Warangal District Latest News
-
ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి
హన్మకొండ: ప్రజా సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 71 దరఖాస్తులు వచ్చాయన్నారు అధికారులు వీటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై అలసత్వం తగదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గణేశ్, ఆర్డీఓ నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ప్రజావాణికి 71 దరఖాస్తులు -
జిల్లాల వారీగా క్యాన్సర్ బాధితులు ఇలా..
ఓరల్హనుమకొండవరంగల్జనగామములుగుజిల్లాసర్వైకల్ఇతరులుబ్రెస్ట్21511118983235-192125319713779213008 -
No Headline
– 8లోu● మహబూబాబాద్కు చెందిన రాజేశ్, సునీత దంపతులకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల క్రితం అతడికి వృషణ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులయ్యే అవకాశం లేదంటూ.. మానసికంగా కుమిలిపోయారు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసి హనుమకొండలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. రాజేశ్ కీమో థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, సునీత అండాలను భద్రపర్చారు. ఆతర్వాత ఐవీఎఫ్ ద్వారా వారికి ప్రస్తుతం పాప జన్మించింది. క్యాన్సర్ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కావడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి
కమలాపూర్: వేసవిలో గ్రామాల్లో తాగు ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశం సిబ్బందిని ఆదేశించారు. కమలాపూర్లోని బీసీ కాలనీ, కాశీంపల్లి ప్రాంతాలను, ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులు, పైప్లైన్లను సోమవారం ఆయన పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం గ్రామాల్లో పర్యటించి నీటి సరఫరా తీరును పరిశీలిస్తున్నట్లు, ఆదిశగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుండె బాబు, ఎంపీఓ రవి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనిల్, గ్రిడ్ ఏఈ కిరణ్, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
కళ్లు, లివర్ ఫంక్షన్లలో వచ్చే మార్పులను ఆధారంగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ను నిర్ధారించవచ్చు. మొదటి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చు. ఒకటి, రెండు స్టేజీలు దాటితే మాత్రం క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది. మూడో స్టేజీలో కీమో, రేడియేషన్ థెరపీల ద్వారా చికిత్స అందించవచ్చు. ఇప్పుడు థెరపీ చికిత్స ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. జిల్లాలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తున్నాం. – డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్ఓ, హనుమకొండ -
వినతులు త్వరగా పరిష్కరించాలి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● ప్రజావాణికి 103 అర్జీలు వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించలేని సమస్యలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 103 వినతులు వచ్చినట్లు తెలిపారు. ‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. -
వినతులు త్వరగా పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణిలు, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీసీఈఓ రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించలేని సమస్యలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 103 వినతులు వచ్చాయి. ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో 103 అర్జీలు -
కేసీఆర్కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది
పరకాల: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ కూడలిలో మహాధర్నా చేపట్టారు. ఈధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణ ఊసే లేదని, ఈప్రాంత బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే రాజీనామా చేసి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దొమ్మాటి సాంబయ్య, గన్నోజు శ్రీనివాసాచారి, సోదా రామకృష్ణ, చందుపట్ల రాజిరెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్రెడ్డి, మడికొండ సంపత్కుమార్, పంచగిరి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం శాయంపేట: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడంపై మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా.. కేవలం రాజకీయ ప్రయోజనాలకే బడ్జెట్ కేటాయించినట్లు ఉందన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి కూడా బడ్జెట్లో నిధులు తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణకు ప్రధాన్యం ఇవ్వాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి బడ్జెట్పై నిరసన.. కాంగ్రెస్ మహా ధర్నా -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నెక్కొండ: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించా లని ప్రత్యేక అధికారి అనురాధ అన్నారు. సోమవా రం హాస్టళ్లలో నెలకొన్న అవకతవకలపై కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు నెక్కొండలోని టీజీ గు రుకుల పాఠశాల/కళాశాల (బాలికలు), పోస్ట్ మె ట్రిక్ (బాలికలు/బాలుర) హాస్టళ్లు, పెద్దకొర్పోలు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లలో విచారణ చేపట్టామన్నారు. విధి నిర్వహణలో గైర్హాజరైన ఉపాధ్యాయులు, పాఠశాల రికార్డులు సరిగా లేక పోవడం, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడం, భోజన సరుకుల నిల్వ చేసే గదులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆ విషయాలపై విచారణ చేశామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్కు నివేదిస్తామన్నారు. ఈ విచారణలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఎంఈఓ రత్నమాల పాల్గొన్నారు. -
క్యాన్సర్ను జయించి..
బాధితుల్లో సంతాన ఫలాలు సంతానోత్పత్తికి ఆందోళన చెందొద్దు దంపతుల్లో ఎవరికై నా క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా మాతృత్వపు అనుభూతిని వారు పొందొచ్చు. అయితే కీమో, రేడియేషన్ థెరపీలు చేయించినట్లయితే మగవారిలో స్పెర్మ్ చురుకుదనం, ఆడవారిలో అండఫలదీకరణ మందగిస్తుంది. అందుకే థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, ఎగ్స్లను స్టోర్ చేస్తాం. వారికి థెరపీ పూర్తయ్యాక అత్యాధునిక టెక్నాలజీలో ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యాన్ని అందిస్తాం. – డాక్టర్ కావ్యరావు జలగం, రీజనల్ మెడికల్ హెడ్, ఒయాసిస్ ఫెర్టిలిటీ, హనుమకొండహన్మకొండ చౌరస్తా: క్యాన్సర్ మహమ్మారి ఏటా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. వయస్సు, లింగబేధం తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో భాగంలో మొదలై విస్తరిస్తోందీ. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి రెండు స్టేజీలు దాటితే మాత్రం సర్జరీల దాకా వెళ్లాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసంక్రమిత వ్యా ధుల సర్వేలో ఉమ్మడి జిల్లాలో పలువరు వివిధ రకాల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. కారణాలెన్నో.. సిగరెట్ తాగి ఒకరు క్యాన్సర్ బారిన పడితే.. మద్యం సేవించి మరొకరు. కలుషిత ఆ హారం తీసుకొని ఒకరు మహమ్మారి బా రిన పడితే.. పొగాకు, గుట్కా, పాన్ మసాలాలు తిని ఇంకొకరు ఇలా కారణాలేవైనా ప్రమాదం పొంచే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్యాన్సర్ వచ్చిన వాళ్లూ ఉన్నారు. కలుషిత, రసాయనాల పంటలు, పండ్లు తిని జబ్బు పడిన వారూ ఉన్నారు. 59హనుమకొండమహబూబాబాద్ములుగుజిల్లాల వారీగా క్యాన్సర్ బాధితులు హద్దుల్లేని ఆనందంలో దంపతులు మొదటి దశలో గుర్తిస్తే తొందరగా నయమవుతుందంటున్న వైద్యులునేడు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం -
వైభవంగా మేడపల్లి ఉమాలక్ష్మీదేవి జాతర
నల్లబెల్లి: మండలంలోని మేడపల్లి ఊరచెరువు సమీపంలో గిరిజనులు ఆరాధ్యదైవగా కొలిచే ఉమాలక్ష్మీదేవత జాతర సోమవారం వైభవంగా జరిగింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతో పాటు నల్లబెల్లి, నర్సంపేట మండలంలోని రుద్రగూడెం, అర్వయ్యపల్లి, గుండ్లపహాడ్, నారక్కపేట, బజ్జుతండా, రామారావుతండా, అర్వయ్యపల్లి, భోజ్యనాయక్తండా, నారాయణతండా, కమలాపుర్, పర్శనాయక్తండా, చెక్కారాంతండా, లక్ష్మీతండాల నుంచి ఎడ్లబండ్లు, ట్రా క్టర్లు, వాహనాల్లో గిరిజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జాతరకు తరలివచ్చిన గిరిజనలు ఇంటిల్లిపాది చెరువులో స్నానాలు చేసి ఉమాలక్ష్మీదేవతకు ఇష్టమైన నెయ్యి, పాలు, బెల్లం, బియ్యంతో త యారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయ ప్రధాన పూజారి అజ్మీరా బామ్నమ్మ బోగిమంటలు వెలిగించి అమ్మవారికి మొక్కులు ముట్టచెప్పారు. జాతరకు ముందు మూ డు రోజుల నుంచి గిరిజనులు ఎలాంటి మద్యం, మాంసాహారం ముట్టకుండా పిండివంటకాలతోనే పవిత్రంగా ఉమాలక్ష్మీదేవత జాతరకు తరలిరా వడం విశేషం. అజ్మీర వంశీయుల పెద్దమనిషి అజ్మీ ర నారాయణ, లంబాడ గిరిజన పెద్దలు జాటోత్ ఉదయ్ సింగ్, బానోత్ హరినాథ్సింగ్, అజ్మీర వాగ్య, అజ్మీర సమ్ము, బాలు, శివరాం, పూల్సింగ్, భూక్య సారయ్య, వీరన్న, అజ్మీర మేఘనాయక్, భద్రు నాయక్, సమ్మయ్య, మంగు నాయక్తో పాటు లంబాడ గిరిజనులు అమ్మవారిని దర్శించుకొన్నారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తారని తెలిసినా.. అధికారులు కనీస సౌకర్యాలు క ల్పించకపోవడాన్ని పలువురు తప్పుపట్టారు. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు -
అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నర్సింహారావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నూతన అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (డాక్యుమెంటేషన్) అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ నర్సింహారావును నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సారయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయనస్థానంలో నర్సింహారావును నియమించారు. ప్రస్తుతం నర్సింహారావు కేయూ పబ్లికేషన్ సెల్ డైరెక్టర్గా, దూరవిద్యాకేంద్రంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపుకార్డులుహన్మకొండ: హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఐదుగురు ట్రాన్స్జెండర్లకు సర్టిఫికెట్, గుర్తింపుకార్డులను కలెక్టర్ ప్రావీణ్య అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా సంక్షేమశాఖ ద్వారా గుర్తింపుకార్డులు అందుకున్న వారు ప్రభుత్వ ఫలాలకు అర్హులని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి జయంతి మాట్లాడుతూ అఫిడవిట్ సమర్పించిన వారికి సర్టిఫికెట్, గు ర్తింపు కార్డులు అందించినట్లు తెలిపారు.ఈ కా ర్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రవికృష్ణ పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలికాజీపేట అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథ మ స్థానంలో నిలపాలని బీసీ వెల్ఫేర్ డీడీ రా మ్రెడ్డి అన్నారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సోమవారం బీసీ వె ల్ఫేర్ వసతి గృహాల పదోతరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వసతి గృహాల అధికారులు విద్యార్థులపై పర్యవేక్షణ కనబర్చి అత్యుత్తమ మార్కులు సాధించేందుకు దోహదపడాలన్నారు. కా ర్యక్రమంలో ఆర్సీఓ రాజ్కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవీ ప్రసాద్, డీబీసీడీఓలు శంకరయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు షురూవిద్యారణ్యపురి: జిల్లాలో ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల మొదటి, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 46 కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో మొదటి సెషన్లో జనరల్ సైన్స్ కోర్సుల విద్యార్థులు 2,088 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 2,016 మంది విద్యార్థులు హాజరయ్యారు. 72 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో 831 మందికిగాను 728 మంది హాజరుకాగా.. అందులో 103 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రెండో సెషన్లో జనరల్ కోర్సుల విద్యార్థులు 1,729 మందికిగాను 1,678 మంది హాజరుకాగా.. 51 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 596 మందికిగాను 554 మంది హాజరుకాగా 42 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. భద్రకాళి దేవాలయంలో వసంత పంచమి పూజలుహన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శైశిర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వసంతపంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు అమ్మవారికి ఉదయం నుంచి పూర్ణాబిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. -
అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నర్సింహారావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నూతన అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (డాక్యూమెంటేషన్) అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ నర్సింహారావును నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సారయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందా రు. దీంతో ఆయనస్థానంలో నర్సింహారావును ని యమించారు. ప్రస్తుతం నర్సింహారావు కేయూ పబ్లికేషన్ సెల్ డైరెక్టర్గా, దూరవిద్యాకేంద్రంలో అ సిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి..
ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వరంగల్ క్రైం: అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన డ్రెయిన్ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలు, మళ్లించిన దారి ఇలా.. ● హనుమకొండలోని అలంకార్ సెంటర్కి సమీపంలో ములుగు క్రాస్ రోడ్డు నుంచి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే దారిలో డ్రెయినేజీ నీటి కోసం మెయిన్ రోడ్డుపై డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా వన్ వే ఏర్పాటు చేశారు. ● సోమవారంనుంచి ఈ దారిలో లారీలు, ఆర్టీసీ బస్సులు, రెడీమిక్స్ వాహనాలు, ట్రాక్టర్లు, ఇతర కమర్షియల్ వాహనాలకు అనుమతి లేదు. ● వాహనదారులు ములుగు క్రాస్ రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా కేయూ జంక్షన్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది. ● హనుమకొండ బస్టాండ్, నక్కలగుట్ట, కాజీపేట వైపు వెళ్లాల్సిన టూవీలర్స్, ఆటోలు, కార్లు, మొదలగు వాహనాలు అలంకార్ సెంటర్, కాపువాడ, బాలంజనేయ స్వామి దేవాలయం మీదుగా ప్రయాణించాలి. ● వేయి స్తంభాలు గుడి నుంచి అలంకార్ సెంటర్ వరకు, అలంకార్ సెంటర్ నుంచి బాలాంజనేయస్వామి దేవాలయం వరకు రోడ్కి ఇరు వైపులా ఎటువంటి వాహనాలు పార్కింగ్ చేయరాదు. ● వాహనాలను రోడ్డుపై మరమ్మతులు చేయరాదు. ఈమార్గంలో ఇతర తోపుడు బండ్లకు కూడా అనుమతి లేదు. ● వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ రోడ్లలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. -
కమల సారథులు..
ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం.. మహబూబాబాద్పై సస్పెన్స్రాష్ట్ర కౌన్సిల్లో వీరికే స్థానం... బీజేపీ పార్టీ సీనియర్లు, ఇతర పదవులు ఆశించిన కొందరికి పార్టీ అధిష్టానం రాష్ట్ర కౌన్సిల్లో స్థానం కల్పించింది. జిల్లా అధ్యక్షులతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన కమిటీల్లో నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల, వరంగల్ పశ్చి మ నియోజకవర్గాలనుంచి గట్టుకొప్పుల రాంబాబు, రావుల సుదర్శన్ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అధిష్టానం నియమించింది. అదే విధంగా వరంగల్ జిల్లా నుంచి వడ్డెపల్లి నర్సింహులు, తాబేటి వెంకట్గౌడ్, మరిపెల్లి రాంచంద్రారెడ్డి, జేఎస్ భూపాలపల్లి నుంచి రాయరాకుల మొగిలి, జనగామ నుంచి మహేందర్రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రచ్చకుమార్, ములుగు నుంచి భూక్యా జవహర్లాల్కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా అవకాశమిచ్చారు.సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందే సంస్థాగత కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు నెలలుగా రేపు, మాపు అంటూ వాయిదా పడుతున్న జిల్లా అధ్యక్షుల ఎంపికపై క్లారిటీ ఇచ్చింది. హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. కొద్దిరోజులుగా ఉన్న సస్పెన్స్కు సోమవారం తెరదించింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఐదు జిల్లాలనుంచి 10 మంది సీనియర్లకు రాష్ట్ర కౌన్సిల్లో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఐదు జిల్లాల అధ్యక్షులు వీరే.. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాల సారథులను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా నియామకపత్రాలను పంపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా రావు పద్మ మూడుసార్లు, జనగామ అధ్యక్షుడిగా ఆరుట్ల దశమంతరెడ్డి రెండుసార్లు పనిచేయగా.. తాజాగా వారి స్థానంలో హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోశ్రెడ్డి, జనగామ నుంచి సౌడ రమేశ్కు మొదటిసారి అవకాశం కల్పించారు. వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులుగా ఉన్న గంట రవికుమార్, ఏడునూతల నిశిధర్రెడ్డి, సిరికొండ బలరామ్కు అధిష్టానం రెండోసారి అవకాశం ఇచ్చింది. ఆశావహుల అసంతృప్తి.. మానుకోటలో పోటాపోటీ.. బీజేపీ నూతన జిల్లా కమిటీ, రాష్ట్ర కౌన్సిల్లో అవకాశం దక్కని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. హనుమకొండ జిల్లా సారథిగా మూడు పర్యాయాలు పనిచేసిన నాయకురాలి సూచనలకే అధిష్టానం ఓకే చెప్పడం.. అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించారన్న చర్చ ఇతర వర్గాల్లో సాగుతోంది. కొందరు ఈ విషయమై సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ములుగు నుంచి చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్యా జవహర్లాల్ తదితరులు ఆశించినప్పటికీ రెండోసారి బలరామ్కే ఛాన్స్ ఇవ్వడం నిరాశపర్చింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న యలమంచిలి వెంకటేశ్వర్ రావు మళ్లీ తానే కొనసాగాలనే ఆసక్తితో ఉండగా.. వల్లభనేని వెంకటేశ్వర్లు, కాపరబోయిన సత్యనారాయణ, మాధవపెద్ది శశివర్దన్ రెడ్డి తదితరులు గట్టిగా పోటీ పడుతుండటంతో అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. మరో జిల్లాలో కూడా చాపకింది నీరులా ఉన్న అసంతృప్తితో ఉన్న ఆశావహనేతలకు సీనియర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ముగ్గురికి రెండోసారి, ఇద్దరికి మొదటిసారి అవకాశం పలువురు సీనియర్ నేతలకు రాష్ట్ర కౌన్సిల్లో చోటు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎట్టకేలకు నియామకం మూడు జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికపై అసంతృప్తి? -
మంగళవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
● ఈపక్క చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు రవి, స్వరూప. చేతిలో పాపతో ఆనందంగా కనిపిస్తున్న వీరిది స్టేషన్ఘన్పూర్. పెళ్లయిన కొన్నేళ్లకు రవికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. విషయం తెలియగానే రవి స్వరూప దంపతులు మాతృత్వానికి నోచుకోమని కుమిలిపోయారు. అధునాతన సాంకేతికతతో సంతానం పొందవచ్చని తెలుసుకుని ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. ముందుగా రవి స్పెర్మ్, స్వరూప అండాలను భద్రపర్చారు. అనంతరం రవి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆతర్వాత వారు ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు 8 నెలల పండంటి పాపతో ఆదంపతులు మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్ను సైతం జయించి మాతృత్వాన్ని పొందారు. న్యూస్రీల్ -
మాతృత్వం వరించి
హన్మకొండ చౌరస్తా: క్యాన్సర్ మహమ్మారి ఏటా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. వయస్సు, లింగబేధం తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో భాగంలో మొదలై విస్తరిస్తోందీ. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి రెండు స్టేజీలు దాటితే మాత్రం సర్జరీల దాకా వెళ్లాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల సర్వేలో ఉమ్మ డి జిల్లాలో పలువరు వివిధ రకాల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. కారణాలెన్నో.. సిగరెట్ తాగి ఒకరు క్యాన్సర్ బారిన పడితే.. మద్యం సేవించి మరొకరు. కలుషిత ఆ హారం తీసుకొని ఒకరు మహమ్మారి బా రిన పడితే.. పొగాకు, గుట్కా, పాన్ మసాలాలు తిని ఇంకొకరు ఇలా కారణాలేవైనా ప్రమాదం పొంచే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్యాన్సర్ వచ్చిన వాళ్లూ ఉన్నారు. కలుషిత, రసాయనాల పంటలు, పండ్లు తిని జబ్బు పడిన వారూ ఉన్నారు. ఆనందంగా ఉన్నాం.. నాకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. అనంతరం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లుగా తెలిసింది. మొదట భయం వేసింది. కీమో థెరపీ తప్పనిసరి కావడంతో ముందుగా ఫెర్టిలిటీ సెంటర్లో నా అండాన్ని నిల్వ చేశారు. ఇప్పుడు బాబుకు జన్మనిచ్చా. మాతృత్వపు ఫలాన్ని అందుకుని మేం ఆనందంగా ఉంటున్నాం. – మీనా, హనుమకొండ జిల్లా ఓరల్ బ్రెస్ట్ సర్వేకల్ ఇతరులు హనుమకొండ 83 215 111 189 వరంగల్ 235 192 125 00 జనగామ 31 79 97 137 ములుగు 21 08 30 00బాధితుల్లో సంతాన ఫలాలు హద్దుల్లేని ఆనందంలో దంపతులు మొదటి దశలో గుర్తిస్తే తొందరగా నయమవుతుందంటున్న వైద్యులు నేడు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం -
‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
వరంగల్: ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఎంశ్రీ పథకంలో జిల్లాలో ఎంపికై న 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కంపోనెంట్ల వారీగా మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ఈ పథకానికి సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇప్పటివరకు రూ.1.22 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ లేబరేటరీలు, లైబ్రరీల ఏర్పాటు, ఫిజికల్ ఫిట్నెస్ను పెంపొందించేందుకు గ్రీన్ స్కూల్, వెజ్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో స్టడీ టూర్ కొరకు వెంటనే ప్రణాళికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సెక్టోరల్ అధికారి వేణుగోపాల్, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. నిరుద్యోగులు నమోదు చేసుకోవాలి జిల్లాలోని నిరుద్యోగులు, ప్రస్తుతం చదువుతున్న ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థులు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్సైట్లో నమోదు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిలా డీట్ వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ వెబ్సైట్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువతకు ప్రైవేటు రంగంలో ని రంతర ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందన్నా రు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజ యలక్ష్మీ, జిల్లా పరిశ్రమల అధికారి సాల్మాన్రాజు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, యువజన క్రీడల అధికారి సత్యవాణి, అధికారులు పాల్గొన్నారు.● కలెక్టర్ సత్యశారద -
లక్ష్మీనర్సింహస్వామి మూలవిరాట్పై సూర్యకిరణాలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గర్భగుడిలోని స్వామి మూలవిరాట్పై సోమవారం ఉదయం సూర్యకిరణాలు ప్రసరించాయని ఆలయ అర్చకులు విష్ణు తెలిపారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఇలా సూర్యకిరణాలు పడటం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. సకాలంలో వేతనాలు చెల్లించాలి నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు ప్రదీప్కుమార్లు డిమాండ్ చేశారు. నర్సంపేట మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు లేకుండా ఆస్పత్రిలో పనులు చేస్తున్నామని, దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రతీనెల వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు పోతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలి నర్సంపేట: హైదరాబాద్లో ఈనెల 7వ తేదీన జరిగే మాదిగ మహా సాంస్కృతిక ప్రదర్శన లక్షల డప్పులు, వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సినీ గేయ రచయిత, కళా నాయకుల స్టేట్ కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో సోమవారం మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లెపల్లి ప్రణయ్దీప్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించారన్నారు. మందకృష్ణకు మద్దతుగా అన్ని కులాల ప్రజలు చలో హైదరాబాద్కు కదలిరావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారన్నారు. అంతకుముందు లక్షల డప్పులు, వేల గొంతుల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు పుల్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు తడుగుల విజయ్, కొడారి రవి, కన్నం వెంకన్న, బొట్ల పవన్, బొట్ల ప్రతాప్, నల్లబెల్లి మేఘం, వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణ, మాదాసి బాబు, తదితరులు పాల్గొన్నారు. ‘భద్రకాళి’లో వసంత పంచమి పూజలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శైశిర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వసంతపంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు అమ్మవారికి ఉద యం నుంచి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. -
కమల సారథులు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందే సంస్థాగత కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు నెలలుగా రేపు, మాపు అంటూ వాయిదా పడుతున్న జిల్లా అధ్యక్షుల ఎంపికపై క్లారిటీ ఇచ్చింది. హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. కొద్దిరోజులుగా ఉన్న సస్పెన్స్కు సోమవారం తెరదించింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఐదు జిల్లాలనుంచి 10 మంది సీనియర్లకు రాష్ట్ర కౌన్సిల్లో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఐదు జిల్లాల అధ్యక్షులు వీరే.. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాల సారథులను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై న వాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా నియామకపత్రాలను పంపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలుగా రావు పద్మ మూడుసార్లు, జనగామ అధ్యక్షుడిగా ఆరుట్ల దశమంతరెడ్డి రెండుసార్లు పనిచేయగా.. తాజాగా వారి స్థానంలో హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్రెడ్డి, జనగామ నుంచి సౌడ రమేష్లకు మొదటిసారి అవకాశం కల్పించారు. వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులుగా ఉన్న గంట రవికుమార్, ఏడునూతల నిశిధర్ రెడ్డి, సిరికొండ బలరామ్లకు అధిష్టానం రెండోసారి అవకాశం ఇచ్చింది. రాష్ట్ర కౌన్సిల్లో వీరికే స్థానం... బీజేపీ పార్టీ సీనియర్లు, ఇతర పదవులు ఆశించిన కొందరిని పార్టీ అధిష్టానం రాష్ట్ర కౌన్సిల్లో స్థానం కల్పించింది. జిల్లా అధ్యక్షులతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన కమిటీల్లో నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలనుంచి గట్టుకొప్పుల రాంబాబు, రావుల సుదర్శన్లను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అధిష్టానం నియమించింది. అదే విధంగా వరంగల్ జిల్లా నుంచి వడ్డెపల్లి నర్సింహులు, తాబేటి వెంకట్గౌడ్, మరిపెల్లి రాంచంద్రా రెడ్డి, జేఎస్ భూపాలపల్లి నుంచి రాయరాకుల మొగిలి, జనగామ నుంచి మహేందర్రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రచ్చకుమార్, ములుగు నుంచి భూక్యా జవహర్లాల్కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఛాన్స్ ఇచ్చారు. ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం.. మహబూబాబాద్పై సస్పెన్స్ ముగ్గురికి రెండోసారి, ఇద్దరికి మొదటిసారి అవకాశం పలువురు సీనియర్ నేతలకు రాష్ట్ర కౌన్సిల్లో చోటు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎట్టకేలకు నియామకం మూడు జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికపై అసంతృప్తి?ఆశావహుల అసంతృప్తి.. మానుకోటలో పోటాపోటీ.. బీజేపీ నూతన జిల్లా కమిటీ, రాష్ట్ర కౌన్సిల్లో అవకాశం దక్కని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. హనుమకొండ జిల్లా సారథిగా మూడు పర్యాయాలు పనిచేసిన నాయకురాలి సూచనలకే అధి ష్టానం ఓకే చెప్పడం.. అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించారన్న చ ర్చ ఇతర వర్గాల్లో సాగుతోంది. కొందరు ఈ విషయమై సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ములుగు నుంచి చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్యా జవహర్లాల్ తదితరులు ఆశించినప్పటికీ రెండోసారి బలరామ్కే ఛాన్స్ ఇవ్వడం నిరాశపర్చింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న యలమంచిలి వెంకటేశ్వర్ రావు మళ్లీ తానే కొనసాగాలనే ఆసక్తితో ఉండగా.. వల్లభనేని వెంకటేశ్వర్లు, కాపరబోయిన సత్యనారాయణ, మాధవపెద్ది శశివర్దన్ రెడ్డి తదితరులు గట్టిగా పోటీ పడుతుండటంతో అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. మరో జిల్లాలో కూడా చాపకింది నీరులా ఉన్న అసంతృప్తితో ఉన్న ఆశావహనేతలకు సీనియర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. -
వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025క్యాన్సర్ను జయించి..యుద్ధ ప్రాతిపదికన పనులు మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర సమీపిస్తుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. – 8లోu● ఈపక్క చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు రవి, స్వరూప. చేతిలో పాపతో ఆనందంగా కనిపిస్తున్న వీరిది స్టేషన్ఘన్పూర్. పెళ్లయిన కొన్నేళ్లకు రవికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. విషయం తెలియగానే రవి స్వరూప దంపతులు మాతృత్వానికి నోచుకోమని కుమిలిపోయారు. అధునాతన సాంకేతికతతో సంతానం పొందవచ్చని తెలుసుకుని ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. ముందుగా రవి స్పెర్మ్, స్వరూప అండాలను భద్రపర్చారు. అనంతరం రవి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆతర్వాత వారు ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు 8 నెలల పండంటి పాపతో ఆదంపతులు మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్ను సైతం జయించి మాతృత్వాన్ని పొందారు. ..ఇలా క్యాన్సర్ ఉన్నప్పటికీ అనేక మంది ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులవుతున్నారు. వైద్యంతో వ్యాధిని నయం చేసుకుంటున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. నేడు (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతున్న వారిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. ● మహబూబాబాద్కు చెందిన రాజేశ్, సునీత దంపతులకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల క్రితం అతడికి వృషణ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులయ్యే అవకాశం లేదంటూ.. మానసికంగా కుమిలిపోయారు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసి హనుమకొండలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. రాజేశ్ కీమో థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, సునీత అండాలను భద్రపర్చారు. ఆతర్వాత ఐవీఎఫ్ ద్వారా వారికి ప్రస్తుతం పాప జన్మించింది. క్యాన్సర్ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కావడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మొదట ఆందోళన చెందా.. మాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల నుంచి పిల్ల ల కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో మొదట తీవ్ర ఆందోళన చెందా. అనంతరం ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించాం. కీమో థెరపీకి వెళ్లే ముందు నా స్పెర్మ్ను భద్రపర్చి, ఆతర్వాత ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యం పొందాం. ఇప్పుడు మాకు ఏడాది బాబు ఉన్నాడు. చాలా ఆనందంగా ఉన్నాం. – విజయ్, హనుమకొండ సంతానోత్పత్తికి ఆందోళన చెందొద్దు దంపతుల్లో ఎవరికై నా క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా మాతృత్వపు అనుభూతిని వారు పొందొచ్చు. అయితే కీమో, రేడియేషన్ థెరపీలు చేయించినట్లయితే మగవారిలో స్పెర్మ్ చురుకుదనం, ఆడవారిలో అండఫలదీకరణ మందగిస్తుంది. అందుకే థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, ఎగ్స్లను స్టోర్ చేస్తాం. వారికి థెరపీ పూర్తయ్యాక అత్యాధునిక టెక్నాలజీలో ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యాన్ని అందిస్తాం. – డాక్టర్ కావ్యరావు జలగం, రీజనల్ మెడికల్ హెడ్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, హనుమకొండమొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చుకళ్లు, లివర్ ఫంక్షన్లలో వచ్చే మార్పులను ఆధారంగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ను నిర్ధారించవచ్చు. మొదటి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చు. ఒకటి, రెండు స్టేజీలు దాటితే మాత్రం క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది. మూడో స్టేజీలో కీమో, రేడియేషన్ థెరపీల ద్వారా చికిత్స అందించవచ్చు. ఇప్పుడు థెరపీ చికిత్స ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. జిల్లాలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తున్నాం. – డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్ఓ, హనుమకొండ5985521,259 59334జిల్లాల వారీగా క్యాన్సర్ బాధితులుములుగువరంగల్హనుమకొండజనగామన్యూస్రీల్ -
ముందస్తు మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు 10 రోజులే ఉంది. వనదేవతల దర్శనానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వాహనాల్లో చేరుకున్నారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్ల కింద స్నానాలు చేసి అమ్మవా ర్ల గద్దెల వద్దకు చేరుకుని పూజలు చేసి కానుకలు సమర్పించారు. ఒక్కరోజే సుమా రు 15వేల మంది తల్లులను దర్శించుకున్న ట్లు అధికారులు అంచనా వేశారు. దేవాదా య శాఖ ఈఓ రాజేంద్రం భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. మొదలైన భక్తుల తాకిడి ఈనెల 12నుంచి 15వ తేదీ వరకు మినీజా తర నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా వనదేవతల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. పస్రా సీఐ రవీందర్, తాడ్వా యి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యాన భారీ బందోబస్తు నిర్వహించారు. మేడారంలో వైద్య సేవలు డీఎంహెచ్ఓ గోపాల్రావు ఆదేశాల మేరకు మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. ఆది వారం శిబిరాన్ని తాడ్వాయి పీహెచ్ఏసీ వైద్యాధికారి ఆడెపు చిరంజీవి సందర్శించా రు. భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర కేసులను తాడ్వాయి పీహెచ్సీకి పంపాలని సూచించారు. డీపీఎంఓ సంజీవరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈఓ రాజేంద్రంమేడారానికి తరలివచ్చిన భక్తులు గంటల మోతతో మార్మోగిన గద్దెల ప్రాంగణం -
