TVK Vijay
-
విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్
-
TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్
-
తమిళనాడులో సంచలనం.. సీఎం అభ్యర్థిగా కొత్త పేరు..?
సాక్షి, చెన్నై: ప్రస్తుతం ఏ నోట చూసినా తమిళనాడు రాజకీయాల చర్చే.. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనేదే ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న.. తంబీల రాజకీయాలు ఇంత వేడిగా ఉన్న సమయంలో ఇప్పుడు మరోక ఆసక్తికర ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్యా వీసీకే చీఫ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వేళ వీసీకే ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్ సంచలన ప్రతిపాదన తెరమీదకి తెచ్చారు." ప్రస్తుత అనిశ్చిత రాజకీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్ పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలి" అని ఇరు పార్టీలను ఎక్స్ వేదికగా కోరారు. కేవలం అభిమానుల బలంపై ఆధారపడిన పాపులరిజం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సెల్వన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అనుభవం ఉన్న, అవినీతి మరక లేని తిరుమావళవన్ వంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజకీయ స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ప్రజల్లో ఉన్న బలమైన భావన అని పేర్కొన్నారు.ఒకవేళ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే, అది కొత్తగా వచ్చిన తారల ద్వారా కాకుండా, ప్రజల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న తిరుమావళవన్ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు.కాగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సినీ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీకి మరో 10 సీట్ల దూరంలో ఆయన నిలిచిపోయారు. దీంతో మిగతా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వీసీకే పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీకి ఎన్నికల్లో 2 స్థానాలు వచ్చాయి. -
విజయ్ కి గుడ్ న్యూస్..లైన్ క్లియర్ చేసిన స్టాలిన్
-
ఎందుకిలా చేశారు?.. తమిళనాడు గవర్నర్ సీరియస్
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను సీఎస్, డీజీపీ కలిశారు. విజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారంటూ డీజీపీని గవర్నర్ ప్రశ్నించారు. ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారంటూ గవర్నర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత శాంతి భద్రతలపై గవర్నర్కు డీజీపీ నివేదిక ఇచ్చారు.కాగా, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు పోలీస్ శాఖ కేటాయించింది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.తాజా పరిణామాలతో విజయ్ కాన్వాయ్ను తొలగించారు. మరో వైపు, రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలు చేపట్టింది. తమిళనాడులో క్షణం క్షణం రాజకీయ పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో చెప్పడంతో పరిస్థితి మారిపోయింది.ఇవాళ పుదుచ్చేరిలోని రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలతో పళనిస్వామి భేటీ కానున్నారు. 30 మంది ఎమ్మెల్యేల కోసం అత్యంత విలాసమైన రిసార్ట్ను పళనిస్వామి బుక్ చేశారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే వైపు చూస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పళనిస్వామి ఉన్నారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్ కూడా సమావేశం కానున్నారు. -
10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్ మ్యాజిక్ ఫిగర్, ట్విస్టులే ట్విస్టులు!
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠం అధిరోహించాలంటే నెంబర్ గేమ్ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ పూర్తికాని నేపథ్యంలో ఆ మూడు పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు విజయ్ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.విజయ్కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్ను కలిసి, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలైన విజయ్ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు టీవీకే : 108డీఎంకే : 59, ఏఐడీఎంకే : 47కాంగ్రెస్: 5సీపీఐ(ఎం), సీపీఐ, బీసీకే : తలా 2 స్థానాలుబీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1 ట్విస్ట్ ఏంటంటే..ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే.ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
'విజయ్ను గవర్నర్ అందుకే అడ్డుకుంటున్నారు'
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. రాజ్యాంగబద్దంగా నడుచుకోకుండా, బీజేపీ ఆడించినట్టు ఆడుతున్నారని మండిపడుతున్నారు. గవర్నర్ వైఖరి ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గురువారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి గవర్నర్ తలొగ్గారని ధ్వజమెత్తారు. రాజ్భవన్లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గవర్నర్కు లేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన టీవీకే విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీ నిరూపించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.''గవర్నర్ అర్లేకర్కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడి కారణంగా.. గవర్నర్ రాజ్యాంగానికి, తమిళనాడు ప్రజలకు కాకుండా బీజేపీకి తలొగ్గుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రాజ్భవన్లో మెజారిటీని నిరూపించుకోమని అడిగే అవకాశం గవర్నర్కు రాజ్యాంగం ఇవ్వలేదు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ తప్పక గౌరవించాలి. మెజారిటీని నిరూపించుకోవడానికి రాజ్యాంగం నిర్దేశించిన వేదిక శాసనసభ. గవర్నర్ ముందు మెజారిటీని ఎందుకు నిరూపించుకోవాలి?విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలనిరూపణకు సమయం ఇవ్వాలి. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతో తమిళనాడును పాలించడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. గవర్నర్ దొడ్డిదారిన తన పాలనను రుద్దడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారు. లౌకిక పార్టీలన్నీ ముందుకు వచ్చి గవర్నర్ వ్యవహారశైలిని ఎండగట్టాలి. లౌకికవాదాన్ని విశ్వసించేవారు, తమిళనాడులో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ పాలనను నిరోధించాలనుకునేవారు బయటకు వచ్చి ప్రజల తీర్పుకు మద్దతు ఇవ్వాల''ని గిరీష్ చోడంకర్ కోరారు. చదవండి: విజయ్ కోసం గళమెత్తిన కమల్, ప్రకాశ్రాజ్బీజేపీ కనుకసన్నల్లో గవర్నర్రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వ్యవహరిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. సెల్వపెరుంతగై గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. ఆ తర్వాత బలపరీక్ష జరుగుతుంది. అయితే, ఆయన (గవర్నర్) భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామ''ని చెప్పారు. -
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు సంఖ్యాబలం తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేశారు.ఇందులో భాగంగా విజయ్ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం వామపక్షాలకు లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, ఇప్పుడు నేరుగా నేతలతో సమావేశమై మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది.మరోవైపు, వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయం కీలకంగా మారింది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనుంది.ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. సీపీఐ,సీపీఎం,వీసీకే వంటి వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇస్తే సంఖ్య 118 దాటే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీవీకే మద్దతుదారులు లోక్భవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. గవర్నర్ ఆలస్యంపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
వాళ్లకు ఛాన్స్ ఇవ్వను.. విజయ్ కి గవర్నర్ గుడ్ న్యూస్
-
రసవత్తరంగా తమిళ రాజకీయం గవర్నర్ ను కలిసిన పళనిస్వామి
-
మిస్ చేసుకుంటే విజయ్ CM కాలేడు..!
-
విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు
-
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
మిత్ర పక్షాలతో భేటీ.. స్టాలిన్ కీలక నిర్ణయం
చెన్నై: డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. కాగా, వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన టీవీకే అధినేత విజయ్.. లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్టాలిన్తో మిత్రపక్షాల నేతలు భేటీ అయ్యారు. విడిగా పార్టీ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, తమ నిర్ణయం ఏంటన్నది ఈ భేటీల తర్వాత ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. లోక్ భవన్లో గవర్నర్తో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా భేటీ కానున్నారు.ఇదిలా ఉండగా.. గవర్నర్, విజయ్ భేటీపై లోక్భవన్ వివరణ ఇచ్చింది. మెజార్టీపై టీవీకే పూర్తి వివరాలు ఇవ్వలేదని.. సంఖ్యాబలం చూపించాలని విజయ్ను కోరామని లోక్ భవన్ తెలిపింది. మరో వైపు, లోక్సభ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మద్దతు ఇవ్వమని ఇదివరకే వీసీకే ప్రకటించింది. కాగా, విజయ్ లేఖ నేపథ్యంలో వీసీకే పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
118 మందితో రా.. విజయ్ కి గవర్నర్ భరోసా..
-
విజయ్ కోసం గళమెత్తిన కమల్, ప్రకాశ్రాజ్
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వైఖరిని పలువురు సినిమా ప్రముఖులు తపుబట్టారు. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తాత్సారం ప్రదర్శించడాన్ని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని అన్నారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరశైలిపై సీనియర్ నటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఎక్స్లో స్పందించారు.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ''శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు. తమిళనాడు చరిత్రలో ఇది అపూర్వమైన నిర్ణయం. ప్రజల తీర్పును గౌరవించి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తాను.ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నవారు కూడా అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తుచేయడం మాత్రమే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలి. మెజారిటీని రాజ్భవన్లో కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింద''ని కమల్ హాసన్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.గవర్నర్ తీరుపై ప్రకాశ్రాజ్ ఫైర్తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్రాజ్ కూడా విమర్శలు గుప్పించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, ఆయన వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ''విజయ్తో మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయనకు అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చింది. అసెంబ్లీలో తన హక్కును వినియోగించుకోవడానికి విజయ్కు గవర్నర్ అవకాశం ఇవ్వాల''ని ప్రకాశ్రాజ్ డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అవకాశం కల్పించాలని కోరారు. చదవండి: టీవీకే ప్రభుత్వాన్ని నడపగలదా?తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు కలిగిస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయ్ సంయమనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, అన్నివైపుల నుంచి విమర్శలు రావడంలో గవర్నర్ మెత్తబడ్డినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని విజయ్కు హామీయిచ్చినట్టు తాజా సమాచారం. -
పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్మీట్లో పోసాని మాట్లాడారు. నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. -
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
-
ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్
-
త్రిష- విజయ్ల పెళ్లెప్పుడు?.. తెగ వెతికేస్తోన్న నెటిజన్స్..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు దళపతి విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని(108 స్థానాలు) నమోదు చేసింది. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ ఫోకస్ అంతా మేజిక్ ఫిగర్(118)కి కావాల్సిన సభ్యులను పోగు చేయడంపైనే పెట్టాడు. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ రోజే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి నెటిజన్స్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిషతో పెళ్లి ఎప్పుడు? వారిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వయసు తేడా ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే విజయ్ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఓ నటితో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట ట్రెండ్ అయింది. విజయ్-త్రిషలు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఎక్కువైయ్యాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిష బర్త్డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. విజయ్ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. మరికొంతమంది అయితే.. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టిపెడతాడని, ఐదారు నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. ఏదేమైనా పెళ్లి మాత్రం చేసుకోవడం పక్కా అని తేలడంతో.. అందరూ విజయ్-త్రిషల వయసుపై గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనేది చాలా మంది గూగుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. విజయ్ 1974 జూన్ 22న జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం 51 ఏళ్లు. త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ తేడా ఉంది. విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెరపై వీరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్పై పుకార్లు రావడమే కానీ.. అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. -
తమిళనాడు సీఎం విజయ్..?
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
విజయ్ దూకుడు షురూ... గవర్నర్ గ్రీన్ సిగ్నల్.?
-
విజయ్కు మద్దతుగా ప్రకాష్ రాజ్
-
విజయ్ మద్దతు పెరిగిందా? పళనిస్వామి ప్లాన్ పై సస్పెన్స్
-
పొలిటికల్ థ్రిల్లర్
-
విజయ్ ప్రభుత్వానికి.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్
-
విజయ్కు గవర్నర్ గ్రీన్సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్సిగ్నల్తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
దళపతి విజయ్ పై కుట్రలు.. పోసాని సంచలన వ్యాఖ్యలు
-
తమిళ రాజకీయాల్లో పళని బాంబు!
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పచ్చ జెండా ఊపడం లేదు. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు విజయ్ లోక్భవన్లో ఉండగానే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. విజయ్ తర్వాత పళనిస్వామి తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో విజయ్ టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తారా? లేదంటే మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందని ఆ పార్టీ నూతన ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారన్నది ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి గెలిచిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకున్నారు. ఆపై టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నుంచి ఓ ప్రకటన వెలువడింది. కానీ, తెర వెనక మరో వ్యవహారం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి.. టీవీకేకు మద్దతు ఇద్దామని అన్నాడీఎంకేలో ఓ వర్గం పళనిస్వామిపై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్తో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఓ వర్గం(15 నుంచి 25 దాకా ఉన్నారనే టాక్) ఏర్పాటు అయ్యిందని.. అప్రమత్తమైన పళనిస్వామి వాళ్లను మందలించారని.. మొండిపట్టుతో ఉన్న షణ్ముగం టీం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్కు తరలిపోయిందని.. పళనిస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే ఉండిపోయిందని.. ప్రచారం జోరందుకుంది. ఇది అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఒకవేళ విజయ్కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినా.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కోరినా.. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసినా.. ఇలా ఏది జరిగినా అది తమిళ రాజకీయాల్లో పళని పేల్చిన బాంబే కానుంది. -
విజయ్పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ని విజయ్ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
నాన్న చనిపోయాడురా విజయ్... కన్నీళ్లు పెట్టుకున్న జీవా..
-
గంటగంటకూ ఉత్కంఠ..! తమిళ రాజ్యమేలేదెవరు..?
-
టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్భవన్కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్తో రావాలని టీవీకేకు గవర్నర్ అర్లేకర్ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్కు గవర్నర్ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్తో భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. గతంలో.. సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్కు 28 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్ ఫిగర్(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్ కాంగ్రెస్ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు విజయ్ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. విజయ్ కోరినట్లు రెండు వారాల గడువు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.కాబట్టి విజయ్ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్ భావిస్తున్నారు. నేషనల్ లెవల్లోనూ..గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. -
విజయ్ కు సీబీఐ నోటీసు? కాంగ్రెస్ దయాకర్ సంచలన కామెంట్స్
-
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
అధికారం కోసం కొత్త పొత్తు.. మాజీ శత్రువులు ఇప్పుడు కొత్త మిత్రులు?
-
జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ
తమిళనాడు: తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విజయ్ విజయం వెనుక 5 మాస్టర్ మైండ్స్
-
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్భవన్లో గవర్నర్తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్భవన్లో గవర్నర్తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్తో పళనిస్వామి భేటీ. గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్ను కలిసిన విజయ్👉లోక్భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్భవన్కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్భవన్కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
తమిళ రాజకీయంలో ఊహించని ట్విస్ట్...
-
తమిళనాడు గవర్నర్ తీరుపై సుబ్రమణ్యస్వామి ఫైర్
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుపై మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ‘‘తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ టీవీకే నాయకుడు విజయ్ను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించి, సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని అన్నారు.కాగా, గురువారం (ఏప్రిల్ 7న) ప్రమాణ స్వీకారం చేద్దామని టీవీకే విజయ్ భావించి అందుకు ప్లాన్ వేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందుగా మెజారిటీ మద్దతుకు ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం. It is shocking that despite TVK being the single largest party in the Tamil Nadu State Assembly Elections, the TN State Governor has not yet invited the TVK leader, Mr Vijay, to form the Government. I demand that in the interest of Democracy, the Governor of Tamil Nadu…— Subramanian Swamy (@Swamy39) May 6, 2026 -
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
టీవీకేతో కాంగ్రెస్ పొత్తు.. డీఎంకే షాకింగ్ రియాక్షన్
