tyre blast
-
లారీ టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి..
సాక్షి, కరీంనగర్: లారీ టైర్ పేలి పంక్చర్ వేసే వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ వన్టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా ఖాజీపూర్కు చెందిన మహమ్మద్ మన్సూర్ అన్సారీ(32) నాలుగేళ్ల క్రితం కరీంనగర్లోని అమెర్నగర్కు వచ్చాడు. ఇక్కడే ఒక పంక్చర్ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఒక లారీ టైర్ పంక్చరై, రావడంతో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి బావమరిది ఎండీ.హుస్సేన్ అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలుండగా వారు బిహార్లోనే ఉంటున్నారు. ఇవి చదవండి: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం.. -
వైరల్: పాపం.. మృత్యువును ఊహించి ఉండరు
మనిషి ప్రాణాలు.. గాల్లో దీపంలాగా మారిన రోజులివి. అలాంటి ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. జేసీడీ టైర్లో గాలి నింపుతుండగా.. అది పేలి ఇద్దరు మరణించిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. కూలీలు ఇద్దరూ జేసీబీకి చెందిన భారీ టైర్లో గాలి నింపుతుండగా.. దానిని మరో వ్యక్తి వచ్చి పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరూ చెల్లచెదురై పడిపోయారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడిన ఈ ఇద్దరిని మధ్యప్రదేశ్ రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చత్తీస్గఢ్ రాయ్పూర్ జిల్లాలో సిల్తారా ఇండస్ట్రీయల్ ఏరియాలో మే 3వ తేదీన ఈ ఘటన జరిగింది. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు..నలుగురి మృతి
అహ్మదాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుజరాత్లోని బార్వాలా-బోతాడ్ హైవే జరిగింది. లింబిడి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై తిరుగుప్రయాణంలో దేవాలయాన్ని దర్శించుకోవడానికి సాలంగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని బోతాడ్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం
విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఆమె విజయవాడకు వెళ్తుండగా యనమలకుదురు వద్దకు రాగానే కరకట్టపై ఒక్కసారిగా స్కూటీ అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. టైర్ పేలినా కారు అదుపు తప్పక పోవడంతో ఆమె ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే కొంత సమయం వేచిచూసిన తర్వాత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మరో కారులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం.