tyre repairer
-
లీవ్ కోసం బాస్కు ఫేక్ ఫోటో.. పడిపడి నవ్వాల్సిందే
ఉద్యోగస్థులు అర్జెంట్గా సెలవులు కావాల్సినప్పుడు ఏ కడుపు నొప్పో అని, కాలు నొప్పో అని అబద్దాలు చెప్పి తప్పించుకోవడం సహజమే. కానీ ఓ యువతి మాత్రం ఆఫీసుకు డుమ్మా కొట్టడం కోసం వెరైటీ అబద్దం చెప్పి.. నెటిజన్లను తెగ నవ్వించింది. అంతలా నవ్వుకునే పని ఏం చేసిందని అనుకుంటున్నారా?.. ఆఫీసుకు వస్తుంటే టైరు పంక్చర్ అయిందని బాస్కు చెప్పింది. అక్కడితో ఆగకుండా ప్రూఫ్ కోసం టైరుకు మేకు గుచ్చుకున్న ఫొటోను తీసి బాస్కు పంపించింది. దీంట్లో నవ్వాల్సింది ఏముందని అంటారా.. ఆమె పంపింది నిజమైన ఫోటో కాదు.. ఫేక్ ఫోటో. దీనిని ఆమె కొలీక్ పసిగట్టి ట్వీట్ చేసింది. ‘అర్జెంటుగా అందరూ తమ పనులని కట్టిపెట్టి ఈ ఫోటోను చూడండి. ఇదీ నా సహోద్యోగి చేసిన నిర్వాకం. కారు టైరు పంక్చరైందని ఆమె మా బాస్కు ఓ ఫోటో పంపించింది. ఆ ఫోటోను కాస్త పెద్దదిగా చేసి చూడండి. టైర్లో దిగిన మేకును జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన నెటిజన్లు ఆ బొమ్మ నిజంకాదని పట్టేశారు. ఫోటోషాప్ ద్వారా ఆమె ఈ ఫేక్ చిత్రాన్ని సృష్టించదని తెలిసి.. ఆమె పడిన పాట్లకు పడపడి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్కు వేల్లల్లో లైకులు షేర్లు వచ్చిపడ్డాయి. ‘ఫేక్ ఫోటో పంపించేటప్పుడు ఇంకాస్త వెరైటీగా ఏమన్నా చేయొచ్చు కదా!’ అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. పంక్చర్ అతికించాను ఇక ఆపీస్కు రమ్మనండి అంటూ వెరైటీ ఫోటోలతో కామెంట్లు చేస్తున్నారు. my coworker called in (yet again) and said she had a nail on her tire that caused her to have a flat. i need everyone to stop what they’re doing and ZOOM IN TO THE NAIL IN THE PICTURE SHE SENT MY BOSS pic.twitter.com/4NcJGuvF4F — syd the kid (@sydneyywhitson) January 8, 2020 -
బిల్లు చూసి గుడ్లు తేలేశాడు
చండీగడ్: హరియాణా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. ఓ చిన్న షాపుకు కోట్ల రూపాయల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ యజమానికి గుండె ఆగినంత పని అయింది. ఫరినాబాద్ నగరంలో చిన్న టైర్ల రిపేరీ షాప్ నడుపుకొనే సురేందర్ కి సుమారు 77 .89 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో షాకైన సదరు యజమాని తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు తనకు ఎప్పుడూ రెండు వేలకు మించి బిల్లు రాలేదని సురేందర్ వాపోయాడు. ఒక ఫ్యాన్, ఒక లైట్ తప్ప మరేయితర విద్యుత్ పరికరాలు లేవని, ఇంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నాడు. అక్టోబర్ 31 న తనకు ఈ భారీ బిల్లు వచ్చిందని తెలిపాడు. ఆ రాష్ట్రంలో విద్యుత్ వినియెగదారులకు ఇలాంటి కరెంట్ షాకులు మామూలేనట. గతంలో ఓ పాన్ షాపు యజమానికి 132 కోట్ల రూపాయల బిల్లును పంపారు. అంతకుముందు దక్షిణ హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ శాఖ 234 కోట్ల బిల్లును పంపి మరో వినియోగదారుడిని అయోమయంలోకి నెట్టేసింది. అయితే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అని, కంప్యూటర్ తప్పిదమంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది.