breaking news
Warangal District Latest News
-
రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. ఖాళీలను భర్తీ చేయాలి. – పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు 16 మందికి పదోన్నతులు 3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్ -
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్, వరంగల్స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలివరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ -
అగ్రంపహాడ్ జాతర పనులు వేగిరం చేయాలి
ఆత్మకూరు: అగ్రంపహాడ్ జాతర పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో బుధవారం జాతర పనులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కలెక్టర్ స్నేహశబరీష్తో కలిసి సమీక్షించారు. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీరు, స్నానాలకు సౌకర్యం కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్ అధికారులు జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ అధికారులు జాతర పరిసరాల్లో ఎక్కడా గుడుంబా విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు జాతరలో రోడ్ల వెంట లైటింగ్ ఉండేలా చూడాలని 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండాలన్నారు. అలాగే భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమన్వయంతో విజయవంతం చేయాలి అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేసి దానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ఆర్డీఓ నారాయణ, ఎండోమెంట్ ఏసీ సునీత, ఏసీపీ సతీశ్బాబు, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఈఓ నాగేశ్వర్రావు, పూజారులు సాంబశివరావు, సారంగపాణి, వెంకన్న, సర్పంచ్లు మహేందర్, సాంబయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్రెడ్డి, బోరిగం స్వామి తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు. 2026 కొత్త సంవత్సరం ప్రతీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. హనుమకొండ కలెక్టర్.. హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన సంవత్సరంలోనూ సహకరించాలని కోరారు. మేయర్ శుభాకాంక్షలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) ఎన్.రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవి ఇంతకాలం భూపాలపల్లి డీఆర్ఓగా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. కీసర, నల్లగొండ ప్రాంతాల్లో ఆర్డీఓగా పని చేశారు. హనుమకొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి డీఆర్ఓగా ఉన్న రవిని హనుమకొండకు బదిలీ చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోరిక హరికృష్ణకు కేటాయించారు. కాజీపేట అర్బన్ : మడికొండ పోలీస్స్టేషన్ను బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తనిఖీ చేశారు. పీఎస్లో మూడేళ్ల నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీస్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్, రామ్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. -
కొత్తకొండ ఆలయ హుండీ లెక్కింపు
● ఐదు నెలల ఆదాయం రూ.8,68,742 ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. ఐదు నెలల హుండీ ఆదాయం రూ.8,68,742 వచ్చినట్లు ఆలయ ఈఓ కిషన్రావు తెలిపారు. ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ హనుకొండ డివిజన్ పరిశీలకులు అనిల్, గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేశ్, కార్యక్రమంలో అర్చకులు రాంబాబు, రవిశర్మ, రవీందర్, శ్రీధర్, రాజు, పాలకవర్గ సభ్యులు, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులతో గడపండి
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు జె.విల్సన్, పి.ప్రకాశ్రెడ్డి, ఆర్ఎస్సై కె.ప్రభాకర్, ఏఆర్ఎస్సైలు అబ్దుల్ రఫీక్, యం.రవి ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్ఐ సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, ఉద్యోగ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం -
ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
రాయపర్తి: ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేసిన సంఘటన బంధనపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో శివాజీ విగ్రహం ఆవిష్కరించకుండా ముసుగు కప్పి ఉంది. గమనించిన దుండగులు మంగళవారం రాత్రి విగ్రహానికి నిప్పంటించగా స్వల్పంగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, వివిధ సంఘాల నాయకులు బుధవారం గ్రామానికి చేరుకుని దుండగులను గుర్తించి శిక్షించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు నూనె అనిల్, నాయకులు ఎనగందుల శ్రావణ్, బూరుగు నవీన్, నిమ్మల అనిల్, పెండ్యాల గణేశ్, గోరంట్ల ప్రభాకర్, మంచాల సుమన్, కొంగ అశోక్, కుమారస్వామితోపాటు బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, సర్పంచ్ అక్రినాయక్, నాయకులు కౌడగాని నర్సింగరావు, దీప్లానాయక్, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం పడిగాపులు
నర్సంపేట రూరల్: గ్రామాల్లోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సొసైటీ గోదాముల ఎదుట బారులుదీరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నారావుపేట సొసైటీ గోదాంకు 444 యూరియా బస్తాలు, ఎల్లాయగూడెం గ్రామానికి 444 బస్తాలు, ఉప్పరపల్లి సొసైటీకి 444 బస్తాలు, ఖాదర్పేటకు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం అర్ధరాత్రి నుంచే చలిలో పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం వ్యవసాయ విస్తీర్ణాధికారులు టోకెన్లు అందించి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
మామిడిలో కానరాని పూత
గీసుకొండ: మామిడి తోటలు సాగుచేస్తున్న రైతులకు ప్రస్తుత సీజన్ నిరాశాజనకమనే చెప్పవచ్చు. డిసెంబర్ నెల చివరి నాటికి తోటలు విరగపూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అలాంటిదేం కనిపించడం లేదని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితికి ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, చలి అధికంగా ఉండడమే కారణం అంటున్నారు ఉద్యానశాఖ అధికారులు. ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి వరకు వర్షాలు కురవడంతో మామిడి తోటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. పలు మామిడి చెట్లకు పూతకు బదులు చిగుర్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మామిడి కాయల దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సహజంగా మామిడి తోటల్లో నవంబర్ నుంచి మొదటి దశ, డిసెంబర్లో రెండో దశ పూత వస్తుంది. ఈసారి అధికవర్షాలతోనే పూత రావడం ఆలస్యమైందని తెలుస్తోంది. పూత త్వరగా వచ్చి నిలిస్తే మామిడి కాయలు ఏపుగా ఎదిగి దిగుబడి అధికంగా వస్తుంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సమయంలో కాత చేతికి రాదు. జిల్లా నుంచి ముందుగా వచ్చే మామిడి కాయలు, పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పూత, కాత ఆలస్యంగా వస్తే రైతులకు లాభాలకు బదులు నష్టాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా వచ్చే దిగుబడి సమయానికి కాకుండా నెల ఆలస్యంగా వస్తే వర్షాలు పడి కాయ ల అమ్మకంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని రైతులు అంటున్నారు. అయితే, జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి, ఫిబ్రవరిలో పూత, పిందె దశ వస్తుందని,, మామిడి రైతులు దిగులుపడొద్దని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 1,622 మంది మామిడి రైతులు జిల్లాలో సుమారు 1,622 మంది రైతులు 5,769 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఎ క్కువగా పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో, ఓ మోస్తరుగా చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, ఖిలా వరంగల్, సంగెం మండలాల్లో సాగు చేస్తున్నారు. తోటలకు నీరు పెట్టొద్దు.. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితిలో మామిడి తోటలకు పూత కొంత ఆలస్యంగా వస్తుంది. కొద్ది పాటి పూత వస్తే రైతులు దిగులు చెందొద్దు. మరో నెలలో పూత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో తోటలకు నీరు పెట్టడం, దున్నడం చేయవద్దు. భూ మి బెట్టుగా ఉంటేనే పూత వచ్చే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 శాతం వచ్చిన పూత విచ్చుకుని, పిందె దశలో ఉన్నప్పుడు నీరు పెట్టాలి. పూత రావడానికి 130045 మల్టీకే/పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. –డాక్టర్ ఎం.తిరుపతి, వరంగల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి 10 శాతంలోపే పూతపూసిన తోటలు అధిక వర్షాలు, తీవ్ర చలి ప్రభావమే కారణం ఆలస్యంగా వస్తుందంటున్న ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 5,761 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు -
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలివరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
నల్లబెల్లి: నాగరాజుపల్లిలోని మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్రావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జాతరను సందర్శించి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం జాతరలో చేపడుతున్న విద్యుత్ లైన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీఈ హార్జినాయక్, ఏడీఈ జానకీరామ్, సర్పంచ్లు లలిత, సరోజ, రవి చిన్న, రాజు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్యాల ఉపేందర్రెడ్డి, ఆలయ ప్రధాన పూజా రి దురిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉర్సును వైభవంగా నిర్వహించాలి పర్వతగిరి: అన్నారం షరీఫ్ ఉర్సును వైభవంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉర్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5వ తేదీన గంధం, 6న దీపారాధన, 7న ఖత్మేఖురాన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్రావు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్మహమ్మద్, అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్, గ్రామ అధ్యక్షుడు గొడుగు రమేశ్, యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్, వార్డు సభ్యులు రాజబాబు, రామకృష్ణ, పవన్కల్యాణ్, రవి, మధు, రామ్మూర్తి, అఖిల్, భార్గవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారులకు పతకాలు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. సాగునీటి విడుదల నర్సంపేట రూరల్: మండలంలోని మాదన్నపేట చెరువు పెద్ద కాల్వ నుంచి సాగునీటిని బుధవారం నీటిపారుదల శాఖ ఏఈ నితిన్, రైతులు విడుదల చేశారు. చెరువు కింద యాసంగి తైబందీ ఇటీవల 1,020 ఎకరాలకు ఖరారు చేశారు. వరి నార్లు, నాట్ల కోసం రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మత్స్యకారుల వలలో చిక్కిన కొండచిలువ వర్ధన్నపేట: మండలంలోని కట్య్రాల గ్రామ ఊర చెరువులో మత్స్యకారులకు బుధవారం కొండచిలువ చిక్కింది. చేపల వేట కోసం మత్స్యకారులు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేయగా కొండచిలువ చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామంలోని స్నేక్ క్యాచర్ను పిలిపించి కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. దీంతో వారు ఊపిరి పిల్చుకున్నారు. మధుసూదన్ సదయ్య సుధాకర్ -
వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
గ్రేటర్ వరంగల్లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లుసాక్షి, వరంగల్: నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి ట్యాంకుబండ్ నయా జోష్కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్లో వరంగల్ తేలిపోనుంది. రారమ్మంటున్న కార్యక్ర మాలు.. విభిన్న థీమ్స్తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇలా రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంకు బండ్ వద్ద బిగ్బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్తోపాటు ఆల్కాహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్ల లు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి ఫుల్జోష్.. పంచాయతీ ఎన్నికలతో సందడిగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు డిసెంబర్ థర్డీ ఫస్ట్ వేడుకలు గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలిచిన ఉత్సాహంలో ఉన్న సర్పంచ్లు తమ అనుచరుల కోసం ఇప్పటికే చికెన్, మటన్, మద్యం కొనుగోలు చేశారు. డీజే సిస్టం కూడా సమకూర్చుకుంటున్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనుండడంతో ఆ పదవులు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే తమ బలగం కోసం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ నయాసాల్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
యాప్ నుంచి ఎరువులను బుక్ చేసుకోవాలి
దుగ్గొండి: రైతుల అవసరాల మేరకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ అన్నారు. మండలంలోని తొగర్రాయి గ్రామంలో మంగళవారం ఆయన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని పరిశీలించారు. యూరియా టోకెన్ల పంపిణీ, సరఫరా విధానాన్ని సమీక్షించి మాట్లాడారు. యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాస రమ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యాప్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్పై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. మండలాలకు అవసరమైన యూరియా సరఫరా చేశామని తెలిపారు. ప్రతి రైతు తన ఆరోగ్యదీపిక కార్డులో పంటల వివరాలను నమోదుచేసి యూరియా తీసుకోవాలని సూచించారు. నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్రెడ్డి, గజ్జల నర్సింగం, ఏఓ గాజుల శ్యాం, ఏఈఓ విజయ్నాయక్, ఉపసర్పంచ్ బుస్సాని రాజు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్ -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: పోలీసులు విధుల్లో అలసత్వ వహిస్తే చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి హెచ్చరించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారి నుంచి ఫిర్యాదులను తీసుకుని, కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. నిరంతరరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 ఫోన్ రాగానే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట నెక్కొండ సీఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి, ఏఎస్సై లక్ష్మణ మూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ● ఎల్ఎండీ నుంచి సరఫరాకు నీటిపారుదల శాఖ సన్నద్ధం ● వారబందీ పద్ధతి అమలుకు అధికారుల ఏర్పాట్లుసాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి... ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతోంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ -
గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..
గీసుకొండ: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి ప్రతీతి. గీసుకొండ మండల కేంద్రం శివారులో నల్లరాతి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. గీసుకొండ గ్రామంలోని ప్రసిద్ధ వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారిని వేదమంత్రాలు, బాజాభజంత్రీలతో సాయంత్రం ఐదు గంటలకు గుట్టపైకి తోడ్కొని వెళ్లి ఆలయ ప్రవేశం చేయిస్తామని ఆలయ వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్తలు వేదాంత మురళీకృష్ణమాచార్యులు, వెంకట నర్సింహాచార్యులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు ఉంటాయిని, మూడో తేదీన జాతర ప్రారంభమై ఐదో తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. చివరిరోజు సాయంత్రం స్వామివారిని ఊరేగింపుతో గీసుకొండ వేణుగోపాలస్వామి ఆలయ ప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుందని వారు తెలిపారు. భక్తులకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గుట్ట వద్ద రెయిలింగ్, మెట్లు, దిగవన ఆలయ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పలువురు దాతలు ముందుకు వచ్చి చేపట్టారు. ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యం.. గుట్టచుట్టూ సుమారు 70 ఎకరాల ప్రాంతంలో మధ్యశిలా యుగం మొదలుకొని శాతవాహనుల కాలానికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. 2001లో తొలిసారిగా గీసుకొండకు చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు ముత్తినేని రాధాకృష్ణ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మధ్య రాతియుగానికి సంబంధించిన సూక్ష్మరాతి పనిముట్లు, నవీన శిలా యుగానికి సంబంధించిన గొడ్డళ్లు, నూరే రాళ్లు, మట్టి పెంకులు, బృహత్ శిలాయుగపు సమాధులు (మెగాలిథిక్ బరియల్స్) వెలుగుచూశాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన పురావస్తుశాఖ వారు పరిశీలన కోసం నాలుగు ట్రెంచ్లను తవ్వడంతో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి ట్రెంచ్లో బౌద్ధానికి సంబంధించిన స్తూపం బయటపడింది. అందులోనే బోధిసత్వుడి తెల్లని ప్రతిమ బయటపడటంతో జిల్లాలోనే మొదటి బుద్ధిస్ట్ సైట్గా దీన్ని గుర్తించారు. శాతవాహనుల నాణెం కూడా లభించింది. ఈ విషయం గతంలో పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ఇక్కడ లభ్యమైన వస్తువులను వరంగల్ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి, మరింత లోతుగా పరిశోధనలు చేస్తే చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వాహకుల ఏర్పాట్లు జనవరి ఒకటిన సాయంత్రం గుట్టపైకి చేరనున్న స్వామివారు మూడు నుంచి జాతర.. తరలిరానున్న వేలాది మంది భక్తులు గుట్ట దిగువ భాగంలో బయల్పడిన ఎన్నో చారిత్రక ఆధారాలుగుట్టతోనే ‘గీసుకొండకు’ ఆ పేరు సుమారు 400 అడుగుల ఎత్తులో ఉన్న నల్లరాతి గుట్ట ఆధారంగానే సమీపంలో ఏర్పడిన గీసుకొండ గ్రామానికి ఆ పేరు వచ్చి ఉంటుందని అంటున్నారు. ‘గీసు’ అంటే నల్లని అని, నల్లని కొండ కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు. శిలాయుగంలో ఆయుధాలకు పదు ను పెట్టడానికి కొండను గీసే వారని, అందువల్లే ‘గీసుడు–కొండ’ అని పేరు వచ్చిందని.. కాలక్రమేణా గీసుకొండగా మారి ఉంటుందని హైదరాబాద్ పురావస్తుశాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం..జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపైన భక్తులు కూర్చోవడానికి గద్దెలు, కింది భాగంలో చలువ పందిళ్లు వేశాం. దిగువన ఉన్న స్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏనుగుల సాంబరెడ్డి, ఆలయ చైర్మన్ -
వైభవంగా వైకుంఠ ఏకాదశి
జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రజలు మంగళవారం వైభవంగా జరుపుకున్నారు. బ్రహ్మ ముహూర్తంలో భక్తులు వైష్ణవాలయాలను సందర్శించి, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. శ్రీమహా విష్ణువు ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు గనుక ముక్కోటి ఏకాదశి అంటారని అర్చకులు తెలిపారు. – సాక్షి, నెట్వర్క్వరంగల్లో బాలానగర వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న మంత్రి కొండా సురేఖవైష్ణవాలయాల్లో మార్మోగిన గోవింద నామస్మరణ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న భక్తులు -
సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
ఫుడ్సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
నర్సంపేట: నర్సంపేటలో ఫుడ్సేఫ్టీ అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ నరేశ్, నర్సంపేట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో హోటల్స్, బేకరీలు, స్వీట్హౌస్లు, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, బిర్యానీ సెంటర్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్గౌడ్, విజిలెన్స్ కమిటీ మెంబర్స్ నాగెల్లి సారంగం, మైస వసంత, జిల్లా ఎస్సీ, ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా నిల్వలున్యూశాయంపేట: జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అన్ని యూరియా విక్రయ కేంద్రాలు తెరిచి ఉంటాయని, అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టండి..జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. . రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు షురూపర్వతగిరి: మండలంలోని అన్నారం పల్లవి మోడల్ స్కూల్లో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ అల్లందాసు భిక్షపతి, సర్పంచ్ గాడిపల్లి మహేందర్ హాజరై అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్ ఐలయ్యతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లవి పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకాచారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి మాట్లాడుతూ షూటింగ్ బాల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ను అభినందించారు. తహసీల్దార్ వెంకటస్వామి, కల్లెడ పీఏసీఎస్ మాజీ చైర్మన్ మోటపోతుల మనోజ్గౌడ్, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ రమేశ్, స్పోర్ట్స్ హెచ్ఓడీ రాజు, ఏఓ బైరి అశోక్, అకౌంటెంట్ వర్మ, ఉపాధ్యాయులు జయంతి, రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్కుమార్ పాల్గొన్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికపర్వతగిరి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పలువురికి జరిమానా విధించారు. డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి, జిల్లా విజిలెన్స్ అధికారి అలివేలు, ఎంపీడీఓ శంకర్నాయక్, ఎస్టీఎం అజయ్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రమేశ్, ఎస్సారెస్పీ అధికారి గంగరాజు పాల్గొన్నారు. ఇరువర్గాలపై కేసుగీసుకొండ: మండల కేంద్రానికి చెందిన ఇరువర్గాలు గొడవపడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండకు చెందిన మేకల రమేశ్ను అదే గ్రామానికి చెందిన మేకల జీవన్తోపాటు కొందరు దుర్భాషలాడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అలాగే, మేకల జీవన్ తన తల్లి మరియను బైక్పై ఎక్కించుకుని వెళ్తుండగా పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని దౌడు సునీల్, బాబు అడ్డగించారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి దుర్భాషలాడి చంపుతామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
సాక్షి, వరంగల్/వరంగల్ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి బండ్ నయా జోష్కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్లో వరంగల్ తేలిపోనుంది. సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం..సీపీ సన్ప్రీత్ సింగ్ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు. గ్రేటర్ వరంగల్లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లు లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్ -
రారమ్మంటున్న కార్యక్రమాలు..
