Tirupati District News
-
తిరుమలలో చిన్నారి అపహరణ
తిరుమల : తిరుమలలో చిన్నారిని గుర్తు తెలియని వృద్ధురాలు తీసుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి తిరుమలలో హ్యాకర్గా పనిచేస్తున్నాడు. ఇతను తన కుమార్తె దీక్షిత(4) షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి ఉంచుకుని తను వ్యాపారం చూసుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో పాప ఆడుకుంటూ సాయంత్రం 5 గంటలకు భక్తురాలైన ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లింది. సదరు వృద్ధురాలు పాపను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై తండ్రి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా వృద్ధురాలు పాపను తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుపతికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి పాపకోసం గాలింపు చేపట్టారు. ఎవరైనా గుర్తిస్తే తిరుమల టూటౌన్ పీఎస్ నెం. 9440796769, 9440796772కు సమాచారం అందించాలని కోరారు. -
ఆగమోక్తంగా ధ్వజావరోహణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆగయోక్తంగా నిర్వహించారు. ఉదయం వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంతోత్సవ మండపంలో కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం సూర్యపుష్కరణి వద్దకు త్రిశూలానికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. నేడు పల్లకీ సేవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ధ్వజావరోహణం సందర్భంగా విశేష పూజలు -
నాణ్యత లోపం
డక్కిలి మండలంలో రూ.2.2 కోట్ల వరకు మంజూరు కాగా దాదాపు నిర్మాణాలు 90 శాతం పూర్తయ్యాయి. ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణాల్లో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు ఇషారాజ్యంగా వ్యవహరించారు. సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వేయలేదన్న విమర్శలున్నాయి. వాస్తవానికి నాణ్యత కలిగిన ఇసుకను వినియోగించాలి. అయితే స్థానికంగా వాగులు, వంకల్లో లభించే ఇసుకను వినియోగించారు. సీసీ రోడ్డు నిర్మాణాల్లో సిమెంట్, ఇసుక, కంకర 1:2:4 నిష్పత్తిలో వినియోగించాలి. అయితే ఇందుకు భిన్నంగా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. అవినీతి బట్టబయలు డక్కిలి మండలంలో సీసీ రోడ్డు నిర్మాణాల్లో జరిగిన అవినీతి మొత్తం క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీ అనంతరం బట్టబయలు అవుతోందని పలు గ్రామాల్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి క్వాలిటీ కంట్రోల్ తనిఖీ అనంతరమే 30 శాతం బిల్లు కాంట్రాక్టర్కు వస్తుంది. ఈలోగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీకి రాక ముందే 70 శాతం బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు తహతహలాడుతున్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
నారాయణవనం: మండలంలో రెండు వెర్వేరు దొంగతనాల కేసుల్లో నారాయణవనానికి చెందిన గోపి(26)ని అరెస్ట్ చేసి 44 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండితో పాటు రూ.80 వేలు రికవరీ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ముద్దాయిని, రికవీ సొత్తును, నగదును ప్రదర్శించారు. రవికుమార్ మాట్లాడుతూ మండలంలోని జగనన్న కాలనీలో తాళం వేసిన నవీన్ ప్రకాష్ ఇంట్లో ఫిబ్రవరి ఒకటవ తేదీన, నారాయణవనం తేరువీధిలో తాళం వేసిన అమవావతి ఇంట్లో ఫిబ్రవరి 17వ తేదీన దొంతనాలు జరిగినట్లు తెలిపారు. రూరల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ రాజశేఖర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పక్కా సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద దామును అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. స్వల్ప వ్యవధిలో కేసును ఛేదించిన సీఐ రవీంద్ర, ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ జయరాం నాయక్, క్రైమ్ సిబ్బంది దాము, మోహన్, హెచ్సీ రాజేష్, కానిస్టేబుళ్లు భాస్కర్, శ్రీనాఽథ్ను ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ అభినందించి, రివార్డులను అందజేశారు. ఎస్వీయూ డీడీఈ డైరెక్టర్గా రమేష్బాబు తిరుపతి సిటీ: ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ఇన్చార్జి డైరెక్టర్గా ఆచార్య ఊకా రమేష్ బాబు నియమితులయ్యారు. ఆయన సోమవారం వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నుంచి నియామక పత్రం అందుకున్నారు. రమేష్ బాబు మాట్లాడుతూ దూరవిద్య పరీక్షలను త్వరగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా 2024–25కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. డీడీఈ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను అధ్యాపకులు పీసీ వెంకటేశ్వర్లు, ఎన్సీ రాయుడు, కిశోర్, ప్రయాగ, కోఆర్డినేటర్ హరికృష్ణ యాదవ్ అభినందించారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,592 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. టీటీడీకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల వితరణ తిరుమల: టీటీడీకి సోమవారం తిరుపతిలోని ఏఎంఆర్డీ బిల్డర్స్ ఎండీలు మారుతి నాయుడు, దేవేంద్ర నాయుడు రూ.2.28 లక్షల విలువైన రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వితరణ చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్లకు పూజలు చేసి డెప్యూటీ ఈవో లోకనాథంకు తాళాలు అందజేశారు. కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ /తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని హెచ్ఎంలు, టీచర్ల సాధారణ సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎస్ కుమార్ తెలిపారు. వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ జాబితాలను www.chittoor deo.com వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే డీడీవో సంతకంతో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటలలోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. టీచర్ పూర్తి పేరు, కేడర్, సీనియారిటీ జాబితాలోని తప్పిదాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఆధారాలతోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయాలన్నారు. గడువు తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించబోమని వెల్లడించారు. -
వేదాల అధ్యయనంతో మానసిక ప్రశాంతత
తిరుపతి సిటీ: వేదాంత శాస్త్రాల అధ్యయనంతో ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సులభంగా అధిగమించవచ్చని శ్రీపరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ గణపతిభట్ అభిప్రాయపడ్డారు. సోమవారం జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో జరుగుతున్న అంతర్జాతీయ శక్తి విశిష్టాద్వైతం సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.సంస్కృత భాషలోని ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ద్వైతవేదాంత విభాగాధ్యక్షులు నారాయణ, అధ్యాపకులు నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్షిండే పాల్గొన్నారు. -
రెడ్బుక్పై ఉన్న శ్రద్ధ.. మేనిఫెస్టోపై లేదా?
సత్యవేడు: రెడ్బుక్పై పెట్టిన శ్రద్ధ ఎల్లో మేనిఫెస్టోపై ఎందుకు పెట్టడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్జైలులో రిమాండ్లో ఉన్న నగిరి నియోజకవర్గ వైఎస్సార్సీసీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎప్పుడో ఐదేళ్లకు ముందు మాట్లాడారని, ఇప్పుడు మనోభావాలు దెబ్బతినాయని 311 కేసు పెట్టి ఆరోగ్యం సరిలేని పోసాని మురళీకృష్ణని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్మీట్లో మట్లాడితే దేశద్రోహం అవుతుందా.. అన్ని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ గురించి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎలా మాట్లాడారో అందరూ విన్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ వీళ్లపై కేసు పెడితే వీళ్లు బయటికి వస్తారా..? అన్ని ప్రశ్నించారు. నగిరిలో టిడీపీ కార్యకర్తలు వైఎస్పార్సీపీకి చెందిన దళిత యువకులపై దాడిచేసి, వారి బైకులను తగలబెట్టి మళ్లీ వారిపైనే కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి సీఐ, డీఎస్పీ వైఎస్సార్సీపీ దళిత నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు పెట్టి వారిని రిమాండ్కు పంపడం దారుణమన్నారు. ఎవరూ ఎదురు మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దొంగదారిన పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళు గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు చేస్తున్నారన్నారు. ఇదేగనుక జగన్మోహన్రెడ్డి చేసి ఉంటే ఒక్క టీడీపీ కార్యకర్త, జనసేక కార్యకర్త రాష్టంలో బతకగలిగే వారా..? అని ప్రశ్నించారు. మాజీ సింగిల్ విండో అధ్యక్షడు కేవీ.నిరంజన్రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ బొప్పన సోమశేఖర్, సర్పంచ్ రమేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మస్తాణి వైఎస్సార్సీపీ టీయూసీ చైర్మన్ గోవిందస్వామి, శ్రీనివాసులురెడ్డి, పళణి, రాబర్టు, సురేష్, నగరి నాయకులు రామ్ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్ కన్నెప్ప, కౌన్సిలర్ బీడీ భాస్కర్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షకు 572 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్–2 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్లో 28,322 మంది, ఒకేషనల్లో 1,033 మంది మొత్తం 29,335 మంది విహాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 572 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంగ్లిష్ పేపర్–1 ఉంటుందన్నారు. పకడ్బందీగా నేర నియంత్రణ తిరుపతి క్రైమ్: జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నేర నియంత్రణ కట్టడి చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో సాధించిన పురగతిని ఆయన వెల్లడించారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న 1,484 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్టు పేర్కొన్నారు. అలాగే 94.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే 2,222 మంది చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
విశాఖపట్నానికి శ్రీకాళహస్తి మెట్రో సర్వీసులు ● వాటి స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు ● వీటిల్లో టిక్కెట్ ధర రూ.70 ● లబోదిబో మంటున్న ప్రయాణికులు తిరుపతి అర్బన్: ఆల్ట్రాడీలక్స్ వద్దు.. మెట్రో సర్వీసులే ముద్దు అని ప్రయాణికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు 22 మెట్రో సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ పెద్దలు వీటిని దశల వారీగా విశాఖపట్నానికి తరలించేస్తున్నారు. అక్కడ వాటిని టౌన్ సర్వీసులుగా తిప్పేందుకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించేశారు. మిగిలిన వాటిని రెండు, మూడు దశల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. మెట్రో స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు మెట్రో స్థానంలో తిరుపతి డిపోలోని ఆల్ట్రా డీలక్స్లను శ్రీకాళహస్తి డిపోకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆరు సర్వీసులు తరలించారు. సాధారణంగా మెట్రో సర్వీసుల్లో టిక్కెట్ ధర రూ.55 ఉండగా.. అదే ఆల్ట్రాడీలక్స్లో రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లి రావడానికి రానుపోను రూ.140 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒకసారి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి పోయి రావాలంటే రూ.30 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మెట్రో సర్వీసులే మేలు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లడానికి మెట్రో సర్వీసులు ఎంతో సౌకర్యంగా ఉండేవి. వాటినే కొనసాగించాలని కోరుతున్నాం. ఆల్ట్రాడీలక్స్ల్లో డ్రైవర్లే టిక్కెట్లు కొడుతున్నారు. ఆయన దృష్టి డ్రైవింగ్పైనే కాకుండా టిక్కెట్లపై ఉంటోంది. ఇది చాలా ప్రమాదకరం. – రెడ్డెప్ప, ప్రయాణికుడు భారం తగ్గించాలి మెట్రో సర్వీసులను తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రద్దు చేసి... ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా రానుపోను రూ.30 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రయాణికులపై భారం తగ్గించాల్సి ఉంది. – వినోద్రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యవంతంగా ఆల్ట్రాడీలక్స్లు తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీ సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయ ని భావిస్తున్నాం. అందుకే ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించాం. ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్లను ఏర్పాటు చేశాం. మెట్రోతో పోల్చుకుంటే టిక్కెట్ ధరపై రూ.15 మాత్రమే అదనం. – నరసింహులు, జిల్లా ప్రజారవాణా అధికారి -
ధాన్యానికి ధరల్లేవు
● ప్రభుత్వ సాయమూ లేదు ● గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలన్నా అద్దె చెల్లించాల్సిందే ● అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు ● పట్టించుకోని అధికారులు, నేతలు సూళ్లూరుపేట: జిల్లాలో రబీ సీజన్ ముగింపు దశకు చేరింది. వరి ఒబ్బిళ్లు జోరందకున్నాయి. కానీ ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాల్లోనే రైతులు తెగనమ్మేస్తున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేవరకు ఏఎంసీ గోదాముల్లో నిల్వ చేసుకుందామంటే బస్తాకు రూ.3 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేది లేక రైతులు ఒకటికి సగానికి విక్రయిస్తున్నారు. గతంలో రుణాలు..ఇప్పుడు ఒట్టి చేతులు గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే రుణాలిచ్చేవారు. ఒక లాట్కి 150 బస్తాలు ధాన్యా న్ని నిల్వ చేసుకుంటే ధాన్యం మద్దతు ధరపై 75 శాతం రుణం కింద ఇచ్చేవారు. దీనికి మూడు నెలలు దాకా బాడుగ కట్టనవసరం లేదు. ఆ తరువాత నెలకు బస్తాకి ఒక్క రూపాయి లెక్కన అద్దె చెల్లించాల్సి ఉండేది. తీసుకున్న రుణానికి కూడా చాలా తక్కువ వడ్డీ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బస్తాకు రూ.3 లెక్కన అద్దె చెల్లించాల్సి వస్తోంది. అన్నీ కష్టాలే గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటే రుణాలు ఇచ్చేవారు. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారు. సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పరికరాలు అందజేసేవారు. కానీ ఇప్పుడు ఇవేవీ లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మిల్లర్లను రైతులపైకి వదిలి చోద్యం చూస్తున్నారు. నిల్వ చేసేదెక్కడ? తిరుపతి జిల్లా పరిధిలోని 34 మండలాలకుగాను 774 పంచాయతీల్లో 16 మార్కెటింగ్ కమిటీలున్నాయి. వీటి పరిధిలో 34,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు 37 గోదాములున్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో 2.07 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఎకరానికి సరాసరిన 30 బస్తాల దిగుబడి వచ్చినా 5 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇందులో ఇప్పటిదాకా 60 శాతం ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. మిగిలిన 40 శాతం ధాన్యాన్ని విక్రయించారు. ఈ నెలాఖరు దాకా కోతకు వచ్చే పంటలు కూడా ఉండడంతో మరికొంతమంది నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రుణాలిచ్చే పరిిస్థితి లేదు ప్రస్తుతం ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకునే రైతులకు రుణాలివ్వలేని పరిస్థితి ఉంది. రైతులే బస్తాకు మూడు రూపాయలు అద్దె చెల్లించి నిల్వ చేసుకోవాలి. గతంలో ఒక రైతుకు ఒక లాట్ మాత్రమే కేటాయించే వారం. ఇప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలను బట్టి ధాన్యం నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాము. – వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి, సూళ్లూరుపేట గతంలో రుణాలిచ్చేవారు వ్యవసాయ మార్కెట్ కమి టీ గోదాములో ధ్యానం నిల్వ చేసుకుంటే గతంలో 75 శాతం రుణం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బతుకు మాత్రం మారడం లేదు. చాలా బాధాకరం. – వాకాటి బాబురెడ్డి, గోపాల్రెడ్డిపాళెం -
