Advertisement
Update the market
-
నిఫ్టీ 8000 దాటేసింది
దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్ - ఇంట్రాడేలో 26,900కు సెన్సెక్స్ - సెన్సెక్స్ 229, నిఫ్టీ 73 పాయింట్లు అప్ - మళ్లీ సరికొత్త రికార్డుల మోత - మెటల్, పవర్, రియల్టీ జోరు మార్కెట్ అప్డేట్ రెండున్నరేళ్ల తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. ఈ ఏడాది(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 5.7% వృద్ధి చూపడంతో మెరుగుపడ్డ సెంటిమెంట్ అన్ని రంగాలకూ బలాన్నిచ్చింది. మరోవైపు గత రెండు దశాబ్దాలలో వివిధ ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు మూకుమ్మడిగా రద్దు చేయబోదన్న అంచనాలు దీనికి జత కలిశాయి. సుప్రీం పేర్కొన్న మొత్తం 218 క్షేత్రాలకు సంబంధించి 48 బ్లాకుల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు మొదలుకావడంతో వీటిని వెనక్కి తిరిగి తీసుకోలేమని అటార్నీ జనరల్ సుప్రీంకు నివేదించడంతో చివర్లో మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డులను లిఖించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి 8,000 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 8,028 వద్ద ముగిసింది. ఇక 229 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 26,867 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ గరిష్టంగా 8,035కు చేరగా, సెన్సెక్స్ 26,900ను తాకడం విశేషం! కాగా, మే 12న నిఫ్టీ తొలిసారి 7,000 పాయింట్లను తాకింది.బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలూ లాభాలతో పుంజుకోగా, మెటల్, పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ 2.5% చొప్పున ఎగశాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మాత్రమే 1%పైగా నష్టపోయాయి. ఎన్సీసీ రూ. 599 కోట్ల రైట్స్ ఇష్యూ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 598.7 కోట్లు సమీకరిస్తున్నట్లు నాగార్జునా కనస్ట్రక్షన్స్ (ఎన్సీసీ) స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. రూ.2 ముఖ విలువ కలిగిన 29.9 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మూలధనాన్ని సేకరించనుంది. ప్రతీ ఆరు షేర్లకు ఏడు షేర్లు ఇచ్చే విధంగా 7:6 నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. షేరు ధరను రూ. 20గా నిర్ణయించారు. కానీ ఈ రైట్స్ ఇష్యూకి రికార్డు తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో ఎన్సీసీ షేరు 1.31 శాతం నష్టపోయి రూ. 67.80 వద్ద ముగిసింది. -
మార్కెట్లో లాభాల పౌర్ణమి
మార్కెట్ అప్డేట్ 4 రోజుల నష్టాల గ్రహణానికి చెక్ - 338 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ - 25,369 వద్ద ముగిసిన ఇండెక్స్ - తొలగిన చమురు ధరల భయాలు ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లలో 4రోజులుగా నెలకొన్న నష్టాల గ్రహణం వీడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు చల్లబడటంతోపాటు, ఎఫ్అండ్వో సిరీస్ ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్తో ప్రధాన సూచీలు రివ్వున ఎగశాయి. గత 2వారాల్లో లేని విధంగా సెన్సెక్స్ 338 పాయింట్లు జంప్చేసి 25,369 వద్ద ముగిసింది. లాభాలతో మొదలైన సెన్సెక్స్ మిడ్ సెషన్లో గరిష్టంగా 25,415కు చేరింది. నిఫ్టీ కూడా 7,593 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 87 పాయింట్ల లాభంతో 7,580 వద్ద ముగి సింది. కాగా, చైనా తయారీ రంగం ఈ ఏడాదిలో తొలిసారి (జూన్ నెలకు) వృద్ధి బాట పట్టడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. అన్ని రంగాలూ..: బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, రియల్టీ, ఆయిల్, బ్యాంకింగ్ 3-1.5% మధ్య బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.6% చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 2,041 లాభపడితే, 985 నష్టపోయాయి. ఆయిల్ షేర్ల జోష్..: ముడిచమురు ధరలుతగ్గడంతోపాటు, దేశీయంగా డీజిల్ ధరల బాటలోనే కిరోసిన్, ఎల్పీజీ ధరలనూ నెలవారీ స్వల్ప మొత్తంలో పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో చమురు షేర్లు హెచ్పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బీపీసీఎల్, గెయిల్, ఐవోసీ 7-5% మధ్య దూసుకెళ్లగా, ఆర్ఐఎల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ 2-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు..: ఎఫ్ఐఐలు రూ. 285 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ సంస్థలు రూ. 216 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మూడు కాంట్రాక్టుల్లో రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్ - బీఎస్ఈలో అసాధారణ ట్రేడింగ్ - టర్నోవర్లో ఎక్స్ఛేంజీల కొత్త రికార్డు మంగళవారం ట్రేడింగ్లో బీఎస్ఈలో అసహజ స్థాయిలో టర్నోవర్ నమోదైంది. దాంతో డెరివేటివ్ విభాగంలో తొలిసారి ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ)ని బీఎస్ఈ(బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ) ఓవర్టేక్ చేసింది. జూన్ నెల ఎఫ్అండ్వో కాంట్రాక్ట్లకు సంబంధించి బీఎస్ఈలో రూ. 3.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఇది ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యధికంకాగా, ఎన్ఎస్ఈలో దాదాపు రూ. 3.30 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ మార్కెట్ చరిత్రలోనే కొత్త రికార్డుగా రూ. 6.67 లక్షల కోట్లను తాకింది. ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఏం జరిగింది? డెరివేటివ్ కాంట్రాక్ట్ల గడువు ప్రతీ నెలా చివరి గురువారం ముగుస్తుంది. ఎప్పుడూ డెరివేటివ్ టర్నోవర్లో నిఫ్టీదే అగ్రస్థానం. 80% టర్నోవర్ ఎన్ఎస్ఈలోనే జరుగుతుంటుంది. అయితే మంగళవారం బీఎస్ఈలో 91.6 లక్షల కాంట్రాక్ట్లు ట్రేడ్కాగా, ఒక్క ఇండెక్స్ ఆప్షన్ విభాగంలోని 3 పుట్ కాంట్రాక్ట్ల ద్వారానే రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యింది. వీటిలో సెన్సెక్స్ 24,400 పాయింట్ల విలువగల ఒక కాంట్రాక్ట్ ద్వారా రూ. 2.06 లక్షల కోట్లు, 24,600 పాయింట్ల పుట్లో రూ. 1.07 లక్షల కోట్లు, 24,200 పాయింట్ల వద్ద మరో కాంట్రాక్ట్ ద్వారా రూ. 19,000 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదైంది. జూన్ డెరివేటివ్స్లో భాగంగా బీఎస్ఈలో సోమవారం వరకూ సగటున రూ. 37,000-1.5లక్షల కోట్లమధ్యటర్నోవర్ జరుగుతూ వచ్చింది.