విభిన్న థీమ్స్తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద బిగ్బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్తోపాటు ఆల్కహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హాప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. -
వార్డుల పునర్విభజనలో అన్యాయం
పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్కు సీతారాంపూర్వాసుల వినతి పరకాల: గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు సీతారాంపూర్లోని మూడు వార్డులు (6, 7, 9) ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యాదవకాలనీ ప్రజలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వార్డులతో సమస్యలు ఉండేవి కాదని, కానీ, పరకాల మున్సిపాలిటీలో విలీనం తర్వాత ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజన చేయడంతో సీతారాంపూర్ అభివృద్ధిలో వెనుకబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉడుత చిరంజీవి, ఉడుత సంపత్, ఇష్టబోయిన తిరుపతి, జాంకాజువ్వ మహేందర్, మహేశ్, నూకల రాజకోమురు, నూనెటి సురేశ్, ఉడుత రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అసమానతలు తొలగించాలి
● అర్చక ఉద్యోగుల కోసం చట్ట సవరణ చేయాలి ● తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఎల్కతుర్తి: దేవాదాయ శాఖలో కొనసాగుతున్న వేతన అసమానతలను వెంటనే తొలగించి, ధూప–దీప నైవేద్య అర్చకులను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూప–దీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా చట్టసవరణ చేసి వారిని దేవాదాయ శాఖలో భాగం చేయాలని కోరారు. మూడు కేటగిరీల దేవాలయాల్లో పని చేస్తూ ఇప్పటికీ రెగ్యులర్ కాకుండా ఉన్న అర్చక ఉద్యోగులు 8 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారి హక్కుల సాధన కోసమే పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 121ఈవోను రద్దు చేసి దేవాలయాల్లో ఐదేళ్లు సేవ పూర్తి చేసిన తాత్కాలిక అర్చకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 2న మడికొండలో నిర్వహించనున్న వరంగల్ ఉమ్మడి జిల్లా అర్చక ఉద్యోగ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అర్చకులు రాంబాబు, శ్రీకాంత్శర్మ, వినయ్, సందీప్, రమేశ్, శరత్చంద్ర, శివకుమార్, శ్రావణ్, సిబ్బంది భిక్షపతి, రాజేందర్, కళ్యాణి, రాజు, కవిత తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాంఅభివృద్ధి.. ఆకట్టుకునేలా! పాకాల.. పచ్చందాలకు నెలవు. ఆహ్లాదకర వాతావరణానికి నిలయం. పక్షుల కిలకిలరావాలు, సరస్సులోని నీటి అలల సవ్వడి, చిలకలగుట్ట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి (అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
మెరుగైన వైద్యసేవలే మా లక్ష్యం
ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. చలికాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు వస్తున్న న్యూమోనియా వంటి వ్యాధులకు పిల్లల విభాగంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది రోస్టర్పై ప్రత్యేక దృష్టి సారించి జనవరి ఒకటో తేదీ నుంచి కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నామని పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య సేవలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో అందుతున్న సేవలు, నెలకొన్న సమస్యలపై సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల సందేహాలకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ప్రశ్న: చలికాలంలో చిన్నపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – మహేందర్, నల్లబెల్లి సూపరింటెండెంట్: చలికాలంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు చలిబారిన పడకుండా స్వెటర్, మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించేలా చూడాలి. అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లకూడదు. చలికాలంలో వచ్చే జలుబు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న: జలుబు, దగ్గుకు ఏ చికిత్స తీసుకోవాలి?– రాజ్యాదవ్, వేలేరు, వీరేందర్, శాయంపేట సూపరింటెండెంట్: సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గువంటి వాటిపై చిన్నపిల్లలు, వృద్ధులు అశ్రద్ధ వహించకూడదు. జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది. తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యుడి సూచనల మేరకు ఔషధాలు వాడాలి. ప్రశ్న: ఎంజీఎంలో మెరుగైన సేవల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? – స్వరూప్రెడ్డి, సుబేదారి సూపరింటెండెంట్: ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాం. వైద్య సిబ్బంది, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది రోస్టర్ల మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. సిబ్బంది అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: గురక, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స అందిస్తారా? – శ్రవణ్, కాశిబుగ్గ సూపరింటెండెంట్: గురక, ఊపిరితిత్తుల సమస్యల చికిత్స కోసం టీవీ ఆస్పత్రిని సంప్రదించాలి. హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ పరిధిలో ప్రత్యేక టీబీ ఆస్పత్రి ఉంది. ఇలాంటి వ్యాధులకు కావాల్సిన ఎంఆర్ఐ, సీటి స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలో చేస్తాం. ప్రశ్న: కొండనాలుక వాపునకు ఏం చేయాలి? – కుమార్, నల్లబెల్లి సూపరింటెండెంట్: ఎంజీఎంలోని ఈఎన్టీ విభాగంలో ఇలాంటి నొప్పులకు చికిత్స అందిస్తాం. ఆస్పత్రిలో ఓపీ విభాగం సేవలను మెరుగుపర్చాం. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈఎన్టీ వైద్యుల వద్ద చికిత్స పొందవచ్చు. ప్రశ్న: ఈసీజీ సేవలు అందుబాటులో ఉన్నాయి? – శివాజీ, ఖిలా వరంగల్ సూపరింటెండెంట్: ఆస్పత్రిలో సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైన పరికరాలపై దృష్టి సారించాం. వారం రోజుల్లో మరో ఆరు ఈసీజీ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. క్యాజువాలిటీతో పాటు కీలక విభాగాల్లో ఈసీజీ సేవలను అందించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశాం. ప్రశ్న: ఎంజీఎంలో సేవలపై ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా తొలగిస్తారు? – సరిత, కరీమాబాద్ సూపరింటెండెంట్: ఎంజీఎంలో వైద్య సేవలను మెరుగుపరుస్తూ రోగులను సంతృప్తి పరుస్తాం. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. సమస్య తిరిగి పునరావృత్తం కాకుండా శాశ్వత కోణంలో పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నాం. పిల్లలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాం సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. ఇసుక అవసరాల వివరాలతో భూపాలపల్లి కలెక్టర్కు లేఖ రాయాలని పీడీ హౌసింగ్ అధికారిని ఆమె ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక పరిమాణాన్ని ఇంజనీరింగ్ విభాగాల వారీగా తెలియజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్సాగర్, శ్రీనివాస్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. యూరియాపై కలెక్టర్ సమీక్ష ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ 2025 –26లో జిల్లావ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 1,12,345 ఎకరాల్లో సాగువుతున్నాయని తెలిపారు. గత యాసంగి 2024, డిసెంబర్ 28 వరకు 12,543 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగా, ఈసారి 2025, డిసెంబర్ 28వ తేదీ వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటుచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేసేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు ఆగుతూ సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకే కార్పొరేట్ తరహాలో వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు అనుకున్నంత వేగంగా ముందుకుసాగడం లేదు. వరంగల్ నగర ట్రాఫిక్ సమస్యను తీర్చే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం కనబడుతోంది. వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాన్ని చేర్చే వేదికై న వరంగల్ ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులు నింపాదిగా జరుగుతున్నాయి. ఇక వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకోగా, ఏళ్లుగా కలలు కంటున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే మార్చికల్లా ఏఏఐ అధికారులు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే, రూ.వందల కోట్ల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో ఆలస్యం, అండర్ గ్రౌ ండ్ డ్రెయినేజీ పనులు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ‘సూపర్ ఆస్పత్రి’ ఇంకా ఆలస్యమే.. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్లో ప్రారంభమయ్యాయి. 2024లోనే ఇది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా నింపాది పనులతో వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలు (కార్డియాలజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) పెంచి రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునీకరించిన రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. ఈ ఏడాది అక్టోబర్లో పూర్తిస్థాయి హంగులతో అది అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి, శిల్పకళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్ఫాంలతో పాటు గోడలకు ఇరువైపులా కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కళాకృతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. 5 రూపాయలకే సురక్షిత తాగునీరు, ఇంటర్నెట్ కోసం వైఫై.. ఇలా అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు.జిల్లాలో అభివృద్ధి పనుల తీరిది నింపాదిగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో నత్తనడక ఆలస్యంగా ప్రారంభమై తుది దశలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న మామూనూరు విమానాశ్రయ భూసేకరణ అత్యాధునిక వసతులతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహి మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనులు ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా, తాజాగా గోడలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈపాటికే ఈ పనులు పూర్తై అన్ని విభాగాలు ఇక్కడకు రావాల్సి ఉన్నా కొత్త సంవత్సరంలో ఈ కొత్త భవనంలోకి అన్ని తరలనున్నాయి. మూడెకరాల్లో ఐదొంతస్తుల ప్రణాళికతో కుడా పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. నెలలు గడుస్తున్నా ఇంకా ఆరంభ దశలోనే పనులు ఉండడంతో అటువైపుగా వచ్చే ప్రయాణికులకు తాత్కాలిక బస్టాండ్తో తిప్పలు తప్పడం లేదు. అలాగే వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు, భూనిర్వాసితులకు పరిహారం సకాలంలో అందక ఆలస్యమవుతోంది.జెట్స్పీడ్లా ఎయిర్పోర్టు భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. 223 ఎకరాల్లో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి భూనిర్వాసితుల ఖాతాల్లో రూ.220 కోట్లను రెవెన్యూ అధికారులు జమచేశారు. మరో రూ.40 కోట్లు బిల్లులను చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో 15 ఎకరాలుండగా ఆ మేరకు డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే, సాదాబైనామాకు సంబంధించి భూమి ఐదెకరాలు ఉండడంతో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలపై క్షేత్రస్థాయిలో అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే, మరో పదెకరాల పట్టా పాస్బుక్కులు, 12 మంది ఇంటి యజమానుల వివరాలను పరిశీలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. -
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
● ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్రమ పట్టాను రద్దు చేయాలి మా కోడలు మా భూమిని అక్రమంగా పట్టా చేసుకుంది. దాన్ని రద్దు చేయాలి. మా కుమారుడు చనిపోవడంతో ఆయన ఉద్యోగాన్ని అనుభవిస్తూ మా బాగోగులు చూసుకోకుండా మా భూమిని పట్టా చేసుకుంది. – అయిలయ్య దంపతులు, గుండ్రపల్లి, నెక్కొండ -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్లో లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ది ప్రత్యేక స్థానం. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన మహానగరమిది. ఈ జిల్లాలో గడిచిన ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయి.. వస్తున్నాయి. వచ్చినవాటిలో కొన్ని ఆగగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. మరింత ముందడుగు పడి.. పనుల్లో వేగం, పారదర్శకత పెరిగితే 2026లో ఓరుగల్లు తెలంగాణ సిగలో మెరవనుంది. ‘గ్రేటర్’లో పనుల సందడి హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది ఒకేసారి రూ.4,962.47 కోట్లు కేటాయించింది. ఇందులో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (రూ. 4,170 కోట్లు), మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ (రూ. 205 కోట్లు) వంటివి ఉన్నాయి. పద్మాక్షిగుట్ట, ఎన్జీఓస్ కాలనీల్లో లైటింగ్, గ్రీనరీ, డ్రెయినేజీ పనులు ఉన్నాయి, ముఖ్యంగా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి దశల వారీగా సుమారు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. భద్రకాళి ఆలయానికి కొత్తశోభ వచ్చేలా మధురై తరహాలో మాఢవీధుల నిర్మాణం పనులకు డిజైన్ చేశారు. డీపీఆర్ దశలో యూజీడీ వరంగల్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటు కీలక ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,170 కోట్ల నిధులను కేటాయించగా, పనులకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. యూజీడీ పూర్తయితే నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం, వరద నియంత్రణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. దీనికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతుండగా.. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఊసే లేని మెట్రో రైలు... 2025లో ఓరుగల్లు మెట్రోరైలు ఊసే రాలేదు. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ మహానగరంలో మెట్రో నియోరైలు తీసుక రావడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కూడా 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరింది. ఏటా బడ్జెట్ సమయంలో తెరమీదకు వచ్చే ఈ ప్రాజెక్టు పేరు ఈ ఏడాది అసలే లేదు. ఔటర్ రింగ్రోడ్డు త్వరలోనే.... వరంగల్ నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంది. దీనికి రూ. 669 కోట్లను మంజూరు చేశారు. ఔటర్ రింగు రోడ్డు పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. టెక్స్టైల్ పార్కు స్థలంలోనే ఈ శిలాఫలకం కూడా వేశారు. ఆ తర్వాత చాలాకాలం పనులు నిలిచిపోగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై మళ్లీ దృష్టి సారించింది. ఐటీలో అనుకున్నంత లేని ఊపు.. 2016లో ఐటీ పార్కును మడికొండ (రాంపూర్)లో ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. సయాంట్, జెన్ప్యాక్ట్, క్వాడ్రంట్ రిసోర్సెస్తో పాటు సాఫ్ట్పాత్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచ్లను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ సిఫీతో పాటు మరో రెండు.. ఏడాది క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నా.. గతంలో తెరిచిన సంస్థలు తప్ప కొత్తగా వచ్చింది లేదు. హనుమకొండ జిల్లాలో అభివృద్ధి పనులు.. హనుమకొండ జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ, స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. అనేక కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ● ముఖ్యంగా హసన్పర్తి–వరంగల్ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, వరంగల్ ట్రై సిటీ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ● కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ● కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో భూముల వేలం, రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకం, జంక్షన్లు, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ● భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ● దామెర మండలం ఊరుగొండ మీదుగా హనుమకొండ జిల్లాలో ఎన్హెచ్ 163ఎలో 4–లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి.మడికొండలోని ఐటీ హబ్ఇంటర్నల్ రింగ్ రోడ్డుకొనసాగుతున్న వరంగల్ నూతన బస్టాండ్ పనులుఏడాదికాలంలో తడబడుతూ.. పరిగెడుతూ.. ‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ‘స్మార్ట్సిటీ’, ‘అమృత్’తో పనులు సుందరనగరం కోసం పరుగులు.. ‘కుడా’, జీడబ్ల్యూఎంసీ నిధులు డీపీఆర్ దశలో యూజీడీ.. ‘ఔటర్’ పూర్తయితే మహర్దశ పారదర్శకత, పనుల్లో వేగం పెరిగితే 2026లో మరింత పురోగతి -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ, వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
ఇంకా ఆలస్యమే..
