Warangal District News
-
ఐనవోలులో అర్చకులు, సిబ్బంది రాస్తారోకో
ఐనవోలు: టెండరుదారుపై చర్యలు తీసుకోవాలని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది, స్వీపర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయం బయట రాస్తారోకో నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో కొబ్బరి ముక్కలు సేకరించేందుకు టెండర్ పొందిన గుండెబోయిన లావణ్య ఇటీవల కొంతమంది భక్తులను దుర్భాషలాడుతూ భౌతికంగా దాడి చేసింది. నాకు నోటీసులు ఇచ్చింది నువ్వేనా అంటూ సోమవారం సాయంత్రం ఆలయ కంప్యూటర్ ఆపరేటర్ తీగల రాజును దుర్భాషలాడి భౌతిక దాడి చేసింది. దీంతో అర్చకులు, సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ హామీతో రాస్తారోకో విరమించారు. లావణ్య టెండర్ రద్దు చేయాలని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావుకు అర్చకులు, సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ను వివరణ కోరగా లావణ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అర్చకులు నరేశ్శర్మ, మధుకర్శర్మ, మధుశర్మ, దేవేందర్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానంసాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడి నుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లో రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడి నుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం అమరుల పల్లె తరాలపల్లి..తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామం నుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీశ్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం, సంపత్, కొత్తపల్లి సాంబయ్య మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. సారయ్య మృతదేహం బుధవారం తరాలపల్లికి రానుంది. -
మే1 నుంచి ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు పీడీ, పీఈటీ, సీనియర్ క్రీడాకారులు వచ్చే నెల 15 వరకు హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నెల రోజులపాటు శిబిరాలను నిర్వహించే శిక్షకులకు గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే శిక్షణ శిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రెండు రోజులపాటు జాతీయ కాన్ఫరెన్స్ విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ పి.అరుణ, కోకన్వీనర్ కవిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టయినబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్’అంశంపై ఈ జాతీయ కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పి.ప్రావీణ్య, నిట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ హరినాఽథ్ కీలక ఉపన్యాసం చేస్తారని, నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆన్వేశ్, సీసీఈటీ ఏజీఓ ప్రొఫెసర్ బాలభాస్కర్ పాల్గొంటారని వివరించారు. ఐఎస్ఎఫ్తో నిట్ ఒప్పందం కాజీపేట అర్బన్: ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) కర్నాటకతో నిట్ వరంగల్ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో డైరెక్టర్ బిద్యాధర్ బిద్యాధర్ సుబుదీ, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జేఏ చౌదరి పరస్పర ఒప్పందపత్రాలను అందజేసుకున్నారు. కాగా, స్టార్టప్ల అభివృద్ధికి ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు ఏప్రిల్ 2కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలకు సంబంధించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల 2,4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజులు చెల్లించేందుకు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 2వరకు గడువు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహించనున్నారని, వివిధ కోర్సుల ఫీజుల వివరాలు, పూర్తి సమాచారం కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. -
పీఎన్డీటీ చట్టం ఉల్లంఘిస్తే చర్యలు
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ (పీసీ అండ్ పీఎన్డీటీ) చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన పీసీఅండ్ పీఎన్డీటీ అథారిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఆస్పత్రిలో చట్టా నికి సంబంధించిన బోర్డు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు. వైద్యాధికారులు రిజిస్టర్ అయిన కేంద్రాలతోపాటు రిజిస్టర్ కాని ఆస్పత్రులను కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పబ్లిక్ స్థలాల్లో వాల్పోస్టర్లు ప్రదర్శించడంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎన్హెచ్జీ గ్రూపులను కూడా అవగాహన సదస్సుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లోని మహిళలకు అవగాహన కల్పించడమే కాక గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కరుణాకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల పాల్గొన్నారు. -
లేకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని హౌసింగ్ బోర్డు నోటీసులు
కాలనీవారీగా బకాయిలు (రూ.లలో)హన్మకొండ: పెండింగ్ బకాయిలను రాబట్టుకునేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కఠిన చర్యలకు పూనుకుంది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు హౌసింగ్ బోర్టు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. వాయిదాల మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా కొంతమంది నిర్లక్ష్యం చేశారు. బకాయిలు తడిసి మోపెడు కావడంతో హౌసింగ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు. అసలుకు వడ్డీలపై వడ్డీలు వేసి అధిక మొత్తం చెల్లించాలని నోటీసులు జారీ చేశారని లబోదిబోమంటున్నారు. వరంగల్ డివిజన్ పరిధిలో 528 మందికి నోటీసులు.. తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని హనుమకొండ వడ్డేపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, వరంగల్ గొర్రెకుంట కాలనీ, జగిత్యాల, మంచిర్యాల నస్పూర్ కాలనీ, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ కాలనీ, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జనగామలోని హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తగూడెం చుంచుకాలనీకు చెందిన బకాయిలు మొత్తం రూ.44,69,99,904 పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 528 మందికి నోటీసులు జారీ చేశారు. ఒక్కో కాలనీలో రూ.3లక్షల నుంచి రూ.18 లక్షలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.22,49,76,301 బకాయిలు పేరుకుపోయినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలు చెల్లించేందుకు గడువు విధించారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక్కో కాలనీలో బకాయిదారులు రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు బకాయిలున్నారు. బకాయిలు సంస్థకు గుదిబండగా తయారయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి బకాయిలు వసూలు చేయాల్సిందేనని సీరియస్గా చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు హుటాహుటినా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేశాం... పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అంకం రావు, హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ ఈఈ -
జిల్లాల వారీగా ఇలా..
● హనుమకొండ వడ్డేపల్లిలో అపార్ట్మెంట్ మోడల్లో 744 ఫ్లాట్లు నిర్మించారు. వీటిని 1990లో లబ్ధిదారులకు కేటాయించగా చాలా మంది క్రయవిక్రయాలు జరిపారు. ఇక్కడ రూ.3,67,81,668 బకాయిలు పేరుకుపోగా ఇప్పుడు 142 మందికి నోటీసులు జారీ చేశారు. ● వరంగల్ గొర్రెకుంట కాలనీలో 1376 ఇళ్లు నిర్మించారు. వీటిని దశల వారీగా 1992, 1993, 2003, 2012లో లబ్ధిదారులకు కేటాయించారు. ఈ కాలనీలో రూ.9,43,58,063 బకాయిలు పేరుకుపోగా వీటిని రాబట్టుకునేందుకు 103 మందికి నోటీసులు జారీ చేశారు. ● మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 79 ఇళ్లు నిర్మించి 1997లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక్కడ రూ.7,19,45,743 బకాయిలు ఉండగా, వీటిని రాబట్టుకునేందుకు 64 మందికి నోటీసులు జారీ చేశారు. ● జనగామ హౌసింగ్ బోర్డు కాలనీలో 127 ఇళ్లు నిర్మించగా రూ.2,18,90,827 బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రాబట్టుకునేందుకు 17 మందికి నోటీసులు జారీ చేశారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
ఆత్మకూరు/దామెర: ప్రజల్లో పోలీసుల గౌరవం పెంచేందుకు పోలీసు అధికారులు నిజాయితీగా పనిచేయాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. ఆత్మకూరు, దామెర పోలీస్ స్టేషన్లను సీపీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం సిబ్బంది వివరాలు, పలు రికార్డులు పరిశీలించారు. నమోదవుతున్న కేసులు, రౌడీషీటర్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా ఉంటూ వెంటనే సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సైబర్నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–భూపాలపట్నం జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏఎస్పీ మనన్భట్, పరకాల ఏసీపీ సతీశ్బాబు, ఆత్మకూరు, పరకాల రూరల్ సీఐలు సంతోష్, రంజిత్రావు, దామెర ఎస్సై కొంక అశోక్, సిబ్బంది ఉన్నారు. చెక్పోస్ట్ తనిఖీ.. ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేందుకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కటాక్షపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సందర్శించారు. చెక్పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు, వాహనాల తనిఖీ తీరును సీపీ అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిజాయితీగా పనిచేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆత్మకూరు, దామెర పోలీస్ స్టేషన్ల తనిఖీ -
ఏడాది జైలుపాలే..
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025వరంగల్ క్రైం: తీవ్రమైన నేరాలకు పదేపదే పాల్పడే అక్రమార్కులు, నేరస్తులపై పీడీయాక్టులతో పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఇబ్బందిగా పరిణమించే వారిపట్ల ఇదో చట్టపరమైన ఆయుధం. కానీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లుగా పీడీయాక్టుల కేసు నమోదు అంతంతమాత్రమే. గత ఏడాది కేవలం రెండు కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కకేసు కూడా పెట్టలేదు. కానీ, అక్రమార్కుల ఆగడాలు, కబ్జాదారులు, గంజాయి, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట పడిందంటే లేదనే చెప్పాలి. వరంగల్ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు, రవీంద్రకుమార్, తరుణ్జోషి హయాంలో ఎక్కువగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఏవీ రంగనాఽథ్ పనిచేసిన సమయంలో అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఉక్కపాదం మోపారు. పేదల భూముల్లో అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుట్టించారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు, ఉదాసీనతతో అక్రమార్కులు పనులు యథాతథమయ్యాయి. మళ్లీ భూకబ్జాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట గంజాయి లభిస్తూనే ఉంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా చోరీల మీద చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.● తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ అధికారులు కేసుల తీవ్రతను బట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తారు. ● సంచలనం కలిగించే హత్య కేసులు ఒక్కటి, మూడు నెలల్లో రెండు కేసులు, 20 కిలోల గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లోని నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు. ● ఈ కేసులో సంవత్సరం వరకు బెయిల్ మంజురు కాదు. ● నిందితులను జైల్లోనే ఉంచి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, వారివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దు అనే ఆలోచనలతో పీడీయాక్టు నమోదు చేస్తారు. ● పోలీస్ కమిషనరేట్లో ఇప్పటివరకు మొత్తం 254 మందిపై పీడీయాక్టు పెట్టారు.హద్దుమీరితే పీడీ యాక్టు నమోదు హద్దుమీరి నేరాలకు పాల్పడే వారిపై కచ్చితంగా పీడీ యాక్టు నమోదు చేస్తాం. ఈ కేసులతో నేరస్తుల్లో భయంతోపాటు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ట్ర దొంగల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. భూకబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. – సన్ప్రీత్సింగ్, వరంగల్ సీపీ కోర్టు ఇబ్బందులతో వెనుకడుగు..వివిధ రకాల నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో పోలీసు అధికారులకు కోర్టుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద నేరాలు ఒక్కటి చేసినప్పటికి వారిపై పీడీయాక్టు నమోదు చేసే నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నిందితులకు పీడీయాక్టు నివేదికలను వారి సొంత భాషలో ఇవ్వడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల పీడీయాక్టు కేసులు నమోదైనప్పటికీ అన్ని కేసులు చివరి వరకు నిలవడం లేదు. హత్యలు చేసిన వారు8పీడీఎస్ బియ్యం రవాణా4డెకాయిట్, రాబరీ22భూకబ్జాదారులు4సీ్త్రల అక్రమ రవాణా1దొంగలు87మోసాలు22గంజాయి, డ్రగ్స్ సరఫరా104అత్యాచారాలకు పాల్పడే వారు2వరంగల్ కమిషనరేట్లో ఈ ఏడాది సున్నా -
కొమ్మాల ఆదాయం రూ. 49.11 లక్షలు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆదాయం ఈ ఏడాది రూ.49,11,096 వచ్చిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. హుండీల్లోని కానుకలను మంగళవారం ఆలయం వద్ద లెక్కించిన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది జాతర సందర్భంగా 31 రోజుల్లో రూ.27.45 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ ఏడాది హుండీల ద్వారా రూ. 20.48 లక్షలు ఆదాయం రాగా.. గత ఏడాది రూ.7.24 లక్షలు వచ్చిందన్నారు. వేలం, వివిధ రకాల టికెట్ల ద్వారా ఈ ఏడాది రూ.28.62 లక్షలు సమకూరితే గత ఏడాది రూ.20.20 లక్షలు సమకూరిందని వివరించారు. అధికారులు, అర్చకులు, సిబ్బంది సహకారంతో జాతర విజయవంతమైందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి పరిశీలకుడిగా అనిల్కుమార్, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తు ల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు కడారి రాజు బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు కానుకలను లెక్కించారు. గత జాతరతో పోలిస్తే రూ. 21.66 లక్షల అధిక ఆదాయం -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు...
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అ డవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధి లోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరి హద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న త రుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సా రథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్ర స్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావో యిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాలోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య గ్రామానికి తిరిగి రాలేదు. ముగిసిన 35 ఏళ్ల ప్రస్థానం... సుమారు 35 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన సారయ్య మంగళవారం ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో వివిధ స్థాయిల్లో పని చేసి 1995లో దండకారణ్యానికి వెళ్లిన ఆయన దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగా రు. ప్రస్తుతం ఈస్ట్ బస్తర్ డీకేఎస్జడ్సీ సభ్యుడిగా, మాస్ మొబైల్ అకడమిక్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. అమరుల పల్లె తరాలపల్లి.. కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరా ఫ్. ఎందరో ఈ గ్రామంనుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీష్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్రా వు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు (బుధవారం) సారయ్య మృతదేహం గ్రామానికి చేరనుంది. 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడినుంచి డీకేఎస్జడ్సీ వరకు.. దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం -
బస్టాండ్ ప్రదేశంలో బాంబుల పేల్చివేత
వరంగల్: వరంగల్ బస్డాండ్ స్థానంలో ప్రభుత్వం నూతనంగా మోడల్ బస్టాండ్ నిర్మిస్తోంది. పనుల్లో భాగంగా పిల్లర్లు ని ర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు ఉండడంతో తొలగించడం అనివార్యమైంది. ఈ రాళ్లను తొలగించేందుకు కాంట్రాక్టర్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ (బాంబులు)పెట్టి పేల్చివేసినట్లు తెలిసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమీపంలోని తాత్కాలిక బస్టాండ్లో నిలిచి ఉన్న భూపాలపల్లి డిపోకు చెందిన బస్సులో పెద్ద బండరాయి పడింది. ఈ రాయి తాకడంతో బస్సు కిటికీల అద్దాలు పగిలి డ్రైవర్, కండక్టర్లకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. బండరాయిని తొలగించేందుకు కాంట్రాక్టర్ అధికా రుల నుంచి అనుమతులు తీసుకున్నారా.. లేదా అన్న విషయం తెలియరాలేదు. అయినప్ప టికీ మిట్ట మధ్యాహ్నం బాంబు పేల్చడంపై పలు వురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద బండరాయి బస్సులో కాకుండా అక్కడే ఉన్నవారి పై పడితే మృత్యువాత పడేవారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలు కాంట్రాక్టర్ జిలెటిన్స్టిక్స్ పెట్టారా ...బాంబులు పెట్టారా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఈ ఘటనలో బస్సు ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్ రూ.10వేలు పరిహారంగా ఇచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఈవిషయంపై ఇంతేజార్గంజ్ పోలీసులను వివరణకోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. నాడు నేడు నిర్లక్ష్యమే... బస్టాండ్లో జరుగుతున్న ప్రతి పనిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడాదిన్నర క్రితం పాత బస్టాండ్లోని వాటర్ ట్యాంక్ను కూల్చివేసిన సమయంలో భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ఓ కూలీ మృత్యువాత పడ్డారు. ఇప్పుడు బాంబుల పేల్చివేతతో బండరాయి బస్సులో పడింది. దీతో కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నా రు. ఇదేవిషయంపై ఆర్టీసీ, పోలీసు అధికారుల వి వరణ కోసం సాక్షి ప్రయత్నించగా స్పందించలేదు.బస్సులో పడిన బండరాయి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు? -
సోదర భావాన్ని పెంపొందించేది ఇఫ్తార్
● డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్ధన్నపేట: ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొదిస్తాయని, రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణరాజేశ్వర్రావు అన్నారు. మంగళవారం రాత్రి వర్ధన్నపేట పట్టణంలోని జమామసీదులో ముస్లింలకు ఎర్రబెల్లి స్వర్ణరాజేశ్వర్రావు దంపతులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లింలకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు. మైనార్టీ సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీయేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఎండీ అప్సర్, ఎండీ అన్వర్, అజీజ్, జలీల్, అఫ్జల్, సలీం, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
వరంగల్: జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనులపై సమీక్ష.. మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. వరంగల్ ఏనుమాముల, గీసుకొండ, ఖిలావరంగల్ ఇన్నర్రింగ్ రోడ్డు పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఆ పనుల్లో వేగం పెంచాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎయిర్పోర్టు పనుల్లో ఖిలావరంగల్లోని నక్కలపల్లి, గాడిపల్లిలో సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో గ్రీన్ కవరేజీ ఏర్పాటు చేయాలని వారంలోగా 15,000 మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఎంప్లాయ్మెంట్ జెనరేట్ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించి గీసుకొండ, సంగెం, వరంగల్కు చెందిన 18నుంచి 39 ఏళ్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కుట్టు శిక్షణలో ప్రావీణ్యత కలిగిన వారిని ఎంపిక చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. నేషనల్ హైవే పనుల్లో నర్సంపేట, గీసుకొండ, సంగెం, చింత నెక్కొండలో ఆర్బిట్రేషన్ నిర్వహించిన అనంతరం అవార్డు పాస్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, అర్అండ్బీ జిల్లా అధికారి రమేష్, డీఈ శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఏఈ శ్రీకాంత్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ సత్య శారద -
పీడీయాక్టులతో ఉక్కుపాదం
వరంగల్ క్రైం: తీవ్రమైన నేరాలకు పదేపదే పాల్పడే అక్రమార్కులు, నేరస్తులపై పీడీయాక్టులతో పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఇబ్బందిగా పరిణమించే వారిపట్ల ఇదో చట్టపరమైన ఆయుధం. కానీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లుగా పీడీయాక్టుల కేసు నమోదు అంతంతమాత్రమే. గత ఏడాది కేవలం రెండు కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కకేసు కూడా పెట్టలేదు. కానీ, అక్రమార్కుల ఆగడాలు, కబ్జాదారులు, గంజాయి, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట పడిందంటే లేదనే చెప్పాలి. వరంగల్ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు, రవీంద్రకుమార్, తరుణ్జోషి హయాంలో ఎక్కువగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఏవీ రంగనాథ్ పనిచేసిన సమయంలో అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఉక్కపాదం మోపారు. పేదల భూముల్లో అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుట్టించారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు, ఉదాసీనతతో అక్రమార్కులు పనులు యథాతథమయ్యాయి. మళ్లీ భూకబ్జాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట గంజాయి లభిస్తూనే ఉంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా చోరీల మీద చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.● తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ అధికారులు కేసుల తీవ్రతను బట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తారు.● సంచలనం కలిగించే హత్య కేసులు ఒక్కటి, మూడు నెలల్లో రెండు కేసులు, 20 కిలోల గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లోని నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు.● ఈ కేసులో సంవత్సరం వరకు బెయిల్ మంజురు కాదు.● నిందితులను జైల్లోనే ఉంచి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, వారివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దు అనే ఆలోచనలతో పీడీయాక్టు నమోదు చేస్తారు.● పోలీస్ కమిషనరేట్లో ఇప్పటివరకు మొత్తం 254 మందిపై పీడీయాక్టు పెట్టారు.కోర్టు ఇబ్బందులతో వెనుకడుగు..వివిధ రకాల నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో పోలీసు అధికారులకు కోర్టుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద నేరాలు ఒక్కటి చేసినప్పటికి వారిపై పీడీయాక్టు నమోదు చేసే నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నిందితులకు పీడీయాక్టు నివేదికలను వారి సొంత భాషలో ఇవ్వడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల పీడీయాక్టు కేసులు నమోదైనప్పటికీ అన్ని కేసులు చివరి వరకు నిలవడం లేదు.హద్దుమీరితే పీడీ యాక్టు నమోదుహద్దుమీరి నేరాలకు పాల్పడే వారిపై కచ్చితంగా పీడీ యాక్టు నమోదు చేస్తాం. ఈ కేసులతో నేరస్తుల్లో భయంతోపాటు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ట్ర దొంగల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. భూకబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం.– సన్ప్రీత్సింగ్, వరంగల్ సీపీ -
సకాలంలో చికిత్సతో క్షయవ్యాధి నిర్మూలన
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం : సకాలంలో వైద్య పరీక్షలతోపాటు క్రమం తప్పకుండా మందుల వాడకం వల్ల క్షయవ్యాధిని నిర్మూలించవచ్చని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాకతీయ మెడికల్ కళాశాలలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైంది కాదని, వ్యాధి నిర్మూలనకు డాక్టర్లు సిఫార్సు చేసిన ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. సకాలంలో పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో 26 ప్రభుత్వ ఆస్పత్రులు కలుపుకొని సేవలందించేందుకు మూడు ట్రీట్మెంట్ యూనిట్లుగా హనుమకొండ, ముల్కనూరు, పరకాలలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 363 కేసులు గుర్తించినట్లు తెలిపారు. ముందుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం నగరంలోని భద్రకాళి ఆలయ ఆర్చి నుంచి కేఎంసీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛందంగా సేవలందిస్తామని వైద్యాధికారులు, సిబ్బంది, వైద్య శాఖ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి హిమబిందు, కేఎంసీ ఎస్పీఎం విభాగాధిపతి శ్రీధర్, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ రాక కోసం పడిగాపులు
హన్మకొండ అర్బన్: ఓవైపు అర్జీదారులు వినతులు ఇస్తారని అధికారులు.. మరోవైపు కలెక్టర్ ప్రావీణ్య వస్తే వినతులిద్దామని అర్జీదారులు పడిగాపులు కాశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వేచి చూశారు. కానీ వారికి వినతులు ఇచ్చేవారు లేకపోవడంతో అధికారులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మరోవైపు అదే హాల్లో వెనుకవైపు కూర్చు న్న వారంతా కలెక్టర్ ప్రావీణ్య వస్తే వినతులు ఇద్దామని వేచి చూశారు. కానీ.. అత్యవసర పనుల కారణంగా, లెప్రసీ డే కార్యక్రమాల వల్ల ఈవారం కలెక్టర్ ప్రజావాణికి రాలేదు. చివరికి అధికారులు వెళ్లే సమయంలో అంతా వచ్చి తమ వినతులు ఇచ్చి రసీదు తీసుకుని వెళ్లారు. -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఐనవోలు: ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన దయాకర్రావు, వినోద్కుమార్ మాట్లాడుతూ ఉద్యమ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మూడు మండలాలకు చెందిన సుమారు 20వేల మంది జనం సభకు తరలిరావాలని, అందుకు ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్త కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు చేపట్టి ప్రజలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా ఒక్క పనీ ముందుకు సాగడం లేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంట నష్టం జరుగుతుందని దేవన్నపేట పంప్హౌజ్ వద్ద అధికారులకు మొరపెట్టుకోగా రేపటిలోగా మోటార్లు ఆన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రుల పర్యటన కోసం పంప్హౌజ్ ఆన్ చేయకుండా ఆపడం ప్రభుత్వానికి మంచిది కాదని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో నీళ్లు వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఏకమై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. గుజ్జ గోపాల్రావు, తక్కెళ్లపెల్లి చందర్రావు, వివిధ మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్ని ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై అధికారులు అలసత్వంగా వ్యవహరించవద్దని, వాటికి సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 120 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ, నారాయణ, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వితంతు పెన్షన్ కోసం వచ్చాం.. నాభర్త చనిపోయాడు. చాలా రోజులుగా వితంతు పింఛన్ కోసం చూస్తున్నాం. గతంలో స్థానికంగా అధికారులకు వినతులు ఇచ్చాం. ఈసారి కలెక్టర్కు ఇద్దామని వచ్చాం. నాకు పాప ఉంది. ఇతర జీవనాధారం లేదు. – కన్నెబోయిన సరిత, వంగపహాడ్ప్లాట్ రెగ్యులరైజ్ కోసం ఫీజు కట్టాం.. గతంలో ప్రభుత్వం నోటరీ ప్లాట్లు రెగ్యులరై జ్ చేస్తామని చెప్పడంతో మీసేవ కేంద్రంలో రూ.1,000 ఫీజు కట్టాం. తర్వాత ఆవిషయంలో ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అధికారులు ప్లాట్ రెగ్యులరైజ్ చేస్తే మిగతా డబ్బులు చెల్లిస్తాం. – ఆకుగల సుగుణ, మారుతీనగర్, వడ్డేపల్లి చిరు వ్యాపారం చేస్తా రుణమివ్వండి.. మాది హనుమకొండ కుమార్పల్లి ప్రాంతం. నేను ప్రభుత్వం నుంచి రుణ సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో నాకు రుణ సాయం చేస్తే చిన్న పాటి వ్యాపారం చేసుకుంటా. రుణం క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తా. – బానోత్ రవి, కుమార్పల్లి దివ్యాంగురాలి బాధ్యత మాదే.. నా కూతురు, అల్లుడు చనిపోయారు. వారి కూతురు మానసిక దివ్యాంగురాలు. ఆమె బాధ్యతలు కూడా మేమే చూడాలి. అలాంటి పిల్లతో అద్దె ఇంట్లో ఉండలేకపోతున్నాం. మాకున్న ఇంటి స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. కొంత మాత్రమే మిగిలింది. అయితే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేస్తే అందులో మా పేరు లేదు. అధికారులు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలి. – గాజుల సరోజన, సమ్మయ్య, శాయంపేట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి 120 అర్జీల స్వీకరణ -
