TVK Vijay
-
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
12ఏళ్ల తర్వాత మోదీని కలిసిన CM విజయ్
-
మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు)
-
పవన్పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
సూపర్ కాంబో: మోదీ, సురేష్ గోపీలతో విజయ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండాసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యతప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పారీ్టలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ? ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్కు లేఖ కూడా రాశారు.స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు. -
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
-
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు. -
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల అనంతరం పార్టీ లోపల మొదలైన విభేదాలు ఇప్పుడు రాజీ, పునఃసమీకరణల దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఇచ్చిన పిటిషన్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో “తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం” అంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసిన రెబల్ శిబిరం కూడా వెనక్కి తగ్గే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల స్పీకర్ను కలిసిన ఈపీఎస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అలాగే టీవీకేలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారడం మొదలైంది. రెబల్ వర్గంలో సంఖ్యా బలం క్రమంగా తగ్గిపోవడం, పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ వైపు మొగ్గు చూపడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది.ఎన్నికల తర్వాత సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ్భాస్కర్ నేతృత్వంలో ఏర్పడిన రెబల్ వర్గం మొదట తమ బలం 30 మంది ఎమ్మెల్యేలని ప్రకటించింది. అయితే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలనిరూపణ సమయానికి ఆ సంఖ్య 25కు చేరింది. ఇప్పుడు వరుస పరిణామాల తర్వాత ఆ సంఖ్య 16కి పడిపోయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెబల్ వర్గ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.బలపరీక్ష సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి రెబల్స్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మద్దతుకు ప్రతిఫలంగా కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కుతాయని ఆ వర్గం ఆశించినట్లు తెలుస్తోంది. కానీ టీవీకే మిత్రపక్షాల అభ్యంతరాలతో అది జరగలేదు. అయితే రాజకీయ ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. భవిష్యత్లో పార్టీలో స్థానం, పదవుల పునరుద్ధరణ, రాజకీయ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ శిబిరం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈపీఎస్కు చేరువవుతున్నారు. మరోవైపు టీవీకే వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికారికంగా విజయ్ శిబిరంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరికి భవిష్యత్ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున అవకాశాలు ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య ఈపీఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట కఠిన వైఖరి తీసుకున్న ఆయన.. ఇప్పుడు రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్స్పై చర్యల పిటిషన్ను వెనక్కి తీసుకోవడం ద్వారా అసంతృప్త వర్గాలను తిరిగి పార్టీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరోసారి ఏకీకృతం కావచ్చన్న చర్చ మొదలైంది.అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీలో 144-22 తేడాతో విజయ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. కాబట్టి రెబల్స్ మద్దతు ఉపసంహరించుకున్నా(మ్యాజిక్ ఫిగర్ 118) ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే… అన్నాడీఎంకేలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతోంది. రెబల్ వర్గం బలహీనపడుతుండగా, ఈపీఎస్ మళ్లీ పార్టీపై పట్టు బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ లెక్కలు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విభాగాల్లో ప్రక్షాళన ఊపందుకుంది. ఇందులో భాగంగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె హైకోర్టు, , హైకోర్టు మదురై బెంచ్లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలుఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. డీఎంకే లీగల్ వింగ్కు చెందిన ఈ న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వ న్యాయవాదులను నియమించేంత వరకు విధుల్లో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాదుల నియామక ప్రక్రియ తుది దశకు చేరడంతో, వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎడ్విన్ ప్రభాకర్తో పాటుగా మద్రాసు హైకోర్టులో 24 మంది న్యాయవాదులు, 36 మంది అదనపు న్యాయవాదులు, మరో 54 ప్రత్యేక న్యాయవాదులు రాజీనామాలు ఆమోదించారు. అలాగే, హైకోర్టు మదురై బెంచ్ ప్రభుత్వ ప్లీడర్ పి. తిలక్కుమార్తో పాటుగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు 9 మంది, అదనపు న్యాయవాదులు 16 మంది, ఇతర న్యాయవాదులు 21 మంది ఈ జాబితాలో ఉన్నారు.కొత్త నియామకాలపై ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా.. కొత్త ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోనే ఈ స్థానాల్లో నియమించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదులలో ఆసక్తి నెలకొంది. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
సీఎం విజయ్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
-
అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్
-
సైలెంట్గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. -
ఇది తమిళనాడా లేదా యూపీనా..?
తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు. వరుస నేరాల తో విమర్శల దాడి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు. సీఎం నియోజకవర్గంలోనే అరాచకం స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. -
‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్ టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కొన్ని పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కోరారని విమర్శించారు.“అదే కాకుండా, ‘పుష్ప’ సినిమా శైలిలో సోఫా చేతిలో పట్టుకుని వెళ్లినట్టు.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నించారు. ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇదేనా నిజాయితీగల రాజకీయ నాయకుడి ప్రవర్తన అని ప్రశ్నిస్తున్నారు” అని పేర్కొన్నారు. కాగా, పుష్ప సినిమాలో సోఫాల్లో హీరో డబ్బుల కట్టలు పంపుతాడు.తమిళనాడులో ఈ ఘటనను “ముందే పన్నిన కుట్ర”గా ఈపీఎస్ పేర్కొన్నారు. రాజీనామాలు, టీవీకేలో చేరికలు సచివాలయం లోపలే సమన్వయంతో జరిగాయని పళనిస్వామి ఆరోపించారు. “సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాజీనామా లేఖలు ఆమోదిస్తుండగా, ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు ఇచ్చారు” అని చెప్పారు. దీంతో ఇది ముందే పన్నిన కుట్ర అని, బేరసారాల రాజకీయాలు బయటపడ్డాయని ఈపీఎస్ అన్నారు.ఇలాంటి మోసపూరిత చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్తవని, ఎన్నో ద్రోహాలు, వెన్నెపోట్లను ఏఐఏడీఎంకే ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. విజయ్పై ఈపీఎస్ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. “సినిమా ప్రముఖుడి గుర్తును” ప్రజలు తిరస్కరించడంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని అన్నారు. టీవీకే విజిల్ గుర్తును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణిస్తున్న వారికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.అన్నాడీఎంకేలో విభేదాలు మరింత తీవ్రంఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలు మరో ఎదురుదెబ్బగా మారాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం పళనిస్వామికి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణికి మద్దతు ఇస్తోంది.రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలలో ఉన్నారు. అయితే, మరో పరిణామంలో, తిరుగుబాటు వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు. దీంతో ఈపీఎస్కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 27కి పెరిగింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తర్వాత స్పీకర్ను కలిసి, పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని లేఖ ఇచ్చారు.నిబంధనల ప్రకారమే..: స్పీకర్ బేరసారాల జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. తన బాధ్యత రాజీనామా లేఖలు అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడటమేనని చెప్పారు. “సమర్పించిన లేఖలు నిబంధనలకు సరిపోతున్నాయా లేదా మాత్రమే నేను పరిశీలించగలను. బయట ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను” అని విలేకరులతో చెప్పారు.రాజీనామాలు ఆమోదం పొందడంతో, మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో గెలిచి తర్వాత విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో కూడా ఉపఎన్నిక జరగనుంది.తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, టీవీకేలో చేరడంతో దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో 234 సభ్యుల అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కి తగ్గింది. మే 13న విశ్వాస పరీక్షలో సి.జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ కూడా ఉన్నారు.శరవేగంగా బేరసారాలు: స్టాలిన్డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దీనిపై మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. శరవేగంగా బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొదట మిత్రపక్షాల మద్దతు కోరిన టీవీకే తర్వాత ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకేలోని కొంతమందితో చర్చలు జరిపిందని, చివరకు కొంతమంది అన్నాడీడీఎంకే సభ్యుల రాజీనామాలు చేయించి, వారినే సచివాలయ ప్రాంగణంలో తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు. ఇలాంటి అవమానకర దృశ్యాలు చూడటానికే ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని స్టాలిన్ అన్నారు.టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్పై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకతంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని కపటత్వంగా ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. ఈ ఫిరాయింపులపై “ఆయా రామ్, గయా రామ్” అన్న వ్యాఖ్య చేశారు. -
ప్రెస్మీట్లో పగలబడి నవ్విన పోలీస్ అధికారిని ఎవరంటే?
సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. Am told that CM has taken action over the insensitive video of police officers laughing before briefing the media on such a serious case.But it turns out no action has been taken yet.I deleted my earlier tweet in which I thanked the CM.Didn’t expect CM Vijay to stay silent… pic.twitter.com/vmLURRYV5Z— Lala (@FabulasGuy) May 25, 2026 ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్మీట్లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు.ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. கடுங்குற்றச் செயல்களில் ஈடுபடுவோர் மீது உடனடியாக வழக்குப் பதிவு செய்து, விரைவாக விசாரணை நடத்தி, சட்டத்தின் கீழ் கடுமையான தண்டனை பெற்றுத்தர வேண்டும் என தமிழ்நாடு முதலமைச்சர் விஜய் அவர்கள் உத்தரவிட்டுள்ளார்#TVKVijayHQ #CMJosephVijay pic.twitter.com/zryLbTeHjc— CM Joseph Vijay (@CMJosephVijayHq) May 25, 2026 -
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయ్ కుమార్ రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు రాజీనామా లేఖలు అందించారు. రాజీనామా అనంతరం,తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (హైవేలు, భవనాలు, మైనర్ పోర్టులు) మంత్రి అధవ్ అర్జున్తో భేటీ అయ్యారు. ఇటీవల అధికారం చేపట్టిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ విశ్వాస తీర్మానంలో అన్నాడీఎంకేలోని వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చారు. ఆ 25 మందిలో ఇవాళ అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మే 13 టీవీకే ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో గెలవడానికి వేలుమణి శిబిరం 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే కన్వినర్ ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇచ్చిన ఈ 25 మందిని పార్టీ పదవుల నుండి తొలగించాలని కోరుతూ స్పీకర్కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెట్టారు. ఈ వరుస పరిణామాలతో వేలుమణి వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ శిబిరంలో చేరగా.. మరికొంత మంది అంతర్గతంగా టీవీకే వైపు మొగ్గు చూపారు. సత్యభామ, మరగాథం, జయ్ కుమార్తో పాటు మరికొంత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విజయ్తో దోస్తీ.. ఉదయనిధి అది గుర్తుంచుకుంటే మంచిది
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం తర్వాత ఏర్పడిన అంతర్గత విబేధాలు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బహిరంగంగా మాటలు విసురుకునే స్థాయికి చేరుకున్నాయి. విజయ్ ఫ్యాక్టర్ కారణంగా డీఎంకే–కాంగ్రెస్ మధ్య ఉన్న దీర్ఘకాలిక పొత్తు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.కాంగ్రెస్ను ఇకపై నమ్మం.. అంటూ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాలుగా ఆ పార్టీ తమపైనే ఆధారపడిందని.. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని .. అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని.. ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని.. కాంగ్రెస్ను ఇకపై దగ్గరికి రానివ్వకూడదంటూ తీవ్రంగా మాట్లాడారాయన. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీఎంకేకు కష్టకాలంలోనూ కాంగ్రెస్ అండగా నిలిచిందని, పొత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీపైనే అనవసర వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారాయన.‘‘కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ కూటమి కోసం పనిచేసింది. డీఎంకేతో ఉన్న భాగస్వామ్యం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయంగా అనవసర ఉద్రిక్తతలను పెంచుతాయి’’ అని ఉదయనిధికి మాణికం ఠాగూర్ హెచ్చరికలు జారీ చేశారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడడంతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది. విజయ్కు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ప్రకటించింది. ఆపై విజయ్ కేబినెట్లో రెండు స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామాలన్నీ డీఎంకేకు కోపం తెప్పించాయి. కాంగ్రెస్పై వెన్నుపోటు రాజకీయమంటూ బహిరంగ విమర్శలకు దిగింది. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ కూడా డీఎంకేకు కౌంటర్ ఇవ్వసాగింది.ఈలోపు.. తామింక ఇండియా కూటమిలో లేమని, లోక్సభలో తమ ఎంపీల సిట్టింగ్ విషయంలో పునరాలోచన చేయాలంటూ డీఎంకే నేత కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే లేఖ రాశారు. దీంతో తమిళనాడు పరిణామాలు.. దేశ రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.ఇద్దరికీ ఇద్దరూ అండగానే!కేంద్ర రాజకీయాల్లో యూపీఏ ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్కు డీఎంకే బలమైన మద్దతుగా నిలిచింది. ఆ దోస్తీతోనే ఇటు తమిళనాడులోనూ కాంగ్రెస్ విజయాలకు కారణమవుతూ వచ్చింది. అలాగే డీఎంకేకు కష్టకాలంలో కాంగ్రెస్ అండగా నిలిచిందన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలకు రాజకీయంగా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1990ల చివరి నుంచి తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తమిళనాడులో గణనీయమైన సీట్లు రావడానికి కూటమి కీలకంగా నిలిచింది. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయంలో డీఎంకే ఓటు బ్యాంక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో డీఎంకే కీలక మిత్రపక్షంగా వ్యవహరించింది. కేంద్ర మంత్రివర్గంలో కూడా డీఎంకేకు ప్రాధాన్యత దక్కింది. బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో రెండు పార్టీలు చాలాకాలం కలిసి పనిచేశాయి. అందుకే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు కేవలం తాజా రాజకీయ రగడగానే కాకుండా.. రెండు దశాబ్దాల రాజకీయ భాగస్వామ్యంలో ఏర్పడిన పెద్ద చీలికగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
వారితో జాగ్రత్త.. విజయ్కు తమిళిసై హెచ్చరిక
సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్కు అలవాటేనని, జాగ్రత్తగా ఉండాలని సీఎం విజయ్కు బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఆదివారం చైన్నెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందన్నారు. తమ విజయాల్లో డీఎంకే పాత్ర ఏమీ లేదని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్కు ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్లూ తమతో ఉన్న డీఎంకేకే వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ.. రేపు సీఎం విజయ్కు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడదని హెచ్చరించారు.అన్నాడీఎంకే విషయంలో త్వరలో నిర్ణయం..మరోవైపు.. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలనే విషయంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ.. రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తనకు వినతిపత్రాలు సమర్పించాయన్నారు.ఆ వినతిపత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోందన్నారు. తనపై ఆరోపణలు చేసే వారికి కూడా అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో, తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తాననని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుందని స్పీకర్ వివరించారు. -
ట్రోలింగ్ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన
సాక్షి, చైన్నె: ‘నేను సహజంగా నవ్విన నవ్వును కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... దానికి రాజకీయ రంగు పూసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా కలచివేసింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ వివరణను పోస్ట్ చేశారు.ట్రోలింగ్ చేయడం సరికాదుపరిశ్రమల శాఖ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్మీట్లో విలేకరుల ప్రశ్నలు–సమాధానాలు ముగిసిన తరుణంలో తాను సహజంగా నవ్వాననని, అది ఏ ఒక్క ప్రశ్నకో లేదా రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఘటనకో వ్యతిరేకంగా చేసిన ప్రతిబింబం కాదన్నారు. అయితే తన తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్ను తప్పుగా చిత్రీకరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నెగిటివ్గా ప్రచారం చేయడం బాధాకరం అని మంత్రి కీర్తనా పేర్కొన్నారు. இவர்கள் எல்லாம் மனிதர்களா...பத்து வயது சிறுமி பாலியல் வன்கொடுமைக்கு ஆளாக்கப்பட்டு மிகக் கொடூரமாக கொலை செய்யப்பட்டது தொடர்பாக செய்தியாளர்கள் கேள்வி கேட்டால் அமைச்சர் @Keerthana4VNR வுக்கு சிரிப்பு வருகிறது 🤬🤬🤬 pic.twitter.com/eALA6Cx8IV— Sivan - DMK (@SSivanDMK) May 24, 2026ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడులకు దిగడం , సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ట్రోలింగ్ చేయడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే కావచ్చని, అయితే, ఒకరి వ్యక్తిగత క్షణాలను అస్త్రంగా మార్చుకుని నిజాన్ని వక్రీకరించడం సమాజానికి ఆరోగ్యకరమైన పద్ధతి కాదని హితవు పలికారు.தொழில்துறை தொடர்பான அறிமுகக் கூட்டத்தை முடித்து பத்திரிகையாளர்களை சந்தித்து வெளியே வந்தபோது, கேள்வி-பதில்கள் முடிந்த தருணத்தில் இயல்பாக நான் சிரித்தேன். அது எந்தக் கேள்விக்கும் அல்லது சம்பவத்திற்கும் எதிரான பிரதிபலிப்பல்ல. ஆனால் அந்த உடல் மொழியை தவறாகப் புரிந்து கொண்டு, அரசியல்…— Virudhai Magal Keerthana (@Keerthana4VNR) May 24, 2026మరోవైపు.. మైనర్ హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్మీట్లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్లో నవ్వులాటలు సాగిస్తూ.. మీడియా ముందే నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.Insensitive 🤦🤦🤦 pic.twitter.com/xiMg9toeb7— Rajasekar (@sekartweets) May 24, 2026అసలు ఏం జరిగింది?కోయంబత్తూర్లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. -
అందుకే విజయ్ గెలిచారు: స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని స్టాలిన్ ఒక రాజకీయ పవనంగా కాకుండా 'సినిమా సునామీ'గా అభివర్ణించారు. ఓటర్లు రాజకీయ విశ్వాసంతో కాకుండా, ఒక ప్రముఖ సినీ నటుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజయ్కు మద్దతు ఇచ్చారని ఆయన వాదించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘తమ అభిమాన నటుడు విజయ్ ఒక పార్టీని ప్రారంభించాడనే ఉత్సాహంతో ప్రజలు ఓటు వేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆటబొమ్మపై వారికి ఆసక్తి పోతుంది. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్లే, ఓటర్లు చివరికి మళ్లీ డీఎంకే కోసం వెతుకుతారు’ అని జోస్యం చెప్పారు.అలాగే, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. విజయ్ పార్టీ సొంతంగా 118 సీట్ల మెజారిటీ మార్కును దాటడంలో విఫలమైంది. వారు కనీసం మెజారిటీ కూడా సాధించలేకపోయారు. తమిళనాడు ప్రభుత్వం మా దయ వల్లే మనుగడ సాగిస్తోంది. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా అది కూలిపోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు’ అంటూ బాంబు పేల్చారు.#WATCH | "நிச்சயமாக இது 5 ஆண்டு காலம் நடைபெறக்கூடிய ஆட்சி அல்ல.. ஜனநாயகத்தில் இந்த தீர்ப்பு சினிமா கவர்ச்சிக்கு சாதகமாக அமைந்திருக்கிறது என்பதே உண்மை.."-திமுக இளைஞரணி அமைப்பாளர் கூட்டத்தில் திமுக தலைவர் மு.க.ஸ்டாலின் பேச்சு#SunNews | #MKStalin | #DMK pic.twitter.com/cGwa5sDeg4— Sun News (@sunnewstamil) May 24, 2026ఇదే సమయంలో అన్నాడీఎంకే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవన్నీ విఫలమయ్యాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరాయని ఆయన పేర్కొన్నారు.ఇక, ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 మంది సభ్యులున్న సభలో మెజారిటీ మార్కుకు అది కొద్దిలో ఆగిపోయింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేశాయి. అయితే, ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయ్కు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకేకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈసారి ఆ పార్టీ కేవలం 59 స్థానాలకే పరిమితమైంది. స్టాలిన్ స్వయంగా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. -
‘వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు’
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు."కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు. -
సీఎం విజయ్ కి తొలి సవాల్.. కోయంబత్తూరు ఘటన కలకలం
-
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
సాక్షి, చెన్నై : రాజ్యసభ, అసెంబ్లీ ఎప ఎన్నికలపై టీవీకే అధినేత, సీఎం విజయ్ దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాలను గుప్పెట్లోకి తెచ్చుకునే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. అధికార పగ్గాలతో చరిత్ర సృష్టించిన తమ పార్టీ, రాజ్యసభలోనూ అడుగు పెట్టేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే, తిరుచ్చి తూర్పులో జరగనున్న ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. రాజ్యసభ గెలుపు సమీకరణాలు ఇవే.. అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యమైంది. జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలెట్టారు. సాధారణంగా తమిళనాడు నుండి ఓ రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో, గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు (అంటే 117 ఓట్లు) అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. (ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది).ప్రస్తుతం అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, వీసీకే , సీపీఎం,సీపీఐల మద్దతు ఇస్తే టీవీకే అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే కానుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు కూడా విజయ్ పారీ్టకే ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఈస్థానం కైవసానికి విజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్లోని తన మిత్రుడు ప్రవీణ్ చవ్రర్తికి సీటు ఇస్తే కూటమి పార్టీలలో ఏదేని విబేధాలు తలెత్త వచ్చు అని భావిస్తున్నారు. దీంతో టీవీకేకు చెందిన ఒక ముఖ్య నేతను లేదా తమకు వెన్నంటి ప్రోత్సహం ఇచ్చిన అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఓ ముఖ్య ప్రముఖుడ్ని రాజ్యసభకు పంపించేందుకు విజయ్ కసరత్తులు చేపట్టినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికపై ఉత్కంఠ మరోవైపు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఎంకే తరపున ఇక్కడ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పోటీ చేయవచ్చ అనే సంకేతాల నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. తొలుత లాల్గుడిలో ఓడిన కూపా కృష్ణన్ పేరు వినిపించినా ఆయనకు బోర్డు పదవి దక్కింది. సినీ నటి త్రిషా పేరిట పోటీ అంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా మాజీ ఐఏఎస్ అధికారులపై విజయ్ దృష్టి పెట్టి ఉన్నారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం పోటీకి నిరాకరించిన పక్షంలో మరో ఐఏఎస్ అధికారి పోటీలో పెట్టేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం. -