సాక్షి, వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఇది పూర్తయితే ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహీ మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ● మూడెకరాల్లో ఐదంతస్తుల ప్రణాళికతో ‘కుడా’ పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ● అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్నపేట: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు. రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి -
చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్రావు, సంపత్రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం -
ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ విజిట్కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్గా అంచనా వేయాలని సూచించారు. మెడికేషన్లో నూతన పోకడలు మెడికేషన్లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు. కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ముగిసిన ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు
రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. -
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు!
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది
● ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి సంగెం: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, తరగతి గదుల్లోనే దేశభవిష్యత్ను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగెం మండలంలోని లోహిత జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన నూకల అంజివర్ధన్రెడ్డి ఆత్మీయ సన్మానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు విధి నిర్వహణను అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అంజివర్ధన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. విధుల్లో ఉన్నప్పుడు చేసిన పనులే గుర్తింపునిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్, యాకూబ్రెడ్డి, సతీష్రెడ్డి, ఉపేందర్రెడ్డి, గాఫార్, విజయ్కుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
వేతన వెతలు
దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి ప్రతిఒక్కరికీ ఆహార కొరత లేకుండా చూడాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో వలసలు తగ్గిపోవడంతో పాటు ప్రతీ కుటుంబం కొంత ఆర్థిక ప్రగతి సాధించింది. జిల్లాలోని 11 గ్రామీణ మండలాలు 325 గ్రామాల్లో 1.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2.37 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో 75 వేల జాబ్కార్డులకు చెందిన 1.26లక్షల మంది పనులు చేస్తున్నారు. వీరికి పని కల్పించడంతో పాటు పనులు చేయించడం, వేతన బిల్లులు అందించడానికి ఉపాధి సిబ్బంది పని చేస్తున్నారు. రూ.1.22కోట్ల బకాయిలు.. జిల్లా వ్యాప్తంగా 172 మంది ఫీల్డు అసిస్టెంట్ట్లు, 11 మంది ఏపీఓలు, 10 మంది ఈసీలు, 36 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 23 మంది సీఓలు పనిచేస్తున్నారు. వీరందరికి గత మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ. 10వేల వేతనం కాగా రూ. 51.60 లక్షలు, ఏపీఓలకు రూ.13.20 లక్షలు, ఈసీలకు రూ. 15 లక్షలు, టీఏలకు రూ.25.92 లక్షలు, సీఓలకు రూ.16.56 లక్షలు ఇలా మొత్తంగా రూ.1.22 కోట్లకుపై వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. చాలీచాలని వేతనమైన వెట్టిచాకిరి చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు అయినా వేతనాలు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు పూట గడవక ఇబ్బందులు జిల్లాలో రూ.1.22 కోట్ల బకాయిలుభవిష్యత్పై ఆశతో పనిచేస్తున్నాం.. గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించాలి. ఇచ్చే వేతనం చాలా తక్కువ అయినా.. భవిష్యత్ బాగుంటుందనే ఆశతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యక్రమమైన తాము పాల్గొని ప్రజల్లోకి చేరవేస్తున్నాం. ప్రభుత్వం వచ్చే సంక్రాంతి పండుగ వరకై న వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. – కేలోతు స్వామిచౌహాన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రతీ నెలా వేతనాలు చెల్లించాలి.. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు అందరూ వచ్చే వేతనంతోనే కుటుంబం గడుస్తుంది. అలాంటిది ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించకపోవడంతో ఇల్లు గడవటం, పిల్లల ఫీజలు చెల్లించలేని పరిస్థితి ఉంది. పలు కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలి. – ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
సింహగర్జన సభను విజయవంతం చేయాలి
నర్సంపేట: ఓసీ సింహగర్జన బహిరంగ సభకు రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెడ్డి సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షుడు కంది గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం, మధిర, బుధరావుపేట, గోపాలపురం, చెన్నారావుపేట, ముదిగొండ గ్రామాల సర్పంచ్లుగా ఎన్నికై న వారిని జైపాల్రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొట్ల వెంకటరమణారెడ్డి, నర్సంపేట అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ పున్నం రవీందర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అండ్రు రాజేంద్రప్రసాద్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్రెడ్డి, ఎర్ర యాకుబ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, మొట్ల లావణ్య, గోగుల శ్రీనివాస్రెడ్డికోమల, కటుకూరి వీరారెడ్డి, పరుపాటి పద్మారఘుపతిరెడ్డి, శ్వేతాచైతన్యరెడ్డి, పొన్నం రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని ఇల్లంద కస్తూర్భాగాంధీ పాఠశాలలో పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వంట కార్మికులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దుగ్గొండి మండలం రూ.1,500, రెండో బహుమతి వర్ధన్నపేట మండలం రూ.1,000, మూడో బహుమతి పర్వతగిరి మండలం రూ.500 బహుమతులు గెలుచుకున్నట్లు డీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని నిత్యం పరిశీలిస్తూ నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో కంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కరుణశ్రీ,, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు -
రేపు వైకుంఠ ఏకాదశి
● వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ● ఊకల్లో శ్రీరంగనాథుడిగా నాగసుబ్రహ్మణ్యుడి దర్శనం గీసుకొండ: జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేవతామూర్తులను ఉత్తర ద్వార దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గీసుకొండ మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి మేనల్లుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. ఉత్తర ద్వార దర్శనంతో సర్వపాపాలు తొలుగుతాయన్నారు. గర్భాలయంలో శేషపాన్పు (సర్పం)పై పడుకుని నిద్రిస్తున్నట్లు భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. దీనికి సంబంధించిన విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవాలన్నారు. -
తగ్గిన దిగుబడి.. దక్కని మద్దతు ధర
ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 25వ మండల పూజ ముగింపు వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ఇరుకు కోటేశ్వర్రావు, సాగర్, బండారుపల్లి చెంచారావు, రాజేంద్ర, త్రివేణి, నాగేశ్వర్, కుసుమ కుమారి పాల్గొనగా బ్రహ్మశ్రీ శ్రీమాన్ కె.పద్మనాభనమోద్రి కేరళ వాస్తవ్యులు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధార స్వాములు, భక్తులు పాల్గొనగా పదునెట్టాంబడిపై మాలధార స్వాములు ఇరుముడితో దర్శనం చేసుకోగా దివ్య పడిపూజ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, దొడ్డ రవీందర్, అర్చకులు, స్వాములు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిన్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి సబ్ స్టేషన్లో 33/11కేవీలో విద్యుత్ మరమ్మతు కారణంగా నేడు (సోమవారం) ఉదయం 9 నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఈ శ్రీధర్, చెన్నారావుపేట ఏఈ సంపత్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల ప్రజలు సహకరించాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికఖానాపురం: మండలంలోని సైనిక్స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్లోని జమాల్పూర్లో ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 ఖోఖో పోటీల్లో సైనిక్స్కూల్ విద్యార్థి చందు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపిౖకైనట్లు తెలిపా రు. అలాగే ఇటీవల ములుగులో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ కరాటే పోటీల్లో అండర్–19 విభా గంలో రామ్ చరణ్ ప్రథమ బహుమతి సాధించి జాతీయస్థాయిలకు ఎంపికయ్యారన్నారు. డై రెక్టర్ దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు బట్టల షాపు దగ్ధంనర్సంపేట రూరల్: ప్రమాదవశాత్తు అగ్ని ప్ర మాదం చోటు చేసుకుని బట్టల షాపు దగ్ధమైన సంఘటన చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఆదివారం చోటుచేసుకుంది. బూ ర్ణం స్వర్ణలత టైలర్షాపుతోపాటు బట్టల షాపు నడిపిస్తుంది. ఆదివారం ఉదయం షాపులో దే వుడి వద్ద దీపం వెలిగించి పని నిమిత్తం బయటకు వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రభు త్వం ఆదుకోవాలనిబాధితురాలు కోరుతుంది. -
జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో నేడు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసింగి–2025–26లో సాగు చేయనున్న పంట వివరాలను నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీనంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్తో పాటు ఆధార్, పట్టాదారు పాస్బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఎరువుల కోసం తండ్లాట!
సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. -
వరంగల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తల్లులకు తనివితీరా మొక్కులు మేడారం సమ్మక్క, సారలమ్మలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా రైతులు 2025లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దుగ్గొండి మండలం నాచినపల్లిలో మోంథా తుపాను ప్రభావంతో మొలకలు వచ్చిన దూదిపింజలు (ఫైల్) ఖానాపురం మండలం రంగాపురంలో నేలవాలిన వరి (ఫైల్) తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 9704458273 -
నియంత్రణలో నేరాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలకు ఇబ్బంది కలిగించే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు, ఇది మనం రక్షించడానికి ప్రమాణం చేసిన సమాజంలో సమష్టి ధృఢ సంకల్పం, భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు ఉన్నాయని తెలిపారు. నేరాల అదుపు, కేసుల పరిశోధనలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలలోని పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని నూతన విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక – 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాబోవు 2026 నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారం నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడి వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక–2025 ఆవిష్కరణ -
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తాం..
దుగ్గొండి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా చాలాచోట్ల 10లోపు ఓట్ల తేడాతో వెలువడిన ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి, తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఓటమి పాలైన యార మోహన్రెడ్డి, ఓడేటి వనిత తిరుపతిరెడ్డి, అక్కపెల్లి సుజాత, ఆడెపు రాజు, పెండ్లి ఉమాదేవి, కందిపల్లి నవనీతను పరామర్శించి, అధైర్య పడవద్దని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు తమ పార్టీ బలపిర్చన అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల భద్రయ్య, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజుకుమార్, బొబ్బరోనిపల్లి సర్పంచ్ శంకేసి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వర్ధన్నపేట: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ముంపునకు గురవుతున్న మండలంలోని కట్య్రాల గ్రామాన్ని శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఉండి అర్హులైన వారికి, స్థలం లేని కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా కాలనీ వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు కారణమవుతున్న మైనార్టీ కాలనీలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్ను తొలగించి, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేయాలిసంగెం / గీసుకొండ: ఉపాధి హామీ పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి ఆదేశించారు. సంగెం, గీసుకొండ మండలాల్లో పశువుల పాక, నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు, నర్సరీలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలకు అవసరమైన మట్టి, విత్తనాలను తెప్పించుకుని ఆయా గ్రామాల్లో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో వీఓఏగా పనిచేస్తూ రాజీనామా చేసి కుంటపల్లి సర్పంచ్గా గెలుపొందిన పెంతల సువర్ణను ఆయన అభినందించారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకుల, ఊకల్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను రాంరెడ్డి పరిశీలించారు. నర్సరీల్లోని బ్యాగులను ఎర్రమట్టితో నింపి విత్తనాలు పెట్టాలన్నారు. అనంతరం గ్రామాల్లో ఔషధ, నీడనిచ్చే, పూల మొక్కలను నాటాలని సూచించారు. పశువుల షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు పేర్ల లలిత, సువర్ణ, వజ్ర రాజు, కక్కెర్ల సుభాష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓలు గణేష్, చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, వాజీద్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలుకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్కప్ క్రికెట్–2025 (ఈస్ట్జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. -
యూరియా కోసం బారులు
● తోపులాటలో గాయపడిన మహిళ రైతు నెక్కొండ: యాసంగి సాగు చేస్తున్న రైతులు.. యూరియా బస్తాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ రైతు వేదికల్లో యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున, ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రైతులు చేరుకున్నారు. రెడ్లవాడ పీఏసీఎస్కు కేటాయించిన యూరియా బస్తాలు రైతు వేదికకు రావడంతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రెడ్లవాడ శివారు మూడెత్తుల తండాకు చెందిన మహిళ రైతు మూడు విజయ కిందపడిపోగా, ఆమె కాలుకు గాయమైంది. విజయను నెక్కొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమె భర్త సుమన్ తరలించాడు. కాగా, పీఏసీఎస్లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మొక్కజొన్న పంటకు మొదటి, రెండో దఫాల్లో ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో వారికి ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ క్రమంలో ఒకటి, రెండు బస్తాలు మాత్రమే అందించి అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
సరిపడా యూరియా ఉంది
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ నెక్కొండ: సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు యూరియా అందిస్తామని, సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 87,508 ఎకరాలు కాగా, అందుకు సరిపడా యూరియా అక్టోబర్లో 3,776 మెట్రిక్ టన్నులు, నవంబర్లో 2,769 మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 438 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు వివరించారు. ఇంకా 5,400 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్లో అందుబాటులో ఉందన్నారు. ఈనెల 26న జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కేంద్రాలకు 720 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. యాసంగి సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు అవసరం మేర యూరియా వాడుకోవాలని, అవసరానికి మించి యూరియా వినియోగిస్తే భూసారం క్షీణిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ నాగరాజు, ఏఈఓ వసంత, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నర్ రింగ్రోడ్ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్రోడ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్ పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, కుడా పీఓ అజిత్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మద్ది మేడారం జాతరపై సమీక్ష నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర కాలంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధి, ఆలయ పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వైద్యసేవలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు, వాహనాల రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. జాతరలోపు పనులు పూర్తియ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, రోడ్డు భవనాల శాఖాధికారి రాజేందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ప్రధాన పూజారి నాగరాజు, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో రేపు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 97044 58273 -
రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్ఫెయిర్కు సంబంధించిన పోస్టర్ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్రెడ్డి, వై.వెంకటేశ్వర్రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
● టీసీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ● కేయూలో ఈస్ట్ జోన్ గోల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్ షురూకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్కప్ క్రికెట్–2025 (ఈస్ట్జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 20 ఓవర్ల మ్యాచ్గా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీముద్దీన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, బాధ్యులు సామిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విష్ణుదాస్, శశాంక్, మరింగంటి నవరాసన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్లు ఇలా.. హనుమకొండ, ఖమ్మం జిల్లా క్రికెట్ జట్లు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులకు ఆల్ఔట్ కాగా, తదుపరి బ్యాటింగ్ చేసిన హనుమకొండ జట్టు 102 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. ఖమ్మం జట్టు విజయం సాధించింది. అనంతరం మహబూబాబాద్, ములుగు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మహబూబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. జనవరి 1వ తేదీ వరకు ఈక్రికెట్ పోటీలు కొనసాగుతాయి. -
లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే పూర్తి చేయండి
డీఎంహెచ్ఓ అప్పయ్య వేలేరు: లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మల్లికుదుర్ల ఆరోగ్య ఉపకేంద్రం, గుండ్లసాగర్లో నిర్వహిస్తున్న ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాలుగు ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న లెప్రసీ కేసుల డిటెక్షన్ సర్వే వివరాలు, పీహెచ్సీలోని రిజిస్టర్, రికార్డులు, మందులు పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మండలంలో 21,900 మంది జనాభాకు గాను 11 వేల మందికి టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో జనవరి 3లోగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గుండ్లసాగర్లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ ఔట్ రీచ్ సెషన్ను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు పిల్లలందరికీ పోషకాహారం అందించడంలో టీకాలు ఇప్పించడంలో గర్భిణుల సంరక్షణలో కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ నవీన్కుమార్, హెల్త్ సూపర్వైజర్ కుమారస్వామి, ప్రభావతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి మరింతగా ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూబక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ధైర్యం కల్పించాలి
రామన్నపేట: దివ్యాంగుల్లో ధైర్యం నింపడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో ఐఏఎస్ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. భగవాన్ మహావీర్ ట్రస్ట్, హైదాబాద్ వారి సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడమంటే వారు తిరిగి నడిచే ధైర్యం కల్పించడమేనని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇతరుల దయపై ఆధారపడే వ్యక్తులు కారని, వారికి సరైన అవకాశాలు అందితే గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని శిబిరాన్ని సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శిబిరంలో ఉమ్మడి వరంగల్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 150 మందికిపైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇన్చార్జ్ పరికిపండ్ల వేణు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాశ్, లింగమూర్తి, ఎలగం చిన్న కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల పంపిణీ -
నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం ● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం ● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి హన్మకొండ కల్చరల్: కాకతీయుల శిల్పకళ, వారసత్వ సంపదను కాపాడుకోవాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సుదర్శన్రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. సుదర్శన్రెడ్డి దంపతులు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. సూర్య, విష్ణు దేవాలయాల చరిత్ర, నాట్యమండపం, స్తంభాల్లో వెంటుక్ర పట్టేంత రంధ్రాలు, తలకిందుల చాప, మనిషి, అష్ట దిక్పాలకులు, కల్యామండపం విశిష్టతను వారికి వివరించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, సిబ్బంది మధుకర్, రజిత, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ!
వరంగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. నిధులు విడుదలై టెండర్లు నిర్వహించినా పనులు గ్రౌండింగ్ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతగా పనులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.46 కోట్లతో వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ మీదుగా ఎంజీఎం జంక్షన్ వరకు ఐదేళ్ల క్రితం చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు పాలకవర్గం గడువు పూర్తికావొస్తున్నా పూర్తి కాలేదు. ఈరహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించేందుకు భవనాల ఎదుట అధికారులు ఆక్రమణలు తొలగించారు. నేటికి ఫుట్పాత్లు పూర్తి చేయకపోవడంతో పలు షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం డీమార్ట్ ఎదుట ప్రారంభించిన పనులు పూర్తికాలేదు. స్మార్ట్రోడ్డులో భాగంగా రహదారిపై బీటీ లేయర్లు అసంపూర్తిగా వేశారు. అవి స్పీడ్బ్రేకర్లుగా మారడంతో దిచక్రవాహనదారులకు పాట్లు తప్పడం లేదు. ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో భవనాల యజమానులు అడ్డుకోవడంతో రహదారి విస్తరణ పనులు జాప్యమవుతున్నాయి. స్మార్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు గ్రేటర్ వరంగల్ మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులే అడ్డు.. ● కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు అడ్డుగా మారుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలస్వామిగుడి జంక్షన్ సమీపంలోని రోడ్డు విస్తరణకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుపడడం, భవన యజమాని కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారికి ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం వేసిన పైపులతో జలమయంగా మారుతోంది. ● పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి ములుగు రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సైతం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అప్పటి ప్రజాప్రతినిఽధి అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు పనులు అసంపూర్తిగా మారాయి. డ్రెయినేజీతోపాటు వెడల్పు జరిగితే ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉండేది. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకుడు సైతం రోడ్డు వెడల్పునకు జంకుతున్నట్లు సమాచారం. ● కాజీపేట డీజిల్ కాలనీ నుంచి వరంగల్ ములుగురోడ్డు వరకు చేపట్టిన స్మార్ట్సిటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి ములుగురోడ్డు వరకు రహదారి వెంట ఉన్న వ్యాపారులే ఇందుకు కారణమని, ప్రజాప్రతినిధులు సహరించకపోవడంతో పనులు పెండింగ్ పడినట్లు సమాచారం. ● వెంకట్రామ జంక్షన్ నుంచి ములుగురోడ్డు జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తాలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ● పోచమ్మమైదాన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మించిన సీసీ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ స్మార్ట్రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పటి తూర్పు ప్రజాప్రతినిధి వ్యాపారుల కోసం డివైడర్ స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పోయించడంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. అభివృద్ధి పనుల్లో కానరాని నాణ్యతాప్రమాణాలు నిధులు విడుదలైనా గ్రౌండింగ్లో జాప్యం పట్టించుకోని గ్రేటర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు -
గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించా రు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్రెడ్డి, బ త్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘా ల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలా షాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వా రా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూ సం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. -
మరో చాన్స్ ప్లీజ్!
నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు ‘మరో చాన్స్ ప్లీజ్’ అంటూ తమ పార్టీ నేతలను వేడుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వారు ప్రత్యామ్నాయ ప్రయత్నంపై దృష్టి సారించారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి సర్పంచ్గా గెలుపొందాలని ఆశపడి భంగపడ్డ నేతలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఓడిపోయిన వ్యక్తులు తమ బలాబలాలను అంచనా చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపొందే పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. సర్పంచ్గా పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థులే రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తే సానుభూతితో పాటు ఓడిపోయిన స్థానంలోనే గెలుపొందవచ్చని అంచనా వేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలుపొందాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం అన్ని వర్గాల ఓటర్లను మద్దతు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఏఏ వర్గాలు, సంఘాల సభ్యులు ఓట్లు వేశాయి, ఎవరు ఓట్లు వేయలేదు, ఎక్కడ లెక్క తప్పిందనే అంచనాలను వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చని అంచనా వేసుకుంటూ తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలకు చెందిన అధినేతల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీటుపైఆశావహుల గురి సర్పంచ్గా ఓటమి పాలైన అభ్యర్థుల ముమ్మర ప్రయత్నాలు సానుభూతి కలిసి వస్తుందని ముందడుగు జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలుసానుభూతి కలిసివస్తుందని.. జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలు, 11 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం రెండు నెలల నుంచి సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేశారు. అయినప్పటికీ ఓటమి పాలైన వ్యక్తులు మండల స్థాయిలో రాజకీయ పలుకుబడితో గెలిచే అవకాశం ఉన్న వారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అందులో ఎలాగైన గెలుపొందాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు కసరత్తు మొదలపెట్టారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
యువత చూపు.. ఎర్రజెండా వైపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఖిలా వరంగల్: పెట్టుబడి దారి వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతో మంది అమరవీరులను అందించిన చరిత్ర సీపీఐ దేనని చెప్పారు. అంతకుముందు బాష్మియాతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, గన్నారపు రమేష్, బద్రి, రమేష్, చంద్రకళ, రవీందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు. హనుమకొండలో..న్యూశాయంపేట: సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఎల్లేష్, రాములు, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. -
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కాజీపేట: స్థానిక యువతకు రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కాజీపేట చౌరస్తాలో భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లేశం, వీరన్న, భిక్షపతి, ప్రదీప్ పాల్గొన్నారు. నేడు కాజీపేటలో రౌండ్టేబుల్ సమావేశం కాజీపేట రైల్వే కమ్యూనిటీహాల్లో శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా పార్టీల డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు తెలిపారు. -
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: జాతర, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. మేడారం జాతర, వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉండాలన్నారు. 2026 జనవరి నుంచి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్స్ యూనివర్సిటీలోఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ హాజరుకానున్నారు. సదస్సులో ‘రోల్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ ఇన్ అగ్రికల్చ ర్ యాక్టివిటీస్ ఆన్ ఎంపిరికల్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై శ్రీధర్కుమార్లోథ్ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 30 వరకు 50వ అఖిల భారత సోషియాలజీ సదస్సు నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట అయిలయ్య సదస్సుకు హాజరుకానున్నారు. ‘మొబిలిటీస్ అండ్ ఇన్ క్వాలిటీస్ షిఫ్టింగ్ కాంటెక్ట్స్ చేంజింగ్ పారాడిగ్మ్స్’ అంశంపై నిర్వహించనున్న ఒక సెషన్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే ‘ఎ స్టడీ ఆన్ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటను శుక్రవారం స్విట్జర్లాండ్ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదను వీక్షించారు. ఆతర్వాత ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. కోటను సందర్శించడం తాము అదృష్టంగా భావిస్తున్నామని విదేశీయులు పేర్కొన్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఉన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పంజాల రమేశ్ అన్నారు. శుక్రవారం సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీ ఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసి 101 సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితే యాకోబు, అక్కపెల్లి రమేశ్, జిల్లా సమితి సబ్యులు మియాపురం గోవర్ధన్, గుంపెల్లి మునీశ్వర్, నాయకులు బాధబోయిన యాదగిరి, సాంబయ్య పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఎంపికై న విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొక్కజొన్న పంట ధ్వంసంసంగెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గాయపు వీరారెడ్డి తన తల్లిదండ్రులు పంచి ఇచ్చిన 2.18 ఎకరాల్లో పట్టా చేయించుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన అన్న కుమారుడు గాయపు రవీందర్రెడ్డి గతేడాది నుంచి పంట వేయనియకుండా అడ్డుకుంటున్నాడని, ఈనెల 25న ట్రాక్టర్తో 20 గుంటల భూమిలోని మొక్కజొన్న పంటను దున్ని ధ్వంసం చేశాడని వీరారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొసలి లభ్యంనర్సంపేట రూరల్: మొసలి లభ్యమైన సంఘటన నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామశివారులోని శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఫారెస్టు రేంజర్ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రైతు సూర్యకు చెందిన వ్యవసాయ భూమిలో మొసలి సంచరిస్తుందని సమాచారం ఫారెస్టు అధికారులకు అందించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకొని పాకాల చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ యోగి, వెంకన్న, బేస్ క్యాంప్ చందు తదితరలు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నెక్కొండ: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సోమయ్య డిమాండ్ చేశారు. పెన్షన్ డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పెన్షన్ భవనంలో శుక్రవారం నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెక్కొండ శాఖ యూనిట్ అధ్యక్షుడు గటిక మల్లయ్య అధ్యక్షతన జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ పెండింగ్ బి ల్లులు, కరువు భత్యం, హెల్త్ కార్డులు అందించాలన్నారు. నకారా చేసిన పోరాటంతోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, సంక్షేమం పథకాలు అందుతున్నాయన్నారు. పెన్షన్దారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఐలయ్య రిటైర్డ్ ఉద్యోగుల కు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో నెక్కొండ యూనిట్ గౌరవ అధ్యక్షుడు ఇనుగాల ఉ పేందర్రెడ్డి, కార్యదర్శి ఎస్ఏ మొహినోద్దీన్, ఆర్థిక కార్యదర్శి కె.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు బి. రత్న య్య, వి. పరమేశ్వరయ్య, పెన్షనర్లు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమయ్య -
వెక్కిరిస్తున్నాయి..
ఎత్తిపోతలను త్వరగా పూర్తిచేయాలి కొనాయమాకుల ఎత్తిపోతల పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. రైతులు ఈ పథకం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అవసరమైన నిధులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. – సిరిసె శ్రీకాంత్, కొనాయమాకుల పిల్లర్ల దశలోనే వదిలేశారు.. గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసింది. కొమ్మాల అంగడిలో దీన్ని పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్ను అడిగితే నిధులు మంజూరు చేయడం లేదన్నారు. మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగటం లేదు. త్వరగా నిధులను మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలి. – ఆంగోతు వీరన్న, హర్జ్యతండా సర్పంచ్ గీసుకొండ: జిల్లాలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. నిర్మాణ దశలో ఉన్న జిల్లా స్థాయి భవనాల నిర్మాణం సైతం మధ్యలోనే ఆగిపోయి దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. వరంగల్ నగరానికి గీసుకొండ మండలం సమీపంలో ఉండటంతో ఇక్కడ పలు జిల్లా భవనాలను నిర్మించడానికి పనులను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత భవనాల నిర్మాణ పనులు పూర్తి కావడంలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొనాయమాకుల ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా.. రైతులకు సాగు నీరు అందించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి నత్తనడకే.. మండలంలోని కొనాయమాకుల వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాల్వ నీటిని పైకెత్తి పోసి రైతుల చేలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారు. 2017లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి ఎందుకో ఏదో ఓ సమస్యతో పనులు పూర్తికావడం లేదు. దీంతో రైతులకు 18 ఏళ్లుగా సాగినీటి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే గీసుకొండ మండలానికి 7,446, దుగ్గొండి 4,509, సంగెం మండలంలో 2,166 ఎకరాల (మొత్తంగా 14వేలు) భూములకు సాగు నీరు అందే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు. అయినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడం లేదని రైతులు నిరాశతో ఉన్నారు. బాలల భవన నిర్మాణం అంతే.. మండలంలోని కొనాయమాకుల గ్రామం వద్ద మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, గత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు రూ. 87.45 లక్షల అంచనా వ్యయంతో బాలల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రులను కోల్పో యి అనాథలుగా మిగిలిని వారికి, బస్టాండు, రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన చిన్నారులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నిధులలేమితో మధ్యలోనే నిలిచిపోయాయి. త్వరగా నిధులు మంజూరు చేయించి ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైన ఉంది. గిరిజన భవన నిర్మాణ పరిస్థితి దారుణం.. మండలంలోని కొమ్మాల అంగడి వద్ద చేపట్టిన గిరిజన భవన నిర్మాణం పనులు తొలి దశలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో గిరిజన భవనాన్ని నియోజకవర్గ స్థాయిలో మంజూరు చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ. 50 లక్షల మేర ఖర్చు చేసి పిల్లర్ల దశ మేరకు నిర్మాణం పనులను చేపట్టారు. బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళితే నియోజకవర్గ కేంద్రంలో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా ఇక్కడెందుకు చేపట్టారని చెప్పడంతో వివాదం నెలకొని పనులు నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తికాని కొనాయమాకుల ఎత్తిపోతల పథకం, జిల్లా బాలల, గిరిజన భవనాల నిర్మాణం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
కాజీపేట: భూనిర్వాసితులతోపాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదం క్రమేణా ఊపందుకుంటోంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శరవేగంగా సాగుతున్న రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు. నియామకాల్లో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లు పోరాట ఫలితంగా రెల్వే కోచ్ అండ్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రైతులు 128 ఎకరాలకు పైగా భూములను ౖఅతి తక్కువ పరిహారంతో రెల్వే శాఖకు అప్పగించారు. భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని భూసేకరణ సమయంలో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఊసే లేకపోవడంతో తెలంగాణ రైల్వే జేఏసీ సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు, జిల్లా నిరుద్యోగులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఏకమవుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్తో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్వాసుల చిరకాల వాంఛను హైదరాబాద్ నుంచి ఢిల్లీస్థాయిలో వినిపించడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని తీర్మానించారు. ఉద్యోగాలు ఇవ్వాలి.. తాత, ముత్తాతల కాలం నుంచి దున్నుకుని బతుకుతున్న భూములను ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాగ్యం చేశాం. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉదృతం చేయాల్సి ఉంటుంది. – గాదె యాదగిరి, బాధితుడు, అయోధ్యపురం ప్రత్యేక జీఓ తీసుకురావాలి.. గతంలో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తాలలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భూనిర్వాసితులకు 38 శాతం, జిల్లాస్థాయిలో నిరుద్యోగ యువతకు 44 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ అదేస్థాయిలో ప్రత్యేక జీఓతో ఉద్యోగాలు ఇవ్వాలి. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే పోరాటాలకు విలువ లేనట్టే.. పోరాటాల ఫలితంగా ఏర్పడిన రైల్వే మ్యాన్ఫాక్చరింగ్ యూనిట్లో స్థానిక యువత, భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో ఎన్నో ఏళ్లు చేసిన పోరాటాలకు విలువ లేనట్లే. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానం ద్వారా ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. – కోండ్ర నర్సింగరావు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులు, భూనిర్వాసితులకు ఉద్యోగవకాశాలు కల్పించాలి రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ రైల్వే జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పోరుబాటు -
ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
మహిళా.. ఏలుకో!
