ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం
ప్రకాశం: పేదరికంతో భారమైన తమ చిన్నారులను కన్నతల్లిదండ్రులు అమ్మకున్న ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో జన్నించిన ఆ ముక్కుపచ్చలరని ఇద్దరు కవలలను పేదరికం కారణంతో అమ్ముకోవడానికి సిద్ధమైయ్యారు ఆ తల్లిదండ్రులు. ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లి తన పిల్లలకు ఆస్పత్రి ఖర్చు చెల్లించలేక విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరి కవలలను ఓ ఇద్దరి దంపతులు డబ్బ చెల్లించి తీసుకవెళ్లినట్టు తెలిసింది. ప్రస్తుతం కవలలిద్దరూ ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్నట్టు సమాచారం.