Vinjamuru
-
అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?
పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్నగర్లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి. అమ్మా.. ఎందుకిలా చేశావు? అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? వింజమూరు: స్థానిక జైభీమ్ నగర్లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్ నగర్కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్స్టేషన్కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. నాన్నా.. నేనేం పాపం చేశాను? నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్బీఎస్ నగర్కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్కుమార్ (14), ప్రేమ్కుమార్ పిల్లలున్నారు. సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్కుమార్ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్ ఆధారంగా ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వింజమూరి అనసూయాదేవి కన్నుమూత
సాక్షి, అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్లో ఆదివారం కన్నుమూశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920లో మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. హార్మోనియం వాయించడంలోనూ ఆమెకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సన్మానించింది. అనసూయాదేవి అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పారిస్లోనూ అనసూయాదేవికి ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. జానపద సంగీతంపై ఆమె ఏడు పుస్తకాలను రచించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయ్యింది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు ఐదుగురు సంతానం. అనసూయాదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని చంద్రబాబు కొనియాడారు. అనసూయదేవి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి(99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వింజమూరి అనసూయాదేవి మృతికి జగన్ సంతాపం ప్రఖ్యాత తెలుగు గాయని డాక్టర్ వింజమూరి అనసూయాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. విషాదంలో ఉన్న అనసూయాదేవి కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వింజమూరు జనభేరీలో జగన్ ప్రసంగం
-
ప్రేమకు అడ్డుగోడగా కులం
వింజమూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కులం పేరుతో తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ యువతి నిరసనకు దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వీరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పించ డంతో కథ సుఖాంతమైంది. వివరాలు... అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన శైలజాకుమారి 2004లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదువుతున్న సూరా భాస్కర్రెడ్డి, శైలజాకుమారి ప్రేమించుకున్నారు. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం శైలజ తిరుపతికి, భాస్కర్రె డ్డి హైదరాబాద్ వెళ్లారు. మధ్యమధ్యలో భాస్కర్రెడ్డి తిరుపతికి వె ళ్లి ఆమెతో మాట్లాడివస్తుండే వాడు. 2010లో శైలజ ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో కులాలు వేరయినందున తల్లిదండ్రులను నెమ్మదిగా ఒప్పించి చేసుకుంటానని నమ్మించాడు. మరోవైపు అదే ఏడాది తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో భాస్కర్రెడ్డి ఖర్చులు భరించి ఆమెకు హైదరాబాద్లో వైద్యం చేయించాడు. చివరకు 2013 జూన్లో తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట హిందూపురం, తర్వాత నెల్లూరులో కాపురం పెట్టారు. అనంతరం క్రమేణా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. అదే సమయంలో భాస్కర్రెడ్డికి మరోపెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శైలజకుమారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వింజమూరు చేరుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నేతలతో కలిసి ఆదివారం రాత్రి నుంచి భాస్కర్రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్న భాస్కర్రెడ్డిని నిలదీసి, తనకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్కు పిలిపించి చర్చలు జరిపారు. చివరకు వీరి వివాహాన్ని మంగళవారం రిజిస్టర్ చేసేందుకు ఒప్పించారు.