ముచ్చటగా మూడో చిత్రం
‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్ తరుణ్ మూడో చిత్రానికి రంగం సిద్ధమైంది. శ్రీనివాస్ గవిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ అధినేత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చి మూడో వారంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు.