Warangal District News
-
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వివిధ శాఖల అధికారులు వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. శివరాత్రికి వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీపీ అంబర్ కిషోర్ ఝా సూచన మేరకు హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి, సీఐ సతీశ్, పోలీస్ సిబ్బంది, ఆర్అండ్బీ, పురావస్తుశాఖ సిబ్బంది.. దేవాలయ ఈఓ అనిల్కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజు జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం జాగరణ భక్తుల కోసం పండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. -
పంటలకు సమృద్ధిగా నీరందించాలి
వర్ధన్నపేట: పంటలు ఎండిపోకుండా నీరందించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వ నీటి లభ్యతను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు సమృద్ధి నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేసి నిల్వ ఉన్న యూరియాను పరిశీలించారు. రైతులు పంటలకు మోతాదుకు మించి యూరియా వాడొద్దని సూచించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్బుక్స్, పెన్నులు అందించారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. పంటల ఆన్లైన్ పరిశీలన పర్వతగిరి: కొంకపాకలో పంటల ఆన్లైన్ ప్రక్రియను ఏడీఏతో కలిసి కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం చౌటపల్లిలో పీఏసీఎస్ను సందర్శించారు. పంటల సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమయం వృథా కాకుండా కౌంటర్ల వద్ద అందుబాటులో ఈ పాస్ మిషన్లను అందుబాటులో ఉంచాలని ఏడీఏను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ ప్రశాంత్కుమార్, ఏఈఓ, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణాలు అందించాలివరంగల్: జిల్లాలోని ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములకు పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులు రుణాల మంజూరులో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంకు అధికారుల నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వారికి నివేదికలను సమర్పించాలని డీటీడీఓకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు తయారుచేసి బ్యాంకర్లకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ సౌజన్య, లీడ్ బ్యాంకు అధికారి రాజు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద నల్లబెల్లిలో ఎస్సారెస్పీ కాల్వ పరిశీలన -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ ప్రలోభాలను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 6,509 మంది పురుషులు, 4,288 మంది సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధికారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు -
అంతెత్తున ఎగసి..
● దేవాదుల పైప్లైన్ లీకేజీ.. వేలేరు: మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధి కుమ్మరిగూడెం శివారులో శుక్రవారం దేవాదుల పైప్లైన్ గేట్ వాల్వ్ లీకయ్యింది. దీంతో పైప్లైన్ నుంచి 40 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. ధర్మసాగర్ పంప్హౌజ్ నుంచి గండిరామారానికి నీటిని తరలించే క్రమంలో శుక్రవారం ఉదయం పైప్లైన్ లీకవడంతో నీరు భారీగా వృథాగా పోయింది. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామరావు గమనించి పైప్లైన్ లీకేజీ విషయాన్ని కలెక్టర్, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
భయం గుప్పిట్లో నగరం!
● నగరంలో హత్యలు.. హత్యాయత్నాలు ● ఒక్కరోజే మూడు ఘటనలతో బెంబేలెత్తుతున్న నగరవాసులుగ్రేటర్ వరంగల్ పరిధిలో గురువారం ఒక్కరోజే జరిగిన సంఘటనలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. యథేచ్ఛగా కత్తులు..రాడ్లతో దాడులు జరుగుతుంటే పోలీసింగ్ ఏమైందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నా కొందరు పోలీస్ అధికారుల్లో చలనం ఉండడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నిఘా వ్యవస్థ ముందస్తు సమాచారం సేకరించడంలో, సంఘటన జరిగి 24 గంటల గడుస్తున్నా.. హత్యాయత్నాలకు తెగబడిన వారిని పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. – వరంగల్క్రైం/ఖిలావరంగల్– 8లోu -
వ్యవసాయ బావిలో శ్వేతనాగు
దుగ్గొండి: వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిన శ్వేత నాగును సురక్షితంగా బయటికి తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఓ రైతుకు దుగ్గొండి మండల శివారులో వ్యవసాయ భూమి ఉంది. కొత్తగా తవ్వుతున్న బావిలో కొద్దిమేర నీరుండగా శుక్రవారం ఉదయం అందులో తెల్లటి నాగుపాము కనిపించింది. గమనించిన యజమాని దానిని కాపాడాలనుకుని పాములు పట్టే (స్నేక్క్యాచర్) దుగ్గొండి గ్రామానికి చెందిన ఎలబోయిన సాంబరావును పిలిపించాడు. కొద్దిపాటి నీళ్లను తోడాక సాంబరావు బావిలోకి దిగి శ్వేతనాగు పామును ప్రాణాలతో ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం ఊరి చివరి వాగు ఒడ్డున పొదల మధ్య వదిలిపెట్టాడు. సురక్షితంగా బయటకు తీసిన స్నేక్క్యాచర్ -
లక్ష్యం రూ.117.31 కోట్లు
● లక్ష్యం రూ.117.31 కోట్లు ● వసూళ్లు రూ.50.31 కోట్లు ● కొందరు అధికారుల తీరు ఆగమాగం ● జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ● సమీక్షలతో సరిపెడుతున్న ఉన్నతాధికారులువసూళ్లను చేధించని ఉద్యోగులకు తాఖీదులివ్వడం వరకే అధికారులు పరిమితమవుతున్నారు. క్షేత్ర స్థాయిలో రోజువారీగా ఏ మాత్రం వసూళ్లపై దృష్టి సారించట్లేదు. గ్రేటర్లో ఆస్తి, నీటి పన్నుల చెల్లింపునకు ఆన్లైన్ ద్వారా అనేక మార్గాలున్నాయి. వివిధ అవసరాల రీత్యా పన్ను చెల్లింపుదారులే 60 శాతానికిపైగా మీ సేవ కేంద్రాలు, డెబిట్, క్రిడెట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. కేవలం 30 శాతం మాత్రమే క్షేత్రస్థాయిలోకి వెళ్లి వార్డు ఆఫీసర్లు, ఆర్ఐలు పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో సిబ్బంది ఇతర పనులకు విధులు అప్పగించడంతో కూడా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఏడాదిలో 10 నెలల పాటు వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది రెండు నెలల గడువులోగా క్షేత్రస్థాయిలో ప్రజలు పన్నులు చెల్లించాలనే ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా గ్రేటర్ పన్నుల విభాగం సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాలి. భారీ బకాయిదారులపై దృష్టి సారించాల్సి న అవసరం ఉంది. లేకపోతే పన్ను వసూళ్ల లక్ష్యం వెనకబడిపోనుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 38 రోజుల గడువే మిగిలి ఉంది. నిర్ణీత గడువులోగా.. కనీసం 90 శాతం ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాలి. కానీ.. పది నెలల ఇరవై రోజులు గడిచినా.. లక్ష్యంలో కనీసం సగం కూడా వసూలు చేయని పరిస్థితి. గ్రేటర్ పన్నుల విభాగం యంత్రాంగం నిద్ర నుంచి మేల్కొనకపోతే లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. రావాల్సింది రూ.67 కోట్లు పన్ను వసూలుపై కొరవడిన శ్రద్ధకొరవడిన పర్యవేక్షణ.. ఆపసోపాలు.. లక్ష్యాన్ని చేరుకుంటాం.. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు బాగానే చేస్తున్నాం. నెల రోజులుగా రోజూ, వారాంతపు టార్గెట్లు పెట్టి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. మార్చి 31 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం. – రామకృష్ణ, బల్దియా పన్నుల విభాగాధికారి -
పీఆర్ ఏఈ రమేశ్కుమార్ సస్పెన్షన్
సంగెం: మండలంలో పీఆర్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న కంకణాల రమేశ్కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ వి.కనకరత్నం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. ఈనెల 10న మండలంలోని కుంటపల్లి గ్రామంలో ఓ ఇంటి అనుమతి కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న విషయం విదితమే. 10వ తేదీ నుంచి 48 గంటలకు మించి నేరానికి సంబంధించి నిర్బంధంలో ఉన్నందుకు ఏఈని సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఒకరి అరెస్ట్వరంగల్: ప్రభుత్వ భూముల్లో చేసిన ప్లాట్లను విక్రయిస్తూ.. అక్రమంగా వసూళ్లకు పాల్ప డుతూ.. ఇవ్వని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు వరంగల్ కాశిబు గ్గ వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంతేజార్గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ షుకుర్ మాట్లాడుతూ.. దేశాయిపేట శివారు ఎంహెచ్నగర్లోని ప్రభుత్వ భూముల్లో సీపీఎం పేరుతో గుడిసెలు వేసి వాటిని ఆధీనంలోకి తీసుకుని అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి నుంచి డబ్బులు తీసుకుంటూ, ఒకటే ప్లాట్ను ఇద్దరు, ముగ్గురికి అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. అడ్వాన్సులు ఇచ్చి ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే అదనంగా ఎక్కువ మొత్తంలో డబ్బులిస్తేనే ఆప్లాట్ను అప్పగిస్తానని మోసం చేస్తున్నాడని, డబ్బులు తీసుకున్న విషయం ఎవరికై నా చెబితే వారిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. గురువారం (20వ తేదీ)న బాధితులు నగరానికి చెందిన శిరీష, రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు షుకుర్ తెలిపారు. కాగా.. విచారణ అనంతరం దుబ్బ శ్రీనివాస్ తనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చేరినట్లు తెలిసింది. ఈవిషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. రేపటి నుంచి నాటికల పోటీలునయీంనగర్: కాళోజీ కళాక్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటిక సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. -
టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి: టీచర్ల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. శుక్రవారం వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు పలుచోట్ల ఆయన ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటు వేయాలని అధ్యాపకులను అభ్యర్థించారు. కాగా.. పింగిళి శ్రీపాల్రెడ్డిని గెలిపించాలని పీఆర్టీయూ బాధ్యులు డాక్టర్ కుండూరు సుధాకర్, విజయ్పాల్రెడ్డి, కమీరుద్దీన్, రఘవేందర్, డాక్టర్ రాజేందర్ శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, వరంగల్ఎల్బీ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ప్రచా రంలో పీఆర్టీయూ జిల్లా బాధ్యులు మంద తిరుపతిరెడ్డి, భానుప్రసాద్రెడ్డి, కె.రజిత పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి -
బాలికలకు కరాటే శిక్షణ
నల్లబెల్లి: బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం కరాటేలో శిక్షణ ఇస్తోంది. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో రాణిలక్ష్మీబాయి ఆత్మ రక్షణ ప్రశిక్షణ్ పేరుతో నిష్ణాతులైన మాస్టర్లు కరాటేలో మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులు శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడు నెలలు.. 36 తరగతులు మూడు నెలల (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) సమయంలో వారానికి మూడు రోజుల చొప్పున 36 శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు అవసరమైన ట్రైనర్లను కూడా నియమించింది. జిల్లాలోని 127 ఉన్నత పాఠశాలల్లో 9,669 మంది, 10 కస్తూర్బా గాంఽధీ బాలికల విద్యాలయాల్లో 2,673 మంది, ఐదు ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 142 మంది విద్యార్థినులకు కరాటే మాస్టర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో విద్యార్థినులు ప్రతిభ చాటుతున్నారు. ఆరు నెలలకు పెంచాలి.. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇస్తున్న కరాటే శిక్షణ తరగతులు మూడు నెలలు సరిపోవడం లేదని విద్యార్థినులు, కరాటే మాస్టర్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సమయంలో పూర్తిస్థాయి శిక్షణ పొందే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేందుకు రాబోయే విద్యాసంవత్సరంలో కనీసం ఆరు నెలలపాటు కరాటే శిక్షణ ఇచ్చేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు మెళకువలు నేర్పిస్తున్న మాస్టర్లు సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థినులు -
పాకాలకు బ్యాటరీ వాహనాలు
జిల్లాలో పర్యాటక ప్రాంతమైన పాకాలను అటవీశాఖ ఆధ్వర్యంలో ఆధునీకరిస్తున్నారు. పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. బోటింగ్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పర్యాటకులు ప్రధాన ముఖద్వారం నుంచి వ్యూ పాయింట్ను వీక్షించడానికి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీంతో రెండు బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఒక్కో వాహనంలో పది మందికి పైగా కూర్చొని పాకాలను వీక్షించే అవకాశం కలుగనుంది. రెండు వాహనాలను త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. – ఖానాపురం -
ప్రణాళికలు సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా సాధికారత దిశగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, ఉత్పత్తి తయారీ యూనిట్ను ప్రణాళికతో రూపొందించాలని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ (వీహబ్) ప్రతినిధులకు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లాలోని ల్యాదెళ్లలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం ఉదయం వీ హబ్ ప్రతినిధులు, ఇతర అధికారులు సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్తో వారు సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి, ఉత్పత్తి తయారీకి సంబంధించిన వార్షిక ప్రణాళికను సమన్వయంతో రూపొందించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. పరకాల నియోజకవర్గ పరిధి మహిళా గ్రూపులకు ఏయే అంశాల్లో శిక్షణను నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మహిళా సాధికారతకు చేయూతనందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి కేంద్రంలో మహిళలకు జ్యూట్ బ్యాగ్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలి..విద్యారణ్యపురి: ఇష్టపడి చదివితే భవిష్యత్లో దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో చదివే అవకాశం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్ విద్యార్థులు ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్లో భాగంగా వరంగల్ నిట్ను సందర్శించారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలైన వరంగల్ నిట్లోని సాంకేతికత, సాంకేతికేతర విభాగాలను, వివిధ ప్రాజెక్టులను పీఎం శ్రీ స్కూల్ విద్యార్థులు సందర్శించి నిట్ ఆచార్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ డి.వాసంతి, వరంగల్ నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆచార్య శ్రీనివాసాచార్య, నెహ్రూ యువ కేంద్ర జిల్లా కో–ఆర్డినేటర్ అన్వేశ్ ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
వర్ధన్నపేట.. డిజిటల్ బాట
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ డిజిటల్ బాట పట్టింది. సాగు భూములకు పక్కా నక్షా పట్టాలు ఉన్నట్లుగానే ఈ మున్సిపాలిటీ విస్తీర్ణంలోని అన్ని ఆస్తులను వాస్తవ హద్దులతో ఆన్లైన్లో నమోదు చేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆర్వీ సంస్థతో కలిసి సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్లతో 41.43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఇల్లు, ఆస్తిని పక్కాగా సర్వే చేసింది. అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులను గుర్తించి డిజిటలైజ్ చేసే దిశగా వేగిరం పెంచారు. వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్నారు. త్వరలోనే డిజిటల్ పనిని పూర్తి చేసి వాస్తవిక హద్దులతో సరిపోల్చనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి ఇల్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ కార్డులతో ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వమే హద్దులతో కూడిన కార్డులు అందించడం వల్ల ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలుగుతుంది. బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో చిన్న ఇళ్లు, స్థలాలకు సైతం పక్కాగా పట్టాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర పథకం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (ఎన్ఏకేఎస్ హెచ్ఏ–నక్షా) కింద పట్టణాలకు నక్షాలను రూపొందించే కార్యక్రమానికి వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎంపికై న సంగతి తెలిసిందే. వర్ధన్నపేట పట్టణంలోని ప్రతి ఇల్లు వాస్తవిక హద్దులను డ్రోన్ల ద్వారా ఫొటోతో క్యాప్చర్ చేశారు. అక్షాంశాలు, రేఖాంశాల (జియో కోఆర్డినేట్స్)తో ఆస్తుల హద్దులు గుర్తించి, వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిశాక పట్టణంలో రెండు వేలకుపైగా ఉన్న ఇళ్లకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరుగుతుంది. అదేసమయంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, చెరువుల విస్తీర్ణం కూడా పక్కాగా తేలనుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్న 12 డివిజన్లలో ఇప్పటివరకు ఆస్తి పన్ను కట్టేవారి సంఖ్య వందల్లోనే ఉంది. 3,200 ఇళ్లు ఉంటే 1,800 మంది ఆస్తి పన్ను కట్టడం లేదు. 1,400 మంది ఇంటి యజమానుల ద్వారా ఏటా సరాసరి రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. ఈ సర్వేతో ప్రతి ఒక్కరి ఇంటికి డిజిటల్ కార్డు ఇవ్వడం వల్ల ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫలితంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి ఏటా ఇంటి పన్ను రూపంలో వచ్చే ఆదాయం మరింత పెరుగనుంది. ●ప్రభుత్వ పథకాల అమలు సులభం.. డిజిటల్ పక్కా నక్షాతో మున్సిపాలిటీలో ప్రభుత్వ పథకాల అమలు సులభం కానుంది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు గురికాకుండా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది ఉండదు. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల గొడవలు సాధ్యమైనంత మేర తగ్గుతాయి. – సుధీర్కుమార్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ డిజిటల్ కార్డుల జారీతో ఆదాయం.. -
డంపింగ్యార్డుల్లోకి చెత్త
చెన్నారావుపేట: డంపింగ్యార్డుల్లోకి చెత్త చేరుతోంది. తడి, పొడి చెత్తను పంచాయతీ కార్యదర్శులు వేరు చేస్తున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో డంపింగ్ యార్డులు నిర్మించింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి కల్పన స్పందించారు. ఆమె ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తమయ్యారు. బయట వేసిన చెత్తను వేరుచేసి డంపింగ్యార్డులకు తరలించారు. అంతేకాకుండా చెత్త సేకరణ కేంద్రంలో సేంద్రియ ఎరువు తయారీ పనులు కూడా ప్రారంభించారు. దీంతో ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్యాధికారులు నిబద్ధతతో సేవలందించాలి
ఎంజీఎం: వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో సేవలందించాలని హనుమకొండ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ విజయకుమార్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పూరిగుట్ట బస్తీ దవాఖాన, వడ్డేపల్లి యూపీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అక్కడ అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు. రక్త, మూత్ర పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తున్న శాంపిళ్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాయి సేవా ట్రస్ట్, స్పందన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హరిత, మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ మాధవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన హన్మకొండ కల్చరల్: ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వివిధ శాఖల అధికారులు వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. శివరాత్రికి వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీపీ అంబర్ కిషోర్ ఝా సూచన మేరకు హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి, సీఐ సతీశ్, పోలీస్ సిబ్బంది, ఆర్అండ్బీ, పురావస్తుశాఖ సిబ్బంది.. దేవాలయ ఈఓ అనిల్కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజు సాయంత్రం జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం జాగారం చేసే భక్తుల కోసం పండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేశారు. రేపటి నుంచి నాటికల పోటీలునయీంనగర్: ఈనెల 23 నుంచి 26 వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటిక సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏవీ.నరసింహారావు, టి.లక్ష్మణరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్నయీంనగర్: హనుమకొండ కిషన్పుర ఆర్డీ జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం హాస్టల్లో తిన్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వారిని వెంటనే కళాశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. అనంతరం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది.. వచ్చి తీసుకెళ్లండని వారికి అప్పగించి ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులు కొందరు కడుపునొప్పితో బాధపడుతుండగా.. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హనుమకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. కళాశాల డైరెక్టర్ మల్లేశంను వివరణ కోరగా.. తమ కాలేజీలో అలాంటి ఘటనేమీ జరగలేదని సమాధానమిచ్చారు. -
మొత్తం నల్లా కనెక్షన్లు
వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నుపై బల్దియా అధికారులు శ్రద్ధ కనబర్చడం లేదని తెలుస్తోంది. కొత్త ఇంటి నంబరు, ఆస్తి పేరు మార్పిడి, విభజన ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. పదిన్నర నెలలుగా అధికారులు చేపట్టిన పన్ను వసూళ్లు చూస్తే వారి పనితీరు, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. 2024–25 సంవత్సరానికి రూ.117.31 కోట్లు పన్ను వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు పదినెలలు దాటినా రూ.50.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పన్నుల లక్ష్యాన్ని చేధించడంలో వెనుకబడడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు సిబ్బంది.. అలసత్వం కూడా తోడవడంతో పన్ను వసూళ్లు ముందుకు సాగట్లేదు. మొండి బకాయిదారులను గుర్తించి వారిపై ఒత్తిడి పెంచడంలోనూ అడుగడుగునా వైఫల్యం కనిపిస్తోంది. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులు, ఆస్తుల పేరు మార్పిడి, విభజన, వీఎల్టీ, రీ అసెస్మెంట్పై పెడుతున్న శ్రద్ధ పన్నుల వసూళ్లపై చూపట్లేదు. కొలతల పేరుతో అందినకాడికి దండుకోవడానికి అవకాశం ఉండడంతో ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు అటువైపు మాత్రమే దృష్టి సారిస్తున్నట్లు విమర్శలున్నాయి. పన్ను బకాయిలు పెరగడానికి సక్రమంగా వసూలవకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు. 2024–25 డిమాండ్ రూ.41.54 కోట్లు, వసూళ్లు రూ.7.68 కోట్లు పాత బకాయిలు రూ.25.32 కోట్లు, వసూళ్లు రూ.4.38 కోట్లు వసూలు చేయాల్సిన బకాయిలు రూ.54.80 కోట్లు 18.05% వసూళ్లు1,77,841లోపమెవరిది?బల్దియాలో ఇలా.. మొత్తం అసెస్మెంట్లు 2,17,615 -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా..సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 6,509 మంది పురుషులు, 4,288 మంది సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించేలా అధికారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకట రాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. 7270మండలాలుపోలింగ్ కేంద్రాలుపురుషులు6,509మొత్తం సీ్త్రలు10,797 4,288ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుసిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తివరంగల్: ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల కోసం జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. విధులు నిర్వర్తించే 18 మంది పీఓలు, 18 మంది ఓపీఓలు, 16 మంది మైక్రో అబ్జర్వర్లకు మొదటి విడత శిక్షణ పూర్తిచేశామని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ మెటీరియల్ రవాణాకు 6 రూట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఎలక్షన్ డీటీ రంజిత్ పాల్గొన్నారు.ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా..జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలు హనుమకొండ 11 15 2884 2214 5098 వరంగల్ 13 13 1381 844 2225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1083 535 1618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 -
దేవుడు దూరం చేసిండు!
ఆసరా అయితారనుకుంటే..నడికూడ : ఎదిగిన కొడుకులు ఆసరా అయితారునుకున్నాం.. దేవుడు మా బిడ్డలను దూరం చేసిండంటూ తల్లిదండ్రులు రోదించిన తీరును చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు. మండలంలోని కంఠాత్మకూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని అన్నదమ్ములు మృతి చెందారు. దామెర పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన ఉప్పుల చంద్రానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజ్కుమార్ (25) హనుమకొండలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్న కొడుకు శంకర్ (22) ఐటీఐ చదువుతున్నాడు. గురువారం రాత్రి అన్నదమ్ములతో పాటు, వారి స్నేహితుడు కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బండారి శివకుమార్ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో కంఠాత్మకూర్ హనుమాన్ గుడి వద్ద వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, శంకర్ను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలతో శివకుమార్ చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలిని పరకాల రూరల్ సీఐ రంజిత్రావు పరిశీలించారు. మృతుల తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దామెర ఎస్సై కొంక అశోక్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు, బంధువులు -
రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
వర్ధన్నపేట: రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు బ్యాంకు అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల ఖాతాలు మెరుగుపరిచి వారికి మాఫీ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వర్ధన్నపేట డీసీసీబీ కార్యాలయంలో వర్ధన్నపేట, రాయపర్తి, నందనం, ఐనవోలు సొసైటీలు, ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీల మేనేజర్లు, నోడల్ అధికారులు, సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలను లీగల్గా కవర్ చేసి రికవరీ చేయాలన్నారు. బ్యాంకు లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిపాజిట్లు, బంగారు ఆభరణాల రుణాలపై దృష్టిసారిస్తూ బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ రవీందర్రావు కోరారు. నోడల్ అధికారి ఏజీఎం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, శ్రావణ్, భద్రునాయక్, పాక్స్ చైర్మన్ రాజేశ్ఖన్నా, రామచంద్రారెడ్డి, సొసైటీ సీఈఓలు యాదగిరి, సంపత్, సోమయ్య, సిబ్బంది సురేశ్, సమ్మయ్య, ఉమేశ్ పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
సబ్స్టేషన్లను పటిష్టం చేయాలి
వర్ధన్నపేట: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సబ్స్టేషన్లను పూర్తిగా పటిష్టపరచాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ (ప్రాజెక్టు) భీకంసింగ్ అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట, ల్యాబర్తిలోని సబ్స్టేషన్లను గురువారం ఆయన సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వర్ధన్నపేట పరిధిలో ఆరు సబ్స్టేషన్లు ఉండగా వర్ధన్నపేట, ల్యాబర్తి సబ్స్టేషన్లలో అంతర్గత పనులు పూర్తిస్థాయిలో చేపడతున్నట్లు పేర్కొన్నారు. దీంతో వచ్చే వేసవిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏడీఈ ప్రాజెక్టు బి.రవి, వర్ధన్నపేట ఏడీఈ నటరాజ్, ఏఈ తరుణ్, విద్యుత్ సిబ్బంది ఉన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ భీకంసింగ్ -
280 బస్తాల నూకలు స్వాధీనం
● కేసు నమోదు చేసిన పోలీసులు నెక్కొండ: లారీలో అక్రమంగా తరలిస్తున్న 280 బస్తాల నూకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం నూకలు తరలిస్తున్న లారీని ఈ నెల 19న రాత్రి సమయంలో నెక్కొండలో పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన డ్రైవర్ సంతోష్ను అదుపులోకి తీసుకుని లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను విచారించగా మండల కేంద్రానికి చెందిన గందె సజన్కు సంబంధించిన నూకలని తేలింది. సమాచారం మేరకు పౌరసరఫరాల డీటీ సంధ్యారాణి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నూకలు రేషన్ బియ్యానికి సంబంధించినవా కాదా అనే కోణంలో విచారణ చేపట్టారు. నూకల శాంపిళ్లను సేకరించి టెస్ట్కు పంపనున్నట్లు ఆమె తెలిపారు. సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. 112 క్వింటాళ్ల (280 బస్తాలు) నూకల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. నల్లబెల్లి ఎంఈఓగా వసంతను కొనసాగించాలి వరంగల్: నల్లబెల్లి ఇన్చార్జ్ ఎంఈఓగా వసంతను కొనసాగించాలని ఎమ్మార్పీఎస్, ఎల్హెచ్పీఎస్, ఎరుకుల సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సత్యశారదను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్చార్జ్ ఎంఈఓగా పనిచేస్తున్న వసంతను కొందరు బాధ్యతల నుంచి తొలగించారని ఆరోపించారు. ఈవిషయంపై పునరాలోచన చేసి ఆమెను కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొమ్ముల బాబు, జైసింగ్ రాథోడ్, మంద కుమార్ పాల్గొన్నారు. ‘నిట్ స్ప్రింగ్స్ప్రీ–25’కి బ్రహ్మానందంకాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ఈనెల 28, మార్చి 1, 2 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్ప్రింగ్స్ప్రీ–25 వేడుకలకు ముఖ్య అతిథిగా హాస్య నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హాజరు కానున్నట్లు నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. ౖస్ప్రింగ్స్ప్రీ–25 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను గురువారం హెదరాబాద్లోని బ్రహ్మానందం నివాసంలో అందజేసినట్లు డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. నిట్లో ప్రతీ ఏడాది వార్షిక సాంస్కృతిక మహోత్సవం వసంతోత్సవాన్ని నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి నిట్ వసంతోత్సవానికి విద్యార్థులు వస్తుంటారని, ఈఏడాది హాస్య నటుడు బ్రహ్మా నందం రాకతో స్ప్రింగ్స్ప్రీ–25 హాస్యానికి వేదికగా నిలువనుందని తెలిపారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్లకు పదోన్నతులుకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న 40 మంది గూడ్స్ ట్రైన్ మేనేజర్లు (గార్డులు) సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్లుగా పదోన్నతులు పొందినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. పదోన్నతులు పొందిన వారిలో కొందరిని బెల్లంపల్లి, రామగుండం, డోర్నకల్కు రైల్వేస్టేషన్లకు బదిలీపై పంపిస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన పలువురికి కాజీపేట రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ రిలీవ్ లెటర్స్ అందజేశారు. ఓపెన్ బీఎడ్ అడ్మిషన్ ఫీజు గడువు పొడిగింపు విద్యారణ్యపురి: హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ (ఓడియల్) అడ్మిషన్ ఫీజు చెల్లింపు గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు ఆ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25సంవత్సరానికిగాను బీఎడ్ ఓడియల్ ప్రవేశ పరీక్ష–24 మొదటి దశలో కౌన్సెలింగ్లో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 22 వరకు ఫీజు చెల్లించాలని కోరారు. పూర్తి వివరాలకు 040–23680333/444/544 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లేదా సంబంధిత వెబ్సైట్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
● నిబంధనలు పాటించకపోతే బిల్లుల్లో కోత ● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేవరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ, ఇతర అభివృద్ధి పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధి సుందరయ్యనగర్లో సీసీ రోడ్డు డ్రెయిన్, 18వ డివిజన్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని కమ్యూనిటీహాల్, చింతల్లో సీసీరోడ్డు డ్రెయిన్, 33వ డివిజన్ శాంతినగర్లో కొనసాగుతున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. హనుమకొండ పరిధి హసన్పర్తి భీమారంలో సీసీరోడ్డు డ్రెయిన్ పనులను కమిషనర్ కొలతల ద్వారా పరిశీలించారు. ఆమె వెంట ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు రవికిరణ్, రాజ్కుమార్, ఏఈలు మోజామిల్, సతీశ్, స్మార్ట్సిటీ పీఎంసీ భాస్కర్రెడ్డి, శ్రీనివాసరాజు ఉన్నారు. -
అందరూ ఒక్కటయ్యారు!
