vittorio colao
-
ఉద్యోగాలు సేఫ్..భరోసా ఇస్తున్న సీఈవోలు
కోల్ కత్తా : ఐడియా, వొడాఫోన్ల మెగా విలీన ప్రకటన అనంతరం తమ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అని ఆందోళన చెందుతున్న ఎంప్లాయీస్ కు కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జాబ్స్ సేఫ్ గానే ఉంటాయని ప్రకటించాయి. ఐడియాలో ఎలాంటి ఉద్యోగాల కోత లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పష్టంచేశారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో విలీనాంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం కంపెనీకి చైర్మన్ గా కుమార్ మంగళం బిర్లానే వ్యవహరించనున్నారని తెలిసింది. వొడాఫోన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయనుంది. తమ సంబంధిత సర్కిళ్లలో బలమైన ఉనికిని చాటుకోవడానికి ఇరు కంపెనీలు వేరువేరుగానే కార్యకలాపాలు నిర్వహించనున్నాయని ఈ టెలికాం దిగ్గజాలు పేర్కొన్నాయి. ఇండియన్ స్టాఫ్ కు కొత్త ప్రొఫిషనల్ అవకాశాలు కల్పించడానికి ఈ విలీనం ఎంతో సహకరించనుందని తెలుపుతూ వొడాఫోన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కోలో తమ భారత ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్ పంపారు. ఎంతో ఆకట్టుకునే కంపెనీగా వొడాఫోన్ ను తీర్చిదిద్దడానికి వొడాఫోన్ ఇండియా టీమ్ కు ఈ డీల్ సహకరించనుందని పేర్కొన్నారు. గట్టి పోటీ ఉండే ఇండియా మార్కెట్లో విజయం సాధించడానికే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని కృషిచేస్తారని అభిప్రాయపడ్డారు. -
రెండేళ్లలో భారత్లో రూ. 18,600 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ గ్రామీణ ప్రాంతాలలోనూ తమ నెట్వర్క్ విస్తరించేందుకు వీలుగా రానున్న రెండేళ్లలో 300 కోట్ల డాలర్ల(సుమారు రూ. 18,600 కోట్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మొబైల్ దిగ్గజం వొడాఫోన్ తెలిపింది. ప్రభుత్వంతో కంపెనీకి రూ. 11,200 కోట్లమేర ఆదాయ పన్ను చెల్లింపు వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరంతో వొడాఫోన్ గ్లోబల్ సీఈవో విటోరియో కొలావో సమావేశమయ్యారు. పన్ను వివాద పరిష్కారం కోసం సమావేశమైన కొలాలో ఆ వివరాలను తెలిపేందుకు నిరాకరిస్తూనే ఆర్థిక మంత్రితో సమావేశం ఫలవంతమైనట్లు విలేకరులకు చెప్పారు. సమావేశానికి అవకాశమిచ్చిన ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీకి సంబంధించి వ్యాపారపరంగానేకాకుండా ఇతర అంశాలలోనూ భారత్కు ప్రాధాన్యత ఉందన్నారు. దేశంలో తమ నెట్వర్క్ను మరింత విస్తరించడం, పటిష్టపరచడం వంటి కార్యక్రమాలకు రెండేళ్లలో 300 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో పన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ తమ పెట్టుబడి ప్రణాళికలపై ఈ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీర్ఘకాల ప్రణాళికలకు జర్మనీ తరువాత భారత్ తమకు కీలక మార్కెట్ అని చెప్పారు. విస్తరణపై వెచ్చించే నిధులను స్పెక్ట్రమ్ చెల్లింపులకు వినియోగించబోమన్నారు. భారత్ మార్కెట్కు సంబంధించి కేవలం నాలుగేళ్ల కోసం కాకుండా 20 ఏళ్లకుపైబడిన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.