కొనసాగుతున్న పనులు
మేడారంలో మినీ జాతర పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాల పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఆదివారం అమ్మవార్ల దర్శనానికి వచ్చి న భక్తులు స్నానాల కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వ్యవసాయదారుల బోరింగ్ మోటార్ల వద్ద స్నానాల కోసం ఒక్కో భక్తుడు రూ.10 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కుల అనంత రం మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు విడిది చేశారు. భక్తులు ఉన్న ప్రదేశాల్లో తాగునీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహం తీర్చుకోవడంతో పాటు వంటకు కూడా వినియోగించుకోవాల్సి వచ్చింది. ముందస్తుగా మేడారానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు, ములుగు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని శాఖల అధికారుల్లో మార్పు కనిపించట్లేదు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాయిప్రీతమ్కు ఫిడే రేటింగ్కాజీపేటకు చెందిన సాయిప్రీతమ్ చెస్లో 1,547 అంతర్జాతీయ ఫిడే రేటింగ్ను సాధించాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో నిర్వహించిన 13వ స్కూల్ గేమ్స్ చెస్ చాంపియన్షిప్లో పాల్గొని ఉన్నతమైన రేటింగ్ను సాధించినట్లు కోచ్ కన్నా తెలిపారు. కాజీపేటకు చెందిన కవిత, కృష్ణమూర్తి దంపతుల కుమారుడు సాయిప్రీతమ్ ఫాతిమానగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. – వరంగల్ స్పోర్ట్స్విద్యారణ్యపురి: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజూ రెండు సెషన్లలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, గురుకుల జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో మొత్తం 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ జనరల్సైన్స్ విద్యార్థులు 15,683 మంది, ఒకేషనల్ 1,956 మంది ప్రాక్టికల్స్ పరీక్షలు రాయబోతున్నారు. పర్యవేక్షణకు 86 మంది చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీలో కలెక్టర్ చైర్మెన్గా, డీఐఈఓ కన్వీనర్గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక జూనియర్ లెక్చరర్, సభ్యులుగా పలువురు అధికారులు ఉన్నారు. ఇంకా 400 మందికిపైగా అధ్యాపకులను ఎగ్జామినర్లుగా ఇంటర్బోర్డు నియమించినట్లు సమాచారం. సీసీ కెమెరాల నిఘా ఉండేనా ? సీసీ కెమెరాల నిఘా మధ్య ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్బోర్డు అధికారులు ఇటీవల ఆదేశించారు. ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. అయితే సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని, ఈ విధానాన్ని రద్దు చేయాలని ఇటీవల జూనియర్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు డీఐఈఓతోపాటు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇంటర్బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీఐఈఓ పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో బయట సీసీ కెమెరాలుంటాయని, ల్యాబ్స్లో ఏర్పాటు చేసి సంబంధిత ఇంటర్ బోర్డుకు అనుసంధానించాల్సి ఉండగా.. అలా జరగలేదని తెలిసింది. ఈ విషయమై డీఐఈఓ గోపాల్ను అడగ్గా సీసీ కెమెరాలు ల్యాబ్స్లో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామని, చేశారా లేదా అనేది క్లారిటీ లేదన్నారు. విధుల బిజీతో ప్రయివేట్ కళాశాలలను సందర్శించలేదని, పరీక్షలు ప్రారంభమయ్యాక వెళ్లి పరిశీలిస్తామన్నారు.జనరల్ విద్యార్థులు 15,683ఒకేషనల్ 1,956 మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 86 సెంటర్లు ఎగ్జామినర్లుగా 400 మంది అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాలు నిఘా వద్దంటున్న ప్రైవేటు యాజమాన్యాలు -
దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పండి
సభలో మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, వేదికపై ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ సారయ్య తదితరులుబీసీ రాజకీయ ‘యుద్ధ భేరి’ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ‘మా బీసీలకు మీ ఓట్లు వద్దు.. దమ్ముంటే బీసీల ఓట్లు మీకొద్దని చెప్పండి’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధ భేరి’ సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు. – వివరాలు 8లోu