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారులు, కొనుగోలుదారుల గుమస్తాలు, కొంతమంది ఉద్యోగులు ఒక్కటై మిర్చి ధరలు తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తెగుళ్లతో మిర్చి దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్ది పంటను అమ్ముకునేందుకు వరంగల్ మార్కెట్కు తీసుకువస్తే అందరూ ఒక్కటై ధరలు తగ్గిస్తున్నారని, తెచ్చిన సరుకులు తిరిగి తీసుకుపోలేక, కోల్డ్స్టోరేజీల్లో పెట్టేస్థాయి లేకపోవడంతో రైతులు కొనుగోలుదారులు చెప్పిన ధరలేక విక్రయిస్తూ ఇంటి ముఖం పడుతున్నారు. కోల్డ్స్టోరేజీల్లో పెట్టుకుంటే రూ.2 లక్షల వరకు 6 నెలలపాటు వడ్డీలేని రుణం వస్తుంది కదా అని ప్రశ్నిస్తే.. ఆ పథకంలో డబ్బులు మంజూరయ్యేవరకూ అప్పులిచ్చినవారు ఆగే పరిస్థితి లేకపోవడంతో తెచ్చిన మిర్చి పంటను విక్రయిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మార్కెట్లో ఈ–నామ్ అమలు చేయడం లేదు. గురువారం సుమారు 35 వేల బస్తాల మిర్చి వచ్చినట్లు మార్కెట్ ఉద్యోగులు తెలిపారు. ధరల పతనం వెనుక దళారుల హస్తం! మిర్చి ధరలు రోజురోజు పడిపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధరల నిర్ణయంలో దళారుల దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతోంది. సీజన్లో మార్కెట్కు వచ్చే సరుకు పెరుగుతున్న కొద్ది ధరలు పడిపోవడం వెనుక దళారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో ఉన్న మిర్చి ధరలు క్రమేణా తగ్గడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. 2024 జనవరిలో గరిష్ట ధర క్వింటాలుకు రూ.24,000 ఉండగా.. కనిష్టంగా రూ.14,000కు తగ్గలేదు. ఈ జనవరిలో గరిష్టంగా రూ.16,000, కనిష్టంగా రూ.11,000 ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన రైతు సంఘాల ప్రతినిధులు మార్క్ఫెడ్తో కొనుగోలు చేయించాలని, మిర్చి రైతులకు పంట నష్టం కింద కేంద్రం మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతపై నజర్ పెట్టని అధికారులు.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిస్థితి. మార్కెట్ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, ఇద్దరు గ్రేడ్–2 కార్యదర్శులతో కలిపి మొత్తం 110 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇద్దరు గ్రేడ్–2 కార్యదర్శులతో కలిసి 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మార్కెట్లో సరుకుల విక్రయాలపై పూర్తిగా అధికారుల నజర్ లేకుండా పోయింది. ఉన్న వారికే అదనంగా బాధ్యతలు అప్పగించడంతో రైతులు తెచ్చిన సరుకుల ధరలు ఎలా నిర్ణయిస్తున్నారన్న విషయాలు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. సరుకులో తేమ ఏమేరకు ఉందన్న వివరాలను కొనుగోలుదారుడికి చెప్పేవారు లేకపోవడంతో దళారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన మిర్చి బస్తాలు.. ఈ ఏడాది వచ్చిన బస్తాలను పరిశీలిస్తే పెద్ద మొత్తంలో జీరో దందా సాగుతోందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మార్కెట్లో మిర్చి ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. నాలుగేళ్లలో మార్కెట్కు వచ్చిన మిర్చి క్వింటాళ్లలో.. అడ్తిదారులు, గుమస్తాలు, కొంతమంది ఉద్యోగుల సిండికేట్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేటు తగ్గిస్తున్నా పట్టించుకోని అధికారులు తక్కువ ధరకు సరుకు విక్రయించి నష్టపోతున్న రైతులునెల 2020–21 2021–22 2022–23 2023–24 2024–25 డిసెంబర్ 8,604 40,193 7,704 22,422 37,826 జనవరి 20,785 63,732 53,025 1,24,163 91,341 ఫిబ్రవరి 1,64,831 1,35,166 2,49,267 2,68,769 85,042 -
మార్చి 31 వరకు ఎన్సీడీ స్క్రీనింగ్
గీసుకొండ: అసంక్రమిత వ్యాధుల (ఎన్డీసీ) నిర్ధారణకు ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్చి 31 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైపర్ టెన్షన్ కోసం 3,982 మందికి పరీక్షలు చేయగా 20 మందికి, 3701 మందికి మధుమేహం పరీక్షలు చేయగా 14 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు గుర్తించామని వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, పల్లె, పట్టణ దవాఖానల వైద్యులు, సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు వంద శాతం స్క్రీనింగ్ పూర్తిచేయాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్, కోఆర్డినేటర్ రేవూరి ప్రకాశ్రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు -
ఎక్కడి చెత్త అక్కడే!
చెన్నారావుపేట: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల క్రితం రూ.రెండు లక్షల ఉపాధి హామీ నిధులతో డంపింగ్ యార్డును నిర్మించింది. కానీ, నిర్వహణ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. నిర్మించినప్పటి నుంచి వృథాగా కనిపిస్తున్నాయి. సిబ్బంది లేర నే సాకుతో.. జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీలో కూడా తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మికంపోస్ట్ ఎరువును తయారు చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో డంపింగ్యార్డుల సమీపంలో పోసి చెత్తను కాల్చివేస్తుండగా.. మరికొన్ని గ్రామాల్లో రోడ్లపై వేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేరని, ఉన్న పనులు చేయడానికి సమయం సరిపోవడం లేదని, కొత్తగా డంపింగ్యార్డుల నిర్వహణ ఎలా చేపట్టాలని కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. వీటి నిర్వహణ విషయంలో మండల, జిల్లాస్థాయి అధికారులు సైతం శ్రద్ధ చూపించకపోవడం శోచనీయం. కనీ సం ఏడాదిలో ఒక్కసారైనా వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డంపింగ్యార్డుల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ఎంపీఓలకు ఆదేశాలిచ్చాం.. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయించి, సేంద్రియ ఎరువు తయారు చేయించాలని ఎంపీఓలకు ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి సేకరించిన చెత్తను డంపింగ్యార్డులకు తరలించాలని సూచించాం. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటాం. – కల్పన, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో నిరుపయోగంగా డంపింగ్యార్డులు గ్రామాల్లో రోడ్లపై పేరుకుపోతున్న చెత్తాచెదారం పట్టించుకోని పాలకులు, అధికారులు 11 గ్రామీణ మండలాల్లో 320 కంపోస్ట్ షెడ్ల నిర్మాణంఉపయోగంలోకి తేవాలి.. కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో తడి చెత్త, పొడి చెత్త వేరుచేయాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో డంపింగ్ యార్డులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించింది. అంతేకాకుండా సేంద్రియ ఎరువు తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేది. అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్యార్డుల్లో కాకుండా చెత్తను వేరే ప్రదేశాల్లో వేసి కాల్చేయడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్రభు త్వ లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డులను ఉపయోగంలోకి తేవాలి. – ఎర్ర రాజు, కోనాపురం -
జిల్లాలో మండలాల వారీగా నిర్మించిన డంపింగ్ యార్డుల వివరాలు..
చెన్నారావుపేట 30దుగ్గొండి 34గీసుకొండ 21ఖానాపురం 20నల్లబెల్లి 29నర్సంపేట 26నెక్కొండ 39పర్వతగిరి 33రాయపర్తి 38సంగెం 33వర్ధన్నపేట 17మొత్తం 320 -
నలుగురు మోటార్ల దొంగల అరెస్ట్
ఖానాపురం: విద్యుత్ మోటార్ల చోరీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ తెలిపారు. ఈ మేరకు ఖానాపురం పోలీస్స్టేషన్లో ఎస్సై ఛాగర్ల రఘుపతితో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చోరీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అశోక్నగర్–పర్శనాయక్తండా మధ్య పంటపొలాల్లోని రైతుల మోటార్లు ఇటీవల చోరీకి గురయ్యాయి. దీంతో రైతుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై రఘుపతి అనుమానితుల వివరాలు సేకరించి అశోక్నగర్ శివారులో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. నర్సంపేట మండలంలోని కొండసముద్రంతండాకు చెందిన ధరావత్ రాంసింగ్, ధరావత్ మల్లు ద్విచక్ర వాహనంపై, జన్ను ముఖేశ్, హనుమకొండలోని చింతగట్టు క్యాంపు ఏరియాకు చెందిన ఆకారపు నవీన్ నడుచుకుంటూ వస్తున్నారు. తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పరిశీలించగా కట్టర్, హాక్సాబ్లేడ్ లభించాయి. నడుచుకుంటూ వస్తున్న వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఇటీవల విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. చోరీ చేసిన మోటార్లను ద్విచక్ర వాహనంపై చిలుకమ్మతండాలోని రాంసింగ్ బంధువు అయిన విజేందర్ ఇంటి వద్ద దాచినట్లు చెప్పారు. అక్కడకు వెళ్లి రూ.1.25 లక్షల విలువ చేసే 9 మోటార్లతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీలను ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. సిబ్బంది సంతోష్, సుమన్, వీరస్వామి, లింగ మూర్తి, ప్రవీణ్, హోంగార్డు ఎర్రయ్య పాల్గొన్నారు. నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ వివరాల వెల్లడి -
మేడారంలో వృద్ధుడి అదృశ్యం
ఖానాపురం: మేడారంలో వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు జబ్బ సారంగం ఈనెల 13న కుటుంబ సభ్యులతో కలిసి మేడారం వెళ్లాడు. తల్లుల దర్శనం అనంతరం మ్యూజియం సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. వృద్ధుడిని అక్కడే ఉంచి కుటుంబ సభ్యులు జాతరలో వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లారు. తిరిగి వారు వచ్చి చూడగా ఆయన కనిపించలేదు. జాతరలో వెతికినా ఆచూకీ లభించలేదు. సారంగం బంధువు కంగల చంద్రయ్య ఫిర్యాదు మేరకు గురురవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. -
మత్తు పదార్థాలను నియంత్రించాలి
వరంగల్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్తో కలిసి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తే సమాజంలో మార్పు తీసుకురావొ చ్చని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో మత్తుపదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ రవీందర్ మాట్లాడుతూ ప్రతి నెల నార్కోటి క్స్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చందర్, ఎఫ్ఆర్ఓ సందీప్, నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 17 వరకు సీఎంఆర్ పూర్తి చేయాలి జిల్లాలో 2023–24 రబీకి సంబంధించిన సీఎంఆర్ మార్చి 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులు, మిల్లర్లతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 2024–25 రబీ సీజన్లో 2 లక్షల 10వేల మెట్రిట్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందని తెలిపారు. 2023–24 ఖరీఫ్ సీఎంఆర్ 100 శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ పత్రాలను తీసుకోవాలని, ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఏఓ అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా కోఆపరేటివ్ అధికారి నీరజ, ఆర్డీఓ ఉమారాణి, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి, జిల్లాకు పేరు తేవాలి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కేడీ సింగ్బాబు స్టేడియంలో జరుగనున్న బ్లైండ్ పారా జోడో జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రంతోపాటు జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల 18న హైదరాబాద్లో జరిగిన బ్లైండ్ పారా జోడో పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని బంగారు పతకాలు సాధించి, జాతీయ పోటీలకు అర్హత పొందిన క్రీడాకారులను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ టీవీఎల్.సత్యవాణి, జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు జేశ్యనాథ్, రాంచరణ్, జీవన్, హరిహరణ్, శ్రీకాంత్, నాగరాజు, సతీశ్, వినోద్, గౌతం పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
స్మార్ట్సిటీ డెడ్లైన్ 31మార్చి
వరంగల్ అర్బన్ : కీలకమైన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూపామిశ్రా సూచించారు. బుధవారం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఎంపికై న నగరాల మేనేజింగ్ డైరెక్టర్లు, కమిషనర్లు, అధికారులతో ఆమె న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి పనులు పురోగతిపై సమీక్షించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు పూర్తయినప్పటికి మరికొన్ని నెలలు పొడిగించినట్లు తెలిపారు. అయినప్పటికి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. నిర్ణీత గడువులోగా నిధులు వినియోగించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో వేగం పెంచాల్సిందే: కమిషనర్ స్మార్ట్ సిటీ పనులను నిర్ధిష్ట గడువులోగా ఇంజనీర్లు వెంట పడి పూర్తి చేయాల్సిందేనని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. వీసీ ముగిసిన అనంతరం కమిషనర్, ఇంజనీర్లు హనుమకొండలో క్షేత్రస్థాయిలో స్మార్ట్సిటీ పనులను తనిఖీ చేశారు. నిధులను వినియోగించుకోండి అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా -
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు●
● వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమలాపూర్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ కోసం కమలాపూర్ మండలం అంబాలలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. తనిఖీ సమయంలో సిబ్బంది తప్పనిసరిగా వాహన వివరాలు నమోదు చేసుకోవాలని, ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించాలన్నారు. నిరంతరం ఇసుక రవాణాపై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం కమలాపూర్ మండలం నుంచి ఇసుక తరలించే అంబాల, నేరెళ్ల వాగులను సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలకు సంబంధించిన వివరాలను స్థానిక ఇన్స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతోపాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం కమలాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలతోపాటు ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
హనుమకొండలో చేతులకు సంకెళ్లతో నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనేఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు.సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పట్నవాసం వద్దు.. పల్లె నివాసమే బెస్ట్ ఉమ్మడి వరంగల్లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772న్యూస్రీల్జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటురూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి.. ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
ఆర్టీసీకి ఆదాయం సమకూర్చాలి : డీఎం
నర్సంపేట: ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చడానికి కృషిచేయాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు నర్సంపేట డిపోలో ఉద్యోగులకు బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. పర్యవేక్షకుడు, వరంగల్ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం కేశరాజుభానుకిరణ్ మాట్లాడుతూ ప్రయాణికులకు సేవలు అందించేందుకు కండక్టర్లు, డ్రైవర్లు, అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ సిబ్బంది సహకారంతో మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని వివరించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఎంఎఫ్ ప్రభాకర్, ఎస్డీఐ వెంకటేశ్వర్లు, సేఫ్టీ వార్డెన్ బాబు, ఏడీసీ మల్లికార్జున్, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధన.. సృజనాత్మకత..