పోలీస్ గ్రీవెన్స్కు 110 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 110 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పుస్తకోత్సవం ప్రారంభం తిరుపతి సిటీ:ఎస్వీయూ కేంద్రీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తకోత్సవం పేరుతో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సోమవారం వర్సిటీ వీసీ అప్పారావు పుస్తక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. పుస్తకం ఒక నేస్తం అని, ప్రస్తుతం పుస్తక పఠనం గణనీయంగా పడిపోవడం బాధాకరమైన అంశమన్నారు. కేంద్రీయ గ్రంథాలయాధిపతి ఆచార్య సురేష్బాబు మాట్లాడుతూ దేశవిదేశాలలో లభించే గ్రంథాలను ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. డీన్ ఆచార్య ఎన్సీ రాయుడు, అధ్యాపకులు డాక్టర్ రంగనాథ్, కిషోర్కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణపై రాయితీ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణపై గృహ వినియోగదారులకు 50 శాతం డిస్కౌంట్ ప్రభుత్వం ప్రకటించిందని ట్రాన్స్కో తిరుపతి, చిత్తూరు ఎస్ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. తిరుపతి జిల్లాలో 7.95 లక్షల మంది, చిత్తూరు జిల్లాలో దాదాపు 4.37 లక్షల మంది కలిపి మొత్తం 12.32 లక్షల మంది సర్వీసులను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. సాధారణ రోజుల్లో కిలో వాట్కు రూ.2 వేలు క్రమబద్ధీకరణ రుసుం చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1000 చెల్లిస్తే చాలన్నారు. జూన్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటిని ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా సంబంధిత విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రంలో చెల్లించవచ్చన్నారు. -
పారదర్శకంగా పది పరీక్షలు
మాట్లాడుతున్న ఆర్జేడీ శామ్యూల్తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కడప ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని కచ్చేపి స్టేడియంలో పది పరీక్షలపై ఆయన అధికారులతో సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశించారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ముందస్తు ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 164 పరీక్షాకేంద్రాల్లో రెగ్యులర్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 28,656 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. మార్చి 5, 6 తేదీల్లో సెట్–1, సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకుంటాయన్నారు. హాల్ టిక్కెట్లు మంగళవారం నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్పెట్టాలన్నారు. డీఈఓ కేవీఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
రేణిగుంట: ఏర్పేడు మండలం, పాగాలి సమీపంలోని రాక్మ్యాన్ పరిశ్రమ ప్రాంగణంలో సోమవారం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. లక్ష్యానికి తొలి అడుగు స్వర్ణాంధ్ర విజన్–2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లకా్ష్య్నికి ఇది తొలిఅడుగు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలిగించడంతోపాటు ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన పాల్గొన్నారు. -
సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లెలోని సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలకు యూజీసీ అటానమస్ హోదా (స్వయంప్రతిపత్తి) లభించిందని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ సెక్రటరీ వై.ఆనందరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1985లో రాయలసీమ ప్రాంతంలో పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో వై.కొండారెడ్డి, యం.వెంకట్రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలను ప్రారంభించినట్టు వివరించారు. గత 40 ఏళ్లుగా విద్యాసంస్థల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా కొత్త రకం కోర్సులను తెచ్చి విద్యార్థులను ఉన్నత స్థాయిలో స్థిరపడేలా చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు టెక్నికల్ విద్యను కూడా చేరువ చేయాలన్న ఉద్దేశంతో 2009లో సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలను స్థాపించినట్టు తెలిపారు. విద్యార్థులకు అన్నిరకాలు శిక్షణ అందించి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం సంపాధించుకునేలా చేయడం జరిగిందన్నారు. ఈ విద్యాసంవత్సరంలో న్యాక్ గుర్తింపు పొంది స్వయంప్రతిపత్తి హోదాను సాధించినట్టు వివరించారు. కళాశాల చైర్మన్ వై.కొండారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ‘మెగా’ నిర్లక్ష్యంపై కార్మికుల కన్నెర్ర ● రెండు నెలలుగా అందని వేతనాలు ● మెగా సంస్థ కార్యాలయ గేట్లు మూసి నిరసనకు దిగిన కార్మికులు శ్రీకాళహస్తి : మదనపల్లె–నాయుడుపేట ఆరు లేన్ల జాతీయ రహదారి విస్తరణ పేరిట పనులు చేపట్టిన మెగా సంస్థ అడగడుగునా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసిన ఆ సంస్థ వేతనాల విషయంలోనూ ఎగవేత ధోరణిని అవలంభిస్తోంది. మెగా సంస్థకు మ్యాన్ పవర్ను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్కు గత రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు సోమవారం శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న మెగా బేస్ క్యాంపు వద్ద గేట్లను మూసి నిరసన తెలియజేశారు. కనీసం సంక్రాంతికి కూడా తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో పండుగను కుటుంబంతో కలిసి జరుపుకో లేకపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు వెంటనే మంజూరయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మెగా పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన మెగా జీఎం మల్లికార్జున మంగళవారం సాయంత్రం లోపు జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఎంబీఏ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ తిరుపతి సిటీ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బజాజ్ ఫైన్ సర్వీస్ సంస్థ స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల ఎంబీఏ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్పై శిక్షణ ఇచ్చారు. కళాశాలలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముంబై వాల్చంద్ పీపుల్స్ ప్రాజెక్ట్ హెడ్ రష్మీ మన్చాని ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యం గురించి వివరించారు. ఉద్యోగాన్వేషణలో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు అడిని సందేహాలను నివృత్తి చేశారు. పలు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్వీసీఈ ప్రిన్సిపల్ సుధాకర్రెడ్డి, హెడ్ ప్రొఫెసర్ నీరజ, బజాజ్ ఫైన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇన్చార్జి రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: అర్జీలను తీసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 280 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపైనే 163 అర్జీలు ఉన్నాయి. సోమవారం కలెక్టరేట్లో క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు. రైతు సాధికారతి సమితి నేతృత్వంలో తాజా కూరగాయలను కలెక్టరేట్ వద్ద విక్రయించడానికి ఓ కౌంటర్ను ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చారు. మాటనిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమేనని ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ రవి పేర్కొన్నారు. అప్కాస్ను కొనసాగించాలని కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ నేతలు విచ్చేశారు. కనీస వేతనం రూ.32వేలు చేయాలని తెలిపారు. అప్కాస్ రద్దును విరమించుకోండి అప్కాస్ రద్దును విరమించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర డిమాండ్ చేశారు. ఆ మేరకు గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. మెస్ చార్జీలు పెంచండి బీసీ హాస్టల్లో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు యూ.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు. రక్షణ కల్పించండి బస్టాండ్ సమీపంలోని జయశ్యామ్ సినిమా హాల్ వద్ద ఆటో స్టాండ్ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపై కొందరు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆటోవాలాలు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా సీఐటీయూ నేతలు నిలిచారు. -
వాహన యజమానులూ జాగ్రత్త
● మైనర్లు వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా తిరుపతి క్రైం:వాహన యజమానులు ఇక జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే రహదారి నిబంధ నలు కఠినంగా అమలు చేసేందుకు రవాణా, పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ‘హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనా లు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నా యి. నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదు’ అంటూ పోలీస్, రవాణాశాఖ అధికారులపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఈ క్రమంలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. మైనర్లకు వాహనాలిస్తే భారీ జరిమానా గతంలో మైనర్లు వాహనాలు వాడితే పెద్ద వారికి శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు. అలాగే మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఫైన్లు ఇలా.. ● లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించే వారు. ఇప్పుడు దాన్ని రూ.5 వేలకు పెంచనున్నారు. ● హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, వెనుక వైపు కూర్చున్నా కూడా రూ.1000 జరిమానా. ● రెడ్ లైట్స్ ఉల్లంఘించి వాహనాలను నడిపితే రూ.500 ● అతివేగంగా వాహనాన్ని నడిపితే రూ.1000 ● రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపితే రూ.5000 ● డ్రంక్ అండ్ డ్రైవ్ గతంలో రూ.2 వేలుగా ఉన్న ఫైన్ను ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పెంచారు. ● రేసింగ్, స్పీడ్ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు ● హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ. వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. ● అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే రూ.10 వేలు ● ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టు బడితే రూ.1000. మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. ● ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు. నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నూతన రూల్స్ను పాటించాలి. – హర్షవర్ధన్రాజు, తిరుపతి జిల్లా ఎస్పీ -
మండలంలోని సీసీ రోడ్ల వివరాలు
పంచాయతీలు 27 గ్రామాలు 58మంజూరైన పనులు 59నిధులు రూ.2.8 కోట్లు ఇప్పటి వరకు పూర్తయిన పనులు 49చేపట్టాల్సిన పనులు 10ఇష్టానుసారంగా చేసిన పనులు 2రోడ్లపైనే రోడ్డు వేసిన సంఖ్య 2అనుమతి లేకుండా వేసిన రోడ్లు 2బిల్లులు చెల్లింపులు రూ.26 లక్షలు చెల్లించాల్సిన బిల్లులు రూ.75 లక్షలు పనులు దక్కించుకున్న కూటమి నేతల సంఖ్య 30 -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారి మార్గంలోని చిట్టమూరు మండం, బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ చిన్నబలరామయ్య వివరాల మేరకు.. బురదగల్లి కొత్తపాళెం పంచాయతీ, కుమ్మరిపాళెం గ్రామానికి చెందిన కన్నెబోయిన మారెయ్య(38) సోమవారం మోటార్ సైకిల్పై కొత్తగుంటకు వెళ్లి మన్నెమాలకు బయలు దేరాడు. బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు వద్ద ట్రాక్టర్ బయ్యవారికండ్రిగ రోడ్డు వైపు తిరుగుతుండగా అదుపుతప్పి మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారెయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని నాయుడుపేట వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
తడ:చైన్నెకి గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట పోలీస్స్టేషన్లో సీఐ మురళీకష్ణ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి బ్యాగులను తనిఖీ చేస్తే గంజాయి పట్టుబడినట్టు వివరించారు. దాడి లో ఎస్ఐ కొండపనాయుడు, సిబ్బంది ఉన్నారు. కడూరులో కార్గో ఎయిర్పోర్టు? తడ : శ్రీసిటీ పారిశ్రామికవాడ, మాంబట్టు, మేనకూరు ఏపీఐఐసీ సెజ్లతోపాటు షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అందుబాటుగా వరదయ్యపాళెం మండలం కడూరు వద్ద కార్గో ఎయిర్పోర్టు నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సుమారు 400 ఎకరాలను వరదయ్యపాళెం, సత్యవేడు, తడ మండలాల్లోని భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అటవీ భూములను విమానాశ్రయానికి కేటాయించేందుకు ఫారెస్ట్ శాఖ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తడ నుంచి శ్రీకాళహస్తి వెళ్లే రహదారి విస్తరణకు సైతం అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
రెచ్చిపోతున్న కూటమి నేతలు
● స్వర్ణముఖిలో యథేచ్ఛగా సై‘ఖతం’ ● యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వకం ● నదీమతల్లికి తప్పని గర్భశోకం ● రాత్రింబవళ్లు అక్రమంగా ఇసుక తరలింపు ● పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు రేణిగుంట/శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదిని ప్రదాన ఆదాయ వనరుగా కూటమి నేతలు మార్చేసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. స్వర్ణముఖిలోకి నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో పచ్చ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. నదిలో జేసీబీల సాయంతో ఇష్టారాజ్యంగా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. నదీతీరంలో గ్రామాల్లో తిష్ట వేసి ఇసుక అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే గతంలో ఇసుకాసురుల ధనదాహానికి ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలు రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన విషయం విధితమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుకాసురులు ముఠాగా మారి స్వర్ణముఖిలో సహజ వనరులను తోడేస్తున్నా, అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పోలీసులు మాత్రం అప్పుడప్పుడూ మొక్కుబడిగా ట్రాక్టర్లను స్వాధీనం చేసకుని చిన్నపాటి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల మాత్రం టీడీపీ ముఖ్య నేతకు విధేయంగా నడుచుకుంటున్నారు. ఆయన అనుచరులకు వంత పాడుతూ మాకేం కనపడలేదు.. మాకేం వినపడలేదు.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఇసుకాసురులకు అందించేస్తున్నారు. దీంతో సామాన్యులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వణికిపోతున్నారు.ఈ ప్రాంతాలే అడ్డా! రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, తూకివాకం, జీపాళెం, పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక తవ్వేసున్నారు. ఒక్కో చోటు నుంచి ప్రతి రోజూ సగటను 50 నుంచి 70 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. జీపాళెం సమీపంలో మూడు నెలలుగా టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఇసుకను రాత్రింబవళ్లు తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆయనకు రూ.1,400 కప్పం కట్టాల్సి ఉంటుంది. సదరు ముఖ్యనేత అనుచరుడికి ముడుపు చెల్లిస్తే ఇక ట్రాక్టర్ను ఎవరూ ఆపరు. దీంతో రోజుకు 100 ట్రాక్టర్లకు పైగా ఇక్కడ నుంచి పగటి పూట తరలిస్తున్నారు. అదే రాత్రి వేళల్లో జేసీబీలు పెట్టి లారీలలో లోడ్ చేసి చైన్నె, బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొట్రమంగళం నుంచి ఎక్కువగా తిరుపతికి, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు. నది వెంబడి ఉండే పంట పొలాలలో ఎలాంటి అనుమతులు లేకుండా 30 నుంచి 40 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేసి అమ్మేస్తున్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట, పెనుమల్లం, మునగలపాళెం, ఎండీ పుత్తూరు, కొత్తవీరాపురం గ్రామాల పరిధిలోని స్వర్ణముఖీ నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. శ్రీకాళహస్తి మండలం రామాపురం, రామలింగాపురం, వేడాం, చుక్కలనిడిగల్లు గ్రామాల నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలిపోతోంది. తొట్టంబేడు మండలం విరూపాక్షపురం, బసవయ్యపాళెం, కన్నలి, చోడవరం, కాసరంలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. -
భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానం, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశైల పీఠం జగద్గురు డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ, బెంగళూరుకు చెందిన అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థాన్ సంయుక్తంగా వర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం శక్తి విశిష్టాద్వైతం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శక్తి విశిష్టాద్వైతం మహత్వాన్ని ఆధునిక దార్శనికులకు అందించడం శుభపరిణామమన్నారు. సంస్కృత భాష ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాశీపీఠం జ్ఞానసింహాసనధీశులు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్ఎస్యూలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి శక్తి విశిష్టాద్వైతం గొప్పతనాన్ని తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇందులో సారాంశాన్ని గ్రహించి ఆధ్యాత్మిక తత్త్వ అన్వేషణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సదుస్సులో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, సతీష్, నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్షిండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెత్తనం నీదా.. నాదా!
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యం సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఆదివారం ఈ క్రమంలోనే పోలీసు.. రెవెన్యూ అధికారులను రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుని ముఖం చాటేశారు. సైదాపురం : మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసాపద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి తీరిపోవడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమలంలో ఆదివారం రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్కు చెందిన వ్యక్తులు తమకు అధికారపార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందని గ్రామస్తులను బెదిరించి తరిమేశారు. ప్రజాప్రతినిధి ఆగ్రహం మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు 8 మోటారుసైకిళ్లు, ఓ ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. తదనంతరం ఏం జరిగిందో కానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు వెంటనే తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్పై విచారణ చేపట్టారు. అనుమతులు ఎలా..? శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, నెల గడవక ముందే సదరు గనిలో 1.5లక్షల టన్నుల ఖనిజం తవ్వుకుని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. అది కూడా ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. గని వద్ద యంత్రం ఉన్న దృశ్యంగనిలో నీరు పంపింగ్ చేస్తున్న దృశ్యం శ్రీనివాసా పద్మావతి గని కోసం కూటమి నేతల ఘర్షణ సిండికేట్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు ముఖ్య నేత జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు మైనింగ్కు అనుమతి లేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గనిని పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్ మాత్రమే చేస్తున్నారు. ఖనిజం తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్కు లేదు. – రమాదేవి, తహసీల్దార్, సైదాపురం ఫిర్యాదు అందలేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. – క్రాంతికుమార్, ఎస్ఐ, సైదాపురం -
కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు
తిరుపతి మంగళం : ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ విధమైన సాయం చేయకూడదని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు చెప్పడం సిగ్గుచేటని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీల మధ్య పోటీ ఉండాలే తప్ప ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా పాలన సాగించాలన్నారు. కానీ చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో టీడీపీ నాయకులకే ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చావా? చంద్రబాబూ అని ప్రశ్నించారు. జగనన్న పాలనలో రూ.2.5లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పేదప్రజలకు అందించారని గుర్తుచేశారు. పేదలకు మంచి చేశారు కాబట్టే గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు జగనన్నకు వేశారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి సూపర్సిక్స్ హామీలు అమలు చేయకుండా సంపద సృష్టించలేకపోతున్నానంటూ మరోసారి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్లు రెడ్బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, సోషయల్ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అరాచకాలు, దౌర్జన్యాలను గ్రహిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం విమానంలో చేరుకున్న గుండెను అంబులెన్న్స్లో గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి పద్మావతి హృదయాలయానికి తరలించారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
వైభవం.. గిరి ప్రదక్షిణం
● ఘనంగా కొండచుట్టు మహోత్సవం – సమస్త దేవగణాలకు వీడ్కోలు పలికిన పార్వతీపరమేశ్వరులు ● ఎదురుసేవలో ఆదిదంపతులకు స్వాగతం పలికిన భక్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్ఞానప్రసూనానాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి కై లాస గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతా గణాలు, రుషులకు పార్వతీ పరమేశ్వరులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చప్పరాలపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. భేరివారి మండపం వద్ద భేరికులస్తులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావువీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కై లాసగిరికాలనీ, రాజీవ్నగర్కాలనీ మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. అంజూరు మండపంలో ఆదిదంపతులు కాసేపు సేదతీరారు. అనంతరం వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. రాత్రి ఆదిదంపతులను అశ్వ, సింహ వాహనాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. గిరిప్రదక్షిణ ఉభయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఉత్సవానికి ఉభయకర్తగా వ్యవహరించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు.కూటమి నేతల కోరల్లో చిక్కి స్వర్ణమ్మ విలవిల్లాడుతోంది. ఇష్టారాజ్యంగా జేసీబీలతో ఇసుక తవ్వేస్తుంటే గర్భశోకంతో కన్నీరుపెడుతోంది. తమ్ముళ్ల ధన దాహం తీర్చలేక కొట్టుమిట్టాడుతోంది. పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మౌనంగా రోదిస్తోంది. సహజంగా ఏర్పడిన మేటలు మాయమవుతుంటే చేసేదిలేక దిగాలు పడుతోంది. నిలువెత్తు గుంతలను చూసుకుంటూ కుమిలిపోతోంది. అక్రమార్జనే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఇసుకాసురుల వికటాట్టహాసంతో భయాందోళన చెందుతోంది. స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు -
రెచ్చిపోయిన మట్టి మాఫియా
రామచంద్రాపురం: మండలంలోని కమ్మపల్లెలో ఆదివారం మట్టి మాఫియా రెచ్చిపోయింది. స్థానిక సిద్ధేశ్వర ఎస్టీ కాలనీవాసులపై దాడికి తెగబడింది. వివరాలు.. రావిళ్ల వారిపల్లెలోని సర్వే నంబరు 233లో ధనలక్ష్మీ స్టోన్ క్రషర్ నిర్వాహకుడు సురేష్ రెడ్డి 2017లో క్వారీ నిర్వహణకు అధికారికంగా అనుమతులు పొందారు. గడువు ముగిసిన తర్వాత సురేష్ రెడ్డి తన భార్య గౌరి పేరు మీద అదే సర్వే నంబరులో నకిలీ స్కెచ్లను తయారు చేసుకుని అధికారుల ఆమోదం తీసుకున్నారు. డమ్మీ స్కెచ్లను ఆధారంగా చేసుకుని గనుల శాఖ అధికారులతో కుమ్మకై ్క నకిలీ అనుమతులతో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మట్టి తరలించే లారీలను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన వారిపై దాడి చేశారు. రామచంద్రాపురం పోలీసులు గ్రామానికి చేరుకుని మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను అక్కడ నుంచి పంపించేశారు. మట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని సురేష్ రెడ్డికి సూచించారు. దీంతో గ్రామస్తులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. దయాగుణంతో ‘దీక్ష’ తిరుపతి కల్చరల్ : నెలవంక దర్శనంతో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని, ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ దయాగుణం చాటాలని ప్రభుత్వ ఖాజా సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం కాద్రి పీఠంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసంలో ప్రతి క్షణం దివ్యమని, ప్రతి ఒక్కరూ అల్లాహ్ను స్మరిస్తూ ప్రార్థన చేయాలని కోరారు. మార్చి 2 నుంచి నిరంతరం 30 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించాలని సూచించారు. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉపవాస దీక్ష సంకల్పించి ప్రత్యేక ప్రార్థన(తాహజాత్) చేయడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష(ఇఫ్తార్)తో విరమించాలని తెలిపారు. ఏకాగ్రతతో ఖురాన్ గ్రంఽథం చదవాలని, లేదా వినాలని చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఒక్కటైన ‘జకాత్’ చేపట్టాలని, సమాజ శ్రేయస్సు కోసం ముస్లింలు దాన ధర్మాలు చేయాలని తెలిపారు. రాత్రి వేళ ‘తరావీ’ నమాజు తప్పక చదవాలని కోరారు. దేశ సమైక్యత, ప్రపంచ శాంతి, భద్రత కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు. 8 నుంచి తుడా టవర్స్ ఈ– వేలం తిరుపతి తుడా : తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్లోని రెసిడెన్షియల్ ప్లాట్లను ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ–వేలం వేయనున్నట్లు తుడా వైస్ చైర్మన్ మౌర్య తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రూ.345కోట్ల అంచనా వ్యయంతో జీప్లస్ 13 భవనం నిర్మిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు. 2026 ఏప్రిల్ నాటికి మొత్తం భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నివాస గృహాలకు సంబంధించి 2వ అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు డబుల్ బెడ్రూం ప్లాట్లు 46, త్రిబుల్బెడ్ రూమ్–152, నాలుగు బెడ్రూమ్ – 32 వెరసి మొత్తం 230 నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగేస్విమ్మింగ్ పూల్, జిమ్, షటిల్ కోర్టు, ల్యాండ్ స్కేపింగ్ పోడియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్ వంటి ఆధునిక సౌక్యరాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు ఈ–వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ్ట udaap.in.tudaotwerr.in వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. -
కారు ఢీకొని ఒకరి మృతి
– మరొకరికి గాయాలు గూడూరురూరల్ : మండలంలోని చెన్నూరు వద్ద ఆదివారం ఉదయం కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గ్రామంలోని కాపువీధి చెందిన అల్లూరు మురళీరెడ్డి(58), శీకిరెడ్డి రామ్మోహన్రెడ్డి ప్రతిరోజూ ఉదయం వాకింగ్కు వెళుతుంటారు. ఈ క్రమంలోనే వ్యాహ్యాళికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా వెంకటగిరి నుంచి గూడూరు వైపునకు వస్తున్న కారు ఢీకొంది. దీంతో మురళీరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన రామ్మోహన్రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార. మురళీరెడ్డి మృతితో చెన్నూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట సమీపంలోని మర్రిగుంట సర్కిల్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ప్రకాశం జిల్లా నుంచి వస్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని 108లో ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
10 నుంచి బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. 10న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల మధ్య చేపట్టే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం చేపడతారు. 11న సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుంది. 11, 12, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. 12, 13 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఊంజల్ సేవ చేపడతారు. 14న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. చెరువును పూడిస్తే సహించం తిరుపతి రూరల్ : మండలంలోని ఓటేరు పంచాయతీలో ఉన్న ఓటేరు చెరువును పూడిస్తే సహించే ప్రసక్తే లేదని స్థానికులు స్పష్టం చేశారు. ఆదివారం టిప్పర్లతో మట్టి తోలి చెరువును పూడ్చేందుకు యత్నించిన కబ్జాదారులను వారు అడ్డుకున్నారు. రూ.కోట్ల విలువైన చెరువు జోలికి వస్తే ఒప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో ఆక్రమణదారులు చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చంద్రగిరి : మండలంలోని ఎం.కొత్తపల్లి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు డ్రైవర్పై గ్రామస్తులు దాడి చేశారు. వివరాలు.. పాకాల నుంచి తిరుపతి వైపునకు ఆర్టీసీ బస్సు వస్తుండగా ముంగళిపట్టు హఠాత్తుగా రోడ్డుకు మధ్యకు ఓ ఆవు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా తప్పించేందుకు యత్నించినా బస్సు వెనుక భాగం ఆవుకు తగిలింది. ఈ ప్రమాదంలో ఆవు మృతి చెందింది. అయినప్పటికీ బస్సును నిలపకుండా డ్రైవరు వెళ్లిపోతుండగా గ్రామస్తులు వెంబడించారు. ఎం.కొత్తపల్లి వద్ద బస్సు ఆపి, డ్రైవరు మునిపై దాడి చేశారు. దీంతో డ్రైవరు ముని అపస్మారక స్థితికి చేరుకోగా 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉత్సాహంగా ఇంటర్జోన్ స్పోర్ట్స్ మీట్ తిరుపతి కల్చరల్: న్యూబాలాజీ కాలనీలోని భాష్యం సీవో క్యాంపస్లో భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాలలో విద్యార్థులకు ఇంటర్జోన్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి నారాయణాద్రి హాస్పిటల్ ఎండీ డాక్టర్ సునందకుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగాల్లో రాణిస్తూ ప్రతిభావంతులుగా ఎదగాలని తెలిపారు. అనంతరం నిర్వహించిన ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్వీయూ కళాశాల కామర్స్, మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ కె.జయచంద్రారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జ్ ఎల్.లక్ష్మణరావు, ప్రిన్సిపల్స్ శ్రీనివాసులు, నేతాజీ, బాలాజి, ఆంజనేయులు, బిందు మాధవి, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఈ వారంలోనైనా వేతనాలు అందేనా?
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి ఒక నెలలోనైనా ఒకటో తారీఖు వేతనం చూడలేదని వేతనజీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్వీయూ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వేతనాలు ఎప్పుడు పడతాయో తెలియని దయనీయస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకులకు గత మాసం వేతనలు నిచిపోయాయి. మార్చి 3వ తేదీ వస్తున్నా జనవరి, ఫిబ్రవరి మాసాల జీతాల కోసం అధ్యాపకులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ వారంలోనైనా రెండు నెలల వేతనాలు అందేనా.. గోవిందా అంటూ వర్సిటీలో ఏ ఇద్దరు ఉద్యోగులు తారసపడినా ఇదే చర్చ సాగుతోంది. అలాగే గత మాసం నాన్ టీచింగ్ స్టాఫ్ సమ్మె సైరన్ మోగిస్తున్నామని హెచ్చరించడంతో అధికారులు శాశ్వత ఉద్యోగులకు డెవలప్మెంట్ ఫండ్ నుంచి జీతాలు అందజేశారు. ఈ నెల ఎప్పటికి జీతం అందుతుందోనన్న అయోమయం ఉద్యోగుల్లో నెలకొంది. -
పవిత్రం.. రంజాన్ మాసం
నాయుడుపేటటౌన్ : రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. వేకువజామున సహారీ చేసిన తర్వాత సాయంత్రం వరకు అన్నపానీయాలు స్వీకరించకుండా కఠిన నియమాలను పాటిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేకంగా ఆష్ (గంజి) పంపిణీ చేస్తున్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన వారికి ఇఫ్తార్ సమయంలో అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ముస్లింలు మసీదుకు వచ్చేప్పుడు ఇఫ్తార్ విందు కోసం ఖర్జూరాలు, అరటి పండ్లు, తదితర తినుబండారాలను తీసుకువస్తున్నారు. సామూహికంగా ఉపవాస దీక్షలున్నవారికి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా మసీదుల వద్ద అందించే ఆష్ కోసం పెద్దసంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఆష్ను ఇంటికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సేవిస్తున్నారు. హిందువులు సైతం మసీదు వద్దకు వచ్చి ఆష్ స్వీకరించడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కొంతమంది మసీదుల వద్ద ఆష్ తయారు చేసేందుకు విరాళాలు సైతం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కఠిన ఉపవాస దీక్ష పాటిస్తూ చిత్తశుద్ధితో అల్లాహ్ను ప్రార్థిస్తే చక్కటి జీవిత గమనం పొందవచ్చని మౌలానాలు ప్రభోదిస్తున్నారు. ఈ మాసంలో ముస్లింలు వారి శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. భక్తిశ్రద్ధలతో ముస్లింల ఉపవాస దీక్షలు మసీదుల్లో నిత్యం ‘ఆష్’ పంపిణీ 200 ఏళ్లకు పైగా.. నాయుడుపేట పట్టణంలోని జామియా మసీదు (పెద్ద మసీదు)లో 200 ఏళ్లకు పైగా రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆష్ పంపిణీ జరుగుతోంది. వెంకటగిరి రాజాల పాలనలో అప్పటి సామంత రాజులుగా ఉన్న ఆర్కాట్ నవాబులు జామియా మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదులో ఉపవాస దీక్ష పాటిస్తున్న వారికి ఆష్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. – హాజీ రంతుల్లా సాహెబ్, జామియా మసీదు ముతవల్లి ఆరోగ్యానికి మంచిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు ఉండేవారు ఆష్ సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. ఉపవాస దీక్ష విరమణకు మొదటగా ఆష్ను తీసుకుంటే కోల్పోయిన శక్తిని పొందడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇబ్బంది ఉండదు. – పఠాన్ ఆరాఫత్ ఖాన్, నాయుడుపేట -
మహిళా వర్సిటీ విద్యార్థులకు అభినందనలు
నేటి నుంచి ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్తిరుపతి సిటీ: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ ఉద్యోగుల మధ్య క్రీడాస్పూర్తిని, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో తిరుపతి వేదికగా ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతోష్ నేతా వెల్లడించారు. ఆయన ఆదివారం తిరుపతి డివిజనల్ పోస్టాఫీసులో విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తిరుపతి మున్సిపల్ రోడ్డులోని స్మార్ట్ సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సోమవారం నుంచి 7వ తేదీ వరకు క్యారమ్స్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో 13 రాష్ట్రాల పోస్టల్ సర్కిల్స్ నుంచి 108 మంది పురుషులు, మహిళా ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. 7వ తేదీన జరిగే ఫైనల్లో విజేతలకు ట్రోఫీని అందజేస్తామని, ప్రతిభ చూపిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం టోర్నమెంట్ పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో తిరుపతి డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ బి.నరసప్ప, కర్నూల్ డివిజన్ ఏడీ వెంకటరెడ్డి, విజయవాడ సర్కిల్ డీఎస్వీఆర్ మూర్తి, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు. -
● చంద్రగిరిలో ఉద్యోగులు బరితెగించేశారా? ● డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నందుకే దోపిడీకి దిగారా? ● బాధితుల చేతుల్లో లంచావతారుల ఆడియో, వీడియో రికార్డులు? ● ముఖ్యమంత్రి ఇలాకాలో రాజ్యమేలుతున్న అవినీతి! ● టీడీపీ నేతల అక్రమాలపై సీఎంఓ ఆరా!
సాక్షి టాస్క్ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో పంచాయతీ అధికారి ఏసీబీకి పట్టుబడిన విషయం విధితమే. దీంతో అప్రమత్తమైన పోలీసు నిఘా వర్గాలు ఇక్కడి అవినీతి, అక్రమాలపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేసినట్టు సమాచారం. ప్రధానంగా తిరుపతి నగరానికి సమీపంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. తిరుపతి రూరల్ మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ , ఇనాం, మఠం భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టారని నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అక్రమార్కులతో కుమ్మకై ్క వాటాలు తీసుకుని నదులు, గుట్టలను తవ్వేస్తున్నా, ఇసుకను అమ్మేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా సీఎంఓకు చేరినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వచ్చే ప్రజల నుంచి ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి బహిరంగ వసూళ్లు చేయడంపై సీఎంఓ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ, జనసేన నేతలు తమ పార్టీల అధినేతల దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు తెలిసింది. ఎన్నడూ లేని విధంగా.. చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. దీనికి కారణం ఉద్యోగుల బదిలీల్లో భారీ ముడుపులు అందించడమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక నేతల అక్రమాలపై టీడీపీని ఓ బలమైన వర్గం ఇతర కూటమి నేతలతో కలసి అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి అనుకూల పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా.. వారిలో మార్పు రావడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్కు విన్నవించుకున్నట్టు తెలిసింది. డబ్బులిచ్చి వచ్చారు.. జైలుకు వెళుతున్నారు.. చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్యోగం చేయడానికి స్థానిక నేతలకు డబ్బు ఇచ్చి వచ్చిన ఉద్యోగులపై ఏసీబీ కన్నువేయడంతో ఒక్కొక్కరుగా జైలుకు వెళతారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. బదిలీల సమయంలో డబ్బులు తీసుకున్న పెద్ద మనుషులు ‘‘మీ సంపాదనలో ఎక్కడ సమస్య రాదు.. అన్నీ మేం చూసుకుంటాం’’.. అని భరోసా ఇచ్చినప్పటికీ ఏసీబీ దాడులతో ఉద్యోగుల్లో భయం పట్టుకున్నట్టు సమాచారం. ముడుపులు చెల్లించి పోస్టుల్లోకి వచ్చిన అధికారులు ఆ డబ్బు సంపాదించుకోవడానికి విచ్చలవిడిగా అవినీతికి తెర లేపారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా సొమ్ము ముట్టుజెప్పాల్సి వస్తోందనే ఆరోపణలు సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇలా బరితెగించి డబ్బులు వసూలు చేస్తుండడంతో కనిపించిన ప్రతి టీడీపీ నాయకుడిని ప్రజలు బహిరంగంగానే తిడుతుండడం గమనార్హం. -
ప్రసన్న వెంకన్న కల్యాణోత్సవంలో గందరగోళం
● వేదికపైకి ఎక్కిన ఆలయ సిబ్బంది పరివారం ● సిబ్బందితో వాగ్వాదానికి దిగిన భక్తులు రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహణ లోపంతో గందరగోళానికి దారి తీసింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవం జరిపారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభం కాగానే ఆలయ సిబ్బంది, వారి బంధు పరివారం వేదికపైకి ఎక్కారు. దీంతో స్వామి వారి కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు లేకుండా పోయింది. అసహనానికి గురైన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాత్రి స్వామివారి గరుడసేవ ఘనంగా నిర్వహించారు. -
రాక్మెన్ పరిశ్రమ పరిశీలన
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం, పంగూరు సమీపంలోని రాక్మెన్ కంపెనీలో ఈనెల 3వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైడ్రోజన్ ప్లాంట్ను వర్చువల్ఽ విధానంలో ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం ఎస్పీ హర్షవర్ధన్రాజు పరిశీలించారు. ప్లాంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఏర్పేడు సీఐ ఎస్.జయచంద్ర పాల్గొన్నారు. సూర్యుడిపై పరిశోధనలు సూళ్లూరుపేట: ఇస్రో 2023 సెప్టెంబర్ 2న పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సూర్యునిపై పరిశోధనలు చేస్తూ అత్యంత విలువైన సమాచారాన్ని సేకరిస్తోందని ఇస్రో తన వెబ్సైట్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. భారతదేశానికి మొట్టమొదటి సౌర ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్1 కావడం విశేషం. ఆదిత్య ఎల్1లో అమర్చిన పేలోడ్స్ ఒక సంచలనాత్మక పరిశోధనలు చేసిందని తెలియజేశారు. నియర్ ఆల్ట్రా వయెలెట్ బ్యాండ్ (ఎన్యూవీ) దిగువ సౌరవాతావరణంలో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లో సౌర మంట ‘కెర్నల్’ మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని చిత్రీకరించినట్టు పేర్కొన్నారు. -
జిల్లాకు మరో 50 విద్యుత్ బస్సులు
తిరుపతి అర్బన్: బస్సుల కండీషన్కు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) తిమ్మాడి చెంగల్రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడ నుంచి విచ్చేసిన ఆయన తిరుపతిలోని డీపీటీఓ కార్యాలయంలో డిపో మేనేజర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలతోపాటు అన్ని ప్రాంతాల్లో ప్రమాదాలకు తావులేకుండా ఆర్టీసీ సర్వీసుల కండీషన్పై ప్రతి డీఎం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో 750 విద్యుత్ సర్వీసులు కొత్తవి రానున్నాయని వెల్లడించారు. అందులో తిరుపతికి 50 సర్వీసులు కేటాయిస్తామన్నారు. మంగళం డిపో కేంద్రంగా కొత్తగా వచ్చే విద్యుత్ బస్సుల ఆపరేటింగ్ ఉంటుందని వివరించారు. మరోవైపు జిల్లాలో 11 ఆర్టీసీ డిపోల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీపీటీఓ నరసింహులు, పీఓ సహజాన్, ఏటీఎం డీఆర్ నాయుడు పాల్గొన్నారు. -
27వ రోజుకు చేరిన జూడాల నిరసన
తిరుపతి సిటీ: గౌరవవేతనం పెంచాలంటూ ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. రూ.7 వేల స్టైఫండ్తో నెలవారి ఖర్చులు ఎలా గడపాలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. గౌరవవేతనం పెంచే వరకు తాము సమ్మెను విరమించేది లేదని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి రూరల్: పింఛన్ల పంపిణీని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి రూరల్ మండలం, వేదాంతపురం గ్రామానికి చేరుకున్న ఆయన పంఛన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారా..? లేదా.. ? అని పరిశీలించారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,62,461 మంది పింఛన్లకు రూ.112.06 కోట్లు మంజూరైందని తెలిపారు. -
ఖద్దరు బేరం!
ఖాకీ పోస్టింగ్లకు.. ఇప్పటికీ పోలీసుల బదిలీలపై స్పష్టత కరువు ● ప్రజాప్రతినిధుల లెటర్ ఉంటే పోస్టింగ్ ● బేరసారాలు సాగిస్తున్న నేతలు ● కీలకమైన పోలీస్ స్టేషన్కు రూ.20 లక్షలకు పైగా డిమాండ్ ● ఆదాయవనరులున్న స్టేషన్లకు పోటాపోటీ తిరుపతి క్రైమ్: కూటమి ప్రభుత్వంఏర్పడి సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్నా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తమకు అనుకూలమైన స్థానాల కోసం ప్రజాప్రతినిధు ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. తిరుపతిలో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో బదిలీల ప్రక్రియ ముగిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ పలు పోస్టింగులు అటాచ్మెంట్ పైన నడుస్తున్నాయి. జిల్లా పరిధిలోనే అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్ అయిన ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా అటాచ్మెంట్ మీద నడుస్తోంది. ఇక్కడ పని చేస్తున్న సీఐని గత ఎస్పీ సుబ్బరాయుడు హయాంలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోలీస్ స్టేషన్ను వెస్ట్ సీఐకి అటాచ్మెంట్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. కొద్దిరోజుల అనంతరం వెస్ట్ పోలీస్ స్టేషన్కు మరో సీఐని అటాచ్మెంట్ ఇస్తూ అప్పటి ఎస్పీ మరోసారి ఆదేశాలు జారీచేశారు. అప్పటి నుంచి ఈ పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్ పైనే నడుస్తోంది. పోలీస్ స్టేషన్లో పైరవీలు చేసేందుకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాసులిస్తే కాస్ట్లీ పోలీస్ స్టేషన్! తిరుపతిలోని ఓ ప్రజాప్రతినిధి పెద్ద మొత్తంలో కాసులు తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కొందరు పోలీస్ అధికారులను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి పీఏ చేతికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. గతంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసిన సీఐ ఈ మొత్తం నగదును చెల్లించి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వస్తున్నట్టు చర్చ మొదలైంది. అదేవిధంగా తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే ప్రజాప్రతినిధి మరో అధికారికి విక్రయించినట్లు సమాచారం. వీరందరికీ త్వరలోనే డ్యూటీ ఆర్డర్ కూడా ఇస్తారని చర్చించుకుంటున్నాయి. ● తిరుమల వన్టౌన్ పోలీస్ స్టేషన్కు కూడా పలువు రు ఐపీఎస్ స్థాయి అధికారులు ఇద్దరు సీఐల పేర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో అన్నమయ్య జిల్లాలో పనిచేసిన ఓ ఎస్పీ అక్కడ స్పెషల్ బ్రాంచ్లో సీఐగా పనిచేసిన వ్యక్తిని తిరుమలకు తీసుకొ స్తానని మాటిచ్చినట్టు సమాచారం. అదే పోలీస్స్టేషన్కు మరో ఐపీఎస్ అధికారి ఇంకో సీఐకి పోస్టింగ్ ఇప్పిస్తానని మాటిచ్చినట్టు సమాచారం. ప్రస్తు తం ఇదే స్థానంలో పనిచేస్తున్న సీఐకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల ఆశీస్సులు ఉండడం గమనార్హం. గతంలో పనితీరును బట్టి పోస్టింగ్లు గతంలో పనితీరుని బట్టి పోస్టింగ్ వచ్చేవారు. కేసుల పరిష్కార వైనం, రివార్డులు, అవార్డులు, చార్జీ మెమోలు, ఇలా అన్నిటినీ పరిశీలించేవారు. అయితే ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు, సామాజిక సమీకరణకే ప్రాధాన్యత ఇస్తూ బదిలీలు చేస్తున్నారు. అంతేకాకుండా కీలకమైన పోలీస్ స్టేషన్లు కోరేవారికి అది ఎంత మొత్తంలో నగదు చెల్లిస్తే అంత మంచి పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ ఇచ్చే విధంగా ప్రస్తుత పాలన సాగుతుంది. ఆ తర్వాత ఆ డబ్బంతా ఫిర్యాదుదారుల వద్ద నుంచి వసూలు చేస్తారని బహిరంగ రహస్యం. ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లలో చిన్నపాటి కేసు నమోదు చేయాలన్నా కూడా కాసులు చెల్లించాల్సి వస్తోంది. -
కమనీయం..
● తరలివచ్చిన భక్తులు ● ఒక్కటైన జంటలుశ్రీకాళహస్తి: ఆదిదంపతుల కల్యాణం భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. శనివారం తెల్లవారు జామున సుమారు 4.30గంటల సమయంలో జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరునిచే మాంగల్యధారణ జరిగింది. ఇదే శుభఘడియల్లో ఆదిదంపతుల సమక్షంలో 41 నూతన జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అంతకుముందు శుక్రవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అదిష్టింపజేసి పెండ్లిమండపం వద్దకు వేంచేశారు. పెండ్లి మండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకోగా.. మధ్యలో పార్వతీదేవి అలకబూనడంతో చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం చేయడంతో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సంతృప్తి చెంది పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం వేదపండితులు ఆదిదంపతుల కల్యాణ ఘటన్ని పూర్తిచేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఒక్కటైన 41 నూతన జంటలు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా 41 నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. జ్ఞానప్రసూనాంబ దేవికి మాంగల్యధారణ చేసిన సమయంలోనే ఈ జంటలు కూడా మాంగల్యధారణ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఒక్కటయ్యారు. గిరిప్రదక్షిణకు హాజరు కండికై లాస గిరి ప్రదక్షిణ ఎన్నో జన్మల పుణ్యఫలమని ఉభయకర్త, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జరగ నున్న స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణకు శివయ్య భక్తులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సభాపతి కల్యాణంలో అర్చకులు రుద్రాక్ష చప్పరాలపై శివయ్య వైభవం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి రుద్రాక్ష చప్పరాపై పురవీధుల్లో ఊరేగారు. ఆదిదంపతుల కల్యాణం ముగిసిన తర్వాత ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11గంటల సమయంలో వేదోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్లును రుద్రాక్ష చప్పరాలపై అధిష్టింపేజేసి పురవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటలకు : కై లాసగిరి ప్రదక్షిణ వాహన సేవలు ఉదయం: బనాత అంబారి వాహనసేవ సాయంత్రం: అశ్వం – సింహ వాహన సేవ ఉభయదాతలు: బియ్యపు కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం శ్రీవాణిరెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి (శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు)ఆగమోక్తం నటరాజస్వామి కల్యాణం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి సభాపతి కల్యాణం ఆగమోక్తంగా సాగింది. నటరాజ స్వామి, శివకామ సుందరి వివాహాన్ని పురోహితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శివకామసుందరి సమేత నటరాజస్వామి పురవీధుల్లో ఊరేగారు. -
శ్రీనివాసా.. మళ్లీ దొంగాట!
