేరి దివ్య (కేవీబీ పురం) జంట విన్నర్స్గా, జీ వినాయకమ్మ, పి అరుణ (తొట్టంబేడు) రన్నర్స్ గా, పురుషుల్లో ఎం నాగమోహన్ రాజు, ఏ మునికుమార్ (కేవీబీ పురం) జంట విన్నర్స్గా, పి మునిశేఖర్ (కేవీబీ పురం), వై గవాస్కర్ (శ్రీకాళహస్తి) రనర్స్ గా నిలిచారు. -
ఆక్రమణలు అచ్చెరువు
●చెరువు ప్రాణకోటికి జీవగర్ర..దాన్ని అభివృద్ధి చేసి నీటితో నింపితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే చెరువుకు నేడు రక్షణ కరువు అవుతోంది. పైగా ఆ నీటి వన రు నేడు ఆక్రమణలు, రియల్టర్లకు ఆదాయాని కి అడ్డాగా మారింది. ఫలితంగా ఎకరాలకు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు కనుమరుగవుతోంది. వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం పంచాయతీ పరిధిలోని రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు ఓ రియల్టర్ సిద్ధమయ్యాడు. ఆ దిశగా చెరువు కింద భాగంలో కంచరపాళెం దళితులకు చెందిన 60 ఎకరాల భూములను చైన్నెకు చెందిన రియల్టర్ కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆ భూములకు ప్రహరీ గోడ నిర్మాణంలో భాగంగా ఏకంగా తమ భూములకు ఆనుకుని ఉన్న రెడ్డిగుంట చెరువు భూ మిని సైతం దర్జాగా ఆక్రమించుకున్నాడు. చెరువుకు అవతలివైపు, ఇవతలివైపు ఆక్రమణతో పాటు చెరువు నుంచి వెళుతున్న కాలువలను సైతం పూడ్చి వేసి తమ రియల్ ఏస్టేట్కు సంబంధించిన భూమిలో అడ్డగోలుగా కలిపేసుకున్నారు. కాలువలో రూపురేఖలు లేకుండా చదును చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించాడు. బఫర్ జోన్ పూర్తిగా ఆక్రమణ రెడ్డిగుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువు భూమిని పూర్తిగా తమిళనాడుకు చెందిన రియల్టర్ ఆక్రమించుకున్నాడు. ఏకంగా చెరువుకట్టకు ఆనుకుని దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నా ప్రశ్నించే దిక్కు లేదు. అంతేకాక చెరువు తూము నుంచి వెళ్లే కాలువను సైతం తమ రియల్ ఏస్టేట్ భూమిలోకి మళ్లించుకుని కాలువకు అడ్డంగా గోడ నిర్మించాడు. అంతేకాక చెరువు కొనకట్ట వద్ద కట్టను తెగ్గొట్టి మరీ కింద నుంచి ప్రహరీ నిర్మాణానికి పునాదులు వేశాడు. చెరువు లోతట్టు ప్రాంతం సైతం చెరువు భూమిని ఆక్రమంచి దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. చెరువుకట్టకు గండి.. అధికారుల కంటపడిన ఆక్రమణ రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు పాల్పడిన రియల్టర్ ఏకంగా నాలుగు రోజుల కిందట ఇరిగేషన్ చెరువుకట్టను తెగ్గొట్టి అందులో నీటిని బయటకు తరలించి, చెరువు మట్టితో తమ భూమిని రియల్ వ్యాపారానికి అనుగుణంగా చదును చేసుకునేందుకు చేపట్టిన పన్నాగం స్థానిక గ్రామస్తుల కంటపడడంతో అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో చెరువుకట్ట తెగ్గొట్టిన సంఘటనపై గ్రామస్తులు సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిన చెరువుకట్టను పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రెడ్డిగుంట చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ సందర్భంలో రియల్టర్ చెరువు చుట్టూ చేపట్టిన ఆక్రమణల భాగోతం వారి కంటపడింది. అంతేకాక ఇప్పటికే చెరువుకట్టను తెగ్గొట్టేందుకు వినియోగించి ఇటాచీ యజమానిపై కేసు నమోదు చేసి, దాన్ని సీజ్ చేశారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రెడ్డిగుంట చెరువు రియల్టర్ దురాక్రమణ చర్యలు తీసుకుంటాం రెడ్డిగుంట చెరువు చుట్టూ రియల్టర్లు నిర్మించిన ప్రహరీ గోడ కట్టకు సమీపంలో బఫర్ జోన్లో నిర్మాణం జరిగినట్లు అనుమానాలున్నాయి. తూము వద్ద వెళుతున్న కాలువకు అడ్డంగా ప్రహరీ గోడ నిర్మించడం చట్టరీత్యా వ్యతిరేకం. దీనిపై సంబంధిత భూయజమానికి నోటీసులు అందించి ఆక్రమణలను అడ్డుకుంటాం. కచ్చితంగా ఆక్రమణ లు జరిగిన చోట ప్రహరీ నిర్మాణం జరిగినప్పటికీ దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చెరువుకట్ట తెగ్గొట్టిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశాం. – రత్నాకర్ రెడ్డి, డీఈ, సత్యవేడు ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ -
రేణిగుంటలో కొండచిలువ ప్రత్యక్షం
● భయాందోళనలో స్థానికులు రేణిగుంట: పట్టణంలోని పాంచాలినగర్ నాలుగో వీధిలో కాపురమున్న కళ్యాణి ఇంట్లో మంగళవారం కొండచిలువ ఉండడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు సర్పంచ్ నగేషం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. ఆయన పంచాయతీ కార్మికులతో కలసి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వెంటనే పూడి గ్రామంలోని స్నేక్ క్యాచర్ కుప్పస్వామికి సమాచారం అందించారు. ఆయన వెంటనే రేణిగుంటకు చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పట్టణంలో కాపురాలు ఉండే ప్రాంతంలోకి కొండచిలువ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
అనుమానాస్పదంగా మహిళ మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటీఆర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మంగళం బీటీఆర్ కాలనీకి చెందిన జయకోడి(43) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తోటి కూలీలతో పనులు చేసే జయకుమార్తో ఆమె కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన నివాసంలో జయకోడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతోపాటు జయకుమార్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం మెడపై చున్నీతో లాగి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు
తిరుమల: తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో ముఖఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను టీటీడీ విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న కచ్చితమైన స్థానం డిస్ప్లే అవుతుందని, తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈఓ తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సత్య నారాయణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
పరీక్షలు ఎప్పుడంటే!
టెన్త్ పబ్లిక్ పరీక్షలు (స్టేట్ సిలబస్): మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు టెన్త్ పబ్లిక్ (సీబీఎస్సీ సిలబస్): ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ : ఫిబ్రవరి ఒకటి నుంచి 5వ తేదీ వరకు ఇంటర్(స్టేట్ సిలబస్) పబ్లిక్ పరీక్షలు: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు 12వ తరగతి (సీబీఎస్ఈ) పబ్లిక్: ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ తొలివిడత: ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు నీట్ పరీక్ష – మే 3వ తేదీ -
పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం
పది పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే టాపర్లుగా నిలిచే అవకాశ ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి సామర్థ్యపు పరీక్షలతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. – జి సురేష్, సీఎంఓ, సమగ్ర శిక్ష, తిరుపతి జిల్లా పోటీ పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం నీట్,జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతు న్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో దొరికే బిట్ బ్యాంక్లు చది వితే ఉపయోగం ఉండదు. పది,ఇంటర్ సిలబస్ను లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణంగా చదివి ప్రాక్టీస్ చేయాలి. – రవిశంకర్, రిటైర్డ్, అధ్యాపకులు, తిరుపతి కొత్త సిలబస్తో పరీక్షలు..జాగ్రత్త సుమా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొత్త సిలబస్తో నూ తన పరీక్షా విధానాన్ని ఎ దుర్కొబోతున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ప్రీఫైనల్ పరీక్షలతో పేపర్ నమూనా తెలిసి ఉంటుంది. క్లిష్టమైన మ్యాథ్స్, ఫిజిక్స్, బోటనీపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. –సరస్వతి, లెక్చరర్ తిరుపతి వీటికి దూరంగా ఉండాల్సిందే! తిరుపతి సిటీ: పరీక్షల కాలం సమీపిస్తోంది. టెన్త్, ఇంటర్తోపాటు జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యార్థులు పుస్తకాలకు పరిమితం కావాల్సి సమయం ఆసన్నమైంది. పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులను ఇటు టీచర్లు అటు తల్లిదండ్రులు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యాసంస్థల యాజమాన్యా లు, ప్రభుత్వాధికారులు, ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేప థ్యంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్త మ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విజయానికి సూచనలివే... సమీపిస్తున్న టెన్త్, ఇంటర్, జేఈఈ, నీట్ పరీక్షలు ఇవి పాటించాలి ఆరోగ్యం ప్రధానమే -
పంటల్లేవు, పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ?
నగరి : ‘ఎరువులు, యూరియా అందక, సబ్సిడీ విత్తనాలు లేక, పంటలు చేతికి రాక, వచ్చినా గిట్టుబాటు ధరలేక, ఇచ్చిన హామీ లు ఏవీ అమలుగాక రైతుకు భవిష్యత్తే లేకుండా పోయింది. పంటల్లేవు.. పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ అనే స్థాయికి రైతులు చే రుకున్నారు.. సంక్రాంతి కళతప్పి కనిపిస్తోంది’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరిలోని తన నివాస కార్యాలయంలో నియోజకవర్గ స్థా యి పార్టీ శ్రేణుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అందరికీ పార్టీ క్యాలెండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ రాష్టంలో రైతులకు దిక్కుతెలియని పరిస్థితి నెలకొందన్నారు. సాగు వ్యయం పెరిగి పంట ఆదాయం తగ్గిందన్నారు. సాగు నుంచి పంట కోత వరకూ అప్పులు చేసుకుని తిప్పలు పడుతున్నారన్నారు. రైతుకు ప్రధాన పండుగైన సంక్రాంతిని జరుపుకోవడానికి ఖర్చులకు లేక రైతే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ ప్రజల గొంతుకోయొద్దు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. జగనన్న 80 శాతం పూర్తి చేసిన పనులను అటకెక్కించేసిందన్నారు. కరువు ప్రాంతాలకు శాశ్వత నీటిపరిష్కారానికి చేపట్టిన పనులకు గండికొట్టిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశామని చెప్పేంత వరకు చంద్రబాబు కుట్ర బయటపడలేదన్నారు. నిశ్శబ్దంగా చంద్రబాబు రాయలసీమ ప్రజల గొంతుకోసేస్తున్నారన్నారు. కళతప్పిన సంక్రాంతి పేదలకు చేసిన మంచి ఇదేనా బాబూ? ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి, వీవీపాట్స్ను చించికాల్చేసి అవకతవకలకు పాల్పడి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి ఇదేనా అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. పాలక ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రం ఎంత నష్టపోతోందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతోందో ప్రజలకు విడమరచి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాయలసీమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పార్టీని పటిష్ట పరచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలన్నారు. పార్టీకి నష్టం వచ్చే పనులకు పాల్పడితే వారు కూర్చున్న కొమ్మను వారు నరుక్కున్నట్లే అన్నారు. ఈ సమావేశంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, నగరి, పుత్తూరు ఎంపీపీలు భార్గవి, మునివేలు, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీ నేతలు, అనుబంధ కమిటీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
23న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 23వ తేదీన తెలంగాణాలోని చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. కాగా అదే రోజు కడప జిల్లాలోని కొప్పర్తిలో దీని ఇజ్తిమా(ముస్లింల మతపరమైన సమావేశం) జరగనుంది. ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే వారి సౌక ర్యార్థం ప్రత్యేక రైలును నడపనున్నారు. అయి తే రైలు నంబరు (07140) చర్లపల్లి–తిరుచానూరు రైలు జనవరి 22న చర్లపల్లిలో బయలుదేరుతుంది. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 5.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి ఈ రైలు కడప మీదుగా తిరుచానూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు (07141) జనవరి 25న రాత్రి 11.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు కడపకు, ఉదయం 6.50 గంటలకు నంద్యాలకు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు కడపలో జరిగే ఇజ్తిమాకు వెళ్లే నంద్యాల వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. టీటీడీకి రూ.20 లక్షలు విరాళం తిరుమల: టీటీడీ మాజీ సీవీఎస్వో దామోదర్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళం ఇచ్చా రు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. స్విమ్స్ ఓపీ, ఓటీలకు రేపు సెలవు తిరుపతి తుడా: మకర సంక్రాంతి సందర్భంగా గురువారం స్విమ్స్ ఆస్పత్రిలో ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ విషయాన్ని రోగులు గుర్తించి సహకరించాలని సూచించారు. కలెక్టరేట్లో కొత్త జిల్లా మ్యాప్ తిరుపతి అర్బన్: జిల్లాలో రాజకీయ కోణంలో చంద్రబాబు సర్కార్ ఇటీవల చేపట్టిన పునర్విభజనతో 34 మండలాలున్న జిల్లా 36 మండలాలుగా మారింది. అయితే 4 రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లా ప్రస్తుతం 3 రెవెన్యూ డివిజన్లగా మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టరేట్లో కొత్త మండలాలతో(36తో) కూడిన మ్యాప్ను గోడకు ఏర్పాటు చేశారు. తిరుపతి రెవెన్యూ డివిజన్లో 14 మండలాలు, శ్రీకాళహస్తి డివిజన్లో 11, సూళ్లూరుపేట డివిజన్లో 11 మండలాలతో కూడిన మ్యాప్ను ఉంచారు. తిరుమలకు తగ్గిన ప్రయాణికులు తిరుపతి అర్బన్ : తిరుమలకు ప్రయాణికుల రద్దీ తెలిసిందే. నిత్యం తిరుపతిలోని ఏడుకొండల బస్టాండ్లో ప్రయాణికులు కిటకిటలాడుతుంటారు. అయితే సంక్రాంతి నేపథ్యంలో నాలుగు రోజులుగా బస్టాండ్ బోసిపోతోంది. సాధారణంగా రోజూ తిరుపతి నుంచి తిరుమలకు 80వేల రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 50వేల మందికి పడిపోయింది. దీంతో చాలా బస్సులు ఖాళీగా డిపోలోనే ఉండిపోవడం గమనార్హం. -
పింఛన్ మంజూరు చేయండయ్యా
వెంకటగిరి రూరల్: పింఛన్ మంజూరు చేయండయ్యా అని వెంకటగిరి రూరల్ మండలంలోని అమ్మపాళెం గ్రామానికి చెందిన మోరా రాజమ్మ వేడుకుంటోంది. ఈమెకు పక్షవాతం సోకి అంగవైకల్యం వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా మంచంపై జీవనం సాగిస్తోంది. వ్యక్తిగత పనులు సైతం చేసుకోవాలని ఆ మహిళకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయడంలో నిర్లక్షధోరణితో వ్యవహరిస్తోంది. సదరం శ్లాట్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాజమ్మకు అంగవైకల్యం ఉందని ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా గతంలో పొంది ఉన్నారు. అర్హత ఉన్న పింఛన్ రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేదమే సనాతన ధర్మానికి మూలం తిరుపతి సిటీ: సంస్కృత భాషకు, భారతీయ సనాతన ధర్మానికి మూలం వేదమేనని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం కేరళ తిరువనంతపురం వేదికగా అఖిల భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వైదిక సమ్మేళనంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వేదాల్లోని జ్ఞానాన్ని భావిభారతానికి అందించడానికి ఇలాంటి వైదిక సమ్మేళనాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. -
పిన్నెల్లికి బియ్యపు మధు పరామర్శ
శ్రీకాళహస్తి: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డిని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. జైలులో పిన్నెల్లిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు. జైలుకు వచ్చిన తర్వాత పిన్నెల్లి దాదాపు 9 కిలోల బరువు తగ్గారని, జైలులో ఖైదీలకు సరైన ఆహారం అందించడం లేదని ఆరోపించారు. కనీసం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. గతంలో అండమాన్–నికోబార్ జైళ్లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వేధింపులను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. -
సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లెకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, యాక్సెస్ కంట్రోల్, నిషేధిత ప్రాంతాల అమలు, వాహనాలపై గట్టి నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హెలిప్యాడ్ నుంచి వీఐపీ రూట్ భద్రతను పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. వీఐపీ రూట్ భద్రత, సభా ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి నిఘా, నిరంతర పరిశీలన, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్లు, ఫైర్, అంబులెన్స్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలను సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు. -
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
దొరవారిసత్రం: ెఫ్లమింగో ఫెస్టివల్ సందర్భంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో సోమవారం సందర్శకుల సందడి నెలకొంది. పండుగ మూడో రోజు పర్యాటకులు వందల సంఖ్యలో విచ్చేసి విహంగాలను వీక్షించారు. పక్షుల పండుగ ప్రత్యేక అధికారి భానుప్రకాష్రెడ్డి పందర్శకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. నాయుడుపేట సీఐ సంఘమేశ్వరరావు, ఎస్ఐ అజయ్కుమార్ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు పక్షుల పండుగ సందర్భంగా పక్షుల కేంద్రం సమీపంలోని పెలికాన్ అతిథి గృహాల వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధుల నృత్యప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. -
గతుకుల రోడ్లు
దెబ్బతిన్న ఓజిలి మండలం తిరుమలపూడి రోడ్డు తిరుపతి రూరల్: మండలంలోని ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు వెళ్లే రో డ్లు గతుకులతో దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా తట్ట మట్టి వేయకుండా వదిలేయడంతో సంక్రాంతికి పట్టణాలు, నగరాల నుంచి వచ్చే వారి ఒళ్లు గుల్ల అవుతోంది. అంతేకాదు ఖరీదైన కార్లు గోతుల్లో పడి షెడ్డుకు చేరాల్సిన పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పల్లె రోడ్లను బాగుపరిచామని పచ్చ పత్రికల్లో కలరింగ్ ఇచ్చుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రామచంద్రాపురం మండలం సి.రామాపురం నుంచి చంద్రగిరి మండలం శానంబట్ల వరకు దెబ్బతిన్న రహదారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం టిప్పర్లతో రహదారి విధ్వంసం చేస్తుంటే ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు, రైతులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే పెరుమాళ్లపల్లి పంచాయతీ లక్ష్మీచెరువుకు వెళ్లే రహదారి గోతులుమయం అయ్యింది. రామానుజ పల్లి సర్కిల్ జాతీయ రహదారి నుంచి పైడిపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా ఛిద్రమైంది. -
20లోపు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి
తిరుపతి సిటీ: ఇటీవల జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎమ్ఎమ్ఎస్) పరీక్షకు హాజరైన జిల్లా విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మెరిట్ విద్యార్థుల జాబితా జిల్లా కార్యాలయానికి అందనున్న నేపథ్యంలో పరీక్ష రాసిన విద్యార్థులు ప్రధానంగా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఏడో తరగతి మార్కుల జాబితా, హాల్టికెట్ జిరాక్స్ తదితర సర్టిఫికెట్లను విద్యార్థులు సిద్ధం చేసుకోవాలని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు తప్పనిసరిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టీఫికెట్లను సైతం సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు జాతీయ విద్యామంత్రిత్వ శాఖ వైబ్సైట్ www.rchoarrh ipr.gov.in లేదా www.bre.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు. తుడా వైస్ చైర్మన్గా గోవిందరావు తిరుపతి తుడా: తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) వైస్ చైర్మన్గా ఆర్ గోవిందరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను సోమవారం బదిలీ చేసింది. అమరావతిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో పనిచేస్తున్న గోవిందరావు తుడా వీసీగా నియమిస్తూ తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. తిరుపతి జేసీగా పనిచేసిన శుభం బన్సల్ను గత ఏడాది అక్టోబర్ 10న ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటినుంచి తుడా వీజీగా జాయింట్ కలెక్టర్గా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య పూర్తి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత ప్రభుత్వం పూర్తిస్థాయి వీసీ నియమించి, జేసీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. పండుగ వేళ ప్రత్యేక రైలు తిరుపతి అన్నమయ్యసర్కిల్: గూడూరు, విజయవాడ మీదుగా ఈ నెల 18వ తేదీన 07483 నంబర్ ప్రత్యేక రైలు (ఆదివారం) తిరుపతి నుంచి చర్లపల్లి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపనున్నారు. ఈ రైలు తిరుపతిలో రాత్రి గంటలకు 9.50కి బయలుదేరి, చర్లపల్లికి ఉదయం 11.45 నిమిషాలకు చేరుకుంటుంది. పండగల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎరచ్రందనం అక్రమరవాణా నిరోధక టాస్క్ఫోర్స్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక టాస్క్ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎరచ్రందనం సంపదను పరిరక్షించడంలో టాస్క్ఫోర్స్ మంచి ఫలితాలను సాధించిందన్నారు. స్మగ్లర్లు నుంచి సిబ్బందికి ప్రలోభాలు వస్తుంటాయని, అటువంటి వాటికి లొంగకూడదని హెచ్చరించారు. అలాంటి వారు ఉద్యోగాలను పోగొట్టుకుని, వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. క్రమశిక్షణతో తమ విధులు నిర్వహించి టాస్క్ఫోర్స్కు మంచి పేరు తీసుకుని రావాలని ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జె.కులశేఖర్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐ సాయి గిరిధర్, సీఐ ఖాదర్ బాషా, ఎస్ఐ సీహెచ్ రఫీ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబుకు రేవంత్రెడ్డి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి?
పెళ్లకూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. రాయలసీమ రైతుల దాహార్తిని తీర్చడం కోసం జలగం వెంగళరావు హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు ప్రాజెక్టుకు 11వేల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు. అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హంపీ–పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11వేల క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. అలాగే శ్రీశైలం నీటిమట్టం 845 అడుగులకు తగ్గకుండా పోతిరెడ్డిపాడు నుంచి 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అధికారికంగా 454 జీఓను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. -
పాలన గాడి తప్పింది!
రీసర్వే డీటీలకు సెక్షన్ పగ్గాలు జిల్లా పరిపాలనా కార్యాలయమైన కలెక్టరేట్ కీలకం.. అయితే ఈ కార్యాలయంలో పోస్టు తగిన స్థాయి అధికారులు లేరు.. పచ్చనేతలకు లాల్సలాం కొట్టే కిందిస్థాయి ఉద్యోగులు సెక్షన్ల హెడ్లుగా నియమితులు కావడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. తిరుపతి అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం జిల్లాకు గుండెకాయ లాటింది. కీలకమైన అన్నీ విభాగాలకు చెందిన వ్యవహారాలను చక్కపెట్టాల్సింది కలెక్టరేట్లోనే. ఈ క్రమంలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ నుంచి హెచ్ వరకు 8 విభాగాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి విభాగానికి హెడ్గా తహసీల్దార్ స్థాయి అధికారిని ఏర్పాటు చేశారు. దీంతో పాలన సజావుగా సాగిపోయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో తాజాగా పలు విభాగాల హెడ్ల నియమకం చేపట్టారు. ఇప్పటికే ఒకరిద్దరు బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన వారు సంక్రాంతి తర్వాత బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే కీలకమైన మూడు విభాగాల్లో హెడ్లుగా రీ సర్వే డీటీలకు బాధ్యతలు అప్పగించడంపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్లో 14 మంది వీఆర్వోలకు వివిధ చోట్ల పోస్టింగ్ ఇవ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వీఆర్వోలను కలెక్టర్లో కీలకమైన చోట్ల నియమించడంపై చర్చసాగుతోంది. మొత్తంగా కలెక్టరేట్ పాలన గాడి తప్పుతుందని పలు విమర్శలు వస్తున్నాయి. కీలకమైన ఎఫ్ సెక్షన్ హెడ్గా కే.స్వాతి(రీసర్వే డీటీ) సీ సెక్షన్కు హెడ్గా పి. బాలాజీ( రీసర్వే డీటీ)లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ సెక్షన్కు సంబంధించి ఇద్దరు రీ సర్వే డీటీలు సీవీఎన్ఎన్ శిరీషా, కే. మాధవి ఉండడంతో ఎవరికి హెడ్గా ఇవ్వాలో తెలియక.. ప్రస్తుతం నియమించకుండా ఖాళీగా ఉంచారు. మరోవైపు కీలకమైన పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్గా కేఎం రోజ్మాండ్(ఎస్డీసీ)ఉన్నప్పటికీ ఆ సెక్షన్లో మరో తహసీల్దార్ స్థాయి అధికారి ఉండేవారు. అయితే ఈ సారి ఆ స్థానాన్ని డీటీతో సరిపెట్టేశారు. ఏ అండ్ బీ సెక్షన్ హెడ్, కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న వై. రమేష్బాబుకు(తహసీల్దార్) ఎలక్షన్ సెక్షన్ హెడ్గా బాధ్యతలు అప్పగించారు. అలాగే తిరుపతి రూరల్ తహసీల్దార్గా పనిచేస్తున్న బి.రామాంజుల నాయక్ను బదిలీపై కలెక్టర్ ఏఓగా, ఏ అండ్ బీ సెక్షన్ హెడ్గా నియమించారు. జీ సెక్షన్ హెడ్గా ఎస్. శివప్రసాద్(తహసీల్దార్), ప్రోట్కాల్ సెక్షన్ హెడ్గా జే. శివశంకర్ నాయక్(ఎస్డీసీ), లీగల్ సెల్ హెడ్గా వి. దేవేంద్రరెడ్డి(ఎస్డీసీ)ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. మొత్తంగా మూడు సెక్షన్లకు హెడ్లుగా డీటీలను ఏర్పాటు చేయడం, కీలమైన పీజీఆర్ఎస్ సెక్షన్కు తహసీల్దార్ను ఏర్పాటు చేయకపోవడం, 14 మంది వీఆర్వోలకు కలెక్టరేట్లో కీలకమైన చోట్ల పోస్టింగ్లు ఇవ్వడంపై చర్చసాగుతుంది. కీలకమైన విభాగాలు రీ సర్వే డీటీలకు అప్పగింత -
అంతా నాశనం చేశారు!
టూరిజం సముదాయాలను కాంట్రాక్టర్లు నాశ నం చేశారని టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ అన్నారు.రోడ్లు వేసిన దాఖలాలు లేవుడక్కిలి: నా పేరు మాదిరెడ్డి మునిరామ్రెడ్డి, మాది డక్కిలి గ్రామం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు సంక్రాంతి పండుగలు వచ్చాయి. ఒక్క గ్రామానికి కూడా తారు రోడ్డు వేసిన దాఖలాలు లేవు. నేను హైదరాబాద్ నుంచి డక్కిలికి వెళదామని వస్తే మా ఊరు ఆర్అండ్బీ రహదారి ఛిద్రమైంది. లింగసముద్రం, నాయుడుపాళెం పలు చోట్ల అడుగు అడుగున గోతులు మయమైంది. -
మళ్లీ సంక్రాంతి వచ్చినా మారని రోడ్ల దుస్థితి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మళ్లీ సంక్రాంతి పండగ వచ్చినా రోడ్లు బాగుపడలేదు. పండక్కి పల్లెకు వ చ్చే వారికి గుంతల రోడ్లే స్వాగతం పలుకుతున్నా యి. ఈ పండక్కీ రోడ్లు బాగుపడలేదా? అంటూ ఊరికి వచ్చిన వారు నిట్టూరుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు ఛిద్రమై దర్శనమిస్తున్నాయి. పండక్కి పట్టణాల నుంచి పల్లెకు వెళ్లాలంటే జనం భయపడుతున్నా రు. దేశ,విదేశాల్లో ఉండే రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వస్తారని,ఆలోపు రహదారులన్నింటినీ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అయితే మళ్లీ సంక్రాంతి వస్తుండడంతో బాబు ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. అయినా బాగుపడకపోవడంతో వారు ఆగ్రహిస్తున్నారు. దుస్థితిలోనే పల్లె రహదారులు.. ప్రయాణం నరకం మళ్లీ సంక్రాంతి పండుగ రానే వచ్చింది. రోడ్లపై ఏర్పడిన గుంతలను మాత్రం పూడ్చలేదు. తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి పరిశీలనలో అనేక గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నట్లు తేలింది. సంక్రాంతికి సంతోషంగా సొంతూరికి బయలు దేరిన వారికి రోడ్డు బాగుందా? లేదా? అనే విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. స్థానిక సర్పంచ్లు రహదారులను బాగు చేద్దామన్నా కూటమి నేతలు నిధులు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. -
ఘనంగా ముగిసిన పక్షుల పండుగ
సూళ్లూరుపేట కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సోమవారంతో ఘనంగా ముగిసింది.గోతులమయంపైచిత్రంలో కనిపిస్తున్న రోడ్డు ఏర్పేడు మండలం ముసలిపేడు బత్తినయ్య ఎస్టీ కాలనీకి వెళ్లే మార్గం. తారు రోడ్డు గోతులమయంగా మారింది. ముఖ్యంగా ఈ మార్గంలో చైన్నె నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళుతున్నారు. దీంతో వారి అవస్థలు వర్ణనాతీతం. ఇది మన్నసముద్రం, ముసలిపేడుకే పరిమితం కాదు. నియోకవర్గంలోని అన్ని మండలాల్లోనూ గ్రామీణ రోడ్లు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
ఎనిమిదెకరాల్లో బొప్పాయి మొక్కలు ధ్వంసం
– అడవి పందులు విధ్వంసం చిట్వేలి:మండలంలోని కంపసముద్రం, కందులవారిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు రైతులకు చెందిన ఎనిమిదెకరాల్లో ఆరు వేల బొప్పాయి మొక్కలు అడవి పందులు ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య, కె.లక్ష్మమ్మ, కె.మురళి, కె.ఈశ్వరయ్య, కె.రెడ్డెమ్మ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి పంట ధ్వంసమై ఉండడాన్ని చూసి లబోదిబోమంటూ గ్రామానికి వచ్చి జరిగిన నష్టాన్ని గ్రామస్తులకు, సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఎనిమిది ఎకరాల్లో ఆరు వేల మొక్కలను పందులు ధ్వంసం చేశాయి. ఒక్కో మొక్క రూ.30 చొప్పున రూ.3 లక్షల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, వీహెచ్ఏ శివంతిక, వీఆర్ఓ బాలసుబ్రమణ్యం సోమవారం ధ్వంసమైన పొలాలను పరిశీలించారు. తిరుమలలో భారీ నాగుపాము తిరుమల: తిరుమలలో ఆదివారం భారీ నాగుపాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు నివాసం ఉండే ఆర్బీ సెంటర్ వద్ద భారీ నాగు పాము ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని తిరుమలలోని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందజేశారు. ఆయన అక్కడకు చేరుకుని ఆరడుగుల నాగుపామును చాకచక్యంగా పట్టుకుని, తిరుమలలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. -
దుస్థితికి చేరిన గ్రామీణ రోడ్లు
నాగయ్యగారిపల్లి–చంద్రగిరి మార్గంలోని రెడ్డివారిపల్లి వద్ద రోడ్డు దుస్థితిపిచ్చినాయుడుపల్లి వద్ద గుంతలమయమైన రోడ్డు చంద్రగిరి: మండలంలోని గ్రామీణ రోడ్లు గుంతలమయమయ్యాయి. చంద్రగిరి–నాగయ్యగారిపల్లి రోడ్లు దెబ్బతిన్నాయి. చంద్రగిరి–పిచ్చినాయుడుపల్లి మార్గం మరింత దారుణంగా ఉంది. తొండవాడలోని జగనన్న కాలనీలో రోడ్లు వేయకపోవడంతో అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రగిరి–ఐతేపల్లి మార్గంలోని ఐతేపల్లి గుంతమయమైంది. తొండవాడ–కొత్తశానంబట్ల రోడ్డు పదేళ్లుగా మరమ్మతు చేయలేదు. -
పెద్దపాండూరు దారిద్య్రం
వరదయ్యపాళెం: పక్క ఫొటోలో కనిపిస్తున్నది వరదయ్యపాళెం నుంచి పెద్దపాండూరుకు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు. సుమారు 9 కిలోమీటర్ల మేరకు దూరం ఉన్న ఈ రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగున గుంతలు ఏర్పడి ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులను కుదిపేస్తోంది. జాతీయ రహదారి ఛిద్రమే పుత్తూరు నుంచి ఊత్తుకోట వరకు ఉన్న తిరుపతి–చైన్నె జాతీయ రహదారి దారుణంగా ఉంది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడి వాహనదారులు ఆ మార్గంలో వెళ్లేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. రూపుకోల్పోయిన చిన్న పాండూరు రోడ్డు నియోజకవర్గంలోని నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డు రూపు కోల్పోయింది. ప్రధానంగా ఈ రోడ్డు 29 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే 17 కిలోమీటర్ల వరకు అసలు ఆర్ అండ్ బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై మట్టి రోడ్డుగా మారిపోయింది. మరో 12 కిలోమీటర్లు రోడ్డు క్వారీ లారీల దాటికి బావులను తలపించేలా గుంతలు ఏర్పడ్డాయి. -
ఘనంగా ముగిసిన పక్షుల పండుగ
సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సోమవారం ఘనంగా ముగిసింది. పండుగ ముగింపు సందర్భంగా పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసి సూళ్లూరుపేట, తడ, దొరవాసత్రం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. చివరి రోజు కావడంతో సూళ్లూరుపేటలో సంద్శకులతో కిటికిటలాడరు. బాలుర ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ అందరిని అలరించాయి. ఉదయం నుంచి సందర్శకులు భారీగా విచ్చేసి అటకానితప్ప వద్ద ఉన్న పక్షుల విజ్ఞాన కేంద్రాన్ని తిలకించి పులికాట్లో పక్షులను వీక్షించారు. మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంది. బాలికలు, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. -
అటకానితిప్పలో పిల్లల సందడి
సూళ్లూరుపేట రూరల్: ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా అటకానితిప్పలోని పక్షుల విజ్ఞాన కేంద్రం చిన్నారులతో కిటకిటలాడింది. పండుగ చివరి రోజు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. విజ్ఞాన కేంద్రంలో పులికాట్ సరస్సులో లభించే మత్స్యసంపద, పక్షులు రాక, వాటి ఆహారం, నేలపట్టులోని పక్షుల రక్షిత కేంద్రం విశిష్టత, పక్కనే శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగాల గురించి వీడియోల ద్వారా పిల్లలకు అధికారులు అవగాహన కల్పించారు. అక్కడే చిల్ట్రన్స్ పార్కులో పిల్లలు సందడి చేశారు. శ్రీహరికోట వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సు ఉండడంతో చిన్నారులు, వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం విద్యార్థులు సరస్సు వద్దకు చేరుకుని పక్షులను తిలకించారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతితో పాటు చైన్నె ప్రాంతాల నుంచి సందర్శకులు విచ్చేసి, విహంగాలను వీక్షించారు. పక్షి ప్రేమికులు ప్రత్యేక కెమెరాలతో విహాంగాల సందడిని చిత్రీకరించారు. -
కోడి పందేలు చట్టవిరుద్ధం
తిరుపతి అర్బన్: సంక్రాంతి నేపథ్యంలో సంప్రదాయ పద్ధతులంటూ కోడి పంందాలు నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమని పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డి.ఉమామహేశ్వరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పసు సంవర్థకశాఖతోపాటు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలపై ప్రేత్యక దృష్టి సారిస్తారని స్పష్టం చేశారు. జంతు సంక్షేమ చట్టం 1960 ప్రకారం, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కోడి పందేలు ఆడడం జంతువులపై అమానుషత్వం, హింసకు దారితీసి అక్రమ చర్యలుగా గుర్తించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోడి పందేలకు అంతా దూరంగా ఉండాలని సూచించారు. సీఆర్ఎస్కు జాతీయ అవార్డు రేణిగుంట: తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్నకు జాతీయ ఉత్తమ రైల్వే వర్క్షాప్ పురస్కారం రావడం గర్వకారణమని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ జాతీయ ఉత్తమ రైల్వే వర్క్షాప్ పురస్కారం అందుకుని సోమవారం సీఆర్ఎస్కు చేరుకున్నారు. మజ్దూర్ యూనియన్ నాయకులు, ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు కలిసి శ్రీనివాస్ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు సాధన వెనుక వర్క్షాప్ పూర్వపు చీఫ్మేనేజర్ దేవసహాయం దూరదృష్టి, అమోఘమైన కృషి, అలాగే కార్మికులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరి శ్రమ ఉందని శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల సంక్షేమం, పచ్చదనం, పరిశుభ్రత, ఉత్పాదకత పెంపు వంటి రంగాల్లో తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ సాధించిన ప్రగతి ఈ అవార్డుకు నిదర్శనమన్నారు. వర్క్షాప్ను జాతీయ స్థాయిలో నిలిపిన ప్రతి కార్మికుడికి, సూపర్వైజర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం యూనియన్ కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ చైర్మన్ సదాశివరెడ్డి, కోశాధికారి ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి తిరుపతి రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని తనపల్లి క్రాస్ జంక్షన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని స్కూటరిస్టు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, రఘునాథ రిసార్ట్, ప్లాట్ నంబర్ 202, సి బ్లాక్ లో నివాసముంటున్న దేశినేని విఠల్ బాబు(70) సోమవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ కోసం బైరాగిపట్టెడ పార్క్ వద్దకు తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో దేశినేని విఠల్ బాబు రోడ్డుపై పడి గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన కుమారులు అతనిని కరకంబాడి రోడ్డులోని హీలియోస్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. కోడి పందేల స్థావరాలపై దాడులు దొరవారిసత్రం: కొత్తపల్లి, నెల్లూరుపల్లి సమీపంలోని కోడి పందేల స్థావరాలపై స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసి, ఐదు బైక్లు, నాలుగు కోళ్లు, రూ.3100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం రాపూరు: మండలంలోని సైదాదుపల్లి ఎస్టీకాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని పురుషుని ఉండడాన్ని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులు సమాచారం అందజేశారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ వెంకటరాజేష్ తెలిపారు. -
వచ్చారు..అర్జీలు ఇచ్చి వెళ్లారు!
తిరుపతి అర్బన్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు సంఖ్య బాగా తగ్గింది. దీంతో అధికారులను కలవడానికి అర్జీదారుల తోపులాటలు, సిపార్స్తో అడ్డదారిలో వెళ్లడం తదితర కార్యక్రమాలకు చోటులేకుండా పోయింది. అర్జీదారులు నేరుగా వచ్చారు..తమ అర్జీని అధికారులకు ఇచ్చి, ఇంటికి వెళ్లిపోయారు.. అన్న చందంగా సాగింది. డీఆర్వో నరసింహులు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ను సోమవారం చేపట్టారు. ఈ సోమవారం కేవలం 241 అర్జీలు వచ్చాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, శివశంకర్నాయక్ అర్జీలను అందుకున్నారు. అందులో 146 అర్జీలు రెవెన్యూ సమస్యలు, 25 అర్జీలు పింఛన్లపై ప్రధానంగా అందజేశారు. -
రూపకర్తలు వీరే..
పీఎస్ఎల్వీ రాకెట్ తయారు చేయడానికి ఎంతో మంది అనాటి యువ ఇంజినీర్లు శ్రమించినప్పటికి ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తాయి. నంబి నారాయణన్, డాక్టర్ ఎస్.శ్రీనివాసన్, ఈకే మాధవన్ నాయర్ కృషి ఫలితమే పీఎస్ఎల్వీ అని చెప్పొచ్చు. ఈ రాకెట్లుకు ప్రాజెక్టు డైరెక్టర్గా ఈకే మాధవన్ నాయర్ పనిచేశారు. అందులో ఎస్.శ్రీనివాసన్ అనే శాస్త్రవేత్త 1994లో జూన్ నుంచి అక్టోబర్ వరకు షార్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. నంబి నారాయణన్ మాత్రం ద్రవ ఇంధనం తయారు చేసిన శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు. 1988లో యువ శాస్త్రవేత్తలుగా వీరు పీఎస్ఎల్వీ ద్రవ ఇంధన దశల మీద ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు. ద్రవ ఇంధన ఇంజిన్ తయారు చేసుకుంటే భవిష్యత్లో అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపించే సామర్థ్యం వస్తుందని నంబి నారాయణన్ ఆధ్వర్యంలో పారిస్లో శిక్షణకు వెళ్లారు. ఆయన అభివృద్ధి చేసిన ద్రవ ఇంజిన్లనే ఈనాటికీ ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు వాడుతుండడం విశేషం. శాస్త్రవేత్త ఎస్. శ్రీనివాసన్ శాస్త్రవేత్త ఈకే మాధవన్ నాయర్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ -
ఇల్లు కూల్చివేతపై ఫిర్యాదు
తిరుపతి రూరల్ : ఇంటి కూల్చివేతపై బాధితులు ఆదివారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. సాయినగర్ పంచాయతీకి చెందిన పి.జలజాక్షి తన కుటుంబంతో 2013 నుంచి ఓ ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఇదే కాలనీకి చెందిన కవిత, చిట్టి అలియాస్ పీసీ పాయల్ తమ అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యం చేశారు. జేసీబీతో ఇంటిని కూల్చివేశారు. దీంతో తమ కుటుంబం రోడ్డున పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు పోలీసులు సైతం అండగా నిలబడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘానికి విన్నవించినట్లు వెల్లడించారు. 13న ముగ్గుల పోటీలు తిరుపతి రూరల్: సంక్రాంతి పురస్కరించుకుని మండలంలోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి తెలిపారు. మహిళలు ఈ పోటీల్లో విరివిగా పాల్గొనాలని ఆమె కోరారు. -
సేవ..లే!
ప్రభుత్వమంటే పక్షపాత రహితంగా పాలన అందించాలి. రాగద్వేషాలకు అతీతంగా సేవలు అందించాలి. కక్షపూరిత వైఖరిని విడిచిపెట్టాలి. ప్రజలకు మేలు చేకూర్చే పథకాలను సక్రమంగా అమలు చేయాలి. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసింది. అందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. ముందుగా రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చడమే కాకుండా పలు సెంటర్లను మూసేసింది. అన్నదాతలకు సేవలను దూరం చేసి నిరుపయోగంగా తయారుచేసింది. చివరకు పలు చోట్ల గోదాములుగా మార్చేసి ఉన్నత లక్ష్యాలను నీరుగార్చేస్తోంది. మూతపడింది వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం మత్తేరిమిట్ట గ్రామంలోని రైతు సేవా కేంద్రం మూతపడింది. దీంతో రైతులకు ఏలాంటి సమస్య వచ్చినా మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 87 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు అందులో సగం కూడా లేవు. అలాగే సిబ్బందిని సైతం పూర్తిగా కుదించేశారు. మిగిలిన అరకొర ఉద్యోగులను సర్వేల పేరుతో అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ప్రభుత్వ సేవలు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి అర్బన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు క్షేత్రస్థాయిలో అండగా నిలిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆశయంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు దూరాభారం వెళ్లాల్సిన పనిలేకుండా సొంత ఊరిలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. అవసరాలకు అనుగుణంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించి పంటల సాగుకు కావాల్సిన సలహాలను అందించేలా విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టారు. దీంతో రైతులు సైతం తమకు కావాల్సిన రాయితీ విత్తనాలు, పనిముట్లు, ఎరువులు, సంక్షేమ పథకాలు, ఉచిత పంట బీమా సౌకర్యాలను సులభతరంగా పొందేవారు. ధాన్యం కొనుగోళ్లు సైతం రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగేవి. ఈ–క్రాప్ నమోదు, ఈకేవైసీ తదితరాలను ఆయా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు పూర్తి చేసేవారు. బాబు పాలనలో అన్నీ అవస్థలే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు మేలు చేయడం వదిలేసి ముందుగా పేర్ల మార్పుపైనే దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆక్ఎస్కే)గా మార్చేసింది. తర్వాత ఆర్ఎస్కేలను దాదాపు 45 శాతం తగ్గించింది. అగ్రికల్చర్ అసిస్టెంట్లను సైతం పూర్తిస్థాయిలో నియమించకుండా కుట్రపూరితంగా వ్యవహరించింది. చివరకు అన్నదాతలకు సేవలందించాల్సిన ఆర్ఎస్కేలను వేరే వాటికి ఉపయోగించుకుంటూ ఉన్నత ఆశయానికి తూట్లు పొడిచేసింది. ఈ క్రమంలోనే పలు చోట్ల రైతు సేవా కేంద్రాలు గోదాములుగా మారిపోయాయి. నిరుపయోగం తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా మారా యి. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిల్వ ఉంచేవారు. రైతులకు ఎప్పటికప్పుడు పంపిణీ చేసేవారు. అప్పట్లో అన్నదాతలతో ఆర్బీకేలు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు చాలా కేంద్రాలను మూసేశారు. ఉన్న వాటినీ నిర్వీర్యం చేసేశారు. అప్పట్లో ఎరువులు, విత్తనాల గడువు ముగిసిపోతే ప్రభుత్వమే ఆయా కంపెనీలకు వెనక్కు పంపి మళ్లీ కొత్త స్టాకు తెప్పించి అందుబాటులో ఉంచేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆర్ఎస్కేలకు రైతులు వచ్చే అవకాశమే లేకుండా చేసేశారు. పలు చోట్ల ఆర్ఎస్కే భవనాలను విరిగిపోయిన ఫర్నీచర్, ఇతర సామగ్రిని వేసుకునేందుకు వాడుతున్నారు. వరదయ్యపాళెం మండలం మత్తేరిమిట్టలో మూసేసిన రైతు సేవా కేంద్రంపంచాయతీలు 774 అన్నదాతల సంఖ్య 3.5లక్షలు -
గ్రామ కమిటీలే ప్రధాన బలం
వరదయ్యపాళెం : సంస్థాగతంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలే 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రధాన బలమని పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎంపీ గురుమూర్తితో కలిసి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు, కేసులు, ఇబ్బందులను పలువురు నేతలు వివరించారు. అనంతరం రఘునాథరెడ్డి మాట్లాడుతూ పార్టీకి సంస్థాగతంగా బలమైన పునాదులు వేసేందుకు గ్రామ కమిటీల నియామకానికి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని దిశానిర్ధేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్కారుపై వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, ఎన్నికల హామీలను విస్మరించడం, రెడ్బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. 2029లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గ్రామ కమిటీల నియామకానికి నేతలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ కమిటీల ఏర్పాటుకు శ్రేణులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. పార్టీ సత్యవేడు పరిశీలకులు కల్పలతా రెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిశీలకుడు బీరేంద్ర వర్మ, తిరుపతి, చిత్తూరు జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్ వేలూరు రాకేష్, రాష్ట్ర కార్యదర్శి కామినేని సత్యనారాయణ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుశీల్కుమార్ రెడ్డి , అపరంజిరాజు , దయాకర్ రెడ్డి , చలపతిరాజు, మణి నాయుడు, సొరకాయలు, గవర్ల కృష్ణయ్య , ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కేవీ భాస్కర్ నాయుడు, నిరంజన్రెడ్డి, ఎంపీపీలు ధనలక్ష్మి, అనిల్కుమార్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటికం దీప, నాయకుడు మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. -
రైతులకు తప్పని ఇక్కట్లు
సైదాపురం : వెంకటగిరి నియోజకవర్గంలో రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. పలుచోట్ల ఆర్ఎస్కేలను మూసేశారు. కొన్నిచోట్ల గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభించేందుకు సైతం ఇప్పటి పాలకులకు తీరిక లేకుండా పోయింది. గతంలో ఇంటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వచ్చేవి. పంట ఉత్పత్తులను సులభతంగా రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఓ బస్తా యూరియా పొందాలంటే రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి దాపురించింది. గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. -
● బస్సులు.. పడిగాపులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుపతి బస్టాండ్ కిక్కిరిసిసోతోది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సైతం ప్రయాణికులు బస్సుల కోసం నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. అవసరాలకు సరిపడా సర్వీసులను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన బస్సులో ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సీటు సంగతి దేముడెరుగు.. కాలు మోపే స్థలం దొరికినా చాలు అంటూ ఎగబడిపోతున్నారు. పండుగ వేళ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. – తిరుపతి అర్బన్ -
పని చేయడం లేదు
పుల్లంపేట : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అన్నదాతకు మేలు చేకూర్చే రైతు సేవాకేంద్రాలను మూసేస్తోంది. కొన్ని చోట్ల ఆయా భవనాల్లో దొంగలు పడి ఫర్నీచర్ను అపహరించినా పట్టించుకోవడం లేదు. ఆర్ఎస్కేల్లో కూటమి నేతలే చోరీలు చేయిస్తున్నారనే ఆరోపణలు సైతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పుల్లంపేట మండలంలోని 11 ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం 6కే పరిమితం చేసింది. దీంతో మిగిలినవి దొంగలపాలయ్యాయి. పలు భవనాలను అప్పట్లోనే ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా మూసేశారు. ఆర్బీకేలను ఆర్ఎస్కేలుగా మార్చడంలో చూపిన శ్రద్ధలో పావు వంతు కూడా అన్నదాతలకు సేవలందించడంపై చంద్రబాబు ప్రభుత్వం చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
చిట్వేలి : మండలంలోని చిన్నరాచపల్లెలో ఈత కు వెళ్లి రేవంత్ (14) అనే బాలుడు ఆదివారం మృతి చెందాడు. వివరాలు.. రేవంత్ రైల్వేకోడూడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తాత పెద్దకర్మ నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి గుంజన నదిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. రేవంత్ తల్లిదండ్రులతో కలిసి రైల్వేకోడూరులో నివాసం ఉంటూ నారాయణ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటవల తాత చనిపోవడంతో శనివారం పెద్దకర్మ కావడంతో చిన్నరాచపల్లికి వచ్చాడు. రేవంత్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు చంద్రగిరి: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆదివారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ పోటీలకు మహిళలు పోటెత్తారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా విద్య, నీరజ నిలిచారు.ఈ రెండు పోటీల్లో విజేతలతోపాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ విజేతలకు పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కూర్మారావు, శిల్పారామం నిర్వాహుకులు సుధాకర్, ఖాదర్ వలి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
సైదాపురం/రాపూరు : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. సీమతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతుల భవిష్యత్ను తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి కండలేరు ప్రాజెక్టు సందర్శనచేపట్టారు. అయితే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాపూరు మండలం తానంచెర్ల వంతెన వద్ద వాహనాలను అడ్డుకున్నారు. కేవలం పది మంది మాత్రమే వెళ్లాలని హుంకరించారు. దీంతో కాకాణి, నేదురుమల్లి వాగ్వాదానికి దిగారు. మేము ఉగ్రవాదులమా.. మా హక్కులను హరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. చివరకు వాహనాల్లో నేతలను మాత్రం అనుమతించడంతో వారు కండలేరుకు చేరుకున్నారు. కార్యకర్తలు కాలినడకనే ప్రాజెక్టుకు చేరాల్సి వచ్చింది. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్లు ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కార్తీక్రెడ్డి, మధురెడ్డి పాల్గొన్నారు. -
‘వైఎస్.. చెవిరెడ్డి’ కీ చైన్ల ఆవిష్కరణ
తిరుపతి రూరల్ : వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మోహిత్రెడ్డి చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక కీ చైన్లను ఆదివారం తుమ్మలగుంటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. రామచంద్రాపురం మండలం నడవలూరు సర్పంచ్ గణపతిరెడ్డి తయారు చేయించిన ఈ కీ చైన్లను చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డిల చేతులు మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేతలు ఒంటెల శేఖర్, తులసీరామిరెడ్డి, ధరణీకుమార్రెడ్డి, యశ్వంత్రెడ్డి, లక్ష్మీప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
కోలాహలంగా పక్షుల పండుగ
సూళ్లూరుపేట : ఫ్లెమింగో ఫెస్టివల్– 2026లో భాగంగా ఆదివారం రెండోరోజు సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం పర్యాటకులతో కళకళలాడింది. పలు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో నేలపట్టు పక్షులు కేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞానకేంద్రం కిక్కిరిసింది. పర్యాటకులు ఫిల్మ్షో వీక్షించేందుకు పోటెత్తారు. పక్షులు పుట్టుక, వాటి జీవన విధానం తెలియజేసే మ్యూజియంలో బారులు తీరారు. నేలపట్టులో పక్షులను చూసేందుకు, భీములవారిపాళెం పడవల రేవులో బోట్ షికారుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఆసక్తి చూపారు. సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో హోరాహోరీగా సాగిన కబడ్డీ, వాలీబాల్ పోటీల ఫైనల్స్ను వీక్షించి కరతాళధ్వనులు చేశారు. సరస్సులో ఫ్లెమింగోలు శ్రీహరికోట–సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి. సరస్సులో నీరు తక్కువగా వుండడంతో ఫ్లెమింగోలు రోడ్డుకు పక్కనే గుంపులు గుంపులుగా చేరి దర్శనమిచ్చాయి. నేలపట్టు పక్షులు కేంద్రంలో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, తెల్ల కంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, పలు రకాల బాతు జాతి పక్షులను పర్యాటకులు ఆసక్తిగా వీక్షించారు. ఫ్లెమింగోలను చూడాలంటే మాత్రం పులికాట్ సరస్సుకు రావాల్సిందే. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డు, అటకానితిప్ప–పేర్నాడు, అటకానితిప్ప– వేనాడు రోడ్డు, తడ పడవల రేవు సమీపంలో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు గుమికూడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. హుషార్.. బోటు షికార్ తడ మండలం భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికారుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. పులికాట్ సరస్సులో పడవలో ప్రయాణిస్తూ సంబరపడ్డారు. ఉచితంగా బస్సులు సూళ్లూరుపేటకు వచ్చిన పర్యాటకులకు నేలపట్టు, అటకానితిప్ప, భీములవారిపాళెం పడవల రేవు, శ్రీసిటీ పారిశ్రామికవాడకు ఉచితంగా బస్సులు నడిపారు. షార్ కేంద్రానికి నో పర్మిషన్ ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా పర్యాటకుల షార్ సందర్శనకు అనుమతి లేకుండా పోయింది. సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్ల్వీ సీ62 ప్రయోగించనున్న నేపథ్యంలో షార్ అధికారులు పర్మిషన్ మంజూరు చేయలేదు. అయితే సోమవారం నిర్వహించబోయే ప్రయోగాన్ని నేరుగా వీక్షించేందుకు మాత్రం అవకాశముంటుంది. నేలపట్టులో మంచు విష్ణు సందడి ప్రకృతి సంరక్షణలో కార్పొరేట్ భాగస్వామ్యం శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా ఆదివారం శ్రీసిటీలో ప్రకృతి సంరక్షణ, జీవ వైవిఽ ద్యం, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. కాఫీ విత్ కార్పొరేట్ పేరిట కార్పొరేట్ భాగస్వామ్యంపై చర్చింఆరు. తిరుపతి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి సి.సెల్వం అధ్యక్షత వహించగా, సిలికా డెవలప్మెంట్ అథారిటీ మాజీ సీఈఓ అజిత్ కుమార్ పట్నాయక్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సతియా సెల్వం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమల భాగస్వామ్యం, జీవ వైవిధ్య సంరక్షణ, పులికాట్ సరస్సు రక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్గా వెటర్నరీ కళాశాల
చంద్రగిరి : విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ యూనివర్సిటీలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్, లిటరరీ మీట్లో తిరుపతి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్గా నిలిచారు. సుమారు 530 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. అథ్లెటిక్స్ చాంపియన్లుగా విజయ్, అంజలి నిలిచారు. బాలుర బాస్కెట్ బాల్ పోటీల్లో వర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ వైకుంఠరావు చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పోటీల్లో వేణుతేజ బంగారు పతకాలను సాధించారు. తమ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్లుగా నిలవడం ఆనందంగా ఉందని అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. పీడీ జయచంద్ర, ఓఎస్ఏ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్రవంతిని ప్రశంసించారు. విష్ణు భట్టాచార్యునికి అరుదైన గౌరవం తిరుపతి సిటీ:జాతీయ సంస్కృత వర్సిటీ ఆగమ విభా గం ఆచార్యులు, దర్శన ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ విష్ణు భట్టాచార్యులకు అరుదైన గౌరవం లభించింది. కర్ణా టక రాష్ట్రం మైసూరు శారదాపీఠం శంకరమఠం వేదికగా ఆదివారం నిర్వహించి న పరిశోధన సంసత్ ప్రథ మ వార్షికోత్సవంలో ఆయనకు నిర్వాహకులు వైఖానస ఆగమ శాస్త్ర రత్నాకర బిరుదుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంసత్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాజగోపాల్, పలువురు పండితులు, పాల్గొన్నారు. -
‘పీఎస్ఎల్వీ’దే అగ్రస్థానం
ఇస్రో ప్రస్థానం.. సూళ్లూరుపేట : శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో తొలిసారిగా 1979 ఆగస్టు 10వ తేదీన 22 మీటర్లు పొడవు, 17 టన్నుల బరువుతో 40 కిలోల ఉపగ్రహంతో ఎస్ఎల్వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తర్వాత ఎస్ఎల్వీ సిరీస్లో నాలుగు ప్రయోగాలు, ఏఎస్ఎల్వీ సిరీస్లో నాలుగు ప్రయోగాలు ఘన ఇంధన దశలతోనే పూర్తి చేశారు. ఇందులో మిశ్రమ పలితాలు రావడంతో అందరి మదిలో పుట్టిందే పోలార్ సన్ సింక్రోనస్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ). ఈ రాకెట్ను ఘన, ద్రవ ఇంధనాలతో కలగలసిన రాకెట్గా రూపొందించాలని అప్పటి శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, శ్రీనివాసన్ తదితరులు ఫ్రాన్స్లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ద్రవ ఇంధన దశలను ఫ్రాన్స్కు పరిచయం చేసింది భారత శాస్త్రవేత్తలే కావడం గమనార్హం. భూమికి 505 నుంచి 730 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి బరువైన ఉపగ్రహాలు పంపేందుకు అధ్యయనం చేశారు. అప్పటి ఇస్రో చైర్మన్ యూఆర్రావు ఆధ్వర్యంలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు సరైన వేదిక అవసరమని గుర్తించారు షార్లో ఒక వైపు మొదటి ప్రయోగ వేదిక (ఎంఎస్టీ)ని నిర్మిస్తూనే మరో వైపు పీఎస్ఎల్వీ రాకెట్కు అవసరమైన ద్రవ ఇంధన మోటార్ పరీక్షలను 1988లో ప్రారంభించారు. అప్పటి నుంచి 1992 దాకా అనేక పరీక్షలు నిర్వహించి పరిణితి సాధించారు. 44 మీటర్లు పొడవు 320 టన్నుల బరువుతో 1,400 కిలోల ఐఆర్ఎస్–1ఈ అనే ఉపగ్రహాన్ని 1993 సెప్టెంబర్ 20న మొట్టమొదటిగా పీఎస్ఎల్వీ–డీ1 పేరుతో ప్రయోగించారు. ద్రవ ఇంధన దశలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ ప్రయోగం విఫలమైంది. తర్వాత 1994 అక్టోబర్ 15వ తేదీన పీఎస్ఎల్వీ–డీ2 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ల విజయంలో ద్రవ ఇంధన దశల్లో వినియోగించే వికాస్ ఇంజిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి దాకా చేసిన 63 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో 60 ప్రయోగాలు విజయవంతమై 99.99 శాతం సక్సెస్ రేటును సాధించాయి. 60 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 518 ఉపగ్రహాలను ప్రయోగించగా ఇందులో 38 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలే ఉండడం విశేషం. 72 స్వదేశీ ఉపగ్రహాలు, దేశీయంగా పలు యూనివర్సిటీలకు చెందిన 15 ఉపగ్రహాలను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ (సమాచారం) ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూరపరిశీలనా ఉపగ్రహాలను), గ్రహాంతర ప్రయోగాలు, దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత పీఎస్ఎల్వీకే దక్కింది. ఈ రాకెట్ రాకముందు ఇస్రో ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసేది. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టలను పతాకస్థాయిలో నిలిపింది పీఎస్ఎల్వీనే. చంద్రయాన్–1, మార్స్ ఆర్బిటర్ మిషన్–1, ఆదిత్య ఎల్1, ఖగోళంలో పరిఽశోధనల నిమిత్తం ఆస్ట్రోశాట్ వంటి ముఖ్యమైన ప్రయోగాలు పీఎస్ఎల్వీతోనే సాధ్యమయ్యాయి. 2017లో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే ఒకేసారి 104 ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,820 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,368 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించు కోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నారు. ఆదివారం ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రీవెన్స్కు ప్రతి విభాగానికి చెందిన ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. అర్జీదారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా తా గునీరు. కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే వినతులు రాసే సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, అర్జీదారులతో గౌరవంగా నడుచుకోవాలని కోరారు. ఎమ్మెస్సీ ఫలితాల విడుదల తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో గత ఏడాది జనవరిలో నిర్వహించి ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఫలితాల విడుదలలో జాప్యంపై సాక్షి పత్రికలో పలు మార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎమ్మె స్సీ మాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ కో ర్సులకు సంబంధించి ఫలితాలు ఏడాదిగా విడుదల కాకపోవడంపై విద్యార్థి సంఘాలు సైతం నిరసన తెలిపాయి.ఈ క్రమంలో వర్సిటీ అధికారులు స్పందించి ఫలితాలు విడుదల చేశారు. అధికార వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. టీటీడీలో ఉద్యోగాలకు అవకాశం తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ఎస్వీ గో సంరక్షణశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు లు 2, గోశాల మేనేజర్–2, డెయిరీ సూపర్ వైజర్–6, డెయిరీ అసిస్టెంట్–2 మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే తాళ్లపాక కై ంకర్యపరుడు, మణ్యం దార్ పోస్టుల నియామకానికి నిబంధన లను ఖరారు చేశారు. కై ంకర్యపరుడి పోస్టుకు తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం సర్టిఫికెట్ ఉండాలి. 40 ఏళ్లు మించకుండా మణ్యం దార్ పోస్టు కు 8వ తరగతి ఉత్తీర్ణులైన, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అర్హులు. బర్డ్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఆర్థోపెడిక్స్ లేదా అనస్తీషియాలో పీజీ, డిగ్రీ లేదా డిప్లొమాను అర్హతను నిర్ణయించారు. శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ప్రొడక్షన్ సూపర్వైజర్ పోస్టుకు బీఏఎంఎస్ లేదా బీ ఫార్మసీ (ఆయుర్వేద) డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలనే సవరణ చేశారు. టీటీడీ వైద్య విభాగానికి సంబంధించి మూడు దశాబ్దాలుగా ఒకే చోట పనిచేస్తున్న సిబ్బందిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేడియోగ్రాఫర్ పోస్టును చీఫ్ రేడియోగ్రాఫర్గా పెంచడం, ఫిజయోథెరపిస్టు పోస్టును అప్గ్రేడ్ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఘనంగా సంజీవరాయునికి పొంగళ్లు పుల్లంపేట : మండలంలోని తిప్పాయపల్లెలో ఆదివారం సంజీవరాయస్వామివారికి ఘనంగా పొంగళ్లు పొంగించారు. ఈ ప్రత్యేక వేడుకకు దేశవిదేశాల్లో స్థిరపడిన తిప్పాయపల్లె వాసులు తరలివచ్చారు. ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు స్వామివారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయంలోకి మహిళలు, దళితులకు ప్రవేశం లేదు. ఈ క్రమంలో కేవలం పురుషులు మాత్రమే పొంగళ్లు పొంగించడం విశేషం. పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూ దళితులు సైతం ఆలయ ప్రవేశం కోరకపోవడం గమనార్హం. మహిళలు గుడి బయట ముఖద్వారం నుంచే స్వామిని మొక్కుకుంటూ ఉంటారు. -
మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ఘర్షణ
తిరుపతి రూరల్:మండలంలోని మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునికి విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కథనం మేరకు.. మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తు న్న మధుసూదన్రాజు తరగతి గదిలో విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా దూషిస్తు న్నారని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని నిలదీశారు. ఒక దశలో ఆయనపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ శాంతించిన తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తే తమకు చెప్పాలని, చావమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా బాగా చదివే పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకున్నారన్న బాధతో దూషించానే తప్ప వారిని బాధపెట్టలేదని చెప్పినా తల్లిదండ్రులు వినిపించు కోలేదన్నారు. -
మళ్లీ స్వర్ణముఖిలో ఇసుకదొంగలు
ఏర్పేడు: మళ్లీ స్వర్ణముఖి నదిలో ఇసుక దొంగలుపడ్డారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎలాంటి అనుమతులు లేకపోయినా తెల్లబంగారాన్ని తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇసుకాసురులు మళ్లీ ఇసుక అక్రమ రవాణా మొదలుపెట్టేశారు. గతంలో కురిసిన వర్షాలకు స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహించటంతో నెలపాటు వీరి ఇసుక దందాకు బ్రేక్ పడింది. మళ్లీ నీటి ప్రవాహం తగ్గటంతో స్వర్ణమ్మ తెల్లబంగారాన్ని తవ్వి తరలించేస్తున్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట–గుడిమల్లం మార్గంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సుమారు 30 అడుగుల పైగా లోడేయడంతో పక్కనున్న విద్యుత్ స్తంభాలు వాలిపోయి కూలటానికి సిద్ధంగా ఉన్నాయి. పెనుమల్లం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇక్కడ ఇసుక దందాను నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ట్రాక్టర్లు వరుసగా ఇసుకను తీసుకెళుతుండడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల కిందట రేణిగుంట మండలంలోనూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాథీనం చేసుకుని కేసులు పెట్టారు. -
గ్యాంగ్ రేప్.. హత్య కలకలం
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంటర్ చదువుతున్న బాలికపై గతేడాది సెప్టెంబరు 25న జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అటవీశాఖకు చెందిన పార్కులోకి తన స్నేహితుడితో కలిసి వెళ్లిన బాలికను బెదిరించిన కిషోర్, మహేష్, హేమంత్ లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాలిక స్నేహితుడి కడుపులో పిడిగుద్దులు గుద్ది, అతడి నోరు అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆపై అడవిలో వీళ్లిద్దరినీ వదలి నిందితులు పారిపోయారు. ఈ ముగ్గురూ టీడీపీ నాయకులే. తీరా ప్రజలే నిందితులను పట్టిస్తే.. ముగ్గురినీ అరెస్టు చూపించిన ఖాకీలు తమ నిర్లక్ష్యం కప్పిపుచ్చుకోవడానికి వాళ్లను రోడ్లపై నడిపించారు. సాక్షి టాస్క్ఫోర్స్, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన కౄరమైన దాడి సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసింది. తన భర్త తీసుకున్న అప్పును చెల్లించలేదని కుప్పం పట్టణంలోని నారాయణపురంలో ఓ మహిళను కన్న బిడ్డ ఎదుటే ఓ చెట్టుకు కట్టేసి కొట్టారు. రూ.80 వేల అప్పు తీసుకుని, వడ్డీలకు వడ్డీ చెల్లించి.. ఆపై డబ్బులు కట్టలేక ఆ కుటుంబం కుప్పం వదిలి వెళ్లిపోయింది. బిడ్డ చదువు కోసం టీసీ తీసుకోవడానికి వచ్చిన ఆమెను ఓ చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగానే మునికన్నప్ప కుటుంబం దాడి చేసింది. కూటమి పార్టీ కార్యకర్తలైన నిందితులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు తొలుత వెనుకడుగువేశారు. ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తీసుకురావడంతో సీఎం ఆదేశాలతో పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారు. ఇక చిత్తూరు నగరంలో అఖిల్ అనే యువకు డు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవు ట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ, డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి వద్ద సొంత పనులు చక్కబెట్టేవాడు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, వేల్లూరు రోడ్డు వైపు ఒంటరి ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకున్న అఖిల్.. మహిళలపై దాడి చేసి, తాను పోలీసునని చెప్పుకునేవాడు. ఖాకీ దుస్తులు ధరించి, ప్రేమ జంటలను బెదిరించి, డ్రోన్ కెమె రాలో వీడియోలు ఉన్నాయని బంగారు ఆభరణా లు దోచుకునేవాడు. ఇతడిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచించిన ఖాకీలు.. మీడియాలో వార్తలు రావడంతో చర్యలకు ఉపక్రమించారు. ● చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో ఓ వివాహితపై బంగారుపాళ్యంకు చెందిన కానిస్టేబుల్, ఓ హోంగార్డు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కూడా గతేడాది వెలుగులోకి వచ్చింది. బాధితురాలు స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెబితే.. ఆపై పోలీసులు కేసు నమోదు చేశారు.మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న వేధింపులు పైరవీలతోనే.. పోస్టింగుల కోసం పైరవీలు చేస్తున్న కొందరు పోలీ సు అధికారులు సక్రమంగా విధులు చేయకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీ ఎమ్మెల్యేల వద్ద సెల్యూట్ చేసి అటెండెస్ వేసుకోవడం, వాళ్లు చెప్పిన పనులన్నీ చక్కబెట్టడం, లాటరీ, పేకాల క్లబ్బులు, అక్రమ గ్రానైట్ తరలింపులో కొందరు పోలీసు పాత్ర ఉన్నాయని.. ఫలితంగా శాంతిభద్రతలను గాలికి వదిలేశారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొందరు పోలీసులు నిజాయితీగా విధులు చేయడానికి వస్తు న్నా, రాజకీయ నాయకుల మాట వినలేదని బదిలీ వేటు వేస్తుండటంతో డ్యూటీలు చేయలేక సతమతమవుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఇన్ స్పెక్టర్లు లా అండ్ ఆర్డర్ వద్దని లూప్లైన్ వెతుక్కుంటుంటే.. జిల్లాలోని ఓ సబ్డివిజన్ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. తాజాగా విభిన్న ప్రతిభావంతురాలు కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే మా పరిధి కాదంటూ తప్పించారు. వారం తరువాత ఆమె హత్యకు గురై నదిలో పడి ఉండడాన్ని మృతురాలి తమ్ముడు గుర్తించాడు. ఈ కేసులో కూడా ఖాకీల దర్యాప్తు సక్రమంగా సాగలేదని పోలీసులను బాధ్యులుగా చేస్తూ ఓ న్యాయవాది మానవ హక్కులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను ఓ ఠాణా నుంచి మరో స్టేషన్కు పంపిస్తూ నిర్లక్ష్యం చేశారంటూ వికలాంగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. -
కూతురు కోసం వచ్చి.. కాటికి చేరాడు!