జిల్లాలో 316 పంచాయతీల్లో 158 మంది మహిళా సర్పంచ్లు..సంగెం: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎక్కువ స్థానాల్లో మహిళలు సర్పంచ్లుగా పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో 317 గ్రామ పంచాయతీలు ఉండగా వంజరపల్లి మినహా 316 జీపీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇందుల్లో 158 మంది మహిళలు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం సర్పంచ్లుగా ఎన్నికై న మహిళలకు పాలన కత్తి మీద సాముగా మారనుంది. సంగెం మండలంలో 32 పంచాయతీల్లో 16 మంది మహిళలు సర్పంచ్లుగా, 281 వార్డుల్లో 141 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. గెలిచిన సర్పంచ్లందరూ రాజకీయాలకు కొత్తవారే. పాలనపై పట్టులేకపోవడం, ఇంటిలో భర్త, కొడుకును కాదనలేని పరిస్థితి. వీటన్నింటిని అధిగమించి కుటుంబాన్ని సక్కదిద్దుకుంటూనే గ్రామాన్ని మరో కుటుంబంగా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని మహిళా సర్పంచ్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. పతుల పెత్తనం కుదరదు గ్రామపంచాయతీ పాలనలో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచ్లుగా సతుల విధుల్లో పతులతో పాటుగా కుమారుడు తదితర కుటుంబసభ్యుల జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో మహిళా సర్పంచ్లను వంటింటికే పరిమితం చేస్తూ వారికి బదులుగా భర్తలు, కుమారులు, కుటుంబసభ్యులు సర్పంచ్లుగా పిలువబడుతూ అధికారం చెలాయించడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి మెమో నంబరు–3, 292 పేరిట పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీలకు సైతం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యుల పెత్తనా న్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వుల ను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అ ధికారులు సైతం సతులకు బదులుగా పతులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా భర్తలనే సర్పంచ్లుగా పిలుస్తుండడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి 90 రోజులకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భార్యలకు బదులుగా భర్తలే సంతకాలు చేసి పనులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులతో మార్పు వస్తుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సతులకు బదులు పతుల పెత్తనంపై కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల ముద్ర కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచ్లు పురుషులకు దీటుగా పల్లెపాలన సాగిస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కుటుంబం.. మరోవైపు గ్రామం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిందే.. సతుల స్థానంలో పతుల పెత్తనం కుదరదు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
రిపబ్లిక్డే పరేడ్కు ఎన్సీసీ కేడెట్ల ఎంపిక
విద్యారణ్యపురి: న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న ఆర్డీ (రిపబ్లిక్ డే) పరేడ్కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ కేడెట్స్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. జి.వెంకటలక్ష్మి (బీఎస్సీ ఎంపీసీసీఎస్ ఫైనల్ ఇయర్), బి.త్రిష (బీఎస్సీ బీజెడ్సీ ఫైనల్ ఇయర్), ఎ.భార్గవి (బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం) ఉన్నారు. రిపబ్లిక్డే పరేడ్కు ఎంపికై న వీరు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఎన్సీసీ ఆఫీసర్ సువర్ణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఎన్సీసీ విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కథాశివిర్కు ఓరుగల్లు విద్యార్థులు యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రాష్ట్రీయ కథాశివిర్కు ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి
గీసుకొండ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ కొండపెల్లి శ్రీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం మండలంలోని ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారత రత్న, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు, సర్పంచ్ల సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి, రవికుమార్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అంతకుముందు వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, పుల్లారావు, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, హరిశంకర్, తిరుపతి రెడ్డి, రాణా ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7నగరంలో అంబరాన్నంటిన వేడుకలు ● చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు నగరంలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని చర్చిలకు ఉదయమే క్రైస్తవులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. మతపెద్దలు క్రీస్తు జననం గురించి తెలిపి, క్రీస్తు సందేశం ఇచ్చారు. వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండలోని సీబీసీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు చర్చిలను అందంగా అలంకరించారు. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ, వరంగల్ప్రార్థనల అనంతరం హనుమకొండ సీబీసీ నుంచి బయటికి వస్తున్న క్రైస్తవులు (ఇన్సెట్లో) ప్రసంగిస్తున్న ఫాదర్ నిరంజన్బాబువరంగల్ జాన్పాకలోని మన్న చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు, వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సీబీసీలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ వాపస్
నల్లబెల్లి: మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలం చెల్లించిన మహిళ స్వయం సహా యక సంఘాల(ఎస్హెచ్జీ)కు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 11 మండలాలకు రూ. 6.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మండలాల వారీగా వివరాలు అందించి ఆయా ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. అయితే 2025–2026 సంబంధించిన రుణాలు తీసుకున్న రుణాలు తీసుకున్న సంఘాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం సంఘాలకు తిరిగి చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా 7,540 సంఘాలకు మహిళలకు వడ్డీ డబ్బులను మండలాల వారీగా ఇటీవల పంపిణీ చేశారు. ఈ డబ్బులను సంఘాల ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో అత్యధికంగా సంగెం మండలంలో వడ్డీ రూ.79,52,538 వాపస్ రాగా, అతి తక్కువగా నెక్కొండ మండలంలో రూ.76,958 మాత్రమే వడ్డీ వాపస్ వచ్చింది. వడ్డీను ప్రభుత్వం తిరిగి చెల్లించడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి భరోసా జిల్లాలో 11 మండలాల పరిధిలో 7,540 ఎస్హెచ్జీ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసింది. వీటిని సకాలంలో సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీ రాయితీని వారి ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో ప్రభుత్వం చెల్లించిన వడ్డీ నిధులు, సంఘాల వివరాలుమండలం ఎస్హెచ్జీలు వడ్డీ(రూ.లల్లో..) చెన్నారావుపేట 707 66,12,744 దుగ్గొండి 500 35,34,507 ఖానాపురం 537 43,25,633 నల్లబెల్లి 576 48,32,289 నర్సంపేట 861 69,33,272 నెక్కొండ 825 76,958 రాయపర్తి 878 56,77,709 గీసుగొండ 674 68,34,282 సంగెం 816 79,52,538 పర్వతగిరి 651 60,03,816 వర్ధన్నపేట 515 46,73,562 జిల్లాలో ఎస్హెచ్జీలకు రూ.6.50 కోట్లు విడుదల 7,540 మహిళా సంఘాలకు లబ్ధి -
సర్కిల్.. క్రిటికల్!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లోని పలు డివిజన్ల ప్రజలు సేవల కోసం వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదు. అందుబాటులో లేని సర్కిల్ కార్యాలయాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. సుపరిపాలన కోసం గత ప్రభుత్వం 2017 అక్టోబర్ 13న 267 జీఓ విడుదల చేసింది. కాశిబుగ్గ, కాజీపేట రెండుగా ఉన్న సర్కిల్ కార్యాలయాలను విభజించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 8 ఏళ్లు గడిచినా అడుగు ముందుకుపడకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దూరంలో సర్కిల్ కార్యాలయాలు.. జనన, మరణ, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాలు, కొత్త ఇంటి నంబర్లు, ఆస్తుల విభజన, పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్, ఇతర అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే బల్దియా సర్కిల్ కార్యాలయాలను ప్రజలు ఆశ్రయించాల్సిందే. కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 2013 మార్చి 19న 42 విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 110 కిలోమీటర్లు ఉన్న నగరం 407.8 కిలోమీటర్లకు చేరింది. జనాభా 9 లక్షలకు చేరడంతో 53 డివిజన్లు 58కి చేరాయి. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2020–21 సంవత్సరంలో 58 డివిజన్లను డీలిమిటేషన్లో 66కు పెంచారు. ప్రస్తుతం నగర జనాభా 13 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 66 డివిజన్లను 88 డివిజన్లుగా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 8 ఏళ్లుగా కాగితాలకే సర్కిల్ కార్యాలయాలు వ్యయప్రయాసాలకు గురవుతున్న డివిజన్ల ప్రజలు పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం, ఉన్నతాధికారులు అధికారులు, సిబ్బంది కొరతే కారణం.. గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 4 సర్కిళ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కానీ, బల్దియా పాలకవర్గం, ఉన్నతధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సర్కిళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. దూరభారం భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 2 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని రంగశాయిపేటలో లేదా ఉర్సు సీఆర్సీ సెంటర్, హనుమకొండ నయీంనగర్లో లేదా నక్కలగుట్టలో సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సేవలు మరింత అందుబాటులో ఉంటాయనే డిమాండ్ ఉంది. డివిజన్ల పునర్విభజనతోపాటు అదనపు సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో కాక వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. -
అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల మహాలక్ష్మిశంకరమ్మ, శ్రీనివాస్రజిత దయాకర్, సాయితేజ, స్వాతిలు పడిపూజ బాధ్యులుగా పాల్గొనగా ప్రధాన అర్చకులు దేవిష్మిశ్రా తాంత్రిక పూజ విధానంలో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అచల్ దేవిష్మిశ్రా, కేతుడి భవాని, అశోక్రెడ్డి, ఎర్ర జగన్మోహన్రెడ్డిర్మిల, లింగాల అమృతవంశీధర్రెడ్డి, పబ్బ దీప్తి, సదాశివుడు, గుట్టం వినిత్, వంశీకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం మార్పునర్సంపేట: నర్సంపేట ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (కరెంటు బిల్లులు చెల్లించే కార్యాలయం) నెక్కొండ రోడ్డు నుంచి మల్లంపల్లికి రోడ్డులోని సబ్స్టేషన్ దగ్గర డివిజన్ ఆఫీస్లోకి మార్చినట్లు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఆకవరపు మధుసూదన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు ఈ మార్పును గమనించి వల్లబ్నగర్ సబ్స్టేషన్ దగ్గర ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. ‘నేరెళ్ల’ పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక హన్మకొండ కల్చరల్: నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారానికి వరంగల్కు చెందిన కవి, నవలా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసినట్లు నేరెళ్ల వేణుమాధవ్ కల్చ రల్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జరిగే ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతి కార్యక్రమంలో రామా చంద్రమౌళికి పురస్కారం అందజేస్తామని శోభావతి పేర్కొన్నారు. -
జెట్స్పీడ్లో ‘మామునూరు’
తుది అంకంలో 223 ఎకరాల భూసేకరణసాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పనులు జెట్స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని మరో 253 ఎకరాల భూసేకరణ చివరిదశకు చేరుకుంది. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఇందులో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి సంబంధించిన వారి ఖాతాల్లో రూ.220 కోట్లు జమచేశారు. మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమి 15 ఎకరాలు ఉండగా ఈ మేరకు ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే సాదాబైనామాకు సంబంధించి ఐదు ఎకరాలు ఉండడంతో ఆ భూమి ఎక్కడినుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలను పరిశీలిస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి క్లియర్ చేస్తున్నారు. మరో 10 ఎకరాల భూమి ఉన్న రైతుల నుంచి పట్టా పాస్బుక్లు, అలాగే 12 మంది ఇళ్లు ఉన్నవారి వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 330 మంది భూనిర్వాసితులు ఉంటే 260 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మరో 40 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు దశలవారీగా భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా ఇప్పటివరకు సేకరించిన 213 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తోంది. అధికారుల సమన్వయంతో.. ఎయిర్పోర్టుకు సంబంధించి వివిధ విభాగాల అ ధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నా రు. కొందరికి పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్ల మిస్ మ్యాచ్, కొన్ని భూములపై మా ర్ట్గేజ్ లోన్లు, సాదాబైనామా భూముల ద్వారా కాస్త ఆలస్యమైనా.. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు భూమి సరిహద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండేళ్లలో మామునూరులో విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధం -
62.36%
ధాన్యం సేకరణసాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు.. వానాకాలంలో సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారులు ప్రకటించారు. 10,39,815 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాలు, తెగుళ్ల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ‘కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను నిండా ముంచింది మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నడం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు సగానికి సగం దిగుబడి తగ్గిందిపోయిన వానాకాలం నాకున్న రెండెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంటేసిన. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అనుకున్న. కానీ పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల, భారీ వర్షాల కారణంగా దిగుబడి సగానికి సగం తగ్గిపోయి ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. పంట చేతికొచ్చే దశలో కురిసిన వర్షాలు రైతులను ఆగం చేశాయి. – వడ్డె వీరయ్య, కమలాపూర్ రైతుజిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మెట్రిక్ టన్నుల్లో) జిల్లా సేకరించాల్సిన కేంద్రాల కేంద్రాల కొనుగోలు రైతుల విలువ ధాన్యం ప్రతిపాదన ప్రారంభం ధాన్యం సంఖ్య (రూ.కోట్లలో) హనుమకొండ 1,80,355 157 157 1,03,154 25754 246.39 వరంగల్ 1,95,141 260 260 1,15,440 28604 275.77 జనగామ 1,69,662 294 294 1,45,206 36274 346.87 మహబూబాబాద్ 2,24,688 260 260 1,54,520 31334 369.06 భూపాలపల్లి 1,22,543 204 204 49,356 9616 117.89 ములుగు 1,47,426 185 185 80,702 11775 192.21 ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ -
స్థల పరిశీలన
పర్వతగిరి: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలోని పల్లవి మోడల్ పాఠశాలలో త్వరలో నిర్వహించనున్న 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అవసరమైన స్థలం, గదులను గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకచారిను వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు అనుకూల వాతావరణం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, నాయకులు పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డి అధికారం మూడేళ్లే
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ను ఆధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధి కారంలో ఉండేది మూడేళ్లేనని హితవు పలి కారు. ఆయన బజారు బాష మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్రెడ్డి పరాన్నజీవి అయితే, కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని రుజువైందని దుయ్యబట్టారు. యూరి యా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి..రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను ప్రశ్ని స్తున్న హరీశ్రావు, కేటీఆర్పై కూడా దిగజారుడు భాషే మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణకు నంబర్వన్ ద్రోహి రేవంత్రెడ్డి అని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు చింతం సదానందం, చెన్నం మధు, జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్రావు, మూటిక రాజుయాదవ్, గండ్రకోట రాకేశ్యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ పాల్గొన్నారు. ఆయన భాషను ఈసడించుకుంటున్న ప్రజలు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
మద్దిమేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి
● అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద నల్లబెల్లి: అధికారులు సమన్వయంతో పనిచేసి నాగరాజుపల్లి మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అధికారులతో కలిసి మద్దిమేడారం జాతరను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజు స్వాగతం పలికారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతు, విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పాటు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు, వాహనాల పార్కింగ్కు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజుతో మాట్లాడి జాతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సమగ్ర నివేదిక పంపించాలని తహసీల్దార్ ముప్పు కృష్ణను ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్ను వినియోగించొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ భక్తులను కోరారు. పీఆర్ జిల్లా అధికారి ఇజ్జగిరి, ఎంపీడీఓ డాక్టర్ శుభనివాస్, సర్పంచ్లు ఎరుకలి లలిత, ఎరుకల సరోజన, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, విష్ణు పాల్గొన్నారు. మేడారం భక్తులకు వసతులు కల్పించాలి.. న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్అండ్బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్హెచ్ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు ఇవీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం.. బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు సమావేశాలు, సమీక్షలు కరువు గ్రేటర్ వరంగల్లో అధ్వాన పరిస్థితి కొరవడిన జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్య ● పీహెచ్సీ తనిఖీ శాయంపేట: ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చూడాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. టీబీ ముక్త్ భారత్, ఎన్ సీడీ కార్యక్రమాలపై వైద్యులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. మండలంలో మగవారి కంటే ఆడవారి జననాల రేటు తక్కువగా ఉందని పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తూ ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అప్పయ్య హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల పడిగాపులు
● అమల్లోకి రాని మొబైల్ యాప్ దుగ్గొండి/గీసుకొండ: యాసంగిలో మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. యాప్పై ఇటీవల రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల 22 నుంచి మొబైల్ యాప్ ద్వారా బుక్చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యాప్ అమల్లోకి రాకపోవడంతో రైతులు పాత పద్ధతిలోనే యూరియా కోసం బారులుతీరాల్సిన పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట పీఏసీఎస్ గోడౌన్కు యూరియా వచ్చిందని తెలుసుకున్న వందలాది మంది రైతులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూ కట్టారు. అనంతరం సొసైటీ సిబ్బంది ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు లేకుండా క్యూలో ఉంటే ఒకేబస్తా వచ్చిందని రైతులు నిట్టూర్చారు. అదేవిధంగా గీసుకొండ మండలం కొనాయమాకుల రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులుదీరి కనిపించారు. -
మీచేతుల్లోనే పంచాయతీ సమాచారం
సాక్షి, వరంగల్: మీ ఊరిలో చెత్త సమస్య ఉందా.. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదా.. డ్రెయినేజీ నిండిపోయిందా.. అయినా పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదా.. ఇన్నాళ్లూ సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయనే అపోహ ఉండేది. ఇప్పుడు మీరే ఆ సమస్య పరిష్కరించవచ్చు. అందుకే మీరు చేయాల్సిందల్లా మీ సెల్ఫోన్లో ఆ సమస్య తీవ్రతను తెలిపే ఫొటో తీసి ‘మేరీ పంచాయతీ’ యాప్లో కంప్లయింట్ సిస్టం అనే ఫీచర్లో జియో ట్యాగ్ వివరాలతో నిక్షిప్తం చేస్తే చాలు.. ఆ సమస్యను అక్కడున్న పంచాయతీ సిబ్బంది పరిష్కరిస్తారు. లేదంటే ఉన్నతాధికారులు ఇలా వచ్చే ఫిర్యాదులను పట్టించుకోని సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో పాలన పారదర్శకత కోసం 2019లోనే కేంద్రం ఈ మేరీ పంచాయతీ యాప్ తీసుకొచ్చింది. ఇటీవల నుంచే పూర్తిస్థాయిలో యాప్ పనిచేస్తోంది. ఆయా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పంచాయతీల ఆదాయం, ఖర్చు వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్లో వివరాల నమోదు సమయంలోనే జీపీఎస్ ద్వారా గుర్తించే అవకాశముంది. ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు. ఇలా చేయడంతో పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలుంటుంది. అయితే ఈ యాప్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు తెలియదు. ఈ యాప్పై పంచాయతీ అధికారులు జాగృతి కల్పించాల్సిన అవసరముంది. ఇటీవల జిల్లాలో 316 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. మీ ఊరి చిట్టా మీ చేతుల్లోనే.. మేరీ పంచాయతీ యాప్ను స్మార్ట్ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు, పిన్కోడ్ ఎంచుకోవాలి. అనంతరం గ్రామపంచాయతీ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తాయి. ఈ యాప్ ద్వారా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, పంచాయతీ ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం మంజూరు చేసే నిధులు, పనులు ఏ దశలో ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు నమోదై ఉంటాయి. నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు కూడా యాప్లో నమోదు చేస్తారు. వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాల నమోదుతోపాటు గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. దీనిలో నిధుల వినియోగంలో ఎన్ని లోపాలున్నా, అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ ఊరిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని పంచాయతీ సిబ్బంది అంటున్నారు. ఇలా పంచాయతీ పాలనను ఎక్కడినుంచైనా తెలుసుకోవచ్చు. అందుబాటులో ‘మేరీ పంచాయతీ’ యాప్ ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సమస్య పరిష్కారం గడువులోగా సిబ్బంది పరిష్కరించకపోతే చర్యలు జిల్లాలో 316 గ్రామపంచాయతీలు -
ఆరంభంలోనే అవస్థలు
కమలాపూర్: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలగించడానికి యాప్ను ప్రవేశపెట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో కమలాపూర్ పీఏసీఎస్కు ఇటీవల నాలుగు లారీల్లో 1,776 బస్తాల యూరియా రాగా, వాటిని మంగళవారం కొందరు రైతులకు పంపిణీ చేశారు. పీఏసీఎస్లో యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచే మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. మరి కొందరు రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మంగళవారం ఒక్కో రైతుకు 5 బస్తాల చొప్పున పంపిణీ చేసి ఇప్పుడు తమకు 3 బస్తాలే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. పోలీసు పహారాలో రైతులకు యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ పలువురు రైతులు యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిగిరి వెళ్లిపోయారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా గ్రామాలకే సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఏఓ వేణు మాట్లాడుతూ.. మండలంలో యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. మరో రెండు రోజుల్లో మరింత స్టాక్ రానుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. యాసంగిలో రైతులకు తప్పని యూరియా తిప్పలు పోలీస్ పహారాలో పంపిణీ -
రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్మెడల్కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు. శిల్ప కళా సౌందర్యం అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్రెడ్డి, ఎస్.ప్రేమ్దినకర్, కె.దీపక్బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహస్తారని తెలిపారు. టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారు. -
క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ‘మీ డబ్బు – మీ హక్కు’ అంశంపై శిబిరం -
వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి సంగెం: వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివియోగదారుల హక్కులు.. బాధ్యతలు.. పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానం కేజీబీవీ విద్యార్థిని బి.రక్షిత, ద్వితీయస్థానం సంగెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పెరుమాండ్ల చరణ్ సాధించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా వారు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వినియోగదారుల చట్టం అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్టినేటర్ పులి రాజశేఖర్, గైడ్ టీచర్ తాటిపాముల రమేశ్, కేజీబీవీ పీఈటీ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు
నర్సంపేట రూరల్: ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని అర్చకులు భిక్షమయ్యశాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్శాస్త్రి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పాకాల తైబందీ ఖరారునర్సంపేట: ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఆయకట్టు రబీ తైబందీని నీటి పారుదలశాఖ అధికారులు, రైతుల సమక్షంలో బుధవారం ఖరారు చేసినట్లు ఈఈ సుదర్శన్రావు తెలిపారు. పాకాలలో ప్రస్తుతం 28.6 ఫీట్ల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. సంగెం కాల్వ కింద 10 వేల ఎకరాలు, జాలుబంధం కాల్వ కింద 3,515, తుంగబంధం కాల్వ కింద 1,100 ఎకరాలు(లంబాడీ లచ్చమ్మ బుర్ర వరకు), పసునూరి కాల్వ కింద 1457, మాటు వీరారం కింద 900 ఎకరాలు నిర్ణయించారు. పాకాల ఆయకట్టు కింద మొత్తం 18,193 ఎకరాలకు 16,972 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఈఈ సుదర్శన్రావు పేర్కొన్నారు జనవరి మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని, మొదటి వారంలోనే నార్లు పోసుకుని ఏప్రిల్ 30 లోపు కోతలు పూర్తిచేసుకునే విధంగా రైతులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. మాదన్నపేట చెరువు 1,020 ఎకరాలు.. నర్సంపేట రూరల్: మాదన్నపేట పెద్ద చెరువు యాసంగి తైబందీ రైతుల సమక్షంలో ఖరారు చేసినట్లు డీఈ సామ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట నీటి పారుదల శాఖ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ సామ్యానాయక్ మాట్లాడుతూ మాదన్నపేట చెరువు మొదటి నుంచి చిమ్మినేని బుర్ర వరకు (మాదన్నపేట శివారు) 220 ఎకరాలు, వైఎస్ఆర్ రోడ్డు నుంచి గొల్లె కన్నయ్య వరకు 500 ఎకరాలు, దుబ్బ కాల్వ చెరువు మొదటి నుంచి కుమ్మరిగడ్డ బుర్ర వరకు 300 ఎకరాలు మొత్తం 1,020 ఎకరాలకు తైబందీ ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈ నితిన్, రైతులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలిఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాబార్డ్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునిస్తుందని, శిక్షణలతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్ పద్ధతులు కూడా మహిళలకు నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఆన్లైన్, డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ పొందాలని, అంతర్జాతీయ మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి, డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ చైతన్యకుమార్, యూనియన్ బ్యాంకు డీజీఎం కమలాకర్, చింతల అన్వేశ్ పాల్గొన్నారు. -
‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలతో సమీక్ష -
పల్లెల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్కాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్భాస్కర్ మాట్లాడుతూ.. బ్యాంకు నిర్వాహణ పని తీరు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ పాల్గొన్నారు. -
పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
ఈసారి పెద్ద చెరువుల్లోనే!
చేపపిల్లలను విడుదల చేసిన మత్స్యశాఖ అధికారులుగీసుకొండ: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేపపిల్ల లను వదిలే కార్యక్రమం ప్రహసనంలా మారింది. చేపపిల్లలను పెద్ద చెరువుల్లో విడుదల చేసి చిన్న చెరువులకు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్లోపు ప్రతి ఏడాది చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో మరింత జాప్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది నవంబర్లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 71 పెద్ద (పెరినియల్) చెరువులు ఉండగా ఇప్పటి వరకు 63 చెరువుల్లో సుమారు 71.43 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇంకా మిగిలిన పెద్ద చెరువుల్లో 18.82 లక్షల చేపపిల్లలను పోయాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. 635 చిన్న (సీజనల్) చెరువుల్లో ఒక్క చెరువులో కూడా చేపపిల్లలను పోయలేదని చెబుతున్నారు. ఈఏడాది చేపపిల్లల పంపిణీ టెండర్ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు. చాలా ఆసల్యంగా టెండర్ల ప్రక్రియ ముగియడం, పంపిణీలో జాప్యం కావడంతో చిన్న చెరువులకు చేపపిల్లలను అందించలేమని వారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించినా.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించడంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్య సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సగం మేరకు చేపపిల్లలను పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ ఏడాది మత్స్యసంఘాల వారు సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్తోపాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేకపోయినా తమకు నగదు బదిలీ చేయాలని మత్స్య సంఘాల వారు కోరుతున్నారు. నీలకంఠ రొయ్య పిల్లల పంపిణీ లేనట్లే.. జిల్లాలోని పలు జలాశయాల్లో కొంతకాలంగా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండే నీలకంఠ రొయ్య పిల్లలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంపిణీ చేస్తారని అనుకుంటే వారికి నిరాశే మిగిలింది. గతంలో సంగెం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు, రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు తదితర జలాశయాల్లో 10 లక్షల వరకు రొయ్యపిల్లలను పంపిణీ చేశారు. ఇవి మంచినీటి జలాశయాలు కావడంతో మత్స్యకారులు పెరిగిన రొయ్యలను వలలతో పట్టి అధిక ఆదాయం పొందేవారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందని అనుకున్నాం అదేం లేదని అధికారులు చెబుతున్నారు. మత్స్య సంఘాలు 189రిజర్వాయర్ మైలారం మొత్తం చెరువులు 706మత్స్య సంఘాల్లో సభ్యులు 15,821 చిన్నచెరువులకు పంపిణీ చేయబోమని చెప్పిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఇలాగైతే తీవ్రంగా నష్టపోతామంటున్న మత్స్య సంఘాల బాధ్యులు జిల్లాలో 635 చిన్న, 71 పెద్దచెరువులు.. 1.93 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యంరాష్ట్ర అధికారులకు నివేదించాం చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేమని జస్వంత ఆక్వా కంపెనీ వారు చెప్పారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఇప్పటికే నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. జిల్లాలో ఇంకా చేపపిల్లలను పంపిణీ చేయని పెద్ద జలాశయాలకు ఈ నెల 31లోపు పంపిణీ పూర్తి చేస్తాం. – పిల్లి శ్రీపతిరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. యూజీసీ నెట్, సెట్, టెట్ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షలు వాయిదావేశామని ఆయన పేర్కొన్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వరంగల్ లీగల్: నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీపై వెళ్తున్న హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్టాభి రామారావుకు న్యాయవాదులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు వీడ్కోల సభలో జస్టిస్ పట్టాభి రామారావు మాట్లాడుతూ తాను 8 నెలలపాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేసిన సేవలు సంతృప్తి కలిగించాయని అన్నారు. అదనంగా ఐదు కొత్త కోర్టులు, నూతన భవనంపై మరో అంతస్తు నిర్మాణానికి తన సారథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంచి అనుభూతులతో బదిలీ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలాగీతాంబ, హన్మకొండ జిల్లా ఇన్చార్జ్ జడ్జి అపర్ణాదేవి, న్యాయమూర్తులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, బార్ నాయకులు కొత్త రవి, అంబేడ్కర్, వెంకటేశ్, సాంబశివరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. హసన్పర్తి: అంబులెన్స్లో ఓ మహిళ మంగళవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన ఝాన్సీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసే క్రమంలోనే ఝాన్సీకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది స్వాతి, పైలట్ తిరుపతి అంబులెన్స్లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను హనుమకొండలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బందికి ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర కమిటీలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదులకు చోటు దక్కింది. ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బార్కు చెందిన సాయిని నరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ బార్కు చెందిన సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్ను ఎన్నుకున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జన్ను పద్మ, ఎగ్గడి సుందర్రామ్, పల్లె ప్రశాంత్, నర్సంపేట బార్కు చెందిన పండగ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న నాయకులకు హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్, ఐఎల్పీఏ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు విలాసాగరం సురేందర్గౌడ్, ముచ్చు రాజేందర్, బార్ కన్వీనర్లు పెండ్యాల అనిల్కుమార్, పూసపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు అంబరీషరావు, కె.నిర్మలాజ్యోతి, లడే రమేశ్, సిరిమల్ల అరుణ, శశిరేఖ తదితరులు అభినందనలు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనీలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. పలు కోర్సుల్లో శిక్షణ పొందిన 86 మందికి 85 మంది హాజరైనట్లు యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ వై.విజయశ్రీ తెలిపారు. హైదరాబాద్ సెట్విన్ అధికారి మాధవి పర్యవేక్షించారు. -
ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుపు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కమలాపూర్: ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడే గెలుపు వరిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంగళవారం కమలాపూర్లో ఆయన సన్మానించి మాట్లాడారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే బలమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా మన వాళ్లేనని, కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామన్నారు. 2021కి పూర్వం పార్టీలపరంగా కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజూరా బాద్ అని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా రాజేందర్ అన్నతో ఉండే బంధమే ఎక్కువని ఇతర పార్టీల్లో గెలిచిన వారు తన దగ్గరకు వస్తున్నారని, ప్రేమతో ఉండే వాళ్లు మనతో ఉంటారని, ఆఽశపడే వాళ్లు ఎన్నటికీ మన వాళ్లు కాదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, పార్టీ గుర్తులు ఉండవని, చెక్ పవర్ ఉన్న ఒకే ఒక్క పదవి సర్పంచ్ అని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కన్నా వార్డు మెంబర్, సర్పంచ్గా గెలవడమే కష్టమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో తట్టెడు మట్టి అయినా తీశాడా అని ప్రశ్నిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎంనైనా కలుస్తానని, పంచాయతీలకు నిధులు ఆగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే వారందరిని గెలిపించుకునే బాధ్యత తనదన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాజయ్యయాదవ్, మాడ గౌతంరెడ్డి, ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, శ్రీరాం శ్యాం, సురేందర్రాజు, తిరుపతిరెడ్డి, తుమ్మ శోభన్, కళాధర్ పాల్గొన్నారు. -
కేఎంసీ ఆభివృద్ధికి కృషి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అవార్డులు, ప్రశంసపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ టాపర్లు, పీజీ యూనివర్సిటీ టాపర్లకు అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే, ఏఎంబీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న ప్రొఫెసర్ డాక్టర్ పుల్లయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం వీసీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ కేఎంసీ (1979 బ్యాచ్) పూర్వ విద్యార్థిగా చదివిన తాను ఇప్పుడు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వీసీని కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
పోరు..!?
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందను కున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 9 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు.. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్తో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లతో కలిసి మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. వరంగల్ నగరంలోని చర్చిలకు రంగులు వేసేందుకు సీఎం నిధులు కేటాయించడం హర్షణీయమని మేయర్ సుధారాణి అన్నారు. మంత్రి ఆదేశం మేరకు నగరంలోని చర్చిలు ఉన్న ప్రాంతాల్లో కార్పొరేషన్ తరఫున శానిటేషన్, లైటింగ్కు రూ.10 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టేజీపై ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు ఆసీనులు కావడంపై పలువురు చర్చించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్లు భోగి సువర్ణ, కావేటి కవిత, అనిల్కుమార్, పద్మ, రవి, సురేష్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆత్మకూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. ఇక్కడ నుంచి ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు తగిన ఫాలోఅప్ సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సంవత్సరం 1,560 మహిళలను పరిశీలించి 350 మందికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, 82 మందిని రెఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెఫర్ చేసిన వారికి తగిన ఫాలోఅప్ సేవలందించాలని డాక్టర్ స్పందనను ఆదేశించారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు లెప్రసీ నిర్ధారణ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ పుష్పలీల, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్క్లెయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీఅండ్బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటేటివ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం జాతర పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి ● మీ డబ్బు–మీ హక్కు కార్యక్రమానికి స్పందనన్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లైయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్కై ్లయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్లు పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లయిమ్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీ అండ్ బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటీవ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37,070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలు జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16‘పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి...మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
మేడారం..ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
వరంగల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించాలి 7● డీఈఓ రంగయ్యనాయుడు నర్సంపేట రూరల్/గీసుకొండ: ప్రతీ సబ్జెక్టుపై వి ద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. న ర్సంపేట మండలంలోని పట్టణ గురుకుల పాఠశాల, గీసుకొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్ ఎస్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాలను పరిశీలించారు. స బ్జెక్టుల ప్రాధాన్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇషాక్ అలీ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
విధుల్లో అలసత్వం వహించొద్దు
● డీసీపీ అంకిత్కుమార్ ఖానాపురం/దుగ్గొండి: పోలీస్ అధికారులు విధుల్లో అలసత్వం వహించొద్దని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. మంగళవారం ఖానాపురం, దుగ్గొండి మండలాల్లోని పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలు, సిబ్బంది యూనిఫాంలు, ఆయుధాలను తనిఖీ చేసి సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. చట్టవ్యతిరేఖ కార్యక్రమాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సైలు రఘుపతి, రణదీర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జీవన ఎరువు తయారీపై శిక్షణ దుగ్గొండి: మండలకేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జీవన ఎరువు తయారీపై శిక్షణా శిబిరం నిర్వహించారు. నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి జీవన ఎరువులు ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం మాట్లాడారు. పశువుల ఎరువులో ఎకరాకు 2 కిలోల పీఎస్బీని కలిపి కలియ చల్లాలన్నారు. జీవన ఎరువులను ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యంకావడంతో పాటు నేల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ రాయపర్తి: ఇటీవల సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ సరిత తెలిపారు. మంగళవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఓవరాల్ చాంపియన్షిప్ జోన్లో నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. చెస్లో దిలీషా, హ్యాండ్ బాల్ పోటీల్లో కీర్తన, వర్షిణితేజ, చందన, వర్షిత, ఖోఖోలో లాస్యనందిని, మన్వితలు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయా విద్యార్థినులు ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు.. సంగెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు మండలంలోని మొండ్రాయి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు గూడ చిన్ను, బైరి లక్ష్మిప్రసన్న, గుగులోత్ ఉమేశ్వరీలు ఎంపికై నట్లు పీడీ ముఖర్జీ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను హెచ్ఎం విజయ, ఉపాధ్యాయబృందం, గ్రామస్తులు అభినందించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రియాజొద్దీన్గీసుకొండ: గీసుకొండ మండల తహసీల్దార్ ఎండీ.రియాజొద్దీన్ రెవె న్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేర కు సంఘం నాయకులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేఎంటీ, గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మండల ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా సేవలందించారు. ఆయన నియామకంపై కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి, నాయకులు ఎలగొండ ప్రవీన్, బెజ్జాల కుమారస్వామి, కోదండపాణి, గోపాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
వేగంగా ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, వరంగల్: ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికల కోలాహలమున్నా.. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆ టంకం లేకుండా యథావిధిగానే సాగింది. ఎన్నిక ల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తీరిక దొరికిన సమయాల్లో తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించారు. ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు వేల మెట్రిక్ టన్నులు అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు తగ్గట్టుగానే పౌర సరఫరా విభాగాధికారు ల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బంది కలగకుండా దొడ్డు, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సమీప ప్రాంతాల్లోని మిల్లులకు తరలించారు. ఇలా జిల్లాలోని 251 కేంద్రాల్లోని నిర్వాహకులు ఇప్పటివరకు 1,16,578. 560 మెట్రిక్ టన్నులు సేకరించి ఆయా ప్రాంతాల్లోని 93 మిల్లులకు తరలించారు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 170 లారీల్లో లోడ్లు చేసి ఆయా మిల్లులకు తరలించే ప్రక్రియ సాగింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, గీసుకొండ, పర్వతగిరి మండలాల్లో ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే పూర్తయ్యాయి. జనవరి రెండో వారంనాటికి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికారులు అంటున్నారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.2,389లతో పాటు రూ.500ల బోనస్, దొడ్డు ధాన్యానికి గ్రేడ్–ఏ క్వింటాకు రూ.2,389, కామన్ క్వింటాకు రూ.2,369 చెల్లిస్తోంది. రోజుల వ్యవధిలో డబ్బుల జమ జిల్లాలో ఇప్పటివరకు అధికారులు 1,16,578.560 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇందుకు సంబంధించిన డబ్బును రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. అలాగే ఈ నెల 20న సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రా రంభమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన 33 రకాల సన్న ధాన్యంరకాలను సాగు చేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగ దు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ధాన్యం డబ్బులు జమచేసే సమయంలోనే ఈ బోనస్ డబ్బులు చెల్లించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. కొందరు రైతులు తమ బ్యాంక్ ఖాతా కు ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో వారి ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ‘ఫార్మర్ కార్నర్’ ద్వారా రైతులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదంటే మండల వ్యవసాయ అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు: 251సేకరించాల్సిన లక్ష్యం: 2,50,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సేకరించింది: 1,16,578మెట్రిక్ టన్నులు రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము: రూ.223.81 కోట్లు ఇంకా చెల్లించాల్సింది: రూ.54.682 కోట్లు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ వేల మెట్రిక్ టన్నుల సేకరణ ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1,16,578 మెట్రిక్ టన్నులు సేకరించాల్సిన లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు జనవరి రెండోవారం నాటికి కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం‘మోంథా’ తుపాను ప్రభావం చూపిందా?ఈ ఏడాది 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పౌర సరఫరా విభాగాధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు. అయితే దొడ్డు వడ్లు 30,000, సన్న వడ్లు 2,20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు దొడ్డు ధాన్యం 1881.840 మెట్రిక్ టన్నులు, సన్నవి 1,14,696.720 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జనవరి 2వ తేదీ వరకు ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందనుకున్నా.. కేవలం నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో మాత్రమే ఇంకా వరి ధాన్యం రావాల్సి ఉందని అధికారులంటున్నారు. ఈ లెక్కన ఇప్పటివరకు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎటువైపు వెళ్లినట్టని, లేదా రైతులు అవసరాలకు ముందే దళారులకు అమ్ముకున్నారా అన్న చర్చ ఉంది. అదే సమయంలో ఈ ఏడాది మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 19,728 ఎకరాల్లో పంట నష్టం జరిగితే, వరినే అధికస్థాయిలో నష్టం జరిగిందని సర్వేలో అధికారులు తేల్చారు. అందుకే అనుకున్న లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. -
పేదల శ్రమను దోచుకునేందుకే నూతన బిల్లు
నర్సంపేట: పేదల శ్రమను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లు తీసుకువచ్చిందని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బిల్లుకు వ్యతిరేకంగా ఎంసీపీఐ(యూ) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నూతన బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం గ్రా మీణ ప్రాంతాల్లో పేదలకు ఎంతో ఆసరాగా నిలి చిందని, ఇప్పుడు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం బిల్లుతో పేదల కూలీల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ 125 రోజుల పని దినాలను కల్పిస్తూ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం, మోటం సురేష్, ప్రభాకర్, రాజు, జన్ను నీల, సీహెచ్.పుష్ప, అచల, ప్రమీల, ఈర్ల అనూష, జన్ను విజయ, కోమల, జయ, గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
నర్సంపేట: ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని శ్రీదేవనాథ జీయర్స్వామి అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని శ్రీవేణుగోపాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో వికాస తరంగిణి న ర్సంపేట శాఖ ఆధ్వర్యంలో అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, శేషాచార్య, ఆలయ చైర్మన్ గంధం నరేందర్ నేతృత్వంలో మంగళవారం ధనుర్మాసో త్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్టును దర్శించుకుని గోపూజ చేశారు. అనంతరం జీయర్స్వామి మాట్లాడుతూ భక్తి భవా న్ని పెంపొందించుకుంటే సుఖ శాంతులతో వర్ధిల్లుతారన్నారు. రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. డఫోడిల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చిన్న తనం నుంచే భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వి కాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్పర్వతగిరి: రైతులు అరటిసాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధిలో భాగంగా మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో సంగని ఐలయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం అరటి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అరటి రైతులకు అందిస్తున్న పథకాలు, అరటిలో నాణ్యత పెంపొందించుటకు మేలైన యాజమాన్య పద్ధతులపై వివరించారు. అరటి రైతులు ఫ్రూట్ బంచ్ కవర్స్ వాడడం వల్ల అరటి నాణ్యత పెరిగి అధిక ధర రావడానికి అవకాశం ఉంటుందన్నారు. వర్ధన్నపేట డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్ రాకేష్ మాట్లాడుతూ ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, కూరగాయాలు, ఆయిల్ ఫామ్, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన రాయితీ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి యు.రాజర్షి, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, శివమణి, వినోద్, సర్పంచ్లు గడుదుల రమేష్, గుగులోతు కిషన్, రైతులు పాల్గొన్నారు. -
హక్కులు, బాధ్యతలు తెలిసి ఉండాలి
● కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్కుమార్ నెక్కొండ: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలు తెలిసిఉంటేనే ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ జరుగుతున్న మోసాలను గుర్తించవచ్చని కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర్గుపల్లి శ్రవణ్కుమార్శాసీ్త్ర అన్నారు. స్థానిక హైస్కూల్లో సోమవారం జాతీయ వినియోగదారుల వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు తమకు చట్ట ప్రకారం సంక్రమించిన హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం శ్రీదేవి, గైడ్ టీచర్ వినయ్కుమార్, సీఆర్పీలు శ్రీనివాస్, చారి, సుమలత, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి ● వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి న్యూశాయంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను జనవరి 13వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితా మ్యాపింగ్ సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాలో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను గుర్తించి సరిచేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అశోక్కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి హర్షిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కాళోజీ సెంటర్: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు డాక్టర్ చేవూరి రమేశ్కుమార్ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమేశ్ 26 సంవత్సరాలుగా జ్యోతిష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్, ఈగల్ యూనివర్సిటీ యునిఎర్త్ హ్యుమానిటీ పీస్ ఫౌండేషన్ (యూఎస్ఏ) సంయుక్తంగా యూనివర్సల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్, భూపేశ్, గైడ్ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం కాళోజీ సెంటర్: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరాన్ని ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహవీర్ ట్రస్ట్ సౌజన్యంతో కొత్తవాడలోని పద్మశాలీ వెల్ఫేర్ ట్రస్టు ప్రాంగణంలో ఉచిత శిబిరం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు అమర్చనున్నారన్నారు. ఆసక్తి గలవారు 9490133650, 9885981959, 9949446802, 7095915728 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేడు జాబ్ మేళా కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు నేడు (మంగళవారం) ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, ఎంపికై న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాద్లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలి
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ● గ్రామాల్లో కొలువుదీరిన నూతన సర్పంచ్లు వర్ధన్నపేట: గ్రామాల్లో కొలువుదీరిన నూతన సర్పంచ్లు ఆయా గ్రామాల్లో ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని దమ్మన్నపేట, చంద్రుతండా, అంబేడ్కర్నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు, డ్రెయినేజీలు, పచ్చదనం తదితర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు సేవలందిస్తానన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయపర్తి: మండలంలోని బాల్నాయక్తండా గ్రామంలో సర్పంచ్గా ఎన్నికై న భూక్య శ్రీదేవిసమ్మయ్య ప్రమాణస్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొని సర్పంచ్ దంపతులను శాలువాతో సన్మానించారు. అంచనాలు సిద్ధం చేయండి ● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో భాగంగా నగరంలో అదనపు పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కో ట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారా యణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు పాల్గొన్నారు. -
మాక్ డ్రిల్ అదుర్స్
వరంగల్: వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, 13వ డివిజన్ నవయుగ కాలనీ లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏడీఎంఏ) ఆదేశాల మేరకు ఒకేసారి వర్షాలు, వరదలు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలని, స హాయక చర్యలు ఎలా నిర్వహించాలనే అంశంపై సోమవారం చేపట్టిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, నవయుగ కాలనీ తదితర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డ్రిల్ సాధారణ పరిశీలకులు గద్వాల డీఎఫ్ఓ అశో క్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్, ఏసీపీ శుభం, వరంగల్ ఆర్డీఓ సుమ, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి శ్రీధర్రెడ్డిలు పర్యవేక్షించారు. వర్షాలతో చెరువు నిండి నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులను, నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని, నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ నుంచి 35 మంది, పోలీస్ శాఖ నుంచి 35, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 12, ఆపదమిత్ర వలంటీర్లు 30 మంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ సహాయక చర్యలు చేపట్టారు. డ్రోన్ సహాయంతో ఆహార ప్యాకెట్లు.. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను సాగించా రు. వరద నీటిలో ముంపునకు గురైన బాధితులు ఇళ్లపైకి చేరగా వారికి ఆహార ప్యాకెట్లతోపాటు నీళ్ల సీసాలను డ్రోన్ల సహాయంతో అందించారు. వరదనీటిలో కొట్టుకుపోతున్న వారిని లైఫ్ బోటుతో రెస్క్యూ బృందం సభ్యులు కాపాడారు. బాధితులకు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం స మీపంలోని దేశాయిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కి 108 వాహనంలో తరలించారు. మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మాక్ డ్రిల్ పరిశీలకులు డీఎఫ్ఓ అశోక్లు మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, డీఏఓ అనురాధ, వివిధ శాఖల అధికారులు గౌతమ్రెడ్డి, కిష్టయ్య, సంధ్యారాణి, సాంబశివరావు, హరీష్రెడ్డి, సమ్మయ్య, ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మాక్ ఎక్సర్సైజ్ ముంపులో చిక్కుకున్న ప్రజలు, పశు సంపదను కాపాడిన సహాయక బృందాలు పరిశీలించిన కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి -
భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ
నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో 39వ రోజు సోమవారం మహా అన్నదాన ప్రసాద వితరణ, దివ్య పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో గీతాంజలి స్కూల్ చైర్మన్ వేములపల్లి జయశ్రీసుబ్బారావు, అపర్ణ రాహుల్చౌదరి, అక్షిభక్తుల రచనచౌదరి, బాలాజీ, సాయివిశ్వనాథ్, డాక్టర్ సాయిసుప్రీత్, కరణ్, దొడ్డ సాయిలు పాల్గొనగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, కోశాధికారి దొడ్డ రవీందర్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీల సిలబస్ మార్చాలి
● రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూ క్యాంపస్: వర్సిటీలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సిలబస్లు మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవారం కేయూలో నిర్వహించిన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ విరామాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలన్నారు. మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలని, జాబ్ మార్కెట్కు తగినట్లుగా ఉండాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 వరకు పెంచారన్నారు. అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఫార్మసీలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్స్తో ఎంఓయూ ఉందని, విద్యాభివృద్ధికి అధ్యాపకులు ప్రధాన భూమికగా వ్యవహరించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడారు. అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డి, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ పాలక మండలి సభ్యులు బి.సురేశ్లాల్ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించాలని అకుట్ బాధ్యులు వినతిపత్రం అందించారు. -
తప్పుడు కేసుల కలకలం!
అకారణంగా కొందరిని టార్గెట్ చేస్తున్నారని.. సాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన ఏసీపీ నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. ఏం తప్పుడు కేసులంటే.. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటు సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటువరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్ : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 7వ డివిజన్లో రూ.కోటితో సైడ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాకాజీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రధానంగా డ్రెయిన్ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న ఒక్కో వార్డుకు కనీసం రూ.50 లక్షలు పెట్టిన దాఖలాలు లేవని, నేడు ప్రతీవార్డుకు రూ.5కోట్ల పై మేర నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ నాయకులు తోట పవన్, మాజీ కార్పొరేటర్ శేఖర్, సోమ నాగేశ్వర్ రావు, బిన్నీ లక్ష్మణ్, వాకర్ అసోసియేషన్ బాధ్యులు గాంధీ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మాక్డ్రిల్ను పరిశీలిస్తున్న బల్దియా కమిషనల్ చాహత్ బాజ్పాయ్వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలను చూపిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ● ఆకట్టుకున్న మాక్డ్రిల్ ● పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులుహన్మకొండ: ‘వరదలు వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి? వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడం ఎలా? పునరావాస కేంద్రానికి తరలించడం ఎలా?’ అనే అంశాలపై ఎస్డీఆర్ఎస్, అగ్నిమాపక శాఖ ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్డ్రిల్ ఆకట్టుకుంది. హనుమకొండలోని సమ్మయ్యనగర్, రెడ్డిపురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన మాక్డ్రిల్ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. సమ్మయ్య నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ఎన్సీసీ, రెడ్క్రాస్, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందికి వరద సహాయక చర్యలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు. ఎస్డీఆర్ఎఫ్ అధికారి రవిచౌహాన్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం సహాయక చర్యలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు రవీందర్రెడ్డి, కిరణ్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజారెడ్డి, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ శంకర్ లింగం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఏసీపీలు నరసింహారావు, సత్యనారాయణ, రెడ్క్రాస్ ఈసీ మెంబర్ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈ నెలాఖరులోగా నారు వేసుకోవాలి
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ కో–ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ మండలంలోని సింగారం, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, యాసంగి వరి నారు మడులను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. యాసంగి మక్కజొన్న తొలిదశలో ఆశించే కత్తెర పురుగు నివారణకు వేపనూనెను పిచికారీ చేయాలని సూచించారు. మిరప శాఖీయ దశలో ఉందని వేరుకుళ్లు తెగులు, ఆకుముడత ప్రధాన సమస్యలుగా ఉన్నట్లు గమనించారు. అందుకు చేయాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఆకుముడత, తెల్ల దోమల నివారణకు ఎకరాకు 15 నుంచి 20 పసుపు రంగు జిగురు అట్టలను, అలాగే తామర పురుగుల నుంచి కాపాడుకోవడానికి 20 నుంచి 30 నీలం రంగు జిగురు అట్టలను పొలమంతా అమర్చుకోవాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి పొలంలోనే కలియదున్నాలన్నారు. వరి నార్లు డిసెంబర్ నెల లోపల వేసుకోవాలన్నారు. చలి ఉధృతి పెరుగుతున్నందున ఉదయం, సాయంత్రం నారుమడుల్లో కొత్తనీరు పెట్టుకోవాలని సూచించారు. రైతులు అన్ని పంటల్లో యాజమాన్య పద్ధతులను పాటించి పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని కోరారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరిఝెన్స్ ప్రోగ్రాంలో భాగంగా అగ్రికల్చర్ విద్యను అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు సందర్శనలో పాల్గొన్నట్లు విజయ్భాస్కర్ తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ పంటక్షేత్రాల సందర్శన -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంపాకాలలో ఏర్పాటుకు కసరత్తు నాలుగు దఫాలుగా పక్షులపై సర్వే మొదటి విడత పూర్తి గుర్తింపు లభిస్తే.. అంతర్జాతీయంగా ప్రతిష్ట ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధికి అడుగులు -
తప్పుడు కేసుల కలకలం!
వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటుసాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. వరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటు -
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్ను ఎన్నుకున్నారు. -
ఆపదలో ఆదెరువు!
వడ్డేపల్లి చెరువులో చేరుతున్న మురుగునీరుకాజీపేట: కాజీపేట, హనుమకొండ పట్టణవాసులకు ఒకప్పుడు తాగు నీరందించిన వడ్డేపల్లి రిజర్వాయర్ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. కాకతీయ రాజుల కాలంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు ద్వారా దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. దాన్ని 1993లో పూర్తిగా సమ్మర్ స్టోరేజీగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా కాజీపేట పట్టణ మురుగు నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరి నీరు కలుషితమవుతూ వస్తోంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తరహాలో ఈ రిజర్వాయర్లో శవాలు తేలుతున్న ఘటనలు కూడా నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రెయినేజీలన్నీ వడ్డేపల్లి చెరువు వైపే.. కాజీపేట పట్టణ పరిధి ఆయా డివిజన్లలో నిర్మించిన డ్రెయినేజీల నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. సోమిడి ఊరచెరువు తూము నుంచి మురికి కాల్వల ద్వారా కలుషిత నీరు వడ్డేపల్లి చెరువులో చేరుతోంది. ఊర చెరువును ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన రియల్ వ్యాపారులు తూముకు గండి కొట్టడమే ఈ చెరువు నీరు కలుషితమవడానికి ఒక కారణం. గతంలో వడ్డేపల్లి ఫోర్షోర్ బండ్కు ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ అవతలి వైపున మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా కట్ట మాదిరిగా రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. అయితే రాళ్ల పక్క నుంచి మురుగు నీరు సవ్యంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ నీరంతా కట్ట మీది నుంచి చెరువులోకి ప్రవేశిస్తోంది. అనుమతి పొందడంలో జాప్యం.. మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా నివారించాలంటే.. రైల్వే ట్రాక్ కింది నుంచి మోరీ నిర్మించాల్సి ఉంది. ఈ మోరీ నిర్మాణానికి రైల్వే అనుమతి తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు రైల్వేశాఖకు పలుమార్లు లేఖలు రాసినా అనుమతులు రాకపోవడంతో మిన్నకుండిపోయారు. దీంతో లక్షల రూపాయలతో సోమిడి వైపు నిర్మించిన కట్ట వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం కాజీపేట 61వ డివిజన్లోని సిద్ధార్థనగర్ వైపు నుంచి మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా, వడ్డేపల్లి చెరువులోని నీరు సిద్ధార్థనగర్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఫోర్షోర్ బండ్ను నిర్మించారు. ఈ బండ్ నిర్మాణం జరిగినపుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ బండ్ కోతకు గుౖరవుతుంది. చెరువు నీటి తాకిడికి ఈ బండ్ ఎప్పుడు గండిపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోర్షోర్ బండ్కు ఇరువైపులా పెద్ద ఎత్తున తుమ్మచెట్లు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారింది. మలమూత్రాల విసర్జన చెరువు పరిసరాలను వాడుతున్నారు. కాగా, చెరువు కింద ఉన్న కాలనీల్లోని బోరు బావుల్లో నీరు నల్లగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, వడ్డేపల్లి చెరువు నీరు కలుషితంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ మున్సిపల్ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘బల్లార్షా రైల్వే లైన్ కింద నుంచి సైడ్ కాల్వ నిర్మించడానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించి చెరువు కలుషితం అవ్వకుండా చూస్తాం’ అని చెప్పారు. కలుషితం కాకుండా చూడాలి.. వడ్డేపల్లి చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే రిజర్వాయర్ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించి తాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలి. – మర్యాల కృష్ణ, కాజీపేట కాల్వలను మళ్లించాలి.. వడ్డేపల్లి రిజర్వాయర్లోకి నేరుగా ఉన్న మురికి కాలువలను అధికారులు గుర్తించి దారి మళ్లించడానికి ఉన్న అవకాశాలపై ప్రత్యేక సర్వే చేయాలి. చెరువులోకి పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురికినీరు వల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – ఎండీ సోనీ, కాజీపేట కోతకు గురవుతున్న ఫోర్షోర్ బండ్ రిజర్వాయర్లో తేలుతున్న శవాలు కన్నెత్తి చూడని అధికారులు ఆందోళనలో నగరవాసులు -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను ప్రభుత్వం నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. పరకాల, కమలాపూర్ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్గా ఎన్.శ్రీనివాస్రావును నియమించారు. పెగడపల్లి ఎ.కృష్ణవేణి, నందనం ఎస్.సదీప్కుమార్, ధర్మసాగర్, సింగారం కె.రవీంద్ర, హసన్పర్తికి ఎ.జగన్మోహన్రావు, దర్గా కాజీపేట, మల్లారెడ్డిపల్లి ఎం.సునీల్ కుమార్, పెంచికలపేట, శాయంపేటకు రాధిక, ఎల్కతుర్తి సీని యర్ ఇన్స్పెక్టర్ ఎండీ అఫ్జలుద్దీన్, మాదారం సీనియర్ ఇన్స్పెక్టర్ వి.జ్యోతి, పెద్దాపూర్కు సీనియర్ ఇన్స్పెక్టర్ మతీన్సుల్తాన్, వంగపహాడ్ సీనియర్ ఇన్స్పెక్టర్ జె.సత్యానందం, ఆత్మకూరు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం.రాణిశ్రీలక్ష్మిని పర్సన్ఇన్చార్జ్గా నియమించారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
ఐనవోలు జాతరకు ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో మంత్రి కొండా సురేఖ హన్మకొండ అర్బన్: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో శనివారం జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా, పార్కింగ్కు ఏర్పాట్లు ఐనవోలు నుంచి కొమురవెల్లి, మేడారానికి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనానికి టోకెన్ల విధానం అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అనంతరం పర్యాటక శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు. సమీక్షలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొత్తకొండ జాతరపై సమీక్షభీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జనవరి 9 నుంచి 18 వరకు జరిగే శ్రీ వీరభద్రస్వామి జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఆలయ ఈఓ కిషన్న్రావు, డాక్టర్ అప్పయ్య, ఆర్టీసీ డీఎం అర్పిత, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి ప్రణాళిక ఖరారు
హన్మకొండ: జిల్లాలో యాసంగి ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,29,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగిలో మొక్కజొన్న 63,608 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 64,100, వేరుశనగ గత యాసంగిలో 473 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 370ఎకరాల్లో సాగుచేయనున్నారు. పప్పుదినుసులు గత యాసంగిలో 238 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. యూరియా 28,584 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,587, ఎన్పీకే 26,466, ఎంఓపీ 8,469 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఎరువులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది యాసంగిలో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే వ్యవసాయ శాఖ విస్తీర్ణాన్ని తగ్గించింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 1,97,025 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగితో చూస్తే 2,815 ఎకరాలు తగ్గింది. పరిస్థితులు చూస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,27,951 ఎకరాలు సాగు చేశారు. వానాకాలంలో చూస్తే 33,741 ఎకరాలు తగ్గింది. వానాకాలంలో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు సాగు చేయడంతో విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 1,94,210 ఎకరాల్లో పంటల సాగు యూరియా అవసరం 28,584 మెట్రిక్ టన్నులు డీఏపీ 10,587 మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 26,466 మెట్రిక్ టన్నులు -
సృజనాత్మకత పెంపునకు సైన్స్ఫెయిర్
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ఫెయిర్ దోహదం చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు శనివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. మానవాళి ప్రకృతిని నాశనం చేస్తుండడంతో అనేక అనర్థాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చిన వరదలే ఉదాహరణ అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి బి.రాంధన్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్, హనుమకొండ, కాజీపేట ఎంఈఓలు నెహ్రూనాయక్, మనోజ్కుమార్, ప్రభుత్వ మర్కజీ హై స్కూల్ ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. -
రేపు ప్రకృతి విపత్తులపై మాక్డ్రిల్
న్యూశాయంపేట: ప్రకృత్తి విపత్తులపై వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సోమవారం మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. మాక్డ్రిల్ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే ఈ మాక్డ్రిల్ ఉద్దేశమని వివరించారు. మాక్డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కలెక్టర్ సత్యశారద సలహాలు ఇచ్చి, పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జనవరిలో జరగనున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమాలపై హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తితో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోడ్లపై రుంబుల్ స్ట్రిప్ట్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలిప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. క్రిస్మస్ సంబరాల ఏర్పాట్లపై అధికారులు, పాస్టర్లతో కలెక్టరేట్లో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ మూడు నియోజకవర్గాల వారీగా వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట తహసీల్దార్లకు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్నకు దరఖాస్తులున్యూశాయంపేట: జిల్లాలోని అల్పసంఖ్యాక వర్గాల (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విద్యార్థులు విదేశాల్లో పైచదువులు చదువుకొనేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు 93988 60995 నంబర్లో సంప్రదించాలన్నారు. ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంకాళోజీ సెంటర్: జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం కింద రూ.75 వేల చొప్పున 8 యూనిట్లకు 100 శాతం సబ్సిడీపై అవకాశం కల్పించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నేడు జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల ఎంపికలుసంగెం/వర్ధన్నపేట: జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ ఎంపిక పోటీలను పర్వతగిరి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు సమ్మయ్య, కార్యదర్శి డెక్క లోకేష్, కోశాధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సీనియర్ పురుషులు, సీ్త్రల కబడ్డీ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 17 సంవత్సరాల పైబడి 85 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26నుంచి ఖమ్మంలో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77807 05024, 87901 54679 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికసంగెం: జిల్లాస్థాయి గణిత ప్రతిభా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు మండల గణిత ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు సత్యమూర్తి, పులి శిరీష తెలిపారు. సంగెం జెడ్పీహెచ్ఎస్లో శనివారం నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి పోటీలకు బి.విష్ణువర్ధణ్, పి.భరత్ (జెడ్పీహెచ్ఎస్), వి.జానేశ్వరి (కేజీబీవీ సంగెం) ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభంగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంట ప్రధాన రోడ్డు ఎస్సీ కాలనీ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ వారికి సమాచారం అందించగా వారు వచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, గొర్రెకుంట – పోతరాజుపల్లి రహదారి విస్తరణ సందర్భంగా గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా అలాగే వదిలేయడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గ్రీవెన్స్లో అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యకు పరిష్కారం లభించడం లేదని గొర్రెకుంట వాసులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
20 రోజులుగా తాగునీరు బంద్
నర్సంపేట: నర్సంపేట పట్టణం ఒకటో వార్డులో గత 20 రోజులుగా తాగునీరు సరిగారాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల మాట్లాడుతూ గతేడాది నుంచి మిషన్ భగీరథ పైపులైన్కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయని అన్నారు. అలాగే, పలు ఇళ్లకు మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదని తెలిపారు. లీకేజీలకు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తిరుమల విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ.అబ్దుల్పాషా, దంచనాదుల సతీష్, కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల రాజు, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య మంజుల, భూక్య సునీత, జాటోత్ విజయ, నల్లబెల్లి మంజుల, విజయ, ఎండీ.గౌస్యబేగం, ఎండి.కౌసర్, ఎండి.హసినా, ఎండి.జరానీ, ఎండి.సాజియా, ఎండి.నూర్, జాటోతు రమేష్, ఎండి.సర్వర్, బోడ శివరామకృష్ణ, శ్రీపెళ్లి రమ, మల్యాల నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానికులు, మహిళల నిరసన -
వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు
న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరం కేవలం ఒక కార్యక్రమం కాదని, తమ ఇంట్లో ఉన్న వృద్ధులకు తామిచ్చే భరోసా అని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన న్యాయ సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ పాల్గొన్నారు. -
బాలల హక్కులకు భంగం కలిగించొద్దు
● జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి కాళోజీ సెంటర్: బాలల హక్కులకు భంగం కలిగించొద్దని, వారి హక్కులు, భవిష్యత్కు విఘాతం కలగకుండా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి అన్నారు. బాలల హక్కులపై వరంగల్లోని మట్వాడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి చదువులో రాణించాలన్నారు. అనంతరం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, పోషకాహారోత్సవంలో జడ్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు భిక్షపతి, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.