సాక్షి టాస్క్ఫోర్స్: సైదాపురానికి కూత వేటు దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. సరిగ్గా నాలుగు నెలలు క్రితమే స్థానిక ప్రజాప్రతినిధికి ఆ ముఖ్యనేత మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఆ మైన్పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూటమి నేతల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఆ శ్రీనివాసా పద్మావతి గనిలో మళ్లీ అక్రమ మైనింగ్ మొదలైంది. మళ్లీ మొదలైన అక్రమ మైనింగ్ మండల కేంద్రమైన సైదాపురానికి కూత వేటు దూరంలోనే కాలం చెల్లిన శ్రీనివాసా పద్మావతి గని ఉంది. గతంలో లీజు కాలవ్యవధి తీరిపోవడంతో గనిని అలాగే వదిలేశారు. ఈ గనిలో మైకా క్వార్ట్జ్జ్ ఖనిజం లభ్యమవుతోంది. దీనికి డిమాండ్ ఉండడంతో నేతల కన్ను ఈ గనిపై పడింది. గత ఏడాది అక్టోబర్లో ఆ గనిలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు అధికారులచేత తనిఖీలు చేయించి అందులో పనిచేస్తున్న విలువైన యంత్రాలను సీజ్ చేయించారు. కాని ఏమైందో ఏమో కాని శనివారం నుంచి ఆ గనిలో అనుమతులు లేకుండానే మళ్లీ పనులు మొదలుపెట్టారు. కాలం చెల్లిన గనిలో ముఖ్యనేత పనులు కన్నెత్తి చూడని అధికారులు -
రెండు నెలలుగా అందని ఉపాధి బిల్లులు
● అష్టకష్టాలు పడుతున్న పేదలు ● అర్ధాకలితో అలమటిస్తున్న కూలీలుఉపాధి పనులు చేస్తున్న కూలీలు చిల్లకూరు: ఉపాధి కూలీలు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. రెండు నెలలుగా కూలీలు అందకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు కూలికి వెళ్లి పొట్ట పోసుకునే వారికి ఇబ్బందికరంగా మారింది. కొంతమంది అప్పులు చేసి పొట్టపోసుకుంటుండగా మరికొందరు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు రూ.60 లక్షలు జిల్లాలో రోజుకు 30 వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.200 చొప్పున ఒక రోజుకు కనీసం రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కూలీకి రెండు నెలలకు కలిపి రూ.12 వేల వరకు కూలీలు రావాల్సి ఉంది. కూటమి నేతలు హంగు, ఆర్భాటాలకు పోయి ఉపాధి కూలీలను కష్టాల్లోకి నెట్టేశారు. పల్లెపండుగ పేరుతో ఇష్టారాజ్యంగా భోంచేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు అంటూ హంగామా సృష్టించారు. ఆపై ఉపాధి కూలీలకు నిధులు లేకుండా మింగేశారు. రెండు నెలలుగా పనిచేస్తున్నా ఉపాధి డబ్బులు రాక కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. దీనిపై అధికారులు సైతం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సమాచారం మండలాలు 33 పంచాయతీలు 806 జాబ్ కార్డులు 2.68 లక్షలు వాస్తవ కూలీల సంఖ్య 4.62 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు 2.25 లక్షలు ప్రస్తుతం ఒక రోజుకు హాజరవుతున్న కూలీల సంఖ్య 42 వేల మంది నిధుల విడుదలలో జాప్యం ఎందుకో? కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులను కూటమి ప్రభుత్వం కొత్తగా పల్లె పండుగ పేరుతో ఆర్భాటం చేసింది. తమ నాయకులకు కట్ట బెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసి ఖర్చుచేసింది. సీసీ రోడ్లు, డ్రైన్లు అంటూ హంగామా సృష్టించింది. అలాగే కొత్తగా ఇంకుడు గుంతలను నిర్మించేందుకు తమ నాయకులకు పనులు అప్పగించింది. దీంతో ఈ నిధులు దుర్వినియోగమవడంతో కూలీలు కడుపు మాడ్చుకోవాల్సి వస్తోంది. పైసా ఇవ్వలేదు నేను ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో వారానికి ఓ సారి డబ్బు పడేది. ఇప్పుడు రెండు నెలలుగా కూలీలు ఇవ్వలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఉపాధి పనులు ముగించేసి వ్యవసాయ పనులకు వెళ్దామంటే అవి కూడా లేవు. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియడం లేదు. – కుమార్, చిట్టమూరు, ఉపాధి కూలీ మార్చి నెలాఖరులోగా చెల్లిస్తాం ఉపాధి హామీ పథకంలో పనికి వచ్చే ప్రతి కూలీకి మార్చి నెలాఖరులోగా నగదు చెల్లిస్తాం. గత రెండు నెలలుగా కూలీలకు నగదు చెల్లింపులు జరగలేదు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. వెంటనే నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. – వరప్రసాద్, ఏపీడీ, డ్వామా, గూడూరు -
స్టైఫండ్ పెంచాల్సిందే
తిరుపతి కల్చరల్: ఎస్వీ వెటర్నరీ విద్యార్థులకు ఇతర వైద్య కోర్సుల విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ రూ.25 వేలకు పెంచాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం పశువైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నేత ఓబుల్రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఎన్ఎల్ఎస్ఏ వ్యవస్థాపకుడు సుందర్రాజ, బీసీ విద్యార్థి విభాగం నేత తిరుమలేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు లోకేష్, ఐక్య విద్యార్థి సంఘ నేత చంద్ర నాయక్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం పశువైద్య విద్యార్థుల సమసమ్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘ నేతలు మోహన్, తేజ, బాల, పూర్ణ, విక్రమ్, రాజ్ఖ, చెంగల్రెడ్డి, వినోద్, రవితేజ, బాలాజీ నాయక్, సురేష్ పాల్గొన్నారు. -
శ్రీసిటీలో షార్ స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్
శ్రీసిటీ (వరదయ్యపాళెం): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీలో షార్ స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీసిటీ, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను శుక్ర, శనివారాల్లో సాగింది. ట్రిపుల్ ఐటీ, క్రియా విశ్వవిద్యాలయం, అకార్డ్, చిన్మయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం నుంచి తాజా పురోగతి వరకు వివిధ ప్రయోగాలు, లాంచ్ ప్యాడ్లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లు తదితర నమూనాలను ప్రదర్శించారు. సంక్లిష్టమైన అంతరిక్ష సాంకేతికతను వివరించడంతో పాటు సైన్స్ సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచే రీతిలో విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన షార్ డైరెక్టర్ రాజరాజన్కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ గెలుపే నీదిరా!
మెరుపై సాగరా.. తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు శనివారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్లో 31,851 మంది, ఒకేషనల్లో 1,313 మంది మొత్తం 33,164 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో జనరల్లో 720 మంది, ఒకేషనల్లో 100 మంది, మొత్తం 820 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. డెఫ్ అండ్ డంబ్ విద్యార్థులు సహాయకుల సహకారంతో పరీక్షను రాసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 86 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష జరగనుంది. పటిష్టంగా ఇంటర్ పరీక్షలు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్కు తావులేకుండా పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరీక్ష నిర్వహణాధికారులను ఆదేశించారు. తిరుపతి రూరల్, వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సీసీ కెమెరాలను అమరావతిలోని ఇంటర్ బోర్డుకు అనుసంధానించడంతో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు తొలి రోజు 820 మంది గైర్హాజరు -
జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి
సత్యవేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ ఆచార్యులు (56) శుక్రవారం రాత్రి గుండె నొప్పితో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె అమెరికాలో, కుమారుడు, భార్య హైదరాబాద్లో ఉంటున్నారు. చౌడేపల్లి జూనియర్ కళాశాలలో పిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ గత ఏడాది పదోన్నతిపై సత్యవేడు జానియర్ కళాశాలకు వచ్చారు. ఇప్పటికే బైపాస్ సర్జరీ చేసుకొని వైద్యం పొందుతున్నారు. కళాశాల వద్దే ఉన్న ఆయన శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటర్ కళాశాల గదులు పరిశీలిస్తూ వెలుపలకు వచ్చి అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తెల్లవారితే ఇంటర్ పరీక్షకు డిపార్టుమెంట్ ఆఫీసర్ డ్యూటీ చేయాల్సిన ఆయన మృతి చెందడంతో జాకీర్హుసేన్(నాగలాపురం జూనియర్ కళాశాల)ను నియమించి ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మృతి పట్ల ఎంఈఓలు కే.రవి, ఉషా, లెక్చరర్లు, విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
సీఎంకు సాదర స్వాగతం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్):చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన హెలికాప్టర్లో జీడీ నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకు ని తిరుగుపయనమయ్యారు. స్వాగతం పలికిన వారిలో అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు. గుడిమల్లం ఆలయంలో హుండీ చోరీ ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయంలో అమ్మవారి వద్ద ఉన్న హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఓ పక్క శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా.. హుండీ చోరీ కావడం విశేషం. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి హుండీ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన ఆలయాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరి పంట పరిశీలన రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మండలంలోని గాజులమండ్యం గ్రామ పొలాల్లో ఈ క్రాప్లో గ్రామ వ్యవసాయ సహాయకులు నమో దు చేసిన పంటలను శనివారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్క రైతు తాము సాగుచేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. -
పరీక్షా సామగ్రి పంపిణీపైనా అక్కస్సే
● ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు ● ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే భార్య మండిపాటు తిరుపతి టాస్క్పోర్స్: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి అందజేశారు. ఈ విషయం ఎమ్మెల్యే భార్య వరకు చేరింది. వెంటనే విద్యాశాఖ అధికారులకు ఫోన్చేసి ‘2029 వరకు ఈ నియోజక వర్గానికి ఎమ్మెల్యే నా భర్త. మీకు భక్తి ఉంటే చెవిరెడ్డి ఇంటికెళ్లి పనిచేసుకోండి.. లేదంటే చంద్రగిరి నియోజకవర్గం వదలి వెళ్లిపోండి’ అంటూ విద్యాశాఖ అధికారులకు ఫోన్లో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. అంతే రాత్రికి రాత్రే చిన్నగొట్టిగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంకు జిల్లా విద్యాశాఖాధికారి నుంచి షోకాజ్ నోటీసు వచ్చింది. -
మహిళల నిరసన
మద్యం షాపు ఏర్పాటుపైబుచ్చినాయుడుకండ్రిగ:మండలంలో నిబంధనలకు విరుద్ధంగా చల్లమాంబపురంగ్రామంలో మద్యం షాపు ను ఏర్పాటు చేయడంపై శనివారం మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మంలోని ఇళ్లమధ్యలో మద్యం షాపును ఏర్పాటు చేయ డంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. గ్రామంలోని రోడ్డు పక్కనే మద్యం షాపు పెట్టడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి గొడవ చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మణినాయుడు హెచ్చరించారు. అనధికార పర్మిట్ షాపులో విచ్చలవిడిగా మద్యం మండలంలోని చల్లమాంబపురం గ్రామంలోని మద్యం దుకాణం పక్కనే ఉన్న అనధికార పర్మిట్ షాపులో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మద్యం షాపు మూత వేసిన సమయంలో అనధికార పర్మిట్ షాపులో ఉదయం 5 నుంచి మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డలున్నారు.. మద్యం దుకాణం పెట్టొద్దు! తిరుపతి రూరల్: ‘కాలేజీలకు వెళ్లే ఆడబిడ్డలున్నారు.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ మార్గం గుండానే తిరుగుతుంటారు.. మద్యం మత్తులో మందుబాబులు వల్ల ఇబ్బందులు వస్తాయి.. దయచేసి ఇక్కడ మద్యం దుకాణం పెట్టకండి..’ అంటూ తిరుపతి రూరల్ మండలం, లింగేశ్వరనగర్, అవిలాల గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆ దుకాణం వద్దకు బాలికలను తీసుకువెళ్లి దుకాణం ముందు కూర్చోబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గతంలో చికెన్ సెంటర్గా ఉన్న దుకాణాన్ని మద్యం అమ్మకాల కోసం ఏర్పాట్లు చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. అయినప్పటికీ మద్యం వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా దుకాణంలోకి మద్యం బాటిళ్లను చేర్చడంతో దుకాణం ప్రారంభిస్తే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు దుకాణ దారులకు తెలిపారు. -
దొంగ అరెస్టు
– రూ.12 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం నాయుడుపేట టౌన్: నేర ప్రవృత్తికి అలవాటు పడి ఇంటి ముందు ముగ్గులు వేసే మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని దొంగతాలకు పాల్పడుతున్న నిందితుడు కావాలి భవానీశంకర్ను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ గల 170 గ్రాములు బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని పోలీస్ డివిజన్ కార్యాలయంలో శనివారం డీఎస్పీ ఆ వివరాలను వెల్లడించారు. నాయుడుపేట ప్రాంతంలో తరచూ బంగారు గొలుసులు చోరీలు జరుగుతుండడంపై నాయుడుపేట సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి, ఐడీ పార్టీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం పట్టణ పరిధిలోని మల్లాం జాతీయ రహదారి కూడలి వద్ద అనుమానాస్పదంగా నిలుచుకుని ఉన్న భవానీశంకర్ను పట్టుకున్నట్లు వివరించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడు నాయుడుపేట పట్టణంలోని పొగొట్టం కాలనీ కాలవగట్టు ప్రాంతానికి చెందిన వాడుగా గుర్తించారు. ఇతడిపై 2021 నుంచి 2025 వరకు 8 కేసులు ఉన్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితుడి వద్ద నుంచి 8 బంగారు చైన్లు, 1 బంగారు నల్లపూసల దండ మొత్తం 170 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలకు పైగా ఉంటుందన్నారు. నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్లతో పాటు హెడ్కానిస్టేబుల్ కోండూరు రామ్మోహన్రాజు, కానిస్టేబుల్ అన్నుదయాకర్, షేక్ సుహెల్బాబు, డీ.పోలయ్యలకు నగదు రివార్డులను అందించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలైన ఘటన రేణిగుంటలో చోటుచేసుకుంది. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ కథనం.. గురువారం మధ్యాహ్నం గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు రేణిగుంట సమీపంలో వస్తుండగా పక్క నుంచి ప్రధాన రహదారి పైకి వస్తున్న టిప్పర్ ఢీకొనంది. ఈ ఘటనలో బస్సు సైడ్ దెబ్బతినగా విజయవాడకు చెందిన దిలీప్కు గాయాలయ్యాయి. మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. -
96.49 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్: జిల్లాలో శనివారం 96.49 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ శోభన్బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 96.06 శాతం పింఛన్లు పంపిణీ చేసి అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు. తిరుపతి జిల్లాలో 2,62,461 పింఛన్లకు గాను తొలిరోజు 2,53,240 మందికి పంపిణీ చేసినట్టు వివరించారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నీటి గుంతలో పడి లారీ డ్రైవర్ మృతి తడ: నీటి గుంతలో పడి లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం మాంబట్టు సెజ్లోని టాటా స్టీల్ పరిశ్రమ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ కొండపనాయుడు కథనం.. జార్ఖండ్లోని జంషెడ్పూర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ దిలీప్ కుమార్ యాదవ్(32) లోడింగ్ కోసం శుక్రవారం టాటా స్టీల్ పరిశ్రమ వద్దకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు పరిశ్రమ ఎదుట ఉన్న గుంతలోకి దిగి మునిగి పోయాడు. సమీపంలో ఉన్న తోటి లారీ సిబ్బంది గమనించి పరిశ్రమ యాజమాన్యానికి తెలపడంతో వాళ్లు సూళ్లూరుపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీసి సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. లోడ్డు క్రమబద్ధీకరణకు రాయితీ తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో గృహ విద్యుత్ ఆదనపు లోడ్డు క్రమబద్ధీకరణకు 50 శాతం రాయితీ కల్పిస్తామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి ఆదేశాలకు అనుగుణంగా వినియోగదారులు తాము వినియోగిస్తున్న అదనపు విద్యుత్ లోడ్డు క్రమబద్ధీకరణకు 2025 మార్చి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీలోగా స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం వరకు రాయితీ కల్పిస్తామని చెప్పారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలి – కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు. శ్రీవారి ఆలయంలో బాలాలయం అలిపిరి పాదాల మండపంలోని శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా శనివారం నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి దర్శనం అందుబాటులో ఉండదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, మహిళలకు కోతలు..వాతలేనని తేలిపోయింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్కు పంగనామం పెడుతున్నట్టు స్పష్టమైంది. మహిళా శక్తికి రిక్తహస్తమే ఎదురైంది. అన్నదాత సుఖీభవకు మొండిచెయ్యే మిగిలింది. ఉచిత బస్సు మూగబోయి
● సంక్షేమానికి అరకొర బడ్జెట్ ● నిరుద్యోగభృతి, ఉచిత బస్సు ఊసేలేదు ● సూపర్ సిక్స్కు చెక్ ● ప్రతినెలా ఒక్కో మహిళకు రూ.1,500పై చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ● జిల్లాలో తాగు, సాగునీటికి మొండి చెయ్యి ● బడ్జెట్పై నిప్పులు చెరుగుతున్న మేధావులు తిరుపతి సిటీ: షరా మామూలే. సంక్షేమానికి మళ్లీ టోకరా పెట్టేశారు. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మేధావులు, వామపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తిరుపతి జిల్లాకు తిరునామం పెడుతూ ఏ రంగంలోనూ బడ్జెట్ గణాంకాల్లో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం మాటవరుసకై నా జిల్లా ప్రస్తావన లేకపోవడంపై మండిపడుతున్నారు. గత ఏడాది 2024–25 బడ్జెట్లో ప్రస్థావించిన అంశాలను ఇంకాస్తా గణాంకాలు జోడించి అమలుకు వీలుకాని అంకెలను పొందుపరుస్తూ మంత్రి ప్రసంగం కొనసాగింది. దీనిపై రైతులు, మహిళలు నిప్పులు చెరుగుఉతన్నారు. సూపర్ సిక్స్కు పంగనామం 2025–26 బడ్జెట్ గణాంకాలు మహిళలను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. గత బడ్జెట్లో సూపర్సిక్స్ పథకాలకు చోటివ్వని కూటమి ప్రభుత్వం ఈసారైనా కరుణించకపోతుందా అని ఎదురు చూసిన మహిళలకు నిరాశే మిగిలింది. మహిళాశక్తి పేరుతో కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందిస్తామని చెప్పి బడ్జెట్లో మాటెత్తకుండా మంగళం పాడేసింది. మహిళలకు ఉచిత బస్సు ఊసేలేదు. తల్లికి వందనం పథకానికి రూ.8వేల కోట్లు కేటాయిండంపై పెదవి విరుస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సుమారు 3లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. బడ్జెట్లో కేటాయించిన సొమ్ములో కనీసం 30శాతం మందికి కూడా సరిపోదనే వాదనలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర ఏదీ? జిల్లాలోని 2.51 లక్షల మంది రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రత్యేకంగా మంత్రి అచ్చెం నాయుడు అసెంబ్లీలో చదివిన గణాంకాలపై నోరెళ్లబెడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించకుండా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. గత ప్రభుత్వం ధరలస్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణమని మండిపడుతున్నారు. అన్నదాత సుఖీభవకు గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయించి అములు చేయలేదు. మళ్లీ 2025–26 బడ్జెట్లో నిధులు కేటాయించడం చూస్తే కనీసం జిల్లాలోని సగం మందికి కూడా ఈ పథకాన్ని వర్తించే పరిస్థితి లేదు. -
పింఛన్ల కోత.. పండుటాకులకు వాత!
9 నెలల్లో 8,722 పింఛన్ల తగ్గింపు తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అభాగ్యులు, దివ్యాంగులు, పండుటాకులతో చెడుగుడు ఆడుతోంది. బతుకు జీవనానికి చుక్కానిగా ఉన్న పింఛన్లకు కోత విధిస్తూ రోడ్డున పడేస్తోంది. కొత్తపింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు తొలగించడం విమర్శలకు తావిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లా వ్యాప్తంగా 8,722 పింఛన్లను పక్కన పెట్టేసింది. గత ఫిబ్రవరిలో 2,63,191 మందికి పింఛన్లు ఇవ్వగా.. మార్చి నెల వచ్చేసరికి 2,62,461 మందికి పరిమితం చేసింది. పింఛన్ల కోత ఇలా నెల పింఛన్ల సంఖ్య జూన్ 2,71,183 జూలై 2,69,162 ఆగస్ట్ 2,67,772 సెప్టెంబర్ 2,67,089 అక్టోబర్ 2,66,342 నవంబర్ 2,65,488 డిసెంబర్ 2,64,636 జనవరి 2,63,995 పిభ్రవరి 2,63,191 మార్చి 2,62,461ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వండి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. శనివారం ఉదయం 7 నుంచే పింఛన్ల ప్రక్రియ మొదలు పెట్టాలి. మార్చి లో 2,62,461 మందికిగాను రూ.112.06 కోట్లు నగదు ఇవ్వాల్సి ఉంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలి. –ఎస్.వెంకటేశ్వర్, కలెక్టర్, తిరుపతి జిల్లా -
ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావాలి
ఏర్పేడు(రేణిగుంట): దేశంలో సైన్స్ ప్రపంచదేశాలకు ధీటుగా అభివృద్ధి చెందటం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమైందని, ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్తగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం గర్వించే గొప్ప శాస్త్రవేత్త సీవీ రామన్ అని, తాను ఎనిమిదో తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఐసర్ విద్యార్థులు అబ్బురపరిచే ప్రయోగాలను రూపొందించి ప్రదర్శించారని అభినందించారు. కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ.. తాను ఆకాశంలో నక్షత్రాలు, రాశులను చూసి ఆనందించేవాడినని, ఆస్ట్రోఫిజిసిస్ట్ కావాలని కలలు కన్నానని తెలిపారు. ఎంబీబీఎస్ పట్టా పొంది విశాఖపట్టణంలోని కేజీహెచ్లో పనిచేశానని, తర్వాత ఐఏఎస్ అయ్యానని తెలిపారు. ఐసర్ విద్యార్థులు సుమారు 100కు పైగా నమూనాలను ప్రదర్శించారు. వాటిని తిలకించేందుకు ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, వేదాంతపురం, శ్రీసిటీల నుంచి 800 మంది విద్యార్థులు వచ్చారు. -
అవినీతి అధికారుల గుండెల్లో దడ!
సాక్షి, టాస్క్ఫోర్స్: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఆందోళన రేకెత్తుతోంది. పోస్టింగ్లు.. పైరవీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి సమీపంలో చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్ ల కోసం ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి సతీమణికి ముడుపులు చెల్లించినట్టు దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ప్రజలను మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన వారు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ దినేష్ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచగొండు అధికారుల గుండెల్లో గుబులు చంద్రగిరి మేజర్ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెల వు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డ చంద్రగిరి పంచాయతీ ఈఓ నాడు స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు సమర్పణ! ఏసీబీ అధికారుల చేతిలో కీలక సమాచారంఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! ‘చంద్రగిరి పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్ దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. -
తిరుమలలో అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు
తిరుమల: తిరుమలలో ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళంగా చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఉదయం అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి రూ.17 లక్షలు ఖర్చు చేస్తామని పేర్కొంది. దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని పేర్కొంది. స్పోర్ట్స్ కోటా ద్వారాటీటీడీలో ఉద్యోగాల భర్తీ తిరుపతి కల్చరల్: టీటీడీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆవరణలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులతో టీటీడీ ఈవో శ్యామలరావు క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. చైర్మన్, ఈవో, ఏఈవో, జేఈవో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి రూ.2,000, రూ.1,800, రూ.1,600 విలువైన బ్యాంకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో పురుషులు, మహిళలకు వేరు వేరుగా.. అలాగే, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ తిరుపతి అర్బన్: తిరుమలలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న పద్మావతి పార్క్లో ఈ ఏడాది జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, మరో 44 మంది గాయపడిన విషయం విధితమే. శుక్రవారం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు భక్తులను విచారణ చేశారు. తిరుపతి నెహ్రూవీధికి చెందిన ఓ భక్తుడు ఇంటి నుంచే తన మొబైల్ ద్వారా వర్చువల్ విధానంలో హాజరయ్యారు. అలాగే విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన మరో మహిళా భక్తురాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన మరో భక్తుడు మొబైల్ ద్వారా వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 35 మందిని విచారణ చేశారు. రైల్వే స్టేషన్లో తాగునీటి ఇక్కట్లు తిరుపతి మంగళం: నాయుడుపేట రైల్వే స్టేషన్లో తాగునీటి సమ స్య తాండవిస్తోందని, వెంటనే పరిష్కారం చూపాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు లేఖ రాశారు. ఉన్న తాగునీటి కొళాయిలను మరమ్మతులు చేయించడంతోపాటు వేసవి నేపథ్యంలో అదనపు కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తిరుపతి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి తదితర రైల్వే స్టేషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. చోరీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని వివరించారు. -
పెళ్లి కళ
● కల్యాణానికి సిద్ధమైన స్వామి, అమ్మవార్లు ● పోటెత్తిన భక్తులు ● ఒక్కటైన జంటలు వధూవరులకు బంగారు తాళిబొట్లు ● బియ్యపు మధుసూదన్ రెడ్డి కానుక శ్రీకాళహస్తి: శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా నూతన వధూవరులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం రాత్రి బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్లుగా పేదలకు బంగారు తాళిబొట్లు కానుకగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళి బొట్లు పంపిణీ చేశారు. ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నాయకులు పగడాల రాజు, కంటా ఉదయ్కుమార్, ఉత్తరాజీ శరవణకుమార్, సిరాజ్ బాషా, మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్, గరికపాటి చంద్ర , పఠాన్ ఫరీద్, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. పెళ్లి పందిరి శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం ఉదయం స్వామివారు అధికార నందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారు కామధేనువుపై దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన శివయ్య గజవా హనంపై, జ్ఞానాంబిక సింహ వాహనంపై ఆశీనులై పెళ్లిమండపానికి వేంచేశారు. -
సీఎం పర్యటనపై సమీక్ష
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారులంతా సమయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎయిర్పోర్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీ శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, డీఎంహెచ్ఓ బాలాజీ నాయ క్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు. ఎరువుల సరఫరా పెంచండి తిరుపతి మంగళం : ఖరీఫ్, రబీ సీజన్ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు గురువారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. 2024–25లో 1,19,141 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించినట్టు తెలిపారు. 2025–26 సంవత్సరానికిగాను మరో 25 శాతం పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 258 ప్రైవేట్ డీలర్లు, 36 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా డీలర్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. రైతుల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత లక్ష్యాలను సాధించేందుకు సరఫరా పెంపు ఎంతో కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. 3 నుంచి ఆకాశవాణిలో టెన్త్ విద్యార్థులకు కార్యక్రమం తిరుపతి కల్చరల్ : పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా మార్చి 3వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు పస్రారం చేయనున్నట్టు ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ ఎం.సుధాకర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మార్చి 3 నుంచి 9వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 7.15 గంటలకు తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5, మెగా హెమ్ స్టేజ్పై వినవచ్చని పేర్కొన్నారు. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్పై కూడా వినవచ్చని తెలిపారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి విషయ నిపుణులైన ఉపాధ్యాయులు వివిధ అంశాలను వివరిస్తారని వెల్లడించారు. పరీక్షలకు ఆందోళన లేకుండా ఎలా సిద్ధం కావాలి అనే అంశాలను తెలియజేస్తారని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం
● సిండికేట్గా ఏర్పడి ధాన్యం ధర తగ్గింపు ● తాము ఆడించే బియ్యానికి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు ● తూకాల్లోనూ మోసాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● కన్నెత్తి చూడని అధికారులు సూళ్లూరుపేట: జిల్లాలో మిల్లర్ల మాయాజాలానికి రైతులు, వినియోగదారులు బలవుతున్నారు. మొదట సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు సిండికేట్గా ఏర్పడుతున్నారు. ఆపై బినామీలతో రేట్లు ఉండవని ఊదరగొట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. చివరగా కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతుల నుంచి ఒకటికి సగానికి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో ఆడించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఆపై ఆ బియ్యం రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల నుంచి అధికారుల వరకు సహకరిస్తుండడంతో వీరి అక్రమ వ్యాపారం మూడు బస్తాలు.. ఆరు లారీలుగా వర్థిల్లుతోంది. సీజన్ ప్రారంభం కాగానే.. వరికోతల సీజన్ ప్రారంభం కాగానే మిల్లర్లు దళారులను రంగంలోకి దింపుతారు. బస్తా ధాన్యాన్ని రూ.1800 దాకా కొనుగోలు చేసి హైప్ చూపిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వీరు ఫాలో కానేకారు. ఆ తర్వాత మిల్లర్లందరూ సిండికేట్గా మారి దళారుల చేతనే రేట్లు తగ్గిపోయాయని చెప్పిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంటలు బాగా పండడంతో అక్కడ రేట్లు లేవు.. తెలంగాణలోని కోదా డ, ఖమ్మం నుంచి భారీగా ధాన్యం వస్తోంది. పైపెచ్చు విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అందుకే రే ట్లు భారీగా తగ్గిపోయాయని రైతులను కలవర పెడు తుంటారు. ఆ తర్వాత మిల్లర్ల బినామీలు రంగప్రవే శం చేసి రూ.1,600, రూ.1,650 కొనుగోలు చేస్తారు. గత ఏడాది రూ.2,200 అమ్మిన బస్తా ధాన్యం ఈ యేడు ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాని పరిస్థితి. మిల్లర్ల ముడుపులు మిల్లర్లు సిండికేట్ ఏర్పడి అఽధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వారికి ముడుపులు చెల్లిస్తారు. ఆపై అధికారులను బుట్టలో వేసుకుని రైతుల కడుపుకొట్టడం ప్రారంభిస్తారు. ధాన్యానికి– బియ్యానికి తేడా 75 కిలో బస్తా వరి ధాన్యాన్ని రైతుల వద్ద తరుగు కింద మరో ఐదు కిలోలకు కలిపి మొత్తం 80 కిలోలు తీసుకుంటారు. దీనికి బస్తాకు రూ.1,600 నుంచి రూ.1,700కు కొనుగోలు చేస్తారు. 75 కిలోల బస్తాను బియ్యంగా ఆడిఏ్త సుమారు 40 నుంచి 45 కిలోలు బియ్యం వస్తాయి. 6 కిలోలు నూకలు, 20 కేజీల తవుడు, 2 కిలోలు పొట్టు వస్తుంది. అంటే 45 కిలోల బియ్యం రూ.2,700 6 కిలోలు నూకలు రూ.240 20 కేజీల తవుడు రూ.560 2 కిలోల పొట్టు రూ.80 రూ.3,600ధాన్యం కొనుగోళ్లలో తేడాలు వరి రకం సీజన్ ప్రారంభంలో ప్రస్తుతం ధర రూ. రూ. బీపీటీ జిలకర మసూరీ 1,600 1,550 కేఎన్ఎం 1,630 1,580బియ్యం ధరలు ఎందుకు తగ్గించరు? నేను గతంలో సుమారు ఐదు ఎకరాల దాకా వరి సాగుచేసేవాడ్ని. ప్రస్తుత పరిస్థితులు బాగోలేక వ్యవసాయం చేయడం మానేశా. కష్టపడి పండించిన పంటను ఎవరో మిల్లర్లు వచ్చి దోచుకెళుతున్నారు. అరు నెలలు పాటు పడిన కష్టాన్ని వ్యాపారం చేసుకునే వారు తక్కువ రేట్లతో దండుకుని వెళ్తున్నారు. ఇలా చేస్తే వ్యవసాయంలో అప్పులు తప్ప ఏమీ మిగలవు. ప్రస్తుతం ధాన్యానికి ధరలు లేవు కదా! మరి మార్కెట్లో బియ్యం రేట్లు ఎందుకు తగ్గట్లేదు..?. – వంకా చంద్రశేఖర్, సూళ్లూరుపేట ధాన్యానికి రేట్లు లేవు రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లు సిండికేట్గా మారి మోసం చేస్తున్నారు. వారు తయారు చేసే బియ్యానికి మాత్రం రేట్లు తగ్గించకుండా విక్రయిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రైతు పండించిన ధాన్యానికి రేట్లు లేకుండా చేసి పబ్లిక్ మార్కెట్లోనేమో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు రేట్లు పెంచడమే కాకుండా తూకాల్లో కూడా ఒకటి రెండు కేజీలు తగ్గించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – గాలి మల్లికార్జున్రెడ్డి, సుగ్గుపల్లి, సూళ్లూరుపేట మండలం రేషన్ బియ్యాన్నీ వదలని మిల్లర్లు ఆంధ్రప్రదేశ్లోని రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని తాము ఆడించే బియ్యంలో పాలిష్ పట్టి బస్తాకు ఏడు నుంచి 9 కిలోల వరకు కలిపేస్తారు. ఇక్కడ మరొక ట్విస్టు ఏమిటంటే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు 75 కిలోల ధాన్యం బస్తాకి మరో ఐదు కిలోలు తరుగు కింద లాగేస్తారు. అదే బియ్యం ఽవద్దకొచ్చే సరికి గోతం మీద నెట్ వెయిట్ 25 కిలోలు అని ఉంటుంది. దాన్ని తూకం వేస్తే 23, 24 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తూనికలు కొలతలు శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడినా ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఆమ్యామ్యాలతో అంతా సర్దేసుకుంటారు మరి.ఆ విషయం తెలియదు మిల్లర్లు, దళారులు రాజ్యమేలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. ధాన్యం ధర లు తగ్గించేస్తున్నారన్న విషయం మాత్రం విన్నాను. – కేఎస్ఎన్.నరసింహారావు, తహసీల్దార్, సూళ్లూరుపేట -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,323 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,460 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.92 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎస్వీయూ దూరవిద్యకు అనుమతులు తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులకు 2024 – 25 సంవత్సరానికి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతులు మంజూరు చేసింది. జనవరిలో యూజీసీ నిపుణుల బృందం వర్సిటీలో మూడు రోజులు పర్యటించింది. అనుమతుల మంజూరుకు సంబంధించిన అర్హతలపై యూజీసీకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అనుమతులు మంజూరు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో వర్సిటీ డీడీఈ విభాగంలో 17 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డీడీఈ కోర్సుల పునరుద్ధరణకు, అనుమతులు రావడానికి కృషి చేసిన వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి వీసీ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. -
మునిగితేలారు!