ప్రతీ గ్రామంలోని మూడు కూడళ్లలో రుణమాఫీ లబ్ధిదారుల వివరాల ప్రదర్శన
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025జిల్లాల వారీగా రుణమాఫీ (రూ.లలో)– 8లోuహన్మకొండ: ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలని నిర్ణయించింది. ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం, పథకాలను ప్రజల ముందుంచనుంది. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.లక్షలోపు రుణం మాఫీ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ ఘనతను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ రుణమాఫీ లబ్ధిదారుల జాబితాతో ఫ్లెక్సీలు రూపొందించనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా జిల్లా వ్యవసాయాధికారులు ఫ్లెక్సీల ప్రింటింగ్, ప్రదర్శనకు టెండర్లు పిలిచారు. ప్రతీ గ్రామంలో మూడు ముఖ్య కూడళ్లలో లబ్ధిదారుల జాబితాతో ముద్రించిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు కూడా ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసాను విడుదల చేసింది. ఉగాది పండుగ నాటికి గ్రామాల్లో రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు కళకళలాడనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.2 లక్షల్లోపు రుణాలు రూ.96,89,400లు మాఫీ అయ్యాయి. రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్న క్రమంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ నాటికి ఎంత మందికి ఎంత మొత్తంలో జమ చేసిన మేరకు జాబితాను ప్రదర్శించనున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 1,47,970 మంది రైతులకు రూ.154,23,04,019 జమ చేయాల్సి ఉంది. ఈనెల 23 వరకు నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన 1 18,348 రైతుల ఖాతాల్లో రూ.90,29,09,744 జమ చేశారు. వరంగల్71,77,800మహబూబాబాద్6,44,175జనగామ55,36,650ములుగు24,21,300న్యూస్రీల్విమర్శలను తిప్పికొట్టేందుకేనా.. సర్కారు రుణమాఫీ సరిగా చేయలేదని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. యాసంగి సాగు పూర్తయి, పంటలు చేతికి వచ్చే సమయం వచ్చినా పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని ఎండగడుతున్నాయి. ఈక్రమంలో వారి విమర్శలు తిప్పికొట్టేలా నేరుగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రదర్శించి వారి నోళ్లు మూయించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది, ఎంత రైతు భరోసా వచ్చిందన్న వివరాలతో కూడిన జాబితాను గ్రామాల్లో ప్రదర్శించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నంగా తెలుస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆలోచన ఇందులో దాగి ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఫ్లెక్సీల తయారీ ప్రదర్శనకు టెండర్లు పిలిచిన వ్యవసాయ శాఖ ఉగాది నాటికి ప్రదర్శించాలని నిర్ణయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.96,89,400 రుణమాఫీ -
సీపీని కలిసిన ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతోషినితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసి బాధితులకు న్యాయం అందించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, బృంద, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పావని, దుర్గాబాయి ఉన్నారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలువిద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమకొండ జిల్లాలో 67కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా 11,994మంది విద్యార్థులకుగాను 11,987మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈఓ వాసంతి తెలిపారు. వరంగల్ జిల్లాలో 49కేంద్రాల్లో 9,221మంది విద్యార్థుకుగాను 9,208 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు. ‘ఇంటర్’ మూల్యాంకనంవిద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల జవాబుపత్రాలను ఈనెల 25నుంచే దిద్దనున్నారు. ఆయా అధ్యాపకులు హాజరుకావాలని డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. విద్యతోనే ఉన్నతస్థాయికాజీపేట అర్బన్ : విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. నిట్ వరంగల్ను సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. నిట్లో పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అదే విధంగా టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందితో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్స్, డైనింగ్హాల్, లైబ్రరీలను పరిశీలించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం ఇన్చార్జ్ ఆర్ఎంఓల నియామకంఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ఇన్చార్జ్ ఆర్ఎంఓలను నియమించారు. ఆస్పత్రికి కొంతకాలంగా పూర్తిస్థాయి ఆర్ఎంఓలు లేకపోవడంతో పేరుకుపోయిన సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా కొనసాగుతున్న డాక్టర్ అంబి శ్రీనివాస్ను సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా, డాక్టర్ శశికుమార్ను డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ నియమిస్తూ డీఎంఈ ఎ.నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ఎంఓలకు సన్మానంసోమవారం బాధ్యతలు చేపట్టిన ఆర్ఎంఓలు శ్రీనివాస్, శశికుమార్ను హెల్త్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్–3194 (ఐఎన్టీయూసీ) ఉమ్మడి జిల్లా చైర్మన్ బత్తిని సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు శాలువాలతో సత్కరించారు. పూలబొకేలు అందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఎంజీఎం బ్రాంచ్ నాయకులు ప్రీతీ సజిని, సాల్మ, నార్ల వేణు, సుజాత, సరళారాణి, కొడిపాక కార్తీక్, సంజీత, రజినీ తదితరులున్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో దొడ్డురకం ధాన్యంతోపాటు ప్రత్యేకంగా సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నధాన్యానికి బోనస్ను అందించినట్లు పేర్కొన్నారు. ఈ రబీ సీజన్లో కూడా అదే విధంగా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నమోదు కాని పంటల వివరాలను ఈనెల 29 నాటికి అన్ని మండలాల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. హార్వెస్టర్ యజమానులతో ఆర్డీఓలు, రవాణా శాఖ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో మూడు రోజుల్లో సమావేశం నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తున్న చోట్ల తూనికలు కొలతలశాఖ అధికారులు తూకాలను తనిఖీ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ కోసం షెడ్ నెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం హెల్ప్డెస్క్, టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లతో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్, డీఆర్డీఓ మేన శ్రీను, పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, ఎల్డీఎం శ్రీనివాస్, మార్కెటింగ్, తూనికలు కొలతలు, రవాణా, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మోటార్ల వరుస చోరీలతో రైతుల బెంబేలు
ఇప్పటి వరకు పదికిపైగా మోటార్ల అపహరణ కమలాపూర్: కమలాపూర్లో వ్యవసాయ విద్యుత్ మోటార్ల వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏడాది కాలంలో సుమారు 10కి పైగా వ్యవసాయ మోటార్లు అపహరణకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారులో హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిని అనుకుని ఉన్న ఎస్సారెస్పీ డీబీఎం–20 కాల్వలో అమర్చుకున్న వ్యవసాయ విద్యుత్ మోటారును ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి వెళ్లేసరికి కాల్వ వద్ద విద్యుత్ మోటారు లేదని బాధిత రైతు పుల్ల రాజు తెలిపారు. కాగా.. కమలాపూర్కు చెందిన పలువురు రైతులు ఎస్సారెస్పీ కాల్వకు విద్యుత్ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగు నీరు అందించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఈక్రమంలోనే సాగు నీటి కోసం కాల్వ వద్ద అమర్చుకున్న విద్యుత్ మోటార్లను కొంతకాలంగా గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్తున్నారు. ఇలా ఏడాది వ్యవధిలో సుమారు 10కి పైగా వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయని, అందులో పుల్ల రాజు అనే రైతుకు చెందినవే ఏడు ఉన్నాయని, అందులో ఈ ఒక్క నెలలోనే 2 చోరీకి గురైనట్లు తెలిపారు. కాగా.. కాల్వ వెంట అమర్చిన వ్యవసాయ విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళల్లో అపహరించుకు వెళ్తున్నారని, మరికొన్నింటిని అక్కడే పగులగొట్టి అందులోని కాపర్ వైరు ఎత్తుకెళ్తున్నారని, దీంతో తమకు వేలాది రూపాయల్లో నష్టం వాటిల్లుతోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్ల చోరీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసులు రాత్రి సమయాల్లో కాల్వ వెంట పెట్రోలింగ్ ముమ్మరం చేసి మోటార్ల దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
ఐనవోలు: ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్లు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన దయాకర్రావు, వినోద్కుమార్లు మాట్లాడుతూ ఉద్యమ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మూడు మండలాలకు చెందిన సుమారు 20వేల మంది జనం సభకు తరలిరావాలని, అందుకు ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్త కృషిచేయాలని దిశానిర్ధేశం చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు చేపట్టి ప్రజలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా ఒక్క పనీ ముందుకు సాగడం లేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంట నష్టం జరుగుతుందని దేవన్నపేట పంప్హౌస్ వద్ద అధికారులకు మొరపెట్టుకోగా రేపటిలోగా మోటార్లు ఆన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రుల పర్యటన కోసం పంప్హౌస్ ఆన్ చేయకుండా ఆపడం ప్రభుత్వానికి మంచిది కాదని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో నీళ్లు వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఏకమై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. గుజ్జ గోపాల్రావు, తక్కెళ్లపెల్లి చందర్రావు, వివిధ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
గ్రామపంచాయతీలుగా మార్చాలి
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి లోని 13 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం సంబంధిత మంత్రులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో తండాలను మున్సిపాలిటీలో విలీనం చేసిందన్నారు. ఆయా తండావాసులు గ్రామపంచా యతీలుగా మార్చాలని కోరుతున్నట్లు చెప్పా రు. అదేవిధంగా మండలంలోని బొక్కలగూడెం గ్రామ పంచాయతీ పేరు మార్చాలని కోరగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంట నే స్పందించి వెంకట్రావుపల్లెగా మార్చిందన్నా రు. దీంతో ఎమ్మెల్యే నాగరాజు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రకృతివనం మొక్కలకు నీరు దుగ్గొండి: మండల కేంద్రంలోని పల్లె ప్రకృతివనంలోని మొక్కలకు అధికారులు నీరు పోసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. స్థానిక పల్లె ప్రకృతివనంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయింది. దీంతో ఈ నెల 23న ‘కాలిపోయిన పల్లె ప్రకృతివనం’ పేరుతో కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో స్పందించిన ఎంపీఓ శ్రీధర్గౌడ్ సోమవారం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు తీయించి నీరు పోయించారు. పూర్తిగా చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు పెట్టించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కారోబార్ రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయంనర్సంపేట: విద్యుత్ సరఫరాకు నేడు (మంగళవారం) అంతరాయం ఉంటుందని విద్యుత్ న ర్సంపేట డీఈ తిరుపతి, చెన్నారావుపేట వి ద్యుత్ ఏఈ జోగానంద్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ 33కేవీ చెన్నారావుపేట, ఉప్పరపల్లి విద్యుత్ లైన్లలో మరమ్మతు కారణంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.33/11కేవీ అమీనాబాద్, 33/ 11కేవీ ఉప్పరపల్లి ఉప కేంద్రాల్లోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎంజీఎంలో ఇన్చార్జ్ ఆర్ఎంఓల నియామకం ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ఇన్చార్జ్ ఆర్ఎంఓలను నియమించారు. ఆస్పత్రికి కొంతకాలంగా పూర్తిస్థాయి ఆర్ఎంఓలు లేకపోవడంతో పేరుకుపోయిన సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా కొనసాగుతున్న డాక్టర్ అంబి శ్రీనివాస్ను సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా, డాక్టర్ శశికుమార్ను డిప్యూటీ సివిల్ సర్జన్గా నియమిస్తూ డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆదేశాలతో కొనసాగుతున్న ఆర్ఎంఓలైనా డాక్టర్ శ్రీనివాస్, శశికుమార్లకు సివిల్ ర్జన్ ఆర్ఎంఓగా, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వీరి నియామకంపై వైద్యులు, వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు విద్యారణ్యపురి: పదవ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమకొండ జిల్లాలో 67కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా 11,994మంది విద్యార్థులకుగాను 11,987మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈఓ వాసంతి తెలిపారు. వరంగల్ జిల్లాలో 49కేంద్రాల్లో 9,221మంది విద్యార్థుకుగాను 9,208 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు. -
సీపీని కలిసిన ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతోషినితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసి బాధితులకు న్యాయం అందించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, బృంద, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పావని, దుర్గాబాయి తదితరులు ఉన్నారు. -
ఉగాది ఉత్సవంలో భక్తులు పాల్గొనాలి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాలయ ఈఓ అనిల్కుమార్, ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈనెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఉగాది రోజున రుద్రేశ్వరస్వామికి పాశుపత రుద్రాభిషేకం జరుగుతుందని, సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సుదర్శనహోమంలో పాల్గొనే భక్తులు రూ. 2,116, ఏప్రిల్ 6న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతీ రోజు శ్రీరాములకు ప్రత్యేకపూజలు, సుదర్శనహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఋగ్వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, శ్రవణ్, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దేశం, ఒకే ఎన్నికతో ఆర్థిక మిగులుబాటు
గీసుకొండ: ఒకే దేశం..ఒకే ఎన్నికతో ఆర్థిక మిగులుబాటు ఉంటుందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గట్టికొప్పుల రాంబాబు అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల సంఘంపై భారం, కాలం వృథా తగ్గి, రాజకీయ స్థిరత్వం నెలకొని శాశ్వత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గాల డీ లిమిటేషన్పై ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్, బీఆర్ఎస్లు అనరసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు జాలిగపు ప్రసన్న, జిల్లా కౌన్సిల్ మెంబర్ గోదాసి అశ్వినికుమార్, మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బండారి కల్యాణి, నాయకులు ఆరె కుమార్, సభావత్ గణేశ్, సంకతాల శ్రీనివాస్, బైకని వెంకటేశ్, బొమ్మగాని దిలీప్, సభావత్ నాగరాజు, పోలెబోయిన నవీన్, సరిత, అశోక్, పర్ష నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొగిలిచర్లలో.. గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ మొగిలిచర్లలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాదారపు శివకుమార్, ల్యాదల్ల ప్రభాకర్, ఆడెపు రమేశ్, బిల్లా రమేశ్, లెంకలపెల్లి స్వామి, గుండెబోయిన రంజిత్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాంబాబు -
క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
గీసుకొండ: జిల్లాను క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని హనుమాన్ జంక్షన్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ అంటు వ్యాధి అని, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలని, తగిన సమయంలో వ్యాధిని గుర్తించి వైద్యుల సలహా మేరకు చికిత్సలు పొంది మందులు వాడితే త్వరగా నయం అవుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కింద నెలకు రూ.వెయ్యి సహాయంగా అందిస్తోందన్నారు. జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆచార్య మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 1,430 టీబీ కేసులు నమోదు కాగా , ఈ ఏడాది ఇప్పటి వరకు 276 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని, వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్చన, డాక్టర్ విజయ్కుమార్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ నర్సింహారెడ్డి, డీపీఓ అర్చన, క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు -
అక్రమ నియామకాలపై విచారణ ఏదీ?
సాక్షి, వరంగల్: జిల్లాలో గతేడాది జరిగిన ఆశవర్కర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై కనీస విచారణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత డీఎంహెచ్ఓ ఉన్న సమయంలో ఇన్చార్జ్ డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నియమ నిబంధనలు పాటించకుండానే అక్రమ నియామకాలు జరిగాయని గతేడాది ఆగస్టు 24న హైదరాబాద్లోని ఆరోగ్య, కుటుంబ విభాగంలోని ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్త ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అక్కడి అధికారులు ఆశవర్కర్ల నియామకాలపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అయితే కొద్ది నెల ల క్రితం కొత్తగా జిల్లా వైద్యారోగ్య విభాగాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సాంబశివరావు ఆశల అక్రమ నియామకాలపై లోతుగా విచారించి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. జిల్లాలో 16 మంది ఆశవర్కర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగానే జరగడంతో అర్హులకు అన్యాయం జరిగిందనే టాక్ వస్తోంది. చాలా నియామకాల్లో అదే మండలానికి చెందిన వారిని కాకుండా, ఇతర మండలాలకు చెందిన వారిని నియమించడంతో జోరుగా చర్చ జరుగుతోంది. వర్ధన్నపేట, రా యపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అ క్కడి సబ్ సెంటర్లలో నలుగురి నియామకాలు ని బంధనలకు విరుద్ధంగా జరిగాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నా.. ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు లేకపోవడంతో ఉన్నతాధికారులు కావాలనే దీనిని పక్కన బెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఆశవర్కర్ల నియామకాల్లో అవకతవకలపై డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావును సంప్రదించగా ఈ విష యం తన దృష్టిలో లేదని సమాధానమిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆశవర్కర్ల నియామకాలు అనర్హులపై నెలలు గడుస్తున్నా.. కానరాని చర్యలు డీఎంహెచ్ఓ దృష్టి సారిస్తేనే వెలుగులోకి నిజాలు -
సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
విద్యారణ్యపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాశాఖ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ఆర్ రాజ్కుమార్ అన్నారు. ఆదివారం ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫకృద్దీన్ అహ్మద్ ఇతర బాధ్యులతో కలిసి హనుమకొండలోని డీఈఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈసందర్బంగా ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. వివిధ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా రాజ్కుమార్ను, ఫకృద్దీన్ అహ్మద్ను విద్యాశాఖ ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర కోశాధికారి పవన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, బాధ్యులు జె.రాజేశ్వర్రావు, ఎండీ అలీం, ఎండీ జాకీర్, ఎస్.శ్రీనివాస్, బి.హరీశ్, ఎఫ్ఏఓ మధుసూదన్రెడ్డి వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
మూడేళ్లు.. 33 దరఖాస్తులు
మాకు ఐనవోలు మండలం కొండపర్తిలోని 194 సర్వే నంబర్లో 24 గుంటల భూమి ఉంది. దానికి సంబంధించి గతంలో పాస్బుక్ వచ్చింది. అయితే ప్రసుతం ధరణిలో ఇతరుల పేరు వస్తోంది. తొలగించాలని మూడు సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటి వరకు 33 సార్లు గ్రీవెన్స్లో వినతులు ఇచ్చాను. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. తప్పు చేసిన అధికారులను కాపాడేందుకు నాకు అన్యాయం చేస్తున్నారు. ధరణి చట్టంలో నాకు న్యాయం చేసే అవకాశం లేదట. ఏం చేస్తారో చూడాలి. – కట్కూరి రాజు, కొండపర్తి, ఐనవోలు మండలం -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ఖిలా వరంగల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ రంగశాయిపేటకు చేరుకోగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతకు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం దామెరకొండ సదానందం అధ్యక్షతన జరిగన సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ఉంటానని అన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్రెడ్డి, సతీశ్, తిరుపతిరెడ్డి, అబ్దుల్ గోపాల్, విజయపాల్రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, దయాకర్ పాల్గొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరిస్తామని, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ ప్రజావాణి..వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వివిధ శాఖల అధికారులకు వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు. భద్రకాళి సన్నిధిలో జ్ఞానేశ్వర్హన్మకొండ కల్చరల్: రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తానని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం● ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్ హన్మకొండ: కార్మిక వ్యతిరేక విధానాలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన నేడు(సోమవారం)ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే బహరంగ సభలో పాల్గొనేందుకు ఆర్టీసీ కార్మికులు ఆదివారం కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు రావడం మూలంగా ఆర్టీసీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, బస్సులను ఆర్టీసీకి సంబంధం లేని సంస్థలకు అప్పగించి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయడంతోపాటు మోటార్ వెహికల్ చట్టం–2019ను సవరించాలన్నారు. విద్యుత్ బస్సు ల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించి సబ్సిడీని సంస్థకు కేటాయించి ప్రజారవాణాను కాపాడాలని డిమాండ్ చేశారు. -
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
దామెర: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని విశ్రాంత వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త జలపతిరావు అన్నారు. గో–ఆధారిత వ్యవసాయంపై దుర్గంపేట్ సమీపాన ఉన్న ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాత వ్యవసాయ పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం పెరగాలని, గో ఆధారిత వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. భూసార పరీక్షలు చేయించి రిపోర్టు ఆధారంగా పంటలు వేసుకోవాల ని సూచించారు. భూమి విషతుల్యమై పంటలు పండకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, రసాయన ఎరువులకు ప్రభుత్వాలు సబ్సి డీ ఇవ్వడం మానుకోవాలన్నారు. అనంతరం ఉత్త మ రైతులను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు, కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం రాజిరెడ్డి, వ్యవసాయ అధికారి విజయభాస్కర్, రైతులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ
హన్మకొండ చౌరస్తా: భారత రాజ్యాంగాన్ని మోదీ సర్కారు అవహేళన చేస్తోందని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోందని పేర్కొన్నారు. హింసలేని స్వతంత్ర పోరాటంలో విజయం సాధించిన భారతదేశంలో నేడు మత విద్వేషాలకు బీజేపీ సర్కారు పునాది వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ ప్రజల హక్కులను హరించే కుట్రలో భాగమే అంబేడ్కర్ను అవమానించడం అన్నారు. ఈ సమావేశానికి వరంగల్, హనుమకొండ జిల్లాల ఇన్చార్జ్లుగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాయల నాగేశ్వర్రావు నియమితులైనట్లు వెల్లడించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వీడియోను ప్రదర్శించారు. సమావేశం చివరిలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అంటు ప్రతిజ్ఞ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, టీపీసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
కట్టమల్లన్న ఆలయంలో పెద్దపట్నం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట కట్టమల్లన్న దేవాలయంలో ఆదివారం పెద్దపట్నం జాతర నిర్వహించారు. మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ ఉత్సవ మూర్తులను రాత్రి గొర్రెకుంట గ్రామం నుంచి పూజారులు మ్యాదరబోయిన కట్టయ్య, యాదగిరి, కొంరెల్లి, కట్టయ్య సంప్రదాయబద్ధంగా ఆలయానికి తోడ్కొని వచ్చి కల్యాణం జరిపించారు. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి కథలు చెప్పారు. ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జాతరకు హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీని ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టమల్లన్న (మల్లికార్జునస్వామి) ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ గాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పత్తిపాక తిరుపతి, కమిటీ సభ్యులు కట్కూరి సారయ్య, కందుల రమ, మేకల రాధాకృష్ణారెడ్డి, రాజబోయిన శివకుమార్, మార ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కొండేటి కొమురారెడ్డి, ఎలగొండ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు
నెక్కొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 1975–76 సంవత్సరంలో పదో తరగతి చ దివిన వారు సుమంగళి ఫంక్షన్హాల్లో కలుసుకొని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు మల్లయ్యతోపాటు మృతి చెందిన ఉపాధ్యాయుల కుమారులను సన్మానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థులు కృష్ణమూర్తి, చింతకింది అశోక్, సంజీవరెడ్డి, గరికపాటి కృష్ణారావు, రాములు, నల్ల రాములు, చల్లా రఘోత్తంరెడ్డి, హుస్సేన్ ఉన్నారు. -
కుడా, పోలీస్ నో రెస్పాన్స్..
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ (కుడా), పోలీసు శాఖకు వచ్చిన వినతులను అధికారులు పరిష్కరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై 202 మంది దరఖాస్తులు సమర్పించగా 10 మాత్రమే పరిష్కారం అయ్యాయి. అదేవిధంగా పోలీసు శాఖలో 123 సమర్పిస్తే మూడు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లా పరిషత్ పరిధిలో 116 ఫిర్యాదులు వస్తే రెండు మాత్రమే పరిష్కారం అయ్యాయి. కుడా పరిధిలో 107కు ఒకటి, నర్సంపేట ఏసీపీ పరిధిలో 45 వస్తే ఒకటి, ఈస్ట్జోన్ పోలీసు అధికారి పరిధిలో 43 వస్తే మొత్తం పెండింగ్లోనే ఉన్నాయి. ఇలా అన్ని శాఖల్లోని సమస్యలపై వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.దరఖాస్తుల స్వీకరణకే ప్రజావాణి..ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆరు నెలలుగా ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నాం. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజావాణి కేవలం దరఖాస్తులు సమర్పించేందుకు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నాం.– గంగుల దయాకర్, ఇన్నర్రింగ్ రోడ్డు భూబాధితుల సమాఖ్య అధ్యక్షుడుమూడు నెలలుగా వస్తున్నా..ఉమ్మడి ఆస్తికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని డిసెంబర్ 2న జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాను. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వచ్చి ఈనెల 10న జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.– చిలుక సుధాకర్, పైడిపల్లి -
మూల్యాంకనంలో లోపాలు ఉండొద్దు
● ఇంటర్బోర్డు అధికారి వెంకటేశ్వర్రావు వరంగల్: ఇంటర్మీడియట్ పరీక్షపత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు ఉండొద్దని ఇంటర్బోర్డు అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. వరంగల్లోని లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఈనెల 10 నుంచి సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనం ప్రారంభమైందని అన్నారు. ఇంటర్బోర్డు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. వరంగల్తోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇచ్చి మూల్యాంకనం ప్రారంభించాలని సూచించారు. ఈ నెల 22 నుంచి మొదటి స్పెల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, 24 నుంచి రెండో స్పెల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్, 26 నుంచి మూడో స్పెల్లో కెమిస్ట్రీ, కామర్స్, 28 నుంచి నాలుగో స్పెల్లో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ప్రారంభించనున్నట్లు డీఐఈఓ పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలో కల్పించిన వసతులపై బోర్డు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. -
రింగ్ మళ్లీ మొదటికి!
ఔటర్ రింగ్రోడ్డు ఇలా● ఐఆర్ఆర్ వల్ల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, విమానాశ్రయంతో నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఉర్సు, తిమ్మాపూర్, ఫోర్ట్ వరంగల్, గొర్రెకుంట, ఏనుమాముల, పైడిపల్లి, ఆరెపల్లి ఓఆర్ఆర్ అనుసంధానం అవుతుంది. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు వ్యయం : రూ.1,500 కోట్లు మొత్తం పొడవు : 71 కిలోమీటర్లు పూర్తయిన రోడ్డు : ఉత్తరం వైపు 30 కిలోమీటర్లు ఖర్చయిన నిధులు : రూ.700 కోట్లు నిర్మాణం చేయాల్సింది : దక్షిణం వైపు 41 కిలోమీటర్లు చేయాల్సిన భూసేకరణ : 911 ఎకరాలు● ఓఆర్ఆర్ పరిధిలోకి రాంపూర్, నష్కల్, ధర్మపురం, వెంకటాపూర్, ఐనవోలు, పున్నేలు, బొల్లికుంట, కాపులకనిపర్తి, వసంతాపూర్, ధర్మారం, బొడ్డుచింతలపల్లి ప్రాంతాలు వస్తాయి. మొగిలిచర్ల, కొత్తపేట నుంచి ఓఆర్ఆర్కు అనుసంధానం చేయనున్నారు. -
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజువర్ధన్నపేట: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఉప్పరపల్లి క్రాస్రోడ్ వద్ద ఉన్న కల్యాణలక్ష్మి గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఇఫ్తార్ విందుతో సోదరభావం పెంపొందుతుందని తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మండల నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ
స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది.● ఆర్టీసీ డిపోలు, వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు ద్వారా ప్రతీబస్లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.● ఈ టిమ్స్ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది.● ముందుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు.● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు.ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్ జారీ చేయవచ్చు.– డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంవరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. -
చారిత్రక గడిని కూల్చవద్దని ధర్నా
కమలాపూర్: చారిత్రక గడిని కూల్చివేయొద్దని కోరుతూ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక గడిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము కొనుగోలు చేశామనే నెపంతో కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చారిత్రక కట్టడాలను అమ్మడం, కొనడం అంటే ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని, తాతలకాలం నుంచి ఈ గడి గ్రామ దేవతలకు నిలయంగా ఉంటోందని, ఇక్కడినుంచే సమ్మక్క–సారలమ్మ జాతరకు, దసరా వేడుకలకు అంకురార్పణ జరుగుతుందన్నారు. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ గడిని కూలగొట్టకుండా భావితరాల కోసం అలాగే ఉంచాలని కోరారు. గడి కూల్చివేతను వ్యతిరేకిస్తూ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు శుక్రవారం గడిని పరిశీలించి అక్కడే నిరసన ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. ఆందోళనలో మాజీఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు నాంపెల్లి మొగిలి, మంచాల రాజయ్య, అట్ల సమ్మయ్య, కిన్నెర కృష్ణమూర్తి, వెంగళ సహదేవ్, ఎండీ.దుర్వేశ్, రాముల అశోక్, సంపత్, సతీశ్, పిట్టల కృష్ణ, మాట్ల సాగర్, రాజు, శ్రీధర్, రమేశ్ పాల్గొన్నారు. -
పట్టు రైతులకు అవగాహన సదస్సు
పట్టు పరిశ్రమ జేడీ అనసూయ ఎల్కతుర్తి: భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల పట్టు రైతులకు శుక్రవారం ఎల్కతుర్తి రైతు వేదికలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పట్టుపరిశ్రమ జిల్లా సంయుక్త సంచాలకురాలు (జేడీ) అనసూయ ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. పట్టు పురుగుల పెంపకం రైతులు సాగు చేసిన మల్బరీ తోటల్లో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఆకు నాణ్యత పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. సిల్క్ సమగ్ర–2 పథకం కింద కొత్తగా మల్బరీ నాటే ఎస్సీ, ఎస్టీ రైతులకు రీలింగ్ షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, మల్బరీ నాటినందుకు రూ.78 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే 300 నేత్రికలు, 10 ట్రేలు, ఇలిగేషన్ కోసం రూ.60 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ, ఓసీ రైతులకు షెడ్ నిర్మాణానికి రూ.2.25 లక్షలు, 300 నేత్రికలు, 10 ట్రేలు, 2,500 రోగనిరోధక మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు సారంగపాణి, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
ఐపీఎల్ వేళ యాప్లతో పందేల జోరు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజ్కుమార్ హనుమకొండలో స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి సుమారు రూ.30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. చివరకు తండ్రికి విషయం చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆయన ఉన్న ప్లాటును అమ్మి అప్పులు తీర్చాడు. అయితే ఎలాగైనా పోయిన డబ్బులు సంపాదించాలని రాజ్కుమార్ మళ్లీ అప్పులు చేసి యాప్లో బెట్టింగ్ కాశాడు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ల వేధింపులు పెరగడంతో ఈ ఏడాది జనవరి ఐదున తండ్రిని రూ.నాలుగు లక్షలు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో రాజ్కుమార్ ఉరేసుకుని జనవరి 10న ఆత్మహత్య చేసుకున్నాడు. రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు డిగ్రీ చదివి బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. హనుమకొండకు మకాం మార్చి పోస్టల్కాలనీలో తాను విద్యార్థినని చెప్పి అద్దె గదిలో నివాసం ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి అప్పులై దొంగ అవతారం ఎత్తాడు. హనుమకొండ, హసన్పర్తి, కేయూసీ, సుబేదారి, సంగెం, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 చోరీల్లో 334 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో 640 గ్రాముల వెండి చోరీ చేశాడు. చివరకు గత అక్టోబర్ 28న పోలీసులకు చిక్కాడు. అత్యాశకు వెళితే ఆర్థికంగా నష్టపోవుడే.. ● పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిందే ● తల్లిదండ్రుల అప్రమత్తత అవసరమే ● గత ఘటనలను గుర్తు చేస్తున్న పోలీసులుసాక్షి, వరంగల్: ఐపీఎల్ రానే వచ్చింది. శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఈ జోష్ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు సిద్ధమవుతున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరిస్తోంది. ఎవరితో సంబంధం లేకుండానే ఫోన్లోనే క్రికెట్ బెట్టింగ్ యాప్లు నిక్షిప్తం చేసుకొని ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తూ బెట్టింగ్ చేస్తున్నారు. కొందరేమో తమ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీఐ ఐడీల ద్వారా, మరికొందరు కాలేజీలో పరీక్షలు, హాస్టల్ ఫీజు అని తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ మొదలవుతుండడంతో ఈ బెట్టింగ్ యాప్ల జోరు పెరగొచ్చని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పిల్లలు వాడే సెల్ఫోన్లు, వారి ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. యాప్ల్లో డబ్బులు పోయి ఏకంగా ప్రాణాలు తీసుకున్న యువకులు ఉన్నారు. ఆ దిశగా ఎవరూ వెళ్లొద్దని పోలీసులు అంటున్నారు. బెట్టింగ్ పెట్టే వాళ్లపై కేసులు నమోదుచేసే అవకాశం ఉండడంతోనే దందా నిర్విరామంగా సాగుతోందని, బెట్టింగ్ చేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవడం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. రేషియో యాప్ల జోరు.. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఒకప్పుడు ఫోన్ల ద్వారా ఆయా జట్టు విజయాలపై బుకీలకు సమాచారం ఇచ్చేవారు. ఫంటర్లను పెట్టుకొని దందా నడిపేవారు. ఇప్పటికీ ఈ దందా ఉన్నా.. ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. ముఖ్య నిర్వాహకుడే యాప్ రూపొందించి బుకీలకు యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఇచ్చి నయా దందాకు శ్రీకారం చుడతాడు. ప్రధాన నిర్వాహకులు ఆయా జట్ల విజయాలకు సంబంధించిన రేషియోను ఆ యాప్లో నిక్షిప్తం చేస్తుండడంతో ఇందుకు అనుగుణంగా బుకీలు తమ ఫంటర్లకు చెప్పి దందా చేస్తారు. ఇలా బుకీలకు వచ్చిన ఆదాయంలోనే కొంత డబ్బును ప్రధాన నిర్వాహకుడికి అందిస్తారు. యూపీఐ చెల్లింపులతో పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో బిట్కాయిన్ల రూంలో దందా చేస్తుండడం గమనార్హం. గతంలో పోలీసులకు చిక్కిన బెట్టింగ్ బుకీలతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. యాప్ల సమాచారం ఇవ్వాలి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డప్ఫాబెట్, 1 ఎక్స్ బెట్. స్కై ఎక్స్చేంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్లైన్ గురూ, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్ వంటి ఆన్ లైన్క్రికెట్ బెట్టింగ్ యాప్లు డౌన్ లోడ్ చేసి పందెంకాస్తూ నష్టపోయిన వారు గతంలో చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్ల గురించి సమాచారం తెలిస్తే ఇవ్వాలి. బెట్టింగ్ ఎవ్వరూ చేయవద్దు. ఈ బెట్టింగ్లతో యువత కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. – సన్ప్రీత్సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ 75 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లుస్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ భారత్లో ప్రతి ఏటా రూ.8,20,000 కోట్ల దాకా ఉంటుందని థింక్ చేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక చెబుతోంది. భారత్లో 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని టీసీఎఫ్ నివేదిక పేర్కొనడం చూస్తే బెట్టింగ్ యాప్ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 75 వెబ్సైట్లు, యాప్లు బెట్టింగ్కు సంబంధించినవి పనిచేస్తున్నాయి. -
ఐనవోలులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
పాఠశాల, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన ఐనవోలు: మండలంలో కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కక్కిరాలపల్లి ప్రభుత్వ పాఠశాలలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ త్రూ ఏఐ టూల్స్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాల్లో రాణించేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్ను ఆపరేట్ చేస్తుండగా ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అదనపు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలన్నారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్తో పాటు ఇటీవల కొనుగోలు చేసిన క్రీడా సామగ్రిని పరిశీలించారు. పాఠశాలకు వచ్చిన పలువురు స్ధానికులు సాగు, తాగునీటితోపాటు వీధి దీపాలు, దివ్యాంగుల పింఛన్ తదితర సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చాలని ఆదేశించారు. పున్నేలు జీపీ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా పాఠశాల ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. చలివేంద్రం నిర్వహణ పరిశుభ్రంగా ఉండాలని ఆమె సూచించారు. పీహెచ్సీ తనిఖీ.. ఐనవోలు పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్య సేవల నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి రోగులతో కలెక్టర్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి? వారి నిర్వహణ గురించి మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ను ప్రశ్నించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్కుమార్, ఎంఈఓ పులి ఆనందం, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్ఐ మల్లయ్య, జీపీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘హైపర్’తో సత్వర సేవలు
హన్మకొండ: హైపర్తో సత్వర సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు పి.మధుసూదన్రావు, కె.గౌతం రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినపుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ‘హైపర్‘ అనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.హైపర్ అంటే..‘హెచ్’ అంటే హెడ్ క్వార్టర్లో అప్రమత్తంగా ఉండడం, ‘ఎ’అంటే సిబ్బంది, సామగ్రి సమీకరణ, ‘ఐ’ అంటే సమాచార సేకరణ, చేరవేయడం, ‘పీ’ అంటే పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం, ‘ఇ’ అంటే నిర్ధిష్ట కార్యాచరణ అమలు, ‘ఆర్’ అంటే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం అని ఎస్ఈలు వివరించారు.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిష్యుం డిష్యుంకాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కమీషన్ విషయంలో శుక్రవారం రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నగరంలోని ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం భూక్రయవిక్రయదారులతోపాటు రియల్టర్లు కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ సాయంత్రం ఆరు గంటలకు పూర్తి కాగా కార్యాలయ ఆవరణలోనే భూమి అమ్మకంలో పాత్ర పోషించిన తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలని రియల్టర్లు గొడవకు దిగారు. గొడవ కాస్త ఘర్షణకు దారి తీసి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చొక్కాలు చింపుకునే స్థాయికి చేరుకోవడంతోపాటు కార్యాలయ ఆవరణలో కుర్చీలను విసిరేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల వారు డయల్ 100కు ఫోన్ చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి పలాయనం చిత్తగించారు.శాంతిని కోరుతూ కవి సమ్మేళనంహన్మకొండ కల్చరల్ : ప్రపంచ కవితాదినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన బహుభాషా కవి సమ్మేళనం అలరించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కవులు పాల్గొని ‘కవులు ప్రపంచానికి ఏమవుతారు ?’ అనే ఆంశంపై తమ కవితలు వినిపించారు. అనంతరం హనుమకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కూజ విజయ్కుమార్ ఉత్తమ కవితలు వినిపించిన కవులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మిగిలిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాకుడు సిరాజుద్దీన్, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆచార్య బి.సురేష్, సంస్థ ప్రధాన కార్యదర్శి సుదాకర్రావు, కోశాధికారి విష్ణువర్ధన్, సంస్థ బాధ్యులు పాల్గొన్నారు.‘కుడా’కు భూమి అప్పగింతనయీంనగర్: కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని పైడిపల్లి రైతులు వారి గ్రామానికి చెందిన 10 ఎకరాల వ్యవసాయ పట్టా భూమిని అభివృద్ధి కోసం ‘కుడా’కు అప్పగించారు. ఈ మేరకు కుడా కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని కలిసి భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామం ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ‘కుడా’కు భూమి ఇచ్చినట్లు తెలిపారు. -
వరంగల్
ఒకే దేశం, ఒకే ఎన్నిక నష్టమే... సమాజానికి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నష్టదాయకమని ప్రముఖ సామాజిక వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. – 8లోuశనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది. ● ఆర్టీసీ డిపోలు, వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు ద్వారా ప్రతీబస్లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ● ఈ టిమ్స్ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. ● ముందుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు. ● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్ జారీ చేయవచ్చు. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంవరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఉత్సాహంగా రూబిజెస్ట్ – 2025 కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రూబిజెస్ట్– 2025లో భాగంగా థిమ్ డే వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.– 8లోuఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం ప్రతీది ఆన్లైనే.. -
గంగదేవిపల్లిని సందర్శించిన రాజస్థాన్ ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని 21 మంది సభ్యులతో కూడిన రాజస్థాన్ రాష్ట్ర ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. రాజస్థాన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ మురారీలాల్శర్మ, కన్సల్టెంట్ కోఆర్డినేటర్ పునీత్ మౌర్య ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు టీజీఐఆర్డీ సెంటర్ హెడ్ అనిల్కుమార్ పర్యవేక్షణలో గంగదేవిపల్లి సందర్శనకు వచ్చారు. జీపీడీపీ ప్లాన్ పనులు, రూఫ్టాప్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఫారం పాండ్లు, తీగజాతి తోటల పెంకాన్ని పరిశీలించారు. గ్రామస్తులను రాంరాం బాయి, బహెన్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ కేంద్రంలో జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి.. గ్రామ కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయాలు, పొందిన 19 జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధి గురించి ప్రధాని నరేంద్రమోదీ మూడుసార్లు ప్రస్తావించినట్లు ఆయన గుర్తుచేశారు. 20 ఏళ్ల క్రితం గ్రామంలో ట్విన్పిట్ టెక్నాలజీతో నిర్మించిన మరుగుదొడ్లు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వి.కృష్ణవేణి, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, ఏపీఎం చంద్రకాంత్, ట్రైనింగ్ మేనేజర్ కరుణాకర్, టీజీఐ ఆర్డీ ప్రతినిధి నిమ్మల శేఖర్, క్లస్టర్ టీఏలు సుధాకర్, సురేశ్, ఈసీ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
25 నుంచి ఎఫ్పీఓఎస్ రాష్ట్రస్థాయి మేళా
వరంగల్: రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓఎస్) రాష్ట్రస్థాయి మేళా ఈనెల 25 నుంచి 27 వరకు వరంగల్ రంగశాయిపేటలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్రస్థాయి మేళాపై శుక్రవారం అధికారులతో సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ మేళాలో రైతు ఉత్పత్తిదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలానే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులతో కలిసి రంగశాయిపేటలోని మేళా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, డీఆర్డీఓ, ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రమేశ్, మత్స్యశాఖ అధికారి నాగమణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి.. ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తుల ఫీజు వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. హైదరాబాద్ నుంచి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్కు 41,443 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 18,943 మంజూరు చేసి, 1,081 దరఖాస్తులకు ఫీజు సేకరించి, 1,081 ప్రొసీడింగ్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే వచ్చే 25 శాతం రాయితీపై ప్రజలకు వివరించాలని సూచించారు. -
కోనారెడ్డి చెరువు సర్వే
వర్ధన్నపేట: వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువును శుక్రవారం నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. కోనారెడ్డి చెరువుకు వెళ్లే దారులతోపాటు శిఖం భూములను కబ్జా చేశారంటూ ఈ నెల 10న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. మత్తడి, ఎఫ్టీఎల్ భూభాగాలను పరిశీలించారు. 0.25 టీఎంసీల సామర్థ్యం కలిగిన కోనారెడ్డి చెరువు విస్తీర్ణం 478.6 ఎకరాలు ఉందని తహసీల్దార్ విజయసాగర్ తెలిపారు. సర్వే తర్వాత చెరువు ఏమేరకు ఆక్రమణకు గురైందో తెలుస్తుందని పేర్కొన్నారు. శిఖం భూములను ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అధికారుల అండతోనే అక్రమార్కులు చెరువు కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. కబ్జాదారులను అధికారులు కాపాడేందుకు ప్రయత్నిస్తే సహించబోమని వారు స్పష్టం చేశారు. -
‘హైపర్’తో సత్వర సేవలు
హన్మకొండ: హైపర్తో సత్వర సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు పి.మధుసూదన్రావు, కె.గౌతం రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి వైపరీ త్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినపుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ‘హైపర్’ అనే కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. హైపర్ అంటే.. ‘హెచ్’ అంటే హెడ్ క్వార్టర్లో అప్రమత్తంగా ఉండడం, ‘ఎ’ అంటే సిబ్బంది, సామగ్రి సమీకరణ, ‘ఐ’ అంటే సమాచార సేకరణ, చేరవేయడం, ‘పీ’ అంటే పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం, ‘ఇ’ అంటే నిర్దిష్ట కార్యాచరణ అమలు, ‘ఆర్’ అంటే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం అని ఎస్ఈలు మధుసూదన్ రావు, గౌతంరెడ్డి వివరించారు. -
పదో తరగతి పరీక్షలు షురూ
వరంగల్/గీసుకొండ: జిల్లాలోని 49 కేంద్రాల్లో శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9,238 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 9,223 మంది విద్యార్థులు (99.8 శాతం) హాజరై 15 మంది గైర్హాజరయ్యారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద వరంగల్ నగరంలోని ప్లాటినం జూబ్లీ పాఠశాల, గీసుకొండ మండల కేంద్రం, ధర్మారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సదుపాయాలు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలను పరిశీలించారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, క్యాలికులేటర్లను అనుమతించవద్దని, పోలీస్ ఎస్కార్ట్తో పరీక్ష, జవాబుపత్రాల రవాణా చేయాలని సూచించా రు. కలెక్టర్ వెంట జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ కరుణ, చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు. విద్యార్థికి అస్వస్థత నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రుద్రగూడెంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్ హైస్కూల్కు చెందిన విద్యార్థి ఈశ్వర్ పాఠశాలలో పరీక్ష పూర్తిగా రాశాడు. సమయం 15 నిమి షాలు ఉండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఇన్విజిలేటర్ వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. ఏఎన్ఎం మాధవి ప్రథమ చికిత్స అందించి 108కు ఫోన్ చేశారు. అధికారుల సూచనల మేరకు పరీక్ష సమయం ముగిసే వరకు ఆఫీస్ రూంలో 108 సిబ్బంది రామ్మూర్తి చికిత్స అందించారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 9,238 మంది విద్యార్థులకు 9,223 మంది హాజరు పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద -
ఖనిజ వనరుల ఆదాయంలో ములుగు..
ఖనిజ వనరుల ద్వారా తెలంగాణకు ఆదాయ లక్ష్యం రూ.1,575 కోట్లకు రూ.1176 కోట్లు సమకూరగా, ములుగు జిల్లాలో రూ.34.94 కోట్లకు రూ.33.86 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత మహబూబాద్ జిల్లా రూ.25.03 కోట్లకు రూ.22.15 కోట్లతో పదో స్థానంలో ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లా 11, హనుమకొండ రూ.41.97కోట్ల లక్ష్యానికి రూ.25.84 కోట్లు సాధించి 24వ స్థానంలో ఉన్నాయి. రూ.15.44 కోట్లకుగాను రూ.8.62 కోట్లతో వరంగల్ 27, జనగామ రూ.8.25 కోట్లకు రూ.4.55 కోట్లతో 28వ స్థానాల్లో నిలిచాయి. -
అడుగులు పడట్లే!
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025ఆర్థికాభివృద్ధి వైపు–IIలోuతలసరి ఆదాయంలో అంతంతే.. 2023–24లోనూ రంగారెడ్డి జిల్లా రూ.10,55,913ల తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ర్యాంకింగ్లో 12 నుంచి 29 స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఫర్ క్యాపిటల్ ఇన్కం పెరిగినా.. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గతేడాది రూ.2,28,655లతో 15వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,57,851కు పెరిగినా 12వ స్థానానికి పరిమితమైంది. గతంలో 19వ స్థానంలో ఉన్న ములుగు ఈసారి రూ.2,49,338లతో 15, రూ.2,44,278లతో వరంగల్ 17, జనగామ రూ.2,33,215లతో 19, మహబూబాబాద్ రూ.2,12,232లతో 29వ స్థానాల్లో నిలవగా, హనుమకొండ జిల్లా రూ.1,99,490లతో 32వ స్థానానికి పడిపోయింది. గతేడాది రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉన్న హనుమకొండ ఈసారి తలసరి ఆదాయంలో మరో మెట్టు దిగింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. జాతీయ ధరల సూచీ ప్రకారం గణించే తలసరి ఆదాయం విషయంలో గతంతో పోలిస్తే కొంత ఫరవాలేదు. జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానం నుంచి 12వ స్థానానికి చేరింది. అడవుల విస్తీర్ణంలో ములుగు మొదటి, భూపాలపల్లి మూడో స్థానాల్లో నిలిచాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను కల్పించడంలో 9 నుంచి 29 స్థానాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలు నిలిచాయి. అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యుత్ కనెక్షన్లు, మహిళా, శిశు సంక్షేమంలో ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం. అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ అటవీ ప్రాంతం జిల్లాల వారీగా గణనీయంగా మారిన నేపథ్యంలో అత్యధికంగా 64.64శాతం అటవీ విస్తీర్ణంతో ములుగు మొదటి స్థానంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం (41.38శాతం) రెండో స్థానంలో ఉండగా, ఆ తదుపరి మూడో స్థానంలో 41.15 శాతంతో జయశంకర్ భూపాలపల్లి ఉంది. 26.89 శాతంతో అడవులతో మహబూబాబాద్ తొమ్మిదో స్థానంలో, 4.44 శాతంతో జనగామ 29, వరంగల్ 3.53 శాతంతో 30, హనుమకొండ 3.40 శాతంతో 31వ స్థానంలో ఉంది. ‘ఉపాధి’ పనిదినాల్లో వెనుకబాటే.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలు వెనుకబడిపోయాయి. ఈ ఏడాది జనవరి 24 వరకు కూలీలకు పనులు కల్పించడంలో లక్ష్యాలను చేరుకోలేక 9 నుంచి 29వ స్థానాల్లో నిలిచాయి. ర్యాంకింగ్లో వరంగల్ జిల్లా 25.5లక్షల పనిదినాలకు 23 లక్షల పనిదినాలు కల్పించి 89.9 శాతంతో 9వ స్థానం, ములుగు 89.8 శాతం పని దినాలతో 10వ స్థానాల్లో నిలిచాయి. అలాగే 89.3 శాతం లక్ష్యంతో హనుమకొండ 15, జనగామ 16, జయశంకర్ భూపాలపల్లి 88.3 శాతంతో 23, మహబూబాబాద్ 47.6 లక్షల పనిదినాలకు 41.8 లక్షల పని దినాలు జనరేట్ చేసి 87.8 శాతంతో 29వ స్థానంలో నిలిచాయి.జీడీడీపీలో అట్టడుగున జిల్లాలు.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో 2022–23 సంవత్సరం కంటే 2023–24లో అట్టడుగున నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో ఈసారి కూడా పోటీ పడలేకపోయాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) గతేడాది రూ.23,868తో 14వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ. 25,667కు జీడీడీపీ పెరిగినా 16వ స్థానంలో నిలిచింది. వరంగల్ రూరల్(వరంగల్) 22, మహబూబాబాద్ 24వ స్థానాల్లో నిలిచాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో ఆఖరి వరుసలో ఉన్నాయి. జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు.. అట్టడుగున ఆరు జిల్లాలు తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే ఫర్వాలేదు అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ – 2025లో వెల్లడిన్యూస్రీల్జిల్లాల వారీగా తలసరి ఆదాయం ( రూ.లలో) జిల్లా 2020–21 2021–22 2022–23 2023–24వరంగల్ అర్బన్ 1,26,594 1,55,055 1,86,618 1,99,490 వరంగల్ రూరల్ 1,65,549 1,95,115 2,20,877 2,44,278 జనగామ 1,66,392 1,86,244 2,21,424 2,33,215 మహబూబాబాద్ 1,44,479 1,79,057 2,00,309 2,12,232 జేఎస్ భూపాలపల్లి 2,03,564 2,34,132 2,28,655 2,57,851 ములుగు 1,55,821 1,75,527 2,15,772 2,44,278జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా.. జిల్లా మొత్తం జనాభా గ్రామీణం పట్టణ/నగరం హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 -
ఓరుగల్లు కవి పరిమళాలు
నాటి పాల్కుర్కి సోమనాథుడు, మొల్ల, బమ్మెర పోతన తదితరుల నుంచి.. నేటి జైనీ ప్రభాకర్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, ఆచార్య బన్న అయిలయ్య, మెట్టు మురళీధర్, అనిశెట్టి రజిత, అన్వర్, మహమ్మద్ సిరాజుద్దీన్, ఎన్వీఎన్ చారి, బిల్ల మహేందర్, బాలబోయిన రమాదేవి, గట్టు రాధికమోహన్, బిట్ల అంజనీదేవి, కార్తీకరాజు, చల్ల కుమారస్వామి వరకు ఎందరో కవులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. తిరగబడు కవులు, విప్లవకవులు, చేతనావర్త కవులు, జాతీయ కవులు, సీ్త్రవాద కవులు, తెలంగాణవాద కవులు.. ఇలా ఎవరు ఏ వాదాన్ని ఎత్తుకున్నా.. వారందరి ధ్యేయం సమాజాన్ని ముందుకు నడపడమే. భాషాభేదం లేకుండా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ వివిధ భాషల్లో కవిత్వం రాస్తున్నారు. కళలకు పుట్టినిల్లు.. వరంగల్ కళలకు, జానపద కళాకారులకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. కుల పురాణాలు చెప్పే జానపదులు, పద్యనాటకాలను ప్రదర్శించి సందర్భాన్ని బట్టి అలవోకగా సంభాషణను మారుస్తూ తమకు తెలియకుండానే కవిత్వాన్ని ఆశువుగా వల్లెవేయగలిగిన కళాకారులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మిగిల్చిన అనుభవాలను పాటలుగా పాడేవాళ్లు.. తత్వాలు పాడే గాయకులు, జానపద కథలు కళ్లకు కట్టినట్లు చెప్పే అమ్మమ్మలు.. ఇలా ఎందరో మౌఖిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్ జిల్లాలో ఉన్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇప్పటి వరకు అనేక కళారూపాలపై డాక్యుమెంటేషన్ నిర్వహిస్తూ వాటిని సేకరిస్తున్నది. అలాగే, గ్రామాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలోకి తీసుకొస్తోంది. యువ కవులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేస్తోంది. కాళోజీ కళా క్షేత్రంలో కవిత్వ పఠనం కోసం కూడా ప్రత్యేకంగా ఏసీ హాల్, కవుల కోసం లైబ్రరీ నిర్మించారు. కవితా.. ఓ కవిత నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో అంటూ శ్రీ శ్రీ లిఖించినా.. నగరాల్లో అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి అంటూ అలిశెట్టి ఆకలి పేగుల రాగాన్ని వర్ణించినా.. పల్లెటూరి పిల్లగాడ అంటూ ‘సుద్దాల’ జనపదాన్ని జనబాహుళ్యంలోకి తెచ్చినా.. ఓ చైతన్యం పరిఢవిల్లుతుంది. ఓ ఆవేశం ఉప్పొంగుతుంది. ఆ కవుల అడుగుజాడల్లో సమాజ చైతన్యానికి నడుం కట్టారు ఓరుగల్లు కవన సేవకులు. నేడు (శుక్రవారం) ‘అంతర్జాతీయ కవితా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – హన్మకొండ కల్చరల్ వ్యవస్థ జాగృతమయ్యేలాకవితాసేద్యం స్ఫూర్తిగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా కవులు వృత్తి ఏదైనా రచనల్లో మేటి నేడు అంతర్జాతీయ కవితా దినోత్సవం నిజ జీవితంలోనూ కవిత్వం.. నిత్యజీవితంలో ఎన్నో కవితాత్వక పదాలుంటాయి. రామసక్కనోడు, అక్క చుట్టమైతే.. లెక్క చుట్టం కాదు.. చిదిమి దీపం పెట్టవచ్చు. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు వంటి పదాలు సామాన్యులు సైతం మాట్లాడుతుంటారు. కవులు మాత్రం తాము అనుకున్న అంశాన్ని విస్తృతం చేసి అందంగా, ఆనందం కలిగించేలా రాస్తారు. కవిత్వం ద్వారా ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చు. – ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్ -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..
పరకాల: పరకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం పరకాలలో పర్యటించిన ఆయన ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు దామెర చెరువు ట్యాంక్బండ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టడంతో పాటు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్టేడియంగా మార్చండి.. పరకాలలోని వెల్లంపల్లి రోడ్డులో నిర్మాణం జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పట్టణ ప్రజలకు దూరమవుతున్న దృష్ట్యా స్పోర్ట్స్ స్టేడియంగా మార్చాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అందులోనే ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ తదితర వాటిని ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తగిన నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
నిట్ డైరెక్టర్ను కలిసిన సీపీ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీపీ సన్ప్రీత్సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి మాట్లాడుతూ.. నిట్లో విద్యనభ్యసిస్తున్న దేశ, విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ, పోలీస్ శాఖ అందజేస్తున్న సేవలపై పరస్పరం చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్రెడ్డి, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి, ఎస్సై లవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
వరంగల్: జిల్లాలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై కేంద్రాల సూపరింటెండెంట్లతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 49 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గుర్తించిన పరీక్షల కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ జారీచేసిన నిబంధనలను తప్పకుండా పాటిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల సీఆర్పీ 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 9,237 మంది రెగ్యులర్ విద్యార్థులుజిల్లాలో టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 287 పాఠశాలల్లో 9,237 మంది రెగ్యులర్ విద్యార్థులు, 155 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49 మంది సీఎస్, 50 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 559 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 4,803 మంది, బాలికలు 4,434 మంది పరీక్షలు రాయనున్నారు. ఫ్లయింగ్స్క్వాడ్లు 3 బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్లు 49 మందిని నియమించారు. పరికరాలు అందుబాటులోకి తేవడం అభినందనీయం రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ పరికరాలతో నెలకొల్పిన మన అగ్రిటెక్ సంస్థను కలెక్టర్ గురువారం సందర్శించారు. డ్రోన్ స్ప్రేయర్ను కలెక్టర్ సత్యశారద, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత పాశికంటి రమేశ్ స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను కలెక్టర్కు వివరించారు. నూతనంగా ఆవిష్కరించిన డ్రోన్ ప్రత్యేకతలు, మన అగ్రిటెక్ ద్వారా రైతులకు 8 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించాలని రమేశ్ కలెక్టర్ను కోరారు. రైతులకు కావాల్సిన రాయితీ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్, మార్కెట్ ప్రతినిధులు ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే ఫరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడినిట్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభంకాజీపేట అర్బన్: నిట్ వ రంగల్లోని అంబేడ్కర్ లె ర్నింగ్ సెంటర్ ఆడిటోరి యంలో గురువారం మూ డు రోజుల ఆసెంట్–25 నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిట్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘అడ్వాన్స్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అండ్ నానో టెక్నాలజీస్’ అంశంపై ఆసెంట్–25 పేరిట నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లో నిర్వహించడం అభినందనీయమన్నారు. 2070 నాటి కి నెట్ జీరో కార్మన్ లక్ష్యాన్ని సాధించేందుకు వేదికగా నేషనల్ కాన్ఫరెన్స్ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్సీఐ డైరెక్టర్ విజయ్, ఐఐసీహెచ్ఈ ముంబై ప్రొఫెసర్ పరాగ్ గోగటే తదితరులు పాల్గొన్నారు. -
వారిపైనే.. ‘మహా’ ఆశలు!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన భారీ బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లవైపు ఆశలు ఉన్నట్లు కనిపిస్తోంది. సొంత ఆదాయం రూ.32 శాతం కాగా, ప్రభుత్వాల గ్రాంట్లే 68 శాతంగా అంచనా వేశారు. గురువారం ఉద యం కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.1,071.48 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సభ ముందు ఉంచారు. బల్దియా జేఏఓ సరిత పద్దులను చదివి వినిపించారు. బడ్జెట్పై మాట్లాడేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, చాడ స్వాతి సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని, భవన నిర్మాణాల ఆక్రమణలు, కమర్షియల్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, నాన్ లేఅవుట్ల క్రమబద్ధీరణ చేయాలని కోరారు. ఆ తర్వాత బల్దియా బడ్జెట్ను ‘మమ’అనిపించారు. 30వ డివిజన్లో సీసీరోడ్లు నిర్మించిన వారానికే పగుళ్లు పట్టాయని బీజేపీ కార్పొరేటర్లు కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. మాజీ కార్పొరేటర్ ఏకుల కోర్నేలు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1.20 గంటలపాటు బడ్జెట్ సమావేశం సాగింది. బడ్జెట్ స్వరూపం ఇలా.. చివరి బడ్జెట్లో పద్దులను స్వల్ప మార్పులు తప్ప మక్కిమక్కిగా రూపొందించారు. రూ.1,071.8 కోట్లతో రూపొందించిన పద్దులు వివరాల ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ.337.38 కోట్లు(32 శాతం) కాగా, అందులో రెవెన్యూ వ్యయాలు రూ.197.96 కోట్లుగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వ గ్రాంట్స్ రూ.728 కోట్లు (68 శాతం)గా అంచనా వేశారు. అందులో కేంద్రంనుంచి రూ. 55.28 కోట్లు (8శాతం), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 672.82 కోట్లు (92శాతం)గా నిర్ణయించారు. హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వైపు చూపు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,071.48కోట్లతో గ్రేటర్ వరంగల్ బడ్జెట్ సొంత ఆదాయం రూ.337.38కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.728.10కోట్లు కేటాయింపులు చదివి వినిపించిన జేఏఓ సరిత మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
నెక్కొండ: అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. బొల్లికొండ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12 ఏళ్ల తర్వాత పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నిబంధనల ప్రకారం పునాది తీసిన వెంటనే యాప్ సాయంతో ఇంటి నిర్మాణ స్థితిని ప్రభుత్వానికి నివేదిస్తారని పేర్కొన్నారు. అప్పుడే లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష జమ అవుతుందని ఆయన వివరించారు. గతంలో మంజూరైనా ఇళ్లు నిర్మించుకోని వారికి తప్పకుండా ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామానికి 120 ఇళ్లు మంజూరయ్యాయని, ఇంకా అర్హులున్నా ఇళ్ల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, పెండెం రామానంద్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏర్సు తిరుపతి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, హౌసింగ్ డీఈ పందెం విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు చల్లా శ్రీపాల్రెడ్డి, కుసుమ చెన్నకేశవులు, కేవీ. సుబ్బారెడ్డి, కొమ్మారెడ్డి సుధాకర్రెడ్డి, గై లక్ష్మణ్, కర్ర చెన్నారెడ్డి, ఊడ్గుల అశోక్, సముద్రాల కనకయ్య, రామారపు రాము పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బొల్లికొండలో నిర్మాణ పనులకు శంకుస్థాపన -
భూకబ్జాలు, రౌడీషీటర్లపై సమాచారం సేకరించండి
హన్మకొండ చౌరస్తా: రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీసి, భూకబ్జాలకు పాల్పడే వారి సమాచారాన్ని సేకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ ఎస్బీ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో కమిషనరేట్లో గురువారం సీపీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ముందుగా.. పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తీరు తెన్నులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం ఎస్బీ సిబ్బంది ప్రధాన కర్తవ్యమన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్పెషల్ బ్రాంచ్ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని, కచ్చితమైన సమయానికి అందించాలని, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భవిష్యత్లో జరిగే ఘటనలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. పాస్పోర్ట్ విచారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజాయితీగా పని చేయాలని విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్ కీర్తి ప్రతిష్టలు స్పెషల్ బ్రాంచ్పైనే ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్బీ ఏసీపీలు జితేందర్రెడ్డి, పార్థసారథి, రాజు, గురుస్వామి, శేఖర్, సంజీవ్, చంద్రమోహన్, డీఏఓ ఇషాక్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో సమీక్ష -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
వరంగల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షలు గురువారం ముగిసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి ప్రథమ సంవత్సరం, 6 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967 మంది విద్యార్థులు, ఒకేషనల్ 848 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5,739 మంది, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల, కార్యాలయ సిబ్బంది రాజశేఖర్, కొలంబో తదితరులు పరీక్షలను పర్యవేక్షించారని వివరించారు. మరియపురం అభివృద్ధిపై ప్రశంసలుగ్రామంలో రాజస్తాన్ ప్రతినిధుల పర్యటన గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురాన్ని రాజస్తాన్ రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం సందర్శించింది. రాజస్తాన్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 21 మందితో కూడిన బృందం టీజీఐఆర్డీ సీడీపీఏ అనిల్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధిని పరిశీలించి ప్రశంసించింది. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆధ్వర్యంలో గణనీయమైన అభివృద్ధి సాధించి రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుందని అధికారులు వారికి వివరించారు. అలాగే, పల్లెప్రకృతి వనం, కిచెన్గార్డెన్, బోరురీచార్జ్, మ్యాజిక్ సోప్పిట్లను పరిశీలించి గ్రామాభివృద్ధి బాగుందని కొనియాడారు. బృందంలోని రాజస్తాన్ సర్పంచ్ రమన్దీప్ కౌర్ జన్మదినం సందర్భంగా గ్రామస్తులు, అధికారులు ఆమెతో కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు. డీపీఓ కటకం కల్పన, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఎంపీడీఓ వి.కృష్ణవేణి, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, ఫ్యాకల్టీ ప్రతినిధి కర్ణాకర్, ఏపీఎం చంద్రకాంత్, ఎన్ఐఆర్డీ ప్రతినిధి శేఖర్, పంచాయతీ కార్యదర్శులు సరిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలినర్సంపేట: ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేసిన సంఘటన నర్సంపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 121 సర్వేనంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని దళిత సంఘాల నాయకులు కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ నిర్మాణాలు జరుగుతుండడంతో సమీపకాలనీ వాసులు, దళిత సంఘాల నాయకులు పెట్రోల్బాటిళ్లు పట్టుకొని పట్టణంలోని మోడల్ స్కూల్ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకుపై ఎక్కారు. నిర్మాణాలు నిలిపివేయాలని, వెంటనే కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కిరణ్కుమార్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజేశ్, నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ సంఘటనా స్థలానికి చేరి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో మున్సిపల్ టీపీఓ వీరస్వామిని రప్పించి నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని చెప్పడంతో తక్షణమే నిర్మాణాలను కూల్చివేయాలని ఆర్డీఓ ఉమారాణి ఆదేశించారు. దీంతో టీపీఓ వీరస్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది నిర్మాణాలు తొలగించారు. దీంతో శాంతించిన దళిత సంఘాలు, స్థానిక కాలనీవాసులు వాటర్ట్యాంకు దిగి వచ్చారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025నైపుణ్యాలు పెంచుకోవాలి ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు.– IIలోuరాయితీ గడువు సమీపిస్తుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన ● ఇప్పటికే తప్పుడు ఎంట్రీలతో రూ.లక్షల్లో అదనపు భారం ● ప్లాట్ల పరిశీలనకు ముందే క్రమబద్ధీకరణ ఫీజుతో హైరానా ● మాస్టర్ప్లాన్ రోడ్డులో పోయే స్థలాలకూ ఆటోమేటిక్ ఫీజు సాక్షి, వరంగల్: దరఖాస్తుదారులను ఎల్ఆర్ఎస్ బెంబేలెత్తిస్తోంది. 2020 ఆగస్టు 31కి ముందు కొనుగోలు చేసిన సేల్ డీడ్ ప్రకారమే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చార్జీలు విధించాలి. కానీ, తాజా మార్కెట్ విలువతోపాటు మార్కెట్ రేటును మించి మూడింతలు చార్జీలు విధిస్తుండడంతో అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయి సందర్శన లేకుండానే వరంగల్ నగర మాస్టర్ప్లాన్ రోడ్డులో పోయే ప్లాట్లకు సైతం ఆటోమేటిక్ ఫీజు వసూలు వివాదాస్పదమవుతోంది. ఫీజు చెల్లించిన తర్వాతే సదరు ప్లాట్ను అధికారులు క్షేత్రస్థాయి సందర్శన చేసి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం బాగానే ఉంది. ఒకవేళ మాస్టర్ప్లాన్, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణలో ఎంత కావాలో అంత రిజిస్టర్డ్ గిఫ్ట్ ద్వారా ఉచితంగా సంబంధిత విభాగానికి బదిలీ చేయాలనే నిబంధన కలవరపెడుతోంది. ఆటోమేటిక్ ఫీజు ఖరారు చేసే ముందు క్షేత్రస్థాయి సందర్శన చేసి ఎంతవరకు మాస్టర్ప్లాన్ ప్రతిపాదిత రోడ్డులో వెళ్తుందో మినహాయించి మిగిలిన విస్తీర్ణానికి డబ్బులు చెల్లిస్తే దరఖాస్తుదారులకు భారం తగ్గుతుంది. అటు రూ.లక్షల్లో ఫీజు చెల్లించి.. ఇటు ప్లాట్ రోడ్డు విస్తరణ కోసం ఉచితంగా ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ట్యాబ్లు రాగానే క్షేత్రస్థాయి పరిశీలన.. చెరువుల ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధి ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన సర్వే నంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్గా ఫీజు ఖరారు చేస్తున్నారు. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నాటికి మరో 35,000 మందికి ఆటోమేటిక్ ఫీజు జనరేట్ చేశారు. వీటిలో ఫీజు చెల్లించిన వారి ప్లాట్లను అధికారులు సందర్శించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన ట్యాబ్లు రాగానే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఒకవేళ క్షేత్రస్థాయి సందర్శన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉందని తిరస్కరిస్తే పది శాతం ఫీజు మినహాయించుకొని మిగతాది చెల్లిస్తామని అన్నారు. ఫీజులో ఎంత తేడా.. ● వడ్డేపల్లిలోని విజయపాల్కాలనీ ఫేజ్–2లో 1981లో 250 గజాల స్థలాన్ని ఎం.సుధారాణి సేల్ డీడ్ ప్రకారం రూ.1250కు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో సమర్పించిన సేల్ డీడ్ ఉన్న సంవత్సరం ఆధారంగానే చార్జీలు విధించాలి. బెటర్మెంట్ చార్జీలు రూ.25,080, ఓపెన్ స్పేస్ చార్జీలు రూ.175 కలుపుకొని రూ.25,255 రావాలి. ఇందులో 25 శాతం రిబేట్ పోగా.. రూ.18,942 ఫీజు రావాలి. కానీ, అధికారులు చేసిన తప్పుడు మార్కెట్ విలువతో ఏకంగా రూ.7,41,806 ఫీజు రావడంతో లబోదిబోమంటున్నారు. రెగ్యులేషన్ చార్జీలు రూ.41,086 వస్తే ఓపెన్ స్పేస్ చార్జీలు ఏకంగా రూ.ఏడు లక్షలు రావడంతో కంగుతిన్నారు. ఇక్కడ ప్రస్తుత మార్కెట్ విలువ గజానికి రూ.ఏడు వేలు ఉంటే ఏకంగా రూ.20,000 నిర్ధారించడం వల్లే ఇదంతా జరిగింది. ● విమలకు కాజీపేటలో ఉన్న 600 గజాల స్థలానికి రెగ్యులైజేషన్ చార్జీలు రూ.70,235 వస్తే ఓపెన్ స్పేస్ చార్జీ రూ.9,800 మాత్రమే వచ్చింది. నగరశివారు ప్రాంతం స్తంభంపల్లి శివారులో 216 గజాలకు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి రంగు ఉమాదేవి రూ.32,644 చెల్లించాలి. కానీ, తప్పుడు ఎంట్రీతో రూ.1,87,435 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూస్రీల్గ్రేటర్ పరిధిలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు.. దరఖాస్తులు పరిశీలించినవి ఫీజు చెల్లించింది ప్రొసీడింగ్లు 1.10 లక్షలు 40 వేలు 14,088 మంది 680 మందికి ఎస్ఎంఎస్లు షార్ట్ఫాల్స్ ఆటోమేటిక్ ఫీజు జనరేట్ 25,000 మందికి 15వేల మందికి 35,000 మందికి ఈ విధంగా చేస్తే మేలు.. ‘2012, 2015–16, 2018 మాదిరిగానే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ చేపట్టాలి. అప్పుడు తొలుత రూ.పది వేలు చెల్లించిన తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్ల సహకారంతో క్షేత్రస్థాయి సందర్శన చేశాకే ఫీజు చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు పంపితే చెల్లించారు. ఇప్పుడు కూడా దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే ఫీజు తీసుకోవాలి. 2020 ఎల్ఆర్ఎస్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించుకుంటేనే తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్లో గతంలో మాదిరిగానే డాక్యుమెంట్ నంబర్, ప్లాన్ను పొందుపరచాలి. లేదంటే భవన నిర్మాణసమయంలో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది’ అని బల్దియాలోని ఓ ప్లానింగ్ అధికారి తెలిపారు. -
రోగులంటే ఇంత చులకనా?
● సురేఖమ్మా.. ఎంజీఎం గోస పట్టదా? ● ఆస్పత్రి సమస్యలపై బీజేపీ మహాధర్నా ఎంజీఎం: జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలకు కావాల్సింది ఓట్లు మాత్రమే, వారికి పేద ప్రజల గోస.. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు కానరావు అంటూ.. బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు సురేఖను నమ్మి గెలిపించి మంత్రి పదవి ఇస్తే ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీల్చైర్లు, స్ట్రెచర్లు, టూడీ ఎకో, ఈసీజీ పరీక్షలు సక్రమంగా చేయని దుస్థితి నెలకొందన్నారు. ఓరుగల్లు రెండో రాజధానిగా పేర్కొంటున్న సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు ఆస్పత్రిలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్కసారైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వెంటనే అడిషనల్ డీఎంఈ పోస్టును భర్తీ చేసి పూర్తి స్థాయి సూపరింటెండెంట్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాద్, తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, రత్నం సతీశ్, చాడ శ్రీనివాస్రెడ్డి, సముద్రాల పరమేశ్వర్ పాల్గొన్నారు. -
సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరి గాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
-IIలోuదేవాదుల పథకంలో భాగంగా మరి కొందరు రైతుల నుంచి భూమి సేకరించి 1,900 ఎకరాలతో చెరువును రిజర్వాయర్గా మార్చారు. దీంతో తమ పొలాలకు సాగు నీరు సమృద్ధిగా అందుతుందని ఆయకట్టు రైతులంతా భావించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించుకుపోతున్నారు కానీ.. స్థానిక రైతులకు మాత్రం చుక్క నీరు రానివ్వడం లేదని స్థానిక రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. గత నిజాం ప్రభుత్వం కాలంలో ధర్మసాగర్ చెరువు కట్టపై నక్కలతూము నిర్మించి కాలువ ద్వారా దాదాపు 2 వేల ఎకరాలకు సాగు నీరందించేవారు. ఈక్రమంలో 1939 నాటి ప్రభుత్వం నక్కల తూము నీటి సరఫరా నిలిపేసి, చెరువు నుంచి నీటిని వరంగల్ నగర ప్రజల దాహార్తి తీర్చడానికి తరలిస్తున్నారు. అదేవిధంగా కట్టపై గతంలో నిర్మించిన చోటనే 6 సంవత్సరాల క్రితం అరకోటికిపైగా నిధులు వెచ్చించి నక్కలతూమును పునర్నిర్మించారు. కానీ కాలువ పునర్నినిర్మాణం మరిచారు. కాగా.. బోడబండ శివారు నుంచి రిజర్వాయర్ వరకు పైపులైన్ వేశారు. ఆపైపులైన్ ఎయిర్వాల్వ్ ద్వారా రైతుల పొలాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఆ రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్ ఎయిర్వాల్వ్ ద్వారా నీటిని విడుదల చేస్తే నక్కలతూము కాలువ ద్వారా నీళ్లు వచ్చి తమ పంట పొలాలు పారుతాయని లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దిశగా అధికారులు ఆలోచిస్తారా.. పంటలు నిలువునా ఎండిపోతున్నా చూస్తుండిపోతారా అన్నది వేచి చూడాల్సిందే..వరిపంట మేస్తున్న మూగజీవాలు ఎండిపోయిన వరిచేనునీరు విడుదల చేయాలి..నేను బోడబండ శివారులో 8 ఎకరాల్లో 5 లక్షలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాను. సరిపడా సాగు నీరందక పంట ఎండుతుంది. దీంతో అందులో మూడెకరాల వరిలో మూగజీవాల్ని మేపుతున్నా. బోడ బండ శివారు నుండి రిజర్వాయర్ వరకు వేసిన పైప్లైన్ ఎయిర్ వా ల్వ్ ద్వారా నీటిని విడుదల చేసినా పొలాలు ఎండిపోకుండా ఉంటాయి. అధికారులు స్పందించి ఎయిర్వాల్ నుంచి నీటిని విడుదల చేయాలి. – తోకల విజయపాల్ రెడ్డి, ధర్మసాగర్ రైతునీరుగారిన ఆశలు.. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీ క్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నలుగురు కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఈఏసీ కె.అరుణ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాలులో జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు దివ్యాంగుల సమస్యలను వివరించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జీడబ్ల్యూఎంసీ డీసీ రాజశేఖర్, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ యాక్షన్ప్లాన్పై సమీక్ష సమ్మర్ యాక్షన్ప్లాన్, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ అంశాలపై వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ప్రొసీడింగ్ ఇస్తే ప్రజలు ముందుకు వస్తారని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ‘ఆయుష్మాన్’ సేవలు వినియోగించుకోవాలిడీఎంహెచ్ఓ అప్పయ్య మడికొండ: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవల్ని ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. ధర్మసాగర్ పీహెచ్సీ పరిధి ఉనికిచర్ల, హసన్పర్తి పీహెచ్సీ పరిధిలోని దేవన్నపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాలను బుధవారం అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయూష్మాన్ కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, లెప్రసీ సర్వే, ఎన్సీడీ రీస్క్రినింగ్ వివరాల్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ రూతమ్, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, మురళి, ఏఎన్ఎంలు అరుణ, రమ్యశ్రీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
ట్రేడ్ వసూళ్లకు 14 ప్రత్యేక బృందాలు
వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల కోసం ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కమర్షియల్ ట్రేడ్ వసూళ్లను వేగవంతం చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు జవాన్లతో కాజీపేట సర్కిల్కు 7, కాశిబుగ్గ సర్కిల్కు 7 బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. కేటాయించిన ప్రాంతాల్లో ప్రతీ రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి ట్రేడ్ వసూళ్లు జరిపేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఐటీ మేనేజర్ రమేశ్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. నూతన ఓటర్ల నమోదుకు సహకరించాలి నూతన ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ (తూర్పు) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పలు సూచనలి చ్చారు. అర్హులు తప్పకుండా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కుసుమ శ్యామ్సుందర్, బాకం హరిశంకర్, రజనీకాంత్, ఎండీ హెబ్దుల్ల తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు సమీక్షలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలు : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సెంటర్లకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులు గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, ఉరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని, డీజేలు వినియోగించవద్దని వివరించారు. కేంద్రాల సమీపంలో పరీక్ష సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో కల్యాణ మండపం నిర్మించాలిహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండప పనులు పూర్తి స్థాయిలో జరగాలని రాష్ట్ర హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం ఉదయం జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నారాయణ వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఘనంగా స్వాగతించారు. వారు స్వామివారిని దర్శించి బిల్వార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. కేంద్ర పురావస్తుశాఖ ఆఽధీనంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఆలయ విశిష్టతను తెలిపేందుకు పూర్తి స్థాయిలో గైడ్ను నియమించాలన్నారు. వారి వెంట జిల్లా కోర్టు సిబ్బంది ఉన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పరీక్షల్లో హనుమకొండ జిల్లాలో 55 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 20,568 మందికిగాను 19,873మంది విద్యార్థులు హాజరయ్యారు. 695మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీ వరంగల్: డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీని వరంగల్లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.గోవిందరావు, ఉపాధ్యక్షులుగా డి.మహేందర్రెడ్డి, ఎస్.సుధారా ణి, డి.రవీందర్, కార్యదర్శులుగా ఎం.రామస్వామి, టి.సూరయ్య, టి.ఆనందాచారి, కె.నర్సింహులు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.జాన్నాయక్, టి.అరుణ, ఆర్. రాంరెడ్డి, కె.కొమ్మయ్య, వి.సదానందం, ఆడిట్ కమిటీ కన్వీనర్గా కె.రమేశ్, సభ్యులుగా డి. శ్రీనివాస్, టి.యాకయ్యలను ఎన్నుకున్నారు. -
మహిళలకు పెద్దపీట
ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన వినిపిస్తోంది. సీఎంగా మొదటిసారి వరంగల్లో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగర అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చినట్లు బడ్జెట్లో కనిపించలేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు.. మహిళా పథకాలకు పెద్దపీటఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా.. ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. రైతులు, రైతుకూలీలకు బీమా.. విద్యారంగానికి మంచి రోజులు.. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నలుగురు కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని సూచించారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ కల్పించడంతోపాటు ఏఎన్ఎం, ఫస్ట్ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రూట్లలో ప్రశ్న, జవాబుపత్రాల తరలింపు సమయంలో పోలీసు అధికారులు తప్పనిసరిగా ఉండాలని, మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఈఏసీ కె.అరుణ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి దివ్యాంగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కలెక్టరేట్ కాన్ఫరెన్్స్ హాలులో జరి గింది. జిల్లా కమిటీ సభ్యులు దివ్యాంగుల సమస్యలను వివరించారు. కలెక్టర్ స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జీడబ్ల్యూఎంసీ డీసీ రాజశేఖర్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఏసీపీ తిరుపతి, ఆర్టీఓ శోభన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి, ఎల్డీఎం రాజు, ఆర్టీసీ సూపరింటెండెంట్ సర్వోత్తమ్రెడ్డి, ఎంజీఎం ఆర్ఎంఓ శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు అంబటి రాజేందర్, బండి చక్రపాణి, సతీ ష్, పిన్నింటి రవీందర్, వీరన్న నాయక్, నర్సక్క, రవీందర్, సునీత తదితరులు పాల్గొన్నారు.సమ్మర్ యాక్షన్ప్లాన్పై సమీక్ష సమ్మర్ యాక్షన్ప్లాన్, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ అంశాలపై కలెక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ప్రొసీడింగ్ ఇస్తే ప్రజలు ముందుకు వస్తారని కలెక్టర్ అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి తొందరగా మార్కింగ్లు ఇచ్చి బేస్మెంట్ లెవెల్కు తీసుకురావాలని, రెండో దశలో మంజూరైన ఎల్–1 జాబితా త్వరగా వెరిఫై చేయాలని, అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించి ఎల్–1 జాబితా ఫైనల్ చేసి ఈనెల 25 లోపు పంపించాలని ఎంపీడీఓలను కోరారు. డీపీఓ కల్పన మాట్లాడుతూ మండలాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలను ఎప్పటికప్పుడు క్రమంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు విద్యార్థులకు వసతులు కల్పించాలి అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
నర్సంపేట: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పింగిళి రజనీకర్రెడ్డి–నవత దంపతుల ఏకై క కుమారుడు అశ్వంత్రెడ్డి (15) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. బుధవారం గుండెపోటు రావడంతో నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడు గుండెపోటుతో మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి ప రామర్శించారు. విద్యార్థి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ యన వెంట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బాదావత్ బాలునాయక్, మొండె భద్రయ్య,కుర్ర వెంకటేశ్వ ర్లు, జర్పుల ప్రవీణ్, కేతిడి వెంకట్రెడ్డి, బిట్ల శ్రీని వాస్, విజేందర్, రంజిత్ ఉన్నారు. జల్లి గ్రామంలో విషాదఛాయలు -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
అందరినోటా ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలుగనుంది. -
రుణమార్పిడితో లబ్ధి పొందాలి
గీసుకొండ: ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్న రుణభారం తగ్గాలంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని చెల్లించి లబ్ధి పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధి సురేశ్ సూచించారు. గీసుకొండ గ్రామపంచాయతీ ఆవరణలో లీగల్ సెల్, జిల్లా లీడ్ బ్యాంకు, వ్యవసాయశాఖ బుధవారం ఏర్పాటు చేసిన రైతు రుణమార్పిడి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు తమ ప్రైవేట్ అప్పుల గురించి బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు ఇస్తారన్నారు. దీంతో పాత ప్రైవేట్ అప్పులను పూర్తిగా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును తక్కువ వడ్డీతో సులభ వాయిదాల్లో చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడీఏ గౌస్హైదర్ మాట్లాడుతూ రైతులకు మేలు చేయడానికే బ్యాంకులు ప్రవేశపెట్టిన డెఫ్ట్ స్వాపింగ్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూబీఐ మేనేజర్ విజయ్, ఏఓ(టి) దయాకర్, గీసుకొండ ఏఓ హరి ప్రసాద్బాబు, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏఈఓ రజని, సీసీ సుజాత, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, రైతులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధి సురేశ్ -
రోగులంటే ఇంత చులకనా?
ఎంజీఎం: జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలకు కావాల్సింది ఓట్లు మాత్రమే వారికి పేద ప్రజల గోస.. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు కానరావు అంటూ.. బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు సురేఖను నమ్మి గెలిపించి మంత్రి పదవి ఇస్తే ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీల్చైర్లు, స్ట్రెచర్లు, టుడీ ఎకో, ఈసీజీ పరీక్షలు సక్రమంగా చేయని దుస్థితి నెలకొందన్నారు. ఓరుగల్లు రెండో రాజధానిగా పేర్కొంటున్న సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు ఆస్పత్రిలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్కసారైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వెంటనే అడిషనల్ డీఎంఈ పోస్టును భర్తీ చేసి పూర్తి స్థాయి సూపరింటెండెంట్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాద్, తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, రత్నం సతీశ్, చాడ శ్రీనివాస్రెడ్డి, సముద్రాల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సురేఖమ్మా.. ఎంజీఎం గోస పట్టదా? ఆస్పత్రి సమస్యలపై బీజేపీ మహాధర్నా -
బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా..
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. ● స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. ● రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరు వాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. -
మౌనికకు అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగం
నల్లబెల్లి: రైతుబిడ్డ అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాన్ని సాధించి ఆదర్శంగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన ఉడుత రాజన్న–రమనీల దంపతుల చిన్న కుమార్తె మౌనిక ప్రభుత్వం ప్రకటించిన అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–1 ఫలితాల్లో భద్రాద్రి జోన్లో 9వ ర్యాంకు సాధించింది. స్థానిక ఎస్వీఎన్ హైస్కూల్లో పదో తరగతి, హనుమకొండలోని శ్రీవేద జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ పూర్తిచేసింది. పోటీ పరీక్షలకు ప్రిపేరై ఉద్యోగానికి ఎంపికై ంది. మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం, పలువురు బుధవారం ఆమెను అభినందించారు. కొమ్మాల అంగడి టెండర్ ఖరారుగీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి టెండర్ను బుధవారం ఖరారు చేసినట్లు ఎంపీఓ ప్రభాకర్ తెలిపారు. అంగడిలో భాగంగా కొమ్మాల గ్రామపంచాయతీ వాటా కింద ఏడాదికి 20 వారాలపాటు ప్రతి శనివారం అంగడి నిర్వహించడానికి టెండర్ ఖరారు చేసినట్లు వివరించారు. అంగడి మొత్తం ఐదు గ్రామపంచాయతీల పరిధిలో ఉండగా కొమ్మాల వాటా కింద సీల్డ్ కవర్ ప్రక్రియ ద్వారా అధికారులు రూ.48,51,396 అప్సెట్ ధర నిర్ణయించారని పేర్కొన్నారు. ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా అదే గ్రామానికి చెందిన బాలోజీ నాగయ్య రూ.49,01,000కు టెండర్ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది వర్తి స్తుందన్నారు. పశువులకు రూ.200, మేకలు, గొర్రెలకు రూ.100,లారీ,జీప్కు రూ.50, ఆ టో, హోటల్, దుకాణం, బండ్లకు రూ.30 చొ ప్పున అంగడిలో వసూలు చేయాలని, అంతకు మించి చేస్తే టెండర్ రద్దు చేస్తామని ఎంపీఓ హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గైని శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రెమల్లి శంకర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. విశ్వనాథపురంలో పారువేటగీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని విశ్వనాథపురానికి పారువేటకు తోడ్కొని వెళ్లారు. రథోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను గ్రామంలోని శివాలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పారువేట, చక్రతీర్థం అనంతరం రాత్రి శ్రీపుష్పయాగం, నాగవెల్లి జరిపించారు. అర్చకులు రామాచారి, ఫణి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లకు 14 ప్రత్యేక బృందాలు ● నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ● సమీక్షలో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల కోసం ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగం ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కమర్షియల్ ట్రేడ్ వసూళ్లను వేగవంతం చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు జవాన్లతో కాజీపేట సర్కిల్కు 7, కాశిబుగ్గ సర్కిల్కు 7 బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. -
పూర్తిస్థాయిలో కల్యాణ మండపం నిర్మించాలి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండప పనులు పూర్తి స్థాయిలో జరగాలని రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం ఉదయం జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నారాయణ దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఘనంగా స్వాగతించారు. వారు స్వామివారిని దర్శించి బిల్వార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. కేంద్ర పురావస్తుశాఖ ఆఽధీనంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఆలయ విశిష్టతను తెలి పేందుకు పూర్తి స్థాయిలో గైడ్ను నియమించాలన్నా రు. వారి వెంట జిల్లా కోర్టు సిబ్బంది ఉన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య -
వరంగల్
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. ఈఆర్సీకి సమస్యల గోడు హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల బహిరంగ విచారణలో బాధితులు తమ సమస్యలను తెలిపారు.-IIలోuరైతులు, రైతుకూలీలకు బీమా.. ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది. మహిళలకు పెద్దపీట ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు.. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179 కోట్లు, కేయూ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. – సాక్షి ప్రతినిధి, వరంగల్విద్యారంగానికి మంచి రోజులు.. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. న్యూస్రీల్బడ్జెట్పై వివిధ వర్గాల అభిప్రాయాలు – వివరాలు IIలోu -
విద్యుత్ మోటారు ఆన్ చేస్తూ.. మృత్యుఒడికి
● షాక్కు గురై రైతు మృతి ● కొండపర్తిలో ఘటన ఐనవోలు: విద్యుత్ మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ (45) వ్యవసాయంతో పాటు కులవృత్తి (గౌడ) కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే వరి పంటకు నీరు పారించడానికి మంగళవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ ద్వారా వ్యవసాయ మోటారు ఆన్ చేస్తుండగా ఎడమ చేతికి విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై పక్కనే ఉన్న నీటి కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుడి భార్య, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
నాణ్యతతో పనులు పూర్తిచేయాలి
దామెర : గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మండలంలోని సీతారాంపురంలో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. నాటుకోళ్ల షెడ్, డ్రాగన్ ఫ్రూట్ సాగు తదితర పనులను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి తాగునీరు అందేలా, పైపులైన్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీ సంఖ్యను పెంచాలని, పనులపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కుట్టు శిక్షణ కేంద్రంలో అధునాతన యంత్రాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, అదన పు డీఆర్డీఓ శ్రీనివాసారావు, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీడీఓ కల్పన, ఎంపీఓ రంగాచారి, ఏపీఎం ఝాన్సీ, ఏపీఓ శారద, పీఆర్ ఏఈ సమ్మిరెడ్డి, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్హౌజ్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌజ్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌజ్కు హుటాహుటిన అధికారులు అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవారెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. -
డబ్బులు ఇవ్వడం లేదని వాట్సాప్లో వైరల్
శాయంపేట : మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోతు సుమలత భర్త రమణా రెడ్డి తనకు సుమారు రూ.12లక్షలు ఇవ్వాలంటూ అదే గ్రామానికి చెందిన మూలగుండ్ల సందీప్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ల్లో మెసేజ్ పోస్ట్ చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, రమణారెడ్డి భార్య సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కాంట్రాక్ట్ పనుల కోసం సందీప్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్నాడని, సర్పంచ్ పదవి అయిపోయినా రమణారెడ్డి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సందీప్రెడ్డి పలు వాట్సాప్ గ్రూప్లలో మెసెజ్ పెట్టాడు. భర్తకు సర్దిచెప్పిన భార్య అనూష సందీప్ రెడ్డి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన విషయం తెలుసుకున్న అతని భార్య అనూష తనభర్తకు ఫోన్ చేసి డబ్బులు ఈరోజు కాకపోతే రేపు వస్తాయని, నీవు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఇంటికి రావాలని సర్దిచెప్పింది. కాసేపటి తర్వాత సందీప్రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనూష తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు పోలీసులకు తెలపడంతో ఎస్సై జక్కుల పరమేష్ హుటాహుటినా సందీప్రెడ్డి ఫోన్ నంబర్ను ట్రేస్ చేశారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల మూలతాళ్లవద్ద ఉన్నాడని గుర్తించి, అక్కడికి చేరుకోగా సందీప్రెడ్డి పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం -
పల్లె దవాఖానాలో మెరుగైన వైద్యసేవలు
ఆత్మకూరు : పల్లె దవాఖానాలో గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని డీఎంహెచ్ఓ అప్పయ్య పేర్కొన్నారు. మండలంలోని పెద్దాపూర్ పల్లె దవాఖానాను మంగళవారం కేంద్ర బృందం సభ్యులు వర్చువల్గా పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో వెస్టేజ్, రోగులకు అందించే సేవలు, గర్భిణులకు అందించే వైద్యం, శిశు ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల ద్వారా రోగులకు వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్పందన, వైద్యులు పద్మశ్రీ, పుష్పలీల, నర్సింగరావు, సీహెచ్ఓ జునేటి, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
గిట్టుబాటు కాని టమాట సాగు
ఎల్కతుర్తి : ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా సాగుకు ఎదురు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమదేరపల్లి మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా మెట్టప్రాంతంలో ఉన్నాయి. కేవలం దేవాదుల కాల్వ, వర్షపు నీరు మాత్రమే ఆయా భూములకు ఆధారం. కాగా ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువుల్లో, కుంటల్లో నీరు చేరినప్పటికి అవి ఇప్పుడు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బావి నీటి ద్వారా పలు గ్రామాల్లోని రైతులు కూరగాయ పంటలు టమాట, బెండ, బీర, వంకాయ ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట ధర రూ.5నుంచి రూ.10కి పడిపోయింది. దీంతో రైతులు కూలీకు ఇచ్చే డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్కు తరలించే ఖర్చు, పంట సాగుకు చేసిన ఖర్చులు ఎదురుపెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చేనులోనే వదిలేసి పోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మండలంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసినట్లైతే పండించిన పంటలను నిల్వ చేసుకోవచ్చు. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే వీలు ఉంటుందని పలువురు రైతులు మొరపెట్టుకుంటున్నారు. సాగు విస్తీర్ణం.. భీమదేవరపల్లి మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను 17,847ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రధాన పంటలైన వరి 11,894 ఎకరాల్లో సాగు చేయగా మొక్కజొన్న 4,365, మామిడి 1,100, ఆయిల్పామ్ 256, పొగాకు 53, మల్బరి 19, కూరగాయలు 17 ఎకరాల్లో సాగు చేశారు. స్వీట్ ఆరేంజ్ 80 ఎకరాలు, సన్ప్లవర్ 25 ఎకరాలు, సపోటా 11 ఎకరాలు, వ్యవసాయ అధికారులు వెల్లడించారు. దిగజారిన రేటు ఆందోళనలో అన్నదాతలు -
మహిళా సంఘాలకు ఉగాది కానుక
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల నిధులు విడుదల చేసి ఉగాది కానుకగా అందజేసింది. మొత్తంగా రూ.18.33కోట్లు సంఘాల ఖాతాలో జమ కానున్నాయి. హనుమకొండ జిల్లాలో సుమారు 12వేల ఎస్హెచ్జీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం వీఎల్ఆర్ 386 వీఓల పరిధిలోని 8,446 ఎస్హెచ్జీలకు మాత్రమే నిధులు వస్తున్నాయి. ఆర్థిక క్రమ శిక్షణ లేక రుణాల చెల్లింపుల్లో వెనకబడిన కారణంగా సుమారు 1,500 సంఘాలు వీఎల్ఆర్ కోల్పోయాయి. సంఘాలు ఎంత రుణం తీసుకున్నా వీఎల్ఆర్ మాత్రం రూ.5లక్షల రుణం ఇస్తారు. మండలాల వారీగా వీఎల్ఆర్ అర్హత పొందిన సంఘాల వివరాలుమండలం వీఓలు ఎస్హెచ్జీలు వీఎల్ఆర్ (రూ.లక్షల్లో) ఆత్మకూరు 29 573 113.26 భీమదేవరపల్లి 43 955 228.07 దామెర 22 494 118.71 ధర్మసాగర్ 40 877 183.71 ఎల్కతుర్తి 39 821 188.85 హసన్పర్తి 24 517 114.03 ఐనవోలు 35 799 160.29 కమలాపూర్ 51 1,325 304.73 నడికుడ 28 485 90.49 పరకాల 14 289 62.84 శాయంపేట 42 842 159.60 వేలేరు 19 469 108.94 మొత్తం 386 8,446 1,833.53 రూ.18.33 కోట్లు వీఎల్ఆర్ విడుదల -
సీపీని కలిసిన ఏసీబీ అధికారులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్.రాజు, ఎల్.రాజు ఉన్నారు. అనంతరం సీపీకి పూలమొక్కను అందజేశారు. కలెక్టర్ ప్రావీణ్య రక్తదానం హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్ ఐడీఓసీలోని జిల్లా ఖజానా కార్యాలయ ప్రాంగణంలో రెడ్క్రాస్ సౌజన్యంతో తలసేమియా బాధితుల కోసం మంగళవారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా ఖజానా అధికారి ఎ.శ్రీనివాస్కుమార్, డీఆర్డీఓ మేన శ్రీను, బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి, ఉద్యోగ సంఘాల బాధ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. నేటినుంచి ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తులు ఎంజీఎం : జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి నేటి (బుధవారం)నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 పోస్టులు (జనరల్–5, బీసీ–ఏ–1, బీసీ–బీ–1, ఎస్సీ–1, ఈడబ్ల్యూఎస్–4, దివ్యాంగులు–1 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 46 సంవత్సరాల వయస్సులోపు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంలో కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దరఖాస్తులు hanamkonda. telangana.gov.in వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, దరఖాస్తు పత్రంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, హనుమకొండ పేరున ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని తెలిపారు. విద్యార్హతలు, కుల, నివాస సర్టిఫికెట్లు జత చేసి కా ర్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
మొండికేస్తే ఆస్తుల జప్తు..
వరంగల్ అర్బన్ : బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లపై దూకుడు పెంచారు. పన్ను చెల్లించని బకాయిదారులకు డిమాండ్, రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేసి జప్తు చేస్తున్నారు. మూడేళ్లుగా రూ.44 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్న హనుమకొండలోని జయ నర్సింగ్ కళాశాలను మంగళవారం సీజ్ చేశారు. ఇలా వారం రోజుల్లో 356 ఆస్తులను సీజ్ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.118.06కోట్లకు గాను రూ.61.39కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో 13 రోజుల్లో గడువు ముగియనుంది. మెమోల జారీతో.. బల్దియాకు ఆస్తి పన్ను ప్రధాన వనరు. పన్నుల వసూలులో మొదటినుంచి నిర్లక్ష్యంగా ఉంటూ మార్చిలో హడావుడి చేస్తుండడంతో మేయర్, కమిషనర్ ఇటీవల సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తాజాగా డిప్యూటీ కమిషనర్లకు, టీఓకు, ఆర్ఓ,ఆర్ఐ, వార్డు ఆఫీసర్లకు మెమోలు జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతధికారులు వందశాతం పన్నుల వసూలు చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. అద్దె వ్యాపార సంస్థలకు తాళాలే.. అద్దె భవనంలో వ్యాపారం చేస్తున్నా.. ఆస్తిపన్ను చెల్లించాల్సిన బాధ్యత భవన యజమానిదే. ఇకపై అలా కుదరదని తాముంటున్న భవనానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపు బాధ్యతను అద్దెదారులు పట్టించుకోవాలంటున్నారు బల్దియా అధికారులు. లేని పక్షంలో చట్టప్రకారం తీసుకునే చర్యలతో నష్టపోవాల్సి వస్తుందని, తాజాగా సుబేదారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశారు. దీంతో చేసేదేమి లేక సదరు యజమాని ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చింది. ప్రతినెలా ఆస్తిపన్నుపై 2శాతం వడ్డీ, అంటే ఏడాదికి 24శాతం అవుతోంది. ఇలా ఏళ్ల తరబడి చెల్లించని పన్ను బకాయిదారులకు ఆస్తిపన్ను భారంగా మారుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరడంతో ఎంత మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి. గ్రేటర్ పరిధిలో వారంలో 356 ఆస్తులు సీజ్ రూ.44లక్షలు చెల్లించని జయ నర్సింగ్ కాలేజీకి తాళం పన్ను బకాయిదారులపై అధికారుల కొరడా -
చివరి ఆయకట్టుకు సాగు నీరందించండి
● అసెంబ్లీలో దండం పెట్టి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికమలాపూర్ : నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్రెడ్డి మాట్లాడారు. కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, గూనిపర్తి, మాదన్నపేట, శనిగరం, లక్ష్మిపూర్, గోపాల్పూర్, బత్తినివానిపల్లి తదితర గ్రామాలకు సాగు నీరందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డీబీఎం–21, 22, 23, 24 ద్వారా వెంటనే సాగు నీరు అందించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. ఇటీవల స్టేషన్ ఘన్పూర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.800 కోట్లు కేటాయించారని, అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. గోవిందా అంటూ భక్తులు రథాన్ని గుట్టచుట్టూ తిప్పారు. తొలుత స్వామి వారు, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని గుట్టపైన ఉన్న ఆలయం నుంచి కిందికి తోడ్కొని వచ్చారు. విశ్వక్సేవ, పుణ్యాహవచనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించేందుకు కొంత సమయం గుట్ట దిగువన ఉత్సవమూర్తులను ఆసీనులను చేయించారు. అనంతరం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై దేవతామూర్తులను కూర్చుండబెట్టి రథాన్ని లాగుతూ గుట్టచుట్టూ తిప్పారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి మొక్కులు సమర్పించారు. బుధవారం స్వామి వారిని విశ్వనాథపురానికి తోడ్కొని వెళ్లి పారువేట, చక్రతీర్థం, శ్రీపుష్పయాగం, నాగవెల్లి నిర్వస్తామని, ఆ తర్వాత దేవతామూర్తులను గుట్టపైకి తీసుకెళ్తామని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు పేర్కొన్నారు. ఽఅర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణి రథోత్సవంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కొమ్మాలలో మార్మోగిన గోవిందనామస్మరణ -
రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి
వర్ధన్నపేట: రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల రుణాలను లీగల్గా కవర్ చేసి వారికి మాఫీ లబ్ధి చేకూర్చాలని టెస్కాబ్ చైర్మ న్ మార్నేని రవీందర్రావు అన్నారు. వర్ధన్నపేట డీసీసీబీ శాఖలో రాయపర్తి, నందనం, ఐనవోలు, వర్ధన్నపేట సొసైటీలు, ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీల మేనేజర్లు, నోడల్ అధికారులు, సొసైటీ సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ బ్యాంకు లక్ష్యాలను నూటికి నూరు శాతం పూర్తిచేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నోడల్ అధికారి, ఏజీఎం గొట్టం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, శ్రావణ్, భద్రునాయక్, నందనం సొసైటీ చైర్మన్ చందర్రావు, వర్ధన్నపేట, రాయపర్తి సొసైటీ చైర్మన్లు రాజేశ్ఖన్నా, రామచంద్రారెడ్డి, సొసైటీ సీఈఓలు వెంకటయ్య, యాదగిరి, సంపత్, సోమయ్య ఉన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
ఆయిల్పామ్తో అధిక ఆదాయం
వరంగల్: తక్కువ నీరు, అధిక ఆదాయం వచ్చే ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం కరప్రతాలను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తుందని, కోతకు వచ్చిన పంటను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 84 దరఖాస్తులు.. జిల్లాలో టీజీ ఐపాస్ చట్టం ద్వారా వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 52 యూనిట్లకు 84 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అందులో 52 యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల శాఖ జీఎం రమేశ్, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, పురోగతిపై అధికా రులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,422 దరఖాస్తులు రాగా.. అందులో 14,899 మంజూరు చేశామని, ఫీజు చెల్లించిన 665 మందికి పత్రాలు అందించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. కల్టెర్ సత్యశారద -
పల్లె దవాఖాన సేవల పరిశీలన
దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న పల్లె దవాఖాన సేవలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం పరీక్షించారు. మల్లంపల్లిలోని పల్లె దవాఖానలో డాక్టర్ అరుణ్జిత్, డాక్టర్ ఇక్బాల్ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలు, కుష్ఠు నిర్మూలన, అంధత్వం, మాతా శిశుసంరక్షణ కార్యక్రమాలపై ఆరాతీశారు. సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్, క్వాలిటీ మేనేజర్ అనిల్కుమార్, డీపీఎంఓ అర్చన, డాక్టర్ కిరణ్రాజు, రాకేశ్, భరత్కుమార్, సీహెచ్ఓ సలోమీ, హెచ్ఈఓ సాంబయ్య, హెచ్వీ సంధ్యారాణి, ఏఎన్ఎం కోమల, హెల్త్ అసిస్టెంట్ రహమాన్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. వేధిస్తున్న వ్యక్తిపై కేసుసంగెం: మహిళను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన వేల్పుల అయిలయ్య.. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వీధిలోకి వచ్చి హారన్ కొడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పగా వారు అతడిని నిలదీయగా తన ద్విచక్రవాహనాన్ని వదిలి వెళ్లిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేర కు అయిలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలివరంగల్: ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని మార్కెటింగ్శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు కలెక్టర్ సత్యశారదను కలిశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పటివరకు అందజేస్తున్న వెయ్యి భోజనాలను రెండు వేలకు పెంచాలని చాంబర్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాలు, అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలి సింది. కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ ఆర్జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, ఏఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్లో ఉండాలి వరంగల్: కుటుంబ సభ్యుల ఓట్లు అన్ని ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,72,824 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఎలక్షన్ డీటీ రంజిత్, రాజకీయ పార్టీల నాయకులు ఈవీ.శ్రీనివాసరావు, బాకం హరిశంకర్, కె.శ్యాం, ఫిరోజుల్లా, జె. అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. గ్రంథాలయ బడ్జెట్ ఆమోదం వరంగల్: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అధ్యక్షతన సంస్థ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16 గ్రంథాలయాల అభివృద్ధికి కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీపీఓ కల్పన, వయోజన విద్యాశాఖ అధికారి రమేశ్రెడ్డి, ఏపీఆర్ఓ ప్రేమలత, జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంపుహౌస్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌస్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావుడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంపుహౌస్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటారు ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటారు మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్వినిరెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష కు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ము ఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాక డే, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవారెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపా టు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. రాత్రి వరకు కాని మోటారు మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌస్కు హుటాహుటిన అధికారులు ఫేజ్–3 పనులపైనే దృష్టి.. చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌస్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60 వేల నుంచి 65 వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వర కు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. -
న్యాయవాదులు నైతిక విలువలు కలిగి ఉండాలి
వరంగల్ లీగల్ : న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య పేర్కొన్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ‘లా అండ్ హ్యూమన్ రైట్స్’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన, అమలు చేసే విధానాలపై వారి అనుభవాలను తెలుపుతూ రాష్ట్ర జల వివాదాల చట్టం గురించి వివరించారు. అనంతరం ఉభయ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ నారాయణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు జీవన్గౌడ్, యం.రమేష్ బాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి సహకరించాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ఆస్తి, నల్లా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ గుండు సుధారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పన్నుల వసూలు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని, రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.118.06 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.60.17 కోట్లు వసూలయ్యాయని, కేవలం పక్షం రోజుల సమయమే మిగిలి ఉన్నదని చెప్పారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి లక్ష దరఖాస్తులు రాగా 14,088 మంది క్రమబద్ధీకరించుకోవడానికి ఫీజులు చెల్లించారని, 680 మందికి క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలు అందజేసినట్లు చెప్పారు. 25శాతం రిబేట్తో ఈనెల 31లోపు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. రంజాన్ పండుగ ఏర్పాట్లు విస్త్రతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, రాజేశ్వర్, టాక్సేషన్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలుఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
రవికుమార్ దంపతులకు బెస్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఇన్షియేట్ అవార్డు
నర్సంపేట: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిస్తున్న సేవలు, గ్రంథాలయాల అభివృద్ధికి చేస్తున్న కృషికి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాసుల రవికుమార్, శోభారాణి దంపతులకు ప్రతిష్టాత్మక బెస్ట్ చైల్డ్ ఇన్షియేటివ్ అవార్డును సీఎస్ఆర్ సమ్మిట్ కాన్ఫరెన్స్లో అందించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈకార్యక్రమంలో అవార్డును మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా రవికుమార్ దంపతులు అందుకున్నారు. చదువును ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ రామచంద్రు, సినీ నటి, చేనేత అంబాసిడర్ పూనమ్కౌర్, డాక్టర్ అర్చన, హక్కుల కార్యకర్త వైజయంతి, వసంత మొగ్గి, ప్రధాన నిర్వాహకుడు వినీల్రెడ్డి, ప్రఖ్యాత కంపెనీల అధినేతలు, సామాజిక కార్యక్తలు సామాజిక బాధ్యత ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఈసందర్భంగా కాసుల రవికుమార్ దంపతులు మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో వికాసం, అభివృద్ధి ఉంటాయన్నారు. నాణ్యమైన విద్య వ్యాప్తికై భవిష్యత్లో మరింత కష్టపడి పని చేయడానికి ఈగుర్తింపు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈచదువుల యజ్ఞంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
గంగదేవిపల్లిని సందర్శించిన అధికారులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన 26 మంది అధికారులు సోమవారం ఉద్యోగ పరమైన శిక్షణలో భాగంగా సందర్శించారు. ఇండియా సెక్రెటేరియట్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఎస్టీఎం) అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్సోనీ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీఐ మహా నిర్దేశకులు శశాంక్ గోయల్ సూచనల మేరకు అధికారుల బృందం గ్రామ సందర్శనకు వచ్చింది. ఈసందర్భంగా గ్రామం సాధించిన విజయాలు, ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శంగా నిలిచిన తీరు గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వారికి వివరించారు. ఐఎస్టీఎం డైరెక్టర్ రాజీవ్, హెచ్ఐఆర్డీ అధికారి మార్గం కుమారస్వామి, రిసోర్స్పర్సన్ గూడ సరోజన, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి : డీఈఓ
విద్యారణ్యపురి : ప్రత్యేక అవసరాల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీఈఓ డి.వాసంతి కోరారు. సోమవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలను అందజేసి ఆమె మాట్లాడారు. భారతీయ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలీంకో) కృత్రిమ ఉపకరణాలను అందజేసిందని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్ల లను భవిత కేంద్రంలో చేర్చి సమీపంలోని పాఠశాలల్లో వారిస్థాయికి తగిన తరగతిలో చేర్పించాలన్నా రు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వీల్చైర్లు, రోలెట ర్స్, క్రష్ ఎల్బో అడ్జస్ట్ మెంటు, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సమ్మిళిత విద్య సమన్వయకర్త బద్దం సుదర్శన్రెడ్డి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఎంఈఓ నెహ్రూ, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..
వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.సాంబశివరావు తెలిపారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆయన వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఆర్ఓఆర్ నీరు అందకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని నీరందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రామ్మూర్తి వివరించారు. సాంబశివరావు వార్డులు కలియ తిరుగుతూ అన్ని వసతులు సమకూరుతున్నాయా? అని రోగులను అడిగి తెలిసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా.. ఆయన స్పందిస్తూ.. వెంటనే తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు -
గబ్బర్సింగ్ కావాలి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు దేశ స్థాయిలో మంచి పేరుంది. ఇక్కడి వారు సాధించిన విజయాలను ఐపీఎస్ ట్రైనింగ్లో సైతం చెబుతారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కమిషనరేట్ చరిత్ర క్రమక్రమంగా మసకబారుతోంది. కొంత మంది పోలీస్ అధికా రుల తీరు పోలీస్ శాఖ పరువును బజారున పడేలా చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్న అధికారులపై కొంత కాలంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో వారి అక్రమ సంపాదన ‘మూడు పువ్వులు.. ఆరు కాయలుగా’ వర్ధిల్లుతోంది. మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్కు నూతన కమిషనర్గా ఈనెల 10న సన్ప్రీత్సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎదుట అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్పై పట్టింపేది..? కమిషనరేట్లోని అనేక మంది పోలీస్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్న గుట్కాలు, గంజాయి, పీడీఎస్ బియ్యం, నకిలీ వస్తువులతో తరువాత ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం వంటి వాటిల్లో నెలవారీ మాముళ్లతో పోలీసులు తరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే డాన్ ’కోటీ‘కి పడగలెత్తినట్లు ప్రచారంలో ఉంది. భూపంచాయితీలకే ప్రాధాన్యం.. కమిషనరేట్ పరిధి చాలాపోలీస్స్టేషన్లలో భూముల పంచాయితీల హవా కొనసాగుతోంది. పలువురు పోలీస్ అధికారులు(ఎస్హెచ్ఓలు) పోలీసింగ్ను ఎస్సైలకు అప్పగించి వారు భూముల పంచాయితీ ల్లో తరిస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని ఓ సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు భూములకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. కొంత మంది పోలీస్ అధికారులు మరో అడుగు ముందుకేసి వారి బినామీల పేరు మీద వివాదంలో ఉన్న భూములను తక్కువ ధరకు కొనుక్కుని వివాదాన్ని పరిష్కరించుకుంటూ లక్షలు కూడబెట్టుకుంటున్నట్లు గుసగులు వినిపిస్తున్నాయి. పోలీసింగ్పై మారిన ప్రాధాన్యం..! శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పోలీస్ అధికారుల ప్రాధాన్యత మారింది. రాత్రి పూట పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. విజుబుల్ పోలీసింగ్ లేక పట్టపగలే చోరీలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్సింగ్ పోలీసింగ్కు మొదటి ప్రాధాన్యం అని ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పోలీస్ శాఖలో అక్రమాలకు పాల్పడుతు న్న కొంత మంది అధికారులపై చర్యలు తీసుకుంటే శాఖ గాడిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కేసుల నమోదు ఇలా.. ట్రైసిటీ పరిధిలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మూడు నెలల్లో ఐదు చైన్స్నాచింగ్ కేసులు నమోదయ్యయి. ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. చోరీ కేసులు సుమారు 36 చోటుచేసుకున్నాయి. లక్షల రూపా యల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైంది. సీసీఎస్లో సంవ త్సరాల తరబడి పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కారణంగా రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న, విక్రయిస్తున్న వ్యాపారులపై 47 కేసులు నమోదు చేశారు. అలాగే 19 మహిళల కిడ్నాప్ కేసులు, 22 అత్యాచారం కేసులు, 91 వేధింపుల కేసులు నమోదయ్యాయి. కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు చైన్ స్నాచింగ్ : 5చోరీలు : 36గంజాయి రవాణా మహిళల కిడ్నాప్అత్యాచారం 22 వేధింపులు 91కొత్త పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు సమస్యల సవాళ్లు వదలని గంజాయి మత్తు.. పట్టపగలే చైన్స్నాచింగ్లు భూపంచాయితీలకే ప్రాధాన్యం అడ్రస్ లేని పోలీసింగ్..? ఎన్ఫోర్స్మెంట్పై కసరత్తు కరువు గంజాయి మత్తుతో కిక్కు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు గ్రామాల్లోనూ గంజాయి మత్తు కిక్కు ఎక్కిస్తోంది. ట్రైసిటీ పరిధిలో అనేక హాస్టళ్లలో గంజాయి గుట్కాల మాదిరిగా సులువుగా లభిస్తున్నదని పోలీసులు గ్రహించినప్పటికీ అరికట్టడంలో విఫలమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో తరగతి గదుల్లో తన్నుకున్నారు. గ్రామాల్లో అనేక మంది యువకులు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. గతంలో ఇక్కడ సీపీగా పనిచేసిన తరుణ్ జోషి గంజాయి అమ్మకాలపై దృష్టిసారించారు. గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గంజాయి బానిసైన సుమారు 100 మంది యువతను రిహాబిటేషన్ సెంటర్కు తరలించి వారిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి వరంగల్ మీదుగా మహారాష్ట్రకు తరులుతోంది. ఈ రవాణాను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పట్టపగలే చైన్ స్నాచింగ్లు.. కమిషనరేట్ పరిధి ట్రైసిటీలో పట్టపగలే చైన్స్నాచింగ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో ఆరు చైన్స్నాచింగ్లు చోటుచేసుకోవ డం గమనార్హం. ఒక పక్క పోలీస్ అధికారులు బ్లూకోల్ట్ సిబ్బంది విజుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నదానికి విరుద్ధంగా పట్టపగలే చోరీలు జరగడం గమనార్హం. 1947 -
న్యాయవాదులు నైతిక విలువలు కలిగి ఉండాలి
వరంగల్ లీగల్: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య పేర్కొన్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ‘లా అండ్ హ్యూమన్ రైట్స్’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదులకు చట్టాలపై అవగాహన, అమలు చేసే విధానాలపై వారి అనుభవాలను తెలుపుతూ రాష్ట్ర జల వివాదాల చట్టం గురించి వివరించారు. అనంతరం ఉభయ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ నారాయణను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు జీవన్గౌడ్, యం.రమేశ్బాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేడు రక్తదాన శిబిరం
హన్మకొండ అర్బన్ : తలసేమియా బాధిత పిల్లల కోసం నేడు(మంగళవారం) హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఐడీఓసీ మొదటి అంతస్తు ఎఫ్–1లోని జిల్లా ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ట్లు డీటీఓ ఆకవరం శ్రీనివాస్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, టీజీఓస్, టీఎన్జీఓస్, డీఆర్డీఏ, ట్రెసా, క్లాస్–4, అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, బా ధ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 309 మంది గైర్హాజరుసాక్షి వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగాయి. జనరల్ కోర్సుకు 5,568 మందికిగాను 5,342 మంది విద్యార్థులు హాజ రయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరైన ట్లు ఇంటర్ విద్యాధికారి శ్రీధర్సుమన్ తెలిపా రు. ఒకేషనల్ విద్యార్థులు 939 మంది కాగా 856 మంది పరీక్షకు హాజ రవ్వగా 83మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. టెక్నికల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 28న నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం పలువు రు నామినేషన్లను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి డాక్టర్ పుల్లా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఎన్.రాము, ఉపాధ్యక్షుడిగా మెట్టు రవి, జాయింట్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా వై.రవికుమార్, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్గా వై.బాబు, కోశాధికారిగా వి.ప్రేమ్సాగర్ నామినేషన్లను యూనివర్సిటీ కళాశాల ప్రిన్సి పాల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.మనోహర్కు అందజేశారు. ఈనెల 20వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నేటినుంచి జాతీయ సదస్సుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ తుమ్మల రాజమణి తెలిపారు. ‘ఇండియన్ కాన్సిట్యూషన్ మైల్స్టోన్స్–ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై యూనివర్సిటీ సెనేట్హాల్లో సదస్సు ఉంటుందని వెల్లడించారు. క్రైమ్ డీసీపీగా జనార్దన్ బాధ్యతలువరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్లో ఎస్సైగా, ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా పనిచేశారు. క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు జిల్లా కోర్టు జీపీగా నర్సింహారావు వరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది(గవర్నమెంట్ ప్లీడర్)గా కాకిరాల నర్సింహారా వును నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ వ్యవహా రాలు, న్యాయపాలన సెక్రటరీ ఆర్.తిరుపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం కుందూరుకు చెందిన నర్సింహా రావు 33 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. -
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 309 మంది గైర్హాజరు
సాక్షి వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగాయి. ఈపరీక్షల్లో జనరల్ కోర్సుకు 5,568 మందికిగాను 5,342 మంది విద్యార్థులు హాజరయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 939 మంది కాగా.. 856 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా.. 83 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కష్టపడి చదివి.. కొలువు సాధించి..నల్లబెల్లి: తల్లి అంగన్వాడీ టీచర్. తండ్రి పసిప్రాయంలోనే దూరమయ్యాడు. తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఆమె ఇష్టపడి చదివింది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేరై గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమాధికారిగా ఉద్యోగం సాధించింది.. నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జకినపల్లి అనూష. భద్రాద్రి జోన్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 2వ ర్యాంకు సాధించింది. నల్లబెల్లి మండలం మేడపల్లిలో ఆమె తల్లి ఊర్మిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. తల్లి ప్రోత్సాహంతో నెల రోజులు ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఉద్యోగం సాధించింది. రాంపూర్ సర్పంచ్ చింతపట్ల సురేశ్, స్థానికులు ఆమెను అభినందించారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కుష్ఠు వ్యాధిపై అవగాహనగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ఽకీర్తినగర్లో యూపీహెచ్సీలో కుష్ఠు వ్యాధి నిర్ధారణ సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆచార్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కుష్ఠు నిర్ధారణ సర్వే కోసం 665 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈకార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చేపట్టే సర్వేలో ప్రజలు సహకరించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి, స్థానిక వైద్యాధికారి అఖిల్, డీపీఎంఓ అనుపమ, సీఈఓ వైకుంఠం, ఆశ, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు. క్రైమ్ డీసీపీగా జనార్దన్ బాధ్యతలు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్లో ఎస్సైగా, ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా పనిచేశారు. క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలువర్సిటీల అభివృద్ధికి నిధులు.. రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనకు కేంద్రం నిధులు కేటాయించాలని వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. వాతావరణం జిల్లాలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీచే అవకాశం ఉంది. – 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
కంఠమహేశ్వరుడికి జలాభిషేకం
సంగెం: మండలంలోని లోహితలో కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం గౌడకులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వరస్వామికి ఇంటింటి నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహించారు. పర్వతగిరి మండలంలో.. పర్వతగిరి: పర్వతగిరి మండలం వడ్లకొండలో కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి కల్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా గుడి నిర్మించి ఐదు రోజులైన సందర్భంగా సోమవారం బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో తరలి వచ్చి కంఠమహేశ్వరస్వామి శ్రీసూరమాంబదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, పూజారి ఏరుకొండ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షుడు పట్టాపురం భిక్షపతిగౌడ్, కుల పెద్ద మనుషులు పట్టాపురం ఎల్ల్లాగౌడ్, మంగాపురం ప్రభాకర్, పట్టాపురం రాజు, రమేశ్, దేవేందర్, బాలే రాజు, రంగు కుమారస్వామి, సారంగం, మందాపురం భిక్షపతి, పట్టాపురం అశోక్, అనిల్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
దుగ్గొండి: మండలంలోని కేశవాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆరు రోజులుగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి శ్రీదేవి, భూదేవి, సహిత వేంకటేశ్వర స్వామివార్లకు చక్రస్నానం చేయించారు. సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ద్వాదశావరణం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బ్రహ్మణోత్తములకు సన్మానం నిర్వహించి ఉత్సవాలను ముగించారు. చివరి రోజు బ్రహ్మోత్సవాలకు దుగ్గొండి, ఆత్మకూరు మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతితో పాటు ఉచిత అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఆలయ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ధర్మకర్తలు జితేందర్రెడ్డి, మనోహర్రెడ్డి, అభినయ్రెడ్డి, ఆలయ ఈఓ కిరణ్కుమార్, ఉద్యోగి అశోక్, అర్చకులు దేశికన్చార్యులు, రంగనాథ్, ప్రదీప్, సాగర్స్వామి పాల్గొన్నారు. -
మేడమ్.. కనికరం చూపండి
ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు● తక్షణమే పరిష్కారం చూపాలి.. అర్జీదారులను గౌరవించాలి ● అధికారులకు కలెక్టర్ సత్యశారద ఆదేశం ● గ్రీవెన్స్కు 94 దరఖాస్తులు ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగురాలి పేరు బి.కల్పన. ఈమెది దుగ్గొండి మండలం లక్ష్మీపురం. 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆమె తండ్రికి ప్రభుత్వ పెన్షన్ ఉందన్న కారణంతో ఈమెకు పింఛన్ తిరస్కరించారు. రుమాటిక్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న ఈమె ప్రతీ నెల రూ.2,500 మందుల కోసం ఖర్చు చేస్తోంది. ఆమె తండ్రి క్యాన్సర్ పేషెంట్. తల్లి నడుం నొప్పితో బాధపడుతోంది. తండ్రికొచ్చే పెన్షన్ మొత్తం ఆస్పత్రి ఖర్చులకే సరిపోతోందని.. బతకడం కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను బీఈడీ పూర్తి చేసి టెట్లో అర్హత సాధించానని.. తనపై కనికరం చూపి జీవనభృతి కల్పించాలని వేడుకుంటోంది.ఇలా.. దివ్యాంగురాలు కల్పన ఒక్కరే కాదు. ప్రజావాణిలో ఆమెలాంటి ఎందరో సోమవారం అర్జీలు పెట్టుకుంటున్నారు. అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. పరిష్కారం చూపడంలో మాత్రం జాప్యం జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి.. ఫిర్యాదుదారులను గౌరవించాలి అని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి పలు సమస్యలపై 94 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సీఎం ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 20, పోలీసు శాఖకు 11, వైద్య ఆరోగ్యశాఖ 7, పౌర సరఫరాల శాఖ 7, కలెక్టరేట్ 6, జీడబ్ల్యూఎంసీ–6, విద్యాశాఖ–4 దరఖాస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించి పలు సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వేసవి పనులపై అధికారులతో సమీక్ష కలెక్టర్ సత్యశారద మండల ప్రత్యేకాధికారులతో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేపడుతున్న చర్యలు, విద్యుత్ సరఫరా, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి తదితరులున్నారు. -
ఆదివాసీలను అడవినుంచి వెళ్లగొట్టే కుట్ర
గీసుకొండ: అడవులే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు అటవీ సంపదను దోచి పెట్టాలని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పకొట్టాలని ఆదివాసీ తోటి తెగ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాన్పాకలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా తోటి తెగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మారణ హోమం సృష్టిస్తున్నారన్నా రు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆదివాసీలు, మైదాన ప్రాంత గిరిజనులు పోరాడాలన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్, నాయకులు సోమ సాంబయ్య, మధు, హెడ్మాకి వీరయ్య, సోమ నాగరాజు, సోయం శరత్బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ తోటి తెగ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు -
12 గంటలు.. నిర్విరామ సంగీత విభావరి
హన్మకొండ కల్చరల్: తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్లో స్థానం పొందడానికి ప్రముఖ గాయకుడు టీవీ రమేశ్, మాధవి గాయనీగాయకులతో కలిసి 12 గంటల పాటు నిర్విరామంగా సంగీ త విభావరి నిర్వహించారు. ఆదివారం ఉద యం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ రికార్డ్ జ్యూరీ మెంబర్ టీవీ అశోక్కుమార్, ప్రముఖ సంగీత విద్వాంసులు తిరుపతయ్య, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం, తొగరు శ్రీనివాస్, చంద్రశేఖర్, పరమేశ్వరి, వనపర్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలివిద్యారణ్యపురి: ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఆ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చిన సీపీఎస్ విధానం రద్దు, ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల కుమారస్వామి, చంద్రగిరి లక్ష్మ య్య, జిల్లా కార్యదర్శి గొడిశాల రమేశ్, బాధ్యులు భిక్షపతి, భాస్కర్, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మల ఐక్యతకు కృషి హన్మకొండ: విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని స్వగృహంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న దాసోజు శ్రావణ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ సంఘీయుడు తమ పేరు చివరన విశ్వకర్మగా రాసుకోవాలని, అలాగే పిలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మదన్మోహన్, గౌరవాధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో శశాంక్కు గోల్డ్ మెడల్కాజీపేట అర్బన్: 31వ డివిజన్ న్యూశాయంపేటకు చెందిన సెయింట్ పీటర్స్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న గుజ్జేటి శశాంక్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈనెల16న ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి 14వ ఓపెన్ పోటీల్లో శశాంక్ 48 కేజీల విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. తైక్వాండో పోటీల్లో ప్రత్యేకతను చాటుతూ జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ సాధించడమే తన లక్ష్యమని శశాంక్ చెబుతున్నాడు. -
చారిత్రక కట్టడాల్ని కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్: చారిత్రక కట్టడాలు, చరిత్ర మరుగున పడిపోకుండా కాపాడుకోవాలని భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయాన్ని లక్ష్మీనారాయణ దంపతులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, అర్చకులు జస్టిస్ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివా రికి సహస్రనామార్చన నిర్వహించుకున్న అనంతరం గంగు ఉపేంద్రశర్మ వారికి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను, మహదాశీర్వచనం అందజేసి ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించారు. వారు ఆలయ పరిక్రమ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయ శిల్ప సంపదను, కల్యాణ మండపాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి, మట్టెవాడ పోలీసులు, దేవాలయ సిబ్బంది మధుకర్, తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి దేవాలయం సందర్శన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దంపతులు భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు ఆయనను స్వాగతించారు. జస్టిస్ దంపతులు ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం అందజేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు -
తిరస్కరించినా.. అధికార భావనే..
ఎల్కతుర్తి: ‘పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారంలో ఉన్నామనే భావన నుంచి నాయకులు బయటకు వస్తలేరు.. విమర్శలు చేయడం కాదు.. ప్రభుత్వానికి సలహాలిస్తే వాటిని పాటిస్తాం’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ము ల్కనూరులో నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులను ఆయన ఆదివారం పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులతో ముల్కనూరు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహా నికి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర నేతలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్, రోడ్డు అథారిటీ అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఎంపీ బండి సంజయ్ సహకారంతో మండలానికి నవోదయ స్కూల్ ప్రాసెస్ నడుస్తున్నదని, అలాగే పీవీ నరసింహా రావు మెమోరియల్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వేసవి సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేశామని, ధర్మసాగర్ రిజర్వాయర్ పంపింగ్ నడుస్తున్నదని తెలి పారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి వెంట నాయకులు కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాశ్, అశోక్ముఖ ర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఎజ్రా, కుడికందుల రాజు, చంద్రశేఖర్గుప్తా, మాచర్ల సదానందం తదితరులు ఉన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఆకట్టుకున్న ఫ్లాష్ మాబ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేని పురస్కరించుకొని ఆదివారం ఫ్లాష్ మాబ్, ట్రెడిషనల్ డేను నిర్వహించారు. విద్యార్థుల మెహందీ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫొటోప్రేమ్లు సుందరంగా తయారు చేశారు. కళాశాల ఆవరణలో ఫ్లాష్మాబ్తో అదరగొట్టారు. అలాగే నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు కళాశాల వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్డే అండ్ కల్చరల్ డేను కూడా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ తెలిపారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలో రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించను న్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనానికి ఆయ న ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మా ట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చుతుందని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రూ.200 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీ ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వీడి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా అనిత రా మకృష్ణ, మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కుంకుమేశ్వరాలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీ నివా స్, కట్కూరి దేవేందర్రెడ్డి తదితరులున్నారు. -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
హైదరాబాద్తో
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులుసాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ/స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా.. ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వరంగల్కు రింగ్రోడ్డు వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్ నుంచి క్లియరెన్స్ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్ సర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు.. జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్.. ఆ టెక్నిక్ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్కు పంపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్రావు, కవితకు ఫామ్హౌస్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు. న్యూస్రీల్ పక్కాగా సంక్షేమ పథకాల అమలు మామునూరు ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఘనతే.. ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్గా ఓరుగల్లుకు ప్రాధాన్యం.. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం -
పోటీ పడేలా..
వరంగల్సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025హైదరాబాద్తో ‘రవాణా భత్యం’ మంజూరు దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం మంజూరు చేసింది. డిమాండ్ ఎంతైనా.. సరఫరా చేస్తాం వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నా.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు. – 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులున్యూస్రీల్ -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
సకాలంలో పన్నులు చెల్లించాలి
నర్సంపేట: సకాలంలో ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని రీజినల్ డైరెక్టర్, అప్పిలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) షాహిద్మసూద్ సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జోనా అధ్యక్షతన ఆదివారం నిర్వహిహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండిబకాయిలు ఉన్న వారి నుంచి త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్లైసెన్స్ ఫీజు లు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు విష్ణువర్ధన్ ఖానాపురం: జాతీయస్థాయి కబడీ పోటీలకు మండలంలోని అశోక్నగర్ గ్రామానికి చెందిన యువకుడు జన్ను విష్ణువర్ధన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ ఖానాపురం జోన్ సెక్రటరీ గాదెపాక బాబు మాట్లాడుతూ గత నెలలో వికారాబాద్ జిల్లాలో జరిగిన సబ్జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విష్ణువర్ధన్ పాల్గొన్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, త్వరలో బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. అనంతరం యువకుడిని కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, స్థానికులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో గీతకార్మికుడి మృతి రాయపర్తి: రోడ్డు ప్రమాదంలో గీతకార్మికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రవణ్కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తరాయపర్తికి చెందిన బొమ్మెర సతీశ్(38) గీత వృత్తిని ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చా డు. అనంతరం మండల కేంద్రం శివారులోని కేసీఆర్కాలనీ వైపు పని నిమిత్తం వచ్చి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘట నలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో ఆదివారం తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రంగశాయిపేటకు చెందిన కేడల సురేశ్ తన కుటుంబంతో జాతరకు వచ్చాడు. షాపింగ్ చేస్తున్న క్రమంలో ఆయన మూడేళ్ల కుమారుడు జస్విత్చంద్ర తప్పిపోయాడు. తమ కుమారుడు తప్పిపోయాడని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో గీసుకొండ ఇన్స్పెక్టర్ మహేందర్ వెంటనే స్పందించారు. ఎస్సై కుమార్తో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గీసుకొండ ఇన్స్పెక్టర్, ఎస్సై, సిబ్బందికి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడి ఆచూకీ లేదు రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వాల్ జిల్లా రేణి గ్రామానికి చెందిన కొందరు ఆట వస్తువులు అమ్ముకోవడానికి 2020 మార్చిలో కొమ్మాల జాతరకు వచ్చారు. వారిలో భగర్య ధర్మవీర్–సీత దంపతుల కుమారుడు ప్రదీప్(6) జాతరలో ఆడుకుంటూ వెళ్లి తప్పిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీస్శాఖ చేయ ని ప్రయత్నం లేదు. బస్సులకు, పలు ప్రాంతాల్లో గోడలకు పోస్టర్లు అంటించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించింది. జాడ చూపిన వారికి రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని అప్పటి ఏసీపీ నరేశ్కుమార్ ప్రకటించారు. అయినా బాలుడు ప్రదీప్ ఆచూకీ నేటికీ లభించలేదు. -
అయ్యో పాపం.. అటవీ జంతువులు
పాకాల సమీపంలో వేటగాళ్లు వదిలివెళ్లిన వన్యప్రాణి కళేబరాన్ని పరిశీలిస్తున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, స్థానికులుఅడవి అంటే.. కొండలు, కోనలు.. గలగల పారే వాగులు, వంకలు, నదులు, సెలయేళ్లు, ఆకాశాన్ని తాకే చెట్లు, ఆకర్షించే పచ్చదనం. వీటన్నింటిపై ఆధారపడి జీవించే జంతువులు ఎన్నో ఉంటాయి. ప్రస్తుతం అటవీ సంపద తరిగిపోతోంది. ముఖ్యంగా వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. వేసవిలో దాహం కోసం మైదాన ప్రాంతాలకు వెళ్తున్న వన్య ప్రాణులను వేటగాళ్లు బలి తీసుకుంటున్నారు. దీంతో జీవవైవిధ్యం దెబ్బతిని, కాలాల్లో మార్పులు కూడా సంభవిస్తున్నాయి. నర్సంపేట: వన్యప్రాణులు దాహార్తికి అల్లాడుతున్నాయి. నీటి కోసం మైదాన ప్రాంతాలకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ప్రస్తుతం ఎండా కాలంలో తాగునీటి సమస్య కూడా వారికి కలిసివస్తోంది. అటవీశాఖ అధికారులు వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు జిల్లాల్లో పాకాల అభయారణ్యం.. ఖానాపురం మండలంలోని పాకాల అభయారణ్యం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం, వరంగల్ జిల్లా ఖానాపురం, నర్సంపేట, ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి వన్యప్రాణులకు పాకాల సరస్సు ఆయువుపట్టుగా ఉంటుంది. సరస్సు కాల్వలో పారే నీటిని తాగి అవి జీవనం గడుపుతున్నాయి. అయితే, ప్రస్తుతం నీటి వనరులు తగ్గడంతో దుప్పులు, కుందేళ్లు, జింకలు, అడవి పందులు, కొండగొర్రెలు తదితర జంతువులు నీటి కోసం మైదాన ప్రాంతాలకు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పట్టణాల్లో మాంసం విక్రయాలు.. ఇలా బలి తీసుకున్న అటవీ జంతువుల మాంసాన్ని నర్సంపేట, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ తదితర పట్టణాల్లో విక్రయిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల వేటగాళ్లు మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎవరికి అనుమానం రాకుండా సంచులు, పెద్ద పెద్ద టిఫిన్ బాక్సులు తదితర వాటిల్లో తరలిస్తున్నారు. జంతువు ఆధారంగా కిలో మాంసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. పక్కా ప్లాన్తో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరిగిపోతున్న అటవీ సంపద విలువైన కలప, వన్యప్రాణులు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అందరూ కృషిచేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటవీ సంపద రోజు రోజుకు తరిగిపోతోందని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ప్రారంభంలో గుంతలు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అటవీ జంతువులు దప్పిక తీర్చుకునేందుకు రోడ్లు, గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేల సమీపానికి వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు వాటిని హతమార్చి మాంసం విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులకు నీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పాకాలలో ఆటోకు ప్రమాదం కొండగొర్రె, కనుజు కళేబరాల స్వాధీనం నలుగురిపై కేసు నమోదు : ఎఫ్ఆర్ఓ కొండగొర్రె, కనుజు కళేబరాలను ఆటోలో తరలిస్తుండగా ఖానాపురం మండలంలోని పాకాలలో ఆదివారం ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఉచ్చుల సాయంతో చంపిన కొండగొర్రెతోపాటు కనుజు కళేబరాలను ఆటోలో తరలిస్తున్నారు. పాకాల చెక్పోస్ట్ సమీపంలోకి రాగానే నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వస్తున్న బస్సును ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. దీంతో ఒక యువకుడికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సులోని ప్రయాణికులు కిందకు దిగి చూశారు. భయాందోళనకు గురైన సదరు వ్యక్తులు ఆటోలో ఉన్న కొండ గొర్రెతోపాటు కనుజును అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ రవికిరణ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి కొండగొర్రె, కనుజు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాలలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా చిలుకమ్మనగర్కు చెందిన సుధీర్, సుమన్, అశోక్నగర్కు చెందిన ఏకాంబరం, కొత్తగూడ మండలం మొండ్రాయికి చెందిన లవన్కుమార్ అటవీ జంతువులను చంపి తరలిస్తున్నట్లు గుర్తించారు. సుధీర్ను అదుపులోకి తీసుకొని విచారించగా మిగతా వారి వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. చిలుకమ్మనగర్లోని సుమన్ వద్దకు వెళ్లగా వేలు విరిగి ఉండడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండగొర్రె, కనుజు కళేబరాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ రవికిరణ్ తెలిపారు. మండుతున్న ఎండలతో తాగునీటికి ఇబ్బందులు మైదాన ప్రాంతాలకు రావడంతో ప్రాణాలు తీస్తున్న వేటగాళ్లు నీటి వసతి కల్పించడంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం -
చట్టంపై అవగాహన తప్పనిసరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే కాజీపేట అర్బన్: ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే తెలిపారు. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని సఖి వన్స్టాప్ సెంటర్లో శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొన్న వస్తువులు నాణ్యతగా లేకపోయినా, కల్తీ జరిగినా.. డబ్బులు చెల్లించి పొందే సేవల్లో లోపాలున్నా.. వినియోగదారుల పరిష్కార కమిషన్ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. వస్తువుల కొనుగోలులో మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ 1915కు లేదా 88000 01915కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, బీఐఎస్–కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని వినియోగదారుల సమన్వయ సమితి అద్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, సఖిసెంటర్ అడ్మిన్ హైమావతి, సీడీపీఓ విశ్వజ, ఇందిర, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో 359 మంది గైర్హాజరువిద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శనివారం 359 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 16,918 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 యూజీసీ ముసాయిదాను వెనక్కితీసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు పి.మహేశ్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్, కోశాధికారి పవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, పీడీఎస్యూ నాయకులు గణేశ్, పండు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు మెటార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాంరెడ్డి శనివారం తెలిపారు. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎంవీ (హెవీ మోటర్ వెహికిల్), ఎల్ఎంవీ(లైట్ మోటర్ వెహికిల్) డ్రైవింగ్ శిక్షణను టజీఆర్టీసీ సౌజన్యంతో తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈనెల 31 లోపు హనుమకొండ కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నేడు అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనంహన్మకొండ: మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఈనెల 16న ‘అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హనుమకొండ హంటర్ రోడ్లోని డీ కన్వెన్షన్ మినీ హాల్లో ఈసమ్మేళనం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటల్ బీహారీ వాజ్పేయి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మజారే.. మండి బజారే!
శనివారం రాత్రి మండిబజార్లో కిక్కిరిసిన జనంముక్కుపుటాలదిరేలా మాంసాహార వంటకాలు. మనసుకు హత్తుకునేలా అత్తరు సువాసనలు.. చూపుతిప్పనివ్వని బ్యాంగిళ్లు. ఆహార్యానికి అందం తెచ్చే కుర్తా పైజామాలు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు. అవన్నింటికీ కేరాఫ్ మన మండి బజార్. నగరానికి ఐకాన్గా నిలుస్తున్న ఈ ప్రాంతం ఓ మినీ చార్మి నార్. రంజాన్ వేళ రాత్రి సైతం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, వరంగల్రంజాన్ సమయంలో మండిబజార్లో దొరికే తినుబండారాలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటి కబాబ్, ఫిష్ కబాబ్, చికెన్–65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. చికెన్ రోల్, 65 రోల్, మెజెస్టిక్, స్టిక్ చికెన్, బంజారా చికెన్, కేఎఫ్సీ చికెన్, మటన్ హలీమ్, చికెన్ హరీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అతారీ చికెన్, మలై చికెన్, సాదిక్ ముర్గీ వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహారప్రియుల నోరూరిస్తున్నాయి. సోరకాయ స్వీట్, డబుల్కమీటా, బాదమ్కా కీర్, గుమ్మడికాయ స్వీట్లు తెగ తినేస్తున్నారు. కాజు, బాదం, పిస్తాలు కలిపి తయారుచేసే సన్రైజ్ ఫుటింగ్ కేక్, ఐస్క్రీమ్లు ఇక్కడ ప్రత్యేకం అని దుకాణాదారులు చెబుతున్నారు. అలాగే మహబత్కా షర్బత్ (పాలలో పుచ్చకాయ రసం మిక్స్ చేస్తారు)కు కూడా ఆహారప్రియులు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. నోరూరిస్తున్న రంజాన్ స్పెషల్స్.. -
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కునేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన జనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46 కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచాయి. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. – 8లోu రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళాశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు 1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
మజారే.. మండి బజార్!
శనివారం రాత్రి మండి బజార్లో కిక్కిరిసిన జనంముక్కుపుటాలదిరేలా మాంసాహార వంటకాలు. మనసును హత్తుకునేలా అత్తరు సువాసనలు.. చూపుతిప్పనివ్వని బ్యాంగిళ్లు. ఆహార్యానికి అందం తెచ్చే కుర్తా పైజామాలు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు. అవన్నింటికీ కేరాఫ్ మన మండి బజార్. నగరానికి ఐకాన్గా నిలుస్తున్న ఈ ప్రాంతం ఓ మినీ చార్మి నార్. రంజాన్ వేళ రాత్రి సైతం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, వరంగల్రంజాన్ సమయంలో మండి బజార్లో దొరికే తినుబండారాలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటి కబాబ్, ఫిష్ కబాబ్, చికెన్–65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. చికెన్ రోల్, 65 రోల్, మేజిస్టిక్, స్టిక్ చికెన్, బంజారా చికెన్, కేఎఫ్సీ చికెన్, మటన్ హలీమ్, చికెన్ హరీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అతారీ చికెన్, మలై చికెన్, సాదిక్ ముర్గీ వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. సోరకాయ స్వీట్, డబుల్కమీటా, బాదమ్కా కీర్, గుమ్మడికాయ స్వీట్లు తెగ తినేస్తున్నారు. కాజు, బాదం, పిస్తాలు కలిపి తయారుచేసే సన్రైజ్ ఫుటింగ్ కేక్, ఐస్క్రీమ్లు ఇక్కడ ప్రత్యేకం అని దుకాణాదారులు చెబుతున్నారు. అలాగే మహబత్కా షర్బత్ (పాలలో పుచ్చకాయ రసం మిక్స్ చేస్తారు)కు కూడా ఆహారప్రియులు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. నోరూరిస్తున్న రంజాన్స్పెషల్స్.. -
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కునేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనజనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46 కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శిస్తారు. అలాగే.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు.. సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈరెండు రూట్లలో పోలీసుల నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా.. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచాయి. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. – 8లోu రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయల్దేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు. ఒంటి గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు. 1.25 గంటల నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయల్దేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
చట్టంపై అవగాహన తప్పనిసరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే కాజీపేట అర్బన్: ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే తెలిపారు. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని సఖి వన్స్టాప్ సెంటర్లో శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొన్న వస్తువులు నాణ్యతగా లేకపోయినా, కల్తీ జరిగినా.. డబ్బులు చెల్లించి పొందే సేవల్లో లోపాలున్నా.. వినియోగదారుల పరిష్కార కమిషన్ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. వస్తువుల కొనుగోలులో మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ 1915కు లేదా 88000 01915కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, బీఐఎస్–కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని వినియోగదారుల సమన్వయ సమితి అద్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, సఖిసెంటర్ అడ్మిన్ హైమావతి, సీడీపీఓ విశ్వజ, ఇందిర, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో 359 మంది గైర్హాజరువిద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శనివారం 359 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 16,918 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా సహకరించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా అధికారులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కోరారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ట్రైనింగ్ సెంటర్లు, పాల డెయిరీల ఏర్పాటులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలో మహిళలు, యువత ఉపాధి సాధించేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు కుట్టు శిక్షణ, ఇతర సాంకేతిక పథకాలను విస్తృతంగా అందించాలని సూచించారు. రైతులతో ఏర్పాటైన సొసైటీలను ప్రోత్సహించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 4న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేళాకు 50కి పైగా.. ప్రముఖ సంస్థలు, కంపెనీలు హాజరుకానున్నట్లు నియోజకవర్గ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
కొమ్మాలకు పోటెత్తిన భక్తజనం
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర జోరుగా సాగుతోంది. శనివారం రెండో రోజు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. హోలీ రోజు అర్ధరాత్రి వరకు రాజకీయ ప్రభలు పెద్దఎత్తున జాతరకు తరలిరావడంతో వరంగల్–నర్సంపేట రహదారిపై వాహనాలు గంటల కొద్ది నిలిచిపోయాయి. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలోని గిర్నిబావి ప్రాంతం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంసీపీఐ(యూ) ప్రభలు అధిక సంఖ్యలో జాతరకు పోటెత్తాయి. ప్రభల ముందు గిరిజన మహిళలు, యువతులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఏస్ఈ కరుణాకర్రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, జాతరకు సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారని, ఈ నెల 18న రాత్రి 10 గంటలకు స్వామి వారి రథ్సోవాన్ని నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాల ని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు కోరారు. రెండో రోజూ లక్ష మంది దర్శనం రాజకీయ ప్రభలతో ట్రాఫిక్ జాం -
ఆకట్టుకుంటున్న వైరెటీలు
మహిళల షాపింగ్ కోసం మండిబజార్లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఢిల్లీ, ఆగ్రాల నుంచి బ్రైడల్ వెడ్డింగ్ వియర్ చీరలు, కుర్తా పైజామాలు ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, పట్టు శారీస్, రెడీమేడ్, కిడ్స్వేర్, బ్యాంగిళ్లు, చెప్పులు, జ్యువెల్లరీ వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. రంజాన్ నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. అలాగే మహిళలు విభిన్న డిజైన్లతో కూడిన గాజులు, ముత్యాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు, యువతకు సంబంధించిన వైరెటీ దుస్తులు కూడా అందుబాటులో ఉండడంతో షాపింగ్ చేస్తున్నారు. -
మజారే.. మండి బజారే!
శనివారం రాత్రి మండిబజార్లో కిక్కిరిసిన జనంముక్కుపుటాలదిరేలా మాంసాహార వంటకాలు. మనసుకు హత్తుకునేలా అత్తరు సువాసనలు.. చూపుతిప్పనివ్వని బ్యాంగిళ్లు. ఆహార్యానికి అందం తెచ్చే కుర్తా పైజామాలు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు. అవన్నింటికీ కేరాఫ్ మన మండి బజార్. నగరానికి ఐకాన్గా నిలుస్తున్న ఈ ప్రాంతం ఓ మినీ చార్మి నార్. రంజాన్ వేళ రాత్రి సైతం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, వరంగల్రంజాన్ సమయంలో మండిబజార్లో దొరికే తినుబండారాలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటి కబాబ్, ఫిష్ కబాబ్, చికెన్–65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. చికెన్ రోల్, 65 రోల్, మెజెస్టిక్, స్టిక్ చికెన్, బంజారా చికెన్, కేఎఫ్సీ చికెన్, మటన్ హలీమ్, చికెన్ హరీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అతారీ చికెన్, మలై చికెన్, సాదిక్ ముర్గీ వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహారప్రియుల నోరూరిస్తున్నాయి. సోరకాయ స్వీట్, డబుల్కమీటా, బాదమ్కా కీర్, గుమ్మడికాయ స్వీట్లు తెగ తినేస్తున్నారు. కాజు, బాదం, పిస్తాలు కలిపి తయారుచేసే సన్రైజ్ ఫుటింగ్ కేక్, ఐస్క్రీమ్లు ఇక్కడ ప్రత్యేకం అని దుకాణాదారులు చెబుతున్నారు. అలాగే మహబత్కా షర్బత్ (పాలలో పుచ్చకాయ రసం మిక్స్ చేస్తారు)కు కూడా ఆహారప్రియులు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. నోరూరిస్తున్న రంజాన్ స్పెషల్స్.. -
ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 యూజీసీ ముసాయిదాను వెనక్కితీసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు పి.మహేశ్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్, కోశాధికారి పవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, పీడీఎస్యూ నాయకులు గణేశ్, పండు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు మెటార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాంరెడ్డి శనివారం తెలిపారు. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎంవీ (హెవీ మోటర్ వెహికిల్), ఎల్ఎంవీ(లైట్ మోటర్ వెహికిల్) డ్రైవింగ్ శిక్షణను టజీఆర్టీసీ సౌజన్యంతో తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈనెల 31 లోపు హనుమకొండ కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నేడు అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనంహన్మకొండ: మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఈనెల 16న ‘అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హనుమకొండ హంటర్ రోడ్లోని డీ కన్వెన్షన్ మినీ హాల్లో ఈసమ్మేళనం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటల్ బీహారీ వాజ్పేయి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఆకట్టుకుంటున్న వైరెటీలు
మహిళల షాపింగ్ కోసం మండిబజార్లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఢిల్లీ, ఆగ్రాల నుంచి బ్రైడల్వెడ్డింగ్ వియర్ చీరలు, కుర్తా పైజామాలు ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, పట్టు శారీస్, రెడీమేడ్, కిడ్స్వేర్, బ్యాంగిల్స్, చెప్పులు, జ్యువెల్లరీ వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. రంజాన్ నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. అలాగే మహిళలు విభిన్న డిజైన్లతో కూడిన గాజులు, ముత్యాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు, యువతకు సంబంధించిన వైరెటీ దుస్తులు కూడా అందుబాటులో ఉండడంతో షాపింగ్ చేస్తున్నారు. -
18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ హాస్పిటిల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్(హెచ్హెచ్సీఎం) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం(ఎల్ఎస్ఎస్బీ) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీఐసెట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న వారు అంబేడ్కర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆయా తేదీల్లో నిర్వహించే అడ్మిషన్ల కౌన్సెలింగ్కు అర్హత పరీక్ష, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్లు ఒకసెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పెర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అంబేడ్కర్ వర్సిటీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి మహిళ మృతి పర్వతగిరి: ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని హట్యతండా శివారు ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన బాదావత్ నేజి(78) గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి ఎస్సారెస్పీ కాల్వలోకి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నెక్కొండ మండలం బొల్లికొండ తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలి కన్పించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూపాలపల్లి అటవీ గ్రామాల్లో మరో పులి ? భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలూ పూర్, రాంపూర్ గ్రామాల మధ్య ఫార్టెస్టు అధి కారులు శుక్రవారం పులి పాదముద్రలు గుర్తించారు. కాటారం, మండలం జాదారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతంలో చెరువుకట్టపై ఈ నెల 12న ఆవుదూడను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించాయి. పాదముద్రలు వేరేనా..? శుక్రవారం కాటారం మండలం మేడిపలి, కొత్తపల్లి గ్రామాల మీదుగా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, కమలాపూర్ అటవీ గ్రామాల మధ్య పులి అడుగుజాడలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాటారం పులి పాదముద్రలు, ఈ పులి పాదముద్రలు సరిపోకపోవడంతో మరో ఆడ పులిగా అనుమానిస్తున్నారు. కాటారం మండలంలో మగ పులి, భూపాలపల్లి మండలలో ఆడ పులి తిరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లి అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామస్తులకు పులి కనపడిన, అటవీలో ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి పులులకు ప్రమాదాన్ని కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
బతుకుదెరువుకోసం వచ్చి..
సంగెం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ భవననిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జిగురుమల్లి మండలం పాలేటిపాడు గ్రామానికి చెందిన కోయ బంగారు బాబు(34) తన భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి పొట్టకూటి కోసం సంగెం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా ఉంటూ.. భవన నిర్మాణ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనిపై తిమ్మాపూర్ గ్రామానికి తోటి మేసీ్త్ర ఉలవపాడుకు చెందిన పులగర శివమణి అలియాస్ మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి సంగెంకు వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి నెక్కొండ వైపునకు అరటిగెలలు తీసుకొచ్చేందుకు ట్రేలతో వెళ్లుతున్న బోలేరో అతివేగంగా అజాగ్రత్తగా సబ్స్టేషన్ సమీపంలో.. వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బంగారు బాబుకు కుడి చేయి, కాలుకు, శివమణికి కుడి చేయి, కుడికాలుకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బంగారుబాబు మృతి చెందగా.. శివమణి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎంజీఎంలో పోస్టుమార్టమ్ అనంతరం బంగారుబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బోలేరో వాహనం తప్పించుకుని వెళ్లగా సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మేసీ్త్ర మృతుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా పాలేటిపాడు -
గ్రూప్–3లో స్టేట్ 57వ ర్యాంక్
బచ్చన్నపేట : మండల కేంద్రానికి చిమ్ముల అరుణ–మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండగా.. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి శుక్రవారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 57వ ర్యాంక్ సాధించారు. గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్స్లో ఉత్తమ ర్యాంక్లు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
ఖానాపురం: మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత తొంబై రోజులుగా గోటితో ఒలిచిన తలంబ్రాలకు పూజారి పర్వతపు శివప్రసాద్శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవానికి తరలించారు. అక్కడ ఆలయంలో తలంబ్రాలతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరికొన్ని తలంబ్రాలను తీసుకొచ్చి కల్యాణ వేడుకలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు తెలిపారు. గూడూరు: సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగించే గోటి తలంబ్రాలను భక్తులు శుక్రవారం గూడూరు నుంచి భద్రాచలం చేర్చారు. శ్రీరామ నవమికి ముందు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాల కోసం తరలిస్తారు. ఈ క్రమంలో గూడూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి భక్తులు ధాన్యాన్ని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. హిందూ జాగరణ సమితి, సేవికా సమితి మహిళలు అందరూ కలిసి గోటి తలంబ్రాలను భద్రాచల రాములవారి దేవాలయానికి చేర్చారు. హోలీ పండుగ సందర్భంగా అక్కడ రంగులు చల్లుకొని సంబురాన్ని పంచుకున్నట్లు మహిళలు తెలిపారు. -
పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్–1, గ్రూ
చిరు వ్యాపారి బిడ్డకు మూడు ఉద్యోగాలు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిన్నహోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న డోలి వెంకటేశ్వర్లు –పద్మ దంపతులు. వారి కుమారై డోలి సంధ్య గ్రూప్–3లో 450 మార్కులకు 269.9 మార్కులతో 1,125 ర్యాంక్ సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ(ఏ) మహిళల విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. అయితే ఇప్పటీకే గ్రూప్–4లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మానుకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధుల్లో కొనసాగిస్తోంది. అదేవిధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సంధ్య 600 మార్కులకు 382.4 మార్కులతో 205 ర్యాంక్ సాధించింది. రాష్ట్రస్థాయిలో మహిళల విభాగంలో 16 స్థానం, బీసీ(ఏ)లో మహిళా విభాగంలో మొదటి ర్యాంక్ సాధించారు. గ్రూప్–2లో మంచి పోస్ట్ వస్తే ఆ ఉద్యోగంలో చేరుతానని చెబుతున్న సంధ్యను తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. గ్రూప్–3లో సత్తా చాటిన ప్రణీత్ కొడకండ్ల: గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభను చాటుకున్న కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెన్న ప్రణీత్ గ్రూప్–3 ఫలితాల్లో 285 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 395 ర్యాంక్ను సాధించి సత్తా చాటాడు. 2019లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రణిత్ సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఉండగా గ్రూప్స్ నోటిఫికేషన్లు రావడంతో వాటిపై దృష్టి సాఽరించాడు. గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణీత్ గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 138వ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభను చాటుకున్నాడు. నిరుపేద పద్మశాలీ కుటుంబానికి చెందిన ప్రణీత్ ఉత్తమ ర్యాంక్ పొందడంపై తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండుకు మించి ఉద్యోగాలుగ్రూప్స్లో మెరిసిన యువత -
కోచింగ్ లేకుండానే..
జనగామ రూరల్: జనగామ మండలం సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి కేదారేశ్వర్రెడ్డి ఎలాంటి కోచింగ్లేకుండానే ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 112వ ర్యాంక్, గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్రెడ్డి కుమారుడు కేదారేశ్వర్రెడ్డి సివిల్ సప్లయీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. ఈ సందర్భంగా కేదారేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేదారేశ్వర్రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రారంభమైన కొమ్మాల జాతర
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర హోలీ పండుగతో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యల్లో వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కొమ్మాల స్టేజీ నుంచి రాజకీయ పార్టీల ప్రభబండ్లు బయలుదేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, భక్తులు, అంబులెన్స్లలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. నిషేధం ఉన్నా కూడా జాతరలో డీజేల జోరు కొనసాగింది. కాంగ్రెస్ ప్రభను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పదేళ్లలో జాతర ఎంతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. అధికార పార్టీలోనే రెండు వర్గాలు కావడంతో జాతరలో ప్రశాంతత దెబ్బతిందన్నారు. బీజేపీ ప్రభను డాక్టర్ కాళీప్రసాద్ ప్రారంభించారు. కొండా వర్గం ప్రభను అల్లం బాలకిశోర్రెడ్డి, వీరగోని రాజ్కుమార్ ఏ ర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ప్రారంభించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నా యకులు వరద రాజేశ్వర్రావు, దొమ్మాటి సాంబయ్య, గన్నోజు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, అధికార ప్రతినిధి కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజుయాదవ్, రాంబాబు, శ్రీనివాస్, ములక ప్ర సాద్, ప్రవీణ్, పోలీస్ ధర్మారావు, బోడకుంట్ల ప్రకా శ్, జయపాల్రెడ్డి, రాజయ్య, నాగేశ్వర్రావు, భరత్ పాల్గొన్నారు. అంతకుముందు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ట్రెయినీ ఐపీఎస్ మనన్భట్, ఏసీపీ తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీనర్సింహస్వామికి భక్తుల పూజలు కొమ్మాల స్టేజీ వద్ద స్తంభించిన ట్రాఫిక్ అట్టహాసంగా రాజకీయ ప్రభలు -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
సంగెం: విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ సురేష్(27)కు భార్య రేణుక, ఇద్దరు కవలు మనోహర్, మణిదీప్, కూతురు మనీషా ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చేసుకుంటున్నాడు. తన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మొక్కజొన్నకు నీరు పారించేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్చేస్తే పని చేయకపోవడంతో ఫ్యూజులు సరిగా ఉన్నాయా.. లే దోనని ఫ్యూజులు, స్టాటర్ ఉన్న బాక్స్లో చేయి పెట్టి తీసే క్రమంలో విద్యుత్షాక్కు గురై కేకలు వేసి పడిపోయాడు. పక్క చేనులో ఉన్న అదే తండాకు చెందిన గుగులోత్ రాజు వచ్చి సురేష్ను లేపబోయేసరికి అతనికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు పడి కొట్టుకుంటుండగా మరో చేనులో ఉన్న రాజు వచ్చి దగ్గరలోని విద్యుత్ స్తంభంపై తీగలను తొలగించా డు. సురేష్ను ద్విచక్రవాహనంపై ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ముందుగా సురేష్ను కాపాడబోయిన రాజు తృటిలో ప్రా ణాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు. విద్యుత్ మోటారు ఫ్యూజులు సరిచేస్తుండగా ఘటన -
ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తా..
● గ్రూప్–3 26వ ర్యాంకర్ అజయ్కుమార్ చిట్యాల: ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తానని గ్రూప్–2 స్టేట్ 43వ ర్యాంక్ సాధించిన నల్ల అజయ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల కోంరయ్య–నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన అజయ్ కుమార్ ఒకటి నుంచి పదో తరగతి వరకు మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో చదివాడు. ఇంటర్ హనుమకొండలోని శివానీ కాలేజీలో, బీటెక్ హైదరాబాద్లో చదివాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్, కాళేశ్వరం జోన్లో 7వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2 ద్వారా వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెబుతున్నాడు.. అజయ్కుమార్. -
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి..●
● సీసీఐ సీనియర్ సెక్రటరీ దామోదర్ హన్మకొండ: వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు, సీసీఐ సీనియర్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా.. ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిదా రుడు ఇచ్చే గ్యారంటీ, వారంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. వస్తువుల్లో నాణ్యతా లోపం ఉన్నప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు. నవోదయలో హోలీ వేడుకలు!మామునూరు: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం ఉదయం హోలీ వేడుకలు జరుపుకున్నట్లు తెలిసింది. విద్యార్థులు గేటు బయటకు వెళ్లి కోడిగుడ్లు తెచ్చి హోలీ సంబురాల్లో మునిగిపోయారు. గేటు బయటకు ఎలా వెళ్లారనే దానిపై ప్రిన్సిపాల్ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా చదువుకుని పరీక్ష రాయాల్సిన సమయంలో.. వేడుకలకు ఎలా అనుమతిచ్చారనే దానిపై ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ను వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇరువర్గాల దాడులు వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో శుక్రవారం ఇరువర్గాల యువకులు పరస్పర దాడులు చేసుకున్నా రు. వివరాలిలా ఉన్నాయి. డీసీ తండా పరిధిలోని బావనికుంట తండాకు చెందిన యువకులు పట్టణంలోని మద్యం షాపులో మద్యం సేవిస్తున్నా రు. ఈ క్రమంలో యువకుల మధ్య మాటామాట పెరగడంతో ఇరువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని మళ్లీ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వెంటనే ఎస్సై చందర్ వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడుల్లో గాయపడిన బాబులాల్, వాంకుడోతు హుస్సేన్ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కొలతలు, తూకాల్లో మోసం
● సంబంధిత అధికారుల్లో నిర్లిప్తత ● నష్టపోతున్న వినియోగదారులు ● ప్రశ్నించి పోరాడితేనే దగాకు చెక్ నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సాక్షి, వరంగల్: మార్కెట్లో కొందరు వ్యాపారులు తూకాలు, కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసారాలతోపాటు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం.. వినియోగదారుల హక్కులపై ప్రచారం చేయడంలోనూ విఫలమవడం ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కమిషన్ను ఎప్పుడు ఆశ్రయించాలంటే.. ఆన్లైన్ సేవలు విస్తృతం కావడంతో ఇంటి నుంచి వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార లావాదేవీలను కూడా వినియోగదారుల రక్షణ చట్టం–2019 పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా.. వాటి వల్ల నష్టం జరిగినా.. తూకాల్లో మోసాలకు పాల్పడినా పరిహారం కోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యతలేని, కల్తీ సరుకులు విక్రయించినప్పుడు.. కాలం చెల్లిన ఔషధాలు అమ్మినా.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించినా.. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, సేవల్లో లోపం కారణంగా నష్టం వాటిల్లినా.. ఎలక్టాన్రిక్ పరికరాలు సక్రమంగా పని చేయకపోయినా.. విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు కల్తీ జరిగినా.. బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, విమానయాన సంస్థలు, బీమా సంస్థలు అందించే సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఏ ఫిర్యాదు ఎక్కడ.. ఎంత నగదు? జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (వినియోగదారుల కమిషన్) పని చేస్తుంది. జిల్లా స్థాయి ఫోరం వస్తువులు/సేవల విలువ రూ.50 లక్షల్లోపు ఫిర్యాదులు పరిష్కరిస్తుంది. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య రాష్ట్ర స్థాయి, రూ.2 కోట్లకు మించిన విలువైన ఫిర్యాదులను జాతీయ స్థాయి ఫోరం పరిష్కరిస్తుంది. వస్తు సేవల్లో నష్టపోయి పరిహారం కోరాలనుకుంటే.. వివరాలను నాలుగు ప్రతులతో దరఖాస్తు చేయాలి. వస్తువుసేవల కొనుగోలు రుజువులు జతపర్చాలి. ఫోరం ఫీజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలు ఆపైన పరిహారం కోసం రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫోరం స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వివిధ కారణాలతో తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు తనవాదన వినిపించవచ్చు. ఫోరంలో వినియోగదారుడే తన కేసును వాదించుకోవచ్చు. లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.వరంగల్కు చెందిన భద్రయ్య అనే వ్యక్తి ఓ హోల్సేల్ షాపులో కారం ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి తెరచి చూశాడు. అది కల్తీ కారం అని గుర్తించి షాపు యాజమాని వద్దకు వెళ్లి అడిగితే అతను గొడవకు దిగాడు. శివనగర్కు చెందిన శ్రీను ఆన్లైన్లో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సెల్ఫోన్ ఆర్డర్ చేశాడు. కొరియర్లో ఇంటికి వచ్చిన బాక్స్ తెరచి చూశాడు. అందులో పనిచేయని మొబైల్ ఫోన్ ఉండడంతో బిత్తరపోయాడు. -
సభా వేదిక దేవన్నపేట !
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, భట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలాన్ని పరిశీలించారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండడంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరికి దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు విజయవంతానికి త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ? -
కొమ్మాల జాతర షురూ..
గీసుకొండ: బండ్లు తిరిగే కార్యక్రమంతో శుక్రవారం మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. రాజకీయ ప్రభబండ్ల రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడి భక్తులు, అంబులెన్స్లలోని రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కాంగ్రెస్ ప్రభను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ ప్రభను డాక్టర్ కాళీప్రసాదరావు ప్రారంభించారు.విద్యుత్ దీపాల వెలుగుల్లో కొమ్మాల జాతర ప్రాంగణం (ఇన్సెట్లో) నర్సింహస్వామివారు