truck collision
-
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాహోహ్ జిల్లాలో మంగళవారం ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్నాయి, ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. సామాన్న గ్రామ సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని జబల్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దామోహ్ ఎస్పీ శృతికీర్తి సోమవంశీ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, అతడు మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అని విచారిస్తున్నట్లు చెప్పారు.మృతులను గుర్తించే పని జరుగుతోందని తెలిపారు. ఆటో డ్రైవర్కు కూడా గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు ట్రక్ డ్రైవర్పై దేహత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగం, పోలీసులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి ఆర్థిక సాయం కింద రూ. 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురి దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుణాలోని జాతీయ రహదారిపై( NH46) మంగళవారం పొగమంచు కమ్ముకోవడంతో స్పీడ్గా వచ్చిన ఓ ట్రక్కు ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 టన్నులతో కూడిన స్రాప్తో వెళ్తున్న ట్రక్కు.. కారును ఓవర్ టేక్ చేయసే ప్రయత్నంలో అదుపుతప్పి కారుపై దూసుకెళ్లింది. మృతులను రాజ్గఢ్ జిల్లాకు చెందిన దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో బాధితుల తుల బంధువులను సంప్రదించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించడపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. VIDEO | Four killed in a road accident near Guna, Madhya Pradesh. More details are awaited. pic.twitter.com/OivWSq6pJm — Press Trust of India (@PTI_News) December 26, 2023 అదేవిధంగా ధార్ జిల్లాలోని ఆగ్రా-ముంబయిజాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి ముందున్న అయిదు వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఒకదానితో ఒకటి ఢీకొని ఆరు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ట్రక్కుతోపాటు మరో అయిదు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. #WATCH | Dhar, Madhya Pradesh: A major accident occurred at Ganesh Ghat located on the Agra-Mumbai National Highway where six vehicles, including cars and one truck, caught fire after colliding with each other. Police and fire brigade on the spot. Efforts to douse the fire are… pic.twitter.com/FD8KVrE3L1 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023 -
ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతవాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. -
లారీని ఢీకొట్టిన బస్సు డ్రైవర్ మృతి
-
లారీని ఢీకొన్న కోణార్క్ ఎక్స్ప్రెస్
భువనగిరి,న్యూస్లైన్: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఆదివారం కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు లారీని ఢీకొట్టింది. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. భువనగిరి నుంచి జగదేవ్పూర్ వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న హన్మాపురం రైల్వే గేటును సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ రైలు కోసం మూసివేశారు. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత మరో రైలు వస్తున్న సమాచారం తెలుసుకోకుండానే గేట్మ్యాన్ గేటు తీశాడు. దీంతో గేటు బయట నిలిచి ఉన్న లారీని డ్రైవర్ ముందుకు కదిలించాడు. ఇదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రావడంతో ట్రాక్ దాటి వెళ్తున్న లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో లారీ ట్రాక్పై కొద్దిదూరంలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంతో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.