చెన్నై: భవిష్యత్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.సోనియా, మన్మోహన్ సింగ్లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్కు పెద్ద తేడా లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది. -
టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం. పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మెజారిటీ మద్దతు నిరూపించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందు మెజారిటీ మద్దతుకు పత్రాలరూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. ఈ పరిణామం వల్ల టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రణాళిక దెబ్బతింది. ప్రమాణ స్వీకారంలో విజయ్ సహా నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, సభలో మెజారిటీ నిరూపణకు రెండు వారాలు గడువు కోరాలని భావించారు.కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్కు ఉన్న దీర్ఘకాల మైత్రి చెడిపోయింది. టీవీకే-కాంగ్రెస్ స్నేహబంధం ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, రాజ్య సభ ఎన్నికలు సహా భవిష్యత్లో జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పాయి. టీవీకే తన ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఓ ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్కు తరలించింది.అనుమతి కోసం మరో ప్రయత్నంటీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్ను మరోసారి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమతి తీసుకోవడానికి మరో ప్రయత్నం చేశారు. సమయాన్ని ఇస్తే 118 సంపూర్ణ మద్దతు కూడగడుతామని హామీ ఇచ్చారు. మొదట ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. -
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
టీవీకే విజయ్కు సరిపోని సంఖ్యాబలం వేళ.. కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ నెలకొంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ఈ భేటీలో తన వద్ద 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. అయితే, ఆ సంఖ్యపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని సూచించారు.సంఖ్యాబలం నిరూపించుకునేందుకు గవర్నర్ నేటి అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఫలితంగా, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న టీవీకే శ్రేణుల ఆశలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీకే–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, సంఖ్యాబలం సరిపోలేదు. దీంతో టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)తో భేటీ అయ్యి, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరిపారు. అయితే, ఈపీఎస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.అన్నాడీఎంకేలో కొంతమంది (సుమారు 30కిపైగా) ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ఈపీఎస్పై ఒత్తిడి పెంచుతున్నారు. టీవీకేతో కలిస్తే పార్టీకి మళ్లీ శక్తి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడం, అంతర్గత చర్చలు కొనసాగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీవీకేకి సంఖ్యాబలం సరిపోలలేదు. నేటి అర్ధరాత్రితో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అదే సమయంలో తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో, టీవీకే అధినేత విజయ్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం తక్కువగా ఉండటం, గవర్నర్ సూచించిన మెజారిటీ నిరూపణ చేయాల్సిన అవసరం ఆసక్తికరంగా మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. -
తమిళనాడు పరిస్థితే ఏపీ లో రిపీట్... TVK విజయ్ విజయంపై చింతా మోహన్ రియాక్షన్
-
విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమే
-
విజయ్.. ఇలాంటివి చేయకండి: గాంధీజీ మునిమనవడు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్కు మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత గోపాలకృష్ణ గాంధీ బహిరంగ లేఖ రూపంలో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. కొన్ని పనలు చేయాలని, కొన్నింటిని చేయకూడదని సూచించారు.‘కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ పర్యాయం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర ఓటరును. కానీ, ఏప్రిల్ 23 రోజు మీకు ఓటు వేసిన దాదాపు 35 శాతం మందిలో నేను లేను. మీకు ఓటు వేయని 65 శాతం మందిలో నేనున్నాను. విజయ్ యువతను ఆకర్షిస్తున్నారని, కానీ అది సీట్లు తెచ్చిపెట్టదని అనుకున్నాను. ఓట్లు ఎప్పటిలాగే వెళ్లే చోటికే వెళ్తాయనే అభిప్రాయంతో నేను ఉన్నాను. కాబట్టి 4 మే రోజు ఫలితాలు వరుసగా వెలువడుతుండగా నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విజయ్ కొత్తవాడు, అంటే అనుభవం తక్కువ’ అన్నారు.ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థను రక్షించాలి అదే సమయంలో ఆయన అవినీతిపరుల ప్రభావం లేకుండా ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్నికైన ఎం.కె.స్టాలిన్ ముందు కొన్ని ఆలోచనలను ఉంచినట్లే, ఇప్పుడు మీ ముందూ అటువంటి వాటిని ఉంచాలనుకుంటున్నానని చెప్పారు. ‘మీరు ఎన్నికల్లో గెలిచారు. సభలో అత్యంత కీలకమైన ఫ్లోర్ టెస్ట్ ఇంకా గెలవాల్సి ఉంది. భారత ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థ రక్షణను మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీ నాయకత్వంలో రాష్ట్రం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ గౌరవాన్ని నిలబెట్టాలి. పదవి కాపాడుకోవాలనే ఆందోళన దానిపై రాజీ పడేలా చేయకూడదు. మీ సిద్ధాంతం ఏమిటి అని అడగవచ్చు. అది మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ‘నా సిద్ధాంతం.. సిద్ధాంతం లేదు’ అని చెప్పండి. అలాగే ‘నా మనసాక్షిని అనుసరించడం’ అని అనండి.మీరు కొత్త నాయకుడు. గత భారాలు లేకుండా కొత్తగా పాలనను ప్రారంభించే అవకాశం ఉంది. ఎం.కె.స్టాలిన్ వద్ద ఈ అవకాశం లేదు. అలాగే, ఆయనకు ఉండి మీకు లేనిది అనుభవం. ఆయన మీకు ముందున్న నాయకుడు, శత్రువు కాదు. మీరు ఆయన తరువాతి నాయకుడు, స్థానభ్రంశం చేసే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలపై విభేదాలు ఉన్నా, ఫెడరల్ స్వభావం, సెక్యులర్ సమానత్వం విషయంలో మీరు ఇద్దరూ ఒకే దిశలో ఉన్నారు. ఆ దిశలో ఆయన మాట వినండి’ అని చెప్పారు.ఉదయనిధితో పోటీ పడొద్దు ‘సభలో ఉదయనిధి స్టాలిన్ ఉనికి మీకు పోటీ కాకుండా మంచి జంటగా ఉండాలి. మీరు ఇద్దరూ యువకులు, ఆకర్షించే స్వభావం ఉన్నవారు. మీ 108 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇంతకుముందు శాసనసభలో అనుభవం ఉంది. మిగతావారు ఆ ముగ్గురి దగ్గర నుంచి, ఎదుటి సీనియర్ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త సభలో కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కర్మయోగి పెరుంతలైవర్ కామరాజ్ నేతృత్వం వహించిన పార్టీకి చెందినవారని గుర్తుంచుకోండి. సెక్రటేరియట్లో అధికారులను మీ సహచరులుగా చూడండి, కిందివారిగా కాదు.చివరిగా, తమిళనాడులో మంచి, స్వచ్ఛమైన, సమర్థ పాలన కొనసాగించండి. పర్యావరణ రక్షణను ప్రధాన ప్రాధాన్యంగా ఉంచండి. రాష్ట్రం దాటి ద్వేషం లేని, భయం లేని, న్యాయమైన భారతానికి మార్గదర్శకంగా నిలవండి. ఒక వ్యక్తిగత వ్యాఖ్యతో ముగిస్తాను.. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నడిపించడం ఇదే మొదటిసారి. ఆ విధిని తమిళనాడు సెక్యులర్ గుర్తింపుకు దైవ హస్తంగా భావించండి’ అని గోపాలకృష్ణ గాంధీ రాసుకొచ్చారు. -
మెజార్టీపై గవర్నర్ ను ఒప్పించలేకపోయిన విజయ్
-
TVKకు కాంగ్రెస్ మద్దతు.. DMK ఫైర్
-
DMK తో 55 ఏళ్ల బంధాన్ని వదిలి TVK కు కాంగ్రెస్ మద్దతు
-
విజయ్కు బిగ్ షాక్ TVKప్రభుత్వ ఏర్పాటులో ట్వీస్ట్
-
విజయ్ విజన్ ఉన్నోడు..వారికి పీడకలే!
టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ విజన్ ఉన్నవాడు, వారెన్ బఫెట్లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.27 పేజీల అఫిడవిట్లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో ఒక సేవింగ్బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో ఎస్ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?He beats nifty returns by keeping his money in FDHe is sitting on 300cr cash Just like Warren buffet with 300 billion in cashThalapathy Vijay is visionary pic.twitter.com/eXdm0CPIQL— सौरभ (@saurabh_gunjal_) May 6, 2026ఇదీ చదవండి: సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి Vijay is a Finfluencer's nightmare! pic.twitter.com/2J2hhjbqFv— Dharmesh Ba (@dharmeshba) May 6, 2026నెటిజన్ల కామెంట్స్"మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు."వంద కోట్ల రూపాయలను ఎఫ్డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్యూ స్టాక్స్లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు)ముఖ్యంగా "టాప్ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక ఎక్స్ యూజర్ వివరించారు. "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. TVK Chief Vijay appears to be risk-averse but may be lacking proper financial advice. He has ₹213 Cr in savings bank & FDs of ₹100 Cr which yields very low interest. If he invests in high dividend yield stocks of top PSUs, capital is safe + regular income + capital appreciation pic.twitter.com/pcakqtFxG6— RJ Stocks (@RakJhun) May 5, 2026 -
విజయ్ అలా చేస్తే మద్దతు ఉపసంహరిస్తాం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాను ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని టీవీకే అధినేత సినీస్టార్ విజయ్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ను కలసి వినతి పత్రం అందించారు. అయితే మెజార్టీ మార్కుకు కేవలం పదిసీట్ల దూరంలో ఆగిపోయిన టీవీకేకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టీవీకేకు సపోర్టు చేసే ముందు కాంగ్రెస్ విజయ్తో ఒక విషయంలో కీలక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహుర్తం సైతం సిద్ధమైంది. రేపు లేదా ఎల్లుండో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే విజయ్ సీఎం కావడానికి అక్కడి కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకేతో కీలక ఒప్పందం చేసుకొని అనంతరం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ ఇంఛార్జ్ గిరీశ్ చౌడాంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రస్తుతం మేము టీవికేకు మద్దతిస్తున్నాం. రాజ్యాంగాన్ని నమ్మని మతతత్వ రాజకీయ పార్టీలకు టీవీకే పార్టీ దూరంగా ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ వారు మతతత్వ శక్తులతో కలిస్తే మా మద్దతు ఉపసంహరిస్తాం. అని అన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది.కాగా మెజార్టీ మార్కు రావాలంటే కాంగ్రెస్ ఐదు స్థానాలతో కలిపి టీవీకేకు మరో ఐదు స్థానాల మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో మెజార్టీమార్కుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్..
-
టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేపు(గురువారం) విజయ్ ప్రమాణ స్వీకారం అనుమానమే?. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్కు గవర్నర్ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్ను విజయ్ ఒప్పించలేకపోయారు. విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్ స్పష్టం చేశారు.మరో వైపు, విజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు.. కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ చెప్పేసింది. ఇదిలా ఉండగా, లోక్ భవన్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదని.. రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను విజయ్ కోరారు.తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అంటూ ఆరా తీసిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, మెజార్టీ సంఖ్య చూపించాలంటూ గవర్నర్ తేల్చిచెప్పినట్లు సమాచారం. 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్కు విజయ్ అందించారు. గవర్నర్ నిర్ణయంపై టీవీకే నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే విజయ్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా, ప్రభంజనంలా దూసుకొచ్చిన టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ప్రశాంత్ కిషోర్కు బిగ్షాక్!
లక్నో:ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్కు బిగ్షాక్ తగిలింది. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ సేవలు ఇకపై తమకు అవసరం లేదని ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్వాద్ పార్టీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాజా నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్ (I-PAC)తో సంబంధాలు తెంచుకున్నారు. పార్టీ ఇకపై ఐపాక్తో పనిచేయదు. ‘మాకు నిధులు లేవు. మీరు (మీడియా) నిధులు ఇస్తే మరో సంస్థను కూడా పెట్టుకుంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఐపాక్ గతంలో సమాజ్వాదీ పార్టీతో కలిసి 2022 ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో వ్యూహాలు రూపొందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయింది. సమాజ్వాదీ పార్టీ మాత్రం మరో సంస్థ షోటైమ్తో ఒప్పందం కొనసాగిస్తుందని తెలిపారు.టీఎంసీ, డీఎంకే ఓటమిఅఖిలేష్ యాదవ్కు ఈ నిర్ణయానికి కారణంగా పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ అరెస్టు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఐపాక్ సేవలందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. విస్మయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఓటమిపశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసు. ఈ కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ఐపాక్కి తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఐపాక్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ 207 సీట్లతో చిత్తు చేసింది. తమిళనాడులో డీఎంకే గద్దె దిగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తమ బలమైన నియోజకవర్గాల్లోనే ఓడిపోవడం విస్మయానికి గురి చేసింది. వెరసీ ఐపాక్తో కలిసి పని చేయడం కంటే దూరం పెట్టడమే మంచిదని భావించే అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిలేష్ మాత్రం ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అవును, మాకు వారితో సంబంధం ఉంది. కొన్ని నెలలు పనిచేశారు. కానీ మాకు ఆ స్థాయి నిధులు లేవు కాబట్టి కొనసాగించలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు.అఖిలేష్ యాదవ్కు డూ ఆర్ డైగా ఎన్నికలుఅయితే ,ఐపాక్ వైఫల్యం, వినేష్ చాందెల్ అరెస్టు, ఈడీ దర్యాప్తు అన్నీ కలిపి సమాజ్వాదీ పార్టీకి ఆలోచన కలిగించాయి. ఇప్పటికే ఐపాక్ ఉత్తరప్రదేశ్లో తన కార్యకలాపాలను తగ్గించిందని, అందులో ఉద్యోగుల సంఖ్యను సగానికిపైగా తగ్గించినట్లు సమాచారం. ఇది పార్టీ ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసింది. 2027 ఎన్నికలు అఖిలేశ్ యాదవ్కి డూ ఆర్ డై అన్నచందంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఏకైక బలమైన ప్రత్యామ్నాయం సమాజ్వాదీ పార్టీగా భావిస్తున్నారు. కానీ ఐపాక్ విడిపోవడం, ఈడీ కేసులు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పరాజయాలు ఇవన్నీ అఖిలేష్కి పెద్ద సవాళ్లుగా మారాయి. -
తమిళనాడులో విజయ్ సునామీ.. సెలబ్రిటీలతో సెల్ఫీలు వైరల్!
-
విజయ్ తీసుకొచ్చిన విప్లవం ఇదే.. ఇక భవిష్యత్ అంతా ఇలానే..!
చెన్నై: అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో నిరూపించాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అన్ని వర్గాలకు చెందిన వారూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సామాజిక న్యాయం దిశగా వెళ్లాలంటే ఇటువంటి ఫలితాలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో అన్ని లెక్కలను సరి చేశారు టీవీకే విజయ్. ఎందరో ఉద్ధండులకూ సాధ్యం కానిది సాధించి చూపించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారూ చూపించని మార్పును చూపించారు. ఓటర్లలో మార్పు తీసుకొచ్చారు.వృత్తులను చూడలేదు వీధుల్లో ఆటో డ్రైవింగ్ చేసుకునే పని నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ప్రవేశం వరకు ఎదిగారు ఓ ఆటోడ్రైవర్. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. రాయపురం ఆటో డ్రైవర్ కేవీ విజయ్ దామూ అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. విజయ్కు దీర్ఘకాలికంగా సహాయకుడిగా ఉంటున్నారు కారు డ్రైవర్ రాజేంద్రన్. ఆ డ్రైవర్ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ స్థానంలో టీవీకే తరఫున గెలిచారు.ఇద్దరు సాధారణ వ్యక్తులు సాధించిన ఈ అతి పెద్ద విజయం.. గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజకీయాలు ఇకపై కేవలం శక్తిమంతమైన కుటుంబాలకే పరిమితం కాదని నిరూపించింది. ఓటర్లు అన్ని వర్గాల వారినీ ఆదరిస్తారని చాటి చెప్పింది.కులాలను చూడలేదుఎవరికి ఓటు వేస్తావని అడిగితే ‘మా కులం వాళ్లకే ఓటు వేస్తా’మని అంటారు చాలామంది. తమిళనాడులోనూ కుల వ్యవస్థ బలంగా ఉంది. ఈ కుల అడ్డుగోడలను దాటి మరీ ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారి నుంచి టీవీకే సామాజికంగా భారీ మద్దతు సంపాదించింది. అసెంబ్లీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఇది ప్రధాన ద్రావిడ పార్టీల దృష్టికి ఎక్కువగా రాని అంశం, రాష్ట్ర ఎన్నికల విధానంలో మార్పును సూచిస్తోంది.టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. ఆయన నేతృత్వంలో పార్టీ సాంప్రదాయ కుల సమీకరణాలను దాటేసి.. అభ్యర్థుల ఎంపిక, స్థానికుల నుంచి నమ్మకాన్ని పెంపొందించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ గిరిజనుల (ఎస్టీ) నుంచి 20కి పైగా ఎమ్మెల్యేలు, మైలాపూర్, శ్రీరంగం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.మైలాపూర్లో పి.వెంకటరమణన్, శ్రీరంగంలో రమేశ్ గెలుపును రాజకీయంగా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రధాన ద్రావిడ పార్టీలు వెనకడుగు వేస్తాయి. వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్లో ఆధిపత్య కులాల ప్రభావంతో ఓడిపోవచ్చు అనే భయం పార్టీల్లో ఉంటుంది. అయినప్పటికీ, టీవీకే వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. వారు గెలవడం ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విధానానికి భిన్నంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 రిజర్వు స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులు వాటిలో 24 స్థానాల్లో గెలిచారు. మిగిలిన 22 రిజర్వు స్థానాల్లో డీఎంకే కూటమి (13), ఏఐఏడీఎంకే (9) గెలిచాయి. సంప్రదాయ కూటములు కొన్ని ప్రాంతాల్లో బలాన్ని నిలబెట్టుకున్నా, టీవీకే భారీ ప్రభావాన్ని చూపించింది.టీవీకే అభ్యర్థి విరుధునగర్లో షెడ్యూల్డ్ కుల అభ్యర్థి పి.సెల్వం జనరల్ స్థానంలో పోటీ చేసి వి.విజయ్ ప్రభాహరణ్ను ఓడించారు. ఎస్సీ అభ్యర్థి జనరల్ స్థానంలో గెలవడం వల్ల ఈ ఎన్నికలో కుల లెక్కలు పనిచేయలేదని స్పష్టమవుతోంది.రిజర్వు, సాధారణ స్థానాల్లో రెండింట్లోనూ వెనుకబడిన వర్గాల అభ్యర్థులు టీవీకే తరఫున గెలిచారు. ఇది కుల, మత గీతలను దాటిన సమీకరణాన్ని సూచిస్తోంది. భవిష్యత్తు రాజకీయాల్లోనూ ఇదే ధోరణి కనపడితే మనం కోరుకుంటున్న సమసమాజం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.టీవీకే నుంచి 13.. డీఎంకే నుంచి 0 తమిళనాడు శాసనసభకు 23 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. గత శాసనసభలో కేవలం 12 మందే ఉండేవారు. తమిళనాడు చరిత్రలో 23 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సందర్భాలు గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీవీకే నుంచి 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఏఐఏడీఎంకే నుంచి ఆరుగురు ఉన్నారు. డీఎంకే 19 మంది మహిళలను పోటీకి దింపినా ఒక్కరు కూడా గెలవలేదు. -
ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి
-
8వ తేదీన "విజయ్ అనే నేను ప్రమాణస్వీకారం!"
-
విజయ్ రాజీనామా డిప్యూటీ సీఎంగా త్రిష?
-
మద్దతు ఇస్తాం.. మంత్రి పదవులు కావాలి..
-
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
విజయలో ఉన్నదేంటి..? పవన్ లో లేనిదేంటి..?
-
రేపు TVK విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
-
విజయ్ మాస్టర్ ప్లాన్, మహాబలిపురం రిసార్ట్ కు TVK 108 ఎమ్మెల్యేలు
-
TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి
-
పలు కీలక అంశాలపై గవర్నర్ తో టీవీకే భేటీ
-
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
'టీవీకే' విజయ్ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)
-
ఎవరీ అధవ్ అర్జున? విజయ్ గెలవడానికి కారణం ఇతనేనా!
-
కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే..! స్పందించిన KC వేణుగోపాల్
-
సింహం సింగిల్ గా విజయ్ గెలుపు వెనుక 10 కారణాలు ..
-
MAGAZINE STORY: ఫలితాలు చెప్పిన పాఠాలు
-
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
TVK విజయ్ ప్రభంజనం వెనుక YS జగన్
-
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?
సాక్షి, చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయం, పార్టీ అధినేత తరువాత కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (దళపతి విజయ్)కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట వైరల్గా మారుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్ నుండి అందుకున్న MLAగా గెలిచిన ధృవీకరణ పత్రం వైరల్ అయ్యింది. ఇపుడు విజయ్ పదో తరగతి మార్కుల వివరాలు సోషల్ మీడియాలో సందడిగామారాయి. ఒక సగటు విద్యార్థిగా ప్రారంభమైన విజయ్ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.మరోవైపు గురువారం ఉదయం 11.30 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ల మద్దతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.మనీ కంట్రోల్ నివేదిక, నెట్టింట హల్ చల్ చేస్తున్న 10వ తరగతి మార్కుల జాబితా (mark sheet) ప్రకారం చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైమ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో విజయ్ చదువు కున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఆయన 1100 మార్కులకు గాను 711 సాధించారు. అంటే మార్కులు 65 శాతం మార్కులొచ్చాయన్నమాట. సబ్జెక్టుల వారీగా మార్కులుతమిళం: 200 మార్కులకు 155 (అత్యధిక మార్కులు)గణితం: 200 మార్కులకు 95.ఇంగ్లీష్: 200/133సైన్స్: 300 /206సోషల్ సైన్స్: 200/122పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. సినిమాలపై మక్కువతో మధ్యలోనే కాలేజీ మానేసి నటన వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఆయన్ని కోలీవుడ్లో సూపర్ స్టార్గా నిలబెట్టింది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రభంజనం దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టి తమిళనాట ఘన విజయం సాధించారు. అత్యధిక మెజారీటీ సాధించిన ఏకైక పార్టీగా టీవీకే పార్టీని నిలబెట్టడం విశేషం. తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ విజయం సాధించారు. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్టు....
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాలలో సొంతంగా ఎదిగి తన ప్రత్యేకతను చాటుకోవడంతో తనను తాను రుజువు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా? లేక స్వయంగా ప్రకాశించడమా?అన్నది తేల్చుకోవడానికి సిద్దమవుతారా?లేదా? అన్నదే ఇప్పుడు చర్చ. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని, అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ క్యాడర్ కు మింగుడుపడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చినవారు. కాని వీరిద్దరి మధ్య చాలా వత్యాసం ఉంది. విజయ్ ఇంతవరకు చిత్తశుద్దితో, ధైర్యంగా రాజకీయాలు చేస్తే, మొదటి నుంచి పవన్లో ఆ లక్షణాలు లోపించాయి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, నిలదీస్తానని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది మాత్రం సున్నా. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా పూటకో చందంగా మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒకసారేమో 1800 ఎకరాలలో రాజధాని నిర్మించవచ్చని అన్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాల భూమి సేకరిస్తోందని రైతుల్లో వ్యతిరేకత వస్తే... వారికి మద్దతు పలికారు. ఆ వెంటనే హైదరాబాద్లో చంద్రబాబును కలవడమే తడవు మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయడంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు.చివరికి తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజికవర్గ రాజధానిగా మార్చుతోందని, గేటెడ్ కమ్యూనిటీ అయిందని కూడా విమర్శించారు. కాని 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని అదికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయి, చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊ కొడుతున్నారు.పైగా వేల ఎకరాల అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడూ ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ, రహస్య సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల అభ్యర్ధులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజయ్ అలా చీకటి బంధాలకు తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు.ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు.అనూహ్యంగా 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భయపడిపోయారు. వెంటనే చెగువేరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమలాడుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారు.తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నానని ఆయనే చెప్పారు.తన తల్లిని దూషించిన టీడీపీ వారిని క్షమించబోనని బీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరికాలంలో ఆ విషయాన్ని విస్మరించి, అదే టీడీపీ నేతలను తెగ పొగడడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు. బీజేపీ విజయ్ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాని విజయ్ ఎక్కడా తన విధానాన్ని వీడలేదు. పవన్ కళ్యాణ్ అలాకాదు. వైఎస్సార్సీపీతో జతకలవలేదు కాని, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు అన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటి అవినీతి పార్టీ లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలామంది ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఏభై సీట్లు అడగాలని, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలని సూచించారు. కాని తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా పది సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలాకాదు.తాను ఏది చెబితే దానికే కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తను గెలిచినా, ఓడినా, ఇలాగే ఉంటానని విజయ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు రెచ్చగొట్టారు.కనీసం కులభావన రావాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.ఆ తర్వాత తనకు కులం ఏమిటని ఆయనే ప్రశ్నించారు. పైగా 15 ఏళ్లపాటు టీడీపీని మోయాలన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ, జనసేన క్యాడర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేకమంది ఇప్పుడు ఈయన తమను ముంచేశారని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ , ఆ తర్వాత కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తమకు ఎక్కడ ఉందని క్యాడర్ ను ప్రశ్నించి ఆశ్చర్యపరచారు. విజయ్ మాత్రం ఎక్కడా కులాలు, మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే ప్రసంగాలు చేసేవారని చెబుతారు.విజయ్ ఏ మీడియాపైన ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా ను నమ్ముకుని చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేశ్ను సీఎంగా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడుగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్దం కోసం, టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తుంటే, విజయ్ మాత్రం సూత్రబద్దమైన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్లే రజనీకాంత్, కమల్ హసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే, మంచి పాలోయింగ్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లో చిత్తశుద్ది లోపం,స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజయ్కు షాక్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న విజయ్కు షాక్ తగిలింది. టీవీకేకు ఎట్టిపరిస్థితుల్లో తాము మద్దతు ఇవ్వబోమంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది. డీఎంకే నాయకత్వం తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం అని ఆ పార్టీ అధినేత ఖాదర్ మొహిదీన్ బుధవారం ప్రకటించారు.డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(SPA) తరఫున.. రెండు స్థానాల్లో పోటీ చేసింది. చేసిన రెండు చోట్ల విజయంతో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ సాధించింది. పాపనాశంలో A. M. షాజహాన్, వాణియంబాడిలో సయ్యద్ ఫారూఖ్ బాషాలు విజయం సాధించారు. మరోవైపు.. డీఎంకే కూటమిలోనే ఉన్న విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) కూడా విజయ్ పార్టీకి పొత్తు ఇవ్వమని స్పష్టం చేసింది.తమిళనాడులో విజయ్ టీవీకే 108 సీట్లు గెలుపొందింది. అధికారం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది మద్దతు అవసరం. అంటే.. సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్నమాట. కాంగ్రెస్(5) మద్దతు దాదాపు ఖరారు కాగా.. లెఫ్ట్ పార్టీలు(4) కూడా జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరో స్థానం తక్కువ పడుతుండడంతో ఎవరు మద్దతుకు ముందుకు వస్తారా? అనే కుతూహలం నెలకొంది. -
ఈ వెన్నుపోటు రాజకీయమేంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.తమిళనాడు సీనియర్ నేత, విజయ్కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్కు నివేదించింది. ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. The Backstabbers.— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026No. DMK does not endorse the support of INC to TVK. It was their unilateral decision. The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది. అయితే దివంగత విజయ్కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది. -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్భవన్లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్భవన్కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్భవన్కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్తో గవర్నర్ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్భవన్కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
‘విజయ్’భేరికి కకావికలం
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. అంచనాలను తలకిందులు చేశాయి. ‘విజయ్’భేరి ముందు దిగ్గజ పార్టీలు చిత్తయ్యాయి. రాజకీయాల్లో ఉద్దండులైన సీఎం స్టాలిన్ సహా 14 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. విజయ్ ప్రభంజనం ముందు మంత్రులే కాదు, కొన్ని పార్టీల కీలక నేతలు, హేమాహేమీలు నిలువలేకపోయారు. విజయ్ టీవీకే పార్టీ తరఫున దళితులు, దివ్యాంగులు, మహిళలు సత్తాచాటి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీ ల ఆధిపత్యానికి గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వసతులు అంటూ లేవు. పదిహేనేళ్లుగా స్టాలిన్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే, ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన్ని ఓడించి, టీవీకేకు చెందిన వీఎస్ బాబును అసెంబ్లీకి పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కూలిన మంత్రుల కోటలు డీఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులలో 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచు కోటలుగా నియోజకవర్గాలను మలచుకున్న సీనియర్లు విజయ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు, మంత్రులు దురైమురుగన్(కాటా్పడి), సుబ్రమణియన్ (సైదాపేట), అన్బిల్ మహేశ్(తిరువెరంబూరు), పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, నాజర్, స్పీకర్ అప్పావు(రాధాపురం), డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి(కీల్ పెన్నాత్తూరు) తదితరులు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.వీరిలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఎం.సుబ్రమణియన్, విద్యా మంత్రిగా అన్బిల్ మహేశ్ నిత్యం ప్రజలలోనే ఉన్నారు. తమిళనాడులో వైద్యం, విద్య బలోపేతంలో వీరి పాత్ర కీలకంగా నిలిచినా, విజయ్ ధాటికి తలవంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కట్చి కనీ్వనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సీ వంటి వారు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో పరాజయం చవి చూశారు. ఒక్క ఓటుతో చేజారిన మంత్రి గెలుపు శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచి్చన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో మూడు ఈవీఎంలు మొరాయించడంతో చివరకు వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపొందడం విశేషం. భారీ మెజార్టీ లూ టీవీకే కైవసం ఈసారి తమిళనాడు అసెంబ్లీలో సామాన్యుల గళం మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన టాప్–10 అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, అందులో 9 మంది విజయ్ పార్టీ కి చెందిన వారే ఉండటం విశేషం. అత్యధిక మెజారిటితో గెలిచిన వారిలో తొలి స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి 98,110 ఓట్ల మెజారిటీతో నిలవగా మిగిలిన 9 మంది టీవీకేకు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో షోళింగనల్లూర్ నుంచి శరవణన్ (96,780), మాధవరం నుంచి విజయ్ ప్రభు (94,985) భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. పూందమల్లి, సేలం వెస్ట్, ఆవడి వంటి నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు.టీవీకే తరఫున సామాన్యులు రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకూ విజయ్ టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్, ఓ డ్రైవర్ కుమారుడు, దివ్యాంగులు, మహిళలు గెలవడం విశేషం. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 35 ఏళ్లలోపు వారు 22 మందికి పైగా ఉన్నారు. గెలిచిన వారిలో 26 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 13 మంది మహిళలూ ఈ సారి టీవీకే తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకున్నారు. టీవీకే అభ్యర్థులు 67 చోట్ల ఓడినా రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలు మూడో స్థానానికి పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంగు మండలం, డెల్టా, ఉత్తర తమిళనాడుల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించినా, కేరళ– తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా ఖాతా తెరవక పోవడం గమనార్హం. -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టాలిన్ రాజీనామా..ఆమోదం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ అర్లేకర్ ఆమోదించారని అనంతరం లోక్భవన్ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్ను గవర్నర్ కోరారని వివరించింది. ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు. -
టీవీకేకు మద్దతుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
తమిళనాడులో టీవీకే మద్దతు అంశంలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశమై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తొలిసారిగా స్పందించారు. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై అగ్రనాయకులు విశ్లేషణ జరిపారు.అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ను ఇదివరకే పలుమార్లు విజయ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖసైతం రాశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్ధతివ్వడం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది . ఈ అంశమై ఇది వరకే హస్తం నేతలు టీవీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా టీవీకే 108 స్థానాల్లో నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ అక్కడ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో హస్తం మద్దతు కీలకం కానుంది. -
స్టాలిన్ లేటెస్ట్ రోడ్ షో..
అది ఎన్నికల ప్రచారం కాదు.. విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు. తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్. టీవీకే విజయ్ దెబ్బతో డీఎంకే, అన్నాడీఎంకేలు ఘోరంగా చతికిలబడ్డాయి. ఇది స్టాలిన్ కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం. అయితే ‘ఛేంజ్’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్కు జైకొట్టారు. ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్ షో రూపంలో థాంక్స్ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’ ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. கொளத்தூருக்கும் எனக்குமான உறவு தேர்தல் வெற்றி, தோல்விகளைக் கடந்த உறவு.15 ஆண்டுகாலம் எனக்கு ஆதரவு நல்கியவர்கள் கொளத்தூர் தொகுதி மக்கள். அதில், 10 ஆண்டுகள் எதிர்க்கட்சி வரிசையில் இருந்தும், 5 ஆண்டுகள் ஆளும்கட்சியாகவும் என்னால் இயன்ற அனைத்துத் திட்டங்களையும் கொளத்தூருக்குக் கொண்டு… pic.twitter.com/xtXB8p6ChR— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 5, 2026 #WATCH चेन्नई: डीएमके प्रमुख और तमिलनाडु के निवर्तमान सीएम एम.के. स्टालिन कोलाथुर विधानसभा क्षेत्र पहुंचे। राज्य के पूर्व मंत्री पीके सेकर बाबू भावुक हुए। pic.twitter.com/SB6vkKYbnh— ANI_HindiNews (@AHindinews) May 5, 2026 -
అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యాడు!
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ప్రభుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్రదాయానికి తమిళులు చరమగీతం పాడి మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే విజయ్వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగిన ద్రవిడ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేత అన్నామలై ముందే పసిగట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది.“తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ తమిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామలై మద్దతుదారులు ఆయనకు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామలై.. సోమవారం ఎన్నికల ఫలితాల సమయానికి చెన్నైకు తిరిగి వచ్చినట్టు ఆమె మరో పోస్ట్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.బీజేపీ ఒంటరిగా పోటీచేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని అన్నామలై మద్దతుదారులు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రెండేళ్ల క్రితమే అన్నామలై పసిగట్టారని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామలై ముందుగానే గుర్తించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామలైని పక్కన పెట్టిందని ఆయన సానుభూతిపరులు అభిప్రాయపడ్డారు.పొత్తుతో చిత్తు'అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యారు' అన్నట్టుగా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ''తమిళనాడు ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయారని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ఆయన మాటలను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు విజయ్ సాధించిన విజయంతో అన్నామలై మాటలు నిజమయ్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా కష్టపడి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజయ్ ఫలితం పొందారని మరొకరు అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పు చేసిందని ఎక్కువ మంది పేర్కొన్నారు.చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!రిస్క్ తీసుకోవాలి2024, ఫిబ్రవరి 16న జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా ప్యూర్ అలయెన్స్ గవర్నమెంట్ ఏర్పడబోతోంది. ఈ రెండేళ్లలో పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి క్షేత్రస్థాయిలో నాయకులకు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. వారం, పది రోజుల అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నామలై అప్పట్లో అన్నారు. பிப்ரவரி 16, 2024. சரியாக 2 வருடம் முன்பு அண்ணாமலை சொன்ன வார்த்தைகள் இன்று அச்சு பிசுறாமல் 200% அப்படியே நடந்துள்ளது.பாஜகவின் வெற்றியை தடுத்து, ரிஸ்க் எடுக்கவும் உழைக்கவும் பயந்து இன்று தமிழக பாஜகவை ஒழித்தது யார்? @annamalai_k 🙇🏻🔥🔥 pic.twitter.com/FTFJERVEX9— ᴋᴀʀᴛʜɪ (@TwitzKarthi) May 5, 2026 -
విజయ్ VS ఉదయనిధి.. అసెంబ్లీ ఇలా దద్దరిల్లాల్సిందే..
