విశాఖ వుడా డీఎఫ్వో నివాసంపై ఏసీబీ దాడులు
విశాఖ : విశాఖ నగర పాలక సంస్థలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఎఫ్వో రామ్మోహన్ రావు నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేశారు. ఆయన నివాసంతో పాటు విజయనగరం జిల్లా సాలూరులోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.