భక్తి సాగరంలో.. శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తేరువీధి, నెహ్రూవీధి, నగరివీధి, బజారువీధి భక్తులతో కిక్కిరిసిపోయాయి. హరహర మహాదేవ, శంభోశంకర అంటూ స్వామివారి రథాన్ని ముందుకు కదిలించగా.. జైజై కాళీ, జైజై భద్రకాళి నామాన్ని స్మరిస్తూ అమ్మవారి రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవం సందర్భంగా భక్తులు ఉప్పు, మిరియాలను చల్లుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, ఈఓ బాపిరెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. వివక్షతోనే ఇక్కట్లు మాజీ కౌన్సిలర్ ఆర్కాటు ముత్తు చాలా ఏళ్లుగా రథోత్సవంలో సేవలందించేవారు. కానీ ఆయన వైఎస్సార్సీపీ నాయకుడు కావడంతో కూటమి నేతలు కక్ష్య గట్టారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పంపకుండా అవమానించారు. ఈ క్రమంలో రథోత్సవానికి కొత్తవారిని నియమించుకున్నారు. వారు సకాలంలో బ్రేక్లు వేయకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. తెప్పోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతుల తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. విద్యుద్దీప కాంతుల్లో విహరిస్తున్న స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. మిల్లర్ల ఇష్టారాజ్యం తిరుపతి జిల్లాకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రైస్ మిల్లులు ఎక్కువ. నెల్లూరు నగరం చుట్టూరా వంద నుంచి 150 రైస్ మిల్లులు ఉన్నాయి. తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పది, శ్రీకాళహస్తిలో మరో పది రైస్ మిల్లులున్నాయి. తిరుపతి, చంద్రగిరిలో ఐదారు మిల్లులు ఉన్నాయి. అదే నెల్లూరులో ఇదొక పెద్ద ఇండస్ట్రీ లాగా ఉంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి నెల్లూరులో ఉన్న మిల్లులకే ధాన్యం వెళ్తుంది. రేషన్ బియ్యం కూడా నెల్లూరులోని కొన్ని మిల్లులకు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడులో ఇచ్చే రేషన్ బియ్యం (ఉప్పుడు బియ్యం) నెల్లూరు మిల్లులకే తరలిస్తున్నారు. నెల్లూరు అంటే మిల్లర్ల అడ్డాగా ఉంది. మిల్లర్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. సీజన్ ప్రారంభంకాగానే కల్లాల్లో వాలిపోతున్నారు. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ధాన్యాన్ని ఒకటికి సగానికి కొనుగోలు చేసి ఆపై మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యంగా ఆడించి మార్కెట్కు తరలించి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండకపోగా.. ఉక్కళంగా దోచుకెళ్తున్న మిల్లర్లు ఆడించే బియ్యానికి రోజురోజుకూ రేట్లు పెరుగుతుండడం గమనార్హం. దీనిపై అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.న్యూస్రీల్ అంగరంగ వైభవంగా శ్రీకాహస్తీశ్వరుడి రథోత్సవం రాత్రి తెప్పలపై విహరించిన సామి,అమ్మవార్లురథోత్సవంలో దొంగల చేతివాటం రథోత్సవంలో దొంగలు తమచేతి వాటం ప్రదర్శించారు. తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన సుభాషిణి అనే మహిళ రథోత్సవానికి రాగా.. నగరి వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు తెంపుకుని వెళ్లారు.నేడు శివపార్వతుల కల్యాణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల తర్వాత గజ వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, సింహ వాహనంపై జ్ఞానప్రసూనాంబదేవి బయలుదేరి పెండ్లి మండపం వద్దకు చేరుకోనున్నారు. అనంతరం సోమవారం వేకువ జామున స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు. -
రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
● తిరుపతి జిల్లాలో 86 పరీక్ష కేంద్రాలు ● పరీక్షకు హాజరుకానున్న 63,197 మంది విద్యార్థులు ● వెబ్సైట్లో హాల్ టికెట్లు ● ఆర్ఐఓ ప్రభాకర్రెడ్డి తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి జిల్లాలోని 86 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్ఐఓ ప్రభాకర్రెడ్డి తెలిపారు. మార్చి 1న ఇంటర్ ప్రథమ సంవత్సరం, 3న ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టు పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. 63,197 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్లో 31,325 మంది, ఒకేషనల్లో 1,324 మంది మొత్తం 32,649 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్లో 29,448 మంది, ఒకేషనల్లో 1,100 మంది, మొత్తం 30,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను కళాశాలతో నిమిత్తం లేకుండా ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం అధికారులు 0877–2237200, 0877–2237332 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో.. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ను పోలీస్ శాఖ అమలుచేయనుంది.ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులకు అనుగుణంగా బల్లలు, లైట్లు, ఫ్యాన్లు సిద్ధంచేశాం. తాగునీరు, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. డీఈసీ కమిటీ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాం. – జీవీ ప్రభాకర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేయాలి
ఆరోగ్యశ్రీకి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించాలి. బకాయిల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆదుకోవాలి. గత ఏడాదిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రజరుగుతున్నట్లు వార్తలు రావడం బాధాకరం. పేదల ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం భరోసా కల్పించాలి. గతంలో ఆరోగ్యశ్రీతో మా కుటుంబానికి రూ.3లక్షల మేర లబ్ధి చేకూరింది. నా భర్త ప్రాణాలను కాపాడింది. అలాంటి పథకాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలి. –కే స్రవంతి, గృహిణి, తిరుపతి రూరల్ తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వాలి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తున్నా ఆ ఊసేలేదు. రెండేళ్లకు సంబంధించి తల్లికి వందనం నగదు ఇవ్వాలి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించాలి. –ప్రమీల, చిరువ్యాపారి, తిరుపతి సూపర్సిక్స్ హామీలు అమలు చేయాలి జిల్లాలో సంక్షేమ పథకా ల ఊసేలేదు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల ను నెరవేర్చేందుకు 2025 –26బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇప్పటికే ఏడాది పాలన గడచినా సూపర్సిక్స్ అమలుపై ప్రభుత్వం నోరు మెదపలేదు. – ఎల్ఎస్ లక్ష్మీ, ఎఐఎంఎస్ మహిళా సంఘం, తిరుపతి -
తెలుగు భాషాభ్యున్నతికి సమష్టి కృషి
తిరుపతి సిటీ: తెలుగు భాషాభివృద్ధికి సమష్టి కృషి, నిరంతర ప్రణాళికలు అవసరమని ఎస్వీయూ వీసీ సీహెచ్.అప్పారావు తెలిపారు. ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖ, ప్రాచ్య పరిశోధనా సంస్థ, బెంగళూరుకు చెందిన తెలుగు సంపద సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ వేదికగా మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం, విశిష్టత ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశీ భాషల పట్ల వ్యామోహం పెరుగుతోందని, తెలుగు భాష అంతరిస్తూ ఉందనే విషయం సత్య దూరమైనదని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బోధన, అధికారిక కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం పెరగాలన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్.కృష్ణమూర్తి, విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథశర్మ, సదస్సు సంచాలకులు ఆచార్య రాజేశ్వరమ్మ, నిర్వహణ కార్యదర్శి ఆచార్య పీసీ వేంకటేశ్వర్లు, సలహాదారు డాక్టర్ రేమిళ్ల మూర్తి, పరిశోధకులు రమేష్ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
తిరుపతి సిటీ: చిన్న, సన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై అవగాహన కల్పిస్తోందని ఇన్చార్జ్ వీసీ జేవీ రమణ పేర్కొన్నారు. గురువారం వెటర్నరీ వర్సిటీ నిరంతర పశువైద్య విద్య, సమాచార కేంద్రం ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రంసంగించారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత, ప్రధాన శాస్త్రవేత బాలసుబ్రమణ్యం, విస్తరణ సంచాలకులు డాక్టర్ శోభామణి, కో–ర్డినేటర్ ప్రొఫెసర్ కే.సుజాత పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి నారాయణవనం: మండలంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టిన ప్రమాదంలో ఏసయ్య(57) మృతి చెందగా మురుగేశం(48)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రాజశేఖర్ కథనం.. మండలంలోని కసిమిట్టకు చెందిన ఏసయ్య, భీముని చెరువుకు చెందిన మురుగేశం ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి పని ముగించుకుని కంపెనీ బస్సులో పుత్తూరుకు వచ్చారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్పై ఇంటికి బయలుదేరారు. మండలంలో జాతీయ రహదారి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాళాశాల సమీపంలోకి వచ్చేసరికి ఇండికేటర్లు లేకుండా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న ఏసయ్య అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కుర్చున్న మురుగేశంకు తీవ్ర గాయాలయ్యాయి. పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏసయ్య మృతదేహాన్ని, వైద్యసేవల నిమిత్తం మురుగేశాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చస్తున్నట్టు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న మినీ వ్యాన్
– అక్కడికక్కడే డ్రైవర్ మృతి గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని జాతీయ రమదారి, ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ మనోజ్కుమార్ కథనం.. తమిళనాడు ఊతుకోటకు చెందిన వెంకటేషన్(45) మినీ వ్యాన్ డ్రైవర్. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వస్తున్న సమయంలో ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ట్రాలీని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. మినీ వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జుయ్యింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ తిరుపతి సిటీ: స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్లోని శ్రీవేంకటేశ్వర అకాడమీలో డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గీతాంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శనివారం అకాడమీలో జరగనున్న డెమో క్లాస్కు హాజరు కావాలని కోరారు. వివరాలకు 8179392526, 6303285971 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు తిరుపతి అర్బన్: ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కెనరా బ్యాంక్ తిరుపతి జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని ఎంఆర్పల్లి లక్ష్మీనగర్లో నూతనంగా నిర్మించిన కెనరా బ్యాంక్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ నుంచి అన్నిరకాల రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. తిరుపతి రీజనల్ ఆఫీస్ ఏజీఎం నాగరాజరావు, డివిజన్ల మేనేజర్లు శ్రవణ్కుమార్, సువర్ణకృష్ణ, హర్ష, స్వాతి పాల్గొన్నారు. -
త్వరితగతిన సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు
తిరుపతి తుడా: స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.మౌర్య అధికారులను ఆదేశించారు. పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు గడువు లోపు పూర్తి చేయాలని, కార్యాలయంలోని అందరూ విభాగాధిపతులకు గదులు ఉండేలా చూడాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈఈ రవి, ఏఈ కాం ప్రతినిధులు బాలాజి, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అన్నారు. -
ఆశలు.. ఆకాంక్షలు!
బడ్జెట్పై ఆశగా ఎదురుచూపు ● వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలంటున్న రైతులు ● అభివృద్ధి, సంక్షేమానికి సమానంగా నిధులు కేటాయించాలి ● జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి ● సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి ● నేడు పయ్యావుల బడ్జెట్పై ఆత్రుతగా ఎదురు చూస్తున్న జిల్లా ప్రజలు తిరుపతి సిటీ: జిల్లాలో అభివృద్ధి ఊసేలేదు. సంక్షేమం పడకేసింది. గత తొమ్మిది నెలలుగా జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలు కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. కక్ష్యసాధింపు చర్యలు తప్ప జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించలేదంటూ విమర్శిలు ఎక్కుపెడుతున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం 20శాతం కూడా అమలు చేయకపోవడంతో నిపుణులు, మేధావులు పెదవి విరుస్తున్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టే బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి, వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత బడ్జెట్ను నీరుగార్చారు కూటమి ప్రభుత్వం 2024–25లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంది. రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందించేందుకు రూ.4,500 కోట్లు, కౌలు రైతులకు రూ.20 వేలు ఇస్తామని, రూ.1000కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఆపై వాటిని అమలు చేయలేదు. తల్లికి వందనం పథకానికి గత బడ్జెట్లో రూ.6,487 కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది 2025–26 బడ్జెట్లోనైనా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తారా.. లేదోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
రేపు హాకీ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో శనివారం ఉదయం 7.30 గంటలకు హాకీ సీనియర్, బాలుర జిల్లా జట్లు ఎంపికకు పోటీలు నిర్వహించనున్నారు. ఆ మేరకు హాకీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఆదిత్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న సీనియర్ బాలుర జట్టు మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించనున్న 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే బాలుర విభాగపు క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, 1 పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలని సూచించారు. వివరాలకు 70131 77413 నంబరులో సంప్రదించాలని కోరారు. -
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
తిరుపతి అర్బన్: జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగించినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి మే 31 వరకు గడువు పెంచినట్టు వెల్లడించారు. ఆయా మీడియా సంస్థల నుంచి యాజమాన్యం వారు తమ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి ఇవ్వాలని సూచించారు. వారు ఇచ్చే స్టిక్కర్లతో ఆర్టీసీలో బస్సు పాస్ పొందాలని తెలిపారు. చెరువులో పడి వివాహిత మృతి ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం, వికృతమాల చెరువులో పడి వివాహిత మృతి చెందినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. వివరాలు.. మర్రిమంద బీసీ కాలనీలో కరివెళ్ల నవనీత (40), భర్త రామ్మూర్తి, కుమారుడు ధరణి(24) నివసిస్తున్నారు. రామ్మూర్తి నిత్యం తాగి, భార్యను హింసించేవాడు. కుమారుడు ధరణి స్థానికంగా ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ తండ్రి మార్గంలో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో శివరాత్రి రోజున కూడా రామ్మూర్తి మద్యం తాగి ఇంటికి రావడంతో అతని భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. జీవితం మీద విరక్తి చెందిన నవనీత అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి సమీపంలోని వికృతమాల చెరువులో దూకి మృతిచెందింది. యూఏఎన్ కార్డుతోనే పథకాలు తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు పొందడానికి యూఏఎన్ (యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) కార్డు తప్పనిసరి అని కార్మికశాఖ తిరుపతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చిన్నలాలెప్ప స్పష్టం చేశారు. గురువారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో ఆయన కార్మికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పేదోడు ఈ కార్డును చేయించుకోవాలని సూచించారు. ప్రధామంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదంతో మృతి చెందినా లేదా అంగవైకల్యం నెలకొన్నా రూ.2 లక్షల బీమా యోజన పొందవచ్చని చెప్పారు. ఈ కార్డును ఉచితంగానే అందజేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ తిరుపతి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు, ఆర్టీసీ సీనియర్ కంట్రోలర్ వీఆర్ కుమార్, కార్మికశాఖ సర్కిల్–1 అధికారి ప్రవీణ్కుమార్, సర్కిల్–2 ఆఫీసర్ శ్రీమన్నారాయణ, సర్కిల్–3 అధికారి రాజయ్య పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు తిరుపతి క్రైం: నగరంలోని ఎయిర్బైపాస్ రోడ్డులోని ఓ సెలూన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. తిరుపతి అగ్నిమాపక అధికారి కిరణ్కుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఎయిర్బైపాస్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఎదురుగా ఉన్న నేచురల్ సెలూన్ మొదటి అంతస్తులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.20 లక్షలకు పైగా ఆస్తినష్టం వచ్చినట్టు షాపు యజమాని గిరిధర్ తెలిపారని చెప్పారు. -
కన్నప్ప కొండపై క్షుద్రపూజల కలకలం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కన్నప్ప కొండపై బుధవారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని కొండమీద ప్రతిష్టించిన శివలింగం వద్ద తమిళనాడుకు చెందిన ఓ అఘోరా విచిత్ర పూజలు నిర్వహించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. అఘోరా లాగా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి తల మీద నిమ్మకాయ, దానిపైన కర్పూరం వెలిగించుకుని మంత్రోచ్ఛారణలు చేస్తూ పూజలు చేశాడు. శివలింగం ముందు అనేక నిమ్మకాయలను నక్షత్రం లాగా పెట్టి మధ్యలో కర్పూరాలు వెలిగిస్తూ ఏదో మంత్రాలు చదువుతూ పూజలు చేయడం భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ ఎవరూ ఆ అఘోరాను ప్రశ్నించలేదు. అక్కడ ఉన్న భక్తులే అఘోరాను ప్రశ్నించారు. తమిళనాడు నుంచి వచ్చానని అఘోరా భక్తులకు చెప్పాడు. పదవీయోగం సిద్ధిస్తుందనీ! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయం వద్ద అనేక మంది భక్తులు జాగరణ చేస్తుండగా ఓ వ్యక్తి కన్నప్ప కొండమీద శివలింగం వద్ద ఈ విధమైన పూజలు నిర్వహిస్తుంటే అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పాలకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రేణిగుంట: శ్రీకాళహస్తి మండలం, కాపుగున్నేరి సమీపంలోని ఓ సీతల పానీయం తయారీ కంపెనీ ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి పట్టణం, బీపీ అగ్రహారానికి చెందిన పుచ్చకాలయ కిరణ్ మేర్లపాకలోని తన బంధువుల ఇంటికి వచ్చి, అక్కడి నుంచి బి.శరవణ కుమారుడు సాదుతేజ్(4)ను తీసుకుని ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తికి బయల్దేరాడు. కాపుగున్నేరి సమీపంలో ఓ కర్మాగారం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అదుపు తప్పి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్పై కూర్చున్న చిన్నారి సాదుతేజ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంట్లో చోరీ
చంద్రగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల పరిధిలోని దిగువ కాశిపెంట్లలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బరామిరెడ్డి వివరాల మేరకు.. దిగువ కాశిపెంట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్చౌదరి ఇటీవల మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల తర్వాత కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటూ తరచూ ఇక్కడకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పైన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్దకు చేరుకుని ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అపై పడక గదిలోని బీరువాలో ఉంచిన 26 గ్రాముల బంగారం, కొంత నగదు నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గౌరవవేతనం పెంచాల్సిందే తిరుపతి సిటీ: వెటర్నరీ జూడాలకు గౌరవవేతనాన్నిపెంచాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా స్టైఫండ్ పెంచాలని వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న న్యాయ పోరాటానికి ఏపీ రైతు సంఘం, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థుల న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
నేడు రథోత్సవం, తెప్పోత్సవం
● శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తులు ● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ● విశిష్ట వాహనాలపై ఊరేగిన ఆదిదంపతులు ● శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కై లాసం ఇంద్ర విమానంపై ముక్కంటి రాజసం హర హర మహాదేవ.. శంభో శంకర.. నమో పార్వతీపతయే నమః.. ముక్కంటీశా పాహిమాం.. పరమేశ్వరా రక్షమాం.. ఓం నమఃశ్శివాయ అంటూ ఆదిదేవుని స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. మహిమాన్విత వాయులింగేశ్వరుని దివ్యతేజస్సును వీక్షించి పులకించారు. ఆదిమధ్యాంత రహితుని ఆత్మలింగ దర్శనంతో పునీతులయ్యారు. నిజరూపంతో సాక్షాత్కరించిన నీలకంఠుని సేవించుకుని తరించారు. ఇంద్ర విమానంపై ఊరేగుతున్న కై లాసనాథునికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అత్యంత ప్రీతిపాత్రమై నంది వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తున్న లయకారుని మనసారా స్తుతిస్తూ పరవశించారు. పవిత్ర లింగోద్భవ కాలంలో త్రినేత్రుని తేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని కోటి జన్మల పుణ్యఫలం పొందారు. శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. వాయులింగేశ్వరుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలు జరిపించారు. అలాగే ఉచ్ఛికాలాభిషషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం చేపట్టారు. పర్వదినం సందర్భంగా మొత్తం 9 విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈక్రమంలోనే మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామి, అమ్మవార్లను మేల్కొలిపారు. అనంతరం గోపూజ చేశారు. 3 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5 నుంచి 10.30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాలఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు సులభతరంగా స్వామి, అమ్మవార్లను సేవించుకునే వెసులుబాటు ఏర్పడింది. క్యూలను విభజించి పకడ్బందీగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనివితీరు ముక్కంటీశుని దర్శించుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు సుమారు 1.5లక్షల మంది భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదని వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఇంద్రవిమానంపై పురవీధుల్లో ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంపై కొలువుదీరి అనుసరించారు. మూషిక వాహనంపై వినాయకుడు, శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగింపులో ముందుకు సాగారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మహోత్సవం ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశౠరు. అలాగే రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతులు తెప్పలపై విహరించనున్నారు. ఈ మమేరకు పుష్కరణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
తిరుపతి క్రైమ్ : జిల్లాలో సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి శాంపిళ్లు సేకరించాలని కోరారు. ఎక్కడైన అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయిని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. నవోదయం 2.0ను విజయవంతం చేయాలని చెప్పారు. తాగుబోతు వీరంగం తిరుపతి మంగళం రోడ్డులోని ఓ బార్ వద్ద బుధవారం ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు.వివరాలు.. చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన లోకేష్ అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగి నారా హంగామా చేశాడు. కానిస్టేబుళ్లు గంగాసాగర్, గోపీనాథ్ రెడ్డి అదుపు చేసేందుకు యత్నించగా తిరగబడ్డాడు. కానిస్టేబుల్ గంగాసాగర్పై దాడి చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాదాలకు కేరాఫ్ వెటర్నరీ
● వర్సిటీలో స్తంభించిన పాలన ● 24రోజులుగా తరగతులకు హాజరుకాని విద్యార్థులు ● సమ్మె విరమణ ససేమిరా అంటున్న జూడాలు తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత ఏడు నెలలుగా వర్సిటీలో అధికారులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీ అనుబంధంగా నడుస్తున్న పశువైద్య కళాశాలల్లో అధ్యాపకుల బదిలీలు నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. గరివిడి కళాశాలను కేంద్ర బృందం తనిఖీ చేసిన సమయంలో వర్సిటీ అధికారుల హడావుడి బదిలీలపై ఆరోపణలు వినిపించాయి. అలాగే వర్సిటీ ఆవరణలోని మహిళ, పురుషుల వసతి గృహాలలో మౌలిక సదుపాయలు లేకపోవడం, నాసిరకం భోజనం అందించడంతో విద్యార్థులతు మెరుపు సమ్మెకు దిగిన సంఘటనలు కోకొల్లలు. అలాగే ఔట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించకపోవడంతో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు పలు మార్లు నిరసన తెలిపారు. నూతన రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కనీసం నెలరోజులు గడవకుండానే దీర్ఘకాలిక లీవులో ఉండడం వంటి ఎన్నో సమస్యలు వర్సిటీని వేధిస్తున్నాయి. కానీ, అధికారులు అవేమీ తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తూ గ్రూపు రాజకీయాలను నడుపుతూ పబ్బం గడుపుతన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వ్యవహారశైలిపై వర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. తరగతుల బహిష్కరణ..పట్టించుకోని అధికారులు వెటర్నరీ వర్సిటీలో పశువైద్య విద్యార్థులు తమ గౌరవ వేతనం పెంచాలని గత 24 రోజులుగా తరగతులను బహిష్కరించారు. రోడ్డెక్కి సమ్మెకు దిగారు. అయినప్పటికీ వర్సిటీ అధికారుల్లో చలనం లేకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు పలువురు మంత్రులను నేరుగా కలసి తమ గోడును విన్నవించుకున్నా స్పందన కరువైందని వెటర్నరీ జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సమ్మె విరమించాలని అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘాల నేతలతో ఒత్తిడి చేయిస్తుండడంపై మండిపడుతున్నారు. తమ ఆందోళనను నిర్వీర్యం చేసేందుకు వర్సిటీ అధికారులు కుట్రలు పన్నుతున్నారని వాపోతున్నారు. గౌరవ వేతనం పెంచే వరకు నిరసన కొనసాగుతుందని, అడ్డుకునేందుకు యత్నిస్తే ప్రాణ త్యాగానికై నా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. పశువైద్య విద్యార్థుల గౌరవ వేతనం వివరాలు బీవీఎస్సీ 7వేలు ఎంవీఎస్సీ 10వేలు పీహెచ్డీ 12వేలు బీవీఎస్సీ 25వేలు ఎంవీఎస్సీ 50వేలు పీహెచ్డీ 75వేలు ఆరోపణలు సత్యదూరం వెటర్నరీ విద్యార్థులు కొంతకాలంగా సమ్మెలో ఉన్నారు. వారి సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సమస్యపై చర్చిస్తున్నాం.విద్యాసంవత్సరం ముగింపు దశలో ఇలా విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం సరికాదు. వెంటనే తరగతులకు హాజరుకావాలి. వర్సిటీలో పాలన సజావుగా సాగుతోంది. రాజకీయాలు, వివాదాలంటూ వస్తున్న ఆరోపణలు సత్యదూరం. విద్యార్థుల శ్రేయస్సు, వర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – జేవీ రమణ, ఇన్చార్జి వీసీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ -
రేపు తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలోని నాక్ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పదోతరగతితోపాటు ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. ఆసక్తిగలవారు ఆధార్ కార్డుతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని రావాలని సూచించారు. ఈ మేరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 9703437472,9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ప్రాణదాన ట్రస్ట్కు భారీగా విరాళాలు తిరుమల : టీటీడీ ప్రాణదాన ట్రస్ట్కు బుధవారం రూ.81 లక్షలు విరాళంగా అందాయి. చైన్నెకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.70 లక్షల విరాళం అందించింది. వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.11 లక్షలు అందజేసింది. దాతలు ఈ మేరకు చెక్లను టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందించారు. పక్షుల కేంద్రంలో రైల్వే డీఆర్ఎం దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని బుధవారం విజయవాడ డివిజన్ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ సందర్శించారు. కడప చెట్లుపై విడిది చేసిన విహంగాల విన్యాసాలను కెమెరాతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నేచర్ గైడ్ హుస్సేనయ్య మాట్లాడుతూ పక్షుల జీవన విధానాలను వివరించారు. ఆదిలక్ష్మికి కాసులహారం రాపూరు :పెంచలకోనలోని నృసింహుని ఆలయంలో ఆదిలక్ష్మీదేవికి బుధవారం బంగారు కాసుల హారాన్ని దాతలు బహూకరించినట్లు అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన గురుబెల్లి లక్ష్మీనారాయణ, చైతన్య దంపతులు 39 గ్రాముల బంగారు కాసుల హారాన్ని అందించినట్లు వివరించారు. తిరుమల నాగతీర్థంలో ప్రత్యేక పూజలు తిరుమల: తిరుమలలోని నాగతీర్థంలో కొలువైన పరమశివుడికి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశేష ప్రసాదాలను సమర్పించారు. ఈ క్రమంలోనే ఆదిదేవును దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అన్నదానం చేపట్టారు. సుమారు వెయ్యిమందికి అన్నప్రసాదాలు అందించినట్టు స్థానిక భక్తులకు అనిల్ తెలిపారు. -
సామాన్య భక్తుల ఇక్కట్లు
ముక్కంటి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలను చూసి కంగారు పడ్డారు. సామాన్య భక్తులకు తీవ్రంగా ఇబ్బందివ పడ్డారు. ఎమర్జెన్సీ దారులు లేకపోవడంతో గంటలు తరబడి వేచి ఉన్న మహిళలు బాత్రూమ్కు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేసినా, అర్ధరాత్రి వరకు 60 వేల మంది భక్తులు మాత్రమే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం గమనార్హం. అయినప్పటికీ చిన్నపాటి తోపులాటలు, భక్తులు అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మదర్ ఫీడింగ్ కోసం ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రాఫిక్ కష్టాలు వాహనాలను వంతెనకు అవతలే నిలిపేశారు. అయినప్పటికీ ప్రోటోకాల్ పేరుతో వీఐపీల వాహనాలు ఆలయ నాలుగో గేటు వరకు వచ్చాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు ఏర్పాడ్డాయి. -
హోంమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం
వరదయ్యపాళెం : శాసన మండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నా మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాపై మాట్లాడే నైతిక హక్కు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదన్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తొలగించేందుకు కుట్రలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల నైపుణ్యతను పెంచేందుకు ఇంగ్లిష్ మీడియం అవసరమని తెలిపారు. అందుకే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుచూపుతో సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని వెల్లడించారు. దీనిపై అప్పట్లో ఎల్లోమీడియా తెలుగు భాషాను నిర్వీర్యం చేస్తున్నట్లు బురదచల్లిందని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ మాధవరావుపై హోంమంత్రి చేసిన ఆరోపణలు సరికాదని స్పష్టం చేశారు. -
గుడిమల్లం ఆలయంలో తొక్కిసలాట
ఏర్పేడు(రేణిగుంట) : ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన భారతదేశపు తొలి శైవక్షేత్రం పరశురామేశ్వరాలయంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కాసేపు సజావుగా భక్తులు దర్శించుకున్నారు. ఇంతలో టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేసి తమ కుటుంబ సభ్యులు, బంధువులను ప్రత్యేక ద్వారం ద్వారా తీసుకెళ్లి దర్శనాలు చేయించుకున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తులు, చంటి బిడ్డల తల్లులు గంటల తరబడి క్యూలో నిలిచిపోయారు. అధికారులు విఫలం ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి ఉత్సవాల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. అతిపురాతన శివాలయంగా పేరుగాంచిన ఈ ఆలయ దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వారికి కనీస సదుపయాలను కూడా కల్పించకుండా భక్తుల సహనాన్ని ఈఓ పరీక్షించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు పెత్తనం తన చేతిలోకి తీసుకుని వీఐపీల సేవలో తరిస్తూ, సామాన్య భక్తులను ఇబ్బందిపెట్టారు. దీంతో పోలీసులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా క్యూలో తోపులాటలు మొదలై మహిళలు కింద పడ్డారు. దీంతో ఆలయంలో గందగోళ పరస్థితులు తలెత్తాయి. గత ఏడాది ఎంతో సవ్యంగా ఏర్పాట్లు చేశారని, అయితే ఈ సారి సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించారని పలువురు మండిపడ్డారు. వీఐపీల సేవలో కూటమి నేతలు చేతులెత్తేసిన అధికారులు దర్శనానికి గంటల తరబడి నిరీక్షించిన సామాన్య భక్తులు -
తలకోనలో పోటెత్తిన భక్త జనం
తలకోన(భాకరాపేట): మహా శివరాత్రిని పురష్కరించుకుని తలకోనకు బుధవారం ఉదయమే భక్తులు పోటెత్తారు. వేకువజామున సిద్ధేశ్వరి సమేత శ్రీసిద్ధేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలోనే తలకోన ఝరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదిదంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిదంపతుల సేవలో పెద్దిరెడ్డి తలకోన బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి పాల్గొన్నారు. ఆదిదంపతులను దర్శించుకున్నారు. పట్టువస్త్రాల సమర్పణ సిద్ధేశ్వరి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామికి చెవిరెడ్డి మోహిత్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ పరమేశ్వరుని సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మహాదేవుని ప్రార్థించినట్లు వెల్లడించారు.