తమిళనాడు రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా కనిపించబోయే పోరు టీవీకే నేత విజయ్, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్యనే సాగనుంది. ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే ప్రతిపక్ష నేత. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్ ఒకవైపు, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించబోయే ఉదయనిధి మరోవైపు ఉండటంతో సభ చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఉదయనిధికి ఉన్న పాలనా అనుభవం ముందు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది కీలకం.అసెంబ్లీలో జరిగే వాగ్వివాదాలు ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. పాలన, సంక్షేమం, చట్టం, వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ ఇద్దరు నేతలే. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ప్రతిపక్షం ఎంత బలంగా నిలబడుతుంది? అన్నదే ముందున్న రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. ఆ వ్యవహారాలే భవిష్యత్తులో విజయ్ను మరోసారి సీఎంగా నిలబెడతాయి. ఇక, ఉదయనిధి స్టాలిన్ బలంగా పనిచేస్తేనే విజయ్ను సీఎం పీఠం నుంచి దించి, మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తోంది. మొత్తంగా చూస్తే, విజయ్-ఉదయనిధి మధ్య ఈ రాజకీయ పోరు తమిళనాడు రాజకీయాలకు కొత్త శక్తిని తీసుకురానుంది. సభలో ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండటం ఖాయం.తమిళనాట ఓ ఆశగా విజయ్బాలనటుడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు టీవీకే విజయ్. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే విజయ్ ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు ఉండనున్నాయి. పాత పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ రెండు పార్టీలే తప్ప మరో పార్టీ లేదా? అనుకుంటున్న సమయంలో తమిళనాట ఓ ఆశగా వెలిగారు విజయ్. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని కొందరు అంటున్న సమయంలో పార్టీని పెట్టి.. పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి తీసుకొచ్చారు. డీఎంకే ఆశ అంతా ఉదయనిధిపైనే..మరోవైపు, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తనను నియమించే నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఉదయనిధి స్టాలిన్.. ఈ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గంలో గెలిచారు. శాసనసభా పక్ష నేత విజయ్తో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే.ఇద్దరిదీ ఒకే వయసు.. ఇరువురూ సినీనటులేఉదయనిధి స్టాలిన్ వయసు 49 సంవత్సరాలు. విజయ్ వయసు 51. దాదాపు ఒకటే ఏజ్. తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు అంతా వీరిద్దరి కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. ఒకరు సీఎంగా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి వారు కూడా తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. కాగా, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులుగా గుర్తింపు పొందిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పోరు అసెంబ్లీ వేదికగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. విజయ్, ఉదయనిధి ఇద్దరూ సినీనటులే. అయితే, విజయ్ సినిమాల్లో హిట్స్ అధికంగా ఉండడంతో ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. విజయ్ జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్బై చెబుతానన్నారు. ఉదయనిధి కూడా సినిమాలకు గుడ్బై చెప్పి, నటనకు విరామం తీసుకుంటున్నట్లు 2023లోనే తెలిపారు.ఒకరు కొత్త.. మరొకరిది వారసత్వ రాజకీయంవిజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఇంతగా రాణించడం ఓ అద్భుతం. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. తాత, తండ్రి వారసత్వం నుంచే స్వతహాగా రాజకీయాలను నేర్చుకున్నారు. అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టొచ్చో ఆయనకు తెలుసు. అయితే, విజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించే తత్వం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధానాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన పాలనలో విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపుతుంది. వీటన్నింటి ఆధారంగా విజయ్పై విమర్శలు చేసే పాత్ర పోషించాల్సింది ఉదయనిధి స్టాలినే. ఉదయనిధి స్టాలిన్కు ఇది కీలక దశ. అధికారంలో ఉన్న సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడం ఆయన ప్రధాన బాధ్యతగా మారనుంది. డీఎంకే వారసుడిగా, కరుణానిధి మనవడిగా, ఉదయనిధికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీకి సంబంధించిన అనుభవం ఆయనకున్న ప్రధాన బలాలు. -
థ్యాంక్యూ మోదీజీ: విజయ్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ ట్వీట్కు టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026 -
సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత సి. జోసెఫ్ విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan)గా సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనపక్ష నేతగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆస్తులు, ఆర్థిక వివరాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2026 మార్చి 30న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 27 పేజీల అఫిడవిట్లో సమర్పించిన వివరాలు విశేషంగా నిలుస్తున్నాయి.దీని ప్రకారం విజయ్ ప్రకటించిన నికర విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ. 404 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 220 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు; ఈ ఆదాయం స్వయం ఉపాధి, అద్దె ఆదాయం , వడ్డీ ఆదాయం ద్వారా సమకూరింది.ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి నాలుగు బకాయి డిమాండ్లు పెండింగ్లో ఉండగా, వాటి మొత్తం విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది. ఒకే సేవింగ్స్ ఖాతాలో రూ. 213 కోట్లు విజయ్ పేర్కొన్న అఫిడవిట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్చి 27, 2026 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సాలిగ్రామం శాఖలోని ఒకే ఒక పొదుపు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉండటం. ఇది ఏదో ఒక నిర్దిష్ట పెట్టుబడి పథకం గానీ, మార్కెట్తో అనుసంధానమైన ఉత్పత్తి గానీ కాదు; కేవలం ఒక సాధారణ పొదుపు ఖాతా మాత్రమే. ఆయన ప్రకటించిన మొత్తం నికర విలువలో మూడో వంతుకు పైగా వాటా ఈ ఖాతాదే కావడం విశేషం.స్థిర డిపాజిట్లు (Fixed Deposits): నాలుగు బ్యాంకుల్లో కలిపి రూ. 100 కోట్లుAxis Bank : ఇందిరా నగర్ శాఖ : రూ. 40 కోట్లుIndian Overseas Bank, కోడంబాక్కం శాఖ : రూ. 25 కోట్లుHDFC Bank, బసంత నగర్ శా ఖ: రూ. 20 కోట్లుState Bank of India, శాస్త్రి నగర్ శాఖ : రూ. 15 కోట్లుIOB పొదుపు ఖాతాలోని నిల్వను కూడా కలిపి చూస్తే, ఆయన ప్రకటించిన సంపదలో రూ. 313 కోట్లకు పైగా మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఇవి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేని, హామీతో కూడిన రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు.ఈక్విటీలో షేర్ల విలువ రూ. 19.37 లక్షలుస్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం, జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, ఇది ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా డిబెంచర్లను ప్రకటించలేదు.స్థిరాస్తులు: విజయ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు విలువ రూ. 220 కోట్లు. ఇవి నాలుగు వర్గాలలో విస్తరించి ఉన్నాయి. నీలన్కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ , సమీప ప్రాంతాలలో ఉన్న నివాస ఆస్తులు, వీటి విలువ పది ఆస్తులలో సుమారుగా రూ. 115 కోట్లు.పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్ మరియు కొప్పూర్లలో ఉన్న వాణిజ్య ఆస్తులు, వీటి విలువ సుమారుగా రూ. 82.8 కోట్లు. అతిపెద్ద ఏకైక వాణిజ్య ఆస్తి కొప్పూర్ గ్రామంలోని 2.30 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2023లో నవంబర్ 2023లో రూ. 35.81 కోట్లకు కొనుగోలు చేశారు.పోరూర్, సాలిగ్రామం మరియు నీలన్కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. ఒక్క ఆయన పోరూర్ ప్లాట్ మాత్రమే 33,955 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.కొడైకనాల్లోని విల్పట్టి గ్రామంలో ఉన్న 0.25 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ ప్లాట్లను 1997లో ఒక్కొక్కటి రూ. 15,000కు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 10 లక్షలుగా ప్రకటించారు.ఇదీ చదవండి : విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?ఈ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రియాశీల ఆదాయ వనరుగా ప్రకటించారు. విజయ్ తన వ్యక్తిగత ఆస్తులకు అతీతంగా, అధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్! అదిరిపోయే వాహనాలు: విజయ్ గ్యారేజ్లో కొలువు దీరిని లగ్జరీ కార్ల విలువ రూ. 13.52 కోట్లకు పైమాటే.2024 Toyota Lexus 350: రూ. 3.01 కోట్లు2015 Tata Caravan: రూ. 6 కోట్లు2024 BMW i7: రూ. 2 కోట్లు2014 Toyota Vellfire: రూ. 1.63 కోట్లు2020 BMW 530: రూ. 80.54 లక్షలు2024 Maruti Swift: రూ. 5.35 లక్షలు2025 TVS XL Super: రూ. 67,400ఆభరణాలు: విజయ్ వ్యక్తిగతంగా 883 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 1.20 కోట్లు) మరియు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులను ప్రకటించారు. ఆయన సతీమణి సంగీత, విడిగా 3,132 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 4.07 కోట్లు), 2 కిలోల వెండిని (విలువ రూ. 4.75 లక్షలు), మరియు 134.91 క్యారెట్ల వజ్రాలను (విలువ రూ. 1 కోటి) ప్రకటించారు.ఇవి కాకుండా రుణాలు ,అడ్వాన్సుల రూపంలో : రూ. 75.5 కోట్లున్నాయని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!సంగీత ఆస్తులు రూ. 15.76 కోట్లువిజయ్ భార్య( విడాకుల కేసు పెండింగ్లో ఉంది) సంగీత విజయ్ తన మొత్తం ఆస్తులను రూ. 15.76 కోట్లుగా విడిగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు (HDFC బ్యాంక్, బసంత నగర్ శాఖలో ఉన్న రూ. 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రూ. 43.41 లక్షల పొదుపు నిల్వతో కలిపి) , రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్
-
సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్
-
హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు
-
TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం
-
tvk vijay : ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మిత్రపక్షాల ప్రతిపాదనలుసీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్కు తమ ప్రతిపాదనలు పంపాయి.పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.విజయ్ వ్యూహంకేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.వినూత్న మంత్రివర్గంమిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.ముఖ్యమంత్రి పదవికి విజయ్అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?
-
ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK
-
విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!
-
ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం
-
డీఏంకేను వీడేది లేదు.. వీసీకే చీఫ్
సినీ స్టార్ విజయ్కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH— ANI (@ANI) May 5, 2026 -
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం
ఏది జరిగినా మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్’ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.ఆలస్యమే ఆమృతం..ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్ అయితే.. కొంతవరకు పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని విజయ్ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్ రిలీజ్ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత జననాయగన్ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్, క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది.బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే..టాక్ని బట్టి కలెక్షన్స్ ఉండేవి. హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
TVK ఎమ్మెల్యేలతో విజయ ఇదే మన స్టాండ్..
-
జగన్ ను ఫాలో అయ్యి, TVK విజయ్ సక్సెస్ స్టోరీ
-
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్
-
ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం..
-
నమస్కారం తమిళనాడు: ప్రకాశ్ రాజ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, తమిళనాడులో విజయ్ సంచలన విజయం నమోదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందన అధికంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే సత్తా విజయ్కు ఉందా అని ఒకరు సందేహిస్తే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు మంచి చేయాలని మరొకరు హితవు పలికారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాజ్దీప్ సర్దేశాయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.‘అభిమాన’ సమాజంనమస్కారం తమిళనాడు. కామరాజర్ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.– ప్రకాశ్ రాజ్, నటుడు‘టీవీకే’ నడపగలదా?బెంగాల్లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.– యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్ట్పింగ్–పాంగ్బెంగాల్లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్–పాంగ్’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్ డోర్’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.– ప్రణయ్ రాయ్, ఎన్నికల డేటా విశ్లేషకులువిద్య... ఆరోగ్యంఅధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.– జావేద్ అఖ్తర్, గీత రచయితవిసుగు ఫలితం!సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్.డి.ఎఫ్.పై ప్రభావం చూపాయి.– రాజ్దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్ట్మూడో శక్తిపశ్చిమ బెంగాల్ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది. – అరుణా రాయ్, ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సభ్యురాలుమార్పే బలంబెంగాల్లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.– హర్ష్ మందర్, సామాజిక కార్యకర్త, రచయితకట్టుబడి లేరుటీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్ జడ్, మిలీనియల్ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది. కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్డిఎఫ్ వైపు మళ్లిన తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణం.– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలుఅందరూ దూరమే!గత నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ దక్కించుకున్నాయి.– అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
గెలిచిన చోట విజయ్ రాజీనామా..
-
తమిళ రాజకీయాల్లో కొత్త శక్తి..!
-
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
10 సీట్లు కోసం.. ఆ పార్టీతో TVK పొత్తు..?
-
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
విజయ్ పై తల్లి, ఫ్యామిలీ అద్భుతమైన పాట
-
సెల్ఫీ విత్ సీఎం విజయ్.. సోషల్ మీడియా షేక్ (ఫొటోలు)
-
ఆ దమ్ము.. ఆ ఫైర్, పవన్ లో ఎందుకు లేదు..
-
విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పా... కేఏ పాల్ సంచలన కామెంట్స్
-
కాంగ్రెస్ తో విజయ్ పొత్తు? TVK MLAలతో భేటీ..
-
ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ డ్రైవర్ కొడుకు
-
ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే
-
TVK ప్రధాన కార్యాలయానికి విజయ్
-
సీఎంనే ఓడించిన మొనగాడు ఇతనే....
-
గవర్నర్కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్భవన్కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
గెలిచిన తర్వాత తాను చదివిన కాలేజికి వెళ్లిన విజయ్ ఎందుకో తెలుసా..?
-
విజయం తర్వాత విజయ్ ఫస్ట్ లుక్
-
చదివిన కాలేజీలోనే ఎమ్మెల్యే విన్నింగ్ సర్టిఫికెట్ తీసుకున్న TVK విజయ్
-
TVK విజయ్ ఘన విజయం YSRCP నేతల సంబరాల్లో పోలీసుల ఓవర్ యాక్షన్
-
విజయ్ వెంట ఎవరెవరు? ఆప్షన్స్ ఇవే
-
పవన్ తలదించుకో విజయ్ ని చూసి నేర్చుకో..
-
CMనే ఓడించిన... ఈ బాబు ఎవరు?
-
TVK సెంచరీ విజయ్ ఇంటి వద్ద సంబరాలు
-
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సునామీ.. కుప్పకూలిన 50 ఏళ్ల పార్టీలు..
-
విజయ్ ప్రచారంలో జగన్ ఫోటో, జగన్ బాటలోనే విజయ్..
-
విజయ్ అప్పటి నుంచే మారిపోయాడు!
తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ పూర్తి పేరు... జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. సినిమాల్లో రాణించి అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం, సోదరి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.అన్నయ్య చేతుల్లోనే..తన చెల్లి విద్య చిన్న వయస్సులోనే మరణించడం విజయ్పై తీవ్ర ప్రభావం చూపింది. 1980లో జన్మించిన విద్య సుమారు నాలుగేళ్ల వయసులో 1984 మే 20వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'ఎనక్కుల్ నానే నీధిపతి' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యా విజయ్.. తన అన్నయ్య చేతుల్లోనే ప్రాణాలు విడిచారని.. ఆ సంఘటన విజయ్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.ఈ విషాదం జరగక ముందు..ఈ విషాదం జరగక ముందు.. దళపతి విజయ్ ఎంతో చురుకుగా.. అల్లరి చేస్తూ.. అతిగా మాట్లాడే బాలుడిగా ఉండేవారు. కానీ విద్యా విజయ్ మరణం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన అంతర్ముఖుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన బహిరంగ ప్రదేశాల్లో కనిపించే శాంత స్వభావానికి ఆనాటి ఆ ఘటనే కారణమని చెబుతుంటారు. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎంతో ఆప్యాయంగా విద్యకు తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించేవాడు. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా..గతంలో ఓ కార్యక్రమంలో తన చెల్లెలు విద్య గురించి విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో చెల్లెలు మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందన్నారు.. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడంటూ.. వారందరిలో తన చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటానని తెలిపారు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని నామకరణం చేశారు.విజయ్ కార్ నంబర్ వెనుక రహస్యంవిజయ్ తన కార్లకు 0277 అనే ప్రత్యేక నంబర్ను వాడుతుంటారు. ఈ నంబర్ తన సోదరి విద్యాకు అంకితం చేశారు. 14-02-77 అనేది ఆమె పుట్టిన తేదీ. తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికీ ఆ నంబర్ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు.తండ్రిపై విజయ్ కేసు..కాగా, గతంలో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టిన సంగతి కూడా అభిమానులు గుర్తుకుచేసుకుంటున్నారు. 2020లో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్గా శోభా చంద్రశేఖర్ వ్యవహరించారు. అయిత.. తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తండ్రి స్థాపించిన ఆ పార్టీకి తన పేరుని ఉపయోగించుకుంటే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది. -
అందరి నోర్లు మూయించిన విజయ్
-
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఐదు ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకేఅందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్మోదీ ట్వీట్కు దన్యవాదాలు తెలిపిన విజయ్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.
-
విజయ్ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్’ రిలీజ్?
నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి. Maanbumigu Thamizhaga Mudhalvar Dr. C. Joseph Vijay Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026