తిరుపతి రూరల్: సంక్రాంతి పండుగకు కూతురుని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఓ తండ్రి ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన తిరుపతి శివార్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా సీకేపల్లి గ్రామానికి చెందిన పగిడి వెంకటేశ్వరరెడ్డి (43) వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. అతని కుమార్తె తిరుపతి శివారులోని తనపల్లి వద్ద ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియ ట్ మొదటి సంత్సరం చదువుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకు వెళ్లడానికి శుక్రవారం రాత్రి బస్సులో తిరుపతికి వచ్చి న వెంకటేశ్వరరెడ్డి తనపల్లి జంక్షన్ వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న విజయానంద ట్రా వెల్స్ బస్సు ఢీ కొంది. దీంతో తీ వ్ర గాయాలపాలై న వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు 108లో చికిత్స ని మిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
సీనియర్ జర్నలిస్టుల పెన్షన్ మంజూరుకు కృషి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: దేశవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెలగురుమూర్తి హామీ ఇచ్చారు. శనివారం తిరుపతిలోని ఆయ న కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్ నా యకులు కలసి ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అందజేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి రాబోయే పా ర్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో జర్నలిస్టుల సమస్య లు సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నేత లు టి.జనార్దన్, ఎం.నరేంద్రరెడ్డి, ఆర్.చంద్రశేఖర్, పీవీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దొంగ అరెస్టు
తిరుపతి క్రైం: మత్తు మందు ఇచ్చి బంగారు తాళి బొట్టు చోరీ చేసిన మహిళను తిరుమల వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వన్టౌన్ ఎస్ఐ చలపతి కథనం మేరకు.. తిరుపతిలోని ము న్సిపల్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న తిరుపతి రాధాకృష్ణ విజయ(63) ఈ నెల రెండో తేదీన తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలోకి వె ళ్లింది. మూడో తేదీ వేకువజామున రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉండగా ఓ గుర్తు తెలియని మహిళ బాధితులకు మత్తుమాత్రలు ఇచ్చి, ఆమె మెడలో ఉన్న 60 గ్రాములు బంగారు తాళిబొట్టు చైను దోచుకుని వెళ్లింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సాంకేతిక విశ్లేషణ, సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించి క ర్ణాటకకు చెందిన నాగిశెట్టి రత్నమ్మ (45)ను తిరుమలలో అరెస్టు చేస్తామన్నారు. ఆమె వద్ద నుంచి సుమారు 57 గ్రాములు బరువు కలిగిన బంగారు తాళిబొట్టు చేను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
పేలవంగా ప్రారంభోత్సవం
చెరువుల తెల్లకంకణాయిలుసందర్శకులకు నిరాశ సూళ్లూరుపేట రూరల్: మూడు రోజులు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్కు పండుగ తొలిరోజు వచ్చిన సందర్శకులకు నిరాశే ఎదురైంది. శ్రీహరికోట వెళ్లే దారిలో పులికాట్ సరస్సు ఎడారిగా మారింది. దీంతో సరస్సులో నీరు లేక పోవడంతో విదేశీ పక్షులు లేక పులికాట్ సరస్సు వెలవెల పోయింది. ఎంతో దూరం నుంచి వచ్చిన సందర్శకులకు నిరాశ ఎదురైంది. సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్–2026ను ప్రారంభం పేవలంగా సాగింది. రాష్ట్ర మంత్రులు లేకుండా ఎక్కడా హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ , సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. పక్షుల పండుగ సందర్భంగా మేళతాళాలతో, తప్పెట్లు, కేరళ సాంప్రదాయ నృత్యాలతో స్థానిక హోలీక్రాస్ సెంటర్ నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రాంగణం వరకు శోభాయాత్రను నిర్వహించారు. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమం ఫ్లెమింగో బెలూన్ ఎగురవేశారు. పండుగ సందర్భంగా వివిధ శాఖల వారు స్టాళ్లను ఏర్పాటు చేసి, ప్రారంభించారు. అలాగే కబడ్డీ, వాలీబాల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఫ్లెమింగో ఫెస్టివల్కు విచ్చేసిన విద్యార్థులు, పర్యాటకులకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేటలోని డివైడర్ వద్ద ఇనుప బారికేడ్లు పెట్టడంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించి, సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. ప్రారంభోత్సవంలో నృత్యాలు తప్ప ఏమీ లేకుండా చేయడంతో ప్రారంభోత్సవం పేలవంగా సాగింది. పార్టీ నేతలతో సమన్వయం లేకుండా చేసినట్టున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. తొలిరోజు సందర్శకుల కరువు దొరవారిసత్రం: జిల్లా అధికారులు, నియోజక వర్గం ప్రజాప్రతినిధులు ఊహించిన స్థాయిలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి తొలి రోజు పక్షుల పండుగలో సందర్శకుల తాకిడి పెద్దగా కనిపించడలేదు. బయట ప్రాంతాల నుంచి అరకొరగా విచ్చేసిన సందర్శకులకు, విద్యార్థునులకు సరిపడా మరుగుదొడ్లు వంటివి కేంద్రంలో లేకపోవడంతో ఉన్న మరుగుదొడ్లు వద్ద క్యూ కట్టక తప్పలేదు. అధిక మొత్తంలో సందర్శకుల రాకపోవడంతో చెరువు కట్టపై వాచ్టవర్ వెలవెల బోయింది. వ్యూ పాయింట్లు వద్ద సరిపడా బైనోక్యూలర్లు ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులు నిరుత్సాహపడ్డారు. నేలపట్టు పక్షుల కేంద్రం మార్గం మధ్యలో జిల్లా యంత్రాగం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి చిత్రం లేకపోవడంపై ప్రోటోకాల్ ఉల్లఘించారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్టపై సందర్శకుల లేక వెలవెలబోయిన వాచ్ టవర్ -
అమ్మవారి సేవలో ప్రముఖులు
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని శనివారం పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. మైసూరు కు చెందిన శ్రీయోగనందేశ్వర సరస్వతి మఠం పీ ఠాధిపతి శ్రీశంకర భారతీ మహాస్వామీజీ, తెలంగాణ రాష్ట్రం సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం ప లికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆ శీర్వచనం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, ప్రసాద్ పాల్గొన్నారు. 17 నుంచి పురందరదాసు ఆరాధనోత్సవాలు తిరుమల:పురందరదాసు ఆరాధనోత్సవాలు టీటీ డీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి. ఈనెల 17న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్టి, వివిధ పీఠాధిపతుల మంగళ శాసనాలు, సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రముఖ పీ ఠాధిపతులు మంగళా శాసనాలు అందిస్తారు. ఈ నెల 18న ఉదయం 6 గంటలకు అలిపిరి వద్ద పు రందరదాసు విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తా రు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవా రి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్సేవ, దా స సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరిరోజు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భ జన, నగర సంకీర్తన, ఉపన్యాసాలు, సంగీత వి భావరి నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు పాపవినాశనం రోడ్డులోని కళ్యాణమస్తు వే దికపై వేంకటేశ నవరత్న సంకీర్తన జరుగుతుంది. 18 నుంచి అధ్యయనోత్సవాలు తిరుపతి కల్చరల్ : గోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు, సేనాధిపతి, ఆళ్వార్లను వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 28న చిన్న శాత్తుమొర, ఫిబ్రవరి 3న ప్రణయకలహ మహోత్సవం, 7న పెద్ద శాత్తుమొర జరిపించనున్నారు. చివరి రోజున తన్నీర్ అముధు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నాయుడుపేట టౌన్: మేనకూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ బాబి తెలిపారు. అర్భన్ పోలీస్స్టేషన్లో సీఐ ఈ వివరాలను వెల్లడించారు. తేదీన మేనకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి ఈ నెల 7వ తేదీన ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం నిందితుడు మేనకూరు గ్రామానికి చెందిన కుంచెల దశరథరామయ్య అలియాస్ దశయ్యను ఎస్ఐ భానుప్రసన్న పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి సుమారు 28 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్రహ్మర్షి ఆశ్రమాన్ని సందర్శించిన సీఆర్పీఎఫ్ డీజీపీ రామచంద్రాపురం: కేంద్ర సీఆర్పీఎఫ్ డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ దంపతులు శనివారం రామచంద్రాపురం మండలం సి. రామాపురం సమీపంలోని బ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ ప్రాంగణంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, జైన్ దేవాలయాలలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డీజీపీ దంపతులను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. -
శ్రీసిటీలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
● పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి శ్రీసిటీ నమూనా అధ్యయనం శ్రీసిటీ(సత్యవేడు): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి(యూపీఎస్ఐడీఏ) కి చెందిన తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందం కేపీఎంజీ ప్రతినిధులతో కలసి శనివారం శ్రీసిటీని సందర్శించింది. యూపీలోని లలిత్పూర్లో అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నేపథ్యంలో శ్రీసిటీ అభివృద్ధి నమూనా అధ్యయనం కోసం వీరి పర్యటన సాగింది. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) ఆర్.శివశంకర్ సాదర స్వాగతం పలికారు. అధికారులను స్వాగతించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దేశంలోని వివిధ రాష్ట్రాల పారిశ్రామిక సంస్థలు శ్రీసిటీ మోడల్ను ఽఅధ్యయనం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వారి పరిశీలనలు, సూచనలు శ్రీసిటీ భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలకు మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, బలమైన అనుసంధానం, పెట్టుబడి అవకాశాలు, వ్యాపార అనుకూలతలు, ప్రయోజనాలు, బయోటెక్ ఫార్ములేషన్లతో సహా శ్రీసిటీ బహుళ రంగాల పెట్టుబడి, యూపీ– ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ జనరల్ మేనేజర్ అనురుద్ధ క్షత్రియ సహా పలువురు నీసియర్ అధికారులు చర్చల్లో పాల్గొని, ఉత్తమ ఆచరణలు ప్రభుత్వ సహకారం, సుస్థిరత చర్యలు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం తదితర అంశాలపై పరస్సర అభిప్రాయాలు పంచుకున్నారు. తమ పర్యటనకు సహకరించిన శ్రీసిటీ ఎండీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
చంద్రగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎంచంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు రానున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు భద్రత లైజన్ (ఏఎస్ఎల్)లో భాగంగా శనివారం నారావారిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీలు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5.20 గంటలకు రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు వెళ్లి, అక్కడ బస చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు ప్రతి దశలో పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీల దేవి పాల్గొన్నారు. -
సీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రేణిగుంట సీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక ఎంపీ కార్యాలయంలో సీఆర్ఎస్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ గురుమూర్తి దృష్టికి తెచ్చారు. సీఆర్ఎస్ హాస్పిటల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. రిఫరల్ వైద్యం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని, పెద్ద చికిత్సలు అవసరమైన సందర్భాల్లో గుంతకల్లు డివిజన్ హాస్పిటల్కు వెళ్లాల్సి రావడంతో అత్యవసర పరిస్థితుల్లో సమయానుకూల వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. హెచ్ఆర్ఎ పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులు కోరారు. గతంలోనే తిరుపతి పట్టణాన్ని టైర్–1 నగరంగా పరిగణించి హెచ్ఆర్ఎ పెంచాల్సిందిగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఎంపీ వారికి గుర్తు చేశారు. ఈ అంశంపై మరోసారి సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి, సీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. త్వరలోనే సీఆర్ఎస్ను స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని ఉద్యోగులకు తెలిపారు. -
పరోక్ష పన్నుల వ్యవస్థకు రీసెట్ జీఎస్టీ 2.0
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ’’జీఎస్టీ 2.0 భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థకు రీసెట్ లాంటిది. ఇది పన్ను రేట్ల సరళీకరణ, కఠినమైన నిబంధనలతో పాటు వివాదాలను వేగంగా పరిష్కరిస్తుంది. ఆడిటర్లకు ఇది కేవలం తనిఖీలకే కాకుండా సలహాదారుగా, రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ అనుసరణలో కొత్త బాధ్యతలను కల్పిస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సవరణలు, ఆడిటర్ల పాత్రపై అవగాహన పెంచేందుకు కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ), శ్రీసిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శ్రీసిటీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి రీజియన్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజ్ సభకు ఆనంద్ కుమార్ను పరిచయం చేశారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 2025 సె ప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 పీఎం నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దృక్పథానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి అవగాహన సదస్సులు వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా బహుళజాతి యూనిట్లకు విధాన మార్పులను సులభంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో శ్రీసిటీకి చెందిన 100కుపైగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని జీఎస్టీ 2.0 అమలుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
గట్టెక్కని గ్రేటర్
గ్రేటర్ తిరుపతి గట్టెక్కలేదు. ప్రణాళికలు, తీర్మానాలకే పరిమితం అయ్యింది. ఇప్పట్లో లేదని సర్కారు వాయిదా ప్రకటన చేసింది. ఇందుకు జనగణన బూచిగా చూపింది. గతంలోనూ టీడీపీ ఇలానే హడావుడి చేసింది. గ్రేటర్ తిరుపతి రూపకల్పనలో టీడీపీకి చిత్తశుద్ధి లోపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి తుడా: అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పుకోవడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నేత మరొకరు ఉండరన్నది నానుడి. ప్రభుత్వ పెద్దలతో సంబంధం లేకుండా ఆ పార్టీ మంత్రులు సైతం నోటికి వచ్చిన హామీలు ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలో తిరుపతిని అత్యవసరంగా గ్రేటర్గా విస్తరించనున్నట్లు ఆర్భాటంగా ఆరు నెలల క్రితం ప్రకటించారు. సీఎం స్వయంగా తిరుపతిపై ఫోకస్ పెట్టారని, తిరుపతిని మహానగరంగా విస్తరించి అమాంతంగా అభివృద్ధి చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు హడావుడి చేశారు. 2017లోనూ ఇదే తరహా గ్రేటర్ తిరుపతిపై మాయ మాటలతో బురిడీ కొట్టించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత గ్రేటర్ తిరుపతిపై హడావుడి సృష్టించి ఆపై తస్సుమనిపించారు. గ్రేటర్గా విస్తరించే ప్రతిపాదన ఇక ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఏదో చేసేస్తున్నారన్న భ్రమను ప్రజల్లో కల్పించేందుకు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి గ్రేటర్ తిరుపతిపై హడావుడి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపాదన వాయిదా వేస్తున్నట్లు ప్రకటన గ్రేటర్ తిరుపతి కోసం మున్సిపల్ కార్పొరేషన్ సరైన కసరత్తు లేకుండా, అశాసీ్త్రయంగా కొన్ని పంచాయతీలను విలీనం చేస్తున్నట్లు కౌన్సిల్ ముందు పెట్టారు. ఈ ప్రతిపాదిత పంచాయతీలపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి అదే తరహా ప్రతిపాదనను సిద్ధం చేశారు. రెండోసారి కౌన్సిల్లో చర్చించి గ్రేటర్కు ఆమోదం తెలిపారు. అయితే 10 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రతిపాదనే తిరుపతి భవిష్యత్తును మారుస్తుందని, తద్వారా కేంద్రం నుంచి నిధులు రెట్టింపు స్థాయిలో తెచ్చుకోవచ్చన్న ఎంపీ మద్దెల గురుమూర్తి చేసిన ప్రతిపాదన కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. గ్రేటర్లో విలీనం చేసే విధివిధానాలపై లోతైన కసరత్తు చేయాలని, కార్పొరేషన్ అధికారులు హడావుడిగా పేపర్ వర్క్ చేసి, చేతులు దులుపుకున్నట్లు పై ప్రతిపాదన ద్వారా తెలుస్తోందని ఆయన కౌన్సిల్ వేదికగా విమర్శించారు. రెండుసార్లు గ్రేటర్ తిరుపతిపై కౌన్సిల్ ఆమోదం పొంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. అయితే మంత్రి నారాయణ ప్రస్తుతానికి గ్రేటర్ తిరుపతిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. 2017 లోనూ తిరుపతిని గ్రేటర్గా మారుస్తున్నట్లు హడావుడి సృష్టించారు. ఏడాది కాలం పాటు అదిగో గ్రేటర్.. ఇదిగో గ్రేటర్ అంటూ ప్రజల్ని మాయలో పడేశారు. ఇప్పుడు మరోసారి గ్రేటర్ ప్రతిపాదనతో కొంతకాలం హడావుడి సృష్టించి తుస్సు మనిపించారు.విస్తీర్ణం: 300చరపు కిలోమీటర్లు జన గణన బూచిగా చూపిన మంత్రి ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపడుతోందని, ఈ క్రమంలో గ్రేటర్ తిరుపతి సాధ్యం కాదంటూ 12 రోజుల క్రితం మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొని గ్రేటర్ను చేపడితే రోజుల్లో గెజిట్ ఇచ్చి ఆమోదం తెలపవచ్చు. 2008లో కేవలం మూడు నెలల వ్యవధిలోనే మున్సిపాలిటీగా ఉన్న తిరుపతిని మున్సిపల్ కార్పొరేషన్గా ఆమోద ముద్ర వేయించిన ఘనత నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. అలాగే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడితే ఆ నెలలోనే ఏదైనా చేయొచ్చని నిరూపించింది. -
దయనీయ స్థితిలో ల్యాబ్
తడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రైతుల కోసం సూళ్లూరుపేట నియోజక వర్గానికి సంబంధించి తడ మండలం, కొండూరు ఏఎంసీ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సుమారు రూ.కోటి వ్యయంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను నెలకొల్పారు. ఆ ల్యాబ్లో సేవలు ప్రారంభం అయ్యే సమయానికి ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం అగ్రి ల్యాబ్ ముళ్ల చెట్ల నడుమ దయనీయ పరిస్థితికి నిలువెత్తు సాక్ష్యంలా మిగిలింది. వెంకటగిరి(సైదాపురం): రైతులు నాణ్యమైన పంటలు పండించుకుని ఉన్నతస్థాయిలో దిగుబడులు సాధించుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డాక్టర్ వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ల్యాబ్ను నిర్వీర్యం చేశారు. -
పడవ షికారుకి పైసా వసూల్
తడ: ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చి పులికాట్ సరస్సుపై పడవ షికారు చేసే పర్యాటకుల నుంచి చార్టీలు వసూలు చేయనున్నారు. ఫెస్టివల్ ఏర్పాటు చేసిన నాటి నుంచి బీవీపాళెం పడవల రేవు వచ్చే సందర్శకులకు సరస్సు అందాలు, సరస్సుకు వచ్చే దేశ, విదేశీ పక్షుల గురించి అవగాహన కల్పించేందుకు, పులికాట్ సరస్సును నమ్ముకుని జీవించే జాలర్ల జీవన చిత్రం అవగతం అయ్యేందుకు పడవ షికారును ఉచితంగా అందుబాటులో ఉంచే వారు. ఈ ఏడాది దానికి నగదు వసూలు చేసుందుకు నిర్వాహకులు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తిప్పిన విధంగా సరస్సులో కొంత దూరం వెళ్లి వచ్చేందుకు 15 ఏళ్లకు పైబడిన వారి నుంచి మనిషికి రూ.30 వసూలు చేయగా ఇరకం వరకు వెళ్లి వచ్చేందుకు రూ.వంద వసూలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే నగదును పడవల యజమానులకే అందించేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్ననట్టు సమాచారం. -
కియా సెల్టోస్ నూతన కారు ఆవిష్కరణ
చంద్రగిరి: చైన్నె – బెంగళూరు రహదారి తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం సాయంత్రం కియా సెల్టోస్ నూతన కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథరెడ్డి, డైరెక్టర్ చెరకు నిరంజన్, సి. భారతి, సి. హోషిమా రెడ్డిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సి. జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కియా నుంచి విడుదలైన కియా సెల్టోస్లో అత్యాధునిక సదుపాయాలతో ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇందులో 2 డీఏఎస్ పానరోమిక్ సన్ రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ కారు బుకింగ్కు 86888 29739 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. టెట్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా గత నెల 10వ తేదీ నుంచి 21 వరకు 9 పరీక్షా కేంద్రాల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు జరిగిన టెట్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఫలితాల్లో 47.82శాతం మంది అర్హత సాధించగా జిల్లా నుంచి 39.68శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో ఫైయిల్ అయినవారికి మరో సారి పరీక్ష రాసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2012 లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. శ్రీసిటీలో ‘హెల్తియం మెడిటెక్’ పరిశ్రమ విస్తరణ శ్రీసిటీ(సత్యవేడు): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ‘ హెల్తియం మెడిటెక్ ’శ్రీసిటీలోని తన తయారీ యూనిట్ను విస్తరించింది. నూతన విస్తరణ యూనిట్ను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ సీఈఓ అనీష్ బప్నా, ఇతర ప్రముఖులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనీష్ బప్నా మాట్లాడుతూ ఈ విస్తరణ భారత్ ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధిని పెంపొందిచడంలో తమ నిబద్ధతను చాటుతుందన్నారు. ఇక్కడ నాణ్యమైన వైద్య పరికరాల తయారీ ద్వారా దిగుమతులను తగ్గించడంతోపాటు, దేశంలోనే కాక రోగులకు అత్యాధునిక సాంకేతికత అందించగలుగుతామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి సత్యవేడు : మండలంలోని దాసుకుప్పం పంచాయతీ అటవీ ప్రాంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. శుక్రవారం పోలీసులు శవాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఆరు రోజుల ముందు మృతి చెంది ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. గుర్తు పట్టలేని విధంగా శవం కుళ్లిపోయి ఉంది. ఎస్ఐ లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట: ముందుగా నిర్ణయించిన మేరకు రెండు రోజులతోనే సరిపెట్టాలనుకున్న ఫ్లెమింగో ఫెస్టివల్కు సీఎం చంద్రబాబు ఈనెల 12న విచ్చేస్తున్న సందర్భంగా మూడు రోజులకు పండుగను పెంచామని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట పట్టణంలోని ఫ్లెమింగో ఫెస్టివల్ మైదానంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజల విజ్ఞప్తులు, సందర్శకులు స్పందనలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచనలు, రాజకీయ కమిటీల సలహాల మేరకు పండుగను ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 12వ తేదీ సాయంత్రం 3.30 నుంచి 4.00 గంటల సీఎం చంద్రబాబు విచ్చేయనున్నారని, ఆయన నేలపట్టు లేదంటే అటకానితిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో పాయింట్ సందర్శిస్తారని చెప్పారు. అనంతరం సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే పబ్లిక్ ప్రోగ్రామ్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్చారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి, టూరిజం అధికారి ఆర్డీ రమణ ప్రసాద్, జనార్థన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, డీఎస్డీఓ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. బడి వైన్స్ దుకాణంలో చోరీ తిరుపతి రూరల్: మండలంలోని చెర్లోపల్లిలో ఉన్న ‘బడి వైన్స్’లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు దుకాణం పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 2,88,000 నగదును దోచుకెళ్లారు. వైన్స్ మేనేజర్ తులసి రామ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ ఎస్ఐ శ్రీరాములు ఘట నా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఇద్దరికి ఐదేళ్ల జైలు
ఎర్రచందం కేసులో ఇద్దరికి ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు.అగ్రిటెస్టింగ్ ల్యాబ్కు తాళం సూళ్లూరుపేట : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.79 లక్షలు ఖర్చు చేసి ఒక అగ్రిటెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవి మూతపడేలా చేసింది. ల్యాబ్ను ఎందుకు మూసి వేశారు? గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ల్యాబ్ను ఎందుకు మూసివేశారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి వాటిని మూసివేయడం కూటమి ప్రభుత్వానికి తగ దు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు నకిలీ వస్తున్నాయనే వాటిపై రైతుల్లో అపనమ్మకం ఉంది. అలాంటి సమయంలో ల్యాబ్కెళ్లి పరీక్ష చేయించి తెలుసుకుంటాం కదా.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కక్షపూరితంగా మూసివేయడం తప్పు. – సుంకర అల్లెయ్య, రైతు, నాదెళ్లవారికండ్రిగ భూసార పరీక్షలు చేయించుకునే వాళ్లం గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లి భూసార పరీక్షలు చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఇక్కడే మట్టి నమూనాలు ఇస్తే ల్యాబ్ రిపోర్టు ఇస్తున్నారు. అంటే భూసార పరీక్షలు ఎలాంటి ఖర్చులు లేకుండా మనకు దగ్గరలోనే చేయించుకుంటున్నాం. అలాగే విత్తనాలు ఎరువులపై అనుమానాలుంటే వెంటనే ల్యాబ్కెళితే పరీక్షలు చేసి ఇస్తున్నారు కదా! రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఇలాంటి ల్యాబ్ను మూసివేయడం మంచిది కాదు. – బత్తల భూపయ్య, నాయుడుపేట మండలం -
ఆందోళనలతో.. అట్టుడికిన ఆర్డీఓ కార్యాలయం
తిరుపతి రూరల్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసింది.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా చేతులెత్తేసింది.. ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీటర్లుగా ముద్ర వేయడం చేస్తోంది’ అని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యార్థి, యువజన సంఘాలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడంతో వారి నినాదాలతో ఆ కార్యాలయం అట్టుడికింది. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఐక్యవేదిక తరపున భారీ ధర్నాను శుక్రవారం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ధర్నా నిర్వహించనున్నట్టు ప్రతిపక్ష పార్టీల విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముందుగానే బహిరంగ ప్రకటన విడుదల చేసినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి, యువజన విభాగం నేతలు బైఠాయించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ, పీడీఎస్యూ, ఎన్ఎల్ఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలతో కలసి వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి నడిరోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ముందు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడే ఉన్న పోలీసులు నడిరోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు అందరినీ పక్కకు తరలించే ప్రయత్నం చేయగా తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసుల దుశ్చర్యలతో రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. విద్యార్థి, యువజన విభాగం నాయకులకు అండగా మహిళలు ఎదురొడ్డి నిలబడడంతో పోలీసులు ఏమీ చేయలేక కొంత సమయం అలాగే వదిలేయాల్సి వచ్చింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం లోపలికి అనుమతించడంతో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం చుట్టూ పోలీసుల భద్రత తిరుపతి ఆర్డీఓ కార్యాలయం చుట్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రామయ్య, ఇతర సిబ్బంది పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాలు, యువత పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు రావడంతో వారిని కట్టడి చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. అయితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అధికంగా రావడంతో జీర్ణించుకోలేని పోలీసులు ఒక్కసారిగా నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం.. డౌన్.. డౌన్.., కూటమి పోవాలి.. జగన్ రావాలి.. విద్యార్థి సంఘాల ఐక్యత వర్థిల్లాలి.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. విద్యార్థుల సమస్యలను వెంటనే.. పరిష్కరించాలి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి..అన్న నినాదాలతో రెండు గంటలపాటు హోరెత్తించారు. పోలీసులు ఊహించని విధంగా విద్యార్థులు, యువత తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రమైంది. -
అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్నదాత కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేవాడు. నకిలీలు.. నాణ్యతలేని విత్తనం, ఎరువుతో ఇక్కట్లు పడుతున్న మట్టి మనిషికి మంచి విత్తనం – మంచి ఎరువు దన్ను అని భావించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకే కష్టనష్టాలు అ
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026వరదయ్యపాళెం: చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి నుంచి రైతన్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. నేడు అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు నిధులు వెచ్చించి, రైతన్నల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేస్తోంది. తిరుపతి జిల్లా లో 6 అగ్రిటెస్ట్ ల్యాబ్లను ఏర్పాటు చేయ గా, అవి నేడు నిరుపయోగంగా మారాయి. నాడు ఎంతో మేలు చేసిన అగ్రిటెస్ట్ ల్యాబ్లు నేడు నిర్వీర్యంగా మారి పాలకుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఆయా ల్యాబ్లకు చెందిన రూ.కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. కనీసం ల్యాబ్ను తెరిచే దిక్కు కూడా లేకుండా మూత వేసి ఉన్నారు. గతంలో రైతు సంక్షేమం కోసం.. ఎంతో ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతన్న సంక్షేమం కోసం సుమారు రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు నిర్మించారు. రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగు చేపడితే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందన్న ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 60 లక్షల వ్యయంతో భవన నిర్మాణాలు, మరో రూ.40 లక్షల ఖర్చుతో వివిధ రకాల విలువైన పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్ సిస్టమ్లోనే అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గంలోని వ్యవసాయ సబ్ డివిజన్కు ఒక్కో అగ్రి ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. విత్తనాలు, ఎరువులు, మందులకు పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎరువులు, విత్తనాలు నాణ్యతను పరీక్షించుకుని నివేదికల తర్వాత సాగు చేసుకునే వారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మూడు రకాలుగా జర్మినేషన్, ఫిజికల్ ఫ్యూరిటీ, మాయిశ్చర్ పద్ధతిలో ఇతర అధికారులు పరిశీలన జరిపేవారు. అంతేకాకుండా నత్రజని, పొటాషియం, భాస్వరం సామర్థ్యం తెలుసుకునేందుకు రసాయనాలను ఉపయోగించేవారు. ఎరువుల నాణ్యతను గుర్తించి ఆ తర్వాత పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సలహాలు, సూచనలు చేసేవారు. కాని అగ్రి ల్యాబ్లను చంద్రబాబు ప్రభుత్వం మూసి వేయడంతో వాటిలో పనిచేసే అధికారులను ఇతర విభాగాలకు డిప్యూటేషన్ వేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవస్థను పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.ల్యాబ్ల కుదింపుతిరుపతి జిల్లాలో గతంలో పనిచేసిన వెంకటగిరి, సత్యవేడు, చంద్రగిరి, సూళ్లూరుపేట అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు పూర్తిగా మూతపడ్డాయి. గూడూరు, శ్రీకాళహస్తిలో ఉన్న ల్యాబ్ల్లో గూడూరు నెల్లూరు జిల్లా లో కలిసిపోవడంతో, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మాత్రమే మిగిలింది. రాష్ట్రంలో ఒకప్పుడు 114 అగ్రి టెస్టింగ్ ల్యాబ్లుండగా, ఇప్పుడు వాటిని 44కి కుదించారు. ఈ నిర్ణయం రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.ల్యాబ్ నిర్వీర్యం.. రైతులకు శాపం శ్రీకాళహస్తి ల్యాబ్పై పెరిగిన ఒత్తిడి శ్రీకాళహస్తి: మంచి విత్తనం – మంచి ఎరువు రైతుకు అందాలనే దృఢ సంకల్పంతో ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం. అయితే ఆయన ఆశయానికి ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డులో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రస్తుతం ఏడాదికి సుమారు 1,800 శాంపిల్స్ పరీక్షిస్తోంది. జిల్లా మొత్తానికి ఒక్క ల్యాబ్ మాత్రమే ఉండటంతో శ్రీకాళహస్తి అగ్రి టెస్టింగ్ ల్యాబ్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న సత్యవేడు అగ్రిటెస్టింగ్ ల్యాబ్ను తెరిచే దిక్కే లేదు. ఆ ల్యాబ్కు కేటాయించిన సిబ్బంది ఏమయ్యారో తెలియని పరిస్థితి. విలువైన పరికరాల, ఎలక్ట్రానిక్ వస్తువులను నిరుపయోగంగా మార్చేశారు. రైతులు స్వయంగా విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించేందుకు వీలు లేకుండా మార్చేశారు. ఏటా సుమారు 300 మంది వరకు ల్యాబ్లో పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగు వేయలేదు. -
భక్తులు సంతృప్తి
వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు సంతృప్తి చెందారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలో 90 శాతం ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో రైతుల శ్రేయస్సు కోసం రైల్వే కోడూరు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. కానీ కుటమి ప్రభుత్వం వచ్చాక దా న్ని రద్దు చేసింది. దీంతో ఆ భవనం నేడు వ్యవసాయ సహాయ సంచాలక కార్యాలయంగా మారింది. ఏఏడీ ఆఫీస్గా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ -
30 వేల స్మార్ట్ రేషన్కార్డులు వెనక్కి..
తిరుపతి అర్బన్: జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో కార్డుదారులు తీసుకోకుండా మిగిలిపోయిన 30 వేల స్మార్ట్ రేషన్కార్డులు తిరిగి జిల్లా సివిల్ సఫ్లయి కార్యాలయానికి చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో మిగిలిన 29 మండలాల నుంచి స్మార్ట్ కార్డులు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నాయి. జిల్లాలో 1,457 రేషన్ దుకాణాల పరిధిలో 5,64,567 రేషన్కార్డులున్నాయి. అయితే 50 రోజుల పాటు పంపిణీ చేసినప్పటికీ తీసుకోకుండా పెద్ద సంఖ్యలో కా ర్డులు మిగిలిపోయారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల కార్డులు వెనక్కి వస్తాయని చర్చ సాగు తోంది. ఇప్పటికే 30 వేలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, కానిస్టేబుల్ గంగాధరం కథనం మేరకు.. 2018 అక్టోబర్ మూడో తేదీ ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై భాకరాపేట పోలీసులకు సమాచారం అందడంతో వారు చిన్నగొట్టిగల్లు మండలం చెట్టివారిపాళెం, తేట్టుపల్లి రోడ్డు, చిట్టివారిపాళెం క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఓ కారు పోలీసులకు దూరంగా ఆగింది. ఆ కారులోని తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, ఉత్తమగిరి తాలూకా, కావేరి కొట్టై గ్రామానికి చెందిన సంపత్ అరుల్, తమిళనాడు, సేలం జిల్లా, పీతనాయం పాళ్యం తాలూకా, కుంభపాడి గ్రామానికి చెందిన వి.సతీష్ కుమార్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర నారాయణ వాదించారు.చోరీ కేసులో వ్యక్తి అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : పుల్లంపేట రామక్కపల్లికి చెందిన అన్నపూర్ణ, ఇందిరమ్మలు ఈనెల 5వ తేదీన ప్రభుత్వాస్పత్రికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి మోటర్సైకిల్పై వచ్చి కత్తితో బెదిరించి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లాడు. ఈ కేసులో శుక్రవారం రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజంపేటకు చెందిన నిందితుడు రావూరు మోహన్ను అరెస్టు చేసి, బంగార ఆభరణం, మోటారుసైకిల్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన శ్రీనివాసులు, ఎస్ఐ చినరెడ్డెప్ప, సిబ్బందిని అభినందించారు. శ్రీవారిమెట్టులో చిరుత కలకలం అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం చంద్రగిరి: తిరుమల కాలిబాట శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత పులి సంచారం శుక్రవారం కలకలం సృష్టించింది. భక్తులకు చిరుత పులి కనిపించడంతో ఒక్కసారిగా టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు, శ్రీవారిమెట్టు ప్రాంతా న్ని పరిశీలించారు. 450వ మెట్టు వద్ద చిరుత పులి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో శ్రీవారిమెట్టులోని శ్రీనివాస ఆలయం వద్ద భ క్తులను తిరుమలకు వెళ్లకుండా బ్యారికేడ్లతో అ డ్డుకున్నారు. సుమారు మూడు గంటల పాటు భక్తులను నిలువరించారు. ఆపై చిరుత జాడ కనిపించకపోవడంతో గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
జగనన్న హయాంలో రూ.400 కోట్లు
●ఓబులవారిపల్లె: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ఏపీఎండీసీ బైరైటీస్ గనులకు కూత వేటు దూరంలో ఉన్న మంగంపేట కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలు దశాబ్దలుగా కాలుష్యం కోరల్లో చిక్కుకుని అగచాట్లు పడుతుండేవి. 2019లో వైస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మూడు గ్రామాల తరలింపునకు ఉత్తర్వు లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించకుండా అభివృద్ది చేయకపోవడంతో కాలుష్యం బారిన పడిన ఆ గ్రామాల ప్రజలు రోగాల బారిన పడి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోని జీవనం సాగిస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని పునరావాసకాలనీ ఆర్ఆర్– 5 చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంగంపేట కాపుపల్లె హరిజనవాడ, అరుంధతివాడ కాలుష్య గ్రామాల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ఆర్ఆర్–5 పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఇందులో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, ఆరోగ్య కేంద్రం, సచివాలయం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, శ్మశానం, పశువుల మేతకు భూములు కేటాయించకపోవడం తదితర అభివృద్ధి పనులను నిర్వహిచకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి వీలు లేకుండా పోతుంది. కాలుష్యంతో రోగాల బారిన ప్రజలు ప్రభుత్వం ఆర్ఆర్–5 పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు చేయకపోవడంతో గ్రామాలు తరలి వెళ్లలేదు. దీంతో నిత్యం ఏపీఎండీసీ గనుల నుంచి వెలికి తీసిన వృథా మట్టిని గ్రామానికి సమీపంలో డంపింగ్ చేస్తుండడంతో ప్రజలు నిత్యం కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యంతో గ్రామం ఖాళీ చేయలేక ఆర్ఆర్–5లో ఇల్లు నిర్మించుకోలేక వారు అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్ఆర్–5 పునవాస కాలనీలో అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి, ప్యాకేజీలు, పరిహారం అందించి గ్రామాలను తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్ఆర్–5 పునరావాస కాలనీలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలుసమస్యలు పట్టించుకోని ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి 2019లో మంగంపేట కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాల తర లింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి గనుల శాఖ మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సహకారంతో మూడు గ్రామాల పునరావాసానికి 2024లో రూ.400 కోట్లు కేటాయించారు. ముక్కావారిపల్లె పంచాయతీలో దాదాపు వంద ఎకరాలు భూసేకరణ చేసి, చదును చేయించారు. లేఅవుట్లు వేయించి పునరావాస కాలనీ ఆర్ఆర్–5 కాలనీ ఏర్పాటు చేసి, అందులో ప్లాట్లు వేయించారు. 675 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వన్టైమ్ సెటిల్్మెంట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.8.16 లక్షల పరిహారం ఇచ్చి, 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. విద్యుత్ సబ్స్టేషన్, వాటర్ హెడ్ ట్యాంక్లు, తాగునీటి కోసం బోర్లు, సిమెంటు రోడ్లు అభివృద్ధి పనులు చేయించారు.కేటాయించిన స్థలం అభివృద్ధి చేయాలి మంగంపేట హరిజవా డ, అరుంధతివాడ రెండు గ్రామాల ప్రజలకు అప్పట్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం 23 సెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. ఆర్ఆర్–5లో 23 సెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయంపై ప్రస్తుతం అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వ డం లేదు. దళిత గ్రామాలకు కేటాయించిన స్థలా న్ని అభివృద్ధి చేయాలి. – పసుపులేటి హరికృష్ణ, కాపుపల్లె దళితవాడ, ఓబులవారిపల్లె -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ చేపట్టింది. భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్కు పోటెత్తారు. కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలకే అధిక సంఖ్యలో జనం రావడంతో ఈ కార్యక్ర
అర్జీ ఆగింది!తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో అధికారులు చేపట్టిన రెవెన్యూ క్లినిక్ అర్జీదారులకు నిరాశ మిగిల్చింది. క్లినిక్లో అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపుతారని భావించి చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అర్జీదారులు గురువారం కలెక్టరేట్కు పెద్ద ఎత్తున విచ్చేశారు. అయితే గతంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులు, కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్ తరహాలోనే అర్జీలను తీసుకుని పంపించారు. దీంతో అర్జీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య, డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, రోజ్మాండ్, ఏపీఐఐసీ అధికారి విజయ్భరత్రెడ్డి, జిల్లా సర్వే అధికారి అరుణ్కుమార్ పాల్గొన్నారు. ఆయా మండలాలకు చెందిన అర్జీలను తహసీల్దార్లు, వీఆర్వోలు స్వీకరించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక రోజు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే అర్జీదారుల సంఖ్య అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో ఏ మండల తహసీల్దార్ పరిధిలో ఆ మండల అర్జీదారులకు రెవెన్యూ క్లినిక్ను ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్వహించాలని భావిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు స్పష్టం చేశారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంతోనే కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్కు బ్రేక్ పడింది. రికార్డు స్థాయిలో రెవెన్యూ క్లినిక్కు అర్జీలు కలెక్టరేట్లో జరిగిన రెవెన్యూ క్లినిక్కు చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 751 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆర్సీ పురం మండలం నుంచి 216, తిరుపతి రూరల్ నుంచి 202, పాకాల నుంచి 110, చంద్రగిరి నుంచి 106, చిన్నగొట్టిగల్లు నుంచి 65, ఎర్రావారిపాళెం నుంచి 52 అర్జీలు వచ్చాయన్నారు. వీఆర్వో గుణభూషణం నాయుడు సస్పెన్షన్ ఆర్సీపురం మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి జి. గుణభూషణం నాయుడు సర్వే నంబర్ 206–4లో కు సంబంధించి పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీ పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తప్పుడు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రివర్స్ పద్ధతితో అర్జీదారులకు కష్టాలు కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో భిన్నంగా వ్యవహరించడంతో తిప్పలు తప్పలేదు. ముందుగా అర్జీలు ఇచ్చారు.. వాటిని పూర్తి చేసిన తర్వాత అన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని రసీదు తీసుకున్న తర్వాత అధికారులను కలిసేలా పద్ధతి పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అన్లైన్ కోసం ఆరు కౌంటర్లు పెట్టారు. అయితే అన్లైన్ రిజిస్త్రేషన్కు గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో అర్జీదారులకు తాగునీరు, భోజనం లేక నానా తిప్పులు పడాల్సి వచ్చింది. నిరాశను మిగిల్చిన రెవెన్యూ క్లినిక్ -
వేడుకగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం స్నాతకోత్సవం
తిరుమల: ధర్మగిరిలోని 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం గురువారం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధా ని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలోని 146 మంది విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దామని చెప్పారు. పట్టాలు పొందిన స్నాతకులు నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారుచేయాలని ఆకాంక్షించారు. అనంతరం వేద విద్య పూర్తిచేసుకున్న స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ను అందజేశారు. రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు శనివారం నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సమాచారం అందించారు. తిరిగి ఈనెల 19వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ ప్రకటనలో డీఈఓ హెచ్చరించారు. పరిశోధన సలహాదారుగా ఐఐటీ ప్రొఫెసర్ తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిశోధన సలహాదారుగా ఐఐటీ ప్రొఫెసర్ వాసుదేవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు వీసీ నర్సింగరావు గురువారం ఉత్తర్వులు అందజేశారు. ఐఐటీ ఖరగ్పూర్లో దాదాపు 40 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాల్లో పని చేసిన ఆయన ఐఐటీ తిరుపతిలో సైతం విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందించారు. -
భగవంతుడా.. నా సమస్యకు పరిష్కారం చూపించూ!
సర్వే నంబర్ 134లో నాకు 57.5 సెంట్ల పొలం ఉంది. ఆ మేరకు పాస్ పుస్తకం ఉంది. అయితే అన్లైన్లో మాత్రం 49 సెంట్లు చూపిస్తుంది. దీంతో ఏడాదిగా అన్లైన్లో మార్పు చేసుకోవడానికి తిరుగుతున్నాను. 2024 డిసెంబర్లో రెవెన్యూ సదస్సుల్లో అర్జీ ఇచ్చాను. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. సమస్య పరిష్కారం కాలేదు. – వడ్లపల్లి చెంగల్రాయుడు, గొల్లపల్లి, రైతు, చిన్నగొట్టిగల్లు మండలం నెలలుగా తిరుగుతూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తర్వాత రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెవెన్యూ సదస్సులో మా భూమికి పాస్ పుస్తకాల కోసం అర్జీ ఇచ్చాం. అయినా పరిష్కారం కాలేదు. నెలలుగా తిరుగుతూనే ఉన్నాం. తాజాగా రెవెన్యూ క్లినిక్ పేరుతో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ అర్జీ ఇచ్చాం. ఇకనైనా అధికారులు స్పందించి మాకు పాస్ పుస్తకాలు ఇప్పించండి. – తుపాకుల సిద్ధమ్మ, అరేపల్లి రంగంపేట, చంద్రగిరి మండలం -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్డీఎస్ఎస్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. సంస్థ పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై గురువారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఆర్డీ ఎస్ఎస్ పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను, 11 కేవీ ఫీడర్లను వేరు చేయడం, ఓవర్ లోడ్ సమస్యను అధిగమించేందుకు వీలుగా అదనంగా 33 కేవీ ఫీడర్ల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా, నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ను సరఫరా చేసేందుకు అవసరమైన పనులను చేపడుతున్నామన్నారు. అలాగే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం పూర్తి అయితే రైతులకు మరింత మెరుగ్గా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ జె. రమణాదేవి, జనరల్ మేనేజర్లు రామచంద్రరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నపిల్లల ఆస్పత్రి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
తిరుపతి తుడా: అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం నూతన భవనాన్ని ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఈఓ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ నూతన ఆస్పత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ ప్లస్ 6 నూతన ఆస్పత్రి భవనంలో వైద్యసేవలు, పరిపాలనా భవనాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పద్మావతి హృదయాలంలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో మాట్లాడారు. గుండె సంబంధ శస్త్రచికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో ఉచిత వైద్యసేవలు అందుతున్నాయా?, ఉచితంగా మందులు అందిస్తున్నారా? లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్రచికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ టీవీ సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి అధికారులు శ్రీనాథ్రెడ్డి, ఆర్ఎంఓ భరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 25 నాటికి ఈ–క్రాప్ పూర్తి చేయండి
తిరుపతి అర్బన్: జిల్లాలో ఫిబ్రవరి 25 తేదీ నాటికి వందశాతం ఈక్రాప్ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా, రైతులకు పంట బీమా పొందాలన్నా తప్పకుండా ఈ క్రాప్ ఉండాలని స్పష్టం చేశారు. ఆ మేరకు అంతా పనిచేయాలని ఆదేశించారు. రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష తిరుమల: జనవరి 25న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణతో కలిసి రథ సప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర బృందాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. సైనికుల సంక్షేమానికి రూ.10లక్షల విరాళం తిరుపతి అర్బన్: జిల్లా సైనికుల సంక్షేమానికి మెప్మా సంఘం సభ్యులు రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్కు చెక్కు రూపంలో మెప్మా పీడీ ఎఫ్రాయిమ్, అధికారులు గాయిత్రి, సుమలత కలెక్టరేట్లో గురువారం అందజేశారు. జిల్లాలోని తిరుపతితోపాటు మరో ఆరు మున్సిపాలిటీల్లోని పొదుపు సంఘం సభ్యులు ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఇచ్చిన విరాళాన్ని అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. -
జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: తమిళనాడు చైన్నె తాంబురం స్పోర్ట్స్ వర్సిటీ వేదికగా ఇటీవల జరిగిన 27వ జాతీయ జంప్ రోప్ చాంపియన్షిప్లో మంగళం ట్రెండ్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులు ఏకంగా ఆరు రజిత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన తొమ్మిదో తరగతి చదువుతున్న కోకిల, జాహ్నవి, జోయల్, 8వ తరగతి చదువుతున్న తస్వీజ, రమ్యశ్రీ, జాహ్నవీలను ప్రధానోపాధ్యయులు కేశవుల నాయుడు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, రాజశేఖర్, చంద్రశేఖర్, సుభాష్ చంద్రదాస్, రామచంద్రయ్య పలువురు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు
సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలకేంద్రం సైదాపురం సమీపంలోని గూడూరు మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల రెవెన్యూ పరిఽధిలోని సర్వే నంబర్ 793లో 10.305 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యవరణం అనుమతి కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ కావాలని, తద్వారా తమకు జీవనోపాధి కలుగుతుందని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పలువురు అధికారులకు విన్నవించారు. మరికొందరు మైనింగ్ వద్దంటూ విన్నవించారు. దీంతో సమావేశంలో విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాపూరు సీఐ చినసత్యనారాయణ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్విరాల్మెంట్ అధికారి అశోక్ కుమార్, గని యజమాని ఉదయ్భాస్కర్, తహసీల్దార్ సుభద్ర, ఆర్ఐ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
సూరావారిపల్లెలో చోరీ
శ్రీకాళహస్తి: మండలంలోని సూరావారిపల్లెలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ప్రసాద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ప్రసాద్ బుధవారం సొంత పని నిమిత్తం పొరుగూరికి వెళ్లాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 72 గ్రాముల బంగారం, అరకేజీ వెండి అపహరించుకుపోయారు. ఉదయం గ్రామస్తులు చూడగా తెలుపులు తెరిచి ఉండడంతో ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతిక్లూస్టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు చోరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా వర్సిటీ రిజిస్ట్రార్గా ఉష బాధ్యతల స్వీకరణ
తిరుపతి రూరల్: మహిళా యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా బయో టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆర్.ఉష గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత రెండు దశాబ్దాలకు పైగా విస్తృతమైన బోధన, పరిశోధనా, పరిపాలనా అనుభవం కలిగిన ఆమెకు రిజిస్ట్రార్గా అవకాశం వచ్చింది. అనంతరం వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ, పూర్వ రిజిస్ట్రార్ రజనితో పాటు పలువురు అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాభినందనలు తెలిపారు. మహిళా యూనివర్సిటీలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొదలైన ఉష ప్రస్థానం రిజిస్ట్రార్ వరకు చేరింది. అలాగే శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో టీచింగ్ అసిస్టెంట్గా, సీఎస్ఐఆర్–ఎస్ఆర్ఎఫ్, సీఎస్ఐఆర్–ఆర్ఏగా ఆమె తమ సేవలు అందించారు. జేసీబీ, ఐదు ట్రాక్టర్ల సీజ్ రేణిగుంట: మండలంలోని స్వర్ణముఖి నదిలో జేసీబీ సహాయంతో అక్రమంగా ఇసుక లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లతోపాటు జేసీబీని సీజ్ చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి తెలిపారు. సీఐ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖినదిలో దాడులు చేశామన్నా రు. అక్కడ జేసీబీ సహాయంతో ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుకలోడ్ చేసి రవాణా చేయ డానికి సిద్ధం చేస్తున్న జేసీబీ ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. జేసీబీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా చేస్తే ఎంతటి వారి పైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ మంజునాథ రెడ్డి హెచ్చరించారు. టిప్పర్ డ్రైవర్పై దాడిశ్రీకాళహస్తి: సెల్ఫోన్ అపహరించబోయిన ఆగంతకుడిని ప్రతిఘటించడంతో టిప్పర్ డ్రైవర్పై మద్యం సీసాతో దాడి చేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. చైన్నెకు చెందిన చిన్నరాజ్ శ్రీకాళహస్తి శివారులోని ఓ ప్రైవేట్ క్రషర్లో కొద్ది రోజులుగా టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఓ దుకాణం వద్ద టిఫిన్ చేసేందుకు వచ్చాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని ఆగంతకుడు చిన్నరాజ్ వద్ద ఉన్న సెల్ఫోన్న్ను లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీనిని చిన్నరాజ్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆగంతకుడు తన వద్ద ఉన్న బీరు సీసాతో చిన్నరాజ్పై దాడి చేసి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక ప్రతిభావంతుల నైపుణ్యాలు అమోఘం తిరుపతి సిటీ: ప్రత్యేక ప్రతిభావంతుల్లో అమోఘమైన నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికి తీసి ప్రొత్సహించడం అభినందనీయమని డీఈఓ కేవీఎన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తిరుచానూరు రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. అనంతరం ప్రతిభ చూపిన 60 మంది ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్టు వ్వవస్థాపకురాలు తహసున్సీసా బేగం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్, ఉప విద్యాశాఖాధికారి ఇందిరా దేవి, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బి చంద్రశేఖర్రెడ్డి, ఏఎస్ఓ సారథి, సీఎంఓ సురేష్, తిరుపతి రూరల్ ఎంఈఓ పద్మజ పాల్గొన్నారు. -
శ్రీహరికోట నుంచి ఈ నెల 12వ తేదీన నిర్వహించే పీఎస్ఎల్వీ సీ62 105వ ప్ర యోగం విజయవంతం కావాలని దేశప్రజ లు ఆకాంక్షిస్తున్నారు. విజయాల పరంప రలో ఇస్రో మరింత ఉన్నత స్థానంలో నిలవనుంది. ప్రయోగం విజయవంతమై ప్రపంచ పటంలో నిలవాలని కోరుకుందాం.