ట్విన్నింగ్ (జంటీకరణ) స్కూల్స్ అంటే ..? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సమీపంలోని ఉన్నతవిద్యాసంస్థతో అనుసంధానం చేయడమే ట్విన్నింగ్. ● దీనివల్ల ప్రముఖ విద్యాసంస్థల్లోని అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేలా ప్రోత్సహించడం, విద్యార్థులతో ముఖాముఖి ద్వారా స్ఫూర్తిని కలిగించేందుకు దోహదం చేస్తుంది. ● ఉన్నత విద్యాసంస్థల్లోని ల్యాబ్స్, లైబ్రరీలు, తరగతి గదులు, క్రీడా వసతులు ఎలా ఉన్నాయి, వర్క్షాప్ల పరిశీలన, విద్యాధిపతులు, అక్కడి అధ్యాపకులను కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తారు. విద్యారణ్యపురి: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి లోని ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎంశ్రీ) హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను విస్తృతపరిచేలా, విద్య, పరిశోధనరంగాల పరంగా ఎలా ముందుకెళ్లాలో తెలిపేందుకు ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ట్విన్నింగ్ (జంటీకరణ) ఆఫ్ స్కూల్స్ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని పీఎంశ్రీ స్కూల్స్ విద్యార్థులను వరంగల్ నిట్కు అనుసంధానించారు. విద్యార్థులు ఆ విద్యాసంస్థను సందర్శించి వసతులు, ల్యాబ్స్, లైబ్రరీ పరిశోధనల పరంగా ఎలా ముందుకెళ్తున్నారనేది ప్రత్యక్షంగా తిలకించటంతోపాటు, అక్కడి అధ్యాపకులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉండేలా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. దీనిపై నిట్ అధికారులతో సంప్రదించి ఒక ప్రోగ్రామ్ను డీఈఓ వాసంతి ద్వారా రూపొందించారు. విద్యార్థులు నేడు(గురువారం), రేపు వరంగల్ నిట్ను సందర్శించనున్నారు. జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూల్స్ పీఎంశ్రీకింద జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో కేంద్ర 60శాతం, రాష్ట్రం 40శాతం నిధులను మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనాలతో కూడిన విద్యాభివృద్ధికి కేటాయిస్తున్నారు. పీఎంశ్రీకింద ఎంపికైన ప్రభుత్వ హైస్కూ ళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులు కలిపి జిల్లాలో సుమారు 2వేలమంది ఉంటారు. షెడ్యూల్ ప్రకారం నేడు (గురువారం) ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఒక సెషన్లో 500మంది, మధ్యాహ్నం 2–10 నుంచి సాయంత్రం 5–45గంటల వరకు మరో 500 మంది, 21వ తేదీన మరో 1000మంది విద్యార్థులు వరంగల్ నిట్ను సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. వారిని ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తారు. నిట్తోపాటు హనుమకొండలోని రీజినల్ సైన్స్ సెంటర్, జూపార్క్, వేయిస్తంభాల గుడిని సందర్శిస్తారు.హైస్కూల్ విద్యార్థుల్లో పెంపునకు శ్రీకారం జిల్లా పీఎంశ్రీ పాఠశాలలు నిట్తో అనుసంధానం నేడు, రేపు ఆ విద్యాసంస్థను సందర్శించనున్న పిల్లలు -
ఛత్రపతి శివాజీకి ఘన నివాళి
సాక్షి, నెట్వర్క్: జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషిచేసిన శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వేడుకల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆరె సంక్షేమ సంఘం, ఏబీవీపీ, బీజేపీ, బీజేవైఎం, ఛత్రపతి శివాజీ యువదళ్ నాయకులు పాల్గొన్నారు. -
కార్పొరేట్కు అనుకూలంగా బడ్జెట్
– 9లోuవిద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి శాయంపేట: మండలంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను, మాందారిపేట శివారులోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల్లోని వంట గది, చేసిన వంటలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో నీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్.. అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే మిషన్ భగీరథ డీఈ, ఏఈలతో ఫోన్లో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంట నిర్వాహకులు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ప్రతీరోజు తాజా కూరగాయలు తెప్పించి వంట చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవి ఉన్నారు. ముల్కనూర్ సహకార సంఘాన్ని సందర్శించిన మాల్దీవ్స్ బృందంఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సంఘాన్ని బుధవారం మాల్దీవ్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి సంఘం కార్యకలాపాలను ఆ బృందానికి వివరించారు. సంఘం అభివృద్ధి చెందిన తీరును తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్దీవుల ట్రైనర్ హుస్సేన్ వాది, అడ్మిన్ ఆఫీసర్ ఈమా, ఎన్ఐఆర్డీ కోఆర్డినేటర్ అరుణ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్..2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
కమలాపూర్: ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కమలాపూర్లోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయలేదని, మొన్నటి వరకు నిరుద్యోగ యువకులను ఇబ్బంది పెట్టి, ఉపాధ్యాయులకు డీఏలు ఇవ్వకుండా, 317 జీఓ సవరించకుండా, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టిన ఆ పార్టీకి పోటీ చేసే ముఖం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా 15 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక ముఖం చాటేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని నేరుగా పోటీలో నిలపలేదన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, నాయకులు శ్రీరాం శ్యాం, కొండం శ్రీనివాస్, అశోక్రెడ్డి, శోభన్, కనుకుంట్ల అరవింద్, చేలిక శ్రీనివాస్, భూపతి ప్రవీణ్, సతీష్, రత్నాకర్, వినయ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. జబ్బాపూర్ ఘటన దురదృష్టకరం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం జబ్బాపూర్లో శివాజీ జయంతి సందర్భంగా జెండా ఎత్తుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందడం, మరొకరు సీరియస్గా ఉండటం, మరో ఎనిమిది మంది గాయపడటం దురదృష్టకరమని ఈటల అన్నారు. మృతిచెందిన లింగ ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, సీరియస్గా ఉన్న కరుణాకర్కు అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామని ఈటల తెలిపారు. శివాజీ విగ్రహావిష్కరణమండలంలోని శంభునిపల్లి, నేరెళ్ల గ్రామాల్లో బుధవారం నిర్వహించిన చత్రపతి శివాజీ 395వ జయంతి ఉత్సవాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొల్పిన శివాజీ విగ్రహాలను ఆవిష్కరించారు. కమలాపూర్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఆరె సంక్షేమ సంఘం నాయకులు కోలె దామోదర్రావు, భావని రాజేశ్వర్రావు, సత్యరాజ్, సాంబరావు, మోకిడె ప్రసాద్, కొండం శ్రీనివాస్ యాదవ్, సామ్రాజ్యంగౌడ్, కట్కూరి అశోక్రెడ్డి, అరె సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, కులస్తులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు అభ్యర్థులను నిలిపే ముఖం లేదు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ -
అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
ఎల్కతుర్తి: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రుల కల సాకారం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో గల డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి విద్యార్థులతో కలిసి పడుకున్న కలెక్టర్ గురువారం ఉదయం విద్యార్థులతో కలిసి వ్యాయామం, యోగా చేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల వాతావరణం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు చదువుల్లో, క్రీడల్లో ఉన్నతంగా రాణించి పేరు తీసుకువస్తారన్న నమ్మకం ఉందన్నారు. పాఠశాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు పాఠశాలకు మిషన భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వీయ రక్షణ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. పాఠశాల, కళాశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పీవీ విజ్ఞాన కేంద్రం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి దివంగత మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. వంగరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆడిటోరియం, మ్యూజియం, గ్రీనరీ, పేయింటింగ్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఆర్ట్ గ్యాలరీలను పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పనులను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అనంతరం విజ్ఞాన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీను, అడిషినల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీఈ ధన్రాజ్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీఓ వీరేశం, ఏపీఎం దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం కోసం స్థల పరిశీలనహనుమకొండ జిల్లాకు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు 30ఎకరాలు కావాల్సి ఉండగా వంగర గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆమె పరిశీలించారు. వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పి. ప్రావీణ్య -
జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో)
23,86819,87717,68418,24516,18118,67716,31716,50912,90313,90111,48112,15711,84813,87512,24410,2987,58310,3535,6955,38213,09210,93911,6726,1472019–202021–222020–212022–23వరంగల్ రూరల్జనగామవరంగల్ అర్బన్మహబూబాబాద్భూపాలపల్లి -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
వరంగల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే అశించిన ఫలితాలు వస్తాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ రాంనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంటగది, పరిసరాలను పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎస్సీడీఓను ఆదేశించారు. వంటమనిషి ఆరు గంటలకే రాత్రి భోజనం వండుతుందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కుక్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహాన్ని రాంనగర్ నుంచి వరంగల్కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్ను కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఈఓను ప్రత్యేక అధికారిగా నియమించి హాస్టల్లో విద్యార్థి నులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. పరీక్ష ప్యాడ్లు అందజేసి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. తనిఖీల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుమతి, హాస్టల్ వార్డెన్ హరిత తదితరులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలి ఖిలా వరంగల్: విద్యార్థులు బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబట్టి పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థులకు అందించే స్నాక్స్ను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలను సాధిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఎస్సీ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీ -
పాకాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
ఖానాపురం: అటవీ ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పాకాల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి ఎఫ్ఆర్వో రవికిరణ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అవగాహన కల్పించారు. రాయపర్తి, పర్వతగిరి, వంచనగిరి, కాశిబుగ్గతోపాటు పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాకాలను సందర్శించారు. విద్యార్థులు చదవడం కంటే చూడడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువ విజ్ఞానం లభిస్తుందనే ఆలోచనతో ఫీల్డ్ట్రిప్ చేపట్టారు. పాకాల అటవీ ప్రాంతంలో పలు అంశాలను తెలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో పాకాలకు.. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2,756 మంది విద్యార్థులు పాకాలకు హాజరయ్యారు. ఈనెల 13న 256 మంది, 18న 1200 మంది, 19న 1300 మంది విద్యార్థులు ప్రత్యేక బస్సుల్లో పాకాలకు వచ్చారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, అడవిలో నడక, బటర్ ఫ్లై అటవీ జంతువులపై అవగాహన, మొక్కలు నాటడం, నర్సరీ ఏర్పాటు, సరస్సులు, జీవవైవిధ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విషరహిత, విషంతో కూడిన సర్పాల గురించి విద్యార్థులకు వివరించారు. ఫీల్డ్ట్రిప్ల ద్వారా విద్యార్థులకు మానసిక ప్రశాతంతతోపాటు విజ్ఞానం లభించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ‘పీఎంశ్రీ’తో మూడు రోజుల్లో 2,756 మంది సందర్శన అడవులు, మొక్కల పెంపకం, జీవవైవిధ్యంపై అవగాహన -
ఆర్థిక ఒడిదుడుకులు
తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309తో 25, రూ.1,77,316తో 21లో ఉన్న ములుగు రూ.2,15,772తో 19వ స్థానంలో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది.సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తర్వాత స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.. ఉమ్మడి వరంగల్లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నా రు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్ట ణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగి రి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జి ల్లాల్లో జనం ఊళ్లలోనే ఉంటున్నా రు. హనుమకొండ జిల్లాలో మా త్రమే 10,62,247 మంది జనా భాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగ ల్ జిల్లాలో 7,37,148కి 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763కు 3,74, 376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76, 376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9) శాతం మంది పట్నవాసం చేస్తున్నారు.జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగర జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి.. ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
వరంగల్
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఆర్టీసీ ఉద్యోగులకు ‘పవర్’ ఆర్టీసీ ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా సన్నద్ధులను చేసేందుకు ‘పవర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం చేపట్టింది. – 8లోuపర్వతగిరిలోనే 10 మీటర్ల లోతున నీరు ● వర్ధన్నపేట, రాయపర్తిలో ఇబ్బందికర పరిస్థితే.. ● వరిసాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడమే కారణం ● జిల్లాలో 13 మండలాలు.. 1,16,500 ఎకరాల్లో పంటల సాగు ● అవసరం మేరకు నీటిని వినియోగించాలని అధికారుల సూచన మండలాల వారీగా భూగర్భ జలమట్టం వివరాలు మీటర్లలో.. మండలం నవంబర్ డిసెంబర్ జనవరి చెన్నారావుపేట 0.80 0.85 0.97దుగ్గొండి 1.72 1.89 2.51గీసుకొండ 3.09 3.50 4.50ఖానాపురం 2.3 2.86 3.08నల్లబెల్లి 2.53 4.05 5.05నర్సంపేట 2.72 3.37 5.40 నెక్కొండ 2.67 3.40 3.65పర్వతగిరి 5.43 9.24 10.00రాయపర్తి 4.24 5.35 6.77సంగెం 2.99 3.36 3.60 వర్ధన్నపేట 7.00 7.28 7.22వరంగల్ 2.34 2.56 2.54ఖిలా వరంగల్ 1.04 1.37 2.07సాక్షి, వరంగల్: జిల్లాలో కాల్వలు, బావుల కింద రబీ వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టం తగ్గుతోంది. 2024 నవంబర్లో జిల్లా సగటు 3.40 మీటర్ల ఎగువన నీరు ఉంటే.. ఈ ఏడాది జనవరి నాటికి 4.82 మీటర్లకు పడిపోయింది. ఫిబ్రవరి, మార్చిలో నీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో భూగర్భ జలమట్టం బాగా తగ్గే అవకాశముందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటలకు నీటిని పొదుపుగా వాడడం వల్ల భూగర్భ జలమట్టం తగ్గింపును కాస్త నిలువరించే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. సహజవనరుల విధ్వంసంతో.. జిల్లాలో 13 మండలాల్లో 1,16,500 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 1,02,000 ఎకరాల్లో సాగు చేస్తున్న వరి పంటకు ఎక్కువ అవసరం ఉండడంతో పొదుపుగా నీరు వాడుకోవాలని అధి కారులు చెబుతున్నారు. ఇంకోవైపు ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో నీటిమట్టాలు పడిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఆ వాగు నుంచే ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో నీరు నిలిచేందుకు కూడా ఆస్కారం ఉండకపోవడం మరో కారణం. సహజవనరుల విధ్వంసం వల్లనే కొన్ని మండలాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం గమనార్హం. ఫిజోమీటరుతో నీటి నిల్వ కొలతలు 2015లోనే జిల్లాలోని సబ్స్టేషన్లు, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని 21 ప్రాంతాల్లో 50 మీటర్ల మేర బోరుబావులు తవ్వారు. వీటికి రక్షణగా ఐరన్బాక్స్లు అమర్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. నెలకోసారి సంబంధిత అధికారులు ఫిజోమీటరు సహకారంతో బోరుబావుల్లో నిల్వ ఉన్న నీటిని కొలుస్తారు. దుగ్గొండి, నర్సంపేట, సంగెం, రాయపర్తిలో ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డింగ్ దారా ప్రతి ఆరు గంటలకోసారి అక్కడ ఏర్పాటుచేసిన సాఫ్ట్వేర్ సహకారంతో నీటి నిల్వ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఈ మండలాల్లో ఇబ్బందికరం.. ● పర్వతగిరిలో గతేడాది మే నెలలో 11.72 మీటర్లో లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో అక్టోబర్లో 5.82 మీటర్లుపైకి నీరు చేరింది. సాగు ప నులు ప్రా రంభం కావడంతో నవంబర్లో 5.43 మీటర్లు, డిసెంబర్లో 9.24 మీటర్లు, జనవరిలో 10 మీటర్లకు తగ్గింది. ● వర్ధన్నపేటలో గతేడాది మే నెలలో 8.02 మీటర్ల లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత వర్షాలతో అక్టోబర్లో 6.93 మీటర్లపైకి నీరు చేరింది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో నవంబర్లో 7మీటర్లు, డిసెంబర్లో 7.28 మీటర్లు, జనవరిలో 7.22 మీటర్లకు పడిపోయింది. ● రాయపర్తి మండలంలో గతేడాది మే నెలలో 8.54లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత వర్షాలతో అక్టోబర్లో 3.85 మీటర్లు, నవంబర్లో4.24మీటర్లు,డిసెంబర్లో 5.35 మీ టర్లు, జనవరిలో 6.77 మీటర్లకు పడిపోయింది. నీటిని పొదుపుగా వాడుకోవాలి.. నీటి వనరులను పొదుపుగా వాడుకుంటే మంచిది. వేసవిలో మరింత వినియోగం పెరుగుతుంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. జిల్లాలో 90 వేలకుపైగా వ్యవసాయ బోర్లు పనిచేస్తున్నాయి. ఇంకా కొత్త బోర్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రస్తుతమున్న నీటి లభ్యతతో పంటలు గట్టెక్కుతాయి. తాగునీటి అవసరాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. – ఎం.అశోక్, జిల్లా భూగర్భ జలశాఖ అధికారిన్యూస్రీల్జిల్లాలో పంటల సాగు వివరాలు ఎకరాల్లో.. పంట విస్తీర్ణం వేరుశనగ 950మిర్చి 12,000కంది 700 పసుపు 850 వరి 1,02,000 మొత్తం 1,16,500 -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నెక్కొండ: పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండలంలోని ఆదర్శ పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టడీ మెటీరియల్, అల్పాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజ్కుమార్ ఉన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. హెచ్ఎంగా యాకూబ్అలీ, డీఈఓగా మానస, డిప్యూటీ డీఈఓగా సరస్వతి, ఎంఈఓగా వర్షశ్రీ వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు బండారి రమేశ్, సురేశ్, కుమారస్వామి, భిక్షపతి పాల్గొన్నారు. ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపుకాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు అధి కారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. గతంలో హనుమకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 6 జిల్లాలకు ఒక్క క్యాంపు అసౌకర్యంగా ఉందని గుర్తించిన అధికారులు జిల్లా కేంద్రంగా కొత్త మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్బీ కళాశాలలో ఏర్పాటు కానున్న మూల్యాంకన క్యాంపులో మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల కోడింగ్ వాల్యుయేషన్కు సంబంధించిన పనులు మార్చి నుంచి ప్రారంభించడానికి ఆదేశాలు జారీచేసినట్లు డీఐఈఓ శ్రీధర్సుమన్ తెలిపారు. యూరియా కోసం రైతుల బారులుఖానాపురం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీల్లో ఇచ్చిన కొద్ది మొత్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నుంచి యూరియా లేకపోవడంతో రైతులు ఖానాపురం సొసైటీ చుట్టూ ప్రదక్షిణ చేశారు. బుధవారం ఉదయం యూరియా రావడంతో బారులు తీరారు. వచ్చిన యూరియా అయిపోవడంతో వెనుదిరిగారు. దీంతో సొసైటీ అధికారులు మరో సారి మధ్యాహ్నం యూరియా తెప్పించడంతో రైతులు తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్ను సవరించాలివరంగల్ చౌరస్తా: కేంద్ర బడ్జెట్ను సవరించాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 10 కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లో ధర్నా చేశారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపో యి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతం నిధులు పెంచాలని, జీడీపీలో విద్య, వైద్య రంగాలకు మూడు శాతం నిధులు అదనంగా ఇవ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థకు రాయితీలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, పలు పార్టీల నాయకులు గంగుల దయాకర్, అక్కెనపల్లి యాదగిరి పాల్గొన్నారు. -
గురుకులాల్లో మౌలిక సదుపాయాలు
ఎల్కతుర్తి: హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం సాయంత్రం కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించారు. పాఠశాల, కళాశాలలోని గదులు కలియదిరిగి పరిశీలించారు. డార్మెటరీ, వంట గదులు తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల, కళాశాలలో రూ.24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల, కళాశాలలో టాయిలెట్ల మరమ్మతులు చేయించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, వాటి పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అధికారులు హాస్టల్ను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలు తన దృష్టికి తెస్తున్నట్లు తెలిపారు. వంగర పాఠశాల పీఎంశ్రీ పథకం కింద ఎంపికై ందని, ఈ పథకం కింద మంజూరైన నిధులతో అదనపు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారితో కలిసి నిద్ర (బస) చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, అడిషినల్ డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ వీరేశం, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంఈఓ సునీత, పంచాయతీరాజ్ ఏఈ వినయ్రెడ్డి, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య వంగరలోని గురుకుల పాఠశాల పరిశీలన.. రాత్రినిద్ర -
పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్ : పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ పాల్గొన్నారు. -
మొక్కలకు నీరందించాలి
ఎల్కతుర్తి: వేసవి కాలం సమీపిస్తున్నందున నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను రక్షించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ విద్యాలత ఫీల్డ్అసిస్టెంట్లను ఆదేశించారు. వీరనారాయణపూర్లో మంగళవారం ఆమె నర్సరీని పరిశీలించి మాట్లాడారు. ఎండాకాలంలో ఎప్పటికప్పుడూ మొక్కలకు నీరందించాలని సూచించారు. అంతకు ముందు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందుతుందా అని అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీఓ విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు. -
హనుమకొండ డీవీఏహెచ్ఓ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి (డీవీఏహెచ్ఓ)గా కొత్తగా ఎవరిని నియమించనున్నారు? అన్న అంశం ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. ఇప్పటి వరకు డీవీఏహెచ్ఓగా ఉన్న వెంకటనారాయణ పదవీ విరమణకు కొద్ది నెలలే గడువున్నా.. సొంత జిల్లా ఖమ్మం జిల్లాకు మంగళవారం బదిలీ అయ్యారు. వెటర్నరీ, పశుసంవర్థకశాఖలో సంయుక్త సంచాలకులుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబసాచి ఘోష్ బదిలీ చేశారు. అందులో భాగంగా సిద్దిపేటకు అశోక్కుమార్, మంచిర్యాలకు కృష్ణ, కరీంనగర్కు సుధాకర్, నల్లగొండకు రమేష్ను నియమించిన ప్రధాన కార్యదర్శి ఘోష్.. హనుమకొండ డీవీఏహెచ్ఓ నుంచి ఏడీగా పదో న్నతి పొందిన వెంకటనారా యణను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రకా లుగా అనుకూలం.. హాట్కేక్లాంటి హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం పలువురు లాబీయింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలో పావులు ప్రధానంగా ఈ సీటుపై ఐదుగురు కన్నేయగా, పదో న్నతులు, ఫారిన్ సర్వీస్ల పేరిట సుమారు మూడు నెలల నుంచి కాచుకు కూర్చున్న సదరు వ్యక్తులు ఇప్పటికే వివిధ రూపాల్లో సమీప ప్రాంతాలు, కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్ సర్వీస్ల పేరిట డిప్యుటేషన్ పొందారు. ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే హనుమకొండ ‘బాస్’ సీటుకు కొందరు స్కెచ్ వేయగా.. వివిధ రూపాల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న మరికొందరు ఇప్పటికే హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది. హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం ముందస్తు వ్యూహాంతో పావులు కదపడం.. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎడాపెడా సాగిన ‘డిప్యుటేషన్’ల దందాపై ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనాలు కలకలం రేపాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపించి షోకాజ్లు జారీ చేయడంతో కొంత సద్దుమణిగినా.. ఆ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులు హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం పైరవీలు చేస్తున్న విష యం ఆ శాఖలో మళ్లీ హాట్టాపిక్గా మారింది. సొంత జిల్లా ఖమ్మానికి వెంకటనారాయణ బదిలీ డీవీఏహెచ్ఓ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు, పైరవీలు హనుమకొండ సీటుపై ఐదుగురి కన్ను ఇప్పటికే డిప్యుటేషన్లపై ఉన్న కొందరు పశుసంవర్థకశాఖలో హాట్టాపిక్ -
సాక్షిప్రతినిధి, వరంగల్
●● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు హసన్పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి. ● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హనుమకొండ, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది. ● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేషన్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తున్న బియ్యంపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ సమయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది. ● ఈ దందాలో రూ. లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది. ● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తనిఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. వరంగల్ -
టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరి లో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సి పాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్కే మీరుద్దీన్, రవీందర్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలి : డీఈఓవిద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలని డీఈఓ వాసంతి కోరారు. గత సంవత్సరం 968 పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దృష్టి లోపం ఉన్న 137 పాఠశాలల్లోని 2,357 మంది విద్యార్థులకు ఈనెల 17 నుంచి 28 వరకు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, ఇతర ఉపకరణాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి మండలంలో ఎంపికచేసిన విద్యార్థులు కంటి పరీక్షలకు వెళ్లేవిధంగా మండల విద్యాశాఖాధికారులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం సమగ్రశిక్ష సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఫోన్నంబర్ 9603672289ను సంప్రదించాలని డీఈఓ కోరారు. ఉపాధ్యాయుల గొంతు వినిపిస్తా.. నయీంనగర్: ఉపాధ్యాయుల గొంతుకనై వారి సమస్యలు పరిష్కరిస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ఆరేళ్లుగా ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యల సాధనకు కృషి చేశానన్నారు. ప్రభుత్వ విద్యారంగం, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను రక్షించడానికి పాటుపడుతానన్నారు. 20 నుంచి దూరవిద్య సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఎంఏ జర్నలిజం,హెచ్ఆర్ఎం పరీక్షలు కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
మండల స్థాయి స్టాక్ పాయింట్లు
మొత్తం రేషన్ దుకాణాలు 2,364ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ 33,153.976మెట్రిక్ టన్నులువరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత మగ్దుంపురం గ్రామంలో సోమవారం రూ.2.50 లక్షల విలువ చేసే 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ననుమాస కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కేయూసీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో రూ.32,500 విలువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) 32,55,776..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్నాయి. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బియ్యం దందా ఎల్లలు దాటుతోంది. వరంగల్ ఈ దందా వెనుక కొందరు రైస్మిల్లర్లే కీలకం కాగా.. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఒకరు హసన్పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతున్నా.. ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చిక్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది. మహారాష్ట్ర18కమిషనరేట్ పరిధిలో ప్రధాన కేంద్రాలు.. -
పూడికతీత పనులు వేగవంతం చేయండి
నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం హన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తాగునీటి సరఫరా, రబీపంటలకు సాగు నీరు, డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో డివిజన్లకు ధర్మసాగర్ తాగునీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 24 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రానున్న రోజుల్లో అదనంగా మరో 21 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పరిశీలన -
‘ముల్కనూరు’ను సందర్శించిన శ్రీలంక ప్రతినిధులు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని సహకార సంఘాన్ని మంగళవారం శ్రీలంక ప్రతినిధులు సందర్శించారు. శ్రీలంక కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, వివిధ సహకార సంఘాల అధికారులు సుమారు 22 మంది పర్యటనకు వచ్చారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వారు ముల్కనూరును సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి సంఘం కార్యకలాపాలు, సంఘం అభివృద్ధి తీరును క్లుప్తంగా తెలిపారు. సంఘం సభ్యుల కుటుంబాల ఉన్నత చదువుల కోసం అందజేస్తున్న సహాయ సకారాలు, రైతులకు అందిస్తున్న బోనస్ తదితర అంశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. -
సంఘాల లావాదేవీలను నిర్లక్ష్యం చేయొద్దు
వర్ధన్నపేట: గ్రామైక్య సంఘాల నెలసరి లావాదేవీలను నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్డీఏ ఏపీఎం వేణు, సీబీఓ ఆడిటర్ వెంకట్ కోరారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మండలంలోని ఉప్పరపల్లి, నల్లబెల్లి, కట్య్రాలతోపాటు సంగెం మండలంలోని వెంకటాపురం, నల్లబెల్లి గ్రామాల గ్రామైక్య సంఘాల రికార్డులను మంగళవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేణు, వెంకట్ మాట్లాడారు. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నట్టు తెలిపా రు. సంఘాల లావాదేవీల్లో పొరపాట్లు చోటు చేసుకుంటే వీఓ సహాయకులు (వీఓఏలు), వీఓ ప్రతిని ధులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. సంఘాల వసూళ్లు, చెల్లింపులకు సంబంధించిన సరైన ఆధారాలు నమోదు చేయాలని స్పష్టం చేశా రు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వీఓఏలు, వీఓ ప్రతి నిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీ ల్లో వెలుగు చూసిన లోపాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. తనిఖీలో సీసీలు గోలి కొమురయ్య, స్వామి, సీ్త్రనిధి మేనేజర్ కపిల్, వీఓఏ ప్రతినిధి కట్ట రజిత, వీఓఏలు బిర్రు దయాకర్, మంజుల, భిక్షపతి, రాము, రాజా రాణి, ఎంఎస్ అకౌంటెంట్ రేవతి, సీఓ మురళి పాల్గొన్నారు. డీఆర్డీఏ ఏపీఎం వేణు, ఆడిటర్ వెంకట్ -
వరంగల్
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025రైతుల సమస్యను మోదీ దృష్టికి తీసుకెళ్తా..ఫిర్యాదుల పెట్టెలతో సమస్యల పరిష్కారంఆకుకూరలతో అధిక ఆదాయం వేసవిలో ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాంబాబు తెలిపారు.వాతావరణం జిల్లాలో ఉదయం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రతతో ఉక్కపోత ఉంటుంది. రాత్రి కాస్త చల్లటి వాతావరణం ఉంటుంది. – 8లోuహుజూరాబాద్ మీదుగా సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ రైస్ ● ప్రధాన కేంద్రాలు హనుమకొండ, హసన్పర్తి, పరకాల శివార్లు ● ఈ దందా వెనుక భీమదేవరపల్లి మండల వాసి! ● పీడీ యాక్టు, 6ఏ కేసులు, అరెస్టులకు వెరవని మాఫియా ● అక్రమార్కులకు వరంగా మారినఉచిత బియ్యం పథకం సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్స్టేషన్ పరి ధిలోని పాత మగ్దుంపురం గ్రామంలో సోమవా రం రూ.2.50 లక్షల విలువ చేసే 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్దుంపురం గ్రామానికి చెందిన ననుమాస కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ● కేయూసీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో రూ.32,500 వి లువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.బత్తుల దుర్గమ్మ,గంట సారయ్య, తూర్పా టి కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ● హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఓ లారీ, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్మిల్లు లీజుదారుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. .. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్నాయి. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బియ్యం దందా ఎల్లలు దాటుతోంది. వరంగల్ ఈ దందా వెనుక కొందరు రైస్మిల్లర్లే కీలకం కాగా.. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఒకరు హసన్పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతున్నా.. ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చిక్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది. కమిషనరేట్ పరిధిలో ప్రధాన కేంద్రాలు.. ● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు హసన్పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి. ● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హ నుమకొండ, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూ ర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది. ● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేష న్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తు న్న బియ్యంపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ స మయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది. ● ఈ దందాలో రూ.లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది. ● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తనిఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ సాంబశివరావుగీసుకొండ: వైద్య, ఆరోగ్య కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గీసుకొండ, రాయపర్తి(డబ్ల్యూ) పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాతాశిశు సంరక్షణ, వాక్సినేషన్, సాధారణ ప్రసవాలు, టీబీ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల సర్వే, వైద్యసేవలు తదితర విషయాల్లో వెనకబడిన ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బందిని ఆయన సరిగా పని చేయాలంటూ హెచ్చరించారు. ప్రతీ ఉద్యోగి సమయపాలనను పాటించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, డీఐఓ డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ సకాలంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మోహన్సింగ్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్, మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన, ఆయుష్మాన్ ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, డీపీహెచ్ఎన్ఓ జ్ఞాన సుందరి, డీపీఓ అర్చన, డీడీఎం నితిన్రెడ్డి, పీహెచ్సీల వైద్యులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 22 నుంచి ఆహ్వాన నాటికలువర్ధన్నపేట: పట్టణంలోని కళాభవన్లో భారతీయ నాటక కళాసమితి ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 26 వరకు 51వ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తామని అధ్యక్షుడు అఫ్సర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను 22న ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కావ్య, రాష్ట్ర కో ఆపరేటివ్ ఆపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 26న శివరాత్రి సందర్భంగా ముగింపు కార్యక్రమం ఉంటుందని, విజేతలకు అతిథులు బహుమతులు అందజేస్తారని వివరించారు.న్యూస్రీల్ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచారం ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు : 11,05,543(ఆహార భద్రత+అంత్యోదయ+అన్నపూర్ణ) మొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) : 32,55,776 మండలస్థాయి స్టాక్ పాయింట్లు : 18 మొత్తం రేషన్ దుకాణాలు : 2,364ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ : 33,153.976 మెట్రిక్ టన్నులు -