విజయ్ మాస్టర్ ప్లాన్.. కర్ణాటకలో టీవీకే ఎంట్రీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..1. బలంతమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్రూట్ నెట్వర్క్ లభిస్తుంది.2. సవాళ్లుస్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.టీవీకే బలం..ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
విజయ్ ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం
సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్: జూన్ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, విజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. -
సోషల్ మీడియాలో రచ్చ.. స్టాలిన్ హెచ్చరిక
సాక్షి, చైన్నె: వీసీకే, ఐయూఎంఎల్లు టీవీకే కూటమి ప్రభుత్వంలో చేరడంపై డీఎంకే శ్రేణులు ఎవరూ కఠిన పదజాలంతో విమర్శలు చేయవద్దని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు నూతన మంత్రులుగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యే షాజహాన్న్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, డీఎంకే కూటమిని వీడి వీసీకే, ఐయూఎంఎల్లు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం డీఎంకే వర్గాలలో ఆగ్రహాన్ని రేపాయి. టీవీకే కేబినెట్లో వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు చేరుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే డీఎంకే ఎంపీ ఎ.రాజా ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. ఇందులో పైకి ఎదగడానికి నిచ్చెనగా ఉపయోగపడిన వారు, సమాజంలోని మూఢత్వాన్ని, కుల వివక్షను అంతమొందించాల్సిన ’చిరుత పులులు’ (వీసీకే పార్టీ చిహ్నాన్ని ఉద్దేశించి), కేవలం ఒక విజిల్’ శబ్దానికి లొంగిపోయి మద్దతు ఇస్తున్నాయంటే, పెళ్లి చేసుకున్న భర్తను పక్కనబెట్టి, వేరే చోటు వెతుక్కున్నట్లే..పెరియార్ సిద్ధాంతాల ప్రకారం సరైన సమయం కోసం వేచి చూద్దాం, కానీ పోరాడుతూనే ఉంటాం. విజయం మనదే అని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహానికి దారితీసింది. అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో ఈ ట్వీట్ ఉందంటూ నెటిజన్లు, ఇతర రాజకీయ నాయకులు రాజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదం ముదరడంతో ఆయన ఆ పోస్ట్ను వెంటనే తొలగించారు. ఆయన మరో ట్వీట్ చేస్తూ ‘నా ఇంటి పెరట్లోని కొబ్బరి చెట్టు అవతలి వైపునకు వంగి, ఎదురింటి వారికి కొబ్బరి నీళ్లు అందిస్తే... సాహిత్యంలో దాన్ని ముడత్తెంగు’ (వంగిన కొబ్బరి చెట్టు) అంటారు! కానీ రాజకీయాల్లో దీనికి ఏం పేరు పెట్టాలి? వర్ధిల్లాలి తమిళం అని పేర్కొన్నారు. ఈ రెండో ట్వీట్ కూడా ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. రాజా చేసిన ఈ రెండు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేసే పనిలో పడ్డారు. తొలి ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో డీఎంకే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అదే సమయంలో డీఎంకే, వీసీకే వర్గాల మధ్యమాటల తూటాలు పేలడం ఉధృతమైన నేపథ్యంలోనే, పరిస్థితి మరింత చేయి దాటకుండా ఉండేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రెండు పార్టీలను సిద్ధాంత మిత్రులుగా అభివర్ణిస్తూ, తమ పార్టీ శ్రేణులకు సంయమనం హెచ్చరిక జారీ చేశారు.స్టాలిన్ ట్వీట్లో హెచ్చరికలుఈ మేరకు స్టాలిన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. ‘మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన మన సిద్ధాంతపరమైన మిత్రులు వన్నియరసు, షాజహాన్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తమ రాజకీయ నిర్ణయాలను తామే నిర్దేశించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకై నా ఉంటుందని, కాబట్టి డీఎంకే కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడా ఈ తరుణంలో ఇతరులను నొప్పించేలా, బాధించేలా కఠినమైన మాటలు మాట్లాడకూడదని విజ్ఞప్తిచేశారు. మంచిని అభినందిస్తూ, లోపాలను ఎత్తిచూపే ఒక బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం పనిచేద్దాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
హామీని నిలబెట్టుకున్న విజయ్.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తనకు సలహాలు అందించేందుకు ఇద్దరు ప్రత్యేక సలహాదారులను నియమించారు. వీరిలో ఒకరు ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి ఉన్నారు. సీఎం విజయ్ తన రాజకీయ సలహాదారుగా ఆయన్ను నియమించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం గెలుపు వ్యూహాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. ప్రముఖ సలహాదారు విష్ణు రెడ్డిని ఇతర ప్రభుత్వ, పాలనాపరమైన విషయాల కోసం సలహాదారుడిగా నియమించుకున్నారు. కాగా, జ్యోతిష్కుడు, టీవీకే అధికార ప్రతినిధి రతన్ పండిట్ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నిపుణులను అధికారికంగా రంగంలోకి దిగారు.వచ్చే వారం ఢిల్లీకి సీఎం విజయ్తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదటిసారిగా వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు, మేఘాదాతు ఆనకట్ట వివాదంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా విజయ్ కలవనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ. 65 లక్షల ఆర్థిక సహాయంతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్’ విగ్రహాన్ని సీఎం విజయ్ ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు.సీఎంఓ ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీలు విడుదలముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజల వినతిపత్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సచివాలయానికి రాకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించేందుకు అధికారిక ఈ–మెయిల్ ఐడీలను ప్రభుత్వం విడుదల చేసింది.హామీని నిలబెట్టుకున్నసీఎం విజయ్చెప్పింది చేస్తాడు.. చేసింది చెబుతాడు’ అనే నినాదంతో సీఎం విజయ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం తమిళనాడులో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ మహానాడులో తాము అధికారంలోకి వస్తే మిత్రపక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యం (సంకీర్ణ ప్రభుత్వం) కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే, తాజాగా వీసీకే నాయకుడు వన్నియరసు, ఐయూఎంఎల్ నాయకుడు షాజహాన్లను క్యాబినెట్ మంత్రులుగా చేర్చుకుని, తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ సర్వాధికారాల సంస్కృతిని మార్చి, సరికొత్త విప్లవాత్మక సంకీర్ణ యుగానికి విజయ్ తెరలేపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ పోస్టు వైరల్గా మారింది.620 అమ్మ క్యాంటీన్ల’ పునరుద్ధరణకు ఆదేశంపేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో ప్రారంభించబడిన అమ్మ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలోని 383 అమ్మ క్యాంటీన్లు,ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 237 అమ్మ క్యాంటీన్లను అత్యుత్తమ వసతులతో పునర్నిర్మించి, పేదలకు నిరంతరాయంగా తక్కువ ధరకే ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు -
స్టైలిష్ అవతార్లో సీఎం విజయ్.. ఉప్పొంగిన అభిమానం (చిత్రాలు)
-
స్టాలిన్-పళనిది కలేనా?
ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్రాజ్ ఆరోపించారు. అయితే.. విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్రాజ్ ఖండించారు. “ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్రాజ్ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్నేషన్-వన్ ఎలక్షన్, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.ఇదిలా ఉంటే.. విజయ్ తన కేబినెట్ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్బో క్యాబినెట్’ను విజయ్ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తమిళనాడులో నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి, సీనియర్ నేత సెమ్మలై బాటలో బరువెక్కిన హృదయంతో వైదొలుగుతున్నానని మాజీ స్పీకర్, సీనియర్ నేత పి. ధనపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పి. ధనపాల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ధనపాల్ అన్నాడీంకే ప్రభుత్వ హయాంలో 2012–2016 , 2016–2021 మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల పాటు స్పీకర్గా సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన 1977, 1980, 1984, 2001 ఎన్నికలలో సంఖగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 జయలలిత క్యాబినెట్లో ఆహార, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011లో రాశిపురం, 2016లో అవినాశి నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు.రాజీనామా అనంతరం ధనపాల్ వ్యాఖ్యలు.. పార్టీకి రాజీనామా చేసినానంతరం ధనపాల్ ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. నేను సైకిల్పై తిరుగుతూ, రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఈ రోజు ముక్కలైపోవడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అందరినీ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు కూడా తాజాగా పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని, ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించిన తీవ్ర డిప్రెషన్ (మానసిక వేదన) వల్లే తాను అన్నాడీఎంకేకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.కాగా, తన కుమారుడు లోకేష్ తమిళసెల్వన్ టీవీకేలో చేరి, రాసిపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడని, కేబినెట్ విస్తరణలో అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నేత సెమ్మలై పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బాటలో ధనపాల్ అడుగులు వేయడంతో అన్నాడీఎంకే నుంచి మరెంత మంది సీనియర్లు మున్ముందు తప్పుకోనున్నారో అన్న చర్చ ఊపందుకుంది. -
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది.ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్ – చీఫ్ ఇంజనీర్ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది.రిటైర్డ్ డైరెక్టర్ పెన్షన్ బెనిఫిట్స్ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్. మంగళనాథన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. -
ఆసక్తికరం.. తమిళనాడు మంత్రుల నేపథ్యం!
సాక్షి, చెన్నై: సీఎం విజయ్ కేబినెట్లో కొత్తగా అడుగు పెట్టిన 23 మందిలో పలువురికి సంబంధించిన విద్యా ప్రయాణం, రాజకీయ అనుభవం తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విజయ్ మక్కల్ ఇయక్కం నుంచే రాజకీయాలలోకి రాగా, మరి కొందరు వైద్యులు, న్యాయవాదులుగా, ఇంకొందరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఎన్. మరియా విల్సన్: తమిళనాడులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, దివంగత ‘జేప్పియార్’ అల్లుడు (జేప్పియార్ కుమార్తె రెజినా భర్త). జేప్పియార్ రెమిబాయ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీహెచ్డీ పూర్తి చేశారు.ఏ. శ్రీనాథ్ : సీఎం విజయ్ అత్యంత ఆప్తమిత్రుడు. 1992లో విజయ్ కథానాయకుడిగా పరిచయమైన ’నాళైయ తీర్పు’ చిత్రం ద్వారానే శ్రీనాథ్ కూడా సినీరంగంలోకి ప్రవేశించారు. విజయ్తో కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఎన్నికల్లో సీనియర్ డీఎంకె మంత్రి గీతా జీవన్ను తూత్తుకుడిలో ఓడించి సంచలనం సృష్టించారు. 52 ఏళ్ల శ్రీనాథ్ 12వ తరగతి చదివారు.ఎస్. కమలి : రాసిపురం ప్రాంతానికి చెందిన ఈమె కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ను ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కేబినెట్లో అత్యంత పిన్న వయసు్కరాలైన మంత్రి ఈమె. 28 ఏళ్ల వయస్సులో మంత్రి అయిన కమలి ఇంగ్లీష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేశారు.సి. విజయలక్ష్మి: టీవీకే పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు. అన్నాడీఎంకే సీనియర్ నేత పి. తంగమణిని ఓడించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వయం ఉపాధి (సొంత బిజినెస్) చేసేవారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. డి. లోకేష్ తమిళసెల్వన్: అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పి. ధనపాల్ కుమారుడు. గత లోక్సభ ఎన్నికల్లో నీలగిరి నుండి అన్నాడీఎంకే తరపున పోటీ చేశారు. తర్వాత టీవీకేలో చేరి, డీఎంకే మంత్రి మదివేందన్ను ఓడించారు. లయోలా కాలేజ్ నుండి బీకామ్, ఢిల్లీ ఐఐపీఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పి. విశ్వనాథన్ (కాంగ్రెస్): చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఈయన 2009–2014 మధ్య కాంచీపురం ఎంపీగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో సాధారణ (జనరల్) స్థానంలో పోటీ చేసి గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ అభ్యర్థి ఈయనే కావడం విశేషం. మద్రాస్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు.ఆర్. కుమార్ : ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన, ఇటీవల ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు నుండి బిజినెస్ లీడర్íÙప్ కోర్సు చేశారు.విజయ్ తమిళన్ పార్తీబన్ : విజయ్ అభిమాన సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా ఎదిగిన లాయలిస్ట్. సేలం పాత బస్టాండ్ వద్ద చిన్న మొబైల్ షాప్ నడుపుకునే స్థాయి నుండి నేడు పెద్ద షోరూమ్ అధినేతగా ఎదిగారు. విజయ్, బుస్సీ ఆనంద్కు అత్యంత నమ్మకస్తుడైన ఈయన 12వ తరగతి వరకు చదివారు.ఎస్. రాజేష్ కుమార్ (కాంగ్రెస్): కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత. కన్యాకుమారి జిల్లా కిళ్లీయూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. న్యాయశాస్త్రం చదివారు.డి. శరత్కుమార్: డీఎంకే కోటగా భావించే తాంబరంలో ఆ పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. కృతికా దేవిని 35,621 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. గతంలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేశారు. జైన్ కాలేజీ నుండి బీబీఏ పూర్తి చేసిన యువ ఎమ్మెల్యే.ఆర్.వి. రంజిత్ కుమార్ : కాంచీపురం ఎమ్మెల్యే, వయసు 50 ఏళ్లు. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.బి రాజ్కుమార్ : వయసు 46 ఏళ్లు. మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.బి. మదన్ రాజా: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సొంత వ్యాపారాలు ఉన్నాయి. విఘ్నేష్ : వయసు 38 ఏళ్లు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సీసీటీవీ కెమెరాల వ్యాపారం చేసేవారు. గత 15 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయక్కంలో పనిచేస్తున్నారు.వి. సంపత్కుమార్: కోయంబత్తూర్ నార్త్లో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ను ఓడించి సంచలనం çసృష్టించారు. అన్నామలై వర్సిటీ నుండి ఎంబీఏ (డిస్టెన్స్) చేశారు.రాజీవి : వయసు 33 ఏళ్లు. వృత్తిరీత్యా డాక్టర్ (వైద్యుడు). టీవీకే యువ మంత్రుల్లో ఒకరు.గాంధీరాజ్: వయసు 52 ఏళ్లు. 12వ తరగతి చదివారు. సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నారు.జెగదీశ్వరి.కె : గ్రాడ్యుయేట్. జర్నలిజం, మీడియా రంగంలో అనుభవం ఉంది. ఆర్. రమేష్ : 10వ తరగతి చదివారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి.తెన్నరసు.కె : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. కమీషన్ ఏజెంట్గా వ్యవహరిస్తూ, విజయ్ వీరాభిమానిగా ఉంటూ వచ్చారు.మహమ్మద్ ఫర్వాజ్.జె : ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ విజయ్ అభిమానిగా ఉంటూ వచ్చారు.సామాజిక సమతుల్యత:కమలి, విస్వనాథన్, రాజ్మోహన్, లోకేష్ తమిళసెల్వన్, తెన్నరసు, గాంధీరాజ్, మదన్రాజాలు షెడ్యూల్ కులాలకు చెందిన నేతలు మంత్రులు కావడం విశేషం.మహిళా శక్తిగా: ఎస్. కమలి, సి. విజయలక్ష్మి, కీర్తన, జగదీశ్వరి కేబినెట్లో ఉన్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు, యువకులకు, విద్యాధికులకు, సామాజిక సమీకరణాలకు సీఎం విజయ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. -
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్కుమార్కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026 -
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ దుందుభి మోగించారు. విజయ్ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంల్, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గ విస్తరణలో వ్యూహంవిజయ్ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.వీసీకే, ఐయూఎంల్ వైఖరివీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు.. వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.విజయ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు. -
తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందికి తన కేబినెట్లో స్థానం కల్పించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరితో గర్నవర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా చేరిన మంత్రులతో తమిళనాడు కేబినెట్లోని సభ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్తరణ జరడంతో ఇంతకుముందు ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం విజయ్ కూడా తన దగ్గరున్న కొన్ని శాఖలకు కొత్త మంత్రులకు బదిలీ చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగానే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కుమార్కు ఈ శాఖను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖను కూడా ఆయనకే అప్పగించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొందనున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్కు కీలక శాఖలుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేశ్కుమార్, పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం దక్కింది. రాజేశ్కుమార్ పర్యాటక శాఖ, విశ్వనాథన్కు ఉన్నతవిద్య శాఖ కేటాయించారు. ఇది ఊహించలేదు: ఐయూఎంఎల్తమను మంత్రి వర్గంలో చేరమని సీఎం విజయ్ ఆహ్వానిస్తారని ఊహించలేదని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మంత్రి పదవుల కోసం తాము అడగలేదని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ పాలన వస్తుందని, తద్వారా బీజేపీ పెత్తనం చెలాయిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్కు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం వెల్లడించలేదు.చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం! -
మరో వివాదంలో సీఎం విజయ్
-
59 ఏళ్ల నిరీక్షణకు ముగింపు విజయ్ కేబినెట్లోకి కాంగ్రెస్
-
సీఎం విజయ్ ఆర్మీ ప్రమాణస్వీకారం
-
అన్నాDMK నేతలకు బిగ్ షాక్.. విజయ్ సంచలన నిర్ణయం
-
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
చెన్నై: తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తనిఖీ సమయంలో, మునియమ్మల్ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు. అందుకే మీకు ఓటు వేశాము. మేము కూడా మీరు రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్ నిరాశ చెందారు. -
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది. -
సెక్రటేరియట్ కు వెళ్లిన సీఎం విజయ్.. మంత్రి ఆధవ్ అర్జునకు ప్రత్యేక శుభాకాంక్షలు
-
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్తో మొదలు పెడదాం. అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్లను చూపించి ప్రచారం చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా.. విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా? ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. -
విజయ్ గవర్నెన్స్ ఫాక్ట్ చెక్.. 108 సీట్లు..1000 అబద్దాలు ?
-
సీఎం విజయ్ యూటర్న్
-
వైద్య సేవల జీపును నడిపి- చెక్ చేసిన సీఎం విజయ్
-
వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ
సాక్షి, చెన్నై : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వివాదం ఏమిటంటే..? ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ: ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు. -
పార్టీలో చేరిన రోజే టికెట్.. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన..!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, ఎన్నికల మేనేజ్మెంట్ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున, సీనియర్ నేత సెంగోట్టయన్ సహా మొత్తం 9 మంది మంత్రులుగా సోమవారం వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలలో మంగళవారం నుంచి సమీక్షలు, సమావేశాలపై దృష్టి పెట్టారు. కాగా త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందిని తెలిసింది. ఇందులో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకూ అమాత్యయోగం దక్కనుందని సమాచారం.సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశంకల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ.. ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) – గ్రామీణాభివృద్ధి – జలవనరుల శాఖ : 61 ఏళ్ల ఆనంద్ పుదుచ్చేరికి చెందినవారు. 2006లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బుస్సీ ఆనంద్గా గుర్తింపు పొందారు. తొలుత విజయ్ అభిమాన సంఘాల్లో చేరి, ఆ తర్వాత విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, ఆపై విజయ్కు అత్యంత ఆప్తుడిగా మారారు. టీవీకే పార్టీలో అత్యంత కీలకమైన (రెండవ పెద్ద) నేతగా ఉంటూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీని ద్వారా పుదుచ్చేరి, తమిళనాడు.. రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆధవ్ అర్జున – పబ్లిక్ వర్క్స్ – క్రీడా శాఖ: తిరుచ్చికి చెందిన 43 ఏళ్ల ఆధవ్ అర్జున రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్. లాటరీ మారి్టన్ అల్లుడైన ఈయన, గతంలో ప్రశాంత్ కిశోర్తో కలిసి డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ’వాయిస్ ఆఫ్ కామన్స్’ అనే సొంత వ్యూహ సంస్థను స్థాపించారు. వీసీకే పారీ్టలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసి, అనంతరం టీవీకేలో చేరి విజయ్ నమ్మకస్థుడిగా మారారు. చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కే.ఏ. సెంగోట్టయన్ (ఆర్థికశాఖ): మంత్రివర్గంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత సెంకోట్టయన్ (77). ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన ఈయన, 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించినప్పటి నుండి ఆ పారీ్టలో ఉన్నారు. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి ఏకంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గాల్లో రవాణా, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచిచన గోబి చెట్టి పాళయంలో మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు. వెంకటరమణన్(ఆహారం, ఫౌరసరఫరాల శాఖ): మైలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెంకటరమణన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ , న్యాయవాది. విజయ్కు సుదీర్ఘకాలంగా అత్యంత సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం టీవీకే పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు మంత్రివర్గంలో చాలా కాలం తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చోటు దక్కడం గమనార్హం. రాజ్ మోహన్ – పాఠశాల విద్యాశాఖ: చెన్నై విరుగంబాక్కంకు చెందిన రాజ్ మోహన్ (39) జర్నలిజం గ్రాడ్యుయేట్. విజయ్ టీవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక అంశాలపై మాట్లాడుతూ పాపులర్ అయ్యారు. యాంకర్, నటుడు, వక్త అయిన ఈయన, 2023లో ’బాబా బ్లాక్ షీప్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. టీవీకేలో చేరిన ఈయనకు పాలసీ ప్రొపగండా సెక్రటరీ పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో ఎగ్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డాక్టర్ అరుణ్రాజ్ ( ఆరోగ్య శాఖమంత్రి) : నామక్కల్ కుమారమంగళానికి చెందిన 46 ఏళ్ల అరుణ్రాజ్ మాజీ ఐఆర్ఎస్ అధికారి, వెద్యుడు. 2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన, సివిల్ సరీ్వసెస్ పాసైన తర్వాత కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో (ఐఆర్ఎస్) పనిచేశారు. 2025లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీలో పాలసీ ప్రొపగండా జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్కు పరిపాలనా పరమైన కీలక సలహాలు అందిస్తున్నారు.సి.టి.ఆర్. నిర్మల్ కుమార్(విద్యుత్, న్యాయ మంత్రి) ఉసిలంపట్టికి చెందిన నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అలాగే క్రిమినాలజీ పోలీస్ అడ్మిని్రస్టేషన్లో పీజీ చేశారు. తొలుత ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అన్నామలైతో విభేదాలతో 2023లో అన్నాడీఎంకేలో చేరి ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2025లో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ, మీడియాలో పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తూ మంత్రి అయ్యారు. కీర్తన – పరిశ్రమల శాఖ: కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్. గతంలో ప్రశాంత్ కిశోర్కు చెందిన ’ఐప్యాక్’ సంస్థలో పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత డీఎంకేకు చెందిన ’పెన్’ సంస్థలోనూ పనిచేశారు. 2025లో అక్కడి నుండి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో..ఈ ఏడాది మార్చి 28న టీవీకేలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆమెకు టికెట్ దక్కడం, విజయం సాధించి ఇప్పుడు ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొత్త తరం వారికి అవకాశం కల్పించినట్టుగా తమకుకూడా మంత్రి ఛాన్స్ వస్తుదన్న ఆశతో అనేక మంది పట్టభద్రులైన సామాన్య ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండటం విశేషం.టి.కె. ప్రభు(ఖనిజ వనరులు): సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన టి.కె. ప్రభు వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో తమిళనాడు కాంగ్రెస్ ఐటీ వింగ్లో కీలక నేతగా ఉండేవారు. ఇన్స్ట్రాగామ్ రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ప్రభు, టీవీకే స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఈ ఎన్నికల్లో కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. -
CM విజయ్ VS కోలీవుడ్
-
విజయ్ కి CPM మద్దతు రద్దు! ఇరకాటంలో TVK
-
విజయ్కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..!
-
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్హాసన్లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
తమిళ రాజకీయాల్లో దుమారం.. చిక్కుల్లో విజయ్..
-
సీఎం విజయ్కు సరికొత్త తలపోటు
తమిళనాడు సీఎం విజయ్ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సీఎం విజయ్ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందివిజయ్ నివాళులు.. కాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది. ఇది కేవలం ప్రభాకరన్కు మాత్రమే నివాళి కాదుఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.విజయ్కు సరికొత్త తలపోటుసీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్తో అందులోనూ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ, తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026 -
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
-
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
-
సనాతన ధర్మంపై టీవీకే ఎమ్మెల్యే యూటర్న్
-
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.అందుకే స్టాలిన్ కామెంట్లు!తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్ మీడియాలోనూ డీఎంకే వీక్గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.VIDEO | Thanjavur, Tamil Nadu: DMK chief MK Stalin says, "TVK leader Vijay became CM by influencing children through Instagram, without even appointing booth agents properly."(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HhI7ofAjeY— Press Trust of India (@PTI_News) May 18, 2026'డిజిటల్ సునామీ'తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశఅధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
విజయ్ కు చిరంజీవి ఫోన్.. పవన్ సీరియస్?
-
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సింహం సింగిల్.. వెనక్కి తగ్గినా రజినీకాంత్.. జీర్ణించుకోలేకపోతున్న పవన్ !
-
రెండు పెద్ద పార్టీల మధ్య గెలవడం గ్రేట్.. విజయ్ ని ఆకాశానికెత్తిన రజినీ
-
టీడీపీ పల్లకీ మోయడం కాదు.. TVK విజయ్ ని చూసి నేర్చుకో
-
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
సీఎం విజయ్ను కలిసిన కమల హాసన్.. కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன். தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது. பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026 -
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎవరెవరికి ఏయే శాఖలు? శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.డాక్టర్ కేజీ అరుణ్రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.ఆర్ నిర్మల్కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.రాజ్మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. -
బాబోయ్ నన్ను వదిలేయండి.! విజయ్ దెబ్బకి పవన్ కి చుక్కలు..!
-
ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు కదా..! ట్రోల్స్ పై పవన్ రియాక్షన్
-
విజయ్ సీఎం.. పవన్ ఏడుపు.. పిచ్చెక్కిపోతున్న జనసేన నేతలు
-
బ్రిటీష్కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్ను ముగించాలంటూ విజయ్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కు చేసిన రిక్వెస్ట్తో ఆమె వార్తల్లో నిలిచింది. -
విజయ్తో పోలిక.. ట్రోలింగ్పై స్పందించిన పవన్
సాక్షి, అమరావతి: ‘‘తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉండాలని నాకు మెసేజ్ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు.’ అంటూ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ నడుస్తున్న ట్రోలింగ్పై స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొన్నారు. ‘‘తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజంగా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో, 2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడపాలంటే ఎంత సత్తా ఉండాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా’ అంటూ పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. Contesting alone sounds easy after Vijay’s win, but I’ve already experienced how tough solo politics is in Andhra. - AP Deputy CM Pawan Kalyan pic.twitter.com/PxlKaqL2aj— South Matters (@SouthMatters) May 15, 2026ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉన్నా.. ‘‘పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన(చంద్రబాబు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఇబ్బందులున్నా.. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.’ అంటూ పవన్కళ్యాణ్ వెల్లడించారు. నా కోసం ఎదురు దాడి చేయండి ‘సమసమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది, ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలేకపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేకపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి, ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపోకూడదు కదా?. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పనిచేయడానికి రాలేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా. తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రేణులతో మాట్లాడతా’ అంటూ పవన్ వివరించారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం విజయ్ సమావేశం
-
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
CM విజయ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్
-
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.“తమిళనాడు భారత్లోనే టెక్స్టైల్, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.“గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్టైల్స్, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు.“ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్టైల్ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. -
మొన్నే సీఎంగా ప్రమాణం.. అప్పుడే విజయ్ బిగ్ బొనాంజ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బిగ్ బొనాంజా ప్రకటించారు. గురువారం డియర్నెస్ అలవెన్స్ (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.సమాచార, ప్రజాసంబంధాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన డీఏ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమిళనాడు సీఎంవో ఎక్స్ ఖాతాలో వివరించారు.డీఏ పెంపు ఇలా..తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 60 శాతానికి చేరింది. దీనితో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు సుమారు 0.70 పాయింట్ల స్వల్ప పెంపు మాత్రమే లభించింది. దీంతో వారికి వచ్చే నగదు ప్రయోజనం తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణానికి వేర్వేరు రంగాలు ఎలా స్పందిస్తున్నాయో ఈ తేడా చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సుల్లో ఎక్కువ సవరణ లభించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా అదనంగా సుమారు రూ. 1,230 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ బాధ్యతలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.அரசு அலுவலர்கள் மற்றும் ஆசிரியர்களுக்கு 58சதவீதமாக உள்ள அகவிலைப்படி 01.01.2026 முதல் 60 சதவீதமாக உயர்த்தி வழங்கப்படும் என மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் அறிவிப்பு#CMJosephVijay pic.twitter.com/jspnkFOKLS— CMOTamilNadu (@CMOTamilnadu) May 14, 2026 -
ప్రారంభంలోనే బిగ్ షాక్.. 24 గంటల్లోనే విజయ్ యూ టర్న్
-
జగన్ చేసిందే విజయ్ రిపీట్ మహిళలకు గుడ్ న్యూస్..
-
పొలిటికల్ స్టైల్ షో.. ఈ అదిరే లుక్స్ చూశారా?..
-
పుష్ప పాలిటిక్స్..! పుష్ప సినిమాను గుర్తుచేసిన డీఎంకే నేత ఉదయనిధి
-
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ను ఫన్గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ కు వైఎస్ జగన్ ఫోన్
-
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది. -
తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
కేంద్రానికి సీఎం విజయ్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
చెన్నై: నీట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. -
అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
DMK వాక్అవుట్ .. బలపరీక్షలో 144 MLAల సపోర్ట్
-
అసెంబ్లీ లో అన్నాడీఏంకే హైడ్రామా
-
TVKలో షణ్ముగం వర్గం విలీనం..!? AIADMK చాప్టర్ క్లోజ్!
-
TVK సంచలన నిర్ణయం.. OSD రాధన్ పండిట్ నియామకం రద్దు
-
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
CM విజయ్ కి కత్తి మీద సాములా ఉదయనిధి
-
144 Seats.. విజయ్ ను వరించిన విజయం
-
CM విజయ్ ని చూసి బాబు, పవన్ నేర్చుకోవాలి..
-
నా పార్టీ నేతలు తప్పు చేసినా సరే.. అసెంబ్లీ విజయ్ విశ్వరూపం
-
టీవీకే పార్టీకి గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.#BREAKING #SupremeCourt stays the Madras High Court's order which stopped TVK MLA Sreenivasa Sethupathi from voting in TN Assembly floor test.#TamilNadu pic.twitter.com/ljOHA56050— Live Law (@LiveLawIndia) May 13, 2026అసలేం జరిగింది..తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్ హైకోర్టును ఆశ్రయించారు.శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్ (కుడి)శనివారం ఆయన పిటిషన్ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్ సవాల్ చేస్తుండడం.. ఆయన ఓటింగ్లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. సుప్రీంలో ఇవాళ.. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్ను మద్రాస్ బెంచ్ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్ వేసిన రిట్ పిటిషన్ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్ టీవీకే సర్కార్ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్ వేసిన ఎన్నికల పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. -
విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ
-
నాకు ఇక తిరుగులేదు.. తమిళనాడు చరిత్రలో చరిత్రాత్మక పరిణామం
-
విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్
-
విజయ్కు షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.#WATCH | DMK MLAs walk out of the Tamil Nadu Assembly before the Floor test of the TVK government(video source: TN Assembly) pic.twitter.com/0oXlxMe4LM— ANI (@ANI) May 13, 2026పళని కౌంటర్.. అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. "We are not an enemy party; we wish to function as a responsible Opposition,” says AIADMK MLA Edappadi K. Palaniswami, adding that AIADMK MLAs would vote against the government in the Assembly. pic.twitter.com/elXR9fWGBR— ANI (@ANI) May 13, 2026కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. ఇక.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. -
TVK విజయ్ పార్టీ నుండి రెండు సీట్లు కట్
-
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
విజయ్పై ప్రేమలతా విజయ్కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
Watch Live: విజయ్ సర్కార్ కు బలపరీక్ష.. నెంబర్ గేమ్ పై ఉత్కంఠ
-
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్కు సపోర్ట్గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
నేడే సీఎం విజయ్ బల పరీక్ష
-
లిక్కర్ షాపులపై విజయ్ సంచలనం..
-
నేడు విజయ్ సర్కార్కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
అరవ చదరంగం అదుర్స్
-
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. -
జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్ షాపులను మూసివేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.విజయ్తో సంబంధం ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే, విజయ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి ఇవ్వండి ఏంటని విమర్శించే వారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. -
నేను విజయ్ ఒకటే కాలేజ్ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
-
సీఎం విజయ్ స్పీచ్ కు దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ కు సీఎం విజయ్ రియాక్షన్
-
సీఎం విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
TVK అధినేత, సీఎం విజయ్ కు మద్దతు ప్రకటన
-
TVK MLA జేబులో జయలలిత ఫోటో విజయ్ డిఫరెంట్
-
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కెప్టెన్ విజయకాంత్ భార్య మాటలకు అసెంబ్లీలో ఎమోషనల్
-
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
విజయ్ తో కనిపించే ఆ వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్
-
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
స్టాలిన్ ఇంటికి విజయ్ భయంతో వెళ్లాడా? మర్యాదపూర్వకమా!
-
సీఎం విజయ్ సంచలన నిర్ణయం మద్యం దుకాణాలు క్లోజ్
-
ఎన్డీయేకు ఝలక్.. విజయ్కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ప్రమాణస్వీకారోత్సవం చూస్తూ..
తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు. -
గేమ్ఛేంజర్.. కీర్తన
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్లో డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. చదువు ..భాషా నైపుణ్యం విరుదునగర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.శివకాశిలో సరికొత్త రికార్డు 2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది.