105.. కావాలి విజయ విహారంసూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ఽ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 12న ఉదయం 10.17 గంటలకు పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. రాకెట్ ప్రయోగానికి 24 గంటలకు ముందు అంటే ఈనెల 11న ఉదయం 10.17 గంటలకు కౌంట్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈనెల 10న ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరిస్లో అత్యంత తేలికగా కలిగిన పీఎస్ఎల్వీ–డీఎల్ (అంటే రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో) ప్రయోగాన్ని నిర్వహించేందుకు రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి, తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా భారతదేశ రక్షణ కోసం ఉపయోగించే 1,485 కిలో బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (ఆన్వేషన్) అనే ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు భారత్లోని స్టార్టప్ కంపెనీ ధృవ స్సేన్ సంస్థ వారు డీఎస్యూశాట్, సీజీయూశాట్, ఎంఓఐ–1, లాచిట్, తైబోల్ట్–3, సంస్కార్ శాట్, ఆర్బిట్ ఎయిడ్ సంస్థకు చెందిన ఆయూల్శాట్, బ్రెజిల్ దేశానికి చెందిన ఎడ్యుశాట్, యూశాట్, గెలాక్సీ ఎక్స్పోరల్, ఆర్బిటల్ టెంపుల్, ఆల్డీబరన్–1 అనే బుల్లి ఉపగ్రహాలు, యూకేకి చెందిన థియోస్–2, నేపాల్కు చెందిన మునాల్, ఫ్రాన్స్కు చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాలను కూడా రోదశీలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఉపగ్రహాలు బరువు తక్కువగా ఉండడంతో రెండు స్ట్రాపాన్ బూస్టర్లుతో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులకు సంబంధించి ఇమేజ్లను విడుదల చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 64వ ప్రయోగం, పీఎస్ఎల్వీ–డీఎల్ అంటే రెండు బూస్టర్లతో చేసిన ప్రయోగాల్లో ఇది ఐదో ప్రయోగం. షార్ నుంచి 105వ ప్రయోగం కావడం గమనార్హం. -
‘యువజన పోరు’ విజయవంతం చేద్దాం
తిరుపతి కల్చరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి, యువజన సంఘాల పోరాటాలను అణచివేయడానికి అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతన్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. గురువారం బైరాగిపట్టెడలోని సీపీఎం కార్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యువతపై చేస్తున్న అక్రమదాడులు, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టే యువజన పోరుకు వందలాదిగా విద్యార్థులు, యువత తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ ముగ్గురికే ఉద్యోగాలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ముగ్గురికి మాత్రమే ఉద్యోగం వచ్చిందని హర్షిత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్కు మాత్రమే ఉద్యోగావకాశం కలిగిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోందని, వారందరికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు అడ్డుకుని ఇప్పుడు వదిలేశారు గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ పెద్దలు ప్రస్తుతం ఆ బకాయిలతో పాటు రెండేళ్లుగా కట్టాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు చెల్లించలేదని హర్షిత్రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులపై పెడుతున్న అక్రమ కేసులను ఖండిద్దామని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉదయ్వంశీ పిలుపునిచ్చారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ కేసులపై ‘స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు’ అన్న నినాదాంతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు గురువారం ఆయన మీడియాకు తెలిపారు. శుక్రవారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి సారధ్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
పెత్తందారీ వ్యవస్థకు ఆరాటం
– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాళెం: ‘దళిత నియోజకవర్గమైన సత్యవేడులో కొందరు పెత్తందారులు చొరబడి పెత్తందారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రశాంత నియోజకవర్గంలో చిచ్చు పెట్టడం సరికాదు.’ అని టీడీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ను ఉద్దేశించి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖానించారు. బుధవారం వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అహర్నిశలు శ్రమించి పంచాయతీ భవనాలు, ఇతర రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసుకువస్తుంటే ఎలాంటి అధికారిక ప్రోటోకాల్ పదవి లేని వ్యక్తులు భూమిపూజ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి అనధికారిక చర్యలకు ప్రభుత్వాధికారులు వంత పాడుతూ, అనధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీనిపై తాను ఇప్పటికే అసెంబ్లీలో ఫ్రివైలెజేషన్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కచ్చితంగా నిబంధనలను అతిక్రమించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తానని హెచ్చరించారు. పెత్తందారీ వ్యవస్థకు బానిసై ఉద్యోగులు బలి కావొద్దని పేర్కొన్నారు. తాను ఎంతో ఓర్పుతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల్లో తిరుగుతుంటే అధికార పార్టీలోని కొందరు ఉద్దేశపూర్వకంగా తనను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నియోజకవర్గంలో పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నికై న ఎమ్మెల్యేను కాదని ప్రైవేటు వ్యక్తులకు ప్రోటోకాల్ పలకడం పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్: మండలంలోని నరసారెడ్డికండ్రిగ సమీపంలో బుధవా రం గుర్తు తెలియని వాహ నం ఢీకొని గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందా డు. జాతీయ రహదారి పక్కన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. సుమా రు 45 ఏళ్ల వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు భిక్షగాడిగా పోలీసులు భావిస్తున్నారు. అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నా రు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భద్రపరచి కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ ఎన్నిక తిరుపతి కల్చరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరు పతి జిల్లాకు చెందిన ఇద్దరిని వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగం కమిటీ ప్రతినిధులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన బి.నరహరిరెడ్డి, రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం సహాయ కార్యదర్శిగా చంద్రగిరికి చెందిన ఆర్.దేవరాజులు నియమితులయ్యారు. నియామకంచిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా శ్రీకాళహస్తికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా గ్రంథాలయాల చైర్మ న్ల నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కారు సహా ఎర్రచందనం స్వాధీనం భాకరాపేట: తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఎరచ్రందనం దుంగలను, కారు సహా అటవీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అటవీ రేంజర్ వెంకటరమణ కథనం మేరకు.. శ్రీనివాసమంగాపురం సమీప ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారనట్లు అటవీశాఖాధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో వారు శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆ సమయంలో ఓ కారు అటువైపు రావడంతో దాన్ని అటవీశాఖాధికారులు ఆపారు. దీంతో కారు వదలి అందులోని వ్యక్తులు పరారయ్యారు. అధికారులు ఆ కారులో పరిశీలించగా 9 ఎర్రచందనం దుంగలు ఉండగా గుర్తించి, వాహనం సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 280 కిలోల బరువు ఉన్న వీటి విలువ సుమారు రూ.13 లక్షలుగా అంచనా వేశా రు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చైతన్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి, డ్రైవర్ శంకర్, ప్రొటెక్షన్ వాచర్లు కుమార్, అంజన్ కుమార్, సురేంద్ర, హేమచంద్ర, యుగంధర్ పాల్గొన్నారు. -
గతం కంటే భిన్నంగా ఫెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట: నియోజకవర్గం కేంద్రంగా నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ను గతంలో కంటే భి న్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్తోపాటు ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా అధికారులు తొలుత నేలపట్టు పక్షులు రక్షిత కేంద్రాన్ని, సూళ్లూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. భీములవారిపాళెం పడవల రేవు వద్ద టూరిజం శాఖకు చెందిన బ్రోచర్, సూళ్లూరుపేటలోని ఫ్లెమింగో ఫెస్టివల్ గ్రౌండ్లో పక్షులు పండుగకు సంబంఽధించిన బ్రోచర్ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది మూడు రోజులు పండుగ నిర్వహించామని, అప్పుడు నిధులు చాలకపోవడంతో ఈ సారి పండుగను రెండు రోజులకే కుదించామని తెలిపారు. అయితే గతంలో కంటే భిన్నంగా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాష్రెడ్డి, వెంకటగిరి డీఎఫ్ఓ శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఆర్డీ రమణ ప్రసాద్, డీఎస్డీఓ శశిధర్, సెట్విన్ సీఈఓ యశ్వంత్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈఓ కుమార్, తహసీల్దార్ గోపీనాథ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. పడవల రేవును పరిశీలించిన కలెక్టర్ తడ: మండలంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. బీవీపాళెం పడవ రేవు నుంచి పులికాట్ సరస్సు మీద పడవల షికారుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. -
సామాన్య భక్తులకు ప్రాధాన్యం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఆలయ పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి ఆయా విభాగాధిపతులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూల్లో ఉండే భక్తులకు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు దాతల నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా లడ్డూ, వడ, పులిహోరా ప్రసాదాలను తయారు చేయడం, ఉచిత వైద్యకేంద్రాలను ఏర్పాటు, అన్నదానానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఖాళీ ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు షామియానాలు, పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు, తాత్కాలిక లైటింగ్, ఎస్ఈడీ స్క్రీన్లు, హోర్డింగ్లు ఏర్పాటుపై చర్చించామన్నారు. ఆలయంలో అవసరమైన ప్రదేశాల్లో పుష్పాలంకరణ, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గత సంవత్సరం కన్నా అధికంగా తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపుగదులు ఏర్పాటు, స్వర్ణముఖి నది పరిసరాల్లో భక్తులు స్నానాలు చేసేందుకు షవర్ల ఏర్పాటుపై సమీక్షించినట్లు తెలిపారు. రథోత్సవం నిర్వహించేందుకు రథానికి తగిన మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విధులకు వచ్చే పలుశాఖల వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులకు అవసరమైన భోజనం, అల్పాహారం, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు నాగరాజు, విజయమ్మ, ఆలయాధికారి కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, రాజేష్ గురుకుల్, ఇన్చార్జి ఈఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో తడిసేలా.. చూస్తే జడిసేలా!
ఈ చిన్నారులు ఇక్కడేదో సరదాగా కాలువలో ఆడుకోవడం లేదు. వారు పాఠశాలకు వెళ్లడానికి కాలువ దాటే సాహసం చేస్తున్నారు. చదువుకొనలేని పేద విద్యార్థులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వాహన వసతి లేమికి తోడు దారి లేక ఇక్కట్లు పడాల్సి వస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో చదువుకోవాలంటే కాలువలు, పంట పొలాల గట్లు, అడవులు దాటాల్సి వస్తోంది. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని గోవిందప్పనాయుడుకండ్రిగ గ్రామంలోని అదర్శ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో పిచ్చిగుంట కాలనీకి చెందిన 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిచ్చిగుంట కాలనీ నుంచి పాఠశాలకు రోడ్డు మార్గం రావాలంటే 11 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ క్రమంలో పాఠశాలకు ఆటోలో వెళుతుండేవారు. ఆటోకు రూ.600 పైనే అద్దె చెల్లించారు. ప్రభుత్వం ఆటోకు వ్యయం చేసిన నగదును చెల్లించలేదు. దీంతో ఆటోను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నెల రోజులుగా పెద్దపాలేడు చెరువుకు నీరందించే వరవ కాలువ దాటి, పంట పొలాల గట్లపై స్కూలుకు వెళుతున్నారు. వర్షం కురిసిన రోజు పాఠశాలకు వెళ్లడం లేదు. ప్రభుత్వం రవాణా చార్జీలే ఇస్తే విద్యార్థులకు ఈ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. – బుచ్చినాయుడుకండ్రిగ -
ఈతకు వెళ్లి వలస కార్మికుడి మృతి
– బిహార్ వాసిగా గుర్తింపు వరదయ్యపాళెం: బతుకు తెరువు కోసం వచ్చిన వలస కార్మికుడు మండలంలోని సంతవేలూరు చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఎస్ఐ మల్లికార్జున్ కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం కటిహర్ జిల్లా డిప్రీంసాళెం హరిహర్పూర్న గ్రామాని కి చెందిన సీతారామ్ ఉర్నన్ కుమారుడు రామానంద టర్కీ(20) మండలంలోని కువ్వాకొల్లి సీసీఎల్ కాంటినెంటల్ కాఫీ కంపెనీలో వలస కార్మికుడుగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో తన స్నేహితులతోపాటు సంతవేలూరు చె రువు సమీపంలో మద్యం తాగిన రామానంద టర్కీ సరదాగా ఈత కొట్టడానికి చెరువులో దిగాడు. చెరువు లో ఉన్న పాచి కారణంగా ఇరుక్కుని మునిగిపోవడా న్ని గుర్తించిన తోటి కార్మికుడు అనోజ్ కేకలు వేయడంతో, ఎస్టీకాలనీకి చెందిన నవీన్ చెరువులో దిగి, నీ టమునిగిన అతన్ని ఒడ్డుకు చేర్చాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్ మంజూరు
తిరుపతి సిటీ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి పెంపుకోసం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ సెంటర్ను మంజూరు చేసింది. కళాశాలలో బుధవారం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్నోవేషన్ సెంటర్ ధృవీకరణ పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అకడమిక్ విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగు పరచుకునేందుకు కళాశాలకు కేంద్రం ఇన్నొవేషన్ సెంటర్ను మంజూరు చేయడం గర్వకారణమన్నారు. నైపుణ్యాభివృద్ధితో పాటు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసి నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్టార్టప్లతో పాటు ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వర్క్ షాప్లు పెద్ద సంఖ్యలో నిర్వహించేందుకు వీలుంటుందన్నారు. సెంటర్ రావడానికి కృషి చేసిన సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె ఉమారాణిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కిషన్, భీమన్న, మల్లికార్జున, చలపతి, కామేశ్వరరావు, ఉష, విజయశ్రీ, రత్నారావు, మార్కండేయ, రామకృష్ణరెడ్డి పాల్గొన్నారు. -
ఐసర్లో టెన్నిస్ కోర్టు ప్రారంభం
ఏర్పేడు: తిరుపతి ఐసర్లో బుధవారం ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య చేతుల మీదుగా టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. ఐసర్ ప్రాంగణంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కోసం టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేశారు. కోర్టును లాంఛనంగా ప్రారంభించిన ఆయన సిబ్బంది, విద్యార్థులతో కలసి సరదాగా కాసేపు టెన్నిస్ ఆడారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు, శారీరక ధారుఢ్యం సాధించేందుకు క్రీడల్లోనూ రాణించేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనిలత్మజ ఆర్య సోమయాజులు పాల్గొన్నారు. ఇరు వర్గాలపై కేసులు రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీ తారకరామనగర్లో ఇద్దరు మహిళల మధ్య నగదు లావాదేవీ కారణంగా జరిగిన ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సీతారామపురానికి చెందిన కస్తూరి నిర్మలకు తారకరామనగర్, సుందరయ్య కాలనీకి చెందిన పి.దీప మధ్య డబ్బుల లావాదేవీలకు సంబంధించి వివాదం ఏర్పడింది. ఈ వి షయంలో ఇరువర్గాల వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఈ నెల 4 వ తేదీన ఘర్షణ పడ్డారు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని బుధవారం రేణిగుంట పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. రెండు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని, దర్యాప్తు అనంతరం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇద్దరి అరెస్టు రేణిగుంట: రేషన్ బియ్యం అక్రమ నిల్వ కేసులో పోలీసులు ఇద్దరి బుధవారం అరెస్టు చేశారు. గాజులమండ్యం పంచాయతీ నీలిసానిపేటలో మంగళవారం ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 7,310 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దొడ్లమిట్టకు చెందిన శేఖర్, జీ పాళేనికి చెందిన మణిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
పాట్లు తప్పవా?
సందర్శకులకుదొరవారిసత్రం : రాష్ట్ర ప్రభుత్వం సూళ్లూరుపేట కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పక్షుల పండుగ ఏర్పాట్లను అధికారులు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో అరకొరగా చేసి, చేతులు దులుపుకున్నారు. పక్షుల పండుగ ఏర్పాట్లపై జిల్లాధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు నెల రోజుల ముందు నుంచే సమీక్షలు, సమావేశాలు నిర్వహించినా కనీస వసతులు లేకపోవడం పరిపాటిగా మారింది. కేంద్రంలో మొదలైన ఏర్పాట్లు ఈ నెల 10,11 తేదీల్లో పక్షుల పండుగ సందర్భంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో, డీవీ సత్రం నుంచి కేంద్రం గేట్లు వరకు స్థానిక అధికారులు పారిశుద్ధ్య పనులు, చెత్తాచెదారం తొలగించడం తదితర పనులు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా చేయించాల్సిన పనులు బుధవారం నుంచి మొదలయ్యాయి. వన్యప్రాణి విభాగం అధికారులు చెరువు కట్టపై పారిశుద్ధ్యం మెరుగు పరిచే పనులు చేయిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా ఇప్పటికే పక్షుల కేంద్రం మార్గం మధ్యలోని హోర్డింగ్లకు రంగులు వేయించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సౌకర్యార్థం కేంద్రానికి సమీపంలోని పెలికాన్ అతిథి గృహాలను సిద్ధం చేసే పనులు టూరిజం శాఖ చేపట్టింది. పండుగ అక్కడే... అందరి చూపు ఇక్కడ! సూళ్లూరుపేట కేంద్రంగా జిల్లా యంత్రాంగం పక్షుల పండుగ రెండు పాటు నిర్వహించినప్పటికీ అందరి చూపు మాత్రం నేలపట్టు పక్షుల కేంద్రం వైపే. గత ఏడాది మూడు రోజులు పాటు నిర్వహించిన పక్షుల పండుగ సందర్భంగా కేంద్రంలోని విదేశీ వలస విహంగాలను వీక్షించేందుకు 70 వేలు మందికి పైగా సందర్శకుల విచ్చేశారు. ఈ సారి కూడా రెండు రోజుల పాటు జరిగే పండుగకు 50 వేలమంది పైగా సందర్శకులు పక్షుల కేంద్రానికి విచ్చేసే అవకాశం ఉందని స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు పేర్కొంటున్నారు. నెరవేరని కలెక్టర్ హామీలు గత ఏడాది జనవరితో పక్షుల పండుగ ఏర్పాట్లు సమయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసి పక్షుల కేంద్రానికి సమీపంలో టూరి జం సముదాయం, డీవీ సత్రంలోని పున్నమి రెస్టారెంట్ను అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే పక్షుల కేంద్రంలోని అత్తిగుంట చెరువుకు చెందిన మూడు తూ ములను రైతుల కోరినట్టు మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కలెక్టర్ హామీలు ఇచ్చి ఏడాది అయిన నేటి వరకు ఇందులో ఏ ఒక్కటి అమలు కాలేదు. పక్షుల పండుగ సమయంలో సమస్యలివీ -
అలమేలు మంగమ్మా.. మన్నించు!
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ తనిఖీ కేంద్రంలోని సిబ్బంది నిబంధనలను తుంగలోకి తొక్కారు. భక్తులకు ఒక నిబంధన, సిబ్బంది మరో నిబంధన అన్నట్లుగా విధులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయ భద్రత దృష్ట్యా పెద్ద ఎత్తున విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహిస్తుంటారు. అయితే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులను తనిఖీ చేసే కేంద్రంలో సిబ్బంది తీరు చర్చనీయాశమైంది. ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించి వెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అలాంటి విజిలెన్స్ తనిఖీ కేంద్రంలో సిబ్బంది తమ పాదరక్షలను అక్కడే ఉంచి, విధులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. మంగళవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్కానింగ్ సెంటర్ వద్ద వారి పాదరక్షలు ఉంచిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎంతో పరమపవిత్రంగా అమ్మవారి కొలుస్తున్న భక్తులను ఇలాంటి ఘటనలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఆలయ ఆవరణలో పాదరక్షలు, పవిత్రంగా భావించి క్యూలైన్ తనిఖీ కేంద్రంలో ఉంచడం మండిపడుతున్నారు. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: బెంగళూరుకు చెందిన రాన్కి ఇన్ఫ్రా సంస్థ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. ఫిలిమ్ చాంబర్ సంయుక్త కార్యదర్శిగా రాజుకుంట వాసి చిట్వేలి: తెలుగు ఫిలి మ్ చాంబర్ సంయుక్త కార్యదర్శిగా రాజుకుంటకు చెంది న ఎంపీటీసీ సభ్యు డు నానబాల నాగా ర్జునకు అరుదైన గౌ రవం దక్కింది. బుధవారం తెలుగు ఫిలిమ్ చాంబర్ సంయుక్త కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో 2017వ సంవత్సరం నుంచి 2023 వరకు సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2025 డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఫిలిమ్ చాంబర్ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న నాగార్జున 2027వ సంవత్సరం వరకు పదవిలో కొనసాగనున్నారు. కెనరా బ్యాంక్ వద్ద రూ.2 లక్షల చోరీ సూళ్లూరుపేట: పట్టణంలోని కెనరా బ్యాంక్ వద్ద చెంగమ్మ ఆనే మహిళ వద్ద ఉన్న రూ.2 లక్షలు నగదును గుర్తు తెలియని యువకులు మోటార్సైకిల్ వచ్చి దోచుకెళ్లారు. బాఽధితురాలి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం వేటగిరిపాళెం గ్రామానికి చెందిన చెంగమ్మ పొదుపు గ్రూపు నడుపుతోంది. వారి గ్రూపునకు బ్యాంక్ రుణం మంజూరు చేయడంతో ఆ నగదు రూ.2 లక్షలు తీసుకుని బయటకు రాగానే గుర్తు తెలియని యువకులు నగదు సంచినీ లాక్కుని వెళ్లిపోయారు. ఈ విషయమై బుధవారం బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. హైవే పట్రోలింగ్ వాహనం బోల్తా – ముగ్గురికి గాయాలు చంద్రగిరి: జాతీయ రహదారిపై పట్రోలింగ్ వాహనం బోల్తాపడిన ఘటన మంగళవారం అర్థరాత్రి చంద్రగిరి మండలంలోని కల్రోడ్డుపల్లి వద్ద చోటు చేసుకుంది. జాతీయ రహదారికి చెందిన పట్రోలింగ్ వాహనం విధుల్లో భాగంగా చంద్రగిరికి వైపు వస్తోంది. ఈ క్రమంలో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుపైకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చరణ్కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన శాస్త్రవేత్తలు డా.శ్రీదేవి, డా. పీసీ లత, డా.మధుసూదన్ రావు బుధవారం సందర్శించారు. ముందుగా వారు కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. దత్తత గ్రామాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని వాటి ప్రభావం గురించి తెలుసుకుని శాస్త్రవేత్తల పనితీరు, కార్యక్రమాల ప్రగతిని ప్రశంసించారు. తరువాత కృషి విజ్ఞాన కేంద్రంలోని పంట క్షేత్రంలో వివిధ ఆహార, ఉద్యాన పంటల ప్రదర్శన క్షేత్రాలు, భూసార పరీక్ష కేంద్రం, వివిధ రకాల నర్సరీలు, వర్మీకంపోస్ట్ తయారీ కేంద్రం, పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రం, పెరటికోళ్ల పెంపకం తదితర ప్రదర్శన క్షేత్రాలు సందర్శించి, జిల్లా నేలల స్వభావంపై పరిశోధన కోసం కేవీకే క్షేత్రంలో మట్టి నమూనాలు సేకరించి, కేవీకే దత్తత గ్రామాలను సందర్శించి, అక్కడ రైతులతో సమావేశమం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.శ్రీనివాసులు, కేవీకే శాస్త్రవేత్తలు దివ్య, రాము కుమార్, అనూష, దివ్య సుధ, సిబ్బంది పాల్గొన్నారు. -
విన్నపానికి
సమస్యలు బోలెడు.. సమయం 3 గంటలే ●ప్రైవేటు సైట్లో మరో వ్యక్తి బోర్డు ఈయన పేరు గణేష్నాయుడు, చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈయన వయస్సు 80 ఏళ్లు. ప్లాట్ నంబర్ 49, సర్వే నంబర్ 264లో చుట్టు ప్రహరీగోడ ఏర్పాటు చేసుకున్నారు. అయినా మరోవ్యక్తి ఈ స్థలం తమదంటూ బోర్డు పెట్టారని ఆయన సోమవారం కలెక్టరేట్కు వచ్చి అర్జీని అధికారులకు ఇచ్చి, న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కొత్తరాగం అందుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెవె న్యూ సమస్యలకు పరిష్కారం చూపుతామని చె ప్పి న ఆయన గత ఏడాది చేపట్టిన రెవెన్యూ సదస్సులతో సమస్యలకు సరైన ఫలితాలు చూపలేదు. దీంతో ఈ ఏడాది కొత్తగా కలెక్టరేట్లో ప్రతి సోమ వా రం ఓ వైపు పీజీఆర్ఎస్.. మరోవైపు రెవెన్యూ క్లినిక్లను నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రమంతటా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్తోపాటు రెవెన్యూ క్లినిక్ల్ను రెండు వారాలుగా చేపడుతున్నా రు. అయితే తిరుపతి జిల్లాలో మాత్రమే రెవెన్యూ క్లినిక్ల్ను సోమవారం పీజీఆర్ఎస్లో వద్దని అధికారులు నిర్ణయించుకున్నారు. జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్న క్రమంలో సోమవారం కాకుండా ప్రత్యేకంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రోజు కలెక్టరేట్లోనే రెవెన్యూ క్లినిక్లను చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ముందుగా జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి రెవెనూ క్లినిక్ను చేపడుతున్నారు. తర్వాత వారంలో ఒక్కరోజు ఒక్కో నియోజకవర్గానికి రెవెన్యూ క్లినిక్ చేపట్టనున్నారు. సమస్యలు బోలెడు...సమయం 3 గంటలే! నిర్దిష్టకాల వ్యవధిలో పరిష్కారం చూపాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి అర్జీలు అక్కడే పేరుకుపోతున్నాయి. 19 నెలల చంద్రబాబు పాలనలో 62,500 అర్జీలను అధికారులకు పీజీఆర్ఎస్లో ఇచ్చారు. అందులో 36,700 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఉన్నాయి. ఈ సందర్భాల్లో పరిష్కారం కోసం కొందరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్, కిరోసిన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడుతున్న ఘటనలే కాకుండా కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారు మరికొందరు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల్లో 55శాతం రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయి. అయితే కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే రెవెన్యూ క్లినిక్ చేపట్టనున్నారు. కేవలం 3 గంటల సమయంలో అర్జీలను ఎప్పుడు స్వీకరిస్తారు, వారి సమస్యలను ఎప్పుడు నిశితంగా వింటారు, ఆ తర్వాత ఎప్పుడు వాటికి పరిష్కారం చూపుతారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రధాన భూ సమస్యలివీ ప్రభుత్వ భూమి ఆక్రమించి చెట్లు నాటేశారు! ఈయన పేరు నాగరాజు, ఎర్రవారి పాళెం మండలంలోని చెరుకువారి పల్లి గ్రామం. దశాబద్దాలుగా ప్రభుత్వ భూమిలో నుంచి బండి బాట మీదుగా అవతల వైపు ఉన్న ఆయన పది ఎకరాల పొలంలోకి వెళుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెట్లు నాటి, దారి మూసివేశారంటూ కలెక్టరేట్లో సోమవారం మొరపెట్టుకున్నారు. మా మరదలు మా ఆస్తిని కొట్టేసింది! నా పేరు ఎం. పట్టాభి. మాది తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలం వెలత్తూరు కండ్రిగ. మేము నలుగురు అన్నదమ్ముళ్లం, మాకు తిరుపతిలో మూడు ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ మూడు ఇళ్లు మా తమ్ముడు ఎం.ధనపాల్ భార్య ఎం.అశ్వని మోసం చేసి, ఆమె పేరుపై అన్లైన్ చేసుకుంది. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద సోమవారం అధికారులను కోరారు. -
సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ
తిరుపతి కల్చరల్: రేణిగుంట క్యారేజ్ రిపేర్ షాప్(సీఆర్ఎస్) ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సీఆర్ఎస్ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల సమస్యలను సా నుకూలంగా విన్న ఎంపీ గురుమూర్తి త్వరలోనే రేణిగుంట సీఆర్ఎస్ను స్వయంగా సందర్శించి సంబంధి త రైల్వే అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మారిషస్ దేశాధ్యక్షుడికి సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అయినా మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కేకు విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రె డ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సు బ్బారాయుడు, ధరంబీర్ గోకుల్ దంపతులను కలంకారి శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను బహుకరించి, సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. మహిళా వర్సిటీ రిజిస్ట్రార్గా ఆచార్య ఉష తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఉషను నియమించారు. ఆ మేరకు ఆమె గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నెల 5వ తేదీకి పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.రజనీ పదవీ కాలం ముగియడంతో నూతన రిజిస్ట్రార్ను నియమించారు. ఈ క్రమంలో బుధవారం పూర్వ రిజిస్ట్రార్ రజనీకి వర్సిటీ తరఫున సాదరంగా వీడ్కోలు పలికారు. వర్సిటీ సెమినార్హాల్లో జరిగిన వీడ్కోలు స మావేశానికి పలువురు అధ్యాపకులు, అధికారు లు హాజరై ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. వైస్చాన్సలర్ ఆచార్య వి.ఉమ మాట్లాడుతూ స మర్థవంతమైన, పారదర్శకమైన పరిపాలనను అందించడంలో రజనీకి సాటిలేరని ప్రశంసించా రు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించను న్న నూతన రిజిస్ట్రార్ ఆచార్య ఆర్.ఉష, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. బి.గీతావాణి మాట్లాడుతూ వర్సిటీ లో అభివృద్ధి పనులు, బోధన పరమైన విషయా ల్లో రజనీ కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆచరణలోకి తీసుకువచ్చారన్నారు. -
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక
గత ఏడాది కంటే 2025–26 సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. పదో తరగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకెళ్లుతున్నాం. ఉపాధ్యాయుల కొరతను నివారించి అన్ని సబ్జెక్ట్ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వంద రోజుల ప్రణాళికతో ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. – కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లా కొత్తపరీక్షా విధానంతో తొలిసారి.. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది జిల్లా టాప్ 10లో ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నూతన సిలబస్తో కొత్త పరీక్షా విధానాన్ని ఎదుర్కొబోతున్నారు. అందుకు తగ్గట్టు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన బోధన అందించాం. విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఫ్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నాం. పబ్లిక్ పరీక్షల నిర్వహణ, సంకల్ప్–2026 వంటి పలు అంశాలపై రెండు రోజుల క్రితం ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి దిశానిర్ధేశం చేసింది. ఆ మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి జిల్లా -
కార్యకర్తల జోలికి వస్తే సీరియల్ చూపిస్తాం!
వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సినిమా కాదు.. సీరియల్ చూపిస్తానని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై రోజు రోజుకు కక్షసాధింపు చర్యలు అఽధికమవుతున్నాయని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల వెంకటగిరి పట్టణంలోని చదువుకుంటున్న యువకుడితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులపై కూడా లేనిపోని సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. అలాగే ఊర్లల్లో లేని వారి పై కూడా కేసులు బనాయించి వేదింపులకు గురిచేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంటే రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే డిజిటల్ బుక్ అమల్లో ఉంటుందన్నారు. తమ కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జిల్లాల పునర్వభజన అసంబద్ధంగా చేశారని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చీల్చాలన్నారు. పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు ధనియాల రాధ, కందాటి కళ్యాణి, సుకన్య, ఆటంబాకం శ్రీనివాసులు, బాలాయపల్లి మండల అధ్యక్షులు వెందోటి కార్తీక్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దశరథరామిరెడ్డి, కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులరెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, అల్లం సాయి, సదానందరెడ్డి, వేణురెడ్డి, కల్లు సతీష్, రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు
చిట్వేలి : మండలంలోని నేతివారిపల్లెలో ఆదివారం దివ్య(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వెంగయ్య తెలిపారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రాజపల్లెకు చెందిన దివ్యతో చిట్వేలి మండలం, నేతివారిపల్లికి చెందిన పసల సాయి పవన్ కల్యాణ్ (32)కు ఐదేళ్ల క్రితం వివామైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దివ్య హైదరాబాద్లోని ఓ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తోంది. పవన్ కల్యాణ్ ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. దీనికితోడు ఆన్లైన్ బెట్టింగ్లో సుమారు రూ.4లక్షలు పోగొట్టుకుని, అప్పు చేయడంతో మనస్పర్థలు మరింత పెరిగాయి. అలాగే దివ్య నగలను సైతం పవన్ కల్యాణ్ అమ్మేయడంతో కాపురంలో ఘర్షణలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఇరువురూ నేతివారిపల్లెకు వచ్చేశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ ఫూటుగా మద్యం తాగి ఇంటికి రావడంతో దివ్య ఆవేదన చెందింది. భర్త వ్యవహారశైలిని వీడియో తీసి వాట్సాప్లో తల్లిదండ్రులకు పంపించింది. తర్వాత ఇంట్లో ఫ్యాను ఉరివేసుకుంది. కుటుంబీకులు వెంటనే రైల్వే కోడురులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు సోమవారం నేతివారిపల్లెకు వచ్చారు. మంగళవారం చిట్వేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించామని ఏఎస్ఐ వెల్లడించారు. -
ఆలయాల్లో చోరీలు
కలువాయి మండలంలోని పలు దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, నగలు, నగదు దోచుకుపోయారు.ఫీజు చెల్లించలేక వదులుకున్నా... నాన్న, అమ్మ భవన నిర్మాణ కూలీలు. నేను ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరాలనుకున్నా. నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చింది. కానీ ఫీజురీయింబర్స్మెంట్ మాటే ఎత్త వద్దు..ఫీజు చెల్లించాల్సిందేనని ఆ కళాశాల యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. దీంతో ఇంజనీరింగ్ సీటు వదులు కున్నాను. – శ్రీరాములు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి, తిరుపతి రిజిస్ట్రేషన్ ఆప్షనే ఇవ్వలేదు నేను బెంగళూరులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 2025–26 విద్యాసంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో ఆప్షనే ఇవ్వలేదు. గత ప్రభుత్వం హయాంలో పొరుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. – లక్ష్మీప్రియ, ఇంజినీరింగ్ విద్యార్థిని, శ్రీకాళహస్తి -
సంకల్పం సిద్ధించేనా?
ఫలితం పదిలమై..●‘పది’ంతల ఆనందం చెందాలని.. వంద రోజుల ప్రణాళికతో ఫలితాలు మెరుగు.. శత శాతం ఉత్తీర్ణత.. రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థానం సాధనకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలు కృషి చేస్తున్నారు. అలాగే సంకల్పం పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థుల శతశాతం ఫలితాలకు ప్రణాళికలు సిద్ధం చేసి కష్టపడుతున్నారు. అయితే వారి సాధన, కృషి, ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తాయో? లేదోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తిరుపతి సిటీ: జిల్లాలో గత ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. ఏకంగా రాష్ట్ర స్థాయిలో 19వ స్థానానికి దిగజారడంతో అధికారుల తీరుపై ప్రభుత్వం మండిపడింది. దీంతో ఈ ఏడాది పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫలితాల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్ధేశం చేశారు. పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికను పక్కా అమలు చేయాలని, విద్యార్థులకు ప్రతిరోజు కష్టతరమైన పాఠ్యాంశాలపై దృష్టి సారించి, సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలు గతం కంటే మెరుగుగా సాధించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. వంద రోజుల ప్రణాళికతో పది..పరువు నిలిచేనా? గత ఏడాది పది ఫలితాల్లో తిరుపతి జిల్లా వెనుకబడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను ప్రత్యేకంగా రూపొందించారు. విద్యాశాఖాధికారి స్వయంగా ప్రతి పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులు ఫలితాల మెరుగుకు పలు సూచనలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, కాస్త వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. మార్చి 16వ తేదీన పది పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ప్రతి పాఠశాలలో రోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్లిప్ టెస్ట్లు నిర్వహించి, విద్యార్థుల సామర్థాన్ని మదింపు వేసేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా పరువు నిలిచేలా టాప్ 5లో నిలబెట్టాలని అధికారులు కృషి చేస్తున్నారు. పది, ఇంటర్ పరీక్షలపై అధికారుల ప్రత్యేక దృష్టి సంకల్ప్–2026..సక్సెస్ సాధించేనా! ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, అదే నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరంలో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లుతోంది. ఇందులో భాగంగా సంకల్ప్–2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్ 22 నుంచి ఫిబ్రవరి 20వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి రివిజన్ టెస్ట్లు, ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో అధ్యాపకులకు నూతన సిలబస్, కొత్త పరీక్షా విధానాలపై ఇప్పటికే పలు మార్లు అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రత్యేక దృష్టి సారించి, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆర్ఐఓలకు దిశానిర్థేశం చేశారు. కాగా నూతన సిలబస్, కొత్త పరీక్షల విధానంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ ఏడాది పరీక్షలు కత్తి మీద సామేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా సమాచారం పదో తరగతి మొత్తం ఉన్నత పాఠశాలలు 323 2024–25లో పది పరీక్షలకు హాజరైన విద్యార్థులు 26,875 ఉత్తీర్ణులై విద్యార్థులు 20,597 ఉత్తీర్ణత శాతం 79శాతం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం 19 ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 27,154 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలు 72 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 109 ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 31,479 ఉత్తీర్ణులైన విద్యార్థులు 22,403 (71 శాతం) రాష్ట్రం స్థాయిలో జిల్లా స్థానం 9 ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 28,460 ఉత్తీర్ణులైన విద్యార్థులు 24,581 (86శాతం) రాష్ట్రం స్థాయిలో జిల్లా స్థానం 8 ఈ ఏడాది హాజరుకానున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 32,438 సెకండ్ ఇయర్ విద్యార్థులు 28,395 -
వేగవంతంగా ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు
చంద్రగిరి/తిరుపతి రూరల్: వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే తమ లక్ష్యమని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి అన్నారు. మండలంలోని నారావారిపల్లి, కందులవారిపల్లి గ్రామాల్లో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన సీఎండీ విద్యుత్ సరఫరా, విద్యుత్ లైన్లు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, సోలార్ విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల అంశాలను పరిశీలించిన ఆయన గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నారావారిపల్లిలో ఏపీఎస్పీడీసీల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ సబ్స్టేషన్ పనులను పరిశీలించారు. త్వరితగతిన ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 11కేవీ, ఎల్టి, వేలాడుతున్న వ్యవసాయ విద్యుత్ లైన్లను, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను పరిశీలించిన ఆయన అన్నింటినీ వెంటనే సరిచేయాలని, దిమ్మెల ఎత్తు పెంచి కంచెను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ ఖాన్, ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ చిన్న రెడ్డెప్ప, ఏడీఈ శేషాద్రి రెడ్డి, ఏఈలు నాగరాజ, వెంకటరమణ పాల్గొన్నారు. -
మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా!
బుచ్చినాయుడుకండ్రిగ: ‘మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే ఉంటానని’ ఎంఈఓ–2 మునిసుబ్రమణ్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పారు. మండలంలోని గాజులపెళ్లూరులోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో బడి బయట కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లిన ఎంఈఓ చిన్నారిని బడికి పంపాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డను తాము తీసుకొని వస్తాం మీరు వెళ్లండి సార్ అని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఆ ఎంఈఓ అక్కడి నుంచి కదలలేదు. బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే కుర్చి వేసుకుని కూర్చుంటానన్నారు. అరగంట సేపు ఇంటి వద్ద నుంచి ఎంఈఓ కదలకపోవడంతో చివరకు తల్లిదండ్రులకు చిన్నారిని బడికి పంపారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీనివాసమంగాపురానికి చెందిన వెంకట నాగరాజ శర్మ మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణ దాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని మంగళవారం దాత తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కు మార్ సింఘాల్కు అందజేశారు. కాగా దాత వెంకట నాగరాజశర్మ శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు. -
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పంచాయతీ, నీలసానిపేటలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి ఆధ్వర్యంలోని గాజుల మండ్యం ఎస్ఐ నాగరాజు, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి నిల్వ చేసి, అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం నీలసానిపేటలో తనిఖీలు నిర్వహించారు. ఒక ఇంట్లో సుమారు 100 బస్తాల రేషన్ బియ్యం ఉండడం గుర్తించి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో సీజ్ చేశారు. తరువాత గాజులమండ్యం పోలీస్స్టేషన్కు రేషన్ బియ్యాన్ని తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు అదృశ్యం వరదయ్యపాళెం: మండలంలోని రా మిరెడ్డిపాళేనికి చెందిన తలారి సుబ్బ య్య భార్య ఎస్. మునివెంకటమ్మ (60) పది రోజుల కిందట అదృశ్యమైనట్లు వరదయ్యపాళెం పోలీస్స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఇంటికి చేరుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మల్లికార్జున సూచించారు. -
సనాతన ధర్మమే మార్గదర్శకం
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మమే, సమాజ శ్రేయస్సు మార్గదర్శకమని, యావత్ జనావళి సనాతన ధర్మాన్ని పాటిస్తూ సమాజ సుభిక్షతకు తోడ్పడాలని కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠాధిపతి, శ్రీశక్తిపీఠం వ్యవస్థాపకులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఉద్ఘాటించారు. శ్రీశక్తిపీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతి 40వ జన్మదినం సందర్భంగా లోకకల్యాణాన్ని మహిళల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో మంగళవారం సాయంత్రం 10 వేల మంది సీ్త్రమూర్తులతో దశ సహస్ర సుహాసినీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీస్వామి పాల్గొని, అనుగ్రహ భాషణం చేశారు. అనేక మంది యుగ పురుషులు తమ కార్యాలను దేశ సంక్షేమ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రమ్యానంద భారతి సనాతన ధర్మ పరిరక్షణకు సేవలు అందిస్తోందని తెలిపారు. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో 10 వేల మంది మహిళలతో ఈ సుహాసినీ పూజ చేపట్టడం పరమేశ్వరుని ఆజ్ఞ అని పేర్కొన్నారు. శ్రీశక్తిపీఠాధీశురాలు రమ్యానంద భారతి మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువుల అనుగ్రహం ఉంటే ఏదైనా సుసాధ్యమవుతుందన్నారు. వేలాది మంది సీ్త్రమూర్తులతో సుహాసినీ పూజ చేపట్టడం మహద్భాగ్యమని తెలిపారు. దీనికి ముందుదశ సహస్ర సుహాసినీ పూజ అత్యంత వేడుకగా సాగింది. పూజా వేదికపై శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతీదేవి, శ్రీకామాక్షి అమ్మవార్లను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సుహాసినీ పూజ అత్యంత భక్తిశ్రద్ధలలో సాగింది. కాగా ఒకే సారి 10 వేల మంది సీ్త్రమూర్తులతో ఏకకాలంలో చేపట్టిన సుహాసినీ పూజకు వరల్డ్ గిన్నీస్ బుక్లో స్థానం లభించింది. ఈమేరకు గిన్నిస్ బుక్ అధికారి స్వపనీల్ఽ ధ్రువీకరణ పత్రాన్ని పీఠాధీశ్వరి రమ్యానంద భారతికి అందజేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, డాక్టర్ వెంకట్రామన్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మహిళలు, శ్రీశక్తిపీఠం సభ్యులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో చోరీలు
కలువాయి(సైదాపురం): మండలంలోని దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతుండడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పెన్న బద్వేల్ గ్రామంలోని శివాలయం, కామాక్షి అమ్మవారి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి సీసీ కెమెరాలు, తాళాలు ధ్వంసం చేసి అమ్మవారి రెండు మంగళ సూత్రాలు దోచుకెళ్లారని పూజారి సురేంద్రనాథ్ తెలిపారు. ఉదయాన్నే గుడిలోకి వెళ్లిన పూజారి చోరీ విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు నాగలాపురం: ద్విచక్ర వాహనాన్ని టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఓ వ్యకికి తీవ్ర గాయాలైన ఘటన పిచ్చాటూరు మండలంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తొట్టంబేడు మండలం బసవమ్మ గుంట ఎస్టీ కాలనీకి చెందిన దొరబాబు(31) ద్విచక్రవాహనంలో తన సొంత పనుల నిమిత్తం పిచ్చాటూరు బైపాస్ మీదుగా పుత్తూరు బయలు దేరాడు. ఆ సమయంలో పిచ్చాటూరు బైపాస్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చైన్నె మీదుగా వెళుతున్న టాటాఏస్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో స్కూటరిస్టు గాయపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొరబాబును ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టాటాఏస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిచ్చాటూరు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. విద్యుత్ స్టార్టర్ల చోరీ పెళ్లకూరు: మండలంలోని భీమవరం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు ఉన్న సుమారు 70 విద్యుత స్టార్టర్లును మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు సాగునీటి కోసం వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ స్టార్టర్లును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి వ్యక్తి మృతి పాకాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కె.వడ్డేపల్లి పంచాయతీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కే.వడ్డేపల్లి పంచాయతీ బావిలో బోరు మోటారు పని చేయకపోడంతో మెకానిక్ రాజారత్నంను పిలిపించారు. బావిలో మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మోటారుతో పాటు బావిలో మునిగిపోయి రాజరత్నం(39) మృతి చెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. పాకాల పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
జిల్లా సమాచారం
జిల్లాలో ప్రైవేటు కళాశాలలు 108 చదువుతున్న విద్యార్థులు 47,360 ఒక్కొక్కరికి ఏడాదికి అందాల్సిన సరాసరి మొత్తం రూ.18 వేలు పెండింగ్లో ఉన్నది (19 నెలలుగా) 7 విడతలు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు రూ. 345.35కోట్లు ఒక్కో కళాశాలకు రావాల్సి బకాయిలు రూ. 4.05కోట్లు 47 వేల మంది విద్యార్థులకు శాపం చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలి జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన దాదాపు 47,360 మంది విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, ఇంజినీరింగ్, పలు రకాల వైద్య విద్యలో యూజీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లిస్తేగాని హాల్టికెట్లు ఇవ్వమని బెదిరిస్తుండగా మరికొన్ని కళాశాలలు కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. తిరుపతి సిటీ: చంద్రబాబు ప్రభుత్వ పాపం.. పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ అందక జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో, చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ క్రమం తప్పకుండా అందిస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఒక విడత మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో 2025–26 విద్యా సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందన్న నమ్మకం లేక, సొంతంగా ఫీజులు చెల్లించలేక ఇంటర్తోనే చదువు నిలిపేసి ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదలు జిల్లాలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు కళాశాలలు 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజురీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవద్దని యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్తోనే చదువును నిలిపివేసినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో చదివే వారికి ఆప్షనే లేదు చంద్రబాబు ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమని అంటున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో యూజీ కోర్సులు చదువుతున్న సుమారు 6,500 మంది విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన ప్రతి విద్యార్థికీ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజురీయింబర్స్ మెంట్ అవకాశాన్ని కల్పించి ఆదుకున్నారు. బాబు పాపం.. విద్యార్థులకు శాపం! కళాశాలలు పీడిస్తున్నాయి మా అబ్బాయి చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ పేరొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫీజు చెల్లించాల్సిందేనని కళాశాల యాజమాన్యాలు పీడిస్తున్నాయి. ఇప్పటికే అప్పులు చేసి ఏడాది ఫీజు చెల్లించాం. ప్రభుత్వం ఇప్పటికై బకాయిలు విడుదల చేయాలి. లేదంటే హాల్టెక్కెట్ ఇచ్చే పరిస్థితి కనబడలేదు. – పూర్ణిమ, విద్యార్థి తల్లి, వెంకటగిరి బకాయిలు ఇవ్వకపోతే ఉద్యమమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బాబు సర్కారు విద్యా ర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6400 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాం. అయినా వారి తీరు మారలేదు. ఈ ఏడాది విద్యార్థులను హింసిస్తే విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి విద్యార్థుల జీవితాలతో ఆటలా? చంద్రబాబు సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ఆపాలి. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. ఎంతో మంది పేదల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఇందుకు తానే నిదర్శనం. విద్యార్థి నాయకుడిగా ఉండి కూడా ఫీజు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని ఎస్వీయూ అధికారులు తేల్చి చెప్పారు. – వినోద్, ఎస్ఎఫ్ఐ, ఎస్వీయూ కార్యదర్శి, తిరుపతి -
ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో చేపట్టిన పలు ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 5 వేల భజన మందిరాలు, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపమాకలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కరీంనగర్లోని పద్మావతీ ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం, అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం, కుప్పంలో నిర్మించనున్న 141 ఆలయాలు, నవీ ముంబైలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ముంబైలోని భాంద్రా, కర్ణాటకలోని బెల్గావిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పీఏసీ తదితర సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్కు ఏపీ టూరిజం బస్సుయాత్ర
తిరుపతి అన్నమయ్యసర్కిల్:జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా తిరుపతి నుంచి బస్సు ప్యాకేజీ టూర్ను నడుపుతున్నట్లు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజనల్ మేనేజర్ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులు ఉదయం 8 గంటలకు బయలుదేరి తిరిగి సాయంత్రం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. ఈ ప్యాకేజ్ టూర్లో నేలపట్టు, అటకాని తిప్ప, సూల్లూరు పేట ఫ్లెమింగో ఫెస్టివల్ సెంటర్, శ్రీ చెంగాళమ్మ ఆలయం, శ్రీసిటీ, బీవీ పాళెం ప్రదేశాలను సందర్శించవచ్చన్నారు. ఒకరికి రూ.550 (నాన్ ఏసీ రవాణా చార్జీలు, గైడ్ సౌకర్యంతో కలిపి) ఽటికెట్టు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ యాత్ర బస్సులు తిరుపతిలోని శ్రీనివాసం (టీటీడీ), విష్ణునివాసం (టీటీడీ) నుంచి బయలుదేరుతాయని, వివరాలకు 0877–2289123, 9848007033 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఎట్టకేలకు కాన్వికేషన్ నోటిఫికేషన్ విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు ఎట్టకేలకు 63 నుంచి 68వ కాన్వొకేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వర్సిటీ పరిధిలో 2018 నుంచి 2024 వరకు యూజీ, పీజీ, పీహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కాన్వొకేషన్ పట్టాకోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వచ్చేనెల 20వ తేదీలోపు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. -
8న ఎస్వీయూలో జాబ్ మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 8వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పలు ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళా కు హాజరవుతారని, ఆసక్తిగల ఎస్ఎస్స్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ, పలు ఫార్మశీ కో ర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఉపాధిహామీ పేరు మార్పు పోస్టర్ ఆవిష్కరణ తిరుపతి అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ పథకం పేరును జీ రామ్ జీ గా పేరు మార్పు చేసిన పోస్టర్ను సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్, డ్వామా పీడీ శ్రీనివాస ప్ర సాద్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఎం మన్మోహన్ సింగ్ పాలనలో పెట్టిన పేరును 20 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వంలో పీఎం నరేంద్రమోదీ ఆ పేరును మార్పు చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివా రం అర్ధరాత్రి వరకు 85,179 మంది స్వామివారి ని దర్శించుకున్నారు. 18,831 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శ నం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారి ని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. 25న తిరుచానూరులో రథసప్తమి చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నట్లు పే ర్కొన్నారు. కాగా సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు పద్మావతీ అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో అ మ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవ, వేదాశీర్వచనం తదితర సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 20వ తేదీ అమ్మవారి ఆలయంలో ఉదయం 6.30 నుంచి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో రోజు తిరుపతి అర్బన్: ఒక్కొక్క నియోజకవర్గానికి ఒ క్కొక్క రోజు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ శిబిరాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవా రం తెలిపారు. ముందుగా జిల్లాలో ఈ నెల 8వ తేదీ(గురువారం) చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ శిబిరం ఉంటుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలకు చెందిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహి స్తున్నామని వెల్లడించారు. అలాగే వారానికి ఒక్క నియోజకవర్గం చొప్పున అన్నీ నియోజకవర్గాకు రెవెన్యూ క్లినిక్ శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గానికి నిర్వహిస్తామన్న సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి కలెక్టరేట్లోనే చెప్పిన తేదీల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయా మండల తహసీల్దా ర్లు, వీఆర్వోలు హాజరుకావాలని చెప్పారు. అలా గే కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు పా ల్గొంటారని తెలిపారు. అయితే కేవలం రెవెన్యూ సమస్యలపై మాత్రమే అర్జీలు స్వీకరణ, సమస్యల పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
వెంకటగిరి రూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు అటవీశాఖ రేంజర్ కె బుజ్జిబాబు పేర్కొన్నారు. వెంకటగిరి రూరల్ మండలంలోని కొండక్రింద ప్రాంతాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన మూడు ఎర్రచందనం మొద్దులు, ఒక దుంగను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వెంకటగిరిలోని అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వెలుగొండ కొండల పరిధిలోని డక్కిలి మండలం దేవుడువెల్లంపల్లి నుంచి వెంకటగిరి మండలం కుర్జాగుంట గ్రామం వరకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీసీ కండ్రిగ నూతిగుంట ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం రవాణాకు సిద్ధం చేస్తుండగా దాడులు చేశారు. ఆ సమయంలో నలుగురిని అరెస్టు చేసి, మూడు మొద్దులు, ఒక ఎర్రచందనం దుంగను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో వెంకటగిరి రూరల్ మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన తూపిలి ఈశ్వరయ్య, బత్తల సుబ్రమణ్యం, వెంకటగిరి పట్టణం నెహ్రునగర్కు చెందిన అక్కల అశోక్, డక్కిలి మండలం శివగిరి గ్రామానికి చెందిన పుట్టం పోలయ్య అరెస్టు చేసినట్లు తెలిపారు. దాచెరువు గ్రామానికి చెందిన మురళి, శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తిరుపతిలోని ఆర్ఎస్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.లక్ష ఉందటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోలు ప్రతాప్రెడ్డి, విజయకుమార్, వరప్రసాద్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
’డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’కి 66 వినతులు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 66 వినతులు అందినట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ లైన్లు, ట్రాన్సఫార్మర్ల మార్పు, లో–ఓల్టేజ్ సమస్య, ట్రాన్సఫార్మర్ల సామర్థ్యం పెంపు, విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలున్నాయి. 66 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను తెలియజేయగా వాటిలో అనంతపురం జిల్లా నుంచి 25, తిరుపతి నుంచి 11, నెల్లూరు నుంచి 2, కర్నూలు నుంచి 2, కడప నుంచి 7, అన్నమయ్య నుంచి 5, నంద్యాల నుంచి 2, చిత్తూరు నుంచి 2, శ్రీసత్యసాయి సర్కిల్ నుంచి 10 వినతులు ఉన్నట్లు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె. రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్. జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం మురళీ కుమార్, ఎం ఉమాపతి, ఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు సమాధానం చెప్పండి
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 425 అర్జీలు వచ్చాయి. కలెక్టర్తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తనిఖీలు.. నీటి ద్రోహంపై నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కార్యక్రమం నేపథ్యంలో పెద్ద ఎత్తున సోమవారం కలెక్టరేట్కు పోలీసులు విచ్చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారులను ఏ సమస్యపై వచ్చారు..ఎంత మంది వచ్చారంటూ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దే పోలీసులు అడ్డుకుని విచారణ చేపట్టారు. దీంతో పలువురు అర్జీదారులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పిచండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తనకు పింఛన్ ఇప్పించాలని కేవీబీపురం మండలం బైబాసి కండ్రిగకు చెందిన వెంకటమ్మ ప్రాథేయపడింది. తన భర్త మృతి చెందాడంతో తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కన్నెమ్మ వద్ద ఉంటున్నానని చెప్పారు. తనకు ఓ చిన్న బిడ్డ కూడా ఉన్నాడని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వితంతువైన తనకు పింఛన్ ఇస్తే ఆ డబ్బులతో వైద్య ఖర్చులు చేయించుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. కరుణించండి తమ పాప మోక్షిత మానసిక రోగి కావడంతో తాము ఇక్కట్లు పడుతున్నామని, తమకు పింఛన్ ఇచ్చి, కరుణించాలని తిరుపతి జీవకోనకు చెందిన ఆ పాప తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం అర్జీ సమర్పించారు. -
ప్రభుత్వ భూమిని కాపాడండి
తిరుపతి రూరల్: ‘తమ గ్రామంలో రూ.30 కోట్లు విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడానికి అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమణదారులు పక్కాగా స్కెచ్ వేస్తున్నారని, వారి నుంచి ఆ విలువైన భూమిని కాపాడాలని చిగురువాడ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా చిగురువాడకు చెందిన తొమ్మిదో వార్డు సభ్యులు ముచ్చేలి కిరణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు చేరుకుని డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ను కలసి వినతిపత్రం సమర్పించారు. అలాగే తిరుపతి రూరల్ తహసీల్దార్ వద్దకు వెళ్లిన ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులకు కట్టబెట్టాలని చూస్తే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వ భూములను తప్పకుండా కాపాడుతామని, ఆక్రమణదారులు అందులోకి వెళ్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
అమరావతిలో పవిత్ర హారతులకు చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అమరావతిలో పవిత్ర హారతులిచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక పరిపాలనా భవనంలోని తన చాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గంగానది తీరంలోని కాశీ, ఉజ్జయిని నిర్వహిస్తున్న పవిత్ర హారతులతోపాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి, నివేదిక రూపొందించాలని కోరారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవనానుభూతిని పెంచుతుందని, టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామన్నారు. గౌహతి, బెల్గాంలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు. జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్ఏఅండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
చీకటి ఒప్పందం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ పోరాటం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు మిలాఖత్ గత ప్రభుత్వంలో జోరుగా పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పుంజుకుందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి అయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనే ముందుగా చూపుతో గొప్ప పథకాన్ని ఆయన పకడ్బందిగా చేపట్టారన్నారు. సాక్షాత్తు పోలీసుల వెంటబెట్టుకుని వైఎస్ జగన్ సర్కారు తమకు రావాల్సిన నీటిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజల నీటి కష్టాలను ఈ ప్రభుత్వం విస్మరించి, పక్కరాష్ట్ర సీఎంకు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నా.. చంద్రబాబు సర్కారు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అభినయ్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.7 వేల కోట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్ ఎత్తిపోతల పథకానికి కేటాయించారని ఆయన తెలిపారు. శ్రీశైలం, తెలుగుగంగ, నగరి–గాలేరు ప్రాజెక్టులకు నీళ్లు అందించాలని సంకల్పించారన్నారు. రాయలసీమకు జీవనాడిగా భావించిన పథకాన్ని చంద్రబాబు అడ్డుకోవడం దేనికి సంకేతమని మండిపడ్డారు. చంద్రగిరి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం తన శిష్యుడితో కలసి రాయలసీమతోపాటు గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి భూమన అభినయ్ మండిపడ్డారు. రాయలసీమకు తలమానికమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను అడ్డుకున్నానని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడంతో చంద్రబాబు సీమకు చేస్తున్న ద్రోహం బట్టబయలైందన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు, మాజీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుచానూరులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వందలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్కు చేరుకున్నారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం తెలిపారు. సైంధవుడిలా సీమ ప్రజలకు బాబు ద్రోహం అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు సైంధవుడిలా వ్యవహరిస్తూ సీమ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని భూమన అభినయ్ మండిపడ్డా రు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులైన గురు, శిష్యులిద్దరూ చేరి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే సంకల్పించారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా 90 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ వాడుకోవాల్సి ఉందని, అయితే చంద్ర బాబు పాలనలో కనీసం 12 వేల క్యూసెక్కుల నీటిని కూడా వాడుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ సీఎంలు చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 800 అడుగుల నీళ్లు ఉండగానే తెలంగాణలోని వారు దిండి, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాంతాలకు ఎత్తిపోతల నీటిని తరలించడం, కూటమి ప్రభుత్వం వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవలంభిస్తున్న తీరుతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, చిత్తూరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం రైతులు ఉత్తరాంధ్ర బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాజధాని పేరుతో చంద్రబాబు పేదల భూములను లాక్కొంటూ, మరోవైపు ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి రాయలసమీతో పాటు రాష్ట్రాన్ని ఎడారిగా మార్చుతున్నారని మండిపడ్డారు. భూమన అభినయ్ అక్రమ అరెస్టు రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రైతులు, ప్రజాసంఘాలతో భూమన అభినయ్ చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో అడ్డుకుంది. భూమన అభియన్తో పాటు సుమారు 29 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి, తిరుచానూరు పోలీసు స్టేషన్కు తరలించారు. సుమారు 4 గంటల పాటు పోలీసు స్టేషన్లో నిర్భధించారు. దీంతో నేతలు స్టేషన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూమన అభినయ్తో పాటు 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపై సొంత పూచీకత్తుతో సాయంత్రం 3.30 గంటలకు విడుదల చేశారు.‘సీఎం చంద్రబాబు స్వార్థం.. శిష్యుడితో చీకటి ఒప్పందం.. తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు..అయినా స్పందించని బాబు సర్కారు.. ఫలితం సీమ ఎత్తిపోతల పథకానికి అడ్డంకి.. రాయలసీమతోపాటు కోస్తాలో రెండు జిల్లాలకు తప్పని నీటి కష్టాలు..రాష్ట్రానికి తీరని అన్యాయం’ జరిగిందని వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ప్రజాగ్రహం తప్పదు రాయలసీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు, ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అభినయ్ స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే వ్యక్తి, తన శిష్యుడిని ఎదు రించలేక ప్రాజెక్టులను తెలంగాణకు నీటి పథకం కట్టబెట్టడమేనా? 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని నిలదీశారు. రాయలసీమను నీటితో సస్యశ్యామ లం చేయడం చేతకాని ఈ సీఎం, రాక్షసుడిలా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, తమకు రావాల్సిన నీటిని తీసుకురాకుండా, సీమ ప్రజలను మోసం చేస్తే ప్రజా సంఘాలతో కలసి వైఎస్సార్సీపీ పోరును మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
రేవంత్రెడ్డిపై పన్నీరు.. సీమ వాసులకు కన్నీరు
తిరుపతి మంగళం : తన శిష్యుడు రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసం రేవంత్రెడ్డిపై పన్నీరు.. రాయలసీమ వాసులకు కన్నీరు మిగిల్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ఎంత దుర్మార్గంగా ఉందో.. రాయలసీమ వాసులంతా ఆలోచించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కోరారు. రాయలసీమ వాసులకు చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసన సభలో సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబు దయవల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని చెప్పారన్నారు. ఆ పలుకులతో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైయిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనకు అనుకూలమైన, తన శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమని రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టారన్నారు. చంద్రబాబు రేవంత్రెడ్డితో చేస్తున్న చెలిమి రాయలసీమను తాకట్టు పెట్టేలా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ వాసుల కడగండ్లు తీర్చాలన్న సదాశయంతో రూ.4వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి, నిత్యం టీఎంసీ నీళ్లతో రాయలసీమవాసుల పొలాలను తడపాలన్న గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమని రాయలసీమను తాకట్టుపెట్టడం వంటి ఘోరం మరొకటి లేదన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈరోజు పతాక శీర్షికలో ఒక వ్యాసం రాసిందన్నారు. ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్రెడ్డే ఎత్తిపోతల పథకానికి ద్రోహం చేశారని రాశారన్నారు. ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మార్చి వేసిన చందంగా ఆ చెలికత్తె పత్రిక వ్యాసముందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏమీ తెలియకపోయినా ఆ చెలికత్తె పత్రిక తన భుజాలపైకి ఎత్తుకుని వ్యాసం రాసిందన్నారు. సీమ వాసి అయిన చంద్రబాబు రాయలసీమకు ఒక మంచిపని చేసిన పాపానపోలేదని మండిపడ్డారు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 1984–85 సంవత్సరాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వీరోచిత పోరాటాలతోనే పలు ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గాలేరు–నగిరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయంటే వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని అన్నారు. ఆ నాడు రాజశేఖరరెడ్డి లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీవ్రమైన నష్టం జరిగి ఉండేదన్నారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమకు మరింతగా రాయలసీమ వాసుల కడకండ్లను తీర్చాలన్న గొప్ప ఆలోచనలతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఆ చెలికత్తె పత్రిక జగన్మోహన్రెడ్డి ఏమాత్రం ప్రయత్నం చేయలేదనంటూ వ్యాసాలు రాసిందని మండిపడ్డారు. ఇక రాయలసీమ వాసులెరూ కూడా మేధావులైనా, కార్మికులైనా, కర్షకులైనా ఉపేక్షించి మౌనంగా ఉండే ప్రసక్తేలేదన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమకు చేస్తున్న అన్యాయంపై రాయలసీమ వాసులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాన్ని మనమంతా తిరిగి సాధించుకోవడం కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు. -
గొలుసు చోరీ
పుల్లంపేట: మండలకేంద్రంలో నడిచి వెళుతున్న మహిళమెడలో గొలుసు ఓ యువకుడు లాక్కొ ని పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. రాజంపేట మండలం మందరం హరిజనవాడకు చెందిన సిగమాల అన్నపూర్ణమ్మ నెలక్రితం కువైట్ నుంచి వచ్చింది. ఈ క్రమంలో మండలంలోని రామక్కపల్లె హరిజనవాడలో ఉన్న తన అక్క ఇంటికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం తన అక్కతో కలిసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి వస్తుండగా పుల్లంగేరు పాతబ్రిడ్జి దాటి గ్రామంలోకి రాగానే ముసుగు ధరించిన యువకుడు బైక్పై వచ్చి మహిళమెడలోని 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. 10 మంది పందెంరాయుళ్ల అరెస్టు బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కంచనపుత్తూరులో ఆదివారం రాత్రి కోడి పందెం ఆడుతున్న 10 మందిని ఎస్ఐ హరిప్రసాద్, సిబ్బందితో కలసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 27,010 నగదు, రెండు కోళ్లును స్వాధీనం చేసు కున్నారు. పలువురు పరారయ్యాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామని, కోడి పందెలు, పేకాట తదితర జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారు డ్రైవర్కు జైలు తిరుపతి లీగల్: కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన కేసులో తిరుపతి, నెహ్రూనగర్ కు చెందిన కారు డ్రైవర్ ఎం.కిరణ్ కుమార్ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు ఏపీపీ జయ శేఖర్ కథనం మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులో 2018 ఏప్రిల్ 9వ తేదీ నిందితుడు కిరణ్ కుమార్ కారును అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ కంట్రోల్ తప్పి శ్రీ వినా యక స్వామి దేవాలయం వద్ద రోడ్డుకు ఎడమ పక్కన కారు ఆపి దిగివున్న తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, సులగిరి తాలూకా, కల్లుకురి గ్రామానికి చెందిన ఎం. మునికృష్ణప్ప, ఆయన కుమారుడు కృష్ణప్పను ఢీకొన్నాడు. దీంతోపాటు వారి కారు ను ఢీకొన్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. టీటీడీ అంబులెన్స్ లో ఇద్దరిని రుయా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మునికృష్ణప్పను బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మ ధ్యలో 2018 ఏప్రిల్ 9వ తేదీన మృతి చెందాడు. దీనిపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు కార్ డ్రైవర్ ఎం కిరణ్ కుమార్, కారు యజమాని పి రత్న మ్మపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ దశలో రత్నమ్మ మృతి చెందారు. నేరం రుజువు కావడంతో కిరణ్ కుమార్ కు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : బంగారం చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓబులవారిపల్లి మండలం బొంతనవారిపల్లిలో గత డిసెంబర్ 31వ తేదీ రాత్రి విజయమ్మ, ఇందిరమ్మ తమ ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై దాడి చేసి 75 గ్రాముల బంగారు నగలు, 36 వేలు నగదు దో చుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరిని రేణిగుంట సమీ పంలో అరెస్టు చేశారు. సోమవారం తిరుపతి డీ ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో నిందితులను హాజరు పరిచారు. డీఎస్పీ మాట్లాడుతూ తక్కు వ సమయంలో చోరీ కేసును ఛేదించడం అభినందించ దగ్గ విషయమన్నారు. చోరీకి పాల్పడి న ముగ్గురు నిందితుల్లో డేరంగుల వంశీ, పుల్లగంటి గంగాధర్ను అరెస్టు చేసి వారివద్ద నుంచి బంగారు నగలు, నగదు, సెల్, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పుల్లగంటి ప్రభాకర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీ ఐ డీశ్రీనివాసులు, ఎస్ఐలు మహేష్, లక్ష్మీప్రసా ద్రెడ్డి, సిబ్బంది రమణ, కార్తీక్, రాఘవేంద్ర, అ నిల్కుమార్, మల్లికార్జునను అభినందించారు. -
కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక రూపొందించండి
● టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అంతర్గత ఆడిట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, లేనివి ఎన్ని, ఆధునీకరించినవి ఎన్ని, ప్రస్తుత స్థితిగతులు తదితర సమాచారం పూర్తిగా అందించాలన్నారు. అలాగే భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి, పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు. టీటీడీ ఆలయాల్లోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి, డాక్యుమెంటను రూపొందించాలన్నారు. అలాగే అన్ని విభాగాల్లోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎర్రచందనం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్:ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో నలుగురికి ఐదేళ్ల వంతున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పా రు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ కథనం మేరకు.. ఎర్ర వారిపాళెం పోలీసులకు అందిన సమాచారంతో 2018 ఫిబ్రవరి 24వ తేదీ ఎర్రవారి పాళెం మండలం, మాదరపల్లి సమీపంలోని అమ్మచెరువు గట్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చంద్రగిరి మండలం పట్టాభిరామపురానికి చెందిన భీమల శ్రీరాములు, చంద్రగిరి మండలం, రామిరెడ్డిగారిపల్లికి చెందిన పెండ్లి హరి, చిన్నగొట్టిగల్లు మండలం, బోడిరెడ్డిగారిపల్లికి చెందిన చుక్కల పాటి ఎర్రయ్య, చిన్నగొట్టిగల్లు మండలం, పాళెం గ్రామానికి చెందిన కానూరు శివ శేషాచలం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి నాలుగు దుంగలు తరలిస్తున్నట్టు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నలుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమరనారాయణ వాదించారు. ఫార్మేటివ్–3 పరీక్షలు ప్రారంభం తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–3 పరీక్షలు సోమ వారం నుంచి ప్రారంభమైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,939 పాఠశాలల్లో పీఏ–3 పరీక్షలు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,02,172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షల అనంతరం 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు. -
● సరస్సులో కొత్త విహంగాల విడిది ● చెరువు గట్ల సమీపంలో విహారం
సూళ్లూరుపేట: వరుణుడు కరుణించడంతో పులికాట్ సరస్సుతోపాటు ఆ సరస్సు సమీప ప్రాంతాల్లోని చెరువులకు పుష్కలంగా నీరు చేరడంతో ఏటా వచ్చే విదేశీ విహంగాలే కాకుండా కొత్తరకం వలస విహంగాలు కూడా దర్శనమిస్తున్నాయి. మామూలుగా అయితే ప్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, అనే రకాల బాతులు శీతాకాలంలో ఈ ప్రాంతంలో విడిది చేసి, సుమారు ఐదు నెలలు పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లిపోతుంటాయి. అయితే పులికాట్ సమీపంలోని పొలాలు, చెరువుల లోతట్టు ప్రాంతాల్లో మరికొన్ని జాతులు పక్షులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పక్షులు సంవృద్ధిగా నీరు చేరినపుడు మాత్రమే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా పులికాట్ సమీపంలోని కుదిరి చెరువు, అటకానితిప్ప వద్ద మంచినీటి గుంత, సరస్సుకు సమీపంలోని అటవీప్రాంతంలో ఇలాంటి పక్షులు కనిపిస్తున్నాయి. వాటిల్లో నీలిబొల్లికోడి, బ్లాక్ విల్లింగ్స్టన్, వైట్ విల్లింగ్స్టన్, పాము మెడ పక్షి, శాలవ, తోకబాతు, తెల్ల పరజలు, బూడిద కలర్ ఫ్లెమింగో, శ్వేతవర్ణ రంగు ఫ్లెమింగోలు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటక ప్రియులు మామూలుగా ఉండే పక్షులను కాకుండా కొత్తరంగా పక్షులును ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నీలిబొల్లికోడి ఈ కొత్తరకం పక్షి పులికాట్ సరస్సులో వేటాడదు. కేవలం కుదిరి, కారిజాత, చెరువుల సమీపంలోనే వుండి చేపలను వేటాడుతుంది. ఇది నీలిరంగు కలిగి కోడిలాగా ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది. శాలవ ఈ పక్షులు ఇక్కడే ఉంటాయి. ఎక్కువగా కోడి పిల్లలను వేటాడుతుంటాయి. ఈ శీతాకాలంలో మాత్రం పులికాట్ సరస్సు అంచున చిత్తడి చిత్తడిగా ఉండే ప్రాంతంలో తక్కువగా నీరు ఉండే ప్రాంతంలో ఉంటూ చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. వైట్ విల్లింగ్స్టన్ ఈ పక్షులు బహు అరుదుగా కనిపిస్తాయి. ఈ పక్షులు సరస్సు ఒడ్డున, చిత్తడిగా ఉన్న నేలల్లో, చెరువుల చెంతన ఉండి చేపలను వేటాడుతుంటాయి. ఈ పక్షులు ఈసారి అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. తెల్లపరజలు ఈ పక్షులు వలస వచ్చే పక్షులే. ఇవి బాతుల ఆకారంలో ఉండి పులికాట్ సరస్సులో ఈత ఆడుతూ చేపల్ని వేటాడుతూ ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ పక్షులు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. తోకబాతు ఈ పక్షులు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కూడా చిత్తడిగా వున్న ప్రాంతంలో, తక్కువగా నీళ్లున్న చోట గడ్డిమాటునటుండి చేపల్ని వేటాడతాయి. శ్వేతవర్ణ ఫ్లెమింగో శ్వేత వర్ణం కలిగిన ప్లెమింగో ఇది. ఈ పక్షులు హంసను పోలివుంటాయి. పులికాట్ సరస్సు అడుగు భాగంలో నాచును బయటకు తీసి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. కాని ఒక్కటే ఆహారవేటలో ఉండగా తీసిన చిత్రమిది. పాముమెడపక్షి పాముమెడ పక్షులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది విదేశీ వలస పక్షే. ఈ పక్షులు కూడా చిత్తడి నేల, చెరువుల సమీపంలో ఉండి చేపల్ని వేటాడుతుంటాయి. గడ్డిమాటున ఉన్నప్పుడు ఈ పక్షులను రైతులు చూసినప్పుడు పాము అనుకునే వారు. తీరా దగ్గరకు వెళితే గానీ పక్షి కనిపించదు. దీని మెడ పాము పడగలాగా ఉండడంతో దీన్ని పాముమెడ పక్షిగా పిలుస్తుంటారు. బూడిదరంగు ఫ్లెమింగో ఈ బూడిద రంగు ఫ్లెమింగోలు బహు అరుదుగా కనిపిస్తుంటాయి. మామూలుగా వచ్చే ఫ్లెమింగోలు తెలుపు, రోజ్ కలర్ కలిగి ఉంటాయి. ఇది మాత్రం బూడిద రంగులో ఉండి సరస్సులో నాచును మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. బ్లాక్ విల్లింగ్స్టన్ ఈ పక్షులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా చిత్తడిగా ఉన్న నేలలో ఉంటాయి. ఒంటికాలుతో ఎంతసేపైనా నిలబడగలవు. ఇది కూడా తుంగ గడ్డి మాటున ఉండి చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. ఎర్రకాళ్ల కొంగలు ఇవి పూర్తి విదేశీ వలస పక్షులైనప్పటికీ ఎప్పుడు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. ఈ శీతాకాలంలో ఈ పక్షులు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ఇవి ఆహారవేటలో చేసే విన్యాసాలు బహు ముచ్చటగా ఉంటాయి. ఇవి జపం చేస్తాయి. వాటి పొడవాటి ముక్కులతో పోట్లాడతాయి. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 88,662 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,417 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.05 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ముక్కంటి సేవలో థాయ్లాండ్ భక్తులుశ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం సుమారు 15 మంది థాయిలాండ్ భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ఆలయంలో శిల్పకళ అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. 8 నుంచి గ్రామీణ క్రీడలు సూళ్లూరుపేట : ఫ్లెమింగో ఫెస్టివల్–2026లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ క్రీడలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల క్రీడాకారులు 7వ తేదీలోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవాలనిసూచించారు. పురుషుల విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, మహిళల విభాగంలో త్రోబాల్, టెన్నీకాయిట్, ఖోఖో క్రీడల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఇతర వివరాల కోసం జూడో కోచ్ గోపి 90596 06346, ఫుట్బాల్ కోచ్ వినోద్ 99668 82029, వాలీబాల్ కోచ్ 91772 34298 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల : వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ట్రస్ట్ తరఫున ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి చెక్ అందజేశారు. -
వీఆర్కు చిట్టమూరు ఎస్ఐ
చిట్టమూరు : కోడి పందేలను అరికట్టడంలో విఫలమైన చిట్టమూరు ఎస్ఐ చిన బలరామయ్యను వీఆర్కు పంపించినట్లు సమాచారం. మండలంలోని దరఖాస్తు గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలా స్థావరంపై సాక్షి పత్రిలో ఆదివారం పడగ విప్పిన పందేలు శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ సుబ్బరాయుడు పూర్తి సమాచారం తెప్పించుకుని ఎస్ఐను వీఆర్కు పంపినట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులు నోరు విప్పకపోవడం గమనార్హం. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో మండలాలు పెరగడంతో అదే స్థాయిలో వినతుల సంఖ్య ఉండవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ గ్రీవెన్స్ నుంచి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలవారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు కలెక్టరేట్లో అర్జీలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలు, పుల్లంపేట, పెనగలూరు మండలాలకు చెందిన వారు తిరుపతి కలెక్టరేట్కు రానున్నారు. రాయలసీమకు మరణ శాసనం రాసిన చంద్రబాబు చిట్టమూరు: రాయలసీమ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి దారుణంగా వెన్నుపోటు పొడిచి, మరణశాసనం రాశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేథావుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్టమూరు మండలం, గునపాటిపాళెం గ్రామానికి చెందిన ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ తాను కోరితేనే చంద్రబాబు రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబుతో ఏకాంత సమావేశంలో తానుకోరగానే ఆయన ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అందుకనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని, నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమకు తాగు, సాగు నీరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తే, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ఆ ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని పేర్కొన్నారు. టీటీడీ నిధుల దుర్వినియోగం తగదు తిరుపతి అన్నమయ్యసర్కిల్: రాజకీయ పార్టీల అధినేతల కోరికలు, వారి ప్రయోజనాల కోసం టీటీడీ నిధులను దుర్వినియోగం చేయడం తగదని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడు కందారపు మురళి కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సిఫారసు మేరకు రూ.35 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. గతంలో అక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి కేటాయించలేదని తెలిపారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదని వెల్లడించారు. అయితే పవన్ కల్యాణ్ ఒత్తిడి మేరకు టీటీడీ రూ.35 కోట్లు కేటాయించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. నేతలను సంతోష పెట్టేందుకు టీటీడీని బలి చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. వేర్వేరు చోట్ల ‘పందేల’పై దాడి సైదాపురం : మండలంలోని తూర్పుపూండ్ల శివారులో ఆదివారం నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో దాడి చేశారు. 10మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.11,100 స్వాధీనం చేసుకున్నారు. దొరవారిసత్రం : మండలంలోని రామారెడ్డికండ్రిగ సమీపంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్లు, రెండు కోళ్లు, రూ.540 స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి రూరల్ : బాలాయపల్లె మండలం పిగిలాం ఎస్సీ కాలనీ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలపై ఎస్ఐ గోపి దాడి చేశారు. 16 మంది పందెంరాయుళ్లు, 10 ద్విక్ర వాహనాలు, రూ.8,190 నగదు, 8 సెల్ఫోన్లు, 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
సనాతనంపై అవగాహన అవసరం
నాయుడుపేట టౌన్: సనాతన హిందూ ధర్మంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి స్వరూపానందగిరిస్వామి కోరారు. ఆదివారం పట్టణంలోని గాంధీపార్కు వద్ద హిందూ సమ్మేళనం నిర్వహించారు. అంతకు ముందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. ముఖ్యఅతిథులుగా హాజరైన స్వరూపానందస్వామి, ఎన్హెచ్ఆర్సీ సభ్యులు విజయభారతి, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మావుడూరు సూర్యనారాయణ మూర్తి, బీజేపీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్రెడ్డి, స్థానిక నేతలు గాధిరెడ్డి గోపి, కనమర్లపూడి సురేంద్ర తదితరులు హిందూ సనాతన ధర్మంపై మాట్లాడారు. -
దొంగల ముఠా అరెస్ట్
పాకాల : మండలంలోని కోనప్పరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ముగ్గురు దొంగలు శనివారం రాత్రి చోరీకి యత్నించారు. స్థానికులు గుర్తించి వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగలను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆలయం గేట్లకు వేసిన తాళాలను పగలగొట్టడానికి ఉపయోగించిన గొడ్డలి, ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పాకాల మండలంలో వరుసగా జరుగుతున్న చోరీలకు వీరికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశ రుసుముపై ఆందోళన తిరుపతి మంగళం : తిరుపతిలోని అలిపిరి వద్ద నగరవనంలోకి వాకర్స్, వ్యాయామం చేసేవారు ప్రవేశ రుసుము చెల్లించాలని అటవీశాఖ అధికారులు ఆదేశించడంపై సీపీఎం నేతలు, వాకర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాయామం, వాకింగ్లతో ఆరోగ్యమంటూ రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి యోగా డేలు జరుపుతుంటే, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. తిరుపతిలోని పార్కుల్లో వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకు స్థానికులు వ్యాయామం చేసుకుంటారని తెలిపారు. 9గంటల తర్వాతే సందర్శకుల నుంచి ప్రవేశ రుసుము వసూలు చేస్తుంటారని వెల్లడించారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం ప్రవేశ రుసుము చెల్లిస్తేనే వాకర్లకు అనుమతిస్తామని చెప్పడం సరికాదని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో నేతలు వందాసి నాగరాజు, సినరేంద్ర, సాయిలక్ష్మి పాల్గొన్నారు. -
నిలకడగా కేజీబీవీ విద్యార్థిని ఆరోగ్యం
తడ: కేజీబీవీ కళాశాలలో శనివారం రాత్రి మిద్దైపె నుంచి పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంకటలక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధిని చికిత్సపొందుతోంది. వివరాలు.. వరదయ్యపాళెం మండలం, విఠలాయపాళెం గ్రామానికి చెందిన కాటయ్య కుమార్తె వెంకటలక్ష్మి తడ కేజీబీవీ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారంభోజనంచేసి స్టడీ అవర్లో కూర్చున్న బాలిక హఠాత్తుగా వెళ/్ల కళాశాల మిద్దైపె నుంచి కిందకు దూకినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. వెంకటలక్ష్మమ్మ సమస్య ఏంటో ఆమెతో మాట్లాడితేకానీ తెలిసే అవకాశం లేదు. ఘటన జరిగిన వెంటనే ఎంఈఓ మల్లికార్జునరావు హుటాహుటిన చేరుకుని విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు రుయా ఆస్పత్రిలో దవడ, మోకాళ్లకు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిసింది. 8 నుంచి అండర్–14 క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ :యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి అండర్–14 క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు సీడీసీఏ కార్యదర్శి సతీష్యాదవ్, ఉప కార్యదర్శి కోలా హరి మాట్లాడుతూ 15మందితో కూడిన జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె జోన్లకు సంబంధించి తిరుపతి కరకంబాడిరోడ్డులోని సీవీ క్రికెట్ నెట్స్లో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పోటీలుంటాయని వెల్లడించారు. 8వ తేదీన తిరుపతి జోన్, 9న చిత్తూరు జోన్, 10వ తేదీన మదనపల్లె జోన్కు పోటీలుంటాయని వివరించారు. 1–09–2011 తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని, ఆసక్తిగల వారు క్రీడా దుస్తులు, సొంత కిట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్తో రావాలని కోరారు. ఇతర వివరాలకు తిరుపతి జోన్కు సంబంధించి 88861 85559, 98491 22 005, చిత్తూరు జోన్–90144 40543, మదనపల్లె జోన్–90002 14966 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
తిరుపతి అర్బన్ : రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీఆర్ఎస్ఏ (ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్) జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో ఏపీఆర్ఎస్ఏ ఉద్యోగులకు కేటాయించిన భవనంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. చిత్తూరు శాఖ ప్రతినిధి ఎస్ఎం హుస్సేన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అయితే ఒక్కో పోస్టుకు ఒక్కో దరఖాస్తు మాత్రమే రావడంతో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఆ మేరకు కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. 2028 వరకు ఈ కమిటీ కొనసాగనుంది. కొత్త కమిటీ ఇదే.. ఏపీఆర్ఎస్ఏ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎస్.శివప్రసాద్ (తహసీల్దార్, కలెక్టరేట్), అసోసియేట్ అధ్యక్షుడిగా సి.జీవన్కుమార్ (డీటీ, తొట్టంబేడు), ఉపాధ్యక్షులుగా ఆర్.జయంత్, ఎం.అన్వర్ బాషా, పి.అజమత్తుల్లా ఖాన్, ఎస్.లావణ్య, కార్యదర్శిగా పి.గోపీనాథ్, సంఘటనా కార్యదర్శిగా యశ్వంత్ కుమార్, క్రీడా,సాంస్కతిక కార్యదర్శిగా టీసీ రాఘువర్మ, సహ కార్యదర్శులుగా అఖిల్ కుమార్, సురేంద్ర, శిరీషా, సురేంద్ర బాబు, రూప్చంద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రమేష్, సందీప్ కుమార్, హరి, రెడ్డి బాబు నాయక్, పవన్ కుమార్, నల్లయ్య, జగన్మోహన్ ఎన్నికయ్యారు. కొత్త కమిటికీ వీఆర్వోల సంఘం తిరుపతి డివిజన్ అధ్యక్షుడు చెంగల్రాయులు అభినందనలు తెలిపారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
వరదయ్యపాళెం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపి వేసి సీమ ద్రోహిగా చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష విమర్శించారు. తనపై గౌరవంతో చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలకు జరిగిన ద్రోహం ఏంటో రేవంత్ రెడ్డి ప్రసంగంలో తేటతెల్లమైందని వెల్లడించారు. సీమ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కృష్ణజలాలపై ఏపీ హక్కులను కాపాడాల్సిన సమయంలో రాయలసీమకు నీరు లేకుండా చేయడమే చంద్రబాబు అజెండా అని ఆరోపించారు. రేవంత్రెడ్డితో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందాలపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. -
ఉరకలేసిన ఉత్సాహం
చంద్రగిరి మండలంలోని చిన్నారామపురంలో ఆదివారం ఘనంగా పశువుల పండుగ నిర్వహించారు. కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జోరుగా దూసుకువస్తున్న ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. గిత్తలకు కట్టిన పలకను చేజిక్కించుకునేందుకు తలపడ్డారు. జల్లికట్టులో పలకలను సాధించిన వారు విజయగర్వంతో ఉప్పొంగారు. ఉరకలేసిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పరుష పందేలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. కోడెగిత్తలను అదుపు చేసేందుకు యత్నించిన యువతకు ప్రోత్సాహంగా కరతాళ ధ్వనులు చేశారు. ఎద్దులను అడ్డుకునే క్రమంలో కొందరు గాయపడ్డారు. వారిని హుటాహుటిన నారావారిపల్లె పీహెచ్సీకి తరలించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు యువకులు గ్రూపులుగా మారి ఘర్షణకు దిగడంతో స్వల్పంగా లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. – చంద్రగిరి -
టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా
● రెచ్చిపోతున్న అక్రమార్కులు ● డీసిల్టింగ్ మాటున సై‘ఖతం’ ● యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు ● నిత్యం వందలాది వాహనాలతో తరలింపు ● మా రాజ్యం.. మా ఇష్టం అంటూ బెదిరింపులు ● మామూళ్ల మత్తులో సహకరిస్తున్న అధికారులు చట్ట విరుద్ధంగా తవ్వకాలు డీసిల్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. డీసిల్టింగ్ అంటే నదిలో పేరుకున్న మట్టి, ఇసుక పొరను కూలీలతో మాత్రమే తవ్వి తీయించాలి. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ, ఇసుకాసురులు మాత్రం యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో నది భారీ గుంతలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే అనుమతులు లేని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. ముఖ్యంగా పెన్నేపల్లి, ఎగువచావలి, కప్పగుంటకండ్రిగ, పెరుమాళ్లపల్లి, పెళ్లకూరు, రావులపాడు, పుల్లూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి, మేనకూరు సెజ్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెళ్లకూరు : చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రకృతి వనరులను దోచేసుకుంటున్నారు. పచ్చమూక నేతృత్వంలో ఇసుక మాఫియా స్వర్ణముఖి నదిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తోంది. వరద నీరు ప్రవహిస్తున్నాలెక్క చేయకుండా నేరుగా నదిలోకి గ్రావెల్రోడ్డు ఏర్పాటు చేసుకుంది. యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తోంది. నీటి కష్టాలు తప్పవు మండలంలోని పదివేల ఎకరాలకు పైగా సాగునీరు, 20 గ్రామాల్లోని రక్షిత పథకాలకు తాగునీరు స్వర్ణముఖి నది నుంచి సరఫరా అవుతోంది. ఇక్కడి ప్రజలందరికి ఈ నది జీవనాధారం. నదికి ఇరువైపుల వ్యవసాయ విద్యుత్ మోటార్లు కింద 10వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నదిలోని వ్యవసాయ బోర్లు వద్ద కూడా యంత్రాలతో ఇసుక తోడేయడంతో బోర్లకు నీరు అందడం లేదని వాపోతున్నారు. ఇసుక స్మగ్లింగ్ను అరికట్టాల్సిన పోలీసులు సైతం మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో తమకు నీటి కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణముఖిలో లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్న హిటాచీలువరద ప్రవాహంలో సైతం ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యంపరిశీలించి చర్యలు స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్దం. నిబంధనలు మేరకు కూలీతోనే ఇసుక తీసి అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలి. డీసిల్టింగ్ పాయింట్ వద్ద యంత్రాలతో తవ్వకాలు చేపడుతుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఏడీ, మైనింగ్శాఖ -
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
రేణిగుంట : మారిషస్ అధ్యక్షుడు ఈ నెల 6న జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ మౌర్య పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అలసత్వం లేకుండా విధులు నిర్వర్తించాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీషా, డీఎస్పీలు రామకృష్ణాచారి, చంద్రశేఖర్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆలయాల భద్రత గాలికి
తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కి, పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. -
ఎరువు..బరువు
ఆరుగాలం కష్టించే అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవ‘సాయం’ ఇబ్బందిగా మారింది. ‘భరోసా’ లేక భారంగా తయారైంది. ఈ క్రమంలోనే సకాలంలో ఎరువులు అందక రైతులకు దిక్కుతోచనని దుస్థితి దాపురించింది. అవసరాలకు అనుగుణంగా యూరియా.. పురుగుమందులను సరఫరా చేయడంలో సర్కారు వైఫల్యం చెందింది. మరోవైపు పెరిగిన ధరలతో కర్షకులపై అదరపు భారం పడుతోంది. దీంతో పెట్టుబడులు అమాంతం అధికమవడంతో సేద్యం అగమ్యగోచరంగా మారింది. రబీ సీజన్లో సాగు వివరాలు వరి 2.35 లక్షల ఎకరాలు మామిడి 52 వేల ఎకరాలు కూరగాయలు 2.500 ఎకరాలు పచ్చిమిర్చి 750 ఎకరాలు తిరుపతి అర్బన్ : చంద్రబాబు పాలనలో రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ఎరువు కొరతతో ఇబ్బందులు పడుతుంటే...మరోవైపు ఎరువు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అలాగే పురుగుమందులు, గుళికల ధరలు ఆకాశానికి చేరాయి. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలు రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. రాయితీ వేరుశనగ విత్తనాలకు సర్కారు ఎగనామం పెట్టడంతో అన్నదాతల అవస్థ వర్ణనాతీతంగా మారింది. వేరుశనగ కాయలు ధరలు పెరిగాయనే సాకుతో సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పిల్లిపిత్తర, జనుములు, జీలగ విత్తనాలను సైతం రాయితీపై అరకొరగా విదల్చడంపై రైతులు మండిపడుతున్నారు. పది రోజులకు ఒక బస్తా! ఎరువుల ధరలు గత ఏడాదితో పోలిస్తే బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచేశారు. యూరియా అందుబాటులో లేక రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కేవలం వరి సాగు చేసిన వారికి మాత్రమే ఎకరాకు 3 బస్తాలు ఇస్తామని...అది కూడా పది రోజులకు ఒక బస్తా చొప్పున మాత్రమే అందిస్తామని టోకెన్లు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. పైగా, యూరియా వాడకం తగ్గించాలంటూ ప్రచారం చేస్తుండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వరి మాత్రమే యూరియా ఇస్తామని, ఇతర పంటలకు పంపిణీ చేయమని చెప్పడంపై ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు వైఖరితో పెట్టుబడి గణనీయంగా పెరిగిపోతోందని వాపోతున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే ఈకేవైసీ, ఈ–క్రాప్ అంటూ తక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటలను చివరకు దళారుల పాలు చేసుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు.ఒక వైపు కొరత.. మరోవైపు ధరల మోత -
కష్టాలు అన్నీఇన్నీ కావు
యూరియా కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. పైగా ఎరువు ధరలు పెంచేశారు. దీంతో పెట్టుబడి ఎక్కువ అయిపోతోంది. ప్రభుత్వం ఇలా పట్టించుకోకపోవడం సరికాదు. ధాన్యానికి అయినా సరైన గిట్టుబాటు ధర కల్పిస్తారా లేదా అనే అందోళన తప్పడం లేదు. చంద్రబాబు పాలనతో రైతుల కష్టా లు అన్నీ ఇన్నీ కావు. – రాము, రైతు, మదనంబేడు వేరుశనగకు ఎగనామం వేరుశనగ సబ్సిడీ విత్తనాలకు ఈ రబీ సీజన్లో పూర్తిగా ఎగనామం పెట్టారు. ఎరువుల ధరలు చూస్తే చుక్కలు చూపిసుతన్నాయి. ఇక యూరియా కష్టాలు తెలిసిందే. దీంతో ప్రతి రైతు ఆందోళనలోనే ఉన్నాడు. ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. – బాలయ్య రైతు, వరదయ్యపాళెం ధర పెంచేశారు ప్రతి ఎరువు ధరా పెంచేశారు. బస్తాపై రూ.100కు పైగా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీనిపై దుకాణం వాళ్లను ప్రశ్నిస్తే ఎరువులు లేవంటున్నారు. దీంతో చేసేది ఏమీ లేక వాళ్లు చెప్పిన ధర చెల్లించి తీసుకుపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. – చిన్న ముమ్మయ్య, రైతు, ఓజిలి గిట్టుబాటు కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారీ బారిన పడకుండా ప్రభుత్వమే ముందస్తు చర్యలు చేపట్టాలి. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎరువుల ధరలకు కుదేలైన అన్నదాతలను గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలి. – చంద్రశేఖర్రెడ్డి, రైతు, ఏఎం పురం ● -
రిపబ్లిక్ డే పరేడ్కు తిరుపతి విద్యార్థులు
తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జరగనున్న ప్రతిష్టాత్మ పరేడ్కు తిరుపతి ఎన్సీసీ 2ఏ ఆర్ అండ్ వీ రెజిమెంట్కు చెందిన ముగ్గురు ఎన్సీసీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్న బి ఆనంద్, టి త్రివేణితో పాటు వెటర్నరీ కళాశాలల్లో ఫైనల్ ఇయర్ బీవీఎస్సీ చదువుతున్న దినేష్ కుమార్ ఉన్నారు. హార్స్రైడింగ్లో పలు విభాగాలల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. హెల్త్కేర్లో బొప్పన సాయి హారికకు అవార్డు వరదయ్యపాళెం: ఆడియాలజీ, స్పీచ్, లాంగ్వేజ్, పాథాలజీలో తన బలమైన నేపథ్యం కలిగి స్పీచ్ థెరపిస్ట్గా తన వృత్తి జీవనాన్ని ప్రారంభించిన వరదయ్యపాళేనికి చెందిన బొప్పన సాయిహారిక జాతీయ స్థాయి హెల్త్కేర్లో టాప్ టెన్ స్థానంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల్లో ఆమెకు స్థానం లభించింది. బెంగళూరుకు చెందిన ఉమెన్ ఎంటర్ప్రేనియస్ మ్యాగ్జైన్ నిర్వహించిన అధ్యయనంలో ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రచిత శర్మ బొప్పన సాయి హారికకు అవార్డు అందజేసినట్లు ఆమె తెలిపారు. వరదయ్యపాళేనికి చెందిన బొప్పన రమేష్ ప్రథమ కుమార్తె బొప్పన సాయి హారిక బెంగళూరులో 8 సంవత్సరాల వయ స్సు గల పిల్లల కోసం పూర్తిస్థాయి చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అందించే విప్లవాత్మక సంస్థ త్రిశూల్ సంస్థ వ్యవస్థాపకురాలు, సంస్థ సీఈఓగా ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆమెకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో వరదయ్యపాళెంలో ప్రముఖులు, స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. -
మహిళా వర్సిటీలో 23మందికి ఉద్యోగోన్నతి
తిరుపతి రూరల్:మహిళా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(సీఏఎస్) కింద 23 మంది బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ వైస్ చాన్స లర్ ఆచార్య ఉమ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి ఉత్తర్వులను వైస్ చాన్స్లర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని అధ్యాపకులకు అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగోన్నతికి ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. బోధన, పరిశోధన, విద్యా సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పించినట్లు వీసీ ఉమ తెలిపారు. -
జూన్ 10 వరకు ధాన్యం కొనాలి
ఈ ఏడాది సాగు పెరిగింది. ఈ క్రమంలో జూన్ 10 వరకు వరి ధాన్యం కొనుగో లు చేయాలని కోరుతున్నాం. యూరియా కోసం ఇప్పటి వరకు పోరాటాలు చేశాం. ఇక ధాన్యం కొనుగోలు కోసం పోరాటాలు చేయా ల్సి వస్తుంది. ఫిబ్రవరిలో మొదలు పెట్టి మార్చిలో ముగించేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. – వేనాటి ప్రకాష్రెడ్డి, రైతు, గొల్లలమలుపు, తడ మండలం పాత ధరలే ఇవ్వడం భావ్యం కాదు ధాన్యానికి గత ఏడాది ఇచ్చిన ధరలే ఈ ఏడాది ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం భావ్యం కాదు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో కాస్తాకూస్తో పెంచేవారు. అలాగే పెంచితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే రైతుకు నష్టం వస్తుంది. ఈ అంశాన్ని అధికారులు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి కోరుతున్నాం. – హరినాద్ యాదవ్, రైతు, అమ్మవారిపట్టెడ, రేణిగుంట మండలం ఏపీ సీడ్స్ కొనుగోలు నిలుపుదల ఏటా లక్ష టన్నులకు పైగా ఏపీ సీడ్సీ వారు ధాన్యం కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది వారు నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు సంఖ్యతోపాటు ధాన్యం పెరుగుతుంది. ఆ ప్రభావంతో కొందరి రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తే మిగిలిన రైతులకు తీవ్రమైన నష్టం వస్తుంది. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – మహేష్, రైతు, తిప్పిరెడ్డిగారి పల్లి గ్రామం, చిన్నగొట్టిగల్లు మండలం కుంటిసాకులు చెప్పొద్దు ఈకేవైసీ చేయలేదు..పంట ఈ–క్రాప్ లేదు, మట్టి, రాళ్లు, చెత్త, జల్లు, రంగు మారింది, పరిపక్వం లేదు, కేళ్లు ఉన్నాయి, తేమ ఉంది అంటూ ధాన్యం కొనుగోలు చేయకుండా వదిలిపెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లోటుపాట్లు ఉంటే ముందే చెబితే ధాన్యం నాణ్యతగా ఉంచుతాం. అంతేతప్ప చిన్న చిన్న సమస్యలు చూపించి రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోం. – దయాకర్రెడ్డి, రైతు, కనమనంబేడు, బీఎన్ కండ్రిగ మండలం దోపిడి సిద్ధంగా ఉన్నారు కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకే ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే తుకాల్లో మోసాలు చేయడానికీ వారు సిద్ధమే. మరోవైపు రైస్ మిల్లర్లు మోసాలు చేయకుండా చూడాల్సి ఉంది. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే న్యాయం జరుగుతుంది. – రమేష్, గొల్లపాళెం గ్రామం రైతు, వాకాడు మండలం -
చెవిరెడ్డి జీవితంలో చీకటి తొలగాలి
తిరుపతి మంగళం : పది మందికి మంచి చేసే గుణం తప్ప చెడు చేసే తత్వం లేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని, ఆయన జీవితంలో చీకటి తొలగాలని మంగళంలోని రణధీర్పురం, సప్తగిరినగర్ పంచాయతీల వైఎస్సార్సీపీ ఇన్చార్జిలు లక్ష్మీనారాయణ, అశోక్రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ స్కామ్ పేరుతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ నిర్బంధానికి 200 రోజులు నిండాయి. ఈ నేపథ్యంలో మంగళం రణధీర్పురం, సప్తగిరినగర్ పంచాయతీల్లో శనివారం ఆ పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, అశోక్రెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జీవితంలో చీకటి తొలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని లిక్కర్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టులు చేయించి, జైళ్లల్లో పెట్టారని మండిపడ్డారు. లిక్కర్ వాసన తెలియని, మద్యమే కాదు మద్యం తాగినవాళ్లను కూడా ఇంట్లోకి అనుమతించని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టడం చంద్రబాబు నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందని, కడిగిన ముత్యంలా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా కార్యనిర్వాహక సభ్యురాలు వి.దీపశ్రీ, ఉపసర్పంచ్ మల్లెమొగ్గల ఉమాపతి, పంచాయతీల అధ్యక్షులు మహ్మద్ఖాసీమ్ బాషా, రజాక్, వార్డు సభ్యులు మురగేష్, సతీష్, మురళి, భాస్కర్యాదవ్, మహేశ్వరరెడ్డి, మణి, మంజుల, ధనమ్మ, పార్టీ నాయకులు మోహన్, భాస్కర్రెడ్డి, బీఆర్కే రమేష్, ఎంఎస్ఆర్, శరణ్, గిరిబాబు, రెడ్డెప్ప, వాసు తదితరులు పాల్గొన్నారు. -
సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే
తిరుపతి తుడా: దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కొనియాడారు. శనివారం మహిళా వర్సిటీ సమీపంలో బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజుల్లో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహిళా సాధికారిత కోసం కృషి చేశారన్నారు. సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే సీ్త్ర విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మ హిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సా మాజిక బాధ్యతగా ఆమె విశ్వసించారని చెప్పారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారని కొనాయాడారు. పూలే ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేసిందన్నారు. జగన్మోహన్రెడ్డి రాజకీయ సంకల్పానికి తానే ఉదాహరణ కావడం, తనకు లభించిన గౌరవమని మేయర్ శిరిషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సైనిక్, నవోదయ కోచింగ్లో అగ్రగామి విశ్వం
తిరుపతి సిటీ: సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల కోచింగ్లో విశ్వం విద్యాసంస్థ జాతీయస్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని ఎమ్మె ల్సీ పర్వతనేని చంద్రశేఖర్రెడ్డి కొనియాడా రు. శనివారం వరదరాజనగర్లోని విశ్వం టాలెంట్ స్కూల్లో ఈనెల 18వ తేదీన జరగనున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2026కు సంబంధించిన మాక్ టెస్ట్ బుక్లెట్ను ఆయన, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ వి శ్వనాథ్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష అనగానే తల్లిదండ్రులు, పిల్లలకు గుర్తు వచ్చే కోచింగ్ సెంటర్ కేవలం విశ్వమేనన్నారు. 2025 సైనిక్ స్కూల్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు మొత్తం 63 సీట్లు, నవోదయ ఫలితాల్లో 61 సీట్లు సాధించి విశ్వం విద్యా సంస్థలు విజయభేరి మోగించాయని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ విశ్వనాథ్రెడ్డి మాట్లాడు తూ గత 35 ఏళ్లలో సైనిక్ ఫలితాల్లో 66 రాష్ట్రస్థాయి ప్ర థమ ర్యాంకులతో పాటు మొత్తం 967 సీట్లు సాధించి కోచింగ్ రంగంలో రికార్డు సృష్టించామన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్తో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
ఈసారీ పాత ధరలే
ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ మేఘం కురిసింది.. అన్నదాత మురిశాడు.. కాడీ మేడీ పట్టి పొలం బాట పట్టాడు.. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ధాన్యం మొత్తం ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగొలు చేయాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఏపీ సీడ్స్ యాజమాన్యం ధాన్యం కొనుగోలుకు దూరం అయ్యింది. దీంతో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు పాత ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.తిరుపతి అర్బన్: ప్రభుత్వం నుంచి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే సాధారణంగా ఏటా పంట సాగు ఖర్చులు పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ పాలనలో రబీ సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యానికి ఏటా క్వింటాకు రూ.150 నుంచి రూ.200 ధర పెంచేది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ఈ రబీ సీజన్లోను గత ఏడాది ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధరలకే ఈ ఏడాది కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఏటా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. ఇంకోవైపు ఈ ఏడాది సాగు పెరగడంతో దిగుబడి అదనంగా 50 వేల టన్నులు ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది. అయితే తూతూ మంత్రంగా కొద్ది మోతాదులో ధాన్యం కొనుగోలు చేసి, మానుకుంటే కుదరదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా... ఈ ఏడాది శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ వారు ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో ఆ ధాన్యం కూడా అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తేనే రైతుల సమస్యలు తీరుతాయి. మరోవైపు గత ఏడాది ధరలే ఈ సారీ నిర్ణయించింది. అయితే పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది క్వింటాల్పై రూ.150 నుంచి రూ.200 పెంచుతారని రైతులు ఆశపడ్డారు. వారి నిరాశగా మిగిలింది. గత ఏడాదిలా.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 1.85 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. 5.50 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. అందులో శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ వారు వరి రకం ఆధారంగా క్వింటాల్కు రూ.2,500 నుంచి రూ.2,700 వరకు రైతులకు చెల్లించి.. 1.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389 వంతున, సాధారణ రకం ధాన్యానికి రూ.2,369 చొప్పున 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మిగిలిన 3.45 లక్షల టన్నుల ధాన్యంలో కొంత మేరకు రైతులు ఆహారం కోసం వినియోగించుకోగా, మిగిలిన ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు(క్వింటా రూ.1800 నుంచి రూ.1900 వరకు) విక్రయించారు. -
యథేచ్ఛగా అక్రమ చేపల వేట
రేణిగుంట: మండలంలోని పెద్ద చెరువుల్లో ఒకటైన వెంకటాపురం చెరువులో స్థానిక అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమ చేప వేటను కొనసాగిస్తున్నా మత్స్యశాఖాధికారలు కనీస చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకార శాఖ మూడేళ్ల కిందట చెరువుకు సొసైటీని ఏర్పాటు చేసింది. అందులో చైర్మన్తో పాటు 55 మంది సభ్యులు ఉన్నారు. గతంలో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వాని కి సంవత్సరానికి ఒకసారి నగదు చెల్లించి, చేపల వేట సాగించేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీని పక్కనపెట్టి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని పంచాయతీలోని అధికార పార్టీ నాయకులు గతంలో చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి రూ.లక్షలు గడించారు. అది చాలదన్నట్లు ప్రస్తుతం అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా, సొసైటీలోని సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేపలను యథేచ్ఛగా పట్టుకుని, రూ.లక్షలు దోచేస్తున్నారు. శనివారం పట్టపగలు పంచాయతీ కార్యాలయం ఎదురుగానే అక్రమ చేపల వేట సాగుతున్నా అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయస్థాయి జూడో పోటీలకు గురుకుల విద్యార్థి చిల్లకూరు: చిల్లకూరు బాలుర గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే యూ బాలు అనే విద్యార్థి అండర్–14 విభాగంలో జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు శనివారం ఆ గురుకులం పీడీ శ్రీరేష్ తెలిపారు. ఇటీవల జరిగిన 69వ స్కూల్ గేమ్స్ పెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా గురుకుల బాలుర పాఠశాలలో చదివే బాలు అనే విద్యార్థి అండర్ –14 విభాగంలో అనంతపురం జిల్లాలోని చిగిచెర్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాడని తెలిపారు. దీంతో బాలుడిని జాతీయ స్థాయిలో జరిగే జూడో పోటీలకు ఎంపిక చేశారన్నారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగే జూడో పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ క్రీడాకారుడిని పాఠశాల ప్రిన్సిపల్ అనిల్కుమార్, పీఈటీ రాజేంద్రలు అభినందించారు. 36వ బ్యాచ్కి వీడ్కోలు తిరుపతి అర్బన్: అలిపిరి డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కళాశాలలో 36వ బ్యాచ్కి శిక్షణ పూర్తి కావడంతో వారికి శిక్షణ పూర్తి చేసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలను డీఎం హరిబాబు శనివారం అందజేశారు. ఆ పత్రాలను వారు ఆర్టీఓ కార్యాలయంలో చూపితే వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ను జారీ చేశారు. అలాగే శనివారం 37వ బ్యాచ్కి స్వాగతం పలికారు. వారికి శిక్షణ మొదలుపెట్టారు. మరోవైపు వచ్చే సోమవారం నుంచి 38వ బ్యాచ్కి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో బ్యాచ్ల్ 16 మందికి 32 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో నిర్వహకుడు రాము పాల్గొన్నారు. -
ట్రైనింగ్ రద్దు చేసుకున్న కలెక్టర్
తిరుపతి అర్బన్: జిల్లాలో రెగ్యులర్ జాయింట్ కలెక్టర్ 100 రోజులుగా లేకపోవడంతో నెలకొన్న రెవెన్యూ సమస్యలను వివరిస్తూ సాక్షి దినపత్రికలో శనివారం ‘కలెక్టరేట్..పాలన సఫరేట్’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరి లో ట్రైనింగ్కు వెళ్లాల్సిన ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కలెక్టర్ శనివారం ఓ ప్రకటనలో ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఉండడంతో తమ ట్రై నింగ్ ప్రోగ్రామ్తోపాటు సీఎం, ఇతర ప్రముఖు ల పర్యటన ఉన్న నేపథ్యంలో తమ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోర్టును ఆశ్రయించిన వీసీ తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీసీ పదవి నుంచి ఆయన్ని అనర్హుడిగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. దీంతో బోర్డు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రేపటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు తిరుపతి అర్బన్: అలిపిరి రోడ్డులోని ఐయాన్ డిజిటల్ జోన్ కేంద్రంలో సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఏపీపీఎస్సీ కంప్యూటర్ డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా అధికారులకు ఏర్పాట్లుపై సూచనలు చేశారు. 1,188 మంది పరీక్షకు హజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షకు ఎలక్ట్రికల్ వస్తువుల అనుమతి లేదని వెల్లడించారు. ఇండిగో విమానం గాలిలో చక్కర్లు రేణిగుంట: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు శని వారం రాత్రి 7.20 గంటలకు చేరుకుని 8 గంటలకు తిరిగి వెళ్లాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా మళ్లీ టేక్ ఆఫ్ అయ్యింది. సుమా రు 20 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన అనంతరం 7.40 కి విమానం సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్లారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 83,032 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,272 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
అభిషేకం రద్దు .. అవస్థలమయం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయంలో శనివార అభిషేకాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో భక్తులు తిప్పలు పడ్డారు. శనివారం ఆరుద్ర నక్షత్రం ఉండడంతో శనీశ్వర అభిషేకాలు చేయించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆలయాధికారులు ముందస్తు సమాచారం లేకుండా శని అభిషేకాలు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తెలిసి ఉంటే భక్తులు శని అభిషేకం కోసం ప్రత్యేకంగా వచ్చి ఉండేవారు కాదని కానీ ఆలయాధికారుల సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆరుద్ర నక్షత్రంలో శని తైలాభిషేకం నిర్వహిస్తే మంచిదని విచ్చేసిన భక్తులకు నిరాశ ఎదురైంది. ఆలయంలో కనిపించని అలంకరణ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మదినమని..ఆ రోజున శివయ్యను దర్శించుకుంటే మహా శివరాత్రిరోజు శివయ్యను దర్శించకున్నంత పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకులు, తమ జన్మదినానికి ఊరంత ఫ్లెక్సీలు కట్టి, అరటి చెట్లు, మామిడి తోరణాలు కట్టి చేసుకుంటున్నారు. కానీ పరమశివుని జన్మదినం అయిన ఆరుద్ర నక్షత్రంలో గుడిలో అలంకరణలు వెలవెలబోయాయి. ఇంత ప్రత్యేకమైన రోజు బంతిపూలు నాలుగు కట్టి మమ అనిపించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బసవయ్యపాళెంలోనే 80 గోవులు మాయం
చెవిరెడ్డి జీవితంలో చీకటి తొలగాలి చెవిరెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన జీవితంలో చీకటి తొలగాలని కోరుతూ పార్టీ నేతలు కొవ్వొత్తులు ర్యాలీ చేశారు.పాడిఘోష! పాలిచ్చే గోవుల్ని తోలుకుపోయారు మాకు చాన్నాళ్లుగా గోవులున్నాయి. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గత మూడు నెలల్లో ఏడు ఆవుల్ని దొంగలు తోలుకెళ్లారు. మా గోవుల్ని ఏం చేశారో తెలియదు. ఎవరికై నా అమ్మేశారా? లేదా కసాయికి తరలించారా? అర్థం కావడం లేదు. దీంతో మేము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మా జీవనం కూడా కష్టంగా మారింది. – వళ్లియమ్మ, బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం దూడల్ని చూస్తే బాధేస్తోంది గోవులిచ్చే పాలే మాకు జీవనాధారం. వాటిపై నే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. దూడలకు పాలిచ్చే గోవుల్ని చోరీ చేశారు. మా దొడ్లో కట్టేసిన మూడు ఆవుల్ని తోలుకెళ్లారు. ఒక్కో ఆవు రూ.50 వేలకుపైగా ఉంటుంది. రోజుకు 20 లీటర్లపైనే పాలిచ్చేవి. దూడలకు పాలు లేక అలమటిస్తున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. – విజయమ్మ, బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం పాలు లేక దూడ చనిపోయింది పాలిచ్చే గోవుల్ని దొంగలు తోలుకెళ్లారు. పాలు లేక దూడ చనిపోయింది. పోత పాలు పట్టించినా ప్రయోజనం లేకుండా పోయింది. మా బాధ ఎవరికి చెప్పుకునేది. పోలీసలకు చెప్పినా పట్టించుకోలేదు. ఆవుల చోరీతో మేము మళ్లీ ఆవులను కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నాము. పశుసంవర్థక శాఖాధికారులైన పట్టించుకుని పాడి ఆవుల చోరీలను అరికట్టాలి. – పుష్ప, బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు మా గ్రామంలో 80కి పైగా గోవుల్ని దొంగలు చోరీ చేశారు. మా దొడ్లోని మూడు గోవుల్ని దొంగలు తోలుకుపోయారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు వెంటనే స్పందించి మా గ్రామానికి సంబంధించిన 80 గోవుల్ని తోలుకు పోయిన దొంగల్ని పట్టుకుని మాకు న్యాయం చేయాలి. –రమేష్, బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలంశ్రీకాళహస్తి /తొట్టంబేడు: జిల్లాలో గోవుల దొంగలు చెలరేగిపోతున్నారు. రోడ్లు, పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో గోవులు కనిపిస్తే చాలు మాటు వేసి చోరీ చేస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలతోపాటు తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు ప్రాంతాల్లో ఆవుల దొంగలు హల్చల్ చేస్తున్నారు. దొడ్లో కట్టి ఉంచిన ఆవులను సైతం రాత్రిపూట ఎవరూ లేని సమయంలో తాళ్లు విప్పి వ్యాన్లలో తరలించేస్తున్నారు. ఈ దొంగలు తెలుగు మాట్లాడడం లేదని తెలిసింది. హిందీ, కర్ణాటక భాషలో మాట్లాడుకుంటున్నట్టు బాధితులు చెబుతున్నారు. చూడుకట్టిన ఆవులు, బాగా బలంగా ఉన్న వాటినే మాయం చేస్తున్నట్టు వాపోతున్నారు. ఒక్కో గోవు సుమారు రూ.50 వేల పైనే ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఆరు నెలలుగా ఈ తంతు జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించినా.. కాపాడలేక! సాధారణంగా జిల్లాలోని తూర్పు మండలాల రైతులు ఎక్కువగా పశుపోషణపై ఆధారపడి జీవిస్తుంటారు. రూ.వేలు వెచ్చించి అధిక పాలు ఇచ్చే ఆవులను పెంచుతుంటారు. ఒంగోలు, పుంగనూరు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఒక్కో ఆవును రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. ఆపై వాటిని కంటిరెప్పలా కాపాడుకుంటుంటారు. విస్తారంగా పచ్చిక బయళ్లు, మేతబీడు భూములు ఉండడంతో ఉదయం తోలి, సాయంత్రం ఇంటికి తోలుకొస్తుంటారు. కానీ ఇటీవల దోమల బాధ ఎక్కువ కావడంతో దొడ్లలో కట్టేయడం లేదు. ఈ క్రమంలో ఆవులు రోడ్ల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో సేద తీరుతుంటాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు వాటికి మత్తు మందు ఇచ్చి చోరీ చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఒక్క బసవయ్యపాళెంలోనే 80 ఆవులు మాయం కాగా.. అందులో ఒక్కో ఆవు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈలెక్కన సుమారు రూ.30 లక్షలపైనే నష్టపోయినట్టు వాపోతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో గోవులు మిస్సవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.కోట్ల మేరకు నష్టపోతున్నట్టు బాధితులు ఆవేదన చెందుతున్నారు. గోవులను పోగొట్టుకున్న బాఽధితులు బసవయ్యపాళేనికి చెందిన ఓ రైతు దొడ్లో కట్టేసిన మూడు ఆవుల్ని చోరులు తోలుకెళ్లారు. ఒక్కో ఆవు రూ.50 వేలకుపైగా ఉంటుంది. రోజుకు 20 లీటర్లపైనే పాలిచ్చేవి. ఈ స్థితిలో ఆ రైతు మా గోవులను కాపాడేవారేరీ అని ఆవేదన చెందుతున్నాడు. ఇది ఆయనొక్కరి వేదనే కాదు.. జిల్లాలోని పాడి రైతులు బాధ. హిందీ, కన్నడ భాషలు మాట్లాడే చోరుల ముఠాలు రెక్కీ నిర్వహించి మరీ నిత్యం గోవులను చోరీ చేస్తున్నాయి. దీంతో జిల్లాలోని పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు జీవనాధారం కోల్పోతున్నారు. దొంగతనం ఎలా చేస్తారంటే? ముందుగా ఆవులు ఎక్కువగా ఎక్కడున్నాయి? మేత కోసం ఎక్కడికి వెళతాయి.. మళ్లీ తిరిగి రాత్రి సమయానికి ఎక్కడికి చేరుకుంటాయో గమనిస్తారు. ఆపై ఇద్దరు వ్యక్తులు బైక్లపై ఎస్కార్ట్గా ఆవులున్న ప్రదేశానికి చేరుకుని గమనిస్తారు. ఆపై వాటిని తస్కరించేందుకు అనుకూల పరిస్థితులను కనుక్కుంటారు. తర్వాత తమ ముఠాకు సమాచారం ఇచ్చి వ్యాన్లను రప్పిస్తారు. ఆపై అరటి పండ్లు, బ్రెడ్డు, బన్ను, గులాబ్జామ్ లాంటి ఆహార పదార్థాల్లో మాత్రల రూపంలో మత్తు మందు కలిపి తిపినిస్తారు. ఆపై గోవులు మత్తులోకి జారుకున్నాక ముందర కాళ్లు వ్యాన్లోకి ఎక్కించి ఆపై ఓ యంత్రం ద్వారా గోవును మొత్తం పైకి నెడుతారు. ఇలా గోవులు ఎక్కించాక సుదూర ప్రాంతాలకు తరలించి కళేబరాలకు విక్రయిస్తారు. -
యువకుడి గుండెతో యువతికి పునర్జన్మ
తిరుపతి తుడా: ఓ యువకుడి గుండెను యువతికి విజయవంతంగా అమర్చి పునర్జన్మను ప్రసాదించారు. టీటీడీ శ్రీపద్మావతి కిడ్స్ కార్డియాక్ కేర్ సెంటర్లో శనివారం 23వ గుండె మార్పిడిని వైద్యులు విజయవంతం చేశారు. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయినా 15 ఏళ్ల యువకుడి గుండెను కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతీకి గుండెను అమర్చారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలో వైద్యులు ఐదు గంటల పాటు శ్రమించి, గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఐదు గంటల పాటు శ్రమించిన వైద్యులు డిసెంబర్ 31న కర్నూలు రింగ్ రోడ్డు వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. యువకుడి అవయవాల వివరాలను అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేయించారు. కృష్ణా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి ప్రసవానంతర కార్డియోమయోపతి, గుండె వైఫల్యం సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. ఇటీవల ఆమె తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ కార్డియాక్ కేర్ సెంటర్లో వైద్యం కోసం వచ్చారు. గుండె పూర్తిగా వైఫల్యం చెందిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు తేల్చారు. ఈ క్రమంలో గుండె అవసరాన్ని ఆస్పత్రి వైద్యులు అవయవ దాన్లో నమోదు చేశారు. కర్నూలు యువకుడి గుండె అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించిన ఇక్కడి వైద్యులు సమాచారం అందించారు. పద్మావతి వైద్యుల బృందం కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి యువకుడి గుండెను సేకరించి, తిరుపతికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు శ్రమించిన వైద్యుల బృందం యువతికి విజయవంతంగా గుండెను అమర్చారు. గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు విమానాశ్రయంలో ప్రత్యేక విమానం టేకాఫ్ కాగా 4.15 గంటల కల్లా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసుల సహకారంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి 25 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. 1.15 గంటల్లో ఆస్పత్రి కి గుండె విజయవంతంగా చేర్చారు. అనంతరం వైద్యులు యువతికి గుండె మార్పిడి చేశారు. -
పడగ విప్పిన పందేలు
కోడికో లెక్క కట్టారు.. కత్తికో విలువ పెట్టారు.. ఆటకో పద్దు పెట్టి మరీ ఆడిస్తున్నారు.. రూ.లక్షలు మారుస్తూ అడ్డగోలుగా కథ నడుపుతున్నారు. పోలీసుల సహకారం ఆసరాగా చేసుకుని పందేలు నడిపిస్తుండడం వారికే చెల్లింది. స్థానిక పచ్చనేత పందేలను నడిపిస్తుండడం వారికే చెల్లింది. అడిగేవారు లేరన్న ధైర్యం.. తెలిసినా ఏం చేస్తారనే నిర్లక్ష్యం..కారణమేదైనా పందేలు కోడి పందేలు నిరంతరాయంగా సాగుతున్నాయి. సాక్షి టాస్క్పోర్సు: చిట్టమూరులో మూడు రోజులుగా చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన పందేలరాయుళ్లు రూ.లక్షల్లో పందేలు కాస్తూ కోడి పందాలు ఆడుతున్నా, కనీసం అటు వైపుగా పోలీసులు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. మూడు రోజులుగా ఓ స్థానిక ప్రజాప్రతినిధి, పోలీసులతో కుమ్మకై రూ.లక్షల్లో కోడి పందేలు, జూదం అడుకునేందుకు అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఆడిస్తున్నా తమకు కనీస సమాచారం లేదని చెప్పడం వెనక మర్మం ఏమిటో పోలీసులే చెప్పాలి. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి సూళ్లూరుపేట డివిజన్లోకి మార్చారు. దీంతో నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తున్నామని, తమ గ్రామానికి సమీపంలోని రిజర్వు ఫారెస్టును ఎంపిక చేసుకుని పెద్దస్థాయిలో కోడి పందేలు ఆడించేందుకు చిట్టమూరు మండలం దరఖాస్తు గ్రామానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధి సిద్ధం అయ్యారు. అయితే స్థానికంగా ఉండే పోలీసులతో కమీషన్ల విషయం మాట్లాడుకున్నారు. అంతే చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో కోడి పందేలు ఆడుకునే వారికి సమాచారం ఇవ్వడంతో వారు తమ కార్లలో రెక్కలు కట్టుకుని వాలి పోయారు. ఈలోగా జూదం ఆడించే వారు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అంతే పోలీసులకు పండగే అటు కోడి పందెం ఆడించే వారితో పాటుగా జూదం( డైమండ్ డబ్బా, మూడు ముక్కల ఆట) అడే వారిని చూసీ చూడనట్లు వదిలివేస్తుండడంతో ఒక్క రోజులోనే రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోడి పందేలు ఆడించేందుకు పోలీసులు ఇలా సహకారం అందించడం చూస్తుంటే చిన్నపాటి పందేలు వేసుకునే వారిపై కేసులు నమోదు చేస్తారని, అదే పెద్ద ఎత్తున పందేలు ఆడే వారిని మాత్రం చూసీ చూడనట్లు వదలి వేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందాలు, జూదం జరుగుతుందనే విషయాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు దృష్టికి తీసుకెళ్లగా తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పందేలు -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 65,225 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,106 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.