‘ఏటీబీ’కి జాతీయస్థాయి గుర్తింపు
దుగ్గొండి : కేంద్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్, విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రతి ఏడాది స్కూల్ ఇన్నోవేషన్ పోటీ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల సామర్ధ్యాలను గు ర్తించి పరిష్కారాలను రూ పొందించడం..నూతన ఆవిష్కరణలు, సృతజనాత్మకత, ఉత్పత్తి వంటి ఆలోచనలను పెంపొందించడానికి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ పోటీలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. 1.20లక్షల ఆవిష్కరణల్లో 1,200 ఆవిష్కరణలే గుర్తింపు.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నిర్వహించిన పోటీలకు 1.20లక్షల ఆవిష్కరణలు రాగా 1,200 ఆవిష్కరణలను జాతీయస్థాయి కి ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ జిల్లా నుంచి దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రిషిక్ రూపొందించిన ఏటీబీ(ఎనీటైం బ్యాగు) ఆవిష్కరణ ఒక్కటే జాతీయస్థాయికి ఎంపికై ంది. ఎన్నికై న ఏటీబీని ఆవిష్కరణను మంగళవారం ఆన్లైన్లో రాజ్కోట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఎదుట ప్రదర్శించాడు. ప్లాస్టిక్ వా డకం భారీగా పెరిగిపోయి కాలుష్యానికి దారితీస్తుంది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా దుస్తువులతో తయారు చేసిన సంచులు (క్లాత్ బ్యాగులు) వాడేటట్టు గైడ్ టీచర్ సుమలత పర్యవేక్షణలో రూపొందిన ఎనీటైం బ్యాగు ఆవిష్కరణను ప్రొఫెసర్లు ప్రశంసించారని హెచ్ఎం జ్యోతిలక్ష్మి పేర్కొన్నారు. ఏటీబీ పనితీరు ఇలా.. ఏటీఎం మిషన్లలో డబ్బులు తీసుకునే విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుని రూ.5 నాణెం వేస్తే ఎనీ టైం బ్యాగ్ (దుస్తువులతో తయారు చేసిన సంచి) వచ్చేలా రిషిక్ నూతన ఆవిష్కరణ చేశాడు. మోడల్ పరి కరాన్ని అట్ట ముక్కలతో తయారు చేశాడు. మిషన్లో 500 వరకు క్లాత్ బ్యాగులను నిల్వ చేయొచ్చు. దీంతో పాటు అందులో ఏర్పాటు చేసిన స్పీకర్ ని త్యం ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, క్లాత్ సంచుల వినియోగం వల్ల కలిగే లాభాలు వివరిస్తుంది. కూరగాయల మార్కెట్లు, బస్టాండ్ సెంటర్లలో దీనిని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రిషిక్ అంటున్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి రూ.25వేల వరకు ఖర్చు అవుతుందని వివరించాడు. మిషన్ తయారీకి కేంద్ర ఇన్నోవేషన్ సెల్కు వివరించగా వారు ఆర్థికసాయం అందిస్తామని చెప్పినట్లు రిషిక్ పేర్కొన్నాడు. ఎనీటైం బ్యాగును ఆవిష్కరించిన రిషిక్ రాజ్కోట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఎదుట ఆన్లైన్లో ప్రదర్శన -
విద్యార్థి అదృశ్యం.. ప్రత్యక్షం
ఖానాపురం: సైనిక్స్కూల్కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమై ప్రత్యక్షమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తండ్రితోపాటు ఎస్సై రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడుగోని గ్రామానికి చెందిన సాయివర్ధన్ సైనిక్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 16న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రోజంతా డార్మెంటరీలో తోటి విద్యార్థులతో మా ట్లాడకుండా.. సోమవారం ఉదయం కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రఘుపతి స్కూల్లో విచారణ చేపట్టారు. తండ్రి నారాయణ ద్వారా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్కూల్ నుంచి అదృశ్యమైన సాయివర్థన్ ఇల్లందులో ప్రత్యక్షమై బంధువులకు ఫోన్ చేయడంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నా రు. విషయం తెలసుకున్న కలెక్టర్ సత్యశారద.. ఇన్చార్జ్ తహసీల్దార్ రాజారేణుక, ఎంపీడీఓ సునీల్కుమార్లను స్కూల్ వద్దకు పంపించారు. అధికారులు ఫిర్యాదుల పెట్టెను పరిశీ లించి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. కాగా సైనిక్స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విచారణ చేపట్టిన అధికారులు -
పరీక్షలకు సన్నద్ధమవ్వాలి
చెన్నారావుపేట: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ అన్నారు. ఈ మేరకు మండలంలోని ఉప్పరపల్లి హైస్కూల్లో మంగళవారం పదో తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన రికార్డులను బృందం పరిశీలించింది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో ప్రతి సబ్టెక్ట్కు 20 మార్కుల చొప్పున నమోదును పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పరిశీలన బృందంలో ప్రభాకర్రావు, కొండ కృష్ణమూర్తి, నల్లతీగెల యాకయ్య, శ్రీరామ్ సునిత, తదితరులు ఉన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలోని శ్రీకంఠమహేశ్వర ఆలయ అభివృద్ధికి ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఇల్లంద గ్రామ గౌడ సంఘం సభ్యులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో గ్రామపెద్దలు కస్తూరి బాలరాజు ద్వారా ఎమ్మె ల్యే వివేకానంద.. గౌడ సంఘం సభ్యులకు ఈ విరాళం అందచేశారు. కార్యక్రమంలో పోశాల వెంకన్న, సమ్మెట సూరి, సూరి, వేణుకుమార్, యాకయ్య, కవిరాజు, సమ్మయ్య, సాయిలు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. డీటీఆర్లు ప్రారంభం గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలిలో నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద విద్యుత్ సరఫరా సజావుగా సాగడానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్)ను మంగళవారం ఎన్పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అలాగే గొర్రెకుంట విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని కట్టమల్లన్న ఆలయం వద్ద కొత్తగా డీటీఆర్ను ఏర్పాటు చేసినట్లు ఏఈ దిలీప్ తెలిపారు. 20 నుంచి కేయూ దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధి కారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఎంఏ జర్నలిజం,హెచ్ఆర్ఎం పరీక్షలు కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. 1,958 మంది విద్యార్థులకు 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలి హన్మకొండ కల్చరల్: పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామి వారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. -
పూడికతీత పనులు వేగవంతం చేయండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పరిశీలన నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించా. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు. -
కంటి పరీక్షల శిబిరం ప్రారంభం
ఎంజీఎం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో దృష్టిలోపం గుర్తించిన 2,334 విద్యార్థులకు రీ స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ, చికిత్స అందించేందుకు వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కంటి పరీక్షల శిబిరా న్ని సోమవారం ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు ఎనిమిది రోజుల పాటు రోజుకు 300 మంది విద్యార్థుల చొప్పున కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ మహేందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, రీజనల్ కంటి ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల, ఆర్బీఎస్కే వైద్యాధికారులు దుర్గాప్రసాద్, కుమారస్వామి, ప్రదీప్రెడ్డి, రవీందర్, ఆప్తాలమిక్ అధికారులు రవీందర్రెడ్డి, మల్లారెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. 105 మంది విద్యార్థినులకు ప్రాంగణ నియామకాలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ఫైనలియర్ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్లో ఇద్దరు, డిజిగీక్స్లో ముగ్గురు, జెన్పాక్ట్లో 35 మంది, డెల్ఫిటీవీఎస్లో 18 మంది, క్యూస్ప్రైడర్లో 33 మంది, పెంటగాన్ స్పేస్లో 10 మంది, ఎకోట్రైన్స్లో నలుగురు ఎంపికయ్యారని, వీరికి వార్షిక వేతనం రూ.3.2 లక్షల నుంచి రూ 4.5 లక్షల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్లో జాయినింగ్ అవుతారు. మధ్యలో ఇంటర్న్షిప్ ఉంటుందని వివరించారు. ఈమేరకు సోమవారం కేయూ సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం విద్యార్థినులను అభినందించారు. కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జైళ్లశాఖ డీజీపీని కలిసిన సీపీ వరంగల్ క్రైం: రాష్ట్ర జైళ్లశాఖ డీజీపీ సౌమ్య మిశ్రాను వరంగల్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా సోమవారం మర్యాదపూర్వకంగా కలి శారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా సౌమ్యమిశ్రా వరంగల్ నగరానికి చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆమెకు బొకే అందజేసి స్వాగతం పలికిన సీపీ కొంతసేపు ముచ్చటించారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏ ఎస్పీ మనన్ భట్, ఏసీపీలు వెంట ఉన్నారు. వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డాక్టర్ టీకే.శ్రీదేవి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్, ఆర్టీసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ‘పీఎం ఈ–బస్ సేవా పథకం’లో భాగంగా వరంగల్ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీతో పాటు ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధి కారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పా రు. ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వీసీలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బాలు నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు, హనుమకొండ ఆర్టీఓ వేణుగోపాల్, బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, బల్దియా ఈఈ మహేందర్ పాల్గొన్నారు. -
శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఈనెల 26న నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వేయి స్తంభాల దేవాలయం, మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని, మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున మహిళా పోలీస్ సిబ్బంది అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. 24 గంటల పాటు పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేష్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఏసీపీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ విప్లవం
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025‘తరగతి గది’లో● ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులతో బోధన ● విద్యార్థికి అభ్యాసం–ఉపాధ్యాయుడికి సులభతరం ● జిల్లాలోని 160 సర్కారు స్కూళ్లలో 444 బోర్డులు ● 1,326 మంది టీచర్లకు పూర్తయిన శిక్షణవిద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన చేయడానికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు(ఐఎఫ్పీ) ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లో డిజిటల్ విప్లవం వచ్చిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ సదుపాయం ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. కొంత కాలం క్రితమే వీటిని పాఠశాలల్లో ఏర్పాటు చేసినప్పటికీ వాటి వినియోగంపై ఉపాధ్యాయులకు స్పష్టత లేకపోవడంతో ఇటీవలే అవగాహన కల్పించారు. జిల్లాలోని 160 పాఠశాలల్లో 444 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను కొంతకాలం క్రితమే ప్రభుత్వం మంజూరు చేయగా ఇన్స్టాల్ చేశారు. అయితే వీటిపై ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేక పోవడం.. ఆపరేటింగ్ తెలియక.. సమగ్రంగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లందరికీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లపై శిక్షణ ఏర్పాటు చేసింది. ఒక రోజు శిక్షణ శనివారంతో ముగిసింది. శిక్షణలో 123 మంది హెచ్ఎంలతోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్సైన్స్, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, లాంగ్వేజ్ పండిట్లు, ఉర్దూ ఉపాధ్యాయులు 1,203 మంది మొత్తం 1,326 మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో 14 మంది రిసోర్స్ పర్సన్లకు రెండు రోజులు శిక్షణ ఇవ్వగా.. వారి ద్వారా జిల్లాలో సబ్జెక్టుల వారీగా మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను గుర్తించి 196 మందికి జిల్లా స్థాయి శిక్షణ ఇచ్చారు. వీరు కాంప్లెక్స్ స్థాయిలో సబ్జెక్టు టీచర్లకు మూడు రోజులపాటు శిక్షణ అందజేశారు. విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం – తెలంగాణ సమగ్ర శిక్ష సహకారంతో ఐఎఫ్పీ బోర్డులను తరగతి గదుల్లో ఏర్పాటు చేసి వాటి లోపల ఎల్ఎంఎస్, డిజిటల్ పాఠాలను అప్లోడ్ చేశారు. సరికొత్త సమాచార సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని తరగతి గదిలో హై డెఫినేషన్ విజువల్స్–టచ్ సపోర్టెడ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో బోధన సులువవుతుంది. ఈ బోర్డులను టీవీగా డిజిటల్ బోధనకే కాకుండా టచ్–స్టైలిష్ సహకారంతో బ్లాక్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ దృశ్య రూపంలో చూపెట్టడం వల్ల ప్రత్యక్ష అనుభూతి పొందుతూ నేర్చుకోగలుగుతారు.ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలిజిల్లాలో ఐఎఫ్పీ బోర్డులు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి. ఈ మేరకు హెచ్ఎంలను ఆదేశించాం. ఇంటర్నెట్కు అయ్యే వ్యయం పాఠశాలలకు మంజూరయ్యే మెయింటినెన్స్ గ్రాంట్ నుంచి వాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేసినందున ఆ నిధులను ఇంటర్నెట్కు వాడుకోవాలి. – వాసంతి, డీఈఓసపోర్టింగ్ మానిటరింగ్ ఉంటుంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన చేయడానికి ఐఎఫ్పీ బోర్డులను వినియోగించుకోవచ్చు. డిజిటల్ బోధనకు సపోర్టింగ్ మానిటరింగ్ కూడా ఉంటుంది. జిల్లాలోని రిసోర్స్ పర్సన్ల ద్వారా ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు వాటి వినియోగంపై అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం. సమర్థవంతంగా హెచ్ఎంలు, టీచర్లు వినియోగించుకోవాలి. – ఎ.శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ●న్యూస్రీల్ఉపాధ్యాయులకు శిక్షణ ఐఎఫ్పీ అవసరం ఏమిటంటే.. ఆకట్టుకునేలా బోధన ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని సులభంగా అర్థం చేయించే అవకాశం ఉంది. ప్రొజెక్టర్, కేయాన్లకు ప్రత్యామ్నాయంగా సులువైన ఆపరేషన్ ఇంటర్నెట్, యూట్యూబ్, విద్యా చానల్స్, పెన్ డ్రైవ్, వాట్సాప్లతో కనెక్టివిటీ చేయడం ద్వారా బోధన సులువవుతుంది. విద్యార్థులకు దృశ్య మాలికతతో కూడిన అభ్యాసము చేయించవచ్చు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చూపించడం, అవసరమైనప్పుడు డిజిటల్ పాఠాన్ని ఆపి వైట్ బోర్డు సహాయంతో బోధించే అవకాశం ఉంది. బోధన సమయాన్ని ఆదాచేయడం, సరళంగా బోధించడం తదితర ఉపయోగాలున్నాయి. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్లోని సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వినతుల్లో జీడబ్ల్యూఎంసీకి 8, ఆర్డీఓ హనుమకొండ 7, తహసీల్దార్ హసన్పర్తి 5, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 70 దరఖా స్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ శ్రీను, అధికారులు పాల్గొన్నారు. అర్జీలపై దృష్టి సారించాలి.. : వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: ప్రజావాణికి వస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అధికారుల ను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించా రు. మొత్తం 86 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ 33, వ్యవసాయశాఖ 7, డీఆర్డీఓ, జీడబ్ల్యూఎంసీ, ఎంజీఎంకు సంబంధించిన సమస్యలపై 5 చొప్పున ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
25నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీవరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ దేవాదాయ, ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత కోరారు. సోమవారం ఆలయంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సునీత, హనుమకొండ సీఐ సతీష్ పాల్గొని ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రుద్రేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, స్వామివారి కల్యాణానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే చండీహోమంలో పాల్గొనడానికి రూ.3,116, స్వామివారి కల్యాణంలో రూ.1,116, అన్నపూజ రూ.5,116, లింగోద్భవ కాలపూజ రూ.12,116, శివరాత్రి ఉత్సవాల్లో ఐదురోజులు జరిగే పూజల్లో పాల్గొనే భక్తులు రూ.21,116 చెల్లించి రశీదు పొందాలని సూచించారు. సీఐ సతీష్ మాట్లాడుతూ ఉత్సవాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, సిబ్బంది ఎల్.మధుకర్, రామకృష్ణ, రజిత తదితరులు పాల్గొన్నారు. -
కొలువులకు కోత !
వృథాగా 215 పోస్టులు ఎన్పీడీసీఎల్ సంస్థలో గన్మ్యాన్, టెలిఫోన్ బాయి, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఇన్స్పెక్టర్, టెలిఫోన్ ఆపరేటర్, టూల్ కీపర్ వంటి 215 పోస్టులు ఎన్నో ఏళ్లుగా వృథాగా ఉంటున్నాయి. వీటిని క్షేత్ర స్థాయి వర్క్మెన్ పోస్టులుగా మార్చాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు మూడేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదే అదనుగా పదోన్నతుల కోసం ఇంజనీర్లు ఇందులో ప్రవేశించి తమకు కొన్ని పోస్టులు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే.. ఈ పోస్టులకు చెల్లించే జీతాల మొత్తం ప్రతిపాదిత పోస్టుల మొత్తానికయ్యే జీతాలకు సరిపోక యాజమాన్యం దృష్టి.. భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులపై పడింది. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్ల పదోన్నతుల కోసం వర్క్మెన్ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల అవకాశాలు కొల్లగొడుతున్నదనే అపవాదును మూటగట్టుకుంటోంది. వర్క్మెన్ పోస్టులను తగ్గించి వాటిని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఉన్నత స్థాయి పోస్టులు సృష్టించడంపై క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త సబ్స్టేషన్లు నిర్మించినా ఆ మేరకు ఆపరేటర్లను నియమించకపోవడంతోఅందుబాటులో ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఉద్యోగులపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. కొన్ని సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఉద్యోగుల ను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ ని ర్వహణను నెట్టుకొస్తున్నారే తప్ప సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకంపై యాజమాన్యం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. 23 నెలల క్రితం నోటిఫికేషన్ టీజీ ఎన్పీడీసీఎల్లో 932 పోస్టులు ఖాళీగా ఉండగా 23 నెలల క్రితం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఇటీవల 93 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 839 పోస్టులు భర్తీ చేయలేదు. వాటిలో 200 పోస్టులకు కోత పెట్టి ఉన్నతస్థాయి పోస్టులుగా సృష్టించి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది లేక.. ఉన్న ఉద్యోగులపై పని భారం పడుతున్నా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. 339 కొత్త పోస్టుల స్థిరీకరణ కొన్నేళ్లుగా వృథాగా ఉన్న 215 అన్యూజ్డ్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల్లో 200 కలిపి మొత్తం 415 పోస్టుల స్థానంలో కొత్తగా 339 పోస్టులు స్థిరీకరించారు. అందులో చీఫ్ ఇంజనీర్, సీజీఎం(అకౌంట్స్), జాయింట్ సెక్రటరీ(పీఅండ్జీ), జనరల్ మేనేజర్ (పీఅండ్జీ), అకౌంట్స్ ఆఫీసర్ ఒక్కో పోస్టు చొప్పున, ఎస్ఈ, డీఈ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, వాచ్మెన్ పోస్టులు నాలుగు చొప్పున, రెండు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆరు అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్ పోస్టులు 16 చొప్పున, జూనియల్ అకౌంట్స్ ఆఫీసర్ 20, సీనియర్ అసిస్టెంట్ 88, సీనియర్లైన్ ఇన్స్పెక్టర్ 32, అసిస్టెంట్ లైన్మెన్ 48, ఆఫీస్ సబార్డినేట్ 88, స్వీపర్ పోస్టులు ఆరు మార్చినట్లు సమాచారం. వంతుల వారీగా విధులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 33/11 కేవీ సబ్స్టేషన్లు 994 ఉండగా ప్రస్తుతం 1,511కు పెరిగింది. విద్యుత్ సర్వీసులు 48,17,575 ఉండగా 68,51,012కు పెరిగా యి. ఈ లెక్కన 517 సబ్స్టేషన్లు, 20,33,437 సర్సీసులు పెరిగాయి. అయితే.. విద్యుత్ వినియోగదారులకు సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించలేదు. ప్రతీ సబ్ స్టేషన్కు కనీసం నలుగురు ఆపరేటర్లు అవసరం. ఈ లెక్కన కొత్తగా నిర్మించిన 517 సబ్స్టేషన్లకు 2,068 మంది కావాలి. అన్ యూజ్ డు పోస్టుల స్థానంలో సృష్టించిన కొత్త పోస్టుల్లోనూ సబ్స్టేషన్ ఆపరేటర్లను మరిచా రు. దీనికి తోడు గతంలో పని చేసిన ఆపరేటర్లు రిటైర్డ్ అవుతుండడంతో ప్రతి నెలా ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో జేఎల్ఎంలు, ఏఎల్ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు వంతుల వారీగా ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీ ఉండడంతో ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేసే వారు కరువయ్యారు. ప్రమోషన్ల కోసం పోస్టుల కుదింపు టీజీ ఎన్పీడీసీఎల్ తీరుతో నిరుద్యోగుల అవకాశాలకు గండి సబ్స్టేషన్లలో ఆపరేటర్లు కరువు గ్రామాల్లో జూనియర్ లైన్మెన్ల కొరత క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ఇబ్బందులు పని భారంతో ఏఅండ్ఎం ఉద్యోగుల అవస్థలు పదోన్నతుల కోసం కాదు.. అన్ యూజ్డు పోస్టులను ఇతర పోస్టులుగా మార్చడం పదోన్నతుల కోసం కాదు. ఎన్పీడీసీఎల్ పరిధి రిమోట్ ఏరియాలో కొత్తగా సెక్షన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ములుగు సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. మరికొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి, వినియోగంలో లేని పోస్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వినియోగదారులకు సేవలు అందించేందుకు, అడ్మినిస్ట్రేషన్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో జేఎల్ఎం పోస్టులు భర్తీ చేయనున్నం. ఈ నియామకాలతో సబ్స్టేషన్ ఆపరేటర్ల కొరత తీరుతుంది. – కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ ఎన్పీడీసీఎల్ -
తహసీల్దార్ గారూ.. ఏది నిజం?
సాక్షి, వరంగల్: జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘అన్న, తమ్ముడు.. ఓ తహసీల్దార్’ కథనంపై వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ సాక్షి పత్రికకు ఇచ్చిన ‘రిజైండర్’ మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి వరంగల్ మండలం కొత్తపేటలోని సర్వే నంబర్ 73లో ఒక ఎకరం భూమి మహమ్మద్ అఫ్జల్ నుంచి 1998 జనవరి 9న సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశానని మోకాపై వ్యవసాయం సాగు చేసుకుంటున్న అంకేశ్వరపు కొమురయ్య వాదిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన సాదాబైనామా అప్లికేషన్ నంబర్ టీటీఆర్వోఎస్ 022003406759 పరిష్కరించాలంటూ 23614 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ ప్రకారం అంకేశ్వరపు కొమురయ్యది సర్వే నంబర్ 73/ఏ/3 అని అందులో ఒక ఎకరం ఒక గుంట భూమి అని.. అది రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అని.. సింపుల్ సేల్ డీడ్ ద్వారా ఎండీ ఖాజా పాషా దగ్గర కొనుగోలు చేశాడని సాక్షికి ఇచ్చిన రిజైండర్లో తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. దీంతో అసలు ఈ విచారణ సజావుగా సాగిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట ధరణిలో అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరున ఉన్నట్టు నిర్ధారించిన తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎండీ ఖాజా పాషాదని పేర్కొనడమే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పుడు ఇదే అంశం కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు సవాల్గా మారిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో వినబడుతోంది. నిజం తేల్చాలని బాధితుల వేడుకోలు వరంగల్ మండలం కొత్తపేటలోని 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట భూమి ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమిని మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ ఇక్బాల్ సాక్షితో పేర్కొన్నారు. ఇది లోతుగా పరిశీలిస్తే ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున పట్టా ఉండడం నిజమే. కానీ ఆ భూమిని మహమ్మద్ అఫ్జల్ సోదరుడైన మహమ్మద్ జాఫర్ హుస్సేన్ ద్వారా డాక్యుమెంట్ నంబర్ 2780/2007తో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరు మీదకు మారింది. మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ చెబుతుంటే.. ఎండీ జాఫర్ హుస్సేన్ నుంచి అంకేశ్వరపు ఎల్లస్వామి కొనుగోలు చేసినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతుండడం గమనార్హం. మరీ ఇందులో ఏది నిజమనేది ఉన్నతాధికారులు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికై నా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తన పట్టా 73/ఏ/3 క్రయ విక్రయాలు జరగకుండా కోర్టు కేసు ఉందని అప్డేట్ చేసినదాన్ని తొలగించాలని అంకేశ్వరపు ఎల్లస్వామి రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అలాగే తన అన్న కొమురయ్య భూమి కొన్న సమయంలో బై సర్వే నంబర్లు లేవని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ఇది తెలుస్తుందని చెబుతున్నాడు. సర్వే నంబర్ 73లో 12.6ఎకరాల భూమి ఉండేదని వివరించారు.కలెక్టర్కు సవాల్గా మారిన కొత్తపేట సర్వే నంబర్ 73 భూ వివాదం ఒకే సర్వే నంబర్లో వింత సమాధానాలతో విచారణపై మరిన్ని అనుమానాలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తేనే బాధితులకు సరైన న్యాయం -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
వరంగల్: ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణిలో అందజేస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీ దారుల నుంచి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 86 దరఖా స్తులు రాగా అందులో రెవెన్యూ 33, వ్యయసాయశాఖ 7,డీఆర్డీఓ, జిడబ్ల్యూఎంసీ, ఎంజీఎంకు సంబంధించిన సమస్యలపై 5చొప్పున వినతులు వచ్చి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణిలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏకశిల కాలేజీపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న వరంగల్ కొత్తవాడలోని ఏకశిల మహిళా జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే వరంగల్లోని వేణురావు కాలనీలో అనుమతి లేకుండా ఏకశిల యాజమాన్యం బాయ్స్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఏఐఎస్బీ, ఏఐఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, స్వేరోస్, డీవైఎఫ్ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
కోదండరాం వ్యాఖ్యలు సరికాదు
హెచ్ఆర్డీఏ, కేఎంసీ జూడాల నిరసన ఎంజీఎం : అక్రమంగా వైద్య సేవలు అందించే క్వాక్స్కు సర్టిఫికెట్ మంజూరు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా ఉన్నాయి.. తీవ్రంగా ఖండిస్తున్నామని హెల్త్కేర్ రిఫార్మస్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ), కేఎంసీ జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేఎంసీ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఒక వైపు వేలాది మంది మెడికల్ విద్యార్థులు అధునాతన, నాణ్యమైన వైద్యవిద్య కోసం పోరాడుతున్నారని అన్నారు. వైద్య కళాశాలల్లో తగిన బోధనా సిబ్బంది, భవనాలు లేక ఇబ్బందులు పడుతుండగా.. కోదండరాం నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా మాట్లాడడం ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఇందుకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డాక్టర్ టీకే.శ్రీదేవి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్, ఆర్టీసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ‘పీఎం ఈ–బస్ సేవా పథకం’లో భాగంగా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్కు జనాభా ప్రాతిపదికన 100ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీతో పాటు ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. వీసీలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీసీ ఆర్ఎం బాలు నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలతో కూడిన నివేదిక అందచేయండి రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కాళోజీ సెంటర్: మార్చి 5 నుంచి 22 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని, సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9240205555కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్తో పాటు వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలన్నారు. సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. వైద్య సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,321 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. వీరికి 26పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం, జనరల్ విద్యార్థులు 4,967 మంది, ఒకేషనల్ 848 మందితో కలిపి మొత్తం 5,815 విద్యార్థులు ఉన్నారని వివరించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,739 మంది, ఒకేషనల్ విద్యార్థులు 767 మందితో కలిపి మొత్తం 6,506 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తంగా 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. వార్షిక పరీక్షల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో డ్యుయల్ డెస్కులు, నీరు, విద్యుత్, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓ మాడభూషి విజయలక్ష్మి, డీఆర్డీఓ అధికారి కౌసల్య దేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావుతో పాటు ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శిగా వినయ్కుమార్
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీరామోజు వినయ్కుమార్ ఎన్నికయ్యారు. తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి లక్ష్మీ, కోశాధికారి నర్సింగరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా గుళ్లపెల్లి వివేక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామోజు వినయ్కుమార్, కోశాధికారిగా శరత్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఈ మేరకు చెస్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా వినయ్కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చెస్ అసోసియేషన్ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు వినయ్కుమార్ ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు. క్రీడలతో మానసికోల్లాసంవర్ధన్నపేట: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఏసీపీ సోమవారం ప్రారంభించారు. తొలి మ్యాచ్ యూత్ సభ్యులతో సరదాగా ఏసీపీ, పోలీస్ అధికారులు ఆడి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూ రంగా ఉంటూ సామాజిక సేవలో ముందుంటూ ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, యూత్ సభ్యులు పాల్గొన్నారు. స్వయం పరిపాలన దినోత్సవంనర్సంపేట రూరల్: నర్సంపేట మండల పరిధిలోని మాధన్నపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అర్చన, సుధావాణి, లీలా, అశోక్, వెంకన్న, విశాల, చంద్రమోహన్, పీఈటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలుగీసుకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి, నర్సంపేట జనరల్ ఆస్పత్రి, వరంగల్లోని రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లాలో 36,368మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516మందికి కంటి పరీక్షలు(92.36శాతం) నిర్వహించగా 1,074 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి సోమవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు చికిత్స అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు వరంగల్ రీజినల్ కంటి ఆస్పత్రిలో 43మంది, నర్సంపేట జనరల్ ఆస్పత్రిలో 32మంది, వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్లో 20మందికి పరీక్షలు చేయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఐవో ప్రకాశ్, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వరంగల్
