Warangal District Latest News
-
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఖానాపురం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, కోలిన్ ఏరోస్పేస్ సీఎస్ఆర్ అమిత్ సావర్కర్ అన్నారు. మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఎస్హెచ్జీకి బెంగళూరుకు చెందిన కోలిన్ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.4.50 లక్షల విలువ చేసే డ్రోన్ పిచికారీ యంత్రాన్ని శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బాధ్యతాయుతంగా వాడుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కోలిన్ ఏరోస్పేస్ సంస్థ కర్ణాటకలో 2,500 మందితో కూడిన ఎఫ్పీఓతో పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్, వరంగల్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఖానాపురంలో మహిళా సంఘానికి అందించినట్లు వివరించారు. ఇన్సూరెన్స్ చేసి డ్రోన్లు అందిస్తున్నామని, భవిష్యత్లో మరిన్ని అందజేస్తామన్నారు. ఏఓ శ్రీనివాస్, సొసైటీ సీఈఓ ఆంజనేయులు, కార్యదర్శి సుప్రజ, ప్రజలు వెంకటప్రసాదరావు, సత్యవరప్రసాదరావు, వాసుదేవరెడ్డి, శ్రీను, ఎస్హెచ్జీ అధ్యక్షురాలు వేజేళ్ల సుజిత, మేరుగు రాజు, సంస్థ బాధ్యులు లవీన్ సుందరరాజ్, గణేశ్, ఫణీంద్ర, రాధ, బలరాం, నందగోపాలం, అరుణ్ పాల్గొన్నారు. -
పాఠకులకు సదుపాయాలు కల్పించండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● జిల్లా గ్రంథాలయంలో వసతుల పరిశీలనహన్మకొండ చౌరస్తా : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిత్యం వచ్చే పాఠకుల కోసం ఏసీలు, చల్లటి తాగునీటి కోసం రిఫ్రిజిరేటర్లు తదితర సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించి వసతులు, పెండింగ్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను సమస్యలు, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రూ.80లక్షలతో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణం నిలిచిపోవడానికి కారణాలను లైబ్రరీ సిబ్బందిని అడగ్గా.. మరో రూ.13లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు అందించామని వివరించారు. కాగా లైబ్రరీకి వస్తున్న సెస్ నిధుల నుంచి ఆడిటోరియం పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అజీజ్ఖాన్, లైబ్రరీ సిబ్బంది మల్సూర్, పురుషోత్తంరాజు, సంతోశ్, గుడికందుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల ‘వీ హబ్’
సాక్షి, వరంగల్: జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన ఉద్యోగాల నియామకాల్లో అనర్హులను అందలం ఎక్కించారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు కొల్లగొట్టారని ‘సాక్షి’ ముందుగానే చెప్పింది. ఈ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఉద్యోగార్థుల విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లు తూతూ మంత్రంగానే పరిశీలించి తమకు కావాల్సి న వారికి ‘మామూలు’గానే ఉద్యోగాలిచ్చేశారని 2023 జూలై 14, జూలై 22న, చైల్డ్లైన్ పోస్టుల్లోనూ అక్రమాలకు తెరలేపారని 2023 ఆగస్టు 8న ‘జనరల్గా జాబ్ లిచ్చేస్తారా’ అంటూ వరుస కథనాలను ప్రచురించింది. విజిలెన్స్ ఆరా తీసి ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న జిల్లా సంక్షేమ విభాగాధికారి శారద ఉండడంతో దీనిపై అడుగు ముందుకు పడలేదు. తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందడంతో మళ్లీ అక్రమాల నియామకాల విషయం తెరమీదకు వచ్చింది. అప్పుడు ‘సాక్షి’ చెప్పినట్లుగానే కొత్త మిషన్ పథకం కింద డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్కు చెందిన ఉద్యోగాల్లో గోల్మాల్ జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఏకంగా స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టు దక్కించుకున్న సుజాత విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమైపె ప్రస్తుత జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచా రిస్తుండడం సంచలనంగా మారింది. దీంతోపాటు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో విద్యార్హత లేకున్నా, పూర్తిస్థాయి అనుభవం లేకు న్నా సు’కుమా’రంగా తీసుకున్నారన్న ఆరోపణ లు న్నాయి. జెండర్ స్పెషలిస్ట్ నియామకంలో కూడా ఓ అంగన్వాడీ టీచర్ కోడలుకు అనుభవం లేకున్నా కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఇవేకాకుండా చైల్డ్లైన్లోని కొన్ని ఉద్యోగాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తీసుకోవడంపై ఇప్పటికే విజిలెన్్స్ దృష్టి సారించింది. ఇదిలా ఉండగానే వీహబ్లో ఓ మహిళ ఉద్యోగి రాజీనామా చేయడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. విచారణ ముమ్మరం.. నకిలీ సర్టిఫికెట్లు సదరు ఉద్యోగి ఎక్కడి నుంచి తీసుకువచ్చి సమర్పించారన్నది తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ విభాగం కార్యాలయానికి పలుమార్లు పోలీసులు వెళ్లారు. నియామకం సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఏదో ఒక కారణంతో కార్యాలయానికి రాకుండా ఉంటున్నారని సమాచారం. వీరిని పోలీసులు విచారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే టాక్ ఉంది. సదరు ఉద్యోగి భర్త సంక్షేమ శాఖలోని ఓ విభాగంలో అకౌంటెంట్గా పనిచేస్తూ.. అక్కడి అధికారులతో కుమ్మకై ్క వారి సహకారంతోనే ఈ ఉద్యోగం తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకోవైపు వీహబ్ ఇతర పోస్టుల్లో కూడా విద్యార్హత, అనుభవ పత్రాలు సరైనవా కావా అన్నది పోలీసులు విచారిస్తే తేలనుంది. ఆయా నియామకాల్లో అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు అసలైనవా కావా అన్నది తెలుసుకోవాల్సిన సంక్షేమ విభాగ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అధికారులు మౌనంగా ఉండడం, ముఖ్యంగా పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో సెలవులో ఉండడం అనుమానాలకు తావి స్తోంది. వీరిలో ఒక అధికారి ఈ నెలలోనే ఉద్యోగ విరమణ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా సుజాత సమర్పించిన నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట కేంద్రంగానే తయారయ్యాయనే తెలుస్తోంది. జిల్లా సంక్షేమ శాఖలో అనర్హులకు ఉద్యోగాలు నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల నిర్ధారణతో వాస్తవాలు వెలుగులోకి.. ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్ విచారణ.. ఆ తర్వాత సుజాతపై కేసు ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులు సెలవుల్లో.. వీరిని విచారిస్తేనే అవినీతి తేటతెల్లమయ్యే అవకాశం -
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కేయూ క్యాంపస్: ఆర్థిక అసమానతలు లేకుండా ధనవంతులు పేదవర్గాలకు ఆర్థిక సహకారం అందించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దోహదపడాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగంలో పాలకమండలి సభ్యులు, విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో సోలార్ పవర్, విండ్ పవర్, ఎనర్జీలో అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ సాధనకు సమ్మిళిత వృద్ధి అత్యావశకమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేడీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, అధ్యాపకులు రమేశ్, సత్యనారాయణ, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రవీందర్, డాక్టర్ రమణ, మాలతీలత, ఎం.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్డ్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, బార్ బైండింగ్, పెయింటింగ్, టైల్స్ ఫ్లోరింగ్, కార్పెంటరీ, బిల్డింగ్, తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువత మరిన్ని వివరాల కోసం విక్టరీ ఐటీఐ కాజీపేట లేదా 79892 50779, 99496 84763 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జాతీయ క్రీడల్లో కమిషనరేట్ పోలీసులువరంగల్ క్రైం: కేరళలోని కొచ్చిలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఏసీపీ జితేందర్రెడ్డి, మధుసూదన్, ఎస్సై సురేశ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ గీత, కానిస్టేబుళ్లు వేణు, తులసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున పాల్గొన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచి కమిషనరేట్కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీపీ సన్ప్రీత్సింగ్, అధికారులు ఆకాంక్షించారు. అంబేడ్కర్ రచనల్ని అధ్యయనం చేయాలికేయూ క్యాంపస్: అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం విద్యార్థులను కోరారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో అంబేడ్క ర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగంతో పాటు సుమారు 60 పుస్తకాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు ఈపుస్తక ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రదర్శనను రిజిస్ట్రార్ రామచంద్రం లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణితో కలిసి ప్రారంభించారు. కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఇసాక్ప్రభాకర్, తేజావత్జావీర్, లైబ్రరీ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలికాజీపేట అర్బన్: ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని రైతు వేదికలో శుక్రవారం పోషణ పక్షోత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 22వ తేదీ వరకు పోషణ మాసంపై అవగాహన కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ పీఓఎంహెచ్డబ్ల్యూ మంజుల, డాక్టర్ శ్రీదేవి, డీఈఎంఓ అశోక్రెడ్డి, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి, ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోషణ్ అభియాన్ అధికారులు, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు సెక్టార్ సూపర్వైజర్లు, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ
ఎల్కతుర్తి: పదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ పాలన కొనసాగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జైబాపు, జైభీమ్, జై సంవిధాన్’ పాదయాత్ర శుక్రవారం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో కొనసాగింది. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర గ్రామాల్లో విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, గోలి రాజేశ్వర్రావు, సుకినె సంతాజీ, గొర్రె మహేందర్, మండ సుమన్గౌడ్ పాల్గొన్నారు.రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి -
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం.. ఆగమాగం జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ -
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్(231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్(172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జా యింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ(263 ఓట్లు), స్పో ర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓ ట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. హనుమకొండ అసోసియేషన్లో.. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్లో మొత్తం 867 మంది ఓటర్లు ఉండగా 752 మంది పోలింగ్లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు కె.రమేష్బాబు, రవీందర్రావు తెలిపారు. అధ్యక్షుడిగా పి.సత్యనారాయణ(336 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా కె.రవి(294 ఓట్లు), ఉపాధ్యక్షడిగా సీహెచ్.రమేశ్(486 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా సి.మల్లేష్(291 ఓట్లు), లైబ్రరీ జాయింట్ సెక్రటరీగా కె.వెంకటేశ్(406 ఓట్లు), కోశాధికారిగా సీహెచ్.సాంబశివరావు (484 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా బి.శివకుమార్యాదవ్(480 ఓట్లు), డి.సునిల్కుమార్(470 ఓట్లు), పి.కమలాకర్(449 ఓట్లు), సీహెచ్.నిఖిల్కుమార్(406 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. వరంగల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్ హనుమకొండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి.సత్యనారాయణ, కె.రవి -
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం.. ఆగమాగం జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ -
ఆర్థిక బలోపేతానికి మహిళా శక్తి క్యాంటీన్లు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాలలోని నూతన సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కృషి చేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్, సబ్ రిజిస్ట్రార్ శ్రావణ్, ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ విజయలక్ష్మి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్: జిల్లా బార్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్ (231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ (172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జూయింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ (263 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), ఎం.మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్ -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట : ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రేణులు గ్రామాలకు వెళ్లి అందుబాటులో ఉండే వాహనాలు, సభకు వచ్చే వారి సంఖ్యను అంచనా వేస్తూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. సభకు వచ్చే వారి కోసం గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. తొలుత సభ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి (ఆర్ఎస్ఎస్) రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్రెడ్డి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట రూరల్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు మోతె జయపాల్రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, మోటూరి రవి, గడ్డం కొమురయ్య, కొడారి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమారస్వామి, పెద్ది శ్రీనివాస్రెడ్డి, వల్లాల కరుణాకర్, అల్లి రవి, పెండ్యాల మునేందర్, మచ్చిక రాజు పాల్గొన్నారు. -
విధుల్లోకి ఔట్సోర్సింగ్ సిబ్బంది
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని వైద్య కళాశాలలో టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్)కి సంబంధించిన 15 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని శుక్రవారం విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్దాస్ తెలిపారు. ‘రెన్యువల్ చేయక.. కొనసాగించక’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 6వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పందించింది. జీఓ 42 ప్రకారం ఆ ఔట్సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశించడంతో ఔట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి : డీపీఓ నర్సంపేట రూరల్: గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీఓ కల్పన అన్నారు. గురిజాల గ్రామంలోని నర్సరీని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. మొక్కల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవికాలంలో ఉదయం సాయంత్రం వేళ మొక్కలకు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం గురిజాల గ్రామపంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. కొమ్మాల ఆలయంలో ప్రతీ శనివారం అన్నదానంగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతీ శనివారం అన్నప్రసాద (అన్నదానం) వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్నదానం కోసం దాతలు సాయం అందించి సహకరించాలని ఆయన కోరారు. పూలే ఆశయాలను కొనసాగించాలినర్సంపేట: మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుంటి రజనికిషన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ గద్ద వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమార్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్లు కల్లెపల్లి ప్రణయ్దీప్, తడుగుల విజయ్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ బ్యాంకు ఎదుట దళిత ప్రజా సంఘాల జేఏసీ కోకన్వీనర్ గుంటి వీరప్రకాశ్ అధ్యక్షతన శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాకూబ్, వేముల రవి, రాజుయాదవ్, సదానందం, రాజు పాల్గొన్నారు. అలాగే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్యగౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్లో, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సి పల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, సోల్తి సాంబయ్య, సోల్తి మధు, పట్టణ అధ్యక్షుడు గండు రవి, డివిజన్ కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నర్సంపేట: సబ్స్టేషన్లో మరమ్మతుల నేపథ్యంలో నేడు (శనివారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఎన్.విజయభాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని పేర్కొన్నారు. నెక్కొండలో.. నెక్కొండ : మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ, నాగారం విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
సమాజ మార్గదర్శకుడు పూలే
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రామన్నపేట : సమాజంలోని రుగ్మతలను పారదో లడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, విద్య విషయంలో పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓలు రాథోడ్ ర మేశ్, సత్యపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి తదితరులున్నారు. -
అంతర్గత పనులు త్వరగా పూర్తి చేయాలి
హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్నాయక్ కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద చేపట్టిన అంతర్గత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కమలాపూర్లో నిర్మించిన, నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను, అక్కడ జరుగుతున్న అంతర్గత పనుల్ని పరిశీలించారు. ఇక్కడ ఇప్పటి వరకు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని, ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఎన్ని? అని అడిగి తెలుసుకుని ఆ ఇళ్ల స్థితిగతులను, నాణ్యతను పరిశీలించారు. డబుల్ బెడ్రూంల వద్ద చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల వంటి అంతర్గత పనుల్లో వేగం పెంచాలని అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ సిద్ధార్థనాయక్, ఏఈ నరేందర్ రాజు పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా కేఎంటీపీ
సాక్షి, వరంగల్: సంగెం, గీసుకొండ మండలాల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) అభివద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చింతలపల్లి, శాయంపేట హవేలి గ్రామాల్లో సేకరించిన 1150 ఎకరాల్లో గణేశ్ ఎకోపేట్, గణేశ్ ఏకోటెక్ పరి శ్రమలు నిర్వహిస్తున్నాయి. కేరళకు చెందిన కై టెక్స్ వస్త్రపరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంకోవైపు దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. ఇలా ఓవైపు పరిశ్రమలు అందుబాటులోకి వస్తుంటే.. ఇంకోవైపు నిచేసే ఉద్యోగులతోపాటు అ క్కడి గ్రామస్తుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల,గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాల కోసం టీఎస్ఐఐసీ రూ.3,72,19,479తో టెండర్లు పిలిచింది. టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన 863 మందికి స్టేట్ రిజర్వ్డ్ కోటా కింద గత నవంబర్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్కడే ఒక్కొక్కరికి కేటాయించిన 100 గజాల ఓపెన్ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.ఐదు లక్షలు ఇస్తామని ఉత్తర్వులిచ్చింది. సకల సౌకర్యాల దిశగా... కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని రాజీవ్గాంధీ టౌన్షిప్లో వసతుల కల్పనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. గతంలోనే సీఎం రేవంత్రెడ్డి వ రంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో మెగా టె క్స్టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన వారితోపాటు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా పనులు మొదలు కానున్నాయి. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పిల్లల దుస్తులు తయారు చేయడంలోనే ప్రసిద్ధి చెందిన ౖకైటెక్స్ కంపెనీ 25,000 ఉద్యోగాల కోసం నియామక ప్రకటన ఇచ్చింది.టెక్స్టైల్ పార్కులోని రాజీవ్ గాంధీ టౌన్షిప్లో వసతులు రూ.3,72,19,479తో టెండర్లు పిలిచిన టీఎస్ ఐఐసీ అధికారులు పీహెచ్సీ, ప్రైమరీ స్కూల్, జీపీ, వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కసరత్తుఅభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలు.. పనులు నిధులు (రూపాయల్లో) ప్రాథమిక పాఠశాల 1,82,05,658ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1,14,42,650 గ్రామ పంచాయతీ కార్యాలయం 43,29,640, పశువైద్యశాల భవనం 32,41,531 -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని, గన్నీ సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి.. గ్రామీణులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ వైద్యులకు సూచించారు. జిల్లాలో ఇటీవల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లుగా నియమితులైన 11 మందికి కలెక్టరేట్లో నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. టీబీ, నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన సేవలను ఎంఎల్హెచ్పీలు సమర్థంగా, అంకితభావంతో అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్, ప్రోగ్రాం అధికారులు కె.లలితాదేవి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేశ్కుమార్, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సుందరీమణుల పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి.. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులు మే 14న వరంగల్కు రానున్నారని.. అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ మార్గనిర్దేశం మేరకు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్న వారికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం ప్రపంచ స్థాయిలో వరంగల్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శన అనంతరం వారు ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, పాల్గొన్నారు. -
తొలిరోజు 39 దస్తావేజుల రిజిస్ట్రేషన్
వరంగల్: రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న స్లాట్లతో గురువారం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 39 దస్తావేజులను రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజు పని గంటల్లో దస్తావేజులు బుక్ చేసుకునేందుకు 48 స్లాట్లు, పనివేళలు ముగిసిన తర్వాత 5 స్లాట్ల (సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చిన వారి కోసం) దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కేటాయించింది. తొలి రోజున 39 స్లాట్లు దస్తావేజుల కోసం బుక్ చేసుకోగా అందులో మూడు పార్టీలు రాకపోవడంతో 36 మందికి రిజిస్ట్రేషన్లు చేశారు. పనివేళలు ముగిసిన అనంతరం 5 స్లాట్లు అందుబాటులో ఉండగా అందులో ముగ్గురి దస్తావేజులను రిజిస్ట్రేషన్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 12 దస్తావేజులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా 10 మందికి అధికారులు పత్రాలు అప్పగించారు. సరిదిద్దేందుకు మళ్లీ స్లాట్.. స్లాట్ బుకింగ్ సమయంలో పేర్కొన్న వివరాల ప్రకారమే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేస్తారు. బుకింగ్ సమయంలో పేర్కొన్న వివరాలను సరిదిద్దాలంటే మళ్లీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ తొలగించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇతరుల పేర్లను తొలగించడం, చేర్చేందుకు అవకాశం లేకుండా పోయింది. వెంటనే పత్రాలు అందిస్తున్నాం.. వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి దస్తావేజులను వెంటనే స్కానింగ్ చేసి 20 నిమిషాల్లో అందజేస్తున్నాం. గ్రూపులుగా ఉన్న వారి దస్తావేజులను స్కానింగ్ చేయడానికి కొంత సమయం పడుతోంది. పూర్తయిన వెంటనే పత్రాలను అందిస్తున్నాం. –సైదులు, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ 20 నిమిషాల్లోనే డాక్యుమెంట్ల అప్పగింత -
కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి
కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. వాతావరణం ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం అక్కడక్కడా మేఘావృతం అవుతుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు. -
‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కవి, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్విద్యార్ధి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ పాల్గొన్నారు. -
వరంగల్
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరిగేనా? కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసహకారం అందిస్తున్న జెడ్పీ సెక్షన్ అధికారులు ● కోరుకున్న చోటుకు వెళ్లేందుకు లాంగ్ లీవులు ● సంఘాల డిమాండ్తో ప్రత్యేకాధికారి వద్దకు ఫైల్వరంగల్: జిల్లా పరిషత్ పరిధిలోని మండలాల్లో జానియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇతర శాఖలో పనిచేసి వచ్చిన ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీకి చెందిన ఒక జూనియర్ అసిస్టెంట్ జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఆర్ ములుగు క్యూసీ సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పీఆర్ ఇంజనీరింగ్శాఖలోని ఒక ఏఈ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద అతడి కుమారుడికి ఇదే క్యూసీ సబ్ డివిజన్లో పోస్టింగ్ ఇస్తూ పీఆర్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ జెడ్పీలో ఇతర ప్రాంతంలో పోస్టింగ్ కోసం రిపోర్టు చేశారు. మార్చి రెండోవారంలో రిపోర్ట్ చేసినా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వడం లేదని, ఇందుకు సంబంధిత సెక్షన్ అధికారులు సహకారం అందిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆరోపిస్తున్నారు. దొడ్డిదారిన పోస్టింగ్ పొందేందుకు.. జిల్లా పరిషత్ పరిధిలో సాధారణ బదిలీలు లేకపోవడంతో దొడ్డిదారిన కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ఉద్యోగులు లాంగ్ లీవు పెడుతున్నారు. ఏ మండలంలోనైనా ఒక ఉద్యోగి 6 నెలల పాటు సెలవులో ఉంటే సదరు ఉద్యోగిని జెడ్పీకి సరెండర్ చేస్తారు. వరంగల్ మండలం పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ పొందుతున్న విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి లాంగ్ లీవు పెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున పైడిపల్లి పాఠశాలలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలో క్యూసీలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా సంఘం నాయకులు అభ్యంతరం చెప్పారు. ఈస్థానంలోకి లాంగ్లీవు పెట్టిన చెన్నారావుపేట నుంచి జెడ్పీకి వచ్చిన ఉద్యోగికి అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. ఆశించిన స్థానం భర్తీ కావడంతో జూనియర్ అసిస్టెంట్ చెన్నారావుపేటకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భూపాలపల్లిలో జూనియర్ అసిస్టెంట్ సతీమణి ఉద్యోగం చేస్తున్నందున అక్కడ ఖాళీగా ఉన్న సబ్ డివిజన్లో పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. సంఘాల నాయకుల ఒత్తిడితో జూనియర్ అసిస్టెంట్కు చెన్నారావుపేటలో పోస్టింగ్ ఇచ్చేందుకు జెడ్పీ అధికారులు ఫైల్ సిద్ధం చేసి జెడ్పీ ప్రత్యేక అధికారి, కలెక్టర్ వద్దకు పంపారు. ఈఫైల్పై కలెక్టర్ రిమార్క్స్ రాయగా తిరిగి జెడ్పీకి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఆమోదించిన వెంటనే జూనియర్ అసిస్టెంట్కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని జెడ్పీ ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్ తెలిపారు.న్యూస్రీల్జెడ్పీల్లో ఇష్టారాజ్యం.. జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. చైర్మన్ల స్థానంలో ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఆయా జిల్లాల కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇందువల్ల జెడ్పీల్లో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. జెడ్పీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు ప్రత్యేక అధికారుల ఆమోదం కోసం పంపితే జాప్యం జరుగుతున్నదని, ఈవిషయాలపై ఉద్యోగులకు సమాధానం చెప్పలేక జెడ్పీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్లన్నింటిలో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్లపై దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్ అధికారులు
వరంగల్ క్రైం: జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. వాహనాలు తీసుకెళ్లండి: సీపీ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను భీమారంలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చినట్లు, స్టేషన్ల వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందించనున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం 87126 85143, 87126 85158, 87125 84557 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuకాజీపేట అర్బన్/ఖిలావరంగల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు. స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు 24 స్లాట్స్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 స్లాట్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రవేశ పె ట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మె రుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్కు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్స్ 15 నిమిషాల్లో దస్తావేజులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 53 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు. ● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 ● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ప్రతీరోజు రెండు కార్యాలయాల్లో 106– జి.నరేందర్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్ట్ వరంగల్ -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
ఆత్మకూరు/దామెర/నడికూడ: కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆత్మకూరు రైతు వేదిక, దామెర, నడికూడ తహసీ ల్దార్ కార్యాలయాల్లో గురువారం అర్హులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్లు జగన్మోహన్రెడ్డి, నాగరాజు, జ్యోతివరలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, వ్యవసాయ అధికారి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేశ్, వాసు, బీరం సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
ఆరబోసి.. ఆగం చేసి
రోడ్డును కల్లాలు చేస్తున్నారు. ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారకులవుతున్నారు ఐనవో లు మండలంలోని కొంతమంది రైతులు. ఐనవోలు నుంచి వనమాల కనపర్తి వరకు ఉన్న రోడ్డు సగాన్ని ఆక్రమించి మక్కలు ఆరబోస్తున్నారు. దీంతో ఈ దారిగుండా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు. వివిధ ప్రాంతాల నుంచి ఐనవోలు ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఈ దారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో రోడ్డులో సగభాగం మక్కలు ఆరబోసి ఉండడంతో ఎదురుగా వాహనాలు వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అదుపుతప్పి గాయాలపాలయ్యారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవా లని, ప్రభుత్వం కల్లాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. – ఐనవోలు -
అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా రాజ్కుమార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బా బా సాహెబ్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా హిస్టరీ అండ్ టూ రిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.రాజ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్కుమార్ కామన్ మెస్ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీఏసీఎస్లను బలోపేతం చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి, నూతన సహకార సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, నూతన సంఘాల ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తగా ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనల గురించి జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అదనపు కలెక్టర్కు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సోలార్ పవర్ప్లాంట్, పెట్రోల్ బంకులు, సీఎస్సీ సెంటర్లు, జనరిక్ ఔషధ కేంద్రాల ఏర్పాటు గురించి సంజీవరెడ్డి వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో పనిచేయని లిఫ్ట్ హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో పై అంతస్తులకు వెళ్లడానికి అధికారులు రెండు లిఫ్టులు అమర్చారు. అందులో ఒకటి కొద్ది రోజుల నుంచి పని చేయడం లేదు. ఇది కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. దీని వద్ద ‘లిఫ్టు పనిచేయడం లేదు’ అని అధికారులు బోర్డు అమర్చారు. కాగా.. లిఫ్టు పనిచేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందనే కారణంతో ఇలా చేస్తున్నారనే ఆరో పణలు కూడా వస్తున్నాయి. ఈవిషయంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పై అంతస్తులో ఉండే ఉద్యోగులు కోరుతున్నారు. సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్ అధికారులువరంగల్ క్రైం: వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి అనోజ్ అగర్వాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. -
స్వామినాఽథన్ సిఫారసులు అమలు చేయాలి
సంగెం: కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కాపులకనిపర్తిలో తెలంగాణ రైతు సంఘం గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, ట్రాక్టర్, కూలీల ఖర్చులు, రైతుల శ్రమ, పెట్టుబడిని సరిగా అంచనా వేడయం లేదని విమర్శించారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంటల బీమా చేయించాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఓదెల రాజయ్య, ఊరటి అంశాలురెడ్డి, మోకిడి పేరయ్య, పి.పైడి, కర్ర రాజిరెడ్డి, రాజగోపాల్, బషీర్, మల్లేశం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠ
ఆశావహుల్లోహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తీవ్రమైన పోటీ కారణంగా పదవులు ఎవరికి దక్కుతాయో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తం పోస్టులు నాలుగు ఉండగా.. ఫైనాన్స్ డైరెక్టర్కు ప్రత్యేక అర్హతలు, మిగతా వాటికి అర్హతలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండి సీజీఎం స్థాయిలో పని చేసిన వారు మాత్రమే ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి అర్హులు. మిగతా మూడు పదవులకు ఇంజనీరింగ్ విభాగంలో సీఈ, సీజీఎంగా పని చేసిన వారు అర్హులు. డైరెక్టర్ పదవులకు ఈనెల 9న హైదరాబాద్లో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి నలుగురు, మిగతా వాటికి 21 మంది హాజరయ్యారు. 17 జిల్లాలు.. 299 మండలాలు.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లెట్లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నది. 68,62,858 విద్యుత్ సర్వీసులున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీజీ ఎన్పీడీసీఎల్లో అప్పటి సీఎండీ అన్నమనేని గోపాల్రావు పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్లు కొనసాగుతుండగా ప్రభుత్వం వారిని 2024 జనవరి 29న తొలగించి, జనవరి 30న నూతన డైరెక్టర్ల భర్తీకి నోటిిఫికేషన్ జారీ చేసి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం సీజీఎంలుగా పని చేస్తున్న అధికారులతో పాటు రిటైర్డ్ అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలు, దరఖాస్తులు స్వీకరించిన 12 నెలల తర్వాత ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. డైరెక్టర్ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు పూర్తి టీజీ ఎన్పీడీసీఎల్లో నాలుగు పోస్టులకు గతేడాది జనవరిలో నోటిఫికేషన్ పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక.. సర్కారుకు నివేదిక! తీవ్ర పోటీ టీజీ ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ పదవుల కోసం ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలతో పాటు ఇదే కంపెనీలో పని చేసి రిటైర్డ్ అయిన వారు, టీజీ ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కోలో పని చేస్తున్న సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్లు, రిటైర్డ్ అయిన వారు దరఖాస్తు చేశారు. దీంతో డైరెక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఇంటర్వ్యూలు పూర్తి కావడంతో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందోననే టెన్షన్ దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఎలాగైనా పదవులు సాధించాలనే ఆలోచనతో ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్ విడదల చేసి దరఖాస్తులు స్వీకరించిన ఏడాది తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించడంతో వెంటనే భర్తీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ డైరెక్టర్లతో అవాంతరాలు లేకుండా పనులైతే జరుగుతున్నాయి. డిస్కంలు నష్టాల్లో కొనసాగుతున్న క్రమంలో డైరెక్టర్ల నియామకం ద్వారా ఆర్థిక భారం పడనున్నందున.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హార్వెస్టింగ్ యజమానులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో సుమారు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, జిల్లా వ్యాప్తంగా సుమారు 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా రవాణా అధికారి శోభన్బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఏఓలు, ఏఈఓలు, హార్వెస్టర్ల యజమానులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
మల్బరీ సాగు లాభదాయకం
గీసుకొండ: రైతులు వరి, పత్తి , మిరప, మొక్కజొన్న పంటలకు బదులుగా మల్బరీ సాగు చేసి ఆర్థికంగా లాభపడాలని పట్టు పరిశ్రమశాఖ సంయుక్త సంచాలకురాలు అనసూయ సూచించారు. మండలంలోని దస్రుతండాలో మల్బరీ సాగుపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మల్బ రీని రెండు ఎకరాల్లో సాగు చేస్తే రూ.మూడు లక్షల నికర ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పంట సాగుచేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. పట్టు పరిశ్రమల సహాయ అధికారులు అరవింద్, షోయబ్ఖాన్, రైతులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలునర్సంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సంపేట పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వల్లభ్నగర్ మార్కండేయ కాలనీకి చెందిన బండ లక్ష్మయ్య రాజుపేట గ్రామ శివారులోని ఎస్టీ హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని లక్ష్మయ్య సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్కండేయ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా నర్సంపేట నుంచి కమలాపురం గ్రామానికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు కొర్రె సాంబయ్య ఢీకొన్నాడు. ఈఘటనలో ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బండ లక్ష్మ య్యను ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. నేడు ‘ప్రేమకు జై’ విడుదలనెక్కొండ: మల్లం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ప్రేమకు జై’ సినిమా శుక్రవారం నెక్కొండ సూర్య థియేటర్లో విడుదల కానుంది. నెక్కొండ ముద్ద బిడ్డ బూరగాని అనిల్గౌడ్ రెండోసారి హీరోగా నటించిన ఈ సినిమా యూత్ను అలరించనుంది. ఆయన ‘వజ్రాలు కావాలా నాయనా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. మూడు ఫైట్స్, ఒక ఐటెం సాంగ్, శివుడి మీద ఒక సాంగ్ చాలా బాగుందన్న టాక్ వినిపిస్తోంది. యూత్కి నచ్చే సావరియా సాంగ్ ఈ సినిమాకు హైలెట్గా నిలువనుంది. విలన్గా సలార్ ఫేమ్ భాస్కర్, హీరోయిన్గా జ్వలిత నటించారు. జాతీయ ఎస్సీ కమిషన్కు కొండేటి శ్రీధర్ ఫిర్యాదువర్ధన్నపేట: సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున తనకు జరిగిన అవమానంపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ గురువారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సోమవారం స్థానికుడు కొండేటి బాబు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు డీజీపీ, వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణవిద్యారణ్యపురి: కవి, ప్రజా కళాకారుడు, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్ విద్యార్థి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
ఖానాపురం: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.రూ.25 వేల పరిహారం అందించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఆరెల్లి క్రాస్వద్ద గురువారం ఆయన వరి పంటలను పరిశీలించారు. అనంతరం పెద్ది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వడగళ్ల వర్షం కురిసి మూడు రోజులవుతున్నా ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో సర్వే ప్రారంభించకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. రూ.మూడు చొప్పున వడ్డీకి తీసుకువచ్చి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, నాయకులు వేజేళ్ల కిషన్రావు, వడ్డె రాజశేఖర్, ఆబోతు అశోక్, మస్తాన్, వల్లెపు సోమయ్య, మచ్చిక అశోక్, బోడ పూలు, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి -
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధి వివిధ గ్రామాల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–163 (జి) భూసేకరణ ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆయా తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో భూసేకరణ ప్రక్రియ, రైతుల భూములకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనంగా కావాల్సిన 12.38 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు కలెక్టర్కు వివరించారు. భూ సేకరణకు అవసరమైన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను తయారు చేయాలని చెప్పారు. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి ముల్కనూరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి గురించి సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ అడిగారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ అర్బన్ : టీఎస్ బీపాస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్వి ని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం బల్ది యా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్దేశిత 21 రోజుల గడువులోగా ఫైల్ క్లియ ర్ చేయాలని, షార్ట్ ఫాల్ ఉంటే దరఖాస్తుదారుడికి సూచించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, రజిత శ్రీనివాస్రెడ్డి, ఏర్షాద్ పాల్గొన్నారు. ఎర్లీ బర్డ్ స్కీంపై అవగాహన కల్పించాలి ఎర్లీ బర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీడీఎంఏ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్ పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కు స్థల పరిశీలన
కాజీపేట అర్బన్ : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి బుధవారం హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ భావ్సింగ్ స్థలాన్ని పరిశీలించారు. కాజీపేట మండలం న్యూశాయంపేట పరిధి 23, 135, 389, 399, 579 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని సందర్శించిన వారు.. స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాలు అవసరం ఉండగా.. తగిన స్థలం దొరకలేదని తెలిపారు. ఎన్సీసీని పటిష్టం చేస్తాం.. కేయూ క్యాంపస్: ఎన్సీసీ విభాగాన్ని రాబో యో రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కార్యక్రమాల గురించి ఆ కళాశా ల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించా రు. ఎన్సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేతవరంగల్ క్రైం : కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 13న మరణించి న సదానందం కుటుంబానికి పోలీస్ భద్రత విభాగం రూ.7,89,920 చెక్కు మంజూరు చేసింది. బుధవారం కుటుంబ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ అందజేశారు. మరణించిన హెడ్కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రస్తుత స్థితిగతులపై ఆయ న ఆరా తీశారు. ఏఓ రామకృష్ణ, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు. జెడ్పీ వాహనాలకు వేలం హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిష త్ ఆవరణలో తుప్పు పట్టిన వాహనాలకు ఎట్టకేలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 63 మంది పాల్గొనగా.. రూ.4,01,500 విలువైన 10 వాహనాలను నలుగురు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ రవి, డీటీఓ వేణుగోపాల్, ఆత్మరాం పాల్గొన్నారు. -
రాజ్యాంగ రక్షణకు ముందుకురావాలి
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ హన్మకొండ: కేంద్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాల ద్వారా భారత జాతిని, భారత రాజ్యాంగాన్ని, ప్రమాద పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు.. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కే.వి.ఎల్. పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు వృథా కాకూడదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మేడిపల్లి శోభన్, నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, మంచాల రమాదేవి, వెంకటరాజం, సూర్యం, మద్దెల ఎల్లేశ్, నాగరాజు, పల్లేరు దామోదర్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి, ఉపాధ్యక్షుడు నిధి పాల్గొన్నారు. -
సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలని హనుమకొండ డీఆర్ ఓ, మెప్మా పీడీ వైవీ.గణేశ్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్లో పట్టణ పరిధి హనుమకొండ, కాజీపేట, పరకాల, హసన్పర్తి మండలాల్లోని 141 పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం స్టిచ్చింగ్ చేసే మహిళా సమాఖ్య సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా స్కూళ్లలో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని సిద్ధంగా ఉండాలని, నిర్దేశించిన నమూనాలో నాణ్యంగా కుట్టి మే 31 వరకు ఇవ్వాలని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి కుట్టు కూలి జతకు రూ.75 కేటాయించామన్నారు. జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, మెప్మా జిల్లా బాధ్యులు రజిత, ఎంఈఓలు మనోజ్, నెహ్రూ, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuవసూళ్లు రూ.16.44 కోట్లుఆస్తి పన్ను బకాయి రూ.71.58 కోట్లు ● ప్రభుత్వ శాఖల నుంచి వసూలుకు వెనుకంజ ● ప్రజలపై పన్ను మోపడంలో ముందంజ ● నోరుమెదపని బల్దియారావాల్సిన బకాయిలు రూ.71.58 కోట్లుఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా పన్నులతో బాదేస్తున్న గ్రేటర్ వరంగల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ నుంచి మొదలుకొని బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖ వరకు రూ.లక్షల మేర బకాయిలున్నాయి. పారిశుద్ధ్యం, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా కోసం ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసెస్మెంట్లు(భవనాలు) 1,551 ఉండగా.. గత పాత, కొత్త బకాయిలు రూ.88.02 కోట్లు అయ్యాయి. కాగా.. మార్చి వరకు కేవలం రూ.16.44 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇంకా రూ.71.58 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వరంగల్ అర్బన్: ప్రతీనెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సంస్థ బల్దియాకు కరెంట్ సరఫరా కట్ చేసిన ఘటనలున్నాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్ము చెల్లించకపోతే పెనాల్టీ లతోపాటు ఆస్తులు జప్తు చేస్తారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయకపోతే ఆర్టీఏ వారు సీజ్ చేస్తారు. ఇలా.. గతంలో బల్దియా ఆస్తులను అటాచ్మెంట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ.. గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం మాత్రం ఆస్తి పన్ను, నీటి చార్జీలు వసూలు చేయడంలో వెనుకబడింది. నిబంధనల పేరుతో సామాన్యులతో కఠినంగా వ్యవహరించే బల్దియాకు ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఏళ్ల తరబడి వాటి బకాయిల వసూలు లేకున్నా.. ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. పేదోడే నయం.. గ్రేటర్లో 2,17,585 అసెస్మెంట్లు (భవనాలు) ఉన్నాయి. 2024–25 గాను కమర్షియల్, రెసిడెన్షియల్ అసెస్మెంట్ల ద్వారా.. రూ.117.62 కోట్లు లక్ష్యం కాగా, రూ.74.90కోట్లు వసూలు చేశారు. ఇకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన 1,551 అసెస్మెంట్లు ఉండగా.. కేవలం 30 శాఖలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లించినట్లు అఽధికారులు వెల్లడించారు. గ్రేటర్ వరంగల్కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు నగర, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులున్నారు. వీరి పర్యవేక్షణలో అన్ని శాఖలు కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఆయా శాఖల ముఖ్య అధికారులతో సమావేశమై నగరంలో సుందరీకరణ, పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్యుత్ వెలుగులు అందించే బల్దియాకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం బల్దియా మేయర్, కమిషనర్లు ఆ దిశగా చొరవ తీసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల నివేదించలేకపోతున్నారు. ఇలా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పన్నుల వసూళ్ల నిర్లక్ష్యంపై ఆ విభాగాధికారులను వివరణ కోరగా.. కమిషనర్ను సంప్రదించాలని దాటవేస్తుండడం గమనార్హం.న్యూస్రీల్బల్దియాలో ఇలా..బల్దియా మొద్దు నిద్ర వసూళ్ల్లు 18.68%ఉన్నతాధికారులు చొరవ చూపాలి! -
బదిలీల కలకలం!
వరంగల్ పోలీసు కమిషనరేట్లో మళ్లీ బదిలీల కలకలం మొదలైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పలువురు ఏసీపీలు, ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు అధికారులు ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పొందడంతో పాటు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుకున్నారు. పోలీస్శాఖలో మళ్లీ ట్రాన్స్ఫర్లు ● త్వరలోనే కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలకు స్థానచలనం? ● కీలక ఠాణాల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు ● పోస్టింగ్లకు ప్రజాప్రతినిధుల సిఫారసులే కీలకం.. ● పోలీసుశాఖపై పట్టు బిగిస్తున్న సీపీ.. తనిఖీలు, సమీక్షలతో బిజీబిజీ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల క్రితం ఐపీఎస్ అధికారుల మూకుమ్మడి బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం కమిషనర్గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సన్ప్రీత్సింగ్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షలు, సమావేశాలు, ఠాణాల ఆకస్మిక సందర్శనలతో బిజీబిజీగా ఉన్న పోలీస్ కమిషనర్.. కమిషనరేట్ పోలీసింగ్పై తనదైన మార్కు వేస్తున్నారు. ఇదే సమయంలో లాంగ్ స్టాండింగ్తో పాటు వివాదాస్పద పోలీసు అధికారులు కొందరికి స్థానచలనం తప్పదన్న ప్రచారంతో ఆశావహులు సిఫారసులకు పోటీపడడం చర్చనీయాంశం అవుతోంది. వివాదంగా పలు విభాగాలు.. పోలీసు కమిషనరేట్లో శాంతిభద్రతలతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, క్రైమ్స్ తదితర విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విభాగాల్లో పని చేస్తున్న కొందరు తమ పనులు కాకుండా ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటూ చికాకు కలిగిస్తున్నారన్న చర్చ ఉంది. వివిధ స్థాయిల్లోని అధికారులు కొందరు తమ సన్నిహితులతో బహిరంగంగానే చర్చిస్తున్నారు. ప్రధానంగా నగరంలో కాసులు కురిపించే ‘భూదందా’ల్లో మితిమీరిన జోక్యంపై ఆయా శాఖల అధికారులు నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలపై సీపీ, డీజీపీల వరకు ఫిర్యాదులు వెళ్లాయన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రజాప్రతినిధి, కుటుంబసభ్యుల అండదండలున్న ఓ ఏసీపీ తన పరిధిలోని ఠాణాలకు ఎస్హెచ్ఓలను రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఆ అధికారి పరిధి ఓ ఠాణా ఎస్హెచ్ఓ ఓ హోంగార్డుతోపాటు క్రైం హెడ్కానిస్టేబుళ్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. కమిషనరేట్ పరిధిలోని మరో ఏసీపీ పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ పొందారన్న ప్రచారం పోలీసుశాఖలో హాట్టాపిక్గా మారింది. వరంగల్ నగరంలోని నాలుగు ఠాణాల్లో నిత్యం భూదందాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. ఓ ఠాణాలో 25 తులాలకుపైగా బంగారం రికవరీ కేసులో ‘ఖర్చు’ల కింద పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిబ్బందిపై బూతు పురాణం.. ఫోన్ పే ద్వారా డబ్బుల స్వీకరణ.. ‘మీరేమన్న చేసుకోండి నాకింతివ్వండి’ అంటూ ఎస్సైలకు టార్గెట్ విధించారన్న ఆరోపణల్లో ముగ్గురు ఎస్హెచ్ఓలపైనా శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు సమాచారం. గ్రేటర్ ఠాణాలపైనే అందరి గురి..గ్రేటర్ వరంగల్ కమిషనరేట్ పోలీస్టేషన్లలో పనిచేసేందుకు కొందరు అధికారులు.. త్వరలో జరిగే బదిలీల కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు సన్ని హితులై ఉమ్మడి వరంగల్తో పాటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేస్తున్న ఓ ఏసీపీ గ్రేటర్ పరిధిలో పోస్టింగ్ కోసం పొరుగు జిల్లాలోని ఓ సీనియర్ మంత్రితో స్థానిక ప్రజాప్రతినిధులకు సిఫారసు చేయించుకున్నట్లు తెలిసింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న కొందరు ఏసీపీలు సైతం ప్రధానమైన డివిజన్లపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, అందులో ఒక్కరిద్దరికి హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. కాగా హనుమకొండ, కేయూసీ, హసన్పర్తి, సుబేదారి, కాజీపేట, హసన్పర్తి, మట్టెవాడ.. నగరం చుట్టూ ఉన్న ధర్మసాగర్, ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట, ఎల్కతుర్తి తదితర ఠాణాల పోస్టింగ్లు పట్టేందుకు పోటాపోటీగా ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఠాణాలకు ఎస్హెచ్ఓలు చేరి ఏడాదైనా కాకపోయినప్పటికీ.. వివిధ కారణాలతో స్థానచలనం తప్పదన్న సమాచారంతో ఖర్చీఫ్లు వేసుకుంటుండడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
‘టైలరింగ్ హబ్’లు ఏర్పాటు చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ఇందిరా మహిళా శక్తి పథకం కింద గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ‘టైలరింగ్ హబ్’ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగానికి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా దుస్తులు కుట్టడానికి వీలుగా కటింగ్ చేసి ఇవ్వడంతో పాటు కాజా బట్టన్స్ కుట్టే మిషన్లను బల్దియా పరిధి వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున టైలరింగ్ హబ్లను(యూనిట్కు రూ.20 లక్షల వ్యయం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ స్కీంలో భాగంగా ప్రభుత్వం వరంగల్ జిల్లాకు మిర్చి ప్రొడక్షన్ యూనిట్ కోసం రూ.కోటి మంజూరు చేసినందున మిర్చి పౌడర్ యూనిట్ స్థాపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనందున ఎన్ఐటీ వద్ద యూనిట్ ఏర్పాటు చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పారు. సారీ రోలింగ్, టైలరింగ్, టై అండ్ డై మగ్గం వర్క్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి బల్దియా పరిధి కమ్యూనిటీ హాళ్లలో వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు 10 చొప్పున, వర్ధన్నపేట 6, పరకాలకు 3 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిక్షణను నగర ప్రాంతాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ అలివేలు, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీలత, సఫియా, రమ, సకినాల రమేశ్, నాగరాజు రాజ్కుమార్, అలీ, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురవకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందించేలా, షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా, తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ముఖ్యమైన 42 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులకు వేసవి దష్ట్యా పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ జీవీ.భానుప్రసాద్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
పారా లీగల్ వలంటీర్లకు అభినందనలు
న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్ : ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పనిచేయడానికి డీఆర్డీఏ, సీనియర్ సిటిజ న్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆసక్తి చూపుతున్న పారా లీగల్ వలంటీర్లకు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ ఆధ్వర్యాన డీఆర్డీఏకు చెందిన సోషల్ యాక్టివ్ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, డీఆర్డీఏ కార్యాలయం నుంచి జి.అనిత, ఎ.సుధాకర్, వి.ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మె గాటెక్స్ టైల్ పార్కు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాల్లో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భూనిర్వాసితులు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టర్ కాన్ఫరెన్్స్హాల్లో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన జి ల్లాస్థాయి సంప్రదింపుల సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్కు సంబంధించి ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల భూనిర్వాసితులతో జనరల్ అవార్డు,కన్సర్న్ అవార్డులపై చర్చించా రు.ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతు న్న తమకు అధిక ధర కావాలని,రోడ్డు సౌకర్యం కావాలని నిర్వాసితులు కోరారు. నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సంగెం మండలం చింతలపల్లి భూనిర్వాసితులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగేశ్వరరా వు, రాజ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
నర్సంపేట రూరల్: మొక్కజొన్న పంటను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి, అధ్యక్షుడు బుర్ర ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం భాంజీపేట గ్రామానికి చెందిన రైతు పిట్టల మల్లయ్యతో వారు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘనాయకులు మాట్లాడుతూ చంద్రయ్యపల్లి గ్రామానికి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నాలుగు సంవత్సరాలుగా మల్లయ్య పురుగుల మందులు తీసుకొచ్చి పంటలకు స్ప్రే చేస్తున్నాడు. దీంతో ఆయన రూ.20 వేలు సదరు వ్యాపారికి చెల్లించాల్సి ఉంది. కొంతమందిని తీసుకొచ్చి కల్లం వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న పంటను వ్యాపారి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మల్లయ్య అడ్డుకున్నాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాస్లైన్ రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు అడ్డూరి రాజు, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకులు భూమా అశోక్, ఈరెల్లి రాంచందర్, శివరాత్రి కుమారస్వామి, ఎలకంటి కుమారస్వామి, ఓదెల రాజయ్య, లింగయ్య పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ -
మామిడి..తగ్గిన దిగుబడి
నర్సంపేట: జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా మా మిడి రైతుకు నష్టాలు తప్పడం లేదు. కోటి ఆశలతో మామిడి తోటలను పెంచుతున్న రైతులకు ఒక ఏడాది దిగుబడి రాకపోవడం, మరో ఏడాది ప్రకృతి వైపరీత్యాలు తప్పడం లేదు. మంచిగా దిగుబడి వచ్చిన సంవత్సరం ధరలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. జిల్లాలో 1,508 మంది రైతులు 5,960 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశా రు.దీని ద్వారా 14,897మెట్రిక్ టన్నుల కాయ దిగుబడి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం వచ్చిన గాలి బీభత్సానికి 10,500 మెట్రిక్ టన్నుల కాయ రాలిపోయింది. దీంతో మా మిడి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఎకరాకు రూ.20 వేల అదనపు ఖర్చు. రైతులు ఎకరం మామిడి తోటను రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లించి కౌలుకు తీసుకుని పూత దశ నుంచి క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నారు. అధిక కాత కోసం సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి రావడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు వస్తోంది. దిగుబడి వచ్చే సమయంలో గాలి వానలు, వడగళ్ల వానలు వచ్చి ఉన్న కొద్దిపాటి కాయను నేలమట్టం చేస్తున్నాయి. దీంతో ప్రతీసారి మామిడి సాగుపై ఆశతో ఉన్న రైతులకు నష్టాలు వస్తున్నాయి. పూత నిలువక.. కాత కాయక.. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి తోటలకు మొదట్లో పూత మంచిగానే వచ్చింది. కానీ, పూత నిలువకపోవడంతో 75 శాతం కాయలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి, నర్సంపేట, నెక్కొండ, మండలాల్లో మామిడి తోటల పరిస్థితి దయనీయంగా ఉంది. దిగుబడి తగ్గడంతో ఈసారి మామిడికి ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 75 శాతం కాయలు రాని పరిస్థితి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులు సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి జిల్లాలో 1,508 మంది రైతులు.. 5,960 ఎకరాల్లో సాగు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు వేముల సంపత్రెడ్డి. కన్నారావుపేట గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటను ఆరు సంవత్సరాలుగా పెంచుతున్నాడు. రెండు సంవత్సరాలు ఆశాజనకంగానే దిగుబడి వచ్చింది. కానీ, ఈ ఏడాది సమీపంలోని మరో ఎకరం మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటివరకు రూ.75 వేల పెట్టుబడి పెట్టినా కాయ అంతంత మాత్రంగానే వచ్చింది. రూ.25 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక సంపత్రెడ్డి పరిస్థితే కాదు.. జిల్లాలో మామిడి తోటలను పెంచుతున్న అనేక మంది రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మూడు సంవత్సరాలుగా మామిడి సాగు వివరాలు.. మండలం రైతులు ఎకరాలు వర్ధన్నపేట 629 2,829.07 రాయపర్తి 239 1,099.07 పర్వతగిరి 349 1,249.18 ఖిలా వరంగల్ 70 209.34 సంగెం 48 146.11 నల్లబెల్లి 38 130.34 నెక్కొండ 25 88.25 నర్సంపేట 39 84.32 గీసుకొండ 42 56.04 చెన్నారావుపేట 11 29.28 ఖానాపురం 6 17.29 వరంగల్ 5 5.16 దుగ్గొండి 7 13.02 -
40 ఎకరాలు కౌలుకు తీసుకున్న..
10 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలు లీజుకు తీసుకుంటున్న. ఈ ఏడాది కూడా 13 ప్రాంతాల్లో రూ.5 లక్షలు వెచ్చించి 40 ఎకరాలను కౌలుకు తీసుకున్న. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న. మరో 10 రోజులు అయితే మామిడి కాయలు అమ్ముకుంటే రూ.6 లక్షలు వచ్చేవి. రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు 70 శాతం కాయ రాలిపోయింది. బుధవారం వరంగల్ మార్కెట్లో రాలిన కాయలను అమ్మితే రూ.50 వేలు వచ్చాయి. ఈసారి భారీగా నష్టపోయాను. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. – గౌని నవీన్, మామిడి రైతు -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కొండాపూర్లో రూ.2.63 కోట్లతో చేపట్టిన 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎన్పీడీసీఎల్ సీఈలు రాజుచౌహాన్, జవంత్ చౌహాన్తో కలిసి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవరెడ్డి మాట్లాడారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మురళీనగర్, గణేశ్నగర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, కొండాపూర్ చెరువును గోదావరి జలాలతో నింపాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కాగా, త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతంరెడ్డి, నర్సంపేట డీఈలు హర్జీ, తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, ఏఈ హరిబాబు, ప్రత్యేక అధికారి పవిత్ర తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాయపర్తి: సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. కొలనుపల్లి గ్రామంలోని చిట్యాల పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతుల ఇంట్లో బుధవారం వారు సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం వారు పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీసీఓ నీరజ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంఅన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం,బురహాన్పల్లి,కొలన్పల్లి గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధా న్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ ప్రకాశ్, ఏఓ వీ రభద్రం, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, వైస్ఛైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కొలనుపల్లిలో పెద్దసోమయ్య– రాజనర్సమ్మ ఇంట్లో సహపంక్తి భోజనం -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
సంగెం: ప్రాఽఽథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖానల వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు సూచించారు. తీగరాజుపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన)ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖి చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని, వ్యాధి నిరోధక టీకాలు అందించాలని ఆదేశించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగిన చికిత్సలు అందించాలని, వేసవిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి లావణ్య, ఏఎన్ఎం సునంద, కవితాకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్య జిల్లాగా మార్చాలివరంగల్: వేసవికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్కుమార్ సూచించారు. పైడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ కార్నర్ నిర్మించాలని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తగిన చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఆశ కార్యకర్త నుంచి అందరూ సమన్వయంతో పనిచేసి తగిన ఫలితాలు రాబట్టి, వరంగల్ను ఆరోగ్య జిల్లాగా మార్చడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త యశోద, ఆశ కార్యకర్తలు తిరుపతమ్మ, యశోద, జ్యోతి, అనిత, ప్రభ, పద్మ, సుమలత, గాయత్రి పాల్గొన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా తీగల రాజేశ్గౌడ్సంగెం: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీ ఐ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్గా చింతలపల్లి గ్రామానికి చెందిన తీగల రాజేశ్గౌడ్ నియమి తులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేశ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించారు. రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులునేటి నుంచి కొత్త పద్ధతిలో స్లాట్ బుకింగ్ వరంగల్: రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో బుధవారం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నిబంధన ప్రకారం స్లాట్ల బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తిచేసే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింది జిల్లాలోని వరంగల్, ఖిలావరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈపద్ధతి అమలు చేయనున్నారు. గురువారం నుంచి ఈ రెండు కార్యాలయాల్లో కొత్తగా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గతంలో డాక్యుమెంట్లలో ఏమైనా తప్పులు ఉంటే కార్యాలయంలో సరి దిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఉండేది. కొత్త పద్ధతి ప్రకారం ఈ ఆప్షన్ను తొలగించారు. స్లాట్ల బుకింగ్ సమయంలో నమోదు చేసిన వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఒకవేళ ఏదైనా తప్పుగా నమోదు చేస్తే సదరు రిజిస్ట్రేషన్దారుడు మళ్లీ కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే లావాదేవీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
గాలి దుమారానికి కొట్టుకుపోయిన రేకులు
నెక్కొండ: గాలి దుమారానికి నిర్మాణంలో ఉన్న గేదెల షెడ్డు రేకులు కొట్టుకుపోయిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మండలంలోని అజ్మీరా మంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మామిడితోట తండాలో గేదెలకు షెడ్డు నిర్మిస్తున్నాడు. ఈ నెల 7 రాత్రి వీచిన గాలి దుమారానికి రేకులు కొట్టుకుపోగా, సిమెంట్ గోడలు కూలిపోయాయి. దీంతో సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని వెంకన్న వాపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు. -
రాలిన మామిడి కాయలు
నల్లబెల్లి: మండలంలోని పలు గ్రామాల్లో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలిపోగా, మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లి, రాంతీర్థం, అర్వయ్యపల్లి, గుండ్లపహాడ్, పంతులపల్లి గ్రామాల్లో మామి డి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా గ్రామా ల పరిధిలో 90 ఎకరాల్లో సుమారు 60 టన్నుల మామిడికాయలు రాలినట్లు కౌలు రైతు నూనె భిక్షపతి తెలిపారు. అర్వయ్యపల్లి గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లిలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. సోమవారొం రాత్రి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడగా.. అధికారులు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
ముందే హెచ్చరించిన సాక్షి
ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 4వ తేదీన గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్లపై బెట్టింగ్క్యాంపుపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితుల నుంచి రూ.10,500, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముదాల శ్రీనివాస్, బోకరి సంతోశ్ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేలు నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఎజెంట్ హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మెడిశెట్టి నరేశ్తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై పోలీసులు, టాస్క్ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. – వరంగల్ క్రైంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటివరకు బెట్టింగ్కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేసి, అతని బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం ఈ సీజన్లో నాలుగు కేసులు నమోదు ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీ అరెస్ట్ అతడి అకౌంట్లలో భారీగా లావాదేవీలుఈ సీజన్లో నాలుగు కేసులు..u -
వరంగల్
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నిఘా నీడలో మూల్యాంకనం టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం అధికారులు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు. – 8లోuకొమ్మాల ఆలయ ఆదాయం రూ.64.80 లక్షలుగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ. 64,80,254 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. జాతర అనంతరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వచ్చిన ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.9,16,892, ఇతర సేవల ద్వారా రూ. 6,52,266 ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి రూ. 15,69,158 రాగా.. జాతర, బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం రూ. 49,11,096 కలుపుకుంటే రూ.64,84,254 ఆదాయం వచ్చిందని వివరించారు. ఇంత మొత్తం ఆదాయం జాతర చరిత్రలో ఎన్నడూ సమకూరలేదని చెబుతున్నారు. రెండోసారి హుండీ లెక్కింపులో మిశ్రమ వెండి నాలుగు కిలోలు, మిశ్రమ బంగారం 12 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, దేవా దాయ శాఖ పరిశీలకుడు డి.అనిల్కుమార్, శ్రీ లక్ష్మీ సేవాసమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలిదుగ్గొండి: వైద్యులు, స్బింది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ రకాల రికార్డులు పరిశీలించారు. పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎన్ఎంలు ప్రతిరోజు సబ్ సెంటర్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటిలో వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యులు రాకేశ్, భరత్కుమార్, సీహెచ్ఓ సాంబయ్య, సలోమి, స్టాఫ్నర్సు సబిత, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. నాగేంద్రస్వామికి పూజలుగీసుకొండ: మండలంలోని ఊకల్హవేలి నాగేంద్రస్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు, కాసం వస్త్ర ప్రపంచం యజమాని కాసం నమశ్శివాయ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి తన జన్మదిన సందర్భంగా సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ప్రధా న అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీ హర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేశారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్ఆర్ఎస్–2015 దరఖాస్తుల పరిష్కారంలో ‘కుడా’ జాప్యం ● ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోని అధికారులు ● పదేళ్లుగా మూడువేల మంది అర్జీదారుల ఇబ్బందులు ● ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కి సాక్షి, వరంగల్: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్ 12న ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. క్లియర్ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల భారం.. ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళితే ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్ఆర్ఎస్ ఫీజు 14 శాతంతో పాటు కాంపౌండ్ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్లియర్ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర● రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు పర్వతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు విమర్శించారు. మండలంలోని బూరుగుమల్ల, మోత్యతండా గ్రామాల్లో మంగళవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజలు స్పందించాలని సూచించారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్షా అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందడుగు వేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాకేశ్, రమేశ్, నాయకులు లింగారెడ్డి, నరుకుడు రవీందర్, కుమార్, శేషగిరిస్వామి, మోహన్రెడ్డి, పూర్ణచందర్, బాషానాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారదవరంగల్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్బాబు, అధికారులు పాల్గొన్నారు. 15 వరకు ఇంటర్న్షిప్ రెండో దశ దరఖాస్తుకు గడువు భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశ దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇంటర్న్షిప్కు ఎంపికై న విద్యార్థులకు మొదటి నెల భత్యం రూ. 5,000..ఆ తర్వాత నుంచి రూ.6,000 మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరంలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 11 6090ను సంప్రదించాలని ఆమె కోరారు. సహకార శాఖ అభివృద్ధిపై సమావేశం.. జిల్లా సహకార శాఖ అభివృద్ధి, జన ఔషధిపై కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీసీఓ నీరజ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మత్స్యశాఖ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం వాల్పోస్టర్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం పోషణ పక్షం వాల్పోస్టర్ను కలెక్టర్ సత్యశారద, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ అభియాన్లో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి పాల్గొన్నారు. న్యూస్రీల్ హంటర్రోడ్డులోని నందిహిల్స్ రోడ్డు నంబర్–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కుడా చెల్లించారు. ప్లాట్కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళితే ఎల్ఆర్ఎస్ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్ఆర్ఎస్ ‘కుడా’ క్లియర్ చేస్తే అప్పటి మార్కెట్ విలువ సేల్ డీడ్ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ఏం చేయాలంటే... ‘కుడా’ ఎల్ఆర్ఎస్ వరంగల్ పేరుతో హనుమకొండలోని యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసిన అకౌంట్కే 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్ఆర్ఎస్ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్ అవుతాయి. ఇప్పటికే తమకు ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్ చేయాలి. 2020 ఎల్ఆర్ఎస్ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
ఈదురు గాలులు.. పంటలు నేలపాలు
దుగ్గొండి: నర్సంపేట డివిజన్లో సోమవారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పలు గ్రామాల్లో పంటలు నేలవాలి, ఇళ్లు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దుగ్గొండి మండలం మందపల్లి, చాపలబండ, దుగ్గొండి, లక్ష్మీపురం గ్రామాల్లో అరటి తోటలు, అడవిరంగాపురం గ్రామంలో సింగతి సునీల్, రాజన్న, వెంకటాపురం గ్రామానికి చెందిన ఎరుకల యుగంధర్ బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. శివాజీనగర్ గ్రామంలో బుస్సారి రామారావు మునగతోటలో చెట్లు విరిగి పోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయతాండవం చేసిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వందల ఎకరాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి కూడా ఈదురు గాలులు వీచాయి. పంటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, బొప్పాయి తోటలను డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి మంగళవారం పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. రైతులకు లక్షల రూపాయల నష్టం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
నీటిఎద్దడి లేకుండా చూడాలి
నర్సంపేట: వేసవిలో నీటిఎద్దడి లేకుండా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధి కారులను ఆదేశించారు. నర్సంపేట పట్టణంలో ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఎంపీడీఓలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అమృత్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు దేవేందర్రెడ్డి, అజహర్, పబ్లిక్ హెల్త్ డీఈ రవీంద్రనాథ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం..
ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
రీల్స్ ఆపి రియల్ లైఫ్లోకి రావాలి
కమలాపూర్ : స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి రీల్స్ ఆపి రియల్ లైఫ్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ సూచించారు. మండలంలోని ఉప్పల్లో మంగళవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే, బీజేపీ గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను అవమానపరస్తోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ప్రణవ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి రీల్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. నియోజక వర్గానికి సుమారు 200కు పైగా కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరై నెలలు దాటినా ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదన్నారు. సరిగ్గా చెక్కులకు గడువు తీరే ముందు రోజు వాటిని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యగౌడ్, నాయకులు రమేశ్, చరణ్ పటేల్, నారాయణరెడ్డి, భిక్షపతి, మహేష్, రమేశ్, గణేష్ పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ -
ముందే హెచ్చరించిన సాక్షి
ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్ల బెట్టింగ్ క్యాంపుపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితుల నుంచి రూ.10,500, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముద్రాల శ్రీనివాస్, బోకరి సంతోశ్ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేల నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్ హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మేడిశెట్టి నరేశ్తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై పోలీసులు, టాస్క్ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. – వరంగల్ క్రైంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటివరకు బెట్టింగ్కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేసి, అతని బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం ఈ సీజన్లో నాలుగు కేసులు నమోదు ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీ అరెస్ట్ అతని అకౌంట్లలో భారీగా లావాదేవీలుఈ సీజన్లో నాలుగు కేసులు..u -
1నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
హన్మకొండ అర్బన్ : మే 1నుంచి జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, విజయవంతం చేసేందుకు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 1నుంచి 31వరకు పలు రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 (బుధవారం) నుంచి 25వ తేదీవరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. దాతల సహకారంతో శిబిరాల వద్ద క్రీడాకారులకు పండ్లు, పాలు, అల్పాహారం వంటివి అందించేందకు చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 22 అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే విధంగా క్రీడా సంఘాలు కృషి చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్ మాట్లాడుతూ క్రీడా శిబిరంలో 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటిన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, క్రికెట్, లాన్టెన్నీస్, సాఫ్ట్బాల్, హాకీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటిన్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 25వ తేదీలోగా హనుమకొండ జేఎన్ఎస్లోని కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ వాసంతి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు శ్యామల పవన్కుమార్, మహ్మద్ కరీం, పింగిళి రమేశ్ రెడ్డి, తోట శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంహసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్ట్ కింద పెంబర్తి గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారంపరిశీలించారు. మండల పరిధిలో ఉంటే తహసీల్దార్, పక్క మండలంలో ఉంటే ఆర్డీఓ ద్వారా ఇసుక కూపన్లు అందజేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్షాపును కలెక్టర్ తనిఖీ చేసి, సన్న బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ కర్ణాకర్ రెడ్డి, హౌజింగ్ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్ధార్థ నాయక్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హౌజింగ్ ఏఈ నరేందర్ రాజ్, మాజీ సర్పంచ్ పూల, కారోబార్ సదానందం పాల్గొన్నారు. ఆసరా మార్ట్ ప్రారంభం హసన్పర్తి మండలం వంగపహాడ్లో మహిళా సంఘం సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆసరా మార్ట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. మహిళలు మార్ట్ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ నవీన్కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు, డీడబ్ల్యూఓ జయంతి, ఓమిని మార్ట్ ఎండీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య -
బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం..
ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu20నుంచి ‘ఓపెన్’ పరీక్షలువిద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 20నుంచి 26వ తేదీవరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలపై మంగళవారం డీఆర్ఓ గణేశ్.. డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాటు వివిధ శాఖల అధికారులు, డీఐఈఓ తదితరులతో సమీక్షించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయని కోఆర్డినేటర్ పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్ : సికింద్రాబాద్లోని లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను మంగళవారం ఎంపిక చేశారు. బి.నితిన్ 50 కేజీల కేటగిరీలో, ఎన్.రాజర్శి 80 కేజీలు, జి.భరత్ 65 కేజీల విభాగాల్లో ఎంపికై నట్లు కార్యదర్శి పోతరాజు రాజేందర్ తెలిపారు. ‘కై టెక్స్’లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురూ..గీసుకొండ: వరంగల్ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో కేరళకు చెందిన చిన్న పిల్లల దుస్తుల తయారీ కై టెక్స్ కంపెనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ మేరకు 25,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు, ఇన్చార్జ్లు తదితర విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీచేయనుంది. రెండు రోజుల నుంచి పలువురు నిరుద్యోగులు కంపెనీ వద్దకు వచ్చి తమ బయోడేటాలు అధికారులకు సమర్పిస్తున్నారు. నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు విద్యారణ్యపురి : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి (బుధవారం)నుంచి అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను టైంటేబుల్ ప్రకారం నిర్వహించాలని ఆయా డీఈఓలు హెచ్ఎంలను ఆదేశించారు. ఈనెల 9నుంచి 17వ తేదీ వరకు ఎస్ఏ–2 పరీక్షలు కొనసాగుతాయి. ఫలితాలను 23న ప్రకటించి విద్యార్థులకు క్యూమిలేటివ్ రికార్డులు అందజేయాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఎస్ఏ–2 పరీక్షల అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను డీసీఈబీ కార్యాలయంనుంచి ఎంఈఓలకు పంపారు. అక్కడినుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలు తీసుకెళ్లారు. ఎంఈఓలు, జిల్లా నోడల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు రోజూ పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓ వాసంతి, డీసీఈబీ కార్యదరి బి.రాంధన్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్–2015 దరఖాస్తుల పరిష్కారంలో ‘కుడా’ జాప్యం ● ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోని అధికారులు ● పదేళ్లుగా మూడువేల మంది అర్జీదారుల ఇబ్బందులు ● ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కి సాక్షి, వరంగల్: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్ 12న ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపుగా కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. క్లియర్ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల భారం.. ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళ్తే ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్ఆర్ఎస్ ఫీజు 14 శాతంతోపాటు కాంపౌండ్ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్లియర్ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి.నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలి ఎల్కతుర్తి : వేసవిలో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కలకు సరిపడా నీరు అందించాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) విద్యాలత అధికారులకు ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, భీమదేవరపల్లి గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. నర్సరీలకు అవసరమైన షేడ్ నెట్లు, నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమెవెంట ఎంపీడీఓ వీరేశం, పంచాయతీ కార్యదర్శి అనంత్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి ● వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు, అధికారులు పాల్గొన్నారు.న్యూస్రీల్హంటర్రోడ్డులోని నందిహిల్స్ రోడ్డు నంబర్–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కూడా చెల్లించారు. ప్లాట్కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళ్తే ఎల్ఆర్ఎస్ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్ఆర్ఎస్ ‘కుడా’ క్లియర్ చేస్తే అప్పటి మార్కెట్ విలువ సేల్ డీడ్ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ఏం చేయాలంటే... ‘కుడా’ ఎల్ఆర్ఎస్ వరంగల్ పేరుతో హనుమకొండలోని యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసిన అకౌంట్కే 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్ఆర్ఎస్ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్ అవుతాయి. ఇప్పటికే తమకు ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్ చేయాలి. 2020 ఎల్ఆర్ఎస్ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి. జెడ్పీ సీఈఓ విద్యాలత -
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuహన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావా ణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావా ణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 12, తహసీల్దార్ హసన్పర్తి 7, డబుల్ బెడ్రూం నోడల్ ఆఫీసర్ 6, ఆర్డీఓ హనుమకొండ 6తో పాటు వివిధ శాఖల సంబంధించి మొత్తం 106 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వేసవి నేపథ్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, జలాశయాల వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజవాణిలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. వీలైతే జలాశయాల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటుతో పాటు గ్రామాల్లో చిన్న పిల్లలు, పెద్దలు సంరక్షకులు లేకుండా బావులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లవద్దని డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని రాజేందర్, సీతారామారావు, తాడూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలి.. ధర్మసాగర్ మండలం ముప్పారంలో రైతుల నుంచి అక్రమంగా ఫారెస్ట్ అధికారులు తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్తో రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. అటవీ శాఖ అధికారులు మాత్రం రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్యన్యూస్రీల్ -
‘ఎండాకాలం’ అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేసవికి సంబంధించిన ఆయా శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్ల ఏర్పాటు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు పాఠశాలలు, పని ప్రదేశాల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ తరగతి గది వద్ద నీటి కుండను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి 87126 99150, హనుమకొండ ఫైర్ స్టేషన్ 87126 99304, పరకాల ఫైర్ స్టేషన్ 87126 99306 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒకరి మెప్పు.. ప్రజలకు ముప్పు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని బస్టాండ్ మూలమలుపు హనుమాన్ టెంపుల్ నుంచి అలంకార్ వరకు చేపట్టిన స్మార్ట్సిటీ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరవాసులకు ప్రయోజనకరంగా ఉండాల్సిన అభివృద్ధి పనులను కొందరు ప్రైవేట్ వ్యక్తుల మెప్పు కోసం నిర్మాణాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోటి పనుల్లో ఇష్టారాజ్యం.. స్మార్ట్సిటీ పథకం ద్వారా రూ.కోటి నిధులతో 7, 10 డివిజన్ల పరిధి హనుమకొండ కొత్తబస్టాండ్కు వెళ్లే దారిలో మూలమలుపు నుంచి అలంకార్ వరకు దాదాపు 60 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. నెల క్రితం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదించిన విధంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ దారి మళ్లింపు.. బస్టాండ్ మూలమలుపులో పనులు ప్రారంభమైన మారెమ్మ చెట్టు వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి బడా షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నాడు. ఏడాది క్రితం ప్రారంభించిన ఈకాంప్లెక్స్ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. కాంప్లెక్స్ ప్రధాన గేట్ ఎదుట నుంచి డ్రెయినేజీ ఉండగా.. ప్రస్తుతం దాన్ని పూర్తిగా మూసేశారు. అందుకోసం వేసిన సీసీ రో డ్డును రెండు రోజులకే తవ్వి కొత్తగా డ్రెయినేజీ కో సం కల్వర్టును నిర్మించారు. మచిలీబజార్ నుంచి మారెమ్మ చెట్టు ముందు భాగం, పింజర్ల వీధి మీదుగా చౌరస్తా పెద్ద నాలాలో కలవాల్సిన నీరు, ఇ ప్పుడు వంకర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పొంచి ఉన్న ముంపు కాంట్రాక్టర్ చేపట్టిన అశాసీ్త్రయ పనులతో వర్షాకాలంలో వరద ముంపు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీని అడ్డంగా నిర్మించడం వల్ల మచిలీబజార్, రాజ్పుత్ వాడ, అగ్గలయ్య గుట్ట నుంచి వచ్చే వరద నీరు సాఫీగా వెల్ల కుండా మారెమ్మ చెట్టు వద్ద నిలిచిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. -
ప్రజాపాలనలో సంక్షోభం
ఎల్కతుర్తి: కాంగ్రెస్ కొనసాగిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం సంక్షోభమైంది.. అభివృద్ధి అరాచకమైందని ఎమ్మెల్సీ మధుసుదనాచారి విమర్శించారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 12వందల ఏకరాల్లో ఈనెల 27న బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సత్యసాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చారిత్రాత్మకమైన బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగబోతుందన్నారు. తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగిస్తోందన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టి స్వరాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్ధిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో గడిచిన పదేళ్లలో 4 లక్షల 15 వేల కోట్లు అప్పు తెస్తే.. 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 1లక్షా 60 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంపదను సృష్టించడానికి నిధులు ఖర్చు చేసిందని.. మారుమూల గ్రామానికి సైతం విద్యుత్ సమస్య లేకుండా చేసి తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ బహిరంగ సభకు తరలివచ్చే 10 లక్షల మందికి సరిపడా నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ నిర్వహించేందుకు 12 వందల ఎకరాల స్థలం కేటాయించి ఇచ్చిన రైతులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభ పర్మిషన్ త్వరలోనే రానున్నట్లు వెల్లడించారు. ఈసభ ఒక కుంభమేళా మాదిరిగా జరుగబోతుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నాయకులు పిట్టల మహేందర్, శ్రీపతి రవీందర్గౌడ్, గొల్లె మహేందర్, కడారి రాజు, ఎల్తూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మధుసుదనాచారి బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలి పరిశీలన -
వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్యజిల్లాలోని అన్ని మండలాల పరిధి 150 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్ను తయారు చేసి వెంటనే అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతా వాటిని కూడా వారంలోగా ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు సంచులు సరిపడా నిల్వ ఉంచాలని, ధాన్యం కాంటాలు సరిగ్గా ఉన్నాయా లేదా? అని ముందే చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమశాతం లేకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద తేమశాతాన్ని కొలిచే మాయిశ్చరైజర్ మిషన్, టార్ఫాలిన్లు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో పేమెంట్స్ జరగాలన్నారు. క్రమపద్ధతిలో రైతులకు కూపన్లు అందజేయాలని, వాటి ప్రకారంగానే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమురయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్సింగ్, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, 2 బీహెచ్కే ఇళ్ల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక కూపన్లు అధికారులు అందజేయాలన్నారు. వారంలో మూడు రోజులు అధికారులు పర్యవేక్షించాలని, బేస్మెంట్ వరకు వచ్చిన వాటిని బిల్లుల చెల్లింపునకు పంపాలన్నారు. లబ్ధిదారులుగా ఉన్న పురుషుల కుటుంబాలకు చెందిన వాటిలో రేషన్కార్డులోని మహి ళల పేరును ఖరారు చేస్తూ జాబితా సమర్పించాలన్నారు. అదేవిధంగా యూడీఐడీ కార్డులు, చేయూత పెన్షన్లపై అధికారులతో చర్చించారు. -
ఒంటిమామిడిపల్లి పాఠశాల సందర్శన
పాఠశాల అభివృద్ధిపై ఆరా తీసిన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఆరుట్ల పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఒకప్పడు పాఠశాల మూతబడి.. తర్వాత మళ్లీ ఎలా పునఃప్రారంభమైందనే అంశాలను తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? విద్యా కమిటీ పాఠశాల అభివృద్ధి కోసం దశల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంది? తదితర అంశాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. పీఎంశ్రీ, వివిధ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో తరగతి గదిలో ముఖాముఖి మాట్లాడి డిజిటల్ తరగతులు ఎలా నడుస్తున్నాయని అడిగారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. అదేవిదంగా విద్యార్థులు ఉపయోగిస్తున్న టాయిలెట్లను పరిశీలించి సరిగ్గా నిర్వహించాలని హెచ్ఎంను ఆదేశించారు. ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ పాఠశాల సమస్యలను విద్యా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు తరగతుల నిర్మాణం కావాలని, పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయినప్పటికీ ఎస్జీటీ, ఎస్ఏలు మాత్రమే ఉన్నారని పీజీ హెచ్ఎం అలాట్ కాలేదన్నారు. అదేవిదంగా పీఈటీ పోస్ట్ మంజూరు చేయించాలని కోరారు. అదేవిదంగా మన ఊరు మన పాఠశాల ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చించి పనులు చేయగా.. ఇంకా సుమారు రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాలని మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు పాఠశాల విద్యా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆ గ్రామ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పులి ఆనందం, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఏఏపీసీ చైర్పర్సన్ సకీనాబీ, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘పోషణ పక్షం’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం–25 ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోషణ్ అభియాన్లో భాగంగా జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవిద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ శిక్షణ కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 17 నాటికి 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సుల్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆయా దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు మే 1 నుంచి జూన్ 11 వరకు 42 రోజుల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. రేపు జెడ్పీలో పాత వాహనాల వేలంహన్మకొండ: జిల్లా ప్రజాపరిషత్లో తుప్పు పట్టిపోతున్న పాత వాహనాల్ని వేలం వేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో ఫిబ్రవరి 25న ప్రచురితమైన ‘మట్టిలో కలవాల్సిందేనా’ ఫొటో ఫీచర్కు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. తుప్పు పడుతున్న 10 పాత వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈనెల 9న ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ ఎం. విద్యాలత కోరారు. శిక్షణ సంస్థలనుంచి దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: నిరుద్యోగ క్రిస్టియన్ మైనార్టీ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి టి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్డీసీ, టాస్క్, ఈజీఎంఎం, మెప్మా, ఎంఎస్ఎంఈ, అనుసంధానం కలిగిన అర్హత ఉన్న శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థలు పూర్తి వివరాలతో హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12లోగా గడువు ఉందని పేర్కొన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడాలివరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, తిరుమల్, ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కౌన్సెలింగ్ పూర్తిఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. -
పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట
మేయర్ గుండు సుధారాణి హసన్పర్తి: కాంగ్రెస్ సర్కార్ పద్మశాలీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. చింతగట్టు క్యాంప్ సమీపంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న పద్మశాలీ కమ్యూనిటీ భవనానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మేయర్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి జీవం పోసిందన్నారు. కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈనిధులతో కమ్యూనిటీ హాల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కార్పొరేటర్ అరుణకుమారి, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఝాన్సీరాణి, అఖిల భారత పద్మశాలీ సంఽఘం జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గోరంటా రాజు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు గడ్డం భాస్కర్, కేశవమూర్తి, సతీష్, వేముల సదానందం, దీకొండ భిక్షపతి, మాజీ సర్పంచ్ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
11న పోలింగ్.. అనంతరం ఫలితాలు వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల స్వీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే... వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానా నికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్/కల్చరల్కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్కుమార్, జాయింట్ సెక్రెటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి నాగభూషణం, పి.ప్రవీణ్కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. హనుమకొండలో.. హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి టి.కృష్ణమూర్తి, ఎ.మార్కండేయ, టి.నరేందర్, ఎం.రంజిత్, పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి స్థానానికి వి.నరేందర్, పి.నవీన్కుమార్, కె.రవి, బి.శంకర్ బరిలో నిలిచినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కె.రమేశ్బాబు తెలిపారు. ఉపాధ్యక్ష స్థానానికి ఎస్.రాజన్బాబు, సీహెచ్ రమేశ్, కార్యవర్గ సభ్యులుగా పి.కమలాకర్, సీహెచ్ నిఖిల్కుమార్, కె.ప్రదీప్, ఆర్.ప్రవీణ్కుమార్, బి.శివకుమార్ యాదవ్, బి.సునీల్కుమార్ బరిలో నిలిచారు. కాగా.. జాయింట్ సెక్రటరీగా ఎంకే భీంరావ్జీ అంబేద్కర్, జాయింట్ సెక్రటరీ (మహిళా) ఆర్.నాగేంద్ర, 30 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.రాజేశ్వర్, 20 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.ఆశీర్వాదం, సీనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా ఇందిరా వేదకుమారి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 11వ తేదీ (శుక్రవారం) ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువరించనున్నట్లు ఎన్నికల అధికారుల పేర్కొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
నర్సంపేట: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన మహిళలకు రూ.11కోట్ల వడ్డీ లేని రుణాలు సోమవారం అందజేశారు. జిల్లాకు తొమ్మిది ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన ఆరు బస్సులు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30లక్షల సబ్సిడీ చెక్కును అందించారు. చెన్నారావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి, ఖానాపురం భారతీయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30లక్షలు ఒక్కో సంఘానికి రూ.15లక్షల చెక్కును సంఘాల బాధ్యులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ 2004లో పావలా వడ్డీ రుణాలు మహిళలకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంఓ దయాకర్, సరిత, అనిత, తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం భోజనం భేష్ ఖానాపురం: రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబి య్యంతో వండిన భోజనం భేషుగ్గా ఉందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మైనార్టీ సెల్ నాయకుడు ముస్తఫా నివాసంలో సన్నబియ్యంతో వండిన భోజ నాన్ని సోమవారం అధికారులతో కలిసి ఎమ్మె ల్యే ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులందరూ సన్నబియ్యం, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
● డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గీసుకొండ/సంగెం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతుందని, అంబేడ్కర్ బోధనలు, వారు చూపిన మార్గాలను గ్రామాల్లో ప్రచారం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపునిచ్చారు. సోమవారం గీసుకొండ, సంగెం మండలాల్లో చేపట్టిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ పేరిట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సత్యం, అహింస మార్గాల్లో నడుస్తామని, సమసమాజ స్థాపనకు పాటుపడతామని ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య, కార్యక్రమ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూచన రవళి, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మాదవరెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, కిశోర్, కట్ట య్య, రుద్రప్రసాద్, రమేశ్, రవీందర్, సాంబరె డ్డి, రాజు, రవికుమార్, జగన్నాథచారి, సంద్య, పాష, కవిత, తదితరులు పాల్గొన్నారు. 41 రోజులపాటు హోమం గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల సమీపంలో గల ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో 41 రోజుల పాటు హో మం నిర్వహిస్తున్నారు. మార్చి 30న హనుమాన్ 41 రోజుల మండల దీక్షలు ప్రారంమై న రోజు నుంచి ముగిసే వరకు హోమం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తలు సీతా ఆనంద్ సా, కుమార్సా సోదరులు సోమవారం తెలిపా రు. ప్రతీరోజు ఉదయం గణపతి, నవగ్రహ, రుద్ర పూజలు నిర్వహిస్తామని, చివరి రోజు పూర్ణాహుతితో హోమం ముగుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి అయ్యప్పశర్మ, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ● 11న పోలింగ్.. అనంతరం ఫలితాలు వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26ల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల సీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే... వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రెటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ స్పోర్ట్స్/కల్చరల్కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్కుమార్, జాయింట్ సెక్రెటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి జి.నాగభూషణం, పి.ప్రవీణ్కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఎంఎల్హెచ్పీ పోస్టులకు కౌన్సెలింగ్ పూర్తి ఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈకౌన్సెలింగ్లో డీడీ సోషల్ వెల్ఫేర్ శ్రీలత, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహాన్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కె.రాజేశ్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ ఫాతిమా పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
నర్సంపేట: విద్యార్థులు రాబోయే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం పరీక్షలు–విద్యార్థుల సన్నద్ధత అనే అంశంపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివితే విజ యం సాధించవచ్చన్నారు. ములుగు ప్రిన్సిపల్ కె.మల్లేషం మాట్లాడుతూ టీజీపీఎస్సీ జాబ్ క్యా లెండర్ ప్రకారం గ్రూప్స్, పోలీసు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని, ఆయా పోటీ పరీక్షలలో విద్యార్థులు అనుసరించాల్సిన ప్రణాళికలను వివరించారు. విశిష్ట అతిథి గ్రూప్–2 మహిళా టా పర్ బిళ్ల శ్రావణి మాట్లాడుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సులభమవుతుందని, తద్వారా గ్రూప్ పరీక్షలలో విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సోమయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, ఎంఎంకె.రహీమోద్దీన్, ఎస్.కమలాకర్, బి.గాయత్రి, రాంబాబు, భద్రు, రుద్రాణి, రజిత, సంధ్య, పూర్ణచందర్, వీరన్న, గణేష్, రమేష్, ఏఓ అనిత, మాధవి, నిజాం, భార్గవి, ఆనందరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
నర్సంపేట:జేసీబీ సాయంతో విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న పోలీసులు, విద్యుత్ సిబ్బందినర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా సోమవారం రాత్రి ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచి న గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిపోయింది. నర్సంపేట పీఎస్ పరిధి లోని మహేశ్వరం, లక్నేపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, సీఐ రమణమూర్తి, ఎస్ఐ అరుణ్, సిబ్బంది కలిసి కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట వ్యర్ధాలను తగులబె ట్టి ఇంటికి వెళ్లాడు. అకస్మాత్తుగా మంటలు రగులుకుని చుట్టు పక్కలకు విస్తరించాయి. దీంతో నాచినపల్లి గ్రామానికి చెందిన ఇజ్జగిరి సదయ్య కు చెందిన ఎకరాల మొక్కజొన్న చేను మంటల్లో దగ్ధమైంది. ఆయనతో పాటు చుట్టూ పక్కల రైతుల చేనులకు మంటలు వ్యాపించాయి. తొగర్రాయిలో ప్రారంభమైన మంటలు కొమ్మాల దేవస్థానం వరకు వ్యాపించాయి. రైతులకు పెద్ద ఎత్తున నష్టం సంభవించడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్లే దారిలో చెట్లు నేలకూలడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సహకార శాఖ, ఐకేపీ, రెవెన్యూ, వ్య వసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో 2024–25 సంవత్సరానికి సుమారు 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 30 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సహకార శాఖ 107, ఐకేపీ ఆధ్వర్యంలో 60, మెప్మా ఆధ్వర్యంలో 2, ఎఫ్పీఓ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్య దేవి, డీసీఎస్ఓ కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా అధికారులు నీరజ, రేణుక తదితరులు పాల్గొన్నారు. మద్యం దుకాణాలపై ఫిర్యాదు జిల్లాలోని గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగనన్డాడీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన అక్రమ మద్యం దుకాణాలపై ఫిర్యాదులు వచ్చాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో పెండింగ్ పనులపై ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై పూర్తి వివరాలతో ఎంబీలు సమర్పించాలని ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
శ్మశానవాటికకు హద్దులు ఏర్పాటు చేయాలి
వరంగల్ దేశాయిపేట గ్రామశివారులోని సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిలో ది పెంతెకోస్తు మిషన్ చర్చి దళిత క్రైస్తవులకు సంబంధించిన (సమాధుల స్థలం) శ్మశానవాటికకు హద్దులు పెట్టాలి. 1.35 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 17 గుంటలు మాత్రమే మిగిలింది. స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. హద్దులు పెట్టాలని రెండేళ్ల క్రితం ల్యాండ్ సర్వే అధికారులకు ఆదేశాలు జారీ అయినా ఇప్పటి వరకు హద్దులు ఏర్పాటు చేయలేదు. – పెంతేకొస్తు చర్చి కమిటీ, దేశాయిపేట ● -
మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి
● సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అడవి బాట పట్టిన మావోయిస్టులు హింసను వది లి జనంలోకి రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందుకొని వారి కుటుంబాలతో ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – 8లోu● ఈ ఫొటోలోని దివ్యాంగుడు ఖిలావరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన పెద్ద వెంకటయ్య. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరేళ్ల క్రితం వెంకటయ్యకు యాక్సిడెంట్ కావడంతో ఎడమకాలు పోయింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడు రామ్ తనకు సపర్యలు చేస్తున్నాడు. పెద్ద కుమారుడు అన్ని సేవలు చేస్తుండటంతో 10 గుంటల భూమి అదనంగా ఇస్తానంటే చిన్న కుమారుడు లక్ష్మణ్ ఇబ్బందులు పెడుతున్నాడని, పోలీస్గా పనిచేస్తున్నందున భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పెద్ద కుమారుడే అన్ని విధాలుగా చూసుకుంటున్నాడని, ఉన్నతాధికారులు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. న్యూస్రీల్ -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫ రా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యే క యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకు న్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తాడు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరలా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండ ఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిచిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, మొదటి పీఆర్సీ గడు వు 2023తోనే ముగిసినందున నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఉద్యోగ విరమణ పొందినవారికి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎస్.సుభాషిని, డి.రమేశ్, కార్యదర్శి ఎన్.భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు జి.ఉప్పలయ్య, ఎం.సారంగపాణి, గంగాధర్ పాల్గొన్నారు. -
నైతిక విలువలకు బీజేపీ ప్రాధాన్యం
హన్మకొండ: నైతిక విలువలకు బీజేపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి.. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ ఇతర పార్లమెంట్ సభ్యులు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఆ మద్దతు నిరాకరిస్తూ ప్రభుత్వం దిగిపోయేందుకు నిర్ణయించుకున్నారని, బీజేపీ విలువలకు ప్రాధాన్యమివ్వడమంటే ఇదేనన్నారు. జాతీయ భావజాలం, దేశం కోసం పార్టీ పని చేస్తోందన్నారు. ఉత్తమ విలువలతో పని చేసే పార్టీ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు, విదేశీ దౌత్యనీతి, వక్ఫ్ బిల్లు వంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అవీనితికి తావు లేని సమర్థ పాలన అందిస్తున్న బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, తోపుచెర్ల మధుసూదన్ రావు, ఆకుల శ్రీకాంత్, నర్మెట్ట శ్రీనివాస్, రాజ్కుమార్, కందగట్ల సత్యనారాయణ, సంపత్రెడ్డి, సండ్ర మధు, ముత్యాల శ్రీనివాస్, మాలోతు నాను నాయక్, కళ్యాణ్, శ్రీకాంత్, ప్రసాద్, సతీశ్, జైపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, అరణ్య రెడ్డి, జన్ను మధు, అనురాధ, సారంగపాణి, మల్లికార్జున్, రాము, అనిల్, అభిషేక్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
గీసుకొండ: పేదల సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ఽ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ హితం, సుస్థిరత, అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కుసుమ సతీశ్, గట్టికొప్పుల రాంబాబు, వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, కపిల్కుమార్, కనుకుంట్ల రంజిత్కుమార్, 16వ డివిజన్ అధ్యక్షురాలు జాలిగపు ప్రసన్న రాంప్రసాద్ పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజావాణి వరంగల్: కలెక్టరేట్లో సోమవారం(నేడు) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సన్న బియ్యం ప్రారంభోత్సవంలో నిరసన వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది. నేడు వరంగల్ ప్రజావాణివరంగల్: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం(నేడు)ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లీకేజీల గుర్తింపు ● టన్నెల్లోకి దిగిన ఇంజినీర్లు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయ్యింది. పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి డీ వాటరింగ్ చేశారు. ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కు ని పరిశీలించారు. బీజేపీతోనే దేశాభివృద్ధిఖిలా వరంగల్/హన్మకొండ: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోశ్రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కార్యాలయాలతో పాటు శివనగర్, రంగశాయిపేటలో వేర్వేరుగా బీజేపీ జెండాలు ఆవి ష్కరించి మాట్లాడారు. దేశానికి పునర్వైభవం తెచ్చే దిశగా మోదీ పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురా లు రావు పద్మ, పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్రెడ్డి, కొల్లూరి యోగానంద్, రాణాప్రతాప్, కపిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నిప్పుపెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూటికె వీరన్న–కమలమ్మ దంపతులు తమకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రెండు ఎకరాల్లోని పంట పూర్తిగా దగ్ధమైంది. చేతికందిన పంట కాలిపోవడంతో రూ.రెండు లక్షలు నష్టపోయామని వీరన్న–కమలమ్మ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. పిండి రవి, మూటికె కట్టయ్య, మూటికె శ్రీనివాస్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు నానబోయిన రాజారాం, వైనాల వీరస్వామి, బత్తిని మల్లయ్య, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మోటురి హరీశ్, వైనాల మధు తదితరులు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
● భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే జాప్యం
నగరాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్మార్ట్సిటీ నిధులు సగానికి పైగా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయంటే పాలకుల అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలేమి కారణంగా అనేక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ స్మార్ట్సిటీ పనులను వేగవంతం చేయాలి. అప్పుడే మరిన్ని నిధులు నగరానికి మంజూరయ్యే అవకాశం ఉంటుంది. – డాక్టర్ కంజర్ల మనోజ్, పెద్దమ్మగడ్డ, హనుమకొండ -
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuహనుమకొండ రెవెన్యూకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు, తాళి బొట్టు చూపిస్తున్న పూజారి కల్యాణ వైభోగమే..గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం రామనామం మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ, ఆంజనేయ సమేత సీతారాములను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఆలయాల్లో వడపప్పు, మిర్యాల పానకం ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ ఆవరణల్లో అన్నదానాలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. – సాక్షి, నెట్వర్క్– మరిన్ని చిత్రాలు 9లోu -
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్రం వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ తమదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి.. కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన సన్నబియ్యం పంపిణీ -
నేడు రాములోరి కల్యాణం
నేడు (ఆదివారం) జరగనున్న సీతారాముల కల్యాణానికి నగరంలోని పలు రామాలయాలు, హనుమాన్ మందిరాలు ముస్తాబయ్యాయి. ఎండాకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామీయానాలు, పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయం, ఎల్లంబజార్లోని శ్రీసీతారామచంద్రస్వామి అలయం, హనుమకొండ రెవెన్యూ కాలనీలోని రామాలయం, వేయిస్తంభాల దేవాలయంతోపాటు పలు దేవస్థానాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వేయిస్తంభాల ఆలయంలో శనివారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రాభిషేం చేశారు. రాములవారిని అయోధ్య రాముడిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ద్వజారోహణం నిర్వహించారు. యాగశాలలో సుదర్శన హోమం జరిపారు. సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని గంగు ఉపేంద్రశర్మ కోరారు. – హన్మకొండ కల్చరల్ -
చామంతులతో లక్షపుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పసుపురంగు చామంతులతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం జరిపారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పసుపు రంగు చామంతిపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనకు కరీంనగర్కు చెందిన బాలజనని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నేడు హజ్ యాత్రికులకు శిక్షణన్యూశాయంపేట: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం (నేడు) హజ్ యాత్రికులకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ శనివారం తెలిపారు. వరంగల్ ఇస్లామియా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులు సకాలంలో వచ్చి శిక్షణలో పాల్గొనాలని కోరారు. డీఈఈసెట్కు దరఖాస్తు చేసుకోవాలివిద్యారణ్యపురి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) డీఈఈసెట్– 2025కు నోటిఫికేషన్ విడుదలైందని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ అబ్దుల్హై శనివారం ఒక ప్రకటనలో కోరారు. మే 15వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష మే 25న ఉంటుందని తెలి పారు. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించినవారు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మా ర్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలికాజీపేట అర్బన్: ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులు వేసవిలో తప్పకుండా జాగ్రత్తలు పాటించి పనులు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. కాజీపేట మండల పరిధి కడిపికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి గ్రామ శివార్లలో ఇటుకబట్టీల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సందర్శించి పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కవి రామా చంద్రమౌళికి సాహిత్య పురస్కారంహన్మకొండ కల్చరల్: హైదరాబాద్ వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రదానం చేయనున్న డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారానికి వరంగల్కు చెందిన కవి, రచయిత రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. ఈమేరకు ఉగాది సంబరాల్లో భాగంగా ఏప్రిల్ 12, 13 తేదీల్లో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో రామాచంద్రమౌళికి ఈపురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేతనాలు పెంచాలి.. గీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్హెచ్ఎం కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తోందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత
దామెర: మండలంలోని పసరగొండలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల్ని శనివారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురు రైతులకు సంబంధించిన పొలాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తోందని కాంట్రాక్టర్ మార్కింగ్ చేస్తూ.. సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా బాధిత రైతులు ఘటనా స్థలికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన పరిహారం ఇంకా తమకు రాలేదని, డబ్బులు రానిదే పనులు నిర్వహించరాదని ఆందోళనకు దిగారు. రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో తప్పులున్నాయని, అధికారులు వాటిని సరిచేసి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వెనుదిగారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. -
భూముల కబ్జా!
ఆగని ఎస్సారెస్పీహసన్పర్తి: ఎస్సారెస్పీ భూముల్లో రోజురోజుకూ కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కబ్జాదారులు దర్జాగా ఎస్సారెస్పీ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్నాసాగరం నుంచి మొదలుకుని పైడిపల్లి వరకు వందలాది నిర్మాణాలు వెలిశాయి. సుమారు 360 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆరేళ్ల క్రితమే అప్పటి అధికారులు సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక మేరకు అప్పటి కమిషనర్, కలెక్టర్లు అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్జాగా షెడ్లు.. తాజాగా ఓ క్వారీ నిర్వాహకుడు హసన్పర్తి–జయగిరి మార్గమధ్యలోని ఎస్సారెస్పీ భూమిని కబ్జా చేశాడు. దర్జాగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కబ్జా చేసుకున్న భూమి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈవ్యవహారం జరిగినప్పటికీ ఎస్సారెస్పీ అధికారుల మౌనంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా ఇక్కడ షెడ్లు కంటైనర్లు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంపై రాజకీయ ఒత్తిడే కారణమా లేక మామూళ్లు అందుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపునకు చర్యలు ఎస్సారెస్పీ భూములు ఆక్రమించుకుని షెడ్, కంటైనర్లు ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటిని తొలగించాలని క్వారీ నిర్వాహకుడికి సూచించాం. లేకపోతే సదరు కబ్జాదారులపైచర్యలు తీసుకుంటాం. – రవీందర్, డీఈఈ -
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటినుంచి నెల రోజులపాటు అమలు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. ఇందులో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞాన తీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను అర్కిటెక్టులు, ఇంజినీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏంటంటే.. పూర్వం ఓ కాకి.. నదిలో స్నానం చేసి హంసలా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్కు కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. -
జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణాభివృద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్బీఐ వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు స్టెప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాస్క్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని, దీంతో పాటు పరకాలలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీలత, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, బాబు జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కొంగర జగన్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాబూ జగ్జీవన్రామ్కు ఘన నివాళి
రామన్నపేట: మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను వరంగల్ ఎల్బీ కళాశాలలోని జయసేన మెమోరియల్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారాంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. పుష్కరఘాట్కు కాకి, హంస, మకరం చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ -
రెన్యువల్ చేస్తేనే విధుల్లో కొనసాగిస్తాం ..
ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన రెన్యువల్ మార్చి 31లోగా ముగిసి పోయింది. దీనిపై ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. కానీ, డీఎంఈలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు మాకు రాలేదు. ఆసిబ్బంది రెన్యువల్ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు కూడా రాకపోవడంతో ఎలా పనిచేయించుకోవాలి, ఎవరు జీతాలు అందించాలి అనే ప్రశ్నలు తలెత్తాయి. రెన్యువల్ చేస్తున్నట్లు అయినా, డీఎంఈలోకి తీసుకున్నట్లు అయినా లేఖ తెస్తేనే విధుల్లోకి తీసుకోవడం సాధ్యమవుతుందని సిబ్బందికి తెలిపాం. – డాక్టర్ మోహన్దాస్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి●
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి: రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్నారంషరీఫ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి, గాంధీజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుకెళ్లేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతం భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి రమేశ్ ఇంటిలో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, ఇన్చార్జ్ కోఆర్డినేటర్ దూపాకి సంతోష్, మహిళా మండలి నాయకురాలు మాసాని సువార్త తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన రావూరు గ్రామస్తులు పాదయాత్రలో భాగంగా రావూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజును తండావాసులు ప్రశ్నలతో ముంచెత్తారు. ఆరు గ్యారంటీల అమలుపై మహిళలు నిలదీశారు. ఆకేరు వాగు నీటిని పంటలకు అందించడంలో విఫమయ్యారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావును వారు హెచ్చరించారు. -
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
● నేటి నుంచి నెల రోజులపాటు అమలు ● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారంనుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుష్ ఉద్యోగుల వేతనాలు పెంచాలిగీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తుందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, 2014 లోపు నియమితులైన వారిని రెగ్యులర్ చేయాలని, డిప్యూటేషన్లను రద్దుచేసి నియామకమైన చోటే పనిచేసేలా చూడాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు 8వ స్థానంగీసుకొండ: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో శనివారం రాష్ట్ర జట్టు 8వ స్థానం సాధించిందని టీం శిక్షణ ఇన్చార్జ్ కోట రాంబాబు తెలిపారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, త్వరలో మేఘాలయలో జరిగే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర జట్టు అర్హత సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాములోరి పెళ్లికి గోటి తలంబ్రాలుదుగ్గొండి: మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈసారి ‘మన ఊరి రాముడికి మన తలంబ్రాలు’ పేరుతో బైరెడ్డి నిరంజనాదేవి ఇంట్లో మహిళలు గోటి తలంబ్రాలు తయారు చేశారు. శనివారం సాయంత్రం వరకు 11 కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేసినట్లు నిరంజనాదేవి తెలిపారు. ఆదివారం తలంబ్రాలను ఆలయానికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పుచ్చకాయల అరుణ, అండృ సఽంధ్యారాణి, బొమ్మినేని రమాదేవి, బైరెడ్డి కళావతి, రావుల కవిత, శైలజ, రిత్విక తదితరులు పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణం చూతము రారండి..
సాక్షి, నెట్వర్క్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు, బాసింగాలు, జీలకర బెల్లం సిద్ధం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయంలో సుమారు 10 వేల మంది భక్తులు వీక్షించేలా పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీల బాధ్యులు కోరుతున్నారు. -
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్ర వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో సన్న బియ్యం పంపిణీ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభం కాగా.. వరంగల్ తూర్పులో మాత్రం శనివారం నుంచి ప్రారంభమైంది. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ వరంగల్ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద శనివారం ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎరబ్రెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. అన్ని రేషన్ షాపుల వద్ద మోదీ పొటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ కార్యకర్తలే ఏర్పాటు చేస్తారని అల్టిమేటం జారీ చేయడంతో తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజ కీయం వేడెక్కినట్లయ్యింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ మాదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో క్రెడిట్ మాదంటే మాదని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి.. నియోజకవర్గంలో బీజేపీ నాయకుల డిమాండ్ కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన సన్న బియ్యం పంపిణీ -
వరంగల్
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రెన్యువల్ చేయక.. రామప్ప వైభవాన్ని చాటిచెప్పాలి మిస్ వరల్డ్ టీమ్ అబ్బురపడేలా రామప్ప కళావైభవం చాటిచెప్పాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. – 8లోuనర్సంపేట రూరల్: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేటలో సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేసింది. ఆస్పత్రికి కావాల్సిన రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 21 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు రక్తనిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిని టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) నుంచి డీఎంఈలో విలీనం చేశారు. మిగిలిన 15 మంది చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. వీరి కాంట్రాక్టు మార్చి 31తో ముగిసింది. సీహెచ్సీని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసి, వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈక్రమంలో టీవీవీపీ నుంచి ఆస్పత్రిని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి మార్చారు. టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగిన ఏజెన్సీలు డీఎంఈ పరిధిలోకి రాకపోవడంతో మరో టీవీవీపీ ఆస్పత్రిలో ఈ సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంది. జిల్లాలోనే వర్ధన్నపేట సీహెచ్సీ టీవీవీ పరిధిలో ఉంది. ఆ ఆస్పత్రిలో 15 మందికి సంబంధించిన పోస్టులు ఖాళీలు లేవు. రక్తనిధిలో పనిచేస్తున్న వారితో 15 మందిని డీఎంఈలో విలీనం చేస్తే అయిపోయేది. అలా చేయకపోవడంతో వారికి రెన్యువల్ చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కార్మికుల ప్రదక్షిణ.. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి పూర్తి బాధ్యతలను సూపరింటెండెంట్ నర్సింహస్వామి.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, సూపరింటెండెంట్ కిషన్కు అప్పగించి డిప్యుటేషన్పై వర్ధన్నపేటకు వెళ్లిపోయారు. కానీ, 15 మంది సిబ్బంది పరిస్థితి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. వారి బాధ్యత డీఎంఈ అధికారులే చూసుకోవాలని టీవీవీపీ అధికారులు చెబుతున్నారు. టీవీవీపీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ అయిపోయిందని డీఎంఈ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఔట్సోర్సింగ్ కార్మికులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని ఆయన నివాసంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిసి సమస్య విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కాగా, ఆస్పత్రిలో 180 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత మీకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారిని విధుల్లోకి తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు హామీ ఇచ్చారు. కానీ, ఆ పోస్టుల భర్తీలో అవకతవకలు జరగడంతో ఏజెన్సీనే ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ నియామకాలు ఆగిపోయాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను రెన్యువల్ చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో మాట్లాడుతున్న కార్మికులు (ఫైల్)న్యూస్రీల్అయోమయంలో ఔట్ సోర్సింగ్ కార్మికులు అరకొర వేతనాలతో 15 ఏళ్లుగా నర్సంపేట సీహెచ్సీలో విధులు విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
ముల్యాంకనంలో నిబంధనలు పాటించాలి
వరంగల్: ఇంటర్ మూల్యాంకనంలో బోర్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, వరంగల్ క్యాంపు అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్తో కలిసి శుక్రవారం వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ హాజరు ఉన్నందున సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఈఏడాది నుంచి రీ వెరిఫికేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. వరంగల్తోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూల్యాంకనంలో టోటలింగ్, బబ్లింగ్ తదితర లోపాలు తలెత్తకుండా ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో పూర్తిచేయడానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయనిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఖానాపురం: వైద్య సేవలందించడంలో రాష్ట్రంలో జిల్లా మధ్య స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,775 పల్లె దవాఖానలు, సబ్సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో అసంపూర్తిగా 30 ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు అలసత్వం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు. వేసవిలో ప్రజలు 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లొద్దని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, క్యాపులు ధరించాలని సూచించారు. డీహెచ్ వెంట డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ఎన్సీడీపీఓ రవీందర్, టీబీ, మలేరియా ప్రోగ్రాం అధికారి ఆచార్య, ఆమ్ పీఓ విజయ్కుమార్, ఎన్సీడీ సూపర్వైజర్ ప్రకాశ్రెడ్డి, వైద్యులు జ్యోతి, అరుణ్కుమార్, సిబ్బంది రాంప్రసాద్రెడ్డి, భాస్కర్ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్నాయక్ ఖానాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ధర్నా హన్మకొండ: దశాబ్దాల కాలంగా రక్తం చెమటగా మార్చి పనిచేసి జీవితాన్ని ధారబోసి ఉద్యోగ విరమణ చేసిన తమపై యాజమాన్యం, ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదదని.. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన హనుమకొండ, వరంగల్–2 డిపోల ఎదుట ధర్నా చేశారు. కార్మికులు మాట్లాడుతూ వయస్సులో ఉన్నప్పుడు సంస్థకు సేవ చేసిన తమకు కనీస పెన్షన్ లేదని, జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించలేదు.. గ్రాట్యుటీ ఇవ్వడం లేదు.. డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదని వాపోయారు. 2022 ఏప్రిల్ నుంచి టెర్నినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్పీఎస్ 2017 ఎరియర్స్, ఈపీఎస్కు పీఎఫ్ హయ్యర్ పెన్షన్, 2021 వేతన ఒప్పందం చేసి ఎరియర్స్ చెల్లించాలన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి, స్పౌజ్కు సూపర్ లగ్జరీ బస్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రిటైర్డ్ కార్మికులు కేఎస్.నారాయణ, ఎస్.ఎస్.చారి, ఎస్.వై.గిరి, టి.సునీత, యాదగిరి, సీహెచ్ సోమయ్య, బీయూ.చారి, వై.శ్రీనివాస్, సాజీద్, వై.గిరి. సమ్మయ్య పాల్గొన్నారు. -
నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శాయంపేట : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అవసరం.. ఇందుకు గ్రామాల్లో పెట్రోలింగ్ నిరంతరం చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సీఐ రంజిత్రావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, పరకాల ఏసీపీ సతీశ్బాబు, ఎస్సై జక్కుల పరమేశ్ ఉన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ధర్నా హన్మకొండ: దశాబ్దాల కాలంగా రక్తం చెమటగా మార్చి పనిచేసి జీవితాన్ని ధారబోసి ఉద్యోగ విరమణ చేసిన తమపై యాజమాన్యం, ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదదని.. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన హనుమకొండ, వరంగల్–2 డిపోల ఎదుట ధర్నా చేశారు. కార్మికులు మాట్లాడుతూ వయస్సులో ఉన్నప్పుడు సంస్థకు సేవ చేసిన తమకు కనీస పెన్షన్ లేదని, జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించలేదు.. గ్రాట్యుటీ ఇవ్వడం లేదు.. డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదని వాపోయారు. 2022 ఏప్రిల్ నుంచి టెర్నినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్పీఎస్ 2017 ఎరియర్స్, ఈపీఎస్కు పీఎఫ్ హయ్యర్ పెన్షన్, 2021 వేతన ఒప్పందం చేసి ఎరియర్స్ చెల్లించాలన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి, స్పౌజ్కు సూపర్ లగ్జరీ బస్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రిటైర్డ్ కార్మికులు కేఎస్.నారాయణ, ఎస్.ఎస్.చారి, ఎస్.వై.గిరి, టి.సునీత, యాదగిరి, సీహెచ్ సోమయ్య, బీయూ.చారి, వై.శ్రీనివాస్, సాజీద్, వై.గిరి. సమ్మయ్య పాల్గొన్నారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పెద్దపల్లి తేజస్వీప్రకాశ్ నర్సంపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని వరంగల్ రూరల్ జిల్లా ఇన్చార్జ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పెద్దపల్లి తేజస్వీప్రకాశ్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్పటేల్, యువజన కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, వరంగల్ తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు మహ్మద్ సలీమ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల నరేశ్, నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నర్సంపేట మండల అధ్యక్షుడు బొంత రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులు తీసుకోం.. బంగారమే ఇవ్వాలి
రాయపర్తి: డబ్బులు తీసుకోం.. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలి.. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఖాతా దారులు మండిపడ్డారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట వారు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. బ్యాంకు అధికారులను బయటకు పంపించి గేటుకు రెండు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ 2024 నవంబర్ 19న ఎస్బీఐ నుంచి 19 కిలోల బంగారాన్ని దొంగులు దోచుకెళ్లారని తెలిపారు. నెల క్రితం బ్యాంకుకు వస్తే న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఉన్నతాధికారులు వచ్చారని తెలియడంతో బ్యాంకుకు వచ్చామని పేర్కొన్నారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహంతో బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన చేసినట్లు ఖాతాదారులు వివరించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే మెయిన్ బ్రాంచ్కు వెళ్లి తాళాలు వేస్తామని హెచ్చరించారు. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలని, తులం బంగారానికి రూ.77,710 ఇస్తామని అధికారులు బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బంగారం చోరీకి గురైందని చెప్పారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఖాతాదారులు ఇళ్లకు వెళ్లిపోయారు. రాయపర్తిలో ఎస్బీఐ ఖాతాదారుల డిమాండ్ బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన90 తులాల బంగారం పోయింది.. 12 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సుమారు 90 తులాల బంగారం పోవడంతో ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. హైదరాబాద్లో ఉంటూ అక్కడే కుదువపెట్టుకోకుండా మా గ్రామం పక్కనే ఉన్న ఎస్బీఐలో రూ.24 లక్షలకు బ్యాంకులో కుదువపెట్టుకున్నం. బ్యాంకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికై నా మా బంగారం మాకే ఇవ్వాలి. డబ్బులు కట్టిస్తామంటే ఊరుకునేదిలేదు. –శిరీష, మైలారం గ్రామం బంగారం ఇస్తామన్నారు.. నేను బ్యాంకులో 13 తులాల బంగారం తాకట్టు పెట్టిన. బంగారం పోయి ఐదు నెలలు కావొస్తున్నా బ్యాంకు అధికారులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. గురిజంత బంగారం కూడా పోదు. బంగారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా మా బంగారాన్ని ఇప్పించాలి. – గిర్క సాయిరెడ్డి, మహబూబ్నగర్ గ్రామం -
నగదు అపహరించిన దొంగ అరెస్ట్
వర్ధన్నపేట: వృద్ధురాలి నుంచి నగదు అపహరించిన దొంగను అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేటకు చెందిన వృద్ధురాలు నందనం భారతమ్మ ఈ నెల రెండున వర్ధన్నపేట ఎస్బీఐ నుంచి రూ. మూడు లక్షలు డ్రా చేసింది. ఆమె డబ్బులు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఆటో కోసం వేచి చూస్తుండగా మండలంలోని కడారిగూడేనికి చెందిన బత్తిని విజయ్కుమార్ వచ్చాడు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఆమెను స్కూటీపై ఎక్కించుకున్నాడు. ఇంటి సమీపంలో స్కూటీ ఆపకుండా ఫిరంగిగడ్డ వరకు తీసుకెళ్లి కోనాపురం రోడ్డు వద్ద దింపాడు. ఆమె దగ్గర ఉన్న రూ.మూడు లక్షల నగదు, సెల్ఫోన్, బ్యాంకు పాసుబుక్ ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కట్య్రాల గ్రామ సమీపంలో నిందితుడు విజయ్కుమార్ను అరెస్టు చేసి, రూ.మూడు లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. వెస్ట్జోన్ డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సై బి.చందర్, పోలీస్ సిబ్బంది కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వారిని అభినందించారు. వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య -
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : కోర్టు ప్రాంగణంలో ప్రమాదకర మందుపాతరలు ఏర్పాటు చేశాం.. మధ్యాహ్నం 2 గంటలకు పేలే ప్రమాదం ఉందని శుక్రవారం ఉదయం 7.11 గంటలకు జిల్లా కోర్టు అధికార మెయిల్కు ఓ సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు, హైకోర్టుకు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ యంత్రాంగం డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్ల ద్వారా తనిఖీలు చేపట్టారు. విషయం తెలిసి న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులకు సంబంధించి కోర్టుకు వచ్చిన కక్షిదారులను పంపించారు. తమిళనాడు లిబరేషన్ ఆర్మీ(టీఎన్ఎల్ఏ) ఎస్.మారన్– వింగ్ ద్వారా ఈ మెయిల్ వచ్చినట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. సల్ఫర్ ఆక్సిడైజ్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్(ఐఈడీఎస్) పేలుడు పదార్థాలు ఏర్పాటు చేసినట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకి చెందిన జర్నలిస్టు సువుక్కు శంకర్పై అమానవీయంగా ప్రవర్తించిన తీరు, అలాగే ఇటీవల రిమోట్ కంట్రోల్ సిస్టంను దుర్వినియోగం చేసి నివేత పేతురాజ్, ఉదయనిధి స్టాలిన్ల విషయాలను లీకేజీ చేసిన ఘటనలో డీఎంకే ప్రభుత్వంపై ప్రతీకారంగా ఈ పేలుడుకు పాల్పడుతున్నట్లు మెయిల్లో వివరించారు. టీఎన్ఎల్ఏ ఎస్.మారన్ వింగ్ ద్వారా మెయిల్ బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ల తనిఖీ -
పడిపోతున్న భూగర్భ జలం
హన్మకొండ: హనుమకొండ జిల్లా భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు.. నవంబర్ నుంచి క్రమేణా అడుగంటుతున్నాయి. హనుమకొండ జిల్లాలో డిసెంబర్ మాసాంతానికి 4.81 మీటర్లకు, జనవరి మాసాంతానికి 5.93 మీటర్ల లోతుకు, ఫిబ్రవరి మాసాంతానికి 6.30 మీటర్లకు, మార్చి మాసాంతానికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, నవంబర్ నుంచి యాసంగి పనులు మొదలు కావడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం 1,77,700 ఎకరాల్లో సాగు చేశారు. వరి, మొక్కజొన్నతోపాటు ఇతర మెట్ట పంటలకు సాగునీటి వినియోగం పెరిగింది. ఐనవోలులో 22.64 మీటర్ల లోతు.. హనుమకొండ జిల్లాలో మార్చి చివరి నాటికి అత్యధికంగా ఐనవోలులో 22.64 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 13.21 మీటర్లకు జలమట్టం పడిపోయింది. బోరుబావులు తవ్వించి 25 ఫీజో మీటర్లు, వరంగల్ జిల్లాలో 26 ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫీజో మీటర్లు భూగర్భజల మట్టాన్ని రికార్డు చేస్తాయి. వీటి నుంచి భూగర్భ జలశాఖ అధికారులు నీటిమట్టం రికార్డును సేకరిస్తారు. గట్లనర్సింగాపూర్లో 6.53 మీటర్ల లోతు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో 6.53 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్లో 10.24, కొత్తపల్లిలో 9.23, వంగరలో 10.31, ధర్మసాగర్ మండలం ధర్మాపూర్లో 4.68, ధర్మసాగర్లో 3.65, పెద్దపెండ్యాలలో 9.68, నారాయణగిరిలో 4.61, ఎల్కతుర్తిలో 8.53, హనుమకొండలో 7.06, హసన్పర్తి మండలం నాగారంలో 8.49, సీతంపేటలో 4.56, ఎల్లాపూర్లో 3.68, ఐనవోలు మండలం పున్నేలులో 4.72, పంథినిలో 5.19, ఐనవోలులో 22.64, కమలాపూర్ మండలం శనిగరంలో 7.18, వేలేరు మండలం పీచరలో 10.43, వేలేరులో 3.48, ఆత్మకూరులో 3.17, దామెరలో 4.19, నడికూడ మండలం చర్లపల్లిలో 13,21, నడికూడలో 3.46, పరకాలలో 4.57, శాయంపేట మండలం పత్తిపాకలో 5.61 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జిల్లాలో సగటున 7.16 మీటర్లు.. 1,77,700 ఎకరాల్లో పంటల సాగు -
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శు క్రవారం ఎరుపు రంగు గులాబీపూలతో అమ్మవారికి అర్చన చేశారు. ఉదయం అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీతారాములకు తులసి అర్చన హన్మకొండ కల్చరల్ : శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజు శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సీతారా ములకు లక్ష తులసిలతో అర్చన చేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన పూజా కార్యక్రమాల అనంతరం యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. పుష్పుల్ రైలు సర్వీసును పునరుద్ధరించండి : ఎంపీహన్మకొండ చౌరస్తా: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పుష్పుల్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను ఎంపీ కావ్య కోరారు. ఈ మేర కు ఆమె శుక్రవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వెళ్తుంటారని, వారి అవసరాల దృష్ట్యా పుష్పు ల్ రైలు సర్వీసు పునరుద్ధరించడంతోపాటు బోగీల సంఖ్య పెంచాలని కోరారు. కాజీపేట లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండ గా.. ఇటీవల వరంగల్కు మంజూరైన సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను త్వరగా ప్రారంభించాలని ఎంపీ కావ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలిసింగ్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎంజీఎం ఓపీ కౌంటర్లో పనిచేయని ప్రింటర్లు ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతోంది. శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం అడ్మిట్ కార్డు కౌంటర్లో ప్రింటర్లు పనిచేయలేదు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో బారులుదీరారు. ఉక్కపోతతో నరకం చూశారు. వారి ఇబ్బందిని చూసి సిబ్బంది గత్యంతరం లేక మాన్యువల్గా ఓపీ చిట్టీలు రాసి ఇచ్చారు. దీనిపై ఓ రోగి కుటుంబ సభ్యుడు సిబ్బందిని ప్రశ్నించగా ‘విషయం అధికారులకు చెప్పినా పట్టికోవడం లేదు.. మేం ఏం చేస్తామంటూ’ బదులిచ్చారు. -
గంజాయి కేసుల్లో నేరస్తులను అరెస్ట్ చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులతోపాటు వారికి సరుకు అందజేసే.. స్వీకరించే వ్యక్తులను అరెస్ట్ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పిలిపించడమే కాకుండా అధికారులు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని పరిసరాల్లో ఉండే వారి నుంచి రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యే నిందితుల సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈనేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్స్టేషన్ అధికారులు కూడా నిర్వహించాలని తెలిపారు. స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై అధికారులు తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, ఏఎస్పీలు చైతన్య, మనాన్భట్, అదనపు డీసీపీలు రవి, సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఖానాపురం: వైద్య సేవలందించడంలో రాష్ట్రంలో జిల్లా మధ్య స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,775 పల్లె దవాఖానలు, సబ్సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో అసంపూర్తిగా 30 ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు అలసత్వం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు. వేసవిలో ప్రజలు 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లొద్దని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, క్యాపులు ధరించాలని సూచించారు. డీహెచ్ వెంట డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ఎన్సీడీపీఓ రవీందర్, టీబీ, మలేరియా ప్రోగ్రాం అధికారి ఆచార్య, ఆమ్ పీఓ విజయ్కుమార్, ఎన్సీడీ సూపర్వైజర్ ప్రకాశ్రెడ్డి, వైద్యులు జ్యోతి, అరుణ్కుమార్, సిబ్బంది రాంప్రసాద్రెడ్డి, భాస్కర్ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్నాయక్ ఖానాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ -
సీహెచ్ఓను తొలగించాలి
నర్సంపేట: ఆశ వర్కర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)ను విధుల నుంచి తొలగించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాతే ఆశవర్కర్ల నియామకాలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా సదరు అధికారి 20 మందిని ఎలా నియమించారని ఆయన ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి..
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దామెర: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. దామెర మండలం ల్యాదెళ్లలోని సాగునీటి పారుదల శాఖ భవనాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీ–హబ్ సహకారంతో ఏర్పాటు చేయనున్న పరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి గురువారం ఆయన ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా కల్పించాల్సిన మౌలిక వసతులు, ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈనెల 15 తర్వాత మంత్రి సీతక్కతో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దామెర మండల కేంద్రంలో త్వరలో డెయిరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం పరకాలలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు, నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వసతులు కల్పించి మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహిళలు ఈసదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీ దేవి, ఎంపీడీఓ కల్పన, ఏపీఓ శారద, కాంగ్రెస్ జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్శెట్టి భిక్షపతి, నాయకులు గుడిపాటి శ్రీధర్రెడ్డి, జక్కుల రవి, సదిరం పోశాలు, మహిళలు తదితరలు పాల్గొన్నారు. మరమ్మతుల్లో జాప్యంపై మేయర్ ఆగ్రహం వరంగల్ అర్బన్: చెత్త తరలింపు వాహన మరమ్మతుల్లో జాప్యంపై మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డును మేయర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి వాహన మరమ్మతులకు సంబంధించిన రిజిస్టర్ను పరిశీలించారు. నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈతనిఖీల్లో ఎస్ఈ ప్రవీణ చంద్ర, ఈఈ మహేందర్, డీఈ శివానంద్, ఏఈలు ఫణికుమార్, సంతోశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నా
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు గురువారం హనుమకొండలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాయడాన్ని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు సిరిమల్ల సదానందం, కార్యదర్శి చాడా జైహింద్ రెడ్డి, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు జి.సంపత్రావు ఖండించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ న్యాయమైన హక్కులపై కేంద్ర సర్కారు సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన నినాదాలతో ధర్నాస్థలి దద్దరిల్లింది. కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, ఆయా సంఘాల నాయకులు ఎన్.ఐజాక్, ఆర్.సమ్మయ్య, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, పోస్టల్, ఆర్మీ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేతలు రాక ఆలస్యం
సన్న బియ్యం..సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈ నెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండ్రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడంపై లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్ధిదారులు ఉదయం నుంచే రేషన్షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు రేషన్దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంటల నుంచే రేషన్షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు. జిల్లాల వారీగా రేషన్ దుకాణాలు, కార్డులు, బియ్యం పంపిణీ ఇలా.. లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందాలి.. కలెక్టర్ ప్రావీణ్య దామెర: లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీని ఆమె గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా సన్న బియ్యం నాణ్యత, తూకం వేస్తున్న విధానం, స్టాక్ వివరాలు, రేషన్ కార్డుల సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సదిరం పోశాలు, మాదరపు భరత్, లబ్ధిదారులు ఉన్నారు. రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభ వేడుకలు లబ్ధిదారులు బారులు... రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్లో 32.61లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణజిల్లా దుకాణాలు కార్డులు లబ్ధిదారులు బియ్యం పంపిణీ (మె.టన్నుల్లో) హనుమకొండ 414 2,28,143 6,75,246 4,051.476 వరంగల్ 509 2,66,429 7,94,087 5,014.541 జనగామ 335 1,61,472 4,85,164 3,094.690 మహబూబాబాద్ 558 2,41,012 7,03,550 4,511.000 జేఎస్భూపాలపల్లి 277 1,23,508 3,50,527 2,276.520 ములుగు 222 91,737 2,52,348 1,650.000 -
ప్రారంభోత్సవాలు, ఆవిష్కరణలు
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయదేవత విగ్రహా పునఃప్రతిష్ఠ, అయోధ్య రామయ్య స్మారక వైద్య పరీక్షల కేంద్రం, ఇ–కోర్ట్స్ కేంద్రం, హనుమకొండ బార్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశ మందిరాన్ని ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్బాబు ప్రారంభించారు. అలాగే న్యాయశాఖ ఉద్యోగుల సంఘం భవనాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో రెండు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు తీగల జీవన్గౌడ్, మాతంగి రమేశ్బాబు, కార్యదర్శులు ముదసర్ అహ్మద్, లడే రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం కనకాంబరాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి మండువా శేషగిరిరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. ధర్మస్థాపన కోసమే రామావతారంహన్మకొండ కల్చరల్: ధర్మ స్థాపన కోసమే రామావతారమని వేయిస్తంభాల ఆలయంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్ రుద్రాభిషేకం నిర్వహించారు. యాగశాలలో సుదర్శనహోమం నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికకేయూ క్యాంపస్ : జమ్మూ కశ్మీర్లోని కశ్మీర్ యూనివర్సిటీలో ఈ నెల 4నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్లిఫ్టింగ్ పోటీలకు పురుష, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. పురుషుల జట్టులో పి.విశాల్, ఎం.అమన్, ఎ స్.పోతురాజు, వి.వెంకటేశ్, మహిళా జట్టులో సీహెచ్.రమ, బి.చిన్మయి, జి.శ్రుతి ఉన్నారు. కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఖమ్మం) ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జె.జేథ్యా మేనేజర్గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. బార్షాపులకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు బార్లకు లైసెన్స్లు ఇవ్వనున్నట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ (వరంగల్ అర్బన్) ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు గతంలో రెన్యువల్ కాకుండా మిగిలి పోయిన నాలుగు బార్లకు తిరిగి లైసెన్స్ జారీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 26లోపు ఆన్లైన్లో tgbcl. telangana.gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేదా సమీప ఎకై ్స జ్ స్టేషన్లో దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చునని సూచించారు. ఈనెల 29న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి బార్లను కేటాయించనున్నట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. నగరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ ఓనర్లు, డ్రైవర్లు ఇక్కడ తమ వాహనాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చని సూచించారు. రైల్వే అధికారుల అనుమతితో ఇండో ఫాస్ట్ ఎనర్జీ కంపెనీ వారు ఈ స్వాప్ పాయింట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ప్రహరీ వద్ద భద్రపర్చినట్లు తెలిపారు. త్వరలో కాజీపేట జంక్షన్లో అధికారికంగా ప్రారంభించి వాహనదారులకు ఈచార్జింగ్ పాయింట్ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రతికూల వాతావరణంలోనూ పునరుద్ధరించాలి
హన్మకొండ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే త్వరితగతిన పునరుద్ధరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈసమావేశంలో సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. పోల్ నంబరింగ్, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఫీడ్ బ్యాక్ సెల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, అశోక్, బీకం సింగ్, వెంకట రమణ, జీఎంలు అన్నపూర్ణ, నాగప్రసాద్, సురేందర్, శ్రీనివాస్, వేణు బాబు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కడవెండి గ్రామంలో గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ.గణేశ్, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్కుమార్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసనాల శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు రామస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యామ్, ఎన్జీఓ నాయకులు మండల పరశురాములు, వివిధ కుల సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంచాలి విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచాలని, సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి కోరారు. జిల్లాలో గతేడాది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు అభ్యసనాభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలన్నారు. విద్యార్థులను పాఠశాలలపైపు ఆకర్శించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ సెల్ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె.రమేశ్బాబు, హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ, రిసోర్స్పర్సన్లు మల్లారెడ్డి, మనోహర్నాయక్, తాడూరి శ్రీనివాస్, సంపత్కుమార్, రవికుమార్, వాసుదేవరావు, బాలమురళీకృష్ణ, గ్రేసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టన్నెల్ లీకేజీల గుర్తింపునకు ట్రయల్ రన్
ధర్మసాగర్: దేవాదుల పథకంలో భాగంగా చేపట్టిన 3వ ప్యాకేజీ ద్వారా హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గత నెల 27న పంపింగ్ ప్రారంభించగా నాలుగు రోజుల క్రితం టన్నెల్ లీకైన విషయం తెలిసిందే. పంపులు బంద్ చేసి డీ వాటరింగ్ చేసి చూడగా ఎక్కడా లీకేజీ కనిపించలేదు. దీంతో గురువారం మళ్లీ పంప్లు ట్రయల్ రన్ చేయగా.. సీపేజీ ద్వారా అక్కడక్కడా చిన్న చిన్న లీకేజీలు కనిపిస్తున్నాయే తప్ప ఎక్కడా పెద్ద లీకేజీ ఉన్నట్టు గుర్తించలేదు. ఇంతకుముందు లీకేజీ అయిన వద్ద నుంచి కాకుండా రిజర్వాయర్లోకి పంపింగ్ జరుగుతున్న దగ్గర డీ వాటరింగ్ చేసి టన్నెల్లోకి దిగి చూస్తే తప్ప లీకేజీని గుర్తించలేమని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ డీ వాటరింగ్ పూర్తి చేసి శుక్రవారం టన్నెల్లోకి దిగే పనులు ప్రారంభించారు. -
ఫాలో అప్ సేవలందించాలి
కమలాపూర్: ప్రసవం అనంతరం తల్లులకు ఏడాది పాటు ఫాలో అప్ సేవలందించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి వంగపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి గుండేడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి అందిస్తున్న సేవలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. వంగపల్లిలో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని పరిశీలించారు. వంగపల్లిలో ఒకరు, మర్రిపల్లిగూడెంలో ఇద్దరు, గుండేడులో ఒకరు ఇటీవల ప్రసవించగా.. వారి ఇళ్లకు వెళ్లి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, వైద్యులు సంయుక్త, హెల్త్ సూపర్వైజర్లు వెంకటరమణారెడ్డి, థామస్, అమృత, సిబ్బంది సరోజ, ప్రేమలత, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
ఏనుమాముల మార్కెట్ను సందర్శించిన కలెక్టర్
ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం సందర్శించి మిర్చి లావాదేవీలను పరిశీలించారు. మిర్చి సాగు విస్తీర్ణం, దిగుబడి, ధరల గురించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిర్చిని శుభ్రపరిచి, ఎండబెట్టి, గ్రేడింగ్ చేస్తే మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. జియో ట్యాగ్ సర్టిఫికెట్ పొందిన చపాట మిర్చి గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. పేటెంట్తో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అనంతరం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్చి యార్డు ప్రాంగణంలో నిర్వహిస్తున్న రూ.5 సబ్సిడీ భోజన కేంద్రాన్ని సందర్శించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని మెప్మా పీడీ రేణుకకు సూచించారు. మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను సమర్పించాలని అధికా రులను ఆదేశించారు. వరంగల్ డీఎంఓ సురేఖ, కార్యదర్శి జి.రెడ్డి, ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు శిక్షణ
వరంగల్: జిల్లాలో పదోన్నతి పొందిన పీజీ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం గురువారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్తేజ మాట్లాడుతూ ప్రతి ప్రధానోపాధ్యాయుడు నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని పాఠశాలల అవసరాలకు తగిన విధంగా విజన్, మిషన్ రూపొందించుకోవాలని సూచించారు. తరగతి గదిలో బోధనాభ్యాసన ప్రక్రియలు సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలతోపాటు అభ్యసన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదాబాయి, రిసోర్స్ పర్సన్లు ఎస్. రవీందర్, జిల్లా సైన్న్స్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, కమలాకర్, టి.రమేశ్, ఆనందరావు, సీహెచ్.శ్రీనివాస్, గౌస్పాషా పాల్గొన్నారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘సహకార’ బలోపేతానికి కృషిపీఏసీఎస్ల బలోపేతానికి అధ్యక్షులు, సీఈఓలు కృషి చేయాలని టీజీ కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు.– 8లోuనల్లబెల్లి: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు పంపిణీ చేస్తోంది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన వారికి మరింత పెంచి అందిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి లక్ష్యానికి అనుగుణంగా సభ్యులకు రుణాలు అందేలా క్రమం తప్పకుండా సమీక్ష చేస్తూ, సభ్యుల వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నారు. రుణాల పంపిణీ, వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మహిళలకు రుణాలు అందిస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు సీ్త్రనిధి రుణాలు లక్ష్యానికి మించి అందించారు. అంతేకాదు అందించిన రుణాల వసూళ్లు కూడా లక్ష్యానికి అనుగుణంగా ఉండడం విశేషం. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.558.21 కోట్ల రుణాలు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. 2,227 స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు లక్ష్యాన్ని మించి రూ.584.23 కోట్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా ఉంది. కాగా, హైదరాబాద్లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.. డీఆర్డీఓ కౌసల్యాదేవికి అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వ్యాపారాభివృద్ధికి రుణాలు.. రుణాలు తీసుకున్న సభ్యులు తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లింపులు, పొదుపు చేసేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. తీసుకున్న రుణాలను తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. రుణాలను నెలవారీగా చెల్లించడంతో వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దీంతో పలువురు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. తమతో పాటు మరికొందరికీ ఉపాధి చూపుతున్నారు. సభ్యుల వ్యాపార అవసరాలకు రుణాలు కావాలని ముందుకు వస్తే అర్హులను గుర్తించి రుణాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.న్యూస్రీల్రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన అధికారులు టార్గెట్ రూ.558.21 కోట్లు.. అందించింది రూ.584.23 కోట్లు లక్ష్యానికి మించి పొదుపు సంఘాలకు రుణాల పంపిణీ డీఆర్డీఓ కౌసల్యాదేవికి అవార్డు ప్రదానం చేసిన మంత్రి సీతక్క మండలాల వారీగా పంపిణీ చేసిన రుణాల వివరాలు (రూ.లక్షల్లో) మండలం రుణాల పంపిణీ గ్రామైక్య ఎన్హెచ్జీలు సభ్యులు లక్ష్యం సంఘాలు చెన్నారావుపేట 582.24 594.46 20 222 614 దుగ్గొండి 360.92 232.97 12 82 233 గీసుకొండ 523.6 694.87 26 270 736 ఖానాపురం 461.83 662.72 18 238 716 నల్లబెల్లి 542.52 342.22 24 168 353 నర్సంపేట 645.19 839.46 26 340 876 నెక్కొండ 570.64 877.13 26 338 1,046 పర్వతగిరి 385.67 268.57 14 100 310 రాయపర్తి 473.17 355.42 17 124 377 సంగెం 556.37 507.32 19 185 541 వర్ధన్నపేట 480.04 467.19 17 160 498 మొత్తం 5,582.19 5,842.33 219 2,227 6,300 -
సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి
గీసుకొండ: రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.మాధవి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లాస్థాయి పదాధికారుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. అన్ని వర్గాల సమస్యలపై పోరాటం కోసం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కోరారు. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, 11న మహాత్మా జ్యోతిరావుపూలే, 14న భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్వచ్ఛతా కార్యక్రమాలు, మండల, డివిజన్స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీశ్, రత్నం సతీశ్, వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామచందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, పోలెపాక మార్టిన్లూథర్, బైరి నాగరాజు, భరత్వీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.మాధవి -
సన్న బియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈ నెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్దిదారులు ఉదయం నుంచే రేషన్షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంటల నుంచే రేషన్షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభ వేడుకలు లబ్ధిదారులు బారులు.. రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్లో 32.61 లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణసన్న బియ్యం కోటా పెంచాలి రేషన్ దుకాణం నుంచి తెచ్చిన సన్న బియ్యంతో మా ఇంట్లో వండిన అన్నం బాగుంది. దొడ్డు బియ్యంతో వండితే ఇష్టంగా తినేవారం కాదు. ప్రస్తుతం కేటాయిస్తున్నవి సరిపోవడం లేదు. కోటా పెంచితే బాగుంటుంది. ఈ పథకాన్ని నిరంతరం కొనసాగించాలి. సన్న బియ్యంలో నాణ్యత లోపించకుండా చూడాలి. – మచ్చిక రాజు, బొల్లికుంట, ఖిలా వరంగల్ మండలం -
సభ్యుల ఆర్థిక బలోపేతానికి కృషి..
రెండేళ్లుగా సీ్త్రనిధి రుణాల పంపిణీలో ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేశాం. క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు డీపీఎం, ఏపీఎం, సీసీలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాం. లక్ష్యాన్ని పూర్తిచేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి సీ్త్రనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకువెళ్లాం. దీంతో ప్రభుత్వం అవార్డు అందించి సత్కరించింది. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సభ్యుల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తాం. – కౌసల్యాదేవి, డీఆర్డీఓ -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
వరంగల్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ తహసీల్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని, ఆన్లైన్లో సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యాలయ సమీపంలో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అధిక రుసుము వసూలు చేస్తున్నాడని కలెక్టర్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. నేరుగా కలెక్టర్ నిర్వాహకుడితో మాట్లాడి ఎక్కువ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈవీఎం గోదాముల పరిశీలన.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ డాక్టర్ సత్యశారద అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో తహసీల్దార్ ఇక్బాల్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు ఉన్నారు. కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్యకు నివాళి తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద, అధికారులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ యువ వికాసంపై అవగాహనరాజీవ్ యువ వికాసం పథకంపై జిల్లాలోని అధికారులు, బ్యాంకర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యశారద గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.4,891 కోట్లకు డిసెంబర్ వరకు రూ.4,144 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ.414 కోట్ల నాన్ పర్ఫార్మెన్స్ రుణాలను రికవరీ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. 557 మంది విద్యార్థులకు రూ.41 కోట్ల విద్యారుణాలు, 22,026 యూనిట్లకు రూ.193 కోట్ల ముద్రరుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
జీఐ ట్యాగ్తో అధిక ధరకు అవకాశం..
వరంగల్ చపాట మిరపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగలిగినందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ. 300 ఉన్నది. జీఐ ట్యాగ్ వల్ల అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా కిలోకు రూ.450 నుంచి 500 వరకు ధర లభించనుంది. అధిక ధర పలికితే రైతుకు లాభం వస్తుంది. తిమ్మంపేట గ్రామం జాతీయస్థాయిలో ఉనికిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. – నరహరి రాజ్కుమార్రెడ్డి, తిమ్మంపేట ఎఫ్పీఓ అధ్యక్షుడు -
తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్
సాక్షి, వరంగల్/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 సంవత్సరాల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందనుంది. 2024 నవంబర్లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్ పేటెంట్ సంస్థ జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ సర్టిఫికెట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధనస్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్ లభించింది. వరంగల్ చపాట మిరపలో రంగు ఎక్కువగా, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయస్థాయిలో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్ లభించింది. ఈ పంట ఉత్పత్తిపై ముద్రించిన జీఐ ట్యాగ్ను స్కాన్ చేయడం వల్ల వినియోగదారులకు ఈ చపాట మిర్చి ప్రత్యేకత తెలుస్తుంది.ఫలించిన తిమ్మంపేట రైతుల కృషి..దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిర్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 10,951 మెట్రిక్ టన్ను లు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు.ఒకప్పుడు నడికూడ నుంచే..ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్న నడికూడ మండలంలోనుంచే ఈ చపాట మిరప సాగు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచే నడికూడ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల రైతులకు విత్తనాలు ఇచ్చా రు. ఇలా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారంలోనూ అప్పటినుంచే సాగు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని పంట పండించే వరంగల్ చపాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ చపాట, టమాట మిరప, సింగిల్ పట్టి, డబుల్ పట్టి పేర్లతో దొడ్డు మిరపను దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో ధర బాగా పలకడం, వరంగల్ జిల్లా వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు చేస్తున్నారు. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలి గింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 10,951 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. -
ఎస్సారెస్పీ కెనాల్లో వ్యక్తి గల్లంతు
వర్ధన్నపేట: బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలు జారి కాల్వలో గల్లంతైన సంఘటన ఇల్లందలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన మునుకుంట్ల సదయ్య బుధవారం మధ్యాహ్నం కుమ్మరిగూడెం సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్లో బట్టలు ఉతుక్కోవడానికి సైకిల్పై వెళ్లాడు. సైకిల్ను బ్రిడ్జిపై నిలిపి చెప్పులు, సంచి అక్కడ వదిలి కాల్వ మెట్ల ద్వారా కిందకు దిగాడు. బట్టలు ఉతుక్కుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి కాల్వలో కొట్టుకుపోతుండగా ఇల్లంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూసినట్లు తెలిసింది. వారు వెంటనే గ్రామస్తులకు తెలుపగా బ్రిడ్జిపైన నిలిపిన సైకిల్, చెప్పులు, సంచి, సంచిలో ఉన్న సెల్ఫోన్ను చూసి అవి మునుకుంట్ల సదయ్యకు చెందినవిగా గుర్తించారు. -
7 నుంచి టెన్త్ స్పాట్
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షలు ముగిశాయి. గత నెల 21 నుంచి ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. బుధవారం సోషల్ స్టడీస్ పరీక్షతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోనే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు నిర్వహించనున్నారు. కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్ను టెన్త్ స్పాట్ కేంద్రంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ సబ్జెక్టుల పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ జరుగనుంది. సీనియార్టీ ప్రకారం ఎస్ఏలకు విధులు ఉమ్మడివ వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని టెన్త్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లలో సీనియార్టీ కలిగిన స్కూల్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా( ఏఈ), చీఫ్ ఎగ్జామినర్లుగా (సీఈ) నియమించారు. హనుమకొండ డీఈఓ డి.వాసంతి క్యాంపు ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. మిగతా జిల్లాల నుంచి వివిధ సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లను వివరాలను తెప్పించుకుని సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. ఏఈలు, సీఈలుగా కలిపి మొత్తంగా 1,064 మంది స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. ఈమేరకు వారికి నియామక ఉత్తర్వులు కూడా పంపుతున్నారు. స్పెషల్ అసిస్టెంట్లుగా 450 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లను కూడా నియమించారు. ఈనెల 7న ఉదయం రిపోర్టు చేయాలి కాజీపేటలోని టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి ఆయా ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్లో తీసుకోవాల్సిన పలు అంశాలను సంబంధిత అధికారులు వారికి తెలియజేస్తారు. అనంతరం టీచర్లు వాల్యుయేషన్ చేస్తారు. రోజుకు 40 జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేస్తారు. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీచర్లు స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొంటారు. జవాబుపత్రాల రాక.. ఉమ్మడి జిల్లా క్యాంపునకు టెన్త్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్కు సంబంధించిన జవాబుపత్రాలు 2.27 లక్షలకు పైగా కేటాయించారు. కొనసాగుతున్న కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ టెన్త్ పరీక్షల జవాబు పత్రాలకు కాజీపేట ఫాతిమా హైస్కూల్లో కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇద్దరు కోడింగ్ ఆఫీ సర్లు ఇద్దరు పీజీహెచ్ఎంలుగా వ్యవహరిస్తుండగా.. మరో 8 మంది పీజీహెచ్ఎంలు అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లుగా విధులను నిర్వర్తిస్తున్నారు. 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ 2.27 లక్షలకుపైగా జవాబు పత్రాలు ఏఈలు, సీఈలు కలిపి 1,064 మంది స్పెషల్ అసిస్టెంట్లు 450 మంది కొనసాగుతున్న కోడింగ్, డీకోడింగ్ ఉమ్మడి జిల్లాకు కలిపి ఒకే క్యాంపు -
పులి చెరువులో అరుదైన చేపలు
ఐనవోలు: మండల కేంద్రంలోని పులి చెరువులో బుధవారం ముదిరాజ్ల వలకు అరుదైన చేపలు చిక్కాయి. కాగా.. ముదిరాజ్లు, పలువురు బాటసారులు, గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనై ఆసక్తిగా తిలకించారు. ఈ చేపలు 180 గ్రాముల నుంచి 235 గ్రాముల మధ్యలో ఉన్నట్లు సుమారు 20 చేపలు వలలో పడ్డట్లు స్థానిక ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షుడు సంపత్ తెలిపారు. ఈ చేప చర్మంపై మచ్చలు, జీబ్రా మాదిరిగా తెలుపు, నలుపు చారలతో పాటు కొమ్ములు ఉండగా.. పొడవాటి రె క్కలు, వెన్నెముక, తోక ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ చేప శాసీ్త్రయ నామం సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అని, స్థానికంగా దెయ్యం చేప అని పిలుస్తారని తెలిపారు. ఇలాంటి చేపలు ఎక్కువ నీళ్లు ఉండే చెరువుల్లో, కాలువల్లో అరుదుగా ఉంటాయని చెప్పారు. ఈచేప తక్కువ కాలంలోనే పదుల రెట్లు తన సంతానాన్ని వృద్ధి చేస్తుందన్నారు. -
నాన్నే నాకు రోల్ మోడల్..
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన మహ్మద్ విలాయత్ అలీ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జోనల్ స్థాయి బీసీ–ఇ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి నిరుపేద యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ప్రోత్సాహంతోనే గ్రూప్స్లో మంచి ర్యాంకు సాధించాను. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నాం. అనేక కష్టాల్ని అనుభవించాం. అమ్మ షమీమ్– నాన్న మహబూబ్ అలీ. మేం ఐదుగురం. ఇద్దరు అక్కలు. ఇద్దరు చెళ్లెళ్లు. నాన్నకు కుటుంబ పోషణ భారంగానే ఉండేది. నాన్న కష్టాన్ని ఎలాగైనా తీర్చాలనే పట్టుదలతో బాగా చదివాను. మామునూరు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో పలు సందర్భాల్లో కలెక్టర్ వచ్చారు. అక్కడే ఇన్స్పైర్ అయ్యాను. కలెక్టర్ అయితే పేద ప్రజలకు సమాజ సేవ చేయడంతో పాటు నాన్న కష్టం తీరుతుందని భావించాను. 2021లో బీటెక్ పూర్తి చేశాను. కుటుంబ ఆర్థిక సమస్యలు ఉండడంతో బీటెక్ పూర్తి కాగానే టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో జాబ్ మానేసి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేరై తొలి ప్రయత్నంలోనే 86వ ర్యాంకు సాధించాను. కలెక్టర్ కావాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో బీటెక్ చదవుతున్నప్పటి నుంచే సమాంతరంగా ఐఏఎస్కు కావాల్సిన మెటీరియల్ స్వతహాగా రాసుకుని ప్రిపేర్ చేసుకున్నా. కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్, ఐపీఎస్లు అయిన ఎంతో మంది ఇంటర్వ్యూలను ఓపిగ్గా గంటల తరబడి వీక్షించేవాడిని. వారు అనుసరించిన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అలాగే కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాను. 86వ ర్యాంకు రావడం జోనల్ స్థాయిలో బీసీ–ఈ కమ్యూనిటీ కేటగిరీలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ర్యాంకును బట్టి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నాన్న కష్టం నన్ను నా లక్ష్యం వైపు నిలబడేలా చేసింది. నా రోల్ మోడల్ మా నాన్నే అన్ని సగర్వంగా చెప్పగలను. ఒక అక్క, ఇద్దరు చెళ్లెళ్ల పెళ్లి చేసి.. అమ్మ నాన్న సంతోషంగా ఉండేలా చూసుకోవడంప్రస్తుతం నాముందున్న కర్తవ్యం. పేదరికమే.. సమాజ సేవ చేయాలన్న స్ఫూర్తినిచ్చింది కలెక్టర్ కావాలన్నది నా ఆకాంక్ష ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్స్ ర్యాంకు సాధించవచ్చు గ్రూప్–1లో స్టేట్ 86వ ర్యాంకు సాధించిన మహ్మద్ విలాయత్ అలీ -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10 లక్షల మందికితో బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్చార్జ్ల నియామకం.. కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభ ఏ ర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్విప్ వినయ్భాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్రెడ్డిని ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్, డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటి నుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సేకరించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన ముఖ్య నేతలు -
ఇదీ.. మా బ్రాండ్ !
తిమ్మంపేట చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ జారీసాక్షి, వరంగల్/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 సంవత్సరాల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచూర్యం పొందనుంది. 2024 నవంబర్లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ కేంద్ర కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్ పేటెంట్ సంస్థ జీఐ ట్యాగ్ సర్టిఫికెట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్ లభించింది. వరంగల్ చపాట మిరపలో రంగు ఎక్కువగా ఉండడం, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయ స్థాయిలో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్ లభించింది. ఈపంట ఉత్పత్తిపై ముద్రించిన జీఐ ట్యా గ్ను స్కాన్ చేస్తే వినియోగదారులకు ఈమిర్చి ప్రత్యేకత తెలుస్తుంది. నడికూడ నుంచే ఇతర ప్రాంతాలకు.. ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్న నడికూడ మండలంలో నుంచే ఈ చపాట మిరప సాగు ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచే నడికూడ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల రైతులకు విత్తనాలు ఇచ్చారు. ఇలా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారంలోనూ అప్పటి నుంచే సాగు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తోంది. సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని పంట పండించే వరంగల్ చపాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చరిత్రాత్మకమని రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ చపాట, టమాట మిరప, సింగిల్ పట్టి, డబుల్ పట్టి పేర్లతో దొడ్డు మిరపను దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో ధర బాగా పలకడం, వరంగల్ జిల్లా వాతావరణం అనుకూలంగా ఉండడంతో సాగు చేస్తున్నారు. దుగ్గొండి మండలం తిమ్మంపేటలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం 10,951 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. జీఐ ట్యాగ్తో అధిక ధరకు అవకాశం..వరంగల్ చపాట మిరపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగలిగినందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలోరూ. 300 ఉన్నది. జీఐ ట్యాగ్ వల్ల అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా కిలోకు రూ.450 నుంచి 500 వరకు ధర లభించనుంది. అధిక ధర పలికితే రైతుకు లాభం వస్తుంది. తిమ్మంపేట గ్రామం జాతీయస్థాయిలో ఉనికిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్లో మరింత ముందుకు వెళ్లడానికి సమష్టిగా కృషి చేస్తాం. – నరహరి రాజ్కుమార్రెడ్డి, తిమ్మంపేట ఎఫ్పీఓ అధ్యక్షుడు ఫలించిన తిమ్మంపేట మిరప రైతుల కృషి..దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం 10,951 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. సొంత లోగో, బ్రాండ్తో అమ్ముకునే వీలు అధిక ధర వచ్చే అవకాశముందని రైతుల్లో ఆనందం -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
వరంగల్ అర్బన్: లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) 25 శాతం రాయితీ గడువు ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ కిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. గ్రేటర్ వరంగల్ పరిధిలో 16వేల మంది ఇప్పటికే రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా బల్దియాకు రూ.102 కోట్ల ఆదాయం సమకూరింది. గడువు పొడిగింపుతో మరో 50 వేల మంది రాయితీని వినియోగించుకునే అవకాశాలున్నాయి. వ్యవసాయాధికారుల ఫోన్ నంబర్ల మార్పుహన్మకొండ: హనుమకొండ జిల్లాలోని వ్యవసాయాధికారులు ఇప్పటి వరకు వినియోగించిన ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త ఫోన్ నంబర్లను ప్రభుత్వం కేటాయించినట్లు హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ తెలిపారు. రైతులు కొత్త ఫోన్ నంబర్లలో అధికారులను సంప్రదించాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి బి.రవీందర్ సింగ్ 89777 56346, ఏఓ టెక్నికల్ డి.శ్రీధర్ రెడ్డి, 89777 56348, ఏఓ టెక్నికల్ టి.కమలాకర్ 89777 56349, ఏఓ టెక్నికల్ ఎండీ అఫ్జల్ పాషా 89777 56350, హనుమకొండ ఏడీఈ 89777 44964, భీమదేవరపల్లి ఏఓ 89777 44965, ధర్మసాగర్ ఏఓ 89777 44966, ఎల్కతుర్తి ఏఓ 89777 44967, హనుమకొండ ఏఓ 89777 44968. హసన్పర్తి ఏఓ 89777 44969, ఐనవోలు ఏఓ 89777 44970, కాజీపేట ఏఓ 89777 44971, వేలేరు ఏఓ 89777 44972, హనుమకొండ ఏడీఏ పీఏ 89777 44975, పరకాల ఏడీఏ 89777 44976, ఆత్మకూరు ఏఓ 89777 44977, దామెర ఏఓ 89777 44978, నడికూడ ఏఓ 89777 44979, పరకాల ఏఓ 89777 44980, శాయంపేట ఏఓ 89777 45013, పీఏ టు పరకాల ఏడీఏ 89777 45014 నంబర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ పీహెచ్సీని (డీఎంహెచ్ఓ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రికార్డులు పరిశీలించారు. అలాగే.. పలు మందులకు సంబంధించి స్టాక్ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 1704 మంది బీపీ, 874 మంది షుగర్ పేషెంట్లకు సరైన మందులు అందజేయడంతో పాటు తగిన ఫాలో అప్ సేవలందించాలన్నారు. వ్యాక్సిన్ స్టోరేజీని పరిశీలించారు. ప్రసవాలు ఎక్కువగా జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్సీలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజలకు, ఉపాధి హామీ కూలీలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే జీల్గుల, దండేపల్లి గ్రామాల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలును పరిశీలించారు. దండేపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణాన్ని పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ను త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డాక్టర్ విజేందర్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సంపత్రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు. రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదంధర్మసాగర్: ముప్పారం, దేవునూరు గ్రామాల శివారు ఇనుపరాతి గుట్టల సమీపంలో ఫారెస్ట్ నోటిఫికేషన్లో లేని రైతుల భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులకు సూచించారు. కొంతకా లంగా ముప్పారం గ్రామ శివారు సర్వే నంబర్లు 214, 215, 216, దేవునూరు గ్రామ శివా రులోని 403,404 సర్వే నంబర్లలోని సుమారు 25 ఎకరాల భూమి ఆయా గ్రామాల రైతుల పట్టా భూములని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. వాటిని ఫారెస్ట్ అధికారులు తమవేనని చెబుతుతున్నారు. ఈవిషయమై గతంలో జరిగిన వివాదంతో రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫారెస్ట్ నోటిఫికేషన్లో లేని రైతులకు సంబంధించిన పట్టా భూములను రైతులకు హద్దులు ఏర్పాటు చేసి చూపించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో బుధవారం రైతులు జేసీబీలతో ఆ భూమిని చదును చేస్తుండగా మరోసారి రైతులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వివాదం జరిగింది. దీంతో స్థానిక తహసీల్దార్ సదానందం, సీఐ ప్రవీణ్ కుమార్ వారిని సముదాయించారు. రెండు రోజుల్లో ఈ భూములపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ, పోలీస్ వారు సూచించారు. దీంతో రైతులు, ఫారెస్ట్ అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ రజతోత్సవ వేడుకల మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దా స్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మా జీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యా దరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10లక్షలకుపైగా మందితో బహిరంగసభ నిర్వహించా లని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ వేడుకల బహిరంగసభ ఏర్పాట్లపైనే నిమగ్నమైన పార్టీ నాయకులు బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షలమందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జన సమీకరణకు ఇన్చార్జ్లు.. కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈమేరకు కేసీఆర్.. సభా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్ విప్ వినయ్భాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్రెడ్డిని ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్, డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. జన సమీకరణపై ప్రతీ రోజూ దృష్టిపెట్టాలని, మండల, గ్రామస్థాయిల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించాలన్న కేసీఆర్ ఆదేశంతో ఇన్చార్జ్లు ద్వితీయ శ్రేణి, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటి నుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండడంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటి వరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సమీకరించనున్నట్లు వివరించారు. సుమారు 50వేలకుపైగా వాహనాలను పార్కింగ్ చేయడానికి వీలుగా ఏర్పాట్లుంటాయని, మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా 1,500 మంది వలంటీర్లను నియమించి శిక్షణ ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భూమి పూజకు తరలివచ్చిన నేతలు.. భూమి పూజలో ముఖ్యనేతలతోపాటు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీశ్రెడ్డి, భరత్ కుమార్రెడ్డి, చింతం సదానందం, వొడితల ఇంద్రనీల్, బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, నరెడ్ల శ్రీధర్, కొండపాక రఘు, రాకేశ్రెడ్డి, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, రామ్మూర్తి, చింతల యాదగిరి, తంగెడ నగేశ్, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామితోపాటు ఎల్కతుర్తి నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలం ఇదే..బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ ఉమ్మడి వరంగల్ నేతలకు టార్గెట్.. జన సమీకరణకు ఇన్చార్జ్లుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన ముఖ్య నేతలు నేటి నుంచి సభావేదిక ఏర్పాట్లు.. వరంగల్లోనే హైదరాబాద్ నేతలు రజతోత్సవ సభకు మరో 24 రోజులే... -
లారీ ఓనర్స్ అసోసియేషన్లో గొడవ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ (కొత్త బీట్బజార్) పక్కన ఏర్పాటు చేసుకున్న ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో రెండు వర్గాల మధ్య గొడవ మరింత ముదిరింది. తాజాగా బుధవారం ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన లారీలను ఎరువుల బస్తాలను అన్లోడ్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా ఎత్తుగడ్డ ఎఫ్సీఐ గోదాం ప్రాంతంలో అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన గీసుకొండ ఎస్సై ప్రశాంత్బాబు అక్కడికి చేరుకుని సమస్యలు ఉంటే మామునూరు ఏసీపీ వద్ద మాట్లాడుకోవాలని వారికి నచ్చజెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ క్లియర్ అయినా సాయంత్రం వరకు వైరి వర్గం వారు లారీల్లోని బస్తాలను అన్లోడ్ చేయకుండా అడ్డుకున్నారు. గతంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ను ఏనుమాముల ప్రాంతంలో నిర్వహించేవారు. కొన్ని సంవత్సరాల క్రితం కొత్త బీట్బజార్ పక్కన ఏర్పాటు చేసుకున్నారు. అసోసియేషన్లో ఓ వర్గం వారు చాలా ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, లారీల కిరాయి ద్వారా వచ్చిన రూ.కోటికి పైగా డబ్బు లెక్కలు చూపించడం లేదని, గడిచిన 30 నెలల లావాదేవీల లెక్కలు చెప్పడం లేదని, ఏమైనా అంటే అసోసియేషన్ ఎన్నికల తర్వాత లెక్కలు చూపిస్తామంటూ దాట వేస్తూ బెదిరిస్తున్నారని మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ వర్గం వారు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు వెళితే, మరో వర్గం వారు తమకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లోడ్ లారీలను వెళ్లనీయకుండా అడ్డుకున్న ఓ వర్గం అసోసియేషన్ లెక్కలు చూపించాలంటున్న మరో వర్గం -
24/7 వైద్య సేవలందేలా చూస్తాం
శాయంపేట: ‘మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలందేలా చూస్తాం’ అని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, మెడికల్ ల్యాబ్ను పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ కోసం వచ్చిన మహిళలతో ఆయన మాట్లాడారు. ఉదయం 11:35 గంటల వరకు 32 మంది మహిళలు పరీక్షలు చేసుకున్నట్లు డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ రమాదేవి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతీ మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈసందర్భంగా గర్భిణులకు సూచనలిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందించడానికి ముగ్గురు స్టాఫ్ నర్సులకు, ఒక ఏఎన్ఎంకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల వైద్యాధికారి సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఉన్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్య పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం గులాబీ రంగు గన్నేరు పూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీ రంగు గన్నేరు పూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.వేయిస్తంభాల ఆలయంలో మహా సుదర్శన హోమంహన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరా మనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మహా సుదర్శన హోమం నిర్వహించారు. మంగళవారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. సీతారాములకు ప్రత్యేక పూజలు జరిపా రు. అనంతరం యాగశాలలో మహా సుదర్శన హోమం నిర్వహించారు. వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులు, సదాశివుడు, భాగ్యలక్ష్మి దంపతులు హోమ క్రతువుకు ఉభయదాతలుగా వ్యవహరించారు.సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్కుమార్ బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఏసీపీగా పని చేస్తున్న విజయ్కుమార్ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మంలో సైబర్ క్రైమ్ ఏసీపీగా పనిచేస్తున్న ఫణీందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్కు బదిలీపై వస్తున్నారు.కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీకాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంమగ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో సామూహికంగా పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు నవగ్రహాల వద్ద శనిపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తులతో సందడి వాతావరణం కనిపించింది. -
‘సన్న బియ్యం’ పేదల ఆత్మగౌరవ పథకం
పరకాల/దామెర/నడికూడ/ఆత్మకూరు: సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాల్లో పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈపథకం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో రూ.6 వేల కోట్లు అదనపు భారం పడుతున్నా.. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎల్లవేళలా పేదల గురించి ఆలోచించే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ సన్నబియ్యంతో భోజనం చేయాలి: మార్నేనిఐనవోలు: తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి పథకాన్ని ప్రారంభించినట్లు టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నియోజకవర్గంలో పథకం ప్రారంభం -
క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..
1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్కౌంటర్తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు. -
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
దేవరుప్పుల: ప్రజా చైతన్యానికి ఊపిరిలూదిన జనగామ జిల్లా కడవెండిలో పుట్టిన గుమ్ముడవెల్లి రేణుక అదే పోరాట పంథాను ఎంచుకుని అడవిబాట పట్టింది. చిన్నతనంలోనే వివాహం, తదితర ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఈనేపథ్యంలో చట్టంపై అవగాహన కోసం న్యాయ విద్యను అభ్యసించింది. ఆమె సోదరుడు ప్రసాద్ అలియాస్ ఉసెండి దండకారణ్యంలో పనిచేసేవాడు. ఈక్రమంలో పోలీసుల అత్యంత నిర్బంధాలను చవిచూసిన తండ్రి సోమయ్య.. కూతురు రేణుకకు యుక్త వయసు రాగానే ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వకుండా ఓ వ్యక్తితో వివాహం చేశారు. దీంతో వారి దాంపత్య జీవితంలో పురుషాధిక్యత వంటి అంశాలతో కలహాలు వచ్చాయి. అనివార్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. యుక్తవయస్సు రాగానే తన ఆలోచనలకు విరుద్ధంగా పితృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు, అజమాయిషీపై ఆమె తీవ్రంగా ఆ లోచించింది. ఈనేపథ్యంలోనే ఓయూలో దూరవిద్యలో డిగ్రీ చేసి చట్టంపై పట్టు కోసం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివింది.ఎల్ఎల్బీ చదువుతున్న క్రమంలోనే..రేణుక లా చదువుతున్న సమయంలో అప్పటికే ఉ ద్యమంలో ఉన్న పద్మక్క, సూర్యం పరిచ య మ య్యారు. దీంతో ఆమె ఆలోచనాత్మక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాసంఘాల్లో భాగస్వామ్యమవుతూ దండకారణ్యం బాట పట్టింది. వరుస ఎన్కౌంటర్లు,నిర్బంధ పరిస్థితుల్లో మావోయిస్టు పా ర్టీ నిర్ణయంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్లో ప్రజాక్షేత్రంలో చోటుచేసుకున్న అనేక కీలక ఘటనలు, ఘ ట్టాలపై విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి పార్టీకి మా ర్గదర్శకాలు చేసింది. అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొంటూనే విప్లవ ప్రజాపోరాటాల చరిత్రను అక్షరీకరించింది. నక్సల్స్ తరఫున ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోటియారో ఫోల్లో, సంఘర్షణ్, భూమ్కల్ సందేశ్, పితురీ వంటి విప్లవ పత్రికలకు సంపాదకత్వం వహించింది. తొలుత భాషాధార(బీడీ) ప్రాంతంలో పని చేసే క్రమంలో బీడీ దమయంతి పేరుతో రచనలు చేసింది. -
ఎండుతున్న మిర్చి పంట
● పరకాల మండలంలో 10 వేల క్వింటాళ్ల దిగుబడి నష్టం పరకాల: మండుతున్న ఎండలు, భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పరకాల మండలంలో మిర్చి పంట ఎండుతోంది. పంటకు సరిగ్గా నీరందకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. పరకాల మండలంలో సుమారు 2 వేల ఎకరాల వరకు మిర్చి సాగు చేశారు. 50 వేల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 40 వేల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో 10 వేల క్వింటాళ్ల దిగుబడి నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్దగా దిగుబడి లేకపోయినప్పటికీ మార్కెట్లో మద్దతు ధర కూడా కరువు కావడంతో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. -
అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
● జిల్లాలో 468 మంది, వరంగల్లో 474 మంది పదోన్నతి ఉపాధ్యాయులు ● ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న రిసోర్స్ పర్సన్లు ● నాయకత్వ లక్షణాల పెంపు, పరిపాలన, అకడమిక్, తదితర అంశాలపై అవగాహన విద్యారణ్యపురి: పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాస్థాయి శిక్షణ ఇచ్చేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 2024 విద్యా సంవత్సరంలో జిల్లాలో భారీగా ఉపాధ్యాయులు పదోన్నతి పొందారు. తెలుగు 88 మంది, హిందీ 94 మంది, ఆంగ్లం 17 మంది, గణితం 33 మంది, భౌతిక శాస్త్రంలో ఏడుగురు, జీవశాస్త్రంలో 46 మంది, సాంఘికశాస్త్రంలో 48 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్లో 56 మంది టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా 46 మంది, గెజిటెడ్ హెచ్ఎంలుగా ముగ్గురు మొత్తం 468 మంది పదోన్నతి పొంది పనిచేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 474మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కేంద్రాలివే.. హనుమకొండ జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో శిక్షణ కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. తెలుగు, హిందీ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆంగ్ల ఉపాధ్యాయులకు హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం టీచర్లకు హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గణితం, భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకు కడిపికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా వారికి శంభునిపేట హైస్కూల్, రంగశాయిపేట హైస్కూల్, కరీమాబాద్ హైస్కూల్లో శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ తెలిపారు. సాయంత్రం 4.30 గంటల వరకు.. టీచర్లకు ఉదయం 9:30 గంటల వరకే కోర్సు డైరెక్టర్లకు రిపోర్ట్ చేయాలి. సాయంత్రం 4–30 గంటల వరకు శిక్షణ ఇస్తారు. టీ, స్నాక్స్తోపాటు మధ్యాహ్న భోజనం ఉంటుంది. జిల్లాలో ఉన్న ముగ్గురు గెజిటెడ్ హెచ్ఎంలు వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న శిక్షణకు హాజరుకావాలి. ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులందరికీ హనుమకొండ జిల్లాలోనే శిక్షణ ఇస్తారు. పలు సబ్జెక్టుల ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లు మాత్రం మిగతా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉర్దూ భాష ఉపాధ్యాయులకు మాత్రం ఈనెల మూడో తేదీన హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీ ఐఆర్డీలో శిక్షణ ఇస్తారు.ఈ అంశాలపై శిక్షణ.. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల ప్ర ధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాల పెంపు, పాఠశాలల నిర్వహణ, పరిపాలన, అకడమిక్, మధ్యాహ్న భోజనం నిర్వహణ తదితర అంశాలపై రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నా రు. పాఠ్యపుస్తకాల వినియోగం, తరగతి గదిలో టీచింగ్, లెర్నింగ్ ప్రాక్టీస్, ఐసీటీ పరికరాలు, అ కడమిక్ స్టాండర్డ్ అభ్యసన సామర్థ్యాలు, వా ర్షిక ప్రణాళిక, పాఠ్యప్రణాళిక, యూనిట్ ప్రణా ళిక తదితరాల గురించి వివరించనున్నారు. -
రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు.