జర్నలిస్టుల కోసం 'విధి నా సారధి'
హైదరాబాద్: మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన తన స్వీయ చరిత్ర 'విధి నా సారధి' పుస్తకం శుక్రవారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం పత్రికా విలేకరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వార్తలు సెన్సేషనల్గా ఉండకుండా ప్రజల సమస్యలు తీర్చేలా ఉండాలని చెప్పారు. మీడియాను తప్పుపట్టడం తన ఉద్దేశం కాదని, ప్రజలకు మంచి వార్తలు అందించాలనే తాను ఈ విషయం చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పాల్గొన్నారు.