పోడు భూముల్లో సౌర వెలుగులు సాగుకు యోగ్యంగా లేని పోడు భూముల్లో సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి.మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025– 8లోuవృథాగా 215 పోస్టులు ఎన్పీడీసీఎల్ సంస్థలో గన్మ్యాన్, టెలిఫోన్ బాయి, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఇన్స్పెక్టర్, టెలిఫోన్ ఆపరేటర్, టూల్ కీపర్ వంటి 215 పోస్టులు ఎన్నో ఏళ్లుగా వృథాగా ఉంటున్నాయి. వీటిని క్షేత్ర స్థాయి వర్క్మెన్ పోస్టులుగా మార్చాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు మూడేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదే అదనుగా పదోన్నతుల కోసం ఇంజనీర్లు ఇందులో ప్రవేశించి తమకు కొన్ని పోస్టులు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే.. ఈ పోస్టులకు చెల్లించే జీతాల మొత్తం ప్రతిపాదిత పోస్టుల మొత్తానికయ్యే జీతాలకు సరిపోక యాజమాన్యం దృష్టి.. భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులపై పడింది. ప్రమోషన్ల కోసం పోస్టుల కుదింపు ● టీజీ ఎన్పీడీసీఎల్ తీరుతో నిరుద్యోగుల అవకాశాలకు గండి ● సబ్స్టేషన్లలో ఆపరేటర్లు కరువు ● గ్రామాల్లో జూనియర్ లైన్మెన్ల కొరత ● క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ఇబ్బందులు ● పని భారంతో ఏఅండ్ఎం ఉద్యోగుల అవస్థలు హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్ల పదోన్నతుల కోసం వర్క్మెన్ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల అవకాశాలను కొల్లగొడుతున్నదనే అపవాదును మూటగట్టుకుంటోంది. వర్క్మెన్ పోస్టులను తగ్గించి వాటిని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఉన్నత స్థాయి పోస్టులు సృష్టించడంపై క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త సబ్స్టేషన్లు నిర్మించినా ఆ మేరకు ఆపరేటర్లను నియమించకపోవడంతో అందుబాటులో ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఉద్యోగులపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. కొన్ని సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ నిర్వహణను నెట్టుకొస్తున్నారే తప్ప సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకంపై యాజమాన్యం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. 23 నెలల క్రితం నోటిఫికేషన్ టీజీ ఎన్పీడీసీఎల్లో 932 పోస్టులు ఖాళీగా ఉండగా 23 నెలల క్రితం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఇటీవల 93 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 839 పోస్టులు భర్తీ చేయలేదు. వాటిలో 200 పోస్టులకు కోత పెట్టి ఉన్నతస్థాయి పోస్టులుగా సృష్టించి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది లేక.. ఉన్న ఉద్యోగులపై పని భారం పడుతున్నా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయకుండా అధికారులు కాలయాపన చేస్తుండడంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. 339 కొత్త పోస్టుల స్థిరీకరణ కొన్నేళ్లుగా వృథాగా ఉన్న 215 అన్ యూజ్డ్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల్లో 200 కలిపి మొత్తం 415 పోస్టుల స్థానంలో కొత్తగా 339 పోస్టులు స్థిరీకరించారు. అందులో చీఫ్ ఇంజనీర్, సీజీఎం(అకౌంట్స్), జాయింట్ సెక్రటరీ(పీఅండ్జీ), జనరల్ మేనేజర్ (పీఅండ్జీ), అకౌంట్స్ ఆఫీసర్ ఒక్కో పోస్టు చొప్పున, ఎస్ఈ, డీఈ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, వాచ్మెన్ పోస్టులు నాలుగు చొప్పున, రెండు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆరు అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్ పోస్టులు 16 చొప్పున, జూనియల్ అకౌంట్స్ ఆఫీసర్ 20, సీనియర్ అసిస్టెంట్ 88, సీనియర్లైన్ ఇన్స్పెక్టర్ 32, అసిస్టెంట్ లైన్మెన్ 48, ఆఫీస్ సబార్డినేట్ 88, స్వీపర్ పోస్టులు ఆరు మార్చినట్లు సమాచారం. వంతుల వారీగా విధులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 33/11 కేవీ సబ్స్టేషన్లు 994 ఉండగా ప్రస్తుతం 1,511కు పెరిగింది. విద్యుత్ సర్వీసులు 48,17,575 ఉండగా 68,51,012కు పెరిగాయి. ఈ లెక్కన 517 సబ్స్టేషన్లు, 20,33,437 సర్సీసులు పెరిగాయి. అయితే.. విద్యుత్ వినియోగదారులకు సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించలేదు. ప్రతీ సబ్ స్టేషన్కు కనీసం నలుగురు ఆపరేటర్లు అవసరం. ఈ లెక్కన కొత్తగా నిర్మించిన 517 సబ్స్టేషన్లకు 2,068 మంది అవసరం. అన్ యూజ్డ్ పోస్టుల స్థానంలో సృష్టించిన కొత్త పోస్టుల్లోనూ సబ్స్టేషన్ ఆపరేటర్లను మరిచారు. దీనికి తోడు గతంలో పని చేసిన ఆపరేటర్లు రిటైర్డ్ అవుతుండడంతో ప్రతి నెలా ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో జేఎల్ఎంలు, ఏఎల్ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు వంతుల వారీగా ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేసే వారు కరువయ్యారు. గ్రామాల్లో జూనియర్ లైన్మెన్లు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా వినియోగదారులకు నేరుగా సేవలందించే వారి పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని పలువురు కోరారు.న్యూస్రీల్పదోన్నతుల కోసం కాదు.. అన్ యూజ్డ్ పోస్టులను ఇతర పోస్టులుగా మార్చడం పదోన్నతుల కోసం కాదు. ఎన్పీడీసీఎల్ పరిధి రిమోట్ ఏరియాలో కొత్తగా సెక్షన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ములుగు సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. మరికొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి, వినియోగంలో లేని పోస్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వినియోగదారులకు సేవలు అందించేందుకు, అడ్మినిస్ట్రేషన్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో జేఎల్ఎం పోస్టులు భర్తీ చేయనున్నం. ఈ నియామకాలతో సబ్స్టేషన్ ఆపరేటర్ల కొరత తీరుతుంది.– కర్నాటి వరుణ్రెడ్డి, సీఎండీ ఎన్పీడీసీఎల్ -
సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి
వరంగల్ లీగల్ : నిత్యం కోర్టుకు వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఇరు జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ లిఫ్ట్, న్యాయవాదుల కారు పార్కింగ్ షెడ్లను జస్టిస్ భట్టాచార్య వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, సీహెచ్.రమేశ్బాబు, రెండు జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్గౌడ్, మాతంగి రమేశ్బాబు, కార్యదర్శి లడే రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, న్యాయవాద సంఘం ప్రతినిధులు, న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీ ల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యాన్ని తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్పీ జయంత్లాల్, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, గృహాలకు సంబంధించి ఆస్తి పన్నులు విధిగా సకాలంలో చెల్లించి నగర ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమి షనర్ అశ్విని తానాజీ వాకడే కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యానికి జీడబ్ల్యూఎంసీ విధించిన డీవియేషన్ పెనాల్టీ, జరిమానా, ఆస్తి పన్ను మొత్తం రూ.7,23,289 చెక్కు ఆదివారం కాజీపేట సర్కిల్ కార్యాలయంలో కమిషనర్కు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, రెవెన్యూ అధికారి యూసుఫొద్దీన్, సూపరింటెండెంట్ అనిల్, ఆర్ఐలు దేవరాజ్, రజని, బిల్కలెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
26న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం
హన్మకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 26న ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓరుగల్లు వైభవాన్ని, శివతత్వాన్ని చాటేలా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ప్రతి సంవత్సరం మాదిరిగానే మహా శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఓరుగల్లు ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాకేశ్రెడ్డితోపాటు ప్రముఖ గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్ పాల్గొన్నారు. -
సైనిక్ స్కూల్కు స్కోచ్ అవార్డు
ఖానాపురం: మండలంలోని అశోక్నగర్లో ఉన్న గిగిరిజన సైనిక్ స్కూల్ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతదేశ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు లేదా సంస్థల కృషిని గుర్తించి స్కోచ్ అవార్డును అందిస్తారని పేర్కొన్నారు. అవార్డు కోసం జాతీయస్థాయిలో పలు విద్యాసంస్థలు పోటీలో పాల్గొనగా సైనిక్ స్కూల్ గెలుచుకుందన్నారు. స్కూల్కు చెందిన 27 మంది విద్యార్థులు త్రివిధ దళాలు, పోలీస్ అకాడమీలో ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. మరో 20 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇండియన్ మేరీ టైం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారని ఆయన వివరించారు. ఫలితాల కృషితో సైనిక్ స్కూల్కు అవార్డు లభించిందని చెప్పారు. గిరిజన గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి, ఓఎస్డీ నటరాజ్ న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నట్లు తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజావాణి వరంగల్: కలెక్టరేట్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతులను కార్యాలయంలో అందించాలని ఆమె సూచించారు. నేడు, రేపు యువజన క్రీడోత్సవాలు వరంగల్ స్పోర్ట్స్: నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 17, 18వ తేదీల్లో సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్వైకే జిల్లా అధికారి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలూకా స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లాస్థాయిలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. యువకులకు వాలీబాల్, అథ్లెటిక్స్, షటిల్బ్యాడ్మింటన్, యువతులకు కబడ్డీ, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల వయస్సు 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 93908 31502 నంబర్లో సంప్రదించాలని సూచించారు. తప్పిపోయిన చిన్నారి అప్పగింత ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నర్సంపేటకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో దర్శనానికి రాగా తన కుమార్తె హఫియా తప్పిపోయింది. ఈ విషయాన్ని రాజు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమైన వాకీటాకీల ద్వారా సమన్వయంతో చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. డీఎస్పీ రవీందర్ సమక్షంలో హఫియాను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తె సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 21 నుంచి మూడేళ్ల లా మొదటి సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు ఐదవ సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 22, 25, మార్చి 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. -
సేవలు మరింత చేరువ
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ సర్వీసుల మంజూరును మరింత సులభతరం చేశారు. వినియోగదారుడికి కొత్త సర్వీసుల మంజూరులో సరైన డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చారు. ఇకపై ఏదేని కారణంచేత దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే దాన్ని తిరస్కరించకుండా మంజూరుకు కావాల్సిన ప్రక్రియను పూర్తిస్థాయిలో అందించేలా విద్యుత్ శాఖ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇది వరకు దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చిందో తెలియక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చాక కార్యాలయం చుట్టూ తిరిగాల్సి న అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ నుంచి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్ స్థితిని తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వినియోగదారుడికి మెరుగైన సేవలువినియోగదారుడికి మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్నాం. ఈక్రమంలో విద్యుత్ నూతన సర్వీసుల మంజూరు వేగవంతం, సులభతరం చేశాం. సేవలను వినియోగించుకోవాలి. – కె.వెంకటరమణ, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ వినియోగదారుల ముందుకు సాంకేతికత వినియోగదారుల ముంగిటికి సాంకేతిక సేవలను తీసుకెళ్తున్నాం. విద్యుత్ సర్వీస్ మంజూరులోనూ సాంకేతికతను వినియోగిస్తున్నాం. మంజూరులో జరిగే ప్రతీ ప్రక్రియను వినియోగదారుడు తెలుసుకునేలా సౌకర్యం కల్పించాం. – మధుసూదన్, ఎస్ఈ, వరంగల్ సర్కిల్ అందుబాటులోకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం వినియోగదారులకు తప్పిన తిప్పలు -
సాగు లెక్క పక్కా!
నల్లబెల్లి: రైతులు సాగుచేస్తున్న పంటల లెక్క పక్కాగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పంట పొలాలను సందర్శిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా సాగు వివరాలతోపాటు పంటల ఫొటోలు తీసి డిజిటల్ యాప్లో నమోదు చేస్తున్నారు. యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వేను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. మండల, జిల్లా, డివిజన్ వ్యవసాయాధికారులు ఈ సర్వే యాప్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సర్వే సమయంలో ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఏఈఓలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 58 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. 1,55,585 సర్వే నంబర్లలోని 1,15,301 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాగా, సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ఏఈఓలు ఇప్పటి వరకు 34,786 సర్వే నంబర్లలోని 27,689 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను యాప్లో నమోదు చేశారు. ఇంకా 1,20,799 సర్వే నంబర్లలోని 87,612 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సర్వే చేయాల్సి ఉంది. సర్వేతో ప్రయోజనాలు.. సాంకేతిక పరిజ్ఞానం ఉయోగించి చేస్తున్న ఈ సర్వే ఆధారంగా రైతులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, పంటల బీమాతోపాటు పంటనష్టాన్ని అంచనా వేయడానికి దోహదపడుతుంది. ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు రైతులు సాగు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. దిగుబడి ఎంత వస్తుందనే విషయాన్ని అంచనా వేస్తూ ప్రభుత్వం ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతు బీమా, రైతు భరోసా తదితర పథకాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పక్కాగా అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నమోదు చేయకుంటే ఇబ్బందులే.. డిజిటల్ సర్వేలో రైతులు పంటల వివరాలు నమోదు చేసుకోకుంటే పంట విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపరిహారం పొందేందుకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఏఈఓలు గ్రామాల్లో సర్వే నంబర్ల ఆధారంగా సర్వే చేపడుతున్నారు. వీరికి రైతులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. సర్వేతో రైతులకు ఉపయోగం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పక్కగా పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు డిజిటల్ సర్వే కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నంబర్ల ఆధారంగా ప్రతి క్లస్టర్ పరిధిలో 2 వేల ఎకరాలు రైతుల పంటల వివరాలు నమోదు చేపడుతున్నాం. ఈ సర్వే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. సర్వేకు వచ్చే ఏఈఓలకు రైతులు సహకరించాలి. – రజిత, ఏఓ, నల్లబెల్లి జిల్లాలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే యాప్లో వివరాలు నమోదు చేస్తున్న ఏఈఓలు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ అధికారులుడిజిటల్ సర్వే ఇలా.. వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే నంబర్లో ఉండే పంట పొలాన్ని చూసి పంట వివరాలను యాప్లో నమోదు చేయడంతోపాటు ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు పక్కాగా నమోదు చేయాలి. పంట లేకుంటే నో క్రాప్ అని నమోదు చేయాల్సి ఉంది. -
సర్వేకు ప్రజలు సహకరించాలి
వరంగల్: కులగణన సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, కరీమాబాద్ మీసేవ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రీసర్వేలో నమోదు వివరాల తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనవు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 వరకు సర్వే నిర్వహిస్తారని, ఇప్పటివరకు నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్లోని పోచమ్మమైదాన్ ఈసేవ కేంద్రం, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ కేంద్రం, కరీమాబాద్ మీసేవ కేంద్రం, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జీడబ్ల్యూఎంసీ వరంగల్ పరిధిలోని అన్ని వార్డులు, నర్సంపేట మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం చేసి కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారిని ప్రోత్సహించాలని సంధ్యారాణి అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–211111111 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా https://seeepcsurvey.cgg.gov.in నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజా పాలన కేంద్రాల్లో అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు సర్వేకు సహకరించి, పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదనవు కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బల్దియా రెవెన్యూ అధికారి షాజాదిబేగం, పర్యవేక్షకులు హబీబుద్దీన్, ఆర్ఐ సోహైల్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి