Warangal District News
-
రైతు పండించిన ప్రతీ గింజ కొంటాం..
పరకాల: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు. సోమవారం పరకాల మండలం నాగారం గ్రామంలో డీఆర్డీఏ, ఎస్ఈఆర్పీ పౌరసరఫరాల శాఖ, ప్రగతి గ్రామ సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో శ్రమించి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోసన్ అందిస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17శాతం తేమశాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఓ క్రాంతి, మాజీ ఎంపీపీ స్వర్ణలత, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ, మండల అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!
తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై కేసువరంగల్ క్రైం: చనిపోయిన వ్యక్తి వచ్చి భూ కబ్జా చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసుల్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూడొచ్చు. 9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి అక్రమంగా భూమిలోకి చొరబడి, బెదిరింపులకు పాల్పడినట్లు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏ–1 కింద కేసు నమోదు చేశారో పోలీస్ అధికారి. సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని పోలీస్ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా.. కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నందుకు ఇదో ఉదాహరణ. భూదందాలకు చిరునామాగా మారిన ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. తనకు నచ్చని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు, ఆపోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ కేసులో రెండు వర్గాలు రాజీకుదుర్చుకోగా.. రాజీ పడవద్దని ఒత్తిడి చేసి వివాదాస్పదుడిగా పేరు మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 21న కొంత మంది వ్యక్తులు తన భూమిలోకి అక్రమంగా చొరబడి, హద్దు రాళ్లను పీకేసి ప్లాట్ల యజమానులను చంపుతామని బెదిరించినట్లు ఓ మహిళ ఆ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే అదే రోజు పిటిషనల్లో పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025 లో ఏ–1గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి సుమారు తొమ్మిదేళ్లవుతోంది. ఎఫ్ఐఆర్ కాపీ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఎక్కడినుంచి వచ్చి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి.. హద్దు రాళ్లు పీకేసి చంపుతానని బెదిరిస్తాడని ప్రశ్నిస్తున్నారు. మృతుడి బంధువులు అడిగితే నా ఇష్టం వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తా. అవసరం అయితే నీపై (ప్రశ్నించిన వ్యక్తిపై ) కేసు పెడతానని సదరు అధికారి బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఏమీ చేయలేక సదరు అధికారిపై చిరుకోపం ప్రదర్శించి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మిస్సింగ్, చిన్న చిన్న చీటింగ్ కేసులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. అవసరం అయితే వారు చెప్పిన సెక్షన్లు వచ్చేలా కేసులు నమోదు చేయడం పోలీస్ స్టేషన్లలో అనవాయితీ. అలాంటిది ఫిర్యాదు వచ్చీ రాగానే.. కనీసం అవతలి వ్యక్తులపై ఎలాంటి విచారణ లేకుండానే, వారిని పోలీస్స్టేషన్కు పిలవకుండానే కేసులు నమోదు చేయడం సదరు అధికారికే చెల్లింది. బాధితుల భూమికి, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమానార్హం. చనిపోయిన వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్విచారించకుండానే.. చట్ట ప్రకారం.. పోలీస్స్టేషన్లలో భూదందాలకు సంబంధించిన కేసులు పట్టించుకోవద్దు. ఏది ఉన్నా న్యాయస్థానాల్ని సంప్రదించాలని సలహా ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లలో తాటికాయలంత అక్షరాలతో ‘ఇక్కడ భూ సమస్యలు పరిష్కరించబడవు. సివిల్ తగదాలకు పరిష్కారం లేదు’ అని రాసి ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం విచారణ జరపకుండా రెండు వర్గాల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేతిలో అధికారం ఉందని, కాసుల కక్కుర్తితో చనిపోయిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి నిబంధనలకు నీళ్లు వదిలారు. ఈ ఒక్క ఘటన వెలుగులోకి రాగా.. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు మరెన్ని ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే కొంత మంది పోలీసు అధికారుల కారణంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుకున్న ఘన చరిత్ర మసకబారుతోందన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి శవాలపై కేసులు పెట్టే సదరు అధికారి అక్రమ దందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రపంచం మెచ్చిన మేధావి అంబేడ్కర్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరివాడు● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రు పాషా, మాజీ మేయర్ ఎరబ్రెల్లి స్వర్ణ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభించాయన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామాల్లోని చివరి ఇంటి వరకూ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. -
సీఎం సమావేశంలో కలెక్టర్లు
వరంగల్: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య పాల్గొన్నారు. ఈసమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగు నీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ శివనగర్లోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ నెల 14 నుంచి 20వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్ను మేయర్ గుండు సుధారాణి, ఏసీపీ నందిరామ్నాయక్, డీఎఫ్ఓ కేవీ సతీశ్కుమార్, ఎస్ఎఫ్ఓ రాజేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో జమేదార్ మాధవరెడ్డి, నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్ పాల్గొన్నారు. మృత పిండం అప్పగింతఎంజీఎం: నగరంలోని రైల్వే గేట్ సమీపంలో కేవీఎన్ రెసిడెన్సీ నివాసి అయిన భావన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదకరమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు తల్లికి అపాయం జరుగుతుందని పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీ వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి ఆదేశంతో కళాశాల అనాటమీ విభాగానికి మృత పిండాన్ని అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. ట్రాక్ రెన్యువల్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ రెన్యువల్, మరమ్మతు పనులు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాక్ను తనిఖీ చేసి మరింత సమర్థవంతంగా ఉండేందుకు యంత్రాల సాయంతో మరమ్మతు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.ఏప్రిల్ 11: హనుమకొండలోని గాంధీనగర్ పోచమ్మ గుడి సమీపంలోని షామా డిస్ట్రిబ్యూటరీలో ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండానే ఐస్క్రీమ్లు ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి నిబంధనలు పాటించకుండా ఐస్క్రీమ్ తయారు చేస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు. రూ.25,740 విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు మొహమ్మద్ జాన్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 12: మడికొండలోని కనకదుర్గ కాలనీలో ఓంకార్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటరీలో టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. తయారీ, ఎక్స్ పైరీ తేదీలు ముద్రించకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.2,39,476 విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు వొల్లాల రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 14: వరంగల్ బాలాజీనగర్లోని కూల్ టచ్ ఐస్ క్రీమ్ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్ పైరీ తేదీలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.83,200ల విలువైన ఎనిమిది రకాల ఉత్పత్తులను గుర్తించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అల్లిపురం శ్రీపాల్రెడ్డిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. -
పిల్లలే బాధితులు!
సెలవుల సమయం, ఒంటిపూట బడులు ఉండడంతో పిల్లలనే టార్గెట్ చేస్తూ కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. కల్తీ, నాసిరకం ఐస్క్రీమ్లు అమ్ముతున్నారు. వీధుల్లో తిరిగే బండ్ల వద్ద, షాపుల్లో ఎక్కువ మంది పిల్లలే కొనుగోలు చేస్తున్నారు. చల్లని ఐస్క్రీం పేరిట నాసిరకం, కల్తీ ఐస్క్రీంలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. కృత్రిమ రంగులతో, కల్తీ నీరు, రసాయనాలతో తయారు చేసిన ఐస్క్రీంలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!
తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై కేసుఎఫ్ఐఆర్లో ఏ–1గా నమోదు.. ● కాసులకు కక్కుర్తి.. నిబంధనలకు నీళ్లు ● చోద్యం చూస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ● ఆ స్టేషన్లో వాళ్లది ఇష్టారాజ్యం!వరంగల్ క్రైం: చనిపోయిన వ్యక్తి వచ్చి భూ కబ్జా చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసుల్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూడొచ్చు. 9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి అక్రమంగా భూమిలోకి చొరబడి, బెదిరింపులకు పాల్పడినట్లు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏ–1 కింద కేసు నమోదు చేశారో పోలీస్ అధికారి. సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని పోలీస్ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా.. కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నందుకు ఇదో ఉదాహరణ. భూదందాలకు చిరునామాగా మారిన ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. తనకు నచ్చని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు, ఆపోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ కేసులో రెండు వర్గాలు రాజీకుదుర్చుకోగా.. రాజీ పడవద్దని ఒత్తిడి చేసి వివాదాస్పదుడిగా పేరు మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 21న కొంత మంది వ్యక్తులు తన భూమిలోకి అక్రమంగా చొరబడి, హద్దు రాళ్లను పీకేసి ప్లాట్ల యజమానులను చంపుతామని బెదిరించినట్లు ఓ మహిళ ఆ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే అదే రోజు పిటిషనల్లో పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025 లో ఏ–1గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి సుమారు తొమ్మిదేళ్లవుతోంది. ఎఫ్ఐఆర్ కాపీ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఎక్కడినుంచి వచ్చి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి.. హద్దు రాళ్లు పీకేసి చంపుతానని బెదిరిస్తాడని ప్రశ్నిస్తున్నారు. మృతుడి బంధువులు అడిగితే నా ఇష్టం వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తా. అవసరం అయితే నీపై (ప్రశ్నించిన వ్యక్తిపై ) కేసు పెడతానని సదరు అధికారి బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఏమీ చేయలేక సదరు అధికారిపై చిరుకోపం ప్రదర్శించి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మిస్సింగ్, చిన్న చిన్న చీటింగ్ కేసులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. అవసరం అయితే వారు చెప్పిన సెక్షన్లు వచ్చేలా కేసులు నమోదు చేయడం పోలీస్ స్టేషన్లలో అనవాయితీ. అలాంటిది ఫిర్యాదు వచ్చీ రాగానే.. కనీసం అవతలి వ్యక్తులపై ఎలాంటి విచారణ లేకుండానే, వారిని పోలీస్స్టేషన్కు పిలవకుండానే కేసులు నమోదు చేయడం సదరు అధికారికే చెల్లింది. బాధితుల భూమికి, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమానార్హం. చనిపోయిన వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్విచారించకుండానే.. చట్ట ప్రకారం.. పోలీస్స్టేషన్లలో భూదందాలకు సంబంధించిన కేసులు పట్టించుకోవద్దు. ఏది ఉన్నా న్యాయస్థానాల్ని సంప్రదించాలని సలహా ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లలో తాటికాయలంత అక్షరాలతో ‘ఇక్కడ భూ సమస్యలు పరిష్కరించబడవు. సివిల్ తగదాలకు పరిష్కారం లేదు’ అని రాసి ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం విచారణ జరపకుండా రెండు వర్గాల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేతిలో అధికారం ఉందని, కాసుల కక్కుర్తితో చనిపోయిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి నిబంధనలకు నీళ్లు వదిలారు. ఈ ఒక్క ఘటన వెలుగులోకి రాగా.. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు మరెన్ని ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే కొంత మంది పోలీసు అధికారుల కారణంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుకున్న ఘన చరిత్ర మసకబారుతోందన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి శవాలపై కేసులు పెట్టే సదరు అధికారి అక్రమ దందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరివాడు
హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రు పాషా, మాజీ మేయర్ ఎరబ్రెల్లి స్వర్ణ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభించాయని అన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామాల్లోని చివరి ఇంటి వరకూ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
మృత పిండం అప్పగింత
ఎంజీఎం: నగరంలోని రైల్వే గేట్ సమీపంలో కేవీఎన్ రెసిడెన్సీ నివాసి అయిన భావన తన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదకరమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు తల్లికి ఆపాయం జరుగుతుందని పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీ వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు రాగా, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి ఆదేశంతో కళాశాల అనాటమీ విభాగానికి మృత పిండాన్ని అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
చల్లని విషం!
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసాక్షి, వరంగల్: అసలే ఎండాకాలం.. ఆపై చల్లటి ఐస్ క్రీమ్.. రోడ్డుపై వెళ్తుంటే కనిపిస్తే చాలు తినకుండా ఎవరైనా ఉండగలరా? ఎండల నుంచి ఉపశమనానికని కొందరు, అలవాటుగా మరికొందరు ఐస్ క్రీమ్లు తినేస్తుంటారు. దీంతో వేసవి మూడు నెలలు ఐస్క్రీమ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈడిమాండ్ను కొంత మంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఇటీవల నగరంలో అధికారుల తనిఖీల్లో బహిర్గతమైన ఘటనలే నిదర్శనం. కాసుల కక్కుర్తితో కొంతమంది నాసిరకం, నిబంధనలు పాటించకుండా ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండానే.. కొన్ని ఐస్క్రీమ్ కంపెనీలు ఎక్స్పైరీ తేదీలను ఐస్క్రీమ్ ప్యాక్పై ముద్రించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లుగా ఇటీవల టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడుల్లో తేలింది. హానికారక, ప్రమాదకర కెమికల్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఆకర్షణీయంగా మెరిసేందుకు కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కెమికల్స్ రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కల్తీ ఐస్ క్రీమ్ తినడం వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఐస్క్రీమ్లు కొనేముందు అన్నీ చెక్ చేసుకోవాలని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. అయితే టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా కలిసి దాడి చేసి ఆహర కల్తీ పదార్థాలు పట్టుకున్న కేసులు నాలుగు నెలల్లో పది కేసులు నమోదైతే ఐదు కేసుల వరకు కల్తీ ఐస్ క్రీమ్లవే ఉండడం గమనార్హం. ఈఐదు కేసుల్లో రూ.8,69,000 కల్తీ ఐస్క్రీం ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యూస్రీల్ నిబంధనలు పాటించని ‘ఐస్’ కంపెనీలు అపరిశుభ్ర వాతావరణం.. కెమికల్స్ వినియోగం తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేకుండానే విక్రయాలు టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో వెలుగులోకి..ఏప్రిల్ 11: హనుమకొండలోని గాంధీనగర్ పోచమ్మ గుడి సమీపంలోని షామా డిస్ట్రిబ్యూటరీలో ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండానే ఐస్క్రీమ్లు ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి నిబంధనలు పాటించకుండా ఐస్క్రీమ్ తయారు చేస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు. రూ.25,740 విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు మొహమ్మద్ జాన్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 12: మడికొండలోని కనకదుర్గ కాలనీలో ఓంకార్ ఐస్క్రీమ్ డిస్ట్రిబ్యూటరీలో టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. తయారీ, ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.2,39,476 విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు వొల్లాల రవీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 14: వరంగల్ బాలాజీనగర్లోని కూల్ టచ్ ఐస్ క్రీమ్ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.83,200ల విలువైన ఎనిమిది రకాల ఉత్పత్తులను గుర్తించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అల్లిపురం శ్రీపాల్రెడ్డిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. -
మావోయిస్టులతో చర్చలు జరపాలి
ఖిలా వరంగల్: కేంద్రం కాల్పులు విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్లోని సీపీఐ తమ్మెర భవనంలో పార్టీ ఉమ్మడి జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్ శక్తులకు మేలు జరిగిందే తప్ప పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఈసీలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇటీవలే వంట గ్యాస్ ధరల ను పెంచి పేద ప్రజలపై భారం మోపారని అన్నా రు. మోదీ సర్కారు దుష్పరిపాలనకు వ్యతిరేకంగా కలిసి వచ్చే లౌకిక శక్తులతో పారాడాలని, ఈనెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్రావు, జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బి.విజయసారధి, మేకల రవి, నేదునూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
రథోత్సవం ప్రారంభం
వరంగల్ : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్ద రథోత్సవం ప్రారంభమైంది. స్థానిక పురవీధుల్లో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, గోపాల నవీన్రాజ్, చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రథయాత్ర కొంత ఆలస్యంగా కరెంటు వైర్లు తీయడం మళ్లీ బిగించడంతో లేట్ అవుతుందని సోమవారం మధ్యాహ్నం వరకు దుర్గేశ్వర ఆలయం చేరుకుంటుందని తెలిపారు. సత్యనారాయణ, మీసాల ప్రకాశ్, జాతి రమేశ్, శ్రీనివాస్, బండి శంకర్, మహేష్, రాజు, శంకర్, పాల్గొన్నారు. సేంద్రియ ఆహారం తీసుకోవాలిహన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్ఫుడ్కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పధార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పులు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలిహన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత పాల్గొన్నారు. హామీలన్నీ నెరవేరుస్తాం..నడికూడ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని అంచలవారీగా అమలు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వరికోల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, పేదల సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలో రేషన్ ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నకు ప్రత్యేక పూజలు
ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్ల న్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం శ్రీడిజిటల్ బాధితుల కమిటీశ్రీ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్.బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండవిద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలను టీఎస్యూటీఎఫ్ నిర్వహించిందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ యన ఉపాధ్యాయ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై అనేక ఐక్య ఉద్యమాలను టీఎస్యూటీఎఫ్ నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ిసీహెచ్ రవీందర్రాజు, పెండెంరాజు, కుమార్, సి.సుజన్ ప్రసాద్రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్, జిల్లాల బాధ్యులు లింగారావు, కరుణాకర్, కె.మోజెస్, సీఎస్ఆర్ మల్లిక్, సదానందం, భాస్కర్రా వు, తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ● ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్ఫోన్ అమ్మేశా.’ – ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్ ● ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’ – డిగ్రీ విద్యార్థి, నర్సంపేట– సాక్షిప్రతినిధి, వరంగల్.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూ దపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకు ని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాప్ల వ్యాప్తి.. ఉమ్మడి వరంగల్లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్లు టాప్–డౌన్లోడెడ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ టార్గెటే.. యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం.నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 14న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. నరేంద్రనగర్, జూలైవాడ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు, వడ్డేపల్లి, విజయపాల్ కాలనీ, రాఘవేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అలాగే వరంగల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. పిన్నవారి స్ట్రీట్, దుర్గేశ్వర స్వామి దేవాలయం, మట్టెవాడ, ఎల్లంబజార్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. న్యూస్రీల్ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతాం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటరెడ్డి గేమింగ్ ముసుగులో ఆన్లైన్ జూదం కేరాఫ్గా మారిన ఉమ్మడి వరంగల్ ‘టైమ్ పాస్’తో మొదలై అప్పుల ఊబిలోకి ప్రాణాలు తీసుకుంటున్న యువత అవగాహన కల్పిస్తున్నా మారని తీరుమోసం ఎలా జరుగుతుందంటే? మొదటి మూడు గేమ్లు గెలిచేలా ఈ యాప్లను రూపొందించి నమ్మకం కలిగేలా చేస్తారు. మూడు గేమ్ల తర్వాత చివరికి ‘ఆటో బాట్’ వాడడం వల్ల యూజర్ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతుంది. యూజర్ నెగ్గడం పక్కన పెడితే.. ఒక వేల గెలిచినా ఆ డబ్బును దక్కించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు తెలిపారు. కాగా.. గేమ్లోకి ‘ఫ్రెండ్స్ని లాగితే రూ.100 బోనస్’.. అంటూ రెఫరల్ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు యాప్ వాడుతున్నవారు చెబుతున్నారు.హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ఎల్కతుర్తి: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాల న సాగిస్తోందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నా రు. ఈనెల 27న ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపాన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలిని ఆయన మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ల కాలంలో తెలంగాణలో నెలకొన్న సమస్యలను అప్పటి సీఎం కేసీఆర్ పరిష్కరిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తిరిగి వెనుకటి రోజులను తీసుకొచ్చిందని విమర్శించా రు. బీఆర్ఎస్ సర్కారు కరెంట్ సమస్య లేకుండా, గుంట పొలం ఎండిపోకుండా చేస్తే.. ఇప్పుడు కరెంట్, నీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి దాపురించిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తం సదానందం, బీఆర్ఎస్ నాయకులు పిట్టల మహేందర్, మండల సురేందర్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ నగేశ్, శేషగిరి, కడారి రాజు, జూపాక జడ్సన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి -
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా...
భీమదేవరపల్లి : 20 నుంచి 30 స్టేషన్ఘన్పూర్ : 25 నుంచి 30 జనగామ : 40 నుంచి 55 కొడకండ్ల : 7 నుంచి 15 మహబూబాబాద్ : 45 నుంచి 60 ములుగు : 10 నుంచి 20 వరంగల్ ఆర్వో : 70 నుంచి 110 వరంగల్ రూరల్ : 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ : 25 నుంచి 40 వర్ధన్నపేట : 6 నుంచి 15 నర్సంపేట : 20 నుంచి 35 పరకాల : 15 నుంచి 25 భూపాలపల్లి : 20 నుంచి 30 -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్లాట్ బుకింగ్ పద్ధతి తమకు కూడా కావాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆయా పరిధి భూక్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడుగుపెడితే ఏ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందో.. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు పిలు స్తాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం వర కు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతోపాటు మరో 15 నిమి షాల్లో దస్తావేజులు చేతికందుతున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు అన్ని కార్యాలయాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న ప్రారంభించిన స్లాట్ బుకింగ్ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. కోరుకున్న సమయానికి.. కోరుకున్న రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భూక్రయవిక్రయదారులతో పాటు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే వారు సమయానికి దస్తావేజులు చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, భీమదేవరపల్లి, స్టేషన్ఘన్పూర్, జనగామ, పరకాల, కొడకండ్ల, మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. తగ్గనున్న పనిభారం నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో సబ్ రిజిస్ట్రార్లు త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఆస్కారం లేక ఒక్కోరోజు రాత్రి 8 గంటల వరకు సైతం కార్యాలయాల్లో ఉండాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని సమయాలతో సబ్ రిజిస్ట్రార్లకు పనిభారం తగ్గడంతో పాటు భూక్రయవిక్రయదారులకు సమయం కలిసి వస్తుంది. రోజుకు 53 స్లాట్ బుకింగ్స్.. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 చొప్పున స్లాట్ బుకింగ్స్ కల్పించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, పేషెంట్ల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్ బుకింగ్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. స్లాట్ బుకింగ్తో మెరుగైన సేవలు..భూక్రయవిక్రయదారులు తాము ఎంచుకున్న రోజు, సమయానికి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగైన, త్వరితగతిన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని సరైన సమయానికి వస్తే చాలు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తవు. – ఆనంద్, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ఆర్వోఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా...భీమదేవరపల్లి 20 నుంచి 30 స్టేషన్ఘన్పూర్ 25 నుంచి 30 జనగామ 40 నుంచి 55 కొడకండ్ల 7 నుంచి 15 మహబూబాబాద్ 45 నుంచి 60 ములుగు 10 నుంచి 20 వరంగల్ ఆర్వో 70 నుంచి 110 వరంగల్ రూరల్ 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ 25 నుంచి 40 వర్ధన్నపేట 6 నుంచి 15 నర్సంపేట 20 నుంచి 35 పరకాల 15 నుంచి 25 భూపాలపల్లి 20 నుంచి 3015 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి ఎదురుచూస్తున్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గనున్న పనిభారం.. సమయం ఆదా -
ధాన్యం కొనుగోళ్లు షురూ
ఖిలా వరంగల్: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2024–2025 యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చు ట్టింది. కలెక్టర్ సత్యశారద ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్నీ సంచులు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, ధాన్యం రవాణా చేసేందుకు లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు, బోరుబావులు కింద సాగు చేసిన వరి పంట కోత దశకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 1.05 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు.. యాసంగి సీజన్లో 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వరి పంట ను కోసేందుకు హార్వెస్టర్లు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు లక్షలకు పైగా గన్నీ సంచులు అవసరం ఉంటాయని గుర్తించారు. ఈసారి 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా..కొనుగోలు కేంద్రాలకు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. నిర్దిష్ట తేమ శాతం వచ్చాకే ధాన్యం నింపడానికి గన్నీ సంచులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి కేంద్రానికి 30 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు. వానా కాలం తరహాలో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయనున్నారు. అఽధికారుల పర్యవేక్షణ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రవాణాశాఖ అధికారి శోభన్బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అఽధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మండల వ్యవసాయాధికారులు తదితరులు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా పరిశీలించనున్నారు. రాయపర్తి మండలంలో ప్రారంభించిన అధికారులు జిల్లాలో 182 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా అందుబాటులో గన్నీ సంచులు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు -
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : రేవూరి
గీసుకొండ: కేంద్రంలోని బీజేపీ కుట్రలు తిప్పికొట్టి, ఆ పార్టీ సర్కారు తీరు కారణంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ఆదివారం కాంగ్రెస్ నాయకుడు దుపాకి సంతోష్ నిర్వహించిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ఆరోపించారు. బీజేపీ తీరుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. గరీబ్నగర్, కీర్తినగర్లో నిర్వహించిన ర్యాలీల్లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నేతలు కొండేటి కొమురారెడ్డి, సాల్మన్, గోదాసి చిన్న, దాసారపు సారయ్య, జానీ, హుజూర్, చెక్క రమేశ్, ఆఫ్రీన్, శైలజ, లలిత పాల్గొన్నారు. -
మామిడిలో జాగ్రత్తలు తీసుకోవాలి
దుగ్గొండి: మామిడి తోటల్లో తామర పురుగు, కాయతొలుచు పురుగు, పిందె రాలడం చాలా తీవ్రంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి అన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మండలంలోని ముద్దునూరు, చలపర్తి గ్రామాల్లో ఆదివారం ఆమె మామిడి తోటలను పరిశీలించి మాట్లాడారు. తామర పురుగుల నివారణకు పిఫ్రోనిల్ 40 గ్రాములు, 400 గ్రాముల సాఫ్ మందు, 400 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందులను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. 10 సంవత్సరాలు దాటిన ఒక్కో చెట్టుకు 500 గ్రాముల యూరియా, కిలో పొటాష్ను వేసి నీరు పెడితే పిందె రాలే శాతం తగ్గుతుందని ఆమె తెలిపారు. హత్య చేసిన ఇద్దరిపై కేసు నమోదు నల్లబెల్లి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ కొమ్మాలును హత్య చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హత్యకు గురైన బానోత్ కొ మ్మాలు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ మేరకు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి మందలించి కొమ్మాలుకు జరిమానా విధించారు. అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో సదరు మహిళ తన భర్త జంపయ్యతో కలిసి కొమ్మాలును హత్య చేసింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజా రులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్లన్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్డీఏ పరీక్ష కేయూ క్యాంపస్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆదివారం ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంఽధిత అధి కారులకు సూచింంచారు. పరీక్షల నిర్వహణపై ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్ఫుడ్కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు రాకుండా చూస్తాం..
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. జిల్లా వ్యాప్తంగా 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాం. – సంధ్యారాణి, మేనేజర్ జిల్లా పౌరసరఫరాల శాఖ -
ప్రకృతి వనాల్లో పచ్చదనం ఎక్కడ?
నర్సంపేట: మున్సిపాలిటీ ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాల నిర్వహణలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో నాటిన మొక్కలు ఎండలకు ఎండిపోతున్నాయి. సిబ్బంది నీరు పట్టకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 14 ఖాళీ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో వనానికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఎండలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వనాల్లో వందలాది మొక్కలు నాటగా ప్రస్తుత ఎండలతో ఐదు శాతం కూడా కనిపించడం లేదు. ఏప్రిల్లోనే ఎండలు ఇలా ఉంటే మేలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. , పర్యవేక్షణ విభాగం లేదు.. ప్రకృతి వనాల పర్యవేక్షణ కోసం రెండు సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టిన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంతోష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. నాటి నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు అదనపు బాధ్యతలు తీసుకుని శానిటరీ సిబ్బందితో పనులు చేపడుతున్నా ఫలితం లేదు. వాస్తవానికి గ్రీన్ ఫండ్ కింద మున్సిపాలిటీ బడ్జెట్లో 10 శాతం నిధలు కేటాయిస్తున్నారు. నిధులు ఖర్చు అవుతున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా ప్రకృతి వనాల్లో మొక్కలు మాత్రం కనుమరుగవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకృతి వనాలను పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రకృతి వనాల అభివృద్ధి కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. నర్సంపేటలో ఎండిపోతున్న మొక్కలు.. నిర్వహణ అధ్వానం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులుఈ ఫొటోలో కనిపిస్తున్నది నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో ఉన్న పట్టణ ప్రకృతి వనం. 2023 జూన్ 16న రూ.15 లక్షల పట్టణ ప్రగతి నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ ముళ్లకంచె, వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన పూల మొక్కలు మొదట్లో ఉండేవి. ఇందులో ఏర్పాటు చేసిన బోరు నుంచి 10 నిమిషాలు కూడా నీళ్లు రాని పరిస్థితి. ట్రాక్టర్ ద్వారా మొక్కలకు నీటిని అందించాలనుకుంటే ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఇరుకుగా ఉంది. ఈ సాకుతో నీరు పోయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయి పట్టణ ప్రకృతి వనం కళావిహీంగా కనిపిస్తోంది. -
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – బి.కేశవులు, సీనియర్ మానసిక వైద్య నిపుణుడు -
పల్లె దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి
నెక్కొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న పల్లె దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. అలంకానిపేట పీహెచ్సీ పరిధిలోని తోపనపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ఆదివారం ఎమ్మెల్యే దొంతి ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు దవాఖానలను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రోగులకు అవసరమయ్యే అన్ని రకాల వైద్య సేవలతోపాటు మందులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మర్ రావుల హరీశ్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, సర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, అలంకానిపేట వైద్యాదికారులు అర్చన, అఖిల్, డెమో అనిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
వర్ధన్నపేట: సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మండలంలోని ఇల్లంద, దమ్మన్నపేట గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. అనంతరం దమ్మన్నపేట గ్రామంలో మేరుగు రాధిక–రమేశ్ ఇంటిలో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు దేవేందర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
అందరి సహకారంతో జాతర విజయవంతం
గీసుకొండ: అందరి సహకారంతో కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర విజయవంతమైందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆలయానికి అధిక ఆదాయం సమకూరడంలో అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యుల కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకులు, మామునూరు ఏసీపీ తిరుపతి,గీసుకొండ సీఐ మహేందర్, ఎస్సై ప్రశాంత్, ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజు, సభ్యులను ఆయన సన్మానించారు. తొలుత ఈఓతోపాటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీని వాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, విష్ణు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేందర్శర్మ, అన్నదాత వీరాటి రవీందర్రెడ్డి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడా కొమురారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, నాయకులు కొండేటి కొమురారెడ్డి, దూల వెంకటేశ్వర్లు, కూసం రమేశ్, నాగారపు స్వామి తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కొమ్మాల ఆలయంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభం -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శా ఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పె ట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వా రికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పా రు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపే తం చేయాలని, తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నా రు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ తదితరులున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనం బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిబాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. -
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 14న అంబేడ్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. అంబేడ్కర్ భవన్లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్రావు, వైస్ చైర్మన్ బండారి సురేందర్, ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీలత, అధికారి అనిల్ పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని కాపాడాలి
నర్సంపేట: హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి యువకుడు కంకణబద్ధుడై హనుమంతుడిలా పనిచేయాలని జగద్గురు శ్రీకాంతేంద్రస్వామి పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్–బజరంగ్దళ్ నర్సంపేట ప్రఖండ బాధ్యులు శనివారం సాయంత్రం నర్సంపేటలో వీరహనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతేంద్రస్వామి మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం హనుమంతుడు, రామలక్ష్మణులు పనిచేశారని గుర్తు చేశారు. ధర్మం కోసం హనుమంతుడు లంకను సైతం తగులబెట్టిన సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులు భగవద్గీతను తప్పకుండా చదవాలని సూచించారు. శోభాయాత్రలో 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. నర్సంపేటలోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రారంభమైన శోభాయాత్ర సర్వాపురంలోని హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. విశ్వహిందూ పరిషత్ నర్సంపేట ప్రఖండ కార్యదర్శి వేల్పుల శ్రీధర్, అధ్యక్షుడు చొల్లేటి జగదీశ్, ఆర్ఎస్ఎస్ నర్సంపేట సంఘచాలకులు మోతె సమ్మిరెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి మల్యాల రవి, వేల్పుల శ్రీధర్, శోభన్, రవీందర్శర్మ, శివకుమార్, భూషబోయిన వెంకటేశ్, దేవేందర్, చరణ్, వీరన్న, క్రాంతికుమార్, రాజేందర్, రాజు, భీంరాజ్, హరీశ్కుమార్, ముస్కు రాజేందర్, అరవింద్, శ్రీకాంత్, సుదర్శన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. జగద్గురు శ్రీకాంతేంద్రస్వామి నర్సంపేట పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర -
పూలే ప్రపంచానికే ఆదర్శం
ఆత్మకూరు: మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జీవితాలు ప్రపంచానికే ఆదర్శమని ప్రొఫెసర్ కంచ అయిలయ్య, అరుణోదయ గాయకురాలు విమలక్క అన్నారు. మండలంలోని నీరుకుళ్లలో శనివారం రాత్రి బస్టాండ్ సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రొఫెసర్లు గడ్డం కృష్ణ, ననుమాస స్వామి, కవి దేవేందర్తో కలిసి కంచ అయిలయ్య, విమలక్క ఆవిష్కరించారు. ఈసందర్భంగా కంచ అయిలయ్య మాట్లాడుతూ.. చదువుతో అన్ని వర్గాల భవిష్యత్ను మార్చేందుకు పూలే దంపతులు అహర్నిశలు కృషి చేశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా అంత ఎత్తు (ఏడున్నర ఫీట్లు జ్యోతిరావుపూలే, 6 ఫీట్లు సావిత్రిబాయి) విగ్రహాలు నీరుకుళ్లలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విమలక్క మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం అహర్నిశలు కృషి చేసిందన్నారు. నేటి మహిళలు సావిత్రిబాయి ఫూలే బాటలో నడిచి అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. యువత పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐ సంతోశ్, భారతక్క, మాజీ సర్పంచ్ అర్షం బలరామ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచ అయిలయ్య, గాయకురాలు విమలక్క పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ -
– ఖిలా వరంగల్
● తిన్నంత బిర్యానీ.. వచ్చి తినిపో.. ● ఇలాంటి కొత్త పేర్లు, వైరెటీ కాన్సెప్టులెన్నో.. ఆకలి రాజ్యం.. చిల్ మామా.. తిన్నంత భోజనం.. స్మోకీ డోకీ.. పొట్లం బిర్యానీ.. ఫుడ్ ఆన్ఫైర్.. ప్రకృతి... కడాయి.. రెడ్ బస్.. హంగర్ స్ట్రీట్.. ఇలా ఎన్నో పేర్లు. ట్రేన్.. జైలు, అరణ్యం ఇలా ఎన్నో థీమ్లు. గ్రేటర్ వరంగల్ నగరంలో కొత్త కాన్సెప్టులు, నోరూరించే రుచులతో రెస్టారెంట్లు భోజనప్రియులను ఆకర్షిస్తున్నాయి. వైరెటీ వంటకాలతో రారమ్మని పిలుస్తున్నాయి. వాటిపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఒక్క క్లిక్తో ఇంటికే.. ఒక్క క్లిక్తో వేళాపాళా లేకుండా ఇంటికే భోజనం వచ్చేస్తుంది. అది కూడా నిమిషాల్లో. కొన్ని యాప్లు అయితే ఉచిత డెలివరీ ఆప్షన్లు ఇస్తున్నాయి. మరికొన్ని యాప్లకు నెలవారీగా, మూడు నెలలకు, ఏడాదికి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు పూర్తి స్థాయి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తావా.. బుక్ చెయ్. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇలా.. నోటిఫికేషన్లనూ పంపిస్తూ ఇంటి వద్దకే సేవలందిస్తున్నాయి. -
ఘనంగా హనుమత్ విజయోత్సవం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శనివారం చైత్రమాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని పంచలోహ పంచముఖ మహా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, సిబ్బంది మధుకర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమన్ భక్తులు, సందర్శకులు పాల్గొన్నారు. సవాళ్లను అధిగమించాలి..కేయూ క్యాంపస్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ విద్య అనేక సమస్యల్ని, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని నైపుణ్యాలతో అధిగమించాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో డైరెక్టర్, పాలక మండలి సభ్యుడు బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన వ్యాపార నిర్వహణ విద్యపై విస్తృతోపన్యాసం చేశారు. మేనేజ్మెంట్ విద్యతో బాధ్యతాయుతమైన నాయకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. సంప్రదాయ మార్కెటింగ్, ఫైనాన్స్ మానవ వనరులకు మించిన క్రియాత్మక రంగాలపై విస్తృత అ వగాహన అవసరముందన్నారు. సమావేశంలో అధ్యాపకులు వీణ, సుమలత పాల్గొన్నారు. నకిలీ వైద్యుడిపై కేసుఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు. -
మార్మోగిన ‘జై హనుమాన్’ నినాదం
పరకాల పట్టణంలో ‘జై హనుమాన్’ నినాదం మార్మోగింది. హనుమాన్ భక్తులతో శనివారం నగరం కాషాయమయమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్ పరకాల శాఖ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ పట్టణంలో సాగిన ఈయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు సతీశ్, సహా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, భజరంగ్దళ్ నాయకులు రమేశ్, అఖిల్, కుమార్, డాక్టర్ రజనీకాంత్, జయపాల్, పురుషోత్తం, రంజిత్ పాల్గొన్నారు. – పరకాల -
హనుమాన్కు జడ్జిల పూజలు
గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల శివారులో ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని జిల్లా జడ్జిలు శనివారం సందర్శించి మొక్కులు చెల్లించారు. వరంగల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి కె.చండీశ్వరీదేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నడికొండ రితిక, వారి బంధువులు స్వామివారికి పూజలు చేశారు. ప్రేమించాలని వేధిస్తున్న యువకుడిపై కేసు● సహకరించిన మరో వ్యక్తిపై కూడా నమోదు సంగెం: ప్రేమించాలని వేధిస్తున్న యువకుడితోపాటు అతడికి సహకరించిన మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. లోహిత గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన నర్ర రాజ్కుమార్ వేధిస్తున్నాడు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో పిలిపించి మందలించగా ఇక జోలికి రానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ వేధించసాగాడు. శనివారం రాజ్కుమార్, అతడి స్నేహితుడు దొమ్మాటి లోకేశ్ కిరాణా షాపులో ఉన్న యువతి వద్దకు వచ్చా రు. ప్రేమించాలని తలుపులను తన్నుతూ రాజ్కుమార్ బెదిరించాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిదండ్రులను చంపుతామని హెచ్చరించాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు రాజ్కుమార్, లోకేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైతుల కష్టం బుగ్గిపాలు గీసుకొండ: చేతికొచ్చిన మొక్కజొన్న పంట దగ్ధం కావడంతో రైతులు కంటనీరు పెడుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో శనివారం గోదాసి రమేశ్–మాధవి దంపతుల రెండు ఎకరాల మొక్కజొన్న చేనుతోపాటు అందులోని డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. తమకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని, గుర్తుతెలియని వ్యక్తులు కాలబెట్టి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన వల్లెం సతీశ్ సాగు చేసిన 20 గుంటల మొక్కజొన్న చేను, వల్లెం శ్రీనుకు చెందిన 20 గుంటల మొక్కజొన్న చేను కాలి బూడిదైంది. తమకు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని ఆ ఇద్దరు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ముగ్గురు రైతులు కోరారు. వైభవంగా పాంచాల రాయస్వామి జాతరగీసుకొండ: శాయంపేట హవేలిలోని పాంచాల రాయస్వామి (శ్రీ కృష్ణ) జాతర శనివారం రాత్రి వైభవంగా జరిగింది. గీసుకొండ, సంగెం మండలాలతోపాటు వరంగల్ నగరం నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీపీ ముంత కళావతి, ఆమె భర్త రాజయ్య, కాంగ్రెస్ నాయకుడు వీరాటి రవీందర్రెడ్డి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలుదుగ్గొండి: లక్ష్మీపురం గ్రామంలోని పెద్దమ్మకుంట చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురవుతోంది. శిఖం మొత్తం లక్ష్మీపురం నీరుకుళ్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో అనే క మంది భూమిని ఆక్రమిస్తున్నారు. వారం రోజులుగా కొంతమంది రోడ్డువైపు పెద్ద పరదాలు కట్టి గుట్టుగా నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ కోసం తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని ఫోన్లో సంప్రదించగా స్పందించ లేదు. -
నిట్లో వెల్లువెత్తిన నిరసన
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ఇటీవల సెకండియర్ విద్యార్థి హృతిక్ సాయి చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన హృతిక్సాయి సంస్మరణ సభలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూనే విద్యార్థులు గేట్ వద్ద నిరసనకు దిగారు. నిట్లోని వివిధ క్లబ్స్లోకి 6.5 జీపీఏ సాధించిన విద్యార్థులకే కాకుండా మిగతా వారికీ అనుమతి కల్పించాలని, ఫస్టియర్ విద్యార్థులకు అటెండెన్స్కు పది మార్కులు, సమ్మర్ కోర్స్ రిజిస్ట్రేషన్ అందరికీ కల్పించాలని, రూ.లక్ష ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగిన వారికి ఫీజులో రాయితీ కల్పించడం తదితర డిమాండ్లు నెరవేర్చాలని నిరసన తెలిపారు. కాగా, విద్యార్థులతో త్వరలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని నిట్ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. దీంతో వారు ఆందోళన విరమించారు. -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన సభాస్థలి పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలన్నారు. ఈనెల 27న జరుగబోయే రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, నాగుర్ల వెంకన్న, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, నాయకులు పిట్టల మహేందర్, గోల్లె మహేందర్, ఎల్తూరి స్వామి, తంగెడ మహేందర్, కడారి రాజు, మహిపాల్రెడ్డి, వేముల సమయ్య, జడ్సన్, రాజ్కుమార్, చిట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు రజతోత్సవ సభ పనుల పరిశీలన -
వరి పంటలో తెల్లకంకి
ఖానాపురం: అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతుల కష్టాన్ని వడగళ్ల వాన గద్దలా తన్నుకుపోయింది. మరో 20 రోజుల్లో పంట చేతికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లుచల్లింది. వరి పంట తెల్లకంకి రూపంలో దర్శనమిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాకాల ఆయకట్టు ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది. అధికారికంగా, అనధికారికంగా 30 వేల ఎకరాల్లో వరి పంటలు సాగయ్యాయి. పుష్కలంగా నీటి వసతి ఉండడంతో రైతులు సంతోషపడ్డారు. చేతిలో ఉన్న డబ్బుతో పాటు బ్యాంకులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి మరీ సాగు చేశారు. ఇటీవల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సుంకంతా రాలిపోయి తెల్లకంకిగా మారిపోయింది. వడగళ్ల వానతో పంటలు సైతం నేలవాలాయి. ధాన్యం రాలిపోయింది. పాకాల ఆయకట్టు కింద సుమారు ఐదువేల ఎకరాల వరకు వరిపంట తెల్ల కంకిగా మారి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వాపోతున్నారు. వాతావరణంలో మార్పులే కారణం పాకాల ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలుపెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాద ని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి,ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిహన్మకొండ: బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్యవివాహాలు జరుగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనంకాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయ క్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం.. ఆగమాగం జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ -
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం.. ఆగమాగం జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ
ఎల్కతుర్తి: పదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ పాలన కొనసాగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జైబాపు, జైభీమ్, జై సంవిధాన్’ పాదయాత్ర శుక్రవారం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో కొనసాగింది. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర గ్రామాల్లో విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, గోలి రాజేశ్వర్రావు, సుకినె సంతాజీ, గొర్రె మహేందర్, మండ సుమన్గౌడ్ పాల్గొన్నారు.రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి -
పాఠకులకు సదుపాయాలు కల్పించండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● జిల్లా గ్రంథాలయంలో వసతుల పరిశీలనహన్మకొండ చౌరస్తా : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిత్యం వచ్చే పాఠకుల కోసం ఏసీలు, చల్లటి తాగునీటి కోసం రిఫ్రిజిరేటర్లు తదితర సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించి వసతులు, పెండింగ్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను సమస్యలు, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రూ.80లక్షలతో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణం నిలిచిపోవడానికి కారణాలను లైబ్రరీ సిబ్బందిని అడగ్గా.. మరో రూ.13లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు అందించామని వివరించారు. కాగా లైబ్రరీకి వస్తున్న సెస్ నిధుల నుంచి ఆడిటోరియం పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అజీజ్ఖాన్, లైబ్రరీ సిబ్బంది మల్సూర్, పురుషోత్తంరాజు, సంతోశ్, గుడికందుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఖానాపురం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, కోలిన్ ఏరోస్పేస్ సీఎస్ఆర్ అమిత్ సావర్కర్ అన్నారు. మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఎస్హెచ్జీకి బెంగళూరుకు చెందిన కోలిన్ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.4.50 లక్షల విలువ చేసే డ్రోన్ పిచికారీ యంత్రాన్ని శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బాధ్యతాయుతంగా వాడుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కోలిన్ ఏరోస్పేస్ సంస్థ కర్ణాటకలో 2,500 మందితో కూడిన ఎఫ్పీఓతో పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్, వరంగల్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఖానాపురంలో మహిళా సంఘానికి అందించినట్లు వివరించారు. ఇన్సూరెన్స్ చేసి డ్రోన్లు అందిస్తున్నామని, భవిష్యత్లో మరిన్ని అందజేస్తామన్నారు. ఏఓ శ్రీనివాస్, సొసైటీ సీఈఓ ఆంజనేయులు, కార్యదర్శి సుప్రజ, ప్రజలు వెంకటప్రసాదరావు, సత్యవరప్రసాదరావు, వాసుదేవరెడ్డి, శ్రీను, ఎస్హెచ్జీ అధ్యక్షురాలు వేజేళ్ల సుజిత, మేరుగు రాజు, సంస్థ బాధ్యులు లవీన్ సుందరరాజ్, గణేశ్, ఫణీంద్ర, రాధ, బలరాం, నందగోపాలం, అరుణ్ పాల్గొన్నారు. -
ఆర్థిక బలోపేతానికి మహిళా శక్తి క్యాంటీన్లు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాలలోని నూతన సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కృషి చేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్, సబ్ రిజిస్ట్రార్ శ్రావణ్, ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ విజయలక్ష్మి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లోకి ఔట్సోర్సింగ్ సిబ్బంది
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని వైద్య కళాశాలలో టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్)కి సంబంధించిన 15 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని శుక్రవారం విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్దాస్ తెలిపారు. ‘రెన్యువల్ చేయక.. కొనసాగించక’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 6వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పందించింది. జీఓ 42 ప్రకారం ఆ ఔట్సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశించడంతో ఔట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి : డీపీఓ నర్సంపేట రూరల్: గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీఓ కల్పన అన్నారు. గురిజాల గ్రామంలోని నర్సరీని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. మొక్కల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవికాలంలో ఉదయం సాయంత్రం వేళ మొక్కలకు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం గురిజాల గ్రామపంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. కొమ్మాల ఆలయంలో ప్రతీ శనివారం అన్నదానంగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతీ శనివారం అన్నప్రసాద (అన్నదానం) వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్నదానం కోసం దాతలు సాయం అందించి సహకరించాలని ఆయన కోరారు. పూలే ఆశయాలను కొనసాగించాలినర్సంపేట: మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుంటి రజనికిషన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ గద్ద వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమార్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్లు కల్లెపల్లి ప్రణయ్దీప్, తడుగుల విజయ్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ బ్యాంకు ఎదుట దళిత ప్రజా సంఘాల జేఏసీ కోకన్వీనర్ గుంటి వీరప్రకాశ్ అధ్యక్షతన శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాకూబ్, వేముల రవి, రాజుయాదవ్, సదానందం, రాజు పాల్గొన్నారు. అలాగే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్యగౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్లో, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సి పల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, సోల్తి సాంబయ్య, సోల్తి మధు, పట్టణ అధ్యక్షుడు గండు రవి, డివిజన్ కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నర్సంపేట: సబ్స్టేషన్లో మరమ్మతుల నేపథ్యంలో నేడు (శనివారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఎన్.విజయభాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని పేర్కొన్నారు. నెక్కొండలో.. నెక్కొండ : మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ, నాగారం విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కేయూ క్యాంపస్: ఆర్థిక అసమానతలు లేకుండా ధనవంతులు పేదవర్గాలకు ఆర్థిక సహకారం అందించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దోహదపడాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగంలో పాలకమండలి సభ్యులు, విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో సోలార్ పవర్, విండ్ పవర్, ఎనర్జీలో అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ సాధనకు సమ్మిళిత వృద్ధి అత్యావశకమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేడీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, అధ్యాపకులు రమేశ్, సత్యనారాయణ, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రవీందర్, డాక్టర్ రమణ, మాలతీలత, ఎం.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్డ్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, బార్ బైండింగ్, పెయింటింగ్, టైల్స్ ఫ్లోరింగ్, కార్పెంటరీ, బిల్డింగ్, తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువత మరిన్ని వివరాల కోసం విక్టరీ ఐటీఐ కాజీపేట లేదా 79892 50779, 99496 84763 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జాతీయ క్రీడల్లో కమిషనరేట్ పోలీసులువరంగల్ క్రైం: కేరళలోని కొచ్చిలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఏసీపీ జితేందర్రెడ్డి, మధుసూదన్, ఎస్సై సురేశ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ గీత, కానిస్టేబుళ్లు వేణు, తులసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున పాల్గొన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచి కమిషనరేట్కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీపీ సన్ప్రీత్సింగ్, అధికారులు ఆకాంక్షించారు. అంబేడ్కర్ రచనల్ని అధ్యయనం చేయాలికేయూ క్యాంపస్: అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం విద్యార్థులను కోరారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో అంబేడ్క ర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగంతో పాటు సుమారు 60 పుస్తకాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు ఈపుస్తక ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రదర్శనను రిజిస్ట్రార్ రామచంద్రం లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణితో కలిసి ప్రారంభించారు. కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఇసాక్ప్రభాకర్, తేజావత్జావీర్, లైబ్రరీ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలికాజీపేట అర్బన్: ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని రైతు వేదికలో శుక్రవారం పోషణ పక్షోత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 22వ తేదీ వరకు పోషణ మాసంపై అవగాహన కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ పీఓఎంహెచ్డబ్ల్యూ మంజుల, డాక్టర్ శ్రీదేవి, డీఈఎంఓ అశోక్రెడ్డి, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి, ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోషణ్ అభియాన్ అధికారులు, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు సెక్టార్ సూపర్వైజర్లు, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్(231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్(172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జా యింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ(263 ఓట్లు), స్పో ర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓ ట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. హనుమకొండ అసోసియేషన్లో.. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్లో మొత్తం 867 మంది ఓటర్లు ఉండగా 752 మంది పోలింగ్లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు కె.రమేష్బాబు, రవీందర్రావు తెలిపారు. అధ్యక్షుడిగా పి.సత్యనారాయణ(336 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా కె.రవి(294 ఓట్లు), ఉపాధ్యక్షడిగా సీహెచ్.రమేశ్(486 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా సి.మల్లేష్(291 ఓట్లు), లైబ్రరీ జాయింట్ సెక్రటరీగా కె.వెంకటేశ్(406 ఓట్లు), కోశాధికారిగా సీహెచ్.సాంబశివరావు (484 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా బి.శివకుమార్యాదవ్(480 ఓట్లు), డి.సునిల్కుమార్(470 ఓట్లు), పి.కమలాకర్(449 ఓట్లు), సీహెచ్.నిఖిల్కుమార్(406 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. వరంగల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్ హనుమకొండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి.సత్యనారాయణ, కె.రవి -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట : ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రేణులు గ్రామాలకు వెళ్లి అందుబాటులో ఉండే వాహనాలు, సభకు వచ్చే వారి సంఖ్యను అంచనా వేస్తూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. సభకు వచ్చే వారి కోసం గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. తొలుత సభ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి (ఆర్ఎస్ఎస్) రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్రెడ్డి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట రూరల్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు మోతె జయపాల్రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, మోటూరి రవి, గడ్డం కొమురయ్య, కొడారి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమారస్వామి, పెద్ది శ్రీనివాస్రెడ్డి, వల్లాల కరుణాకర్, అల్లి రవి, పెండ్యాల మునేందర్, మచ్చిక రాజు పాల్గొన్నారు. -
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్: జిల్లా బార్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్ (231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ (172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జూయింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ (263 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), ఎం.మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్ -
అక్రమార్కుల ‘వీ హబ్’
సాక్షి, వరంగల్: జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన ఉద్యోగాల నియామకాల్లో అనర్హులను అందలం ఎక్కించారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు కొల్లగొట్టారని ‘సాక్షి’ ముందుగానే చెప్పింది. ఈ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఉద్యోగార్థుల విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లు తూతూ మంత్రంగానే పరిశీలించి తమకు కావాల్సి న వారికి ‘మామూలు’గానే ఉద్యోగాలిచ్చేశారని 2023 జూలై 14, జూలై 22న, చైల్డ్లైన్ పోస్టుల్లోనూ అక్రమాలకు తెరలేపారని 2023 ఆగస్టు 8న ‘జనరల్గా జాబ్ లిచ్చేస్తారా’ అంటూ వరుస కథనాలను ప్రచురించింది. విజిలెన్స్ ఆరా తీసి ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న జిల్లా సంక్షేమ విభాగాధికారి శారద ఉండడంతో దీనిపై అడుగు ముందుకు పడలేదు. తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందడంతో మళ్లీ అక్రమాల నియామకాల విషయం తెరమీదకు వచ్చింది. అప్పుడు ‘సాక్షి’ చెప్పినట్లుగానే కొత్త మిషన్ పథకం కింద డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్కు చెందిన ఉద్యోగాల్లో గోల్మాల్ జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఏకంగా స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టు దక్కించుకున్న సుజాత విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమైపె ప్రస్తుత జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచా రిస్తుండడం సంచలనంగా మారింది. దీంతోపాటు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో విద్యార్హత లేకున్నా, పూర్తిస్థాయి అనుభవం లేకు న్నా సు’కుమా’రంగా తీసుకున్నారన్న ఆరోపణ లు న్నాయి. జెండర్ స్పెషలిస్ట్ నియామకంలో కూడా ఓ అంగన్వాడీ టీచర్ కోడలుకు అనుభవం లేకున్నా కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఇవేకాకుండా చైల్డ్లైన్లోని కొన్ని ఉద్యోగాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తీసుకోవడంపై ఇప్పటికే విజిలెన్్స్ దృష్టి సారించింది. ఇదిలా ఉండగానే వీహబ్లో ఓ మహిళ ఉద్యోగి రాజీనామా చేయడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. విచారణ ముమ్మరం.. నకిలీ సర్టిఫికెట్లు సదరు ఉద్యోగి ఎక్కడి నుంచి తీసుకువచ్చి సమర్పించారన్నది తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ విభాగం కార్యాలయానికి పలుమార్లు పోలీసులు వెళ్లారు. నియామకం సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఏదో ఒక కారణంతో కార్యాలయానికి రాకుండా ఉంటున్నారని సమాచారం. వీరిని పోలీసులు విచారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే టాక్ ఉంది. సదరు ఉద్యోగి భర్త సంక్షేమ శాఖలోని ఓ విభాగంలో అకౌంటెంట్గా పనిచేస్తూ.. అక్కడి అధికారులతో కుమ్మకై ్క వారి సహకారంతోనే ఈ ఉద్యోగం తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకోవైపు వీహబ్ ఇతర పోస్టుల్లో కూడా విద్యార్హత, అనుభవ పత్రాలు సరైనవా కావా అన్నది పోలీసులు విచారిస్తే తేలనుంది. ఆయా నియామకాల్లో అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు అసలైనవా కావా అన్నది తెలుసుకోవాల్సిన సంక్షేమ విభాగ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అధికారులు మౌనంగా ఉండడం, ముఖ్యంగా పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో సెలవులో ఉండడం అనుమానాలకు తావి స్తోంది. వీరిలో ఒక అధికారి ఈ నెలలోనే ఉద్యోగ విరమణ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా సుజాత సమర్పించిన నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట కేంద్రంగానే తయారయ్యాయనే తెలుస్తోంది. జిల్లా సంక్షేమ శాఖలో అనర్హులకు ఉద్యోగాలు నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల నిర్ధారణతో వాస్తవాలు వెలుగులోకి.. ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్ విచారణ.. ఆ తర్వాత సుజాతపై కేసు ఆ నియామకాల్లో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులు సెలవుల్లో.. వీరిని విచారిస్తేనే అవినీతి తేటతెల్లమయ్యే అవకాశం -
అంతర్గత పనులు త్వరగా పూర్తి చేయాలి
హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్నాయక్ కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద చేపట్టిన అంతర్గత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కమలాపూర్లో నిర్మించిన, నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను, అక్కడ జరుగుతున్న అంతర్గత పనుల్ని పరిశీలించారు. ఇక్కడ ఇప్పటి వరకు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని, ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఎన్ని? అని అడిగి తెలుసుకుని ఆ ఇళ్ల స్థితిగతులను, నాణ్యతను పరిశీలించారు. డబుల్ బెడ్రూంల వద్ద చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల వంటి అంతర్గత పనుల్లో వేగం పెంచాలని అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ సిద్ధార్థనాయక్, ఏఈ నరేందర్ రాజు పాల్గొన్నారు. -
సమాజ మార్గదర్శకుడు పూలే
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రామన్నపేట : సమాజంలోని రుగ్మతలను పారదో లడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, విద్య విషయంలో పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓలు రాథోడ్ ర మేశ్, సత్యపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి తదితరులున్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
ఆత్మకూరు/దామెర/నడికూడ: కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆత్మకూరు రైతు వేదిక, దామెర, నడికూడ తహసీ ల్దార్ కార్యాలయాల్లో గురువారం అర్హులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్లు జగన్మోహన్రెడ్డి, నాగరాజు, జ్యోతివరలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, వ్యవసాయ అధికారి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేశ్, వాసు, బీరం సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి
కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. వాతావరణం ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం అక్కడక్కడా మేఘావృతం అవుతుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు. -
వరంగల్
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరిగేనా? కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసహకారం అందిస్తున్న జెడ్పీ సెక్షన్ అధికారులు ● కోరుకున్న చోటుకు వెళ్లేందుకు లాంగ్ లీవులు ● సంఘాల డిమాండ్తో ప్రత్యేకాధికారి వద్దకు ఫైల్వరంగల్: జిల్లా పరిషత్ పరిధిలోని మండలాల్లో జానియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇతర శాఖలో పనిచేసి వచ్చిన ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీకి చెందిన ఒక జూనియర్ అసిస్టెంట్ జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఆర్ ములుగు క్యూసీ సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పీఆర్ ఇంజనీరింగ్శాఖలోని ఒక ఏఈ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద అతడి కుమారుడికి ఇదే క్యూసీ సబ్ డివిజన్లో పోస్టింగ్ ఇస్తూ పీఆర్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ జెడ్పీలో ఇతర ప్రాంతంలో పోస్టింగ్ కోసం రిపోర్టు చేశారు. మార్చి రెండోవారంలో రిపోర్ట్ చేసినా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వడం లేదని, ఇందుకు సంబంధిత సెక్షన్ అధికారులు సహకారం అందిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆరోపిస్తున్నారు. దొడ్డిదారిన పోస్టింగ్ పొందేందుకు.. జిల్లా పరిషత్ పరిధిలో సాధారణ బదిలీలు లేకపోవడంతో దొడ్డిదారిన కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ఉద్యోగులు లాంగ్ లీవు పెడుతున్నారు. ఏ మండలంలోనైనా ఒక ఉద్యోగి 6 నెలల పాటు సెలవులో ఉంటే సదరు ఉద్యోగిని జెడ్పీకి సరెండర్ చేస్తారు. వరంగల్ మండలం పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ పొందుతున్న విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి లాంగ్ లీవు పెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున పైడిపల్లి పాఠశాలలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలో క్యూసీలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా సంఘం నాయకులు అభ్యంతరం చెప్పారు. ఈస్థానంలోకి లాంగ్లీవు పెట్టిన చెన్నారావుపేట నుంచి జెడ్పీకి వచ్చిన ఉద్యోగికి అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. ఆశించిన స్థానం భర్తీ కావడంతో జూనియర్ అసిస్టెంట్ చెన్నారావుపేటకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భూపాలపల్లిలో జూనియర్ అసిస్టెంట్ సతీమణి ఉద్యోగం చేస్తున్నందున అక్కడ ఖాళీగా ఉన్న సబ్ డివిజన్లో పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. సంఘాల నాయకుల ఒత్తిడితో జూనియర్ అసిస్టెంట్కు చెన్నారావుపేటలో పోస్టింగ్ ఇచ్చేందుకు జెడ్పీ అధికారులు ఫైల్ సిద్ధం చేసి జెడ్పీ ప్రత్యేక అధికారి, కలెక్టర్ వద్దకు పంపారు. ఈఫైల్పై కలెక్టర్ రిమార్క్స్ రాయగా తిరిగి జెడ్పీకి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఆమోదించిన వెంటనే జూనియర్ అసిస్టెంట్కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని జెడ్పీ ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్ తెలిపారు.న్యూస్రీల్జెడ్పీల్లో ఇష్టారాజ్యం.. జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. చైర్మన్ల స్థానంలో ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఆయా జిల్లాల కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇందువల్ల జెడ్పీల్లో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. జెడ్పీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు ప్రత్యేక అధికారుల ఆమోదం కోసం పంపితే జాప్యం జరుగుతున్నదని, ఈవిషయాలపై ఉద్యోగులకు సమాధానం చెప్పలేక జెడ్పీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్లన్నింటిలో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్లపై దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అభివృద్ధి దిశగా కేఎంటీపీ
సాక్షి, వరంగల్: సంగెం, గీసుకొండ మండలాల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) అభివద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చింతలపల్లి, శాయంపేట హవేలి గ్రామాల్లో సేకరించిన 1150 ఎకరాల్లో గణేశ్ ఎకోపేట్, గణేశ్ ఏకోటెక్ పరి శ్రమలు నిర్వహిస్తున్నాయి. కేరళకు చెందిన కై టెక్స్ వస్త్రపరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంకోవైపు దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. ఇలా ఓవైపు పరిశ్రమలు అందుబాటులోకి వస్తుంటే.. ఇంకోవైపు నిచేసే ఉద్యోగులతోపాటు అ క్కడి గ్రామస్తుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల,గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాల కోసం టీఎస్ఐఐసీ రూ.3,72,19,479తో టెండర్లు పిలిచింది. టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన 863 మందికి స్టేట్ రిజర్వ్డ్ కోటా కింద గత నవంబర్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్కడే ఒక్కొక్కరికి కేటాయించిన 100 గజాల ఓపెన్ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.ఐదు లక్షలు ఇస్తామని ఉత్తర్వులిచ్చింది. సకల సౌకర్యాల దిశగా... కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని రాజీవ్గాంధీ టౌన్షిప్లో వసతుల కల్పనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. గతంలోనే సీఎం రేవంత్రెడ్డి వ రంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో మెగా టె క్స్టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన వారితోపాటు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా పనులు మొదలు కానున్నాయి. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పిల్లల దుస్తులు తయారు చేయడంలోనే ప్రసిద్ధి చెందిన ౖకైటెక్స్ కంపెనీ 25,000 ఉద్యోగాల కోసం నియామక ప్రకటన ఇచ్చింది.టెక్స్టైల్ పార్కులోని రాజీవ్ గాంధీ టౌన్షిప్లో వసతులు రూ.3,72,19,479తో టెండర్లు పిలిచిన టీఎస్ ఐఐసీ అధికారులు పీహెచ్సీ, ప్రైమరీ స్కూల్, జీపీ, వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కసరత్తుఅభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలు.. పనులు నిధులు (రూపాయల్లో) ప్రాథమిక పాఠశాల 1,82,05,658ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1,14,42,650 గ్రామ పంచాయతీ కార్యాలయం 43,29,640, పశువైద్యశాల భవనం 32,41,531 -
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హార్వెస్టింగ్ యజమానులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో సుమారు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, జిల్లా వ్యాప్తంగా సుమారు 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా రవాణా అధికారి శోభన్బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఏఓలు, ఏఈఓలు, హార్వెస్టర్ల యజమానులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఉత్కంఠ
ఆశావహుల్లోహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తీవ్రమైన పోటీ కారణంగా పదవులు ఎవరికి దక్కుతాయో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తం పోస్టులు నాలుగు ఉండగా.. ఫైనాన్స్ డైరెక్టర్కు ప్రత్యేక అర్హతలు, మిగతా వాటికి అర్హతలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండి సీజీఎం స్థాయిలో పని చేసిన వారు మాత్రమే ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి అర్హులు. మిగతా మూడు పదవులకు ఇంజనీరింగ్ విభాగంలో సీఈ, సీజీఎంగా పని చేసిన వారు అర్హులు. డైరెక్టర్ పదవులకు ఈనెల 9న హైదరాబాద్లో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి నలుగురు, మిగతా వాటికి 21 మంది హాజరయ్యారు. 17 జిల్లాలు.. 299 మండలాలు.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లెట్లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నది. 68,62,858 విద్యుత్ సర్వీసులున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీజీ ఎన్పీడీసీఎల్లో అప్పటి సీఎండీ అన్నమనేని గోపాల్రావు పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్లు కొనసాగుతుండగా ప్రభుత్వం వారిని 2024 జనవరి 29న తొలగించి, జనవరి 30న నూతన డైరెక్టర్ల భర్తీకి నోటిిఫికేషన్ జారీ చేసి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం సీజీఎంలుగా పని చేస్తున్న అధికారులతో పాటు రిటైర్డ్ అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలు, దరఖాస్తులు స్వీకరించిన 12 నెలల తర్వాత ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. డైరెక్టర్ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు పూర్తి టీజీ ఎన్పీడీసీఎల్లో నాలుగు పోస్టులకు గతేడాది జనవరిలో నోటిఫికేషన్ పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక.. సర్కారుకు నివేదిక! తీవ్ర పోటీ టీజీ ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ పదవుల కోసం ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలతో పాటు ఇదే కంపెనీలో పని చేసి రిటైర్డ్ అయిన వారు, టీజీ ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కోలో పని చేస్తున్న సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్లు, రిటైర్డ్ అయిన వారు దరఖాస్తు చేశారు. దీంతో డైరెక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఇంటర్వ్యూలు పూర్తి కావడంతో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందోననే టెన్షన్ దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఎలాగైనా పదవులు సాధించాలనే ఆలోచనతో ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్ విడదల చేసి దరఖాస్తులు స్వీకరించిన ఏడాది తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించడంతో వెంటనే భర్తీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ డైరెక్టర్లతో అవాంతరాలు లేకుండా పనులైతే జరుగుతున్నాయి. డిస్కంలు నష్టాల్లో కొనసాగుతున్న క్రమంలో డైరెక్టర్ల నియామకం ద్వారా ఆర్థిక భారం పడనున్నందున.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
మల్బరీ సాగు లాభదాయకం
గీసుకొండ: రైతులు వరి, పత్తి , మిరప, మొక్కజొన్న పంటలకు బదులుగా మల్బరీ సాగు చేసి ఆర్థికంగా లాభపడాలని పట్టు పరిశ్రమశాఖ సంయుక్త సంచాలకురాలు అనసూయ సూచించారు. మండలంలోని దస్రుతండాలో మల్బరీ సాగుపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మల్బ రీని రెండు ఎకరాల్లో సాగు చేస్తే రూ.మూడు లక్షల నికర ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పంట సాగుచేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. పట్టు పరిశ్రమల సహాయ అధికారులు అరవింద్, షోయబ్ఖాన్, రైతులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలునర్సంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సంపేట పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వల్లభ్నగర్ మార్కండేయ కాలనీకి చెందిన బండ లక్ష్మయ్య రాజుపేట గ్రామ శివారులోని ఎస్టీ హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని లక్ష్మయ్య సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్కండేయ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా నర్సంపేట నుంచి కమలాపురం గ్రామానికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు కొర్రె సాంబయ్య ఢీకొన్నాడు. ఈఘటనలో ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బండ లక్ష్మ య్యను ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. నేడు ‘ప్రేమకు జై’ విడుదలనెక్కొండ: మల్లం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ప్రేమకు జై’ సినిమా శుక్రవారం నెక్కొండ సూర్య థియేటర్లో విడుదల కానుంది. నెక్కొండ ముద్ద బిడ్డ బూరగాని అనిల్గౌడ్ రెండోసారి హీరోగా నటించిన ఈ సినిమా యూత్ను అలరించనుంది. ఆయన ‘వజ్రాలు కావాలా నాయనా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. మూడు ఫైట్స్, ఒక ఐటెం సాంగ్, శివుడి మీద ఒక సాంగ్ చాలా బాగుందన్న టాక్ వినిపిస్తోంది. యూత్కి నచ్చే సావరియా సాంగ్ ఈ సినిమాకు హైలెట్గా నిలువనుంది. విలన్గా సలార్ ఫేమ్ భాస్కర్, హీరోయిన్గా జ్వలిత నటించారు. జాతీయ ఎస్సీ కమిషన్కు కొండేటి శ్రీధర్ ఫిర్యాదువర్ధన్నపేట: సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున తనకు జరిగిన అవమానంపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ గురువారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సోమవారం స్థానికుడు కొండేటి బాబు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు డీజీపీ, వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణవిద్యారణ్యపురి: కవి, ప్రజా కళాకారుడు, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్ విద్యార్థి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కవి, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్విద్యార్ధి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
ఖానాపురం: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.రూ.25 వేల పరిహారం అందించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఆరెల్లి క్రాస్వద్ద గురువారం ఆయన వరి పంటలను పరిశీలించారు. అనంతరం పెద్ది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వడగళ్ల వర్షం కురిసి మూడు రోజులవుతున్నా ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో సర్వే ప్రారంభించకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. రూ.మూడు చొప్పున వడ్డీకి తీసుకువచ్చి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, నాయకులు వేజేళ్ల కిషన్రావు, వడ్డె రాజశేఖర్, ఆబోతు అశోక్, మస్తాన్, వల్లెపు సోమయ్య, మచ్చిక అశోక్, బోడ పూలు, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి -
ఆరబోసి.. ఆగం చేసి
రోడ్డును కల్లాలు చేస్తున్నారు. ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారకులవుతున్నారు ఐనవో లు మండలంలోని కొంతమంది రైతులు. ఐనవోలు నుంచి వనమాల కనపర్తి వరకు ఉన్న రోడ్డు సగాన్ని ఆక్రమించి మక్కలు ఆరబోస్తున్నారు. దీంతో ఈ దారిగుండా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు. వివిధ ప్రాంతాల నుంచి ఐనవోలు ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఈ దారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో రోడ్డులో సగభాగం మక్కలు ఆరబోసి ఉండడంతో ఎదురుగా వాహనాలు వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అదుపుతప్పి గాయాలపాలయ్యారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవా లని, ప్రభుత్వం కల్లాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. – ఐనవోలు -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని, గన్నీ సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి.. గ్రామీణులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ వైద్యులకు సూచించారు. జిల్లాలో ఇటీవల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లుగా నియమితులైన 11 మందికి కలెక్టరేట్లో నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. టీబీ, నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన సేవలను ఎంఎల్హెచ్పీలు సమర్థంగా, అంకితభావంతో అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్, ప్రోగ్రాం అధికారులు కె.లలితాదేవి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేశ్కుమార్, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సుందరీమణుల పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి.. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులు మే 14న వరంగల్కు రానున్నారని.. అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ మార్గనిర్దేశం మేరకు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్న వారికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం ప్రపంచ స్థాయిలో వరంగల్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శన అనంతరం వారు ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuకాజీపేట అర్బన్/ఖిలావరంగల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు. స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు 24 స్లాట్స్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 స్లాట్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రవేశ పె ట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మె రుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్కు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్స్ 15 నిమిషాల్లో దస్తావేజులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 53 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు. ● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 ● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ప్రతీరోజు రెండు కార్యాలయాల్లో 106– జి.నరేందర్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్ట్ వరంగల్ -
స్వామినాఽథన్ సిఫారసులు అమలు చేయాలి
సంగెం: కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కాపులకనిపర్తిలో తెలంగాణ రైతు సంఘం గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, ట్రాక్టర్, కూలీల ఖర్చులు, రైతుల శ్రమ, పెట్టుబడిని సరిగా అంచనా వేడయం లేదని విమర్శించారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంటల బీమా చేయించాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఓదెల రాజయ్య, ఊరటి అంశాలురెడ్డి, మోకిడి పేరయ్య, పి.పైడి, కర్ర రాజిరెడ్డి, రాజగోపాల్, బషీర్, మల్లేశం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 39 దస్తావేజుల రిజిస్ట్రేషన్
వరంగల్: రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న స్లాట్లతో గురువారం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 39 దస్తావేజులను రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజు పని గంటల్లో దస్తావేజులు బుక్ చేసుకునేందుకు 48 స్లాట్లు, పనివేళలు ముగిసిన తర్వాత 5 స్లాట్ల (సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చిన వారి కోసం) దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కేటాయించింది. తొలి రోజున 39 స్లాట్లు దస్తావేజుల కోసం బుక్ చేసుకోగా అందులో మూడు పార్టీలు రాకపోవడంతో 36 మందికి రిజిస్ట్రేషన్లు చేశారు. పనివేళలు ముగిసిన అనంతరం 5 స్లాట్లు అందుబాటులో ఉండగా అందులో ముగ్గురి దస్తావేజులను రిజిస్ట్రేషన్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 12 దస్తావేజులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా 10 మందికి అధికారులు పత్రాలు అప్పగించారు. సరిదిద్దేందుకు మళ్లీ స్లాట్.. స్లాట్ బుకింగ్ సమయంలో పేర్కొన్న వివరాల ప్రకారమే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేస్తారు. బుకింగ్ సమయంలో పేర్కొన్న వివరాలను సరిదిద్దాలంటే మళ్లీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ తొలగించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇతరుల పేర్లను తొలగించడం, చేర్చేందుకు అవకాశం లేకుండా పోయింది. వెంటనే పత్రాలు అందిస్తున్నాం.. వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి దస్తావేజులను వెంటనే స్కానింగ్ చేసి 20 నిమిషాల్లో అందజేస్తున్నాం. గ్రూపులుగా ఉన్న వారి దస్తావేజులను స్కానింగ్ చేయడానికి కొంత సమయం పడుతోంది. పూర్తయిన వెంటనే పత్రాలను అందిస్తున్నాం. –సైదులు, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ 20 నిమిషాల్లోనే డాక్యుమెంట్ల అప్పగింత -
అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా రాజ్కుమార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బా బా సాహెబ్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా హిస్టరీ అండ్ టూ రిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.రాజ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్కుమార్ కామన్ మెస్ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీఏసీఎస్లను బలోపేతం చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి, నూతన సహకార సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, నూతన సంఘాల ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తగా ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనల గురించి జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అదనపు కలెక్టర్కు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సోలార్ పవర్ప్లాంట్, పెట్రోల్ బంకులు, సీఎస్సీ సెంటర్లు, జనరిక్ ఔషధ కేంద్రాల ఏర్పాటు గురించి సంజీవరెడ్డి వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో పనిచేయని లిఫ్ట్ హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో పై అంతస్తులకు వెళ్లడానికి అధికారులు రెండు లిఫ్టులు అమర్చారు. అందులో ఒకటి కొద్ది రోజుల నుంచి పని చేయడం లేదు. ఇది కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. దీని వద్ద ‘లిఫ్టు పనిచేయడం లేదు’ అని అధికారులు బోర్డు అమర్చారు. కాగా.. లిఫ్టు పనిచేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందనే కారణంతో ఇలా చేస్తున్నారనే ఆరో పణలు కూడా వస్తున్నాయి. ఈవిషయంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పై అంతస్తులో ఉండే ఉద్యోగులు కోరుతున్నారు. సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్ అధికారులువరంగల్ క్రైం: వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి అనోజ్ అగర్వాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. -
సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్ అధికారులు
వరంగల్ క్రైం: జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. వాహనాలు తీసుకెళ్లండి: సీపీ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను భీమారంలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చినట్లు, స్టేషన్ల వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందించనున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం 87126 85143, 87126 85158, 87125 84557 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. -
పారా లీగల్ వలంటీర్లకు అభినందనలు
న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్ : ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పనిచేయడానికి డీఆర్డీఏ, సీనియర్ సిటిజ న్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆసక్తి చూపుతున్న పారా లీగల్ వలంటీర్లకు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ ఆధ్వర్యాన డీఆర్డీఏకు చెందిన సోషల్ యాక్టివ్ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, డీఆర్డీఏ కార్యాలయం నుంచి జి.అనిత, ఎ.సుధాకర్, వి.ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కు స్థల పరిశీలన
కాజీపేట అర్బన్ : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి బుధవారం హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ భావ్సింగ్ స్థలాన్ని పరిశీలించారు. కాజీపేట మండలం న్యూశాయంపేట పరిధి 23, 135, 389, 399, 579 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని సందర్శించిన వారు.. స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాలు అవసరం ఉండగా.. తగిన స్థలం దొరకలేదని తెలిపారు. ఎన్సీసీని పటిష్టం చేస్తాం.. కేయూ క్యాంపస్: ఎన్సీసీ విభాగాన్ని రాబో యో రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కార్యక్రమాల గురించి ఆ కళాశా ల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించా రు. ఎన్సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేతవరంగల్ క్రైం : కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 13న మరణించి న సదానందం కుటుంబానికి పోలీస్ భద్రత విభాగం రూ.7,89,920 చెక్కు మంజూరు చేసింది. బుధవారం కుటుంబ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ అందజేశారు. మరణించిన హెడ్కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రస్తుత స్థితిగతులపై ఆయ న ఆరా తీశారు. ఏఓ రామకృష్ణ, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు. జెడ్పీ వాహనాలకు వేలం హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిష త్ ఆవరణలో తుప్పు పట్టిన వాహనాలకు ఎట్టకేలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 63 మంది పాల్గొనగా.. రూ.4,01,500 విలువైన 10 వాహనాలను నలుగురు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ రవి, డీటీఓ వేణుగోపాల్, ఆత్మరాం పాల్గొన్నారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురవకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందించేలా, షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా, తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ముఖ్యమైన 42 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులకు వేసవి దష్ట్యా పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ జీవీ.భానుప్రసాద్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధి వివిధ గ్రామాల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–163 (జి) భూసేకరణ ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆయా తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో భూసేకరణ ప్రక్రియ, రైతుల భూములకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనంగా కావాల్సిన 12.38 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు కలెక్టర్కు వివరించారు. భూ సేకరణకు అవసరమైన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను తయారు చేయాలని చెప్పారు. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి ముల్కనూరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి గురించి సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ అడిగారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలని హనుమకొండ డీఆర్ ఓ, మెప్మా పీడీ వైవీ.గణేశ్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్లో పట్టణ పరిధి హనుమకొండ, కాజీపేట, పరకాల, హసన్పర్తి మండలాల్లోని 141 పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం స్టిచ్చింగ్ చేసే మహిళా సమాఖ్య సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా స్కూళ్లలో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని సిద్ధంగా ఉండాలని, నిర్దేశించిన నమూనాలో నాణ్యంగా కుట్టి మే 31 వరకు ఇవ్వాలని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి కుట్టు కూలి జతకు రూ.75 కేటాయించామన్నారు. జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, మెప్మా జిల్లా బాధ్యులు రజిత, ఎంఈఓలు మనోజ్, నెహ్రూ, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuవసూళ్లు రూ.16.44 కోట్లుఆస్తి పన్ను బకాయి రూ.71.58 కోట్లు ● ప్రభుత్వ శాఖల నుంచి వసూలుకు వెనుకంజ ● ప్రజలపై పన్ను మోపడంలో ముందంజ ● నోరుమెదపని బల్దియారావాల్సిన బకాయిలు రూ.71.58 కోట్లుఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా పన్నులతో బాదేస్తున్న గ్రేటర్ వరంగల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ నుంచి మొదలుకొని బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖ వరకు రూ.లక్షల మేర బకాయిలున్నాయి. పారిశుద్ధ్యం, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా కోసం ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసెస్మెంట్లు(భవనాలు) 1,551 ఉండగా.. గత పాత, కొత్త బకాయిలు రూ.88.02 కోట్లు అయ్యాయి. కాగా.. మార్చి వరకు కేవలం రూ.16.44 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇంకా రూ.71.58 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వరంగల్ అర్బన్: ప్రతీనెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సంస్థ బల్దియాకు కరెంట్ సరఫరా కట్ చేసిన ఘటనలున్నాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్ము చెల్లించకపోతే పెనాల్టీ లతోపాటు ఆస్తులు జప్తు చేస్తారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయకపోతే ఆర్టీఏ వారు సీజ్ చేస్తారు. ఇలా.. గతంలో బల్దియా ఆస్తులను అటాచ్మెంట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ.. గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం మాత్రం ఆస్తి పన్ను, నీటి చార్జీలు వసూలు చేయడంలో వెనుకబడింది. నిబంధనల పేరుతో సామాన్యులతో కఠినంగా వ్యవహరించే బల్దియాకు ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఏళ్ల తరబడి వాటి బకాయిల వసూలు లేకున్నా.. ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. పేదోడే నయం.. గ్రేటర్లో 2,17,585 అసెస్మెంట్లు (భవనాలు) ఉన్నాయి. 2024–25 గాను కమర్షియల్, రెసిడెన్షియల్ అసెస్మెంట్ల ద్వారా.. రూ.117.62 కోట్లు లక్ష్యం కాగా, రూ.74.90కోట్లు వసూలు చేశారు. ఇకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన 1,551 అసెస్మెంట్లు ఉండగా.. కేవలం 30 శాఖలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లించినట్లు అఽధికారులు వెల్లడించారు. గ్రేటర్ వరంగల్కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు నగర, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులున్నారు. వీరి పర్యవేక్షణలో అన్ని శాఖలు కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఆయా శాఖల ముఖ్య అధికారులతో సమావేశమై నగరంలో సుందరీకరణ, పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్యుత్ వెలుగులు అందించే బల్దియాకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం బల్దియా మేయర్, కమిషనర్లు ఆ దిశగా చొరవ తీసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల నివేదించలేకపోతున్నారు. ఇలా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పన్నుల వసూళ్ల నిర్లక్ష్యంపై ఆ విభాగాధికారులను వివరణ కోరగా.. కమిషనర్ను సంప్రదించాలని దాటవేస్తుండడం గమనార్హం.న్యూస్రీల్బల్దియాలో ఇలా..బల్దియా మొద్దు నిద్ర వసూళ్ల్లు 18.68%ఉన్నతాధికారులు చొరవ చూపాలి! -
రాజ్యాంగ రక్షణకు ముందుకురావాలి
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ హన్మకొండ: కేంద్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాల ద్వారా భారత జాతిని, భారత రాజ్యాంగాన్ని, ప్రమాద పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు.. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కే.వి.ఎల్. పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు వృథా కాకూడదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మేడిపల్లి శోభన్, నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, మంచాల రమాదేవి, వెంకటరాజం, సూర్యం, మద్దెల ఎల్లేశ్, నాగరాజు, పల్లేరు దామోదర్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి, ఉపాధ్యక్షుడు నిధి పాల్గొన్నారు. -
బదిలీల కలకలం!
వరంగల్ పోలీసు కమిషనరేట్లో మళ్లీ బదిలీల కలకలం మొదలైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పలువురు ఏసీపీలు, ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు అధికారులు ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పొందడంతో పాటు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుకున్నారు. పోలీస్శాఖలో మళ్లీ ట్రాన్స్ఫర్లు ● త్వరలోనే కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలకు స్థానచలనం? ● కీలక ఠాణాల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు ● పోస్టింగ్లకు ప్రజాప్రతినిధుల సిఫారసులే కీలకం.. ● పోలీసుశాఖపై పట్టు బిగిస్తున్న సీపీ.. తనిఖీలు, సమీక్షలతో బిజీబిజీ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల క్రితం ఐపీఎస్ అధికారుల మూకుమ్మడి బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం కమిషనర్గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సన్ప్రీత్సింగ్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షలు, సమావేశాలు, ఠాణాల ఆకస్మిక సందర్శనలతో బిజీబిజీగా ఉన్న పోలీస్ కమిషనర్.. కమిషనరేట్ పోలీసింగ్పై తనదైన మార్కు వేస్తున్నారు. ఇదే సమయంలో లాంగ్ స్టాండింగ్తో పాటు వివాదాస్పద పోలీసు అధికారులు కొందరికి స్థానచలనం తప్పదన్న ప్రచారంతో ఆశావహులు సిఫారసులకు పోటీపడడం చర్చనీయాంశం అవుతోంది. వివాదంగా పలు విభాగాలు.. పోలీసు కమిషనరేట్లో శాంతిభద్రతలతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, క్రైమ్స్ తదితర విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విభాగాల్లో పని చేస్తున్న కొందరు తమ పనులు కాకుండా ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటూ చికాకు కలిగిస్తున్నారన్న చర్చ ఉంది. వివిధ స్థాయిల్లోని అధికారులు కొందరు తమ సన్నిహితులతో బహిరంగంగానే చర్చిస్తున్నారు. ప్రధానంగా నగరంలో కాసులు కురిపించే ‘భూదందా’ల్లో మితిమీరిన జోక్యంపై ఆయా శాఖల అధికారులు నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలపై సీపీ, డీజీపీల వరకు ఫిర్యాదులు వెళ్లాయన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రజాప్రతినిధి, కుటుంబసభ్యుల అండదండలున్న ఓ ఏసీపీ తన పరిధిలోని ఠాణాలకు ఎస్హెచ్ఓలను రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఆ అధికారి పరిధి ఓ ఠాణా ఎస్హెచ్ఓ ఓ హోంగార్డుతోపాటు క్రైం హెడ్కానిస్టేబుళ్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. కమిషనరేట్ పరిధిలోని మరో ఏసీపీ పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ పొందారన్న ప్రచారం పోలీసుశాఖలో హాట్టాపిక్గా మారింది. వరంగల్ నగరంలోని నాలుగు ఠాణాల్లో నిత్యం భూదందాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. ఓ ఠాణాలో 25 తులాలకుపైగా బంగారం రికవరీ కేసులో ‘ఖర్చు’ల కింద పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిబ్బందిపై బూతు పురాణం.. ఫోన్ పే ద్వారా డబ్బుల స్వీకరణ.. ‘మీరేమన్న చేసుకోండి నాకింతివ్వండి’ అంటూ ఎస్సైలకు టార్గెట్ విధించారన్న ఆరోపణల్లో ముగ్గురు ఎస్హెచ్ఓలపైనా శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు సమాచారం. గ్రేటర్ ఠాణాలపైనే అందరి గురి..గ్రేటర్ వరంగల్ కమిషనరేట్ పోలీస్టేషన్లలో పనిచేసేందుకు కొందరు అధికారులు.. త్వరలో జరిగే బదిలీల కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు సన్ని హితులై ఉమ్మడి వరంగల్తో పాటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేస్తున్న ఓ ఏసీపీ గ్రేటర్ పరిధిలో పోస్టింగ్ కోసం పొరుగు జిల్లాలోని ఓ సీనియర్ మంత్రితో స్థానిక ప్రజాప్రతినిధులకు సిఫారసు చేయించుకున్నట్లు తెలిసింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న కొందరు ఏసీపీలు సైతం ప్రధానమైన డివిజన్లపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, అందులో ఒక్కరిద్దరికి హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. కాగా హనుమకొండ, కేయూసీ, హసన్పర్తి, సుబేదారి, కాజీపేట, హసన్పర్తి, మట్టెవాడ.. నగరం చుట్టూ ఉన్న ధర్మసాగర్, ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట, ఎల్కతుర్తి తదితర ఠాణాల పోస్టింగ్లు పట్టేందుకు పోటాపోటీగా ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఠాణాలకు ఎస్హెచ్ఓలు చేరి ఏడాదైనా కాకపోయినప్పటికీ.. వివిధ కారణాలతో స్థానచలనం తప్పదన్న సమాచారంతో ఖర్చీఫ్లు వేసుకుంటుండడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ అర్బన్ : టీఎస్ బీపాస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్వి ని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం బల్ది యా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్దేశిత 21 రోజుల గడువులోగా ఫైల్ క్లియ ర్ చేయాలని, షార్ట్ ఫాల్ ఉంటే దరఖాస్తుదారుడికి సూచించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, రజిత శ్రీనివాస్రెడ్డి, ఏర్షాద్ పాల్గొన్నారు. ఎర్లీ బర్డ్ స్కీంపై అవగాహన కల్పించాలి ఎర్లీ బర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీడీఎంఏ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్ పాల్గొన్నారు. -
‘టైలరింగ్ హబ్’లు ఏర్పాటు చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ఇందిరా మహిళా శక్తి పథకం కింద గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ‘టైలరింగ్ హబ్’ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగానికి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా దుస్తులు కుట్టడానికి వీలుగా కటింగ్ చేసి ఇవ్వడంతో పాటు కాజా బట్టన్స్ కుట్టే మిషన్లను బల్దియా పరిధి వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున టైలరింగ్ హబ్లను(యూనిట్కు రూ.20 లక్షల వ్యయం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ స్కీంలో భాగంగా ప్రభుత్వం వరంగల్ జిల్లాకు మిర్చి ప్రొడక్షన్ యూనిట్ కోసం రూ.కోటి మంజూరు చేసినందున మిర్చి పౌడర్ యూనిట్ స్థాపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనందున ఎన్ఐటీ వద్ద యూనిట్ ఏర్పాటు చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పారు. సారీ రోలింగ్, టైలరింగ్, టై అండ్ డై మగ్గం వర్క్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి బల్దియా పరిధి కమ్యూనిటీ హాళ్లలో వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు 10 చొప్పున, వర్ధన్నపేట 6, పరకాలకు 3 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిక్షణను నగర ప్రాంతాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ అలివేలు, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీలత, సఫియా, రమ, సకినాల రమేశ్, నాగరాజు రాజ్కుమార్, అలీ, తదితరులు పాల్గొన్నారు. -
మామిడి..తగ్గిన దిగుబడి
నర్సంపేట: జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా మా మిడి రైతుకు నష్టాలు తప్పడం లేదు. కోటి ఆశలతో మామిడి తోటలను పెంచుతున్న రైతులకు ఒక ఏడాది దిగుబడి రాకపోవడం, మరో ఏడాది ప్రకృతి వైపరీత్యాలు తప్పడం లేదు. మంచిగా దిగుబడి వచ్చిన సంవత్సరం ధరలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. జిల్లాలో 1,508 మంది రైతులు 5,960 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశా రు.దీని ద్వారా 14,897మెట్రిక్ టన్నుల కాయ దిగుబడి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం వచ్చిన గాలి బీభత్సానికి 10,500 మెట్రిక్ టన్నుల కాయ రాలిపోయింది. దీంతో మా మిడి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఎకరాకు రూ.20 వేల అదనపు ఖర్చు. రైతులు ఎకరం మామిడి తోటను రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లించి కౌలుకు తీసుకుని పూత దశ నుంచి క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నారు. అధిక కాత కోసం సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి రావడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు వస్తోంది. దిగుబడి వచ్చే సమయంలో గాలి వానలు, వడగళ్ల వానలు వచ్చి ఉన్న కొద్దిపాటి కాయను నేలమట్టం చేస్తున్నాయి. దీంతో ప్రతీసారి మామిడి సాగుపై ఆశతో ఉన్న రైతులకు నష్టాలు వస్తున్నాయి. పూత నిలువక.. కాత కాయక.. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి తోటలకు మొదట్లో పూత మంచిగానే వచ్చింది. కానీ, పూత నిలువకపోవడంతో 75 శాతం కాయలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి, నర్సంపేట, నెక్కొండ, మండలాల్లో మామిడి తోటల పరిస్థితి దయనీయంగా ఉంది. దిగుబడి తగ్గడంతో ఈసారి మామిడికి ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 75 శాతం కాయలు రాని పరిస్థితి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులు సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి జిల్లాలో 1,508 మంది రైతులు.. 5,960 ఎకరాల్లో సాగు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు వేముల సంపత్రెడ్డి. కన్నారావుపేట గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటను ఆరు సంవత్సరాలుగా పెంచుతున్నాడు. రెండు సంవత్సరాలు ఆశాజనకంగానే దిగుబడి వచ్చింది. కానీ, ఈ ఏడాది సమీపంలోని మరో ఎకరం మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటివరకు రూ.75 వేల పెట్టుబడి పెట్టినా కాయ అంతంత మాత్రంగానే వచ్చింది. రూ.25 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక సంపత్రెడ్డి పరిస్థితే కాదు.. జిల్లాలో మామిడి తోటలను పెంచుతున్న అనేక మంది రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మూడు సంవత్సరాలుగా మామిడి సాగు వివరాలు.. మండలం రైతులు ఎకరాలు వర్ధన్నపేట 629 2,829.07 రాయపర్తి 239 1,099.07 పర్వతగిరి 349 1,249.18 ఖిలా వరంగల్ 70 209.34 సంగెం 48 146.11 నల్లబెల్లి 38 130.34 నెక్కొండ 25 88.25 నర్సంపేట 39 84.32 గీసుకొండ 42 56.04 చెన్నారావుపేట 11 29.28 ఖానాపురం 6 17.29 వరంగల్ 5 5.16 దుగ్గొండి 7 13.02 -
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
నర్సంపేట రూరల్: మొక్కజొన్న పంటను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి, అధ్యక్షుడు బుర్ర ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం భాంజీపేట గ్రామానికి చెందిన రైతు పిట్టల మల్లయ్యతో వారు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘనాయకులు మాట్లాడుతూ చంద్రయ్యపల్లి గ్రామానికి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నాలుగు సంవత్సరాలుగా మల్లయ్య పురుగుల మందులు తీసుకొచ్చి పంటలకు స్ప్రే చేస్తున్నాడు. దీంతో ఆయన రూ.20 వేలు సదరు వ్యాపారికి చెల్లించాల్సి ఉంది. కొంతమందిని తీసుకొచ్చి కల్లం వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న పంటను వ్యాపారి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మల్లయ్య అడ్డుకున్నాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాస్లైన్ రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు అడ్డూరి రాజు, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకులు భూమా అశోక్, ఈరెల్లి రాంచందర్, శివరాత్రి కుమారస్వామి, ఎలకంటి కుమారస్వామి, ఓదెల రాజయ్య, లింగయ్య పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కొండాపూర్లో రూ.2.63 కోట్లతో చేపట్టిన 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎన్పీడీసీఎల్ సీఈలు రాజుచౌహాన్, జవంత్ చౌహాన్తో కలిసి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవరెడ్డి మాట్లాడారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మురళీనగర్, గణేశ్నగర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, కొండాపూర్ చెరువును గోదావరి జలాలతో నింపాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కాగా, త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతంరెడ్డి, నర్సంపేట డీఈలు హర్జీ, తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, ఏఈ హరిబాబు, ప్రత్యేక అధికారి పవిత్ర తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
40 ఎకరాలు కౌలుకు తీసుకున్న..
10 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలు లీజుకు తీసుకుంటున్న. ఈ ఏడాది కూడా 13 ప్రాంతాల్లో రూ.5 లక్షలు వెచ్చించి 40 ఎకరాలను కౌలుకు తీసుకున్న. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న. మరో 10 రోజులు అయితే మామిడి కాయలు అమ్ముకుంటే రూ.6 లక్షలు వచ్చేవి. రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు 70 శాతం కాయ రాలిపోయింది. బుధవారం వరంగల్ మార్కెట్లో రాలిన కాయలను అమ్మితే రూ.50 వేలు వచ్చాయి. ఈసారి భారీగా నష్టపోయాను. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. – గౌని నవీన్, మామిడి రైతు -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
సంగెం: ప్రాఽఽథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖానల వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు సూచించారు. తీగరాజుపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన)ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖి చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని, వ్యాధి నిరోధక టీకాలు అందించాలని ఆదేశించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగిన చికిత్సలు అందించాలని, వేసవిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి లావణ్య, ఏఎన్ఎం సునంద, కవితాకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్య జిల్లాగా మార్చాలివరంగల్: వేసవికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్కుమార్ సూచించారు. పైడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ కార్నర్ నిర్మించాలని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తగిన చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఆశ కార్యకర్త నుంచి అందరూ సమన్వయంతో పనిచేసి తగిన ఫలితాలు రాబట్టి, వరంగల్ను ఆరోగ్య జిల్లాగా మార్చడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త యశోద, ఆశ కార్యకర్తలు తిరుపతమ్మ, యశోద, జ్యోతి, అనిత, ప్రభ, పద్మ, సుమలత, గాయత్రి పాల్గొన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా తీగల రాజేశ్గౌడ్సంగెం: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీ ఐ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్గా చింతలపల్లి గ్రామానికి చెందిన తీగల రాజేశ్గౌడ్ నియమి తులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేశ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించారు. రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులునేటి నుంచి కొత్త పద్ధతిలో స్లాట్ బుకింగ్ వరంగల్: రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో బుధవారం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నిబంధన ప్రకారం స్లాట్ల బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తిచేసే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింది జిల్లాలోని వరంగల్, ఖిలావరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈపద్ధతి అమలు చేయనున్నారు. గురువారం నుంచి ఈ రెండు కార్యాలయాల్లో కొత్తగా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గతంలో డాక్యుమెంట్లలో ఏమైనా తప్పులు ఉంటే కార్యాలయంలో సరి దిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఉండేది. కొత్త పద్ధతి ప్రకారం ఈ ఆప్షన్ను తొలగించారు. స్లాట్ల బుకింగ్ సమయంలో నమోదు చేసిన వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఒకవేళ ఏదైనా తప్పుగా నమోదు చేస్తే సదరు రిజిస్ట్రేషన్దారుడు మళ్లీ కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే లావాదేవీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మె గాటెక్స్ టైల్ పార్కు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాల్లో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భూనిర్వాసితులు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టర్ కాన్ఫరెన్్స్హాల్లో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన జి ల్లాస్థాయి సంప్రదింపుల సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్కు సంబంధించి ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల భూనిర్వాసితులతో జనరల్ అవార్డు,కన్సర్న్ అవార్డులపై చర్చించా రు.ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతు న్న తమకు అధిక ధర కావాలని,రోడ్డు సౌకర్యం కావాలని నిర్వాసితులు కోరారు. నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సంగెం మండలం చింతలపల్లి భూనిర్వాసితులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగేశ్వరరా వు, రాజ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాయపర్తి: సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. కొలనుపల్లి గ్రామంలోని చిట్యాల పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతుల ఇంట్లో బుధవారం వారు సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం వారు పెద్దసోమయ్య–రాజనర్సమ్మ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీసీఓ నీరజ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంఅన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం,బురహాన్పల్లి,కొలన్పల్లి గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధా న్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ ప్రకాశ్, ఏఓ వీ రభద్రం, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, వైస్ఛైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కొలనుపల్లిలో పెద్దసోమయ్య– రాజనర్సమ్మ ఇంట్లో సహపంక్తి భోజనం -
నీటిఎద్దడి లేకుండా చూడాలి
నర్సంపేట: వేసవిలో నీటిఎద్దడి లేకుండా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధి కారులను ఆదేశించారు. నర్సంపేట పట్టణంలో ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఎంపీడీఓలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అమృత్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు దేవేందర్రెడ్డి, అజహర్, పబ్లిక్ హెల్త్ డీఈ రవీంద్రనాథ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
వరంగల్
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నిఘా నీడలో మూల్యాంకనం టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం అధికారులు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు. – 8లోuకొమ్మాల ఆలయ ఆదాయం రూ.64.80 లక్షలుగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ. 64,80,254 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. జాతర అనంతరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వచ్చిన ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.9,16,892, ఇతర సేవల ద్వారా రూ. 6,52,266 ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి రూ. 15,69,158 రాగా.. జాతర, బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం రూ. 49,11,096 కలుపుకుంటే రూ.64,84,254 ఆదాయం వచ్చిందని వివరించారు. ఇంత మొత్తం ఆదాయం జాతర చరిత్రలో ఎన్నడూ సమకూరలేదని చెబుతున్నారు. రెండోసారి హుండీ లెక్కింపులో మిశ్రమ వెండి నాలుగు కిలోలు, మిశ్రమ బంగారం 12 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, దేవా దాయ శాఖ పరిశీలకుడు డి.అనిల్కుమార్, శ్రీ లక్ష్మీ సేవాసమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలిదుగ్గొండి: వైద్యులు, స్బింది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ రకాల రికార్డులు పరిశీలించారు. పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎన్ఎంలు ప్రతిరోజు సబ్ సెంటర్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటిలో వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యులు రాకేశ్, భరత్కుమార్, సీహెచ్ఓ సాంబయ్య, సలోమి, స్టాఫ్నర్సు సబిత, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. నాగేంద్రస్వామికి పూజలుగీసుకొండ: మండలంలోని ఊకల్హవేలి నాగేంద్రస్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు, కాసం వస్త్ర ప్రపంచం యజమాని కాసం నమశ్శివాయ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి తన జన్మదిన సందర్భంగా సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ప్రధా న అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీ హర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేశారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్ఆర్ఎస్–2015 దరఖాస్తుల పరిష్కారంలో ‘కుడా’ జాప్యం ● ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోని అధికారులు ● పదేళ్లుగా మూడువేల మంది అర్జీదారుల ఇబ్బందులు ● ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కి సాక్షి, వరంగల్: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్ 12న ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. క్లియర్ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల భారం.. ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళితే ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్ఆర్ఎస్ ఫీజు 14 శాతంతో పాటు కాంపౌండ్ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్లియర్ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర● రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు పర్వతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు విమర్శించారు. మండలంలోని బూరుగుమల్ల, మోత్యతండా గ్రామాల్లో మంగళవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజలు స్పందించాలని సూచించారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్షా అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందడుగు వేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాకేశ్, రమేశ్, నాయకులు లింగారెడ్డి, నరుకుడు రవీందర్, కుమార్, శేషగిరిస్వామి, మోహన్రెడ్డి, పూర్ణచందర్, బాషానాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారదవరంగల్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్బాబు, అధికారులు పాల్గొన్నారు. 15 వరకు ఇంటర్న్షిప్ రెండో దశ దరఖాస్తుకు గడువు భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశ దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇంటర్న్షిప్కు ఎంపికై న విద్యార్థులకు మొదటి నెల భత్యం రూ. 5,000..ఆ తర్వాత నుంచి రూ.6,000 మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరంలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 11 6090ను సంప్రదించాలని ఆమె కోరారు. సహకార శాఖ అభివృద్ధిపై సమావేశం.. జిల్లా సహకార శాఖ అభివృద్ధి, జన ఔషధిపై కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీసీఓ నీరజ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మత్స్యశాఖ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం వాల్పోస్టర్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం పోషణ పక్షం వాల్పోస్టర్ను కలెక్టర్ సత్యశారద, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ అభియాన్లో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి పాల్గొన్నారు. న్యూస్రీల్ హంటర్రోడ్డులోని నందిహిల్స్ రోడ్డు నంబర్–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కుడా చెల్లించారు. ప్లాట్కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళితే ఎల్ఆర్ఎస్ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్ఆర్ఎస్ ‘కుడా’ క్లియర్ చేస్తే అప్పటి మార్కెట్ విలువ సేల్ డీడ్ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ఏం చేయాలంటే... ‘కుడా’ ఎల్ఆర్ఎస్ వరంగల్ పేరుతో హనుమకొండలోని యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసిన అకౌంట్కే 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్ఆర్ఎస్ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్ అవుతాయి. ఇప్పటికే తమకు ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్ చేయాలి. 2020 ఎల్ఆర్ఎస్ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం..
ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
ముందే హెచ్చరించిన సాక్షి
ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 4వ తేదీన గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్లపై బెట్టింగ్క్యాంపుపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితుల నుంచి రూ.10,500, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముదాల శ్రీనివాస్, బోకరి సంతోశ్ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేలు నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఎజెంట్ హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మెడిశెట్టి నరేశ్తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై పోలీసులు, టాస్క్ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. – వరంగల్ క్రైంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటివరకు బెట్టింగ్కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేసి, అతని బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం ఈ సీజన్లో నాలుగు కేసులు నమోదు ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీ అరెస్ట్ అతడి అకౌంట్లలో భారీగా లావాదేవీలుఈ సీజన్లో నాలుగు కేసులు..u -
రాలిన మామిడి కాయలు
నల్లబెల్లి: మండలంలోని పలు గ్రామాల్లో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలిపోగా, మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లి, రాంతీర్థం, అర్వయ్యపల్లి, గుండ్లపహాడ్, పంతులపల్లి గ్రామాల్లో మామి డి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా గ్రామా ల పరిధిలో 90 ఎకరాల్లో సుమారు 60 టన్నుల మామిడికాయలు రాలినట్లు కౌలు రైతు నూనె భిక్షపతి తెలిపారు. అర్వయ్యపల్లి గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లిలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. సోమవారొం రాత్రి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడగా.. అధికారులు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
గాలి దుమారానికి కొట్టుకుపోయిన రేకులు
నెక్కొండ: గాలి దుమారానికి నిర్మాణంలో ఉన్న గేదెల షెడ్డు రేకులు కొట్టుకుపోయిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మండలంలోని అజ్మీరా మంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మామిడితోట తండాలో గేదెలకు షెడ్డు నిర్మిస్తున్నాడు. ఈ నెల 7 రాత్రి వీచిన గాలి దుమారానికి రేకులు కొట్టుకుపోగా, సిమెంట్ గోడలు కూలిపోయాయి. దీంతో సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని వెంకన్న వాపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఈదురు గాలులు.. పంటలు నేలపాలు
దుగ్గొండి: నర్సంపేట డివిజన్లో సోమవారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పలు గ్రామాల్లో పంటలు నేలవాలి, ఇళ్లు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దుగ్గొండి మండలం మందపల్లి, చాపలబండ, దుగ్గొండి, లక్ష్మీపురం గ్రామాల్లో అరటి తోటలు, అడవిరంగాపురం గ్రామంలో సింగతి సునీల్, రాజన్న, వెంకటాపురం గ్రామానికి చెందిన ఎరుకల యుగంధర్ బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. శివాజీనగర్ గ్రామంలో బుస్సారి రామారావు మునగతోటలో చెట్లు విరిగి పోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయతాండవం చేసిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వందల ఎకరాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి కూడా ఈదురు గాలులు వీచాయి. పంటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, బొప్పాయి తోటలను డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి మంగళవారం పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. రైతులకు లక్షల రూపాయల నష్టం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
ముందే హెచ్చరించిన సాక్షి
ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్ల బెట్టింగ్ క్యాంపుపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితుల నుంచి రూ.10,500, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముద్రాల శ్రీనివాస్, బోకరి సంతోశ్ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేల నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్ హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మేడిశెట్టి నరేశ్తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై పోలీసులు, టాస్క్ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. – వరంగల్ క్రైంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటివరకు బెట్టింగ్కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేసి, అతని బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం ఈ సీజన్లో నాలుగు కేసులు నమోదు ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీ అరెస్ట్ అతని అకౌంట్లలో భారీగా లావాదేవీలుఈ సీజన్లో నాలుగు కేసులు..u -
రీల్స్ ఆపి రియల్ లైఫ్లోకి రావాలి
కమలాపూర్ : స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి రీల్స్ ఆపి రియల్ లైఫ్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ సూచించారు. మండలంలోని ఉప్పల్లో మంగళవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే, బీజేపీ గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను అవమానపరస్తోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ప్రణవ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి రీల్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. నియోజక వర్గానికి సుమారు 200కు పైగా కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరై నెలలు దాటినా ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదన్నారు. సరిగ్గా చెక్కులకు గడువు తీరే ముందు రోజు వాటిని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యగౌడ్, నాయకులు రమేశ్, చరణ్ పటేల్, నారాయణరెడ్డి, భిక్షపతి, మహేష్, రమేశ్, గణేష్ పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ -
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu20నుంచి ‘ఓపెన్’ పరీక్షలువిద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 20నుంచి 26వ తేదీవరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలపై మంగళవారం డీఆర్ఓ గణేశ్.. డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాటు వివిధ శాఖల అధికారులు, డీఐఈఓ తదితరులతో సమీక్షించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయని కోఆర్డినేటర్ పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్ : సికింద్రాబాద్లోని లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను మంగళవారం ఎంపిక చేశారు. బి.నితిన్ 50 కేజీల కేటగిరీలో, ఎన్.రాజర్శి 80 కేజీలు, జి.భరత్ 65 కేజీల విభాగాల్లో ఎంపికై నట్లు కార్యదర్శి పోతరాజు రాజేందర్ తెలిపారు. ‘కై టెక్స్’లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురూ..గీసుకొండ: వరంగల్ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో కేరళకు చెందిన చిన్న పిల్లల దుస్తుల తయారీ కై టెక్స్ కంపెనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ మేరకు 25,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు, ఇన్చార్జ్లు తదితర విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీచేయనుంది. రెండు రోజుల నుంచి పలువురు నిరుద్యోగులు కంపెనీ వద్దకు వచ్చి తమ బయోడేటాలు అధికారులకు సమర్పిస్తున్నారు. నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు విద్యారణ్యపురి : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి (బుధవారం)నుంచి అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను టైంటేబుల్ ప్రకారం నిర్వహించాలని ఆయా డీఈఓలు హెచ్ఎంలను ఆదేశించారు. ఈనెల 9నుంచి 17వ తేదీ వరకు ఎస్ఏ–2 పరీక్షలు కొనసాగుతాయి. ఫలితాలను 23న ప్రకటించి విద్యార్థులకు క్యూమిలేటివ్ రికార్డులు అందజేయాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఎస్ఏ–2 పరీక్షల అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను డీసీఈబీ కార్యాలయంనుంచి ఎంఈఓలకు పంపారు. అక్కడినుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలు తీసుకెళ్లారు. ఎంఈఓలు, జిల్లా నోడల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు రోజూ పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓ వాసంతి, డీసీఈబీ కార్యదరి బి.రాంధన్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్–2015 దరఖాస్తుల పరిష్కారంలో ‘కుడా’ జాప్యం ● ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోని అధికారులు ● పదేళ్లుగా మూడువేల మంది అర్జీదారుల ఇబ్బందులు ● ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కి సాక్షి, వరంగల్: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్ 12న ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపుగా కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. క్లియర్ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల భారం.. ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళ్తే ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్ఆర్ఎస్ ఫీజు 14 శాతంతోపాటు కాంపౌండ్ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్లియర్ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి.నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలి ఎల్కతుర్తి : వేసవిలో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కలకు సరిపడా నీరు అందించాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) విద్యాలత అధికారులకు ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, భీమదేవరపల్లి గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. నర్సరీలకు అవసరమైన షేడ్ నెట్లు, నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమెవెంట ఎంపీడీఓ వీరేశం, పంచాయతీ కార్యదర్శి అనంత్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి ● వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు, అధికారులు పాల్గొన్నారు.న్యూస్రీల్హంటర్రోడ్డులోని నందిహిల్స్ రోడ్డు నంబర్–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కూడా చెల్లించారు. ప్లాట్కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళ్తే ఎల్ఆర్ఎస్ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్ఆర్ఎస్ ‘కుడా’ క్లియర్ చేస్తే అప్పటి మార్కెట్ విలువ సేల్ డీడ్ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ఏం చేయాలంటే... ‘కుడా’ ఎల్ఆర్ఎస్ వరంగల్ పేరుతో హనుమకొండలోని యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసిన అకౌంట్కే 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్ఆర్ఎస్ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్ అవుతాయి. ఇప్పటికే తమకు ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్ చేయాలి. 2020 ఎల్ఆర్ఎస్ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి. జెడ్పీ సీఈఓ విద్యాలత -
1నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
హన్మకొండ అర్బన్ : మే 1నుంచి జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, విజయవంతం చేసేందుకు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 1నుంచి 31వరకు పలు రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 (బుధవారం) నుంచి 25వ తేదీవరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. దాతల సహకారంతో శిబిరాల వద్ద క్రీడాకారులకు పండ్లు, పాలు, అల్పాహారం వంటివి అందించేందకు చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 22 అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే విధంగా క్రీడా సంఘాలు కృషి చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్ మాట్లాడుతూ క్రీడా శిబిరంలో 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటిన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, క్రికెట్, లాన్టెన్నీస్, సాఫ్ట్బాల్, హాకీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటిన్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 25వ తేదీలోగా హనుమకొండ జేఎన్ఎస్లోని కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ వాసంతి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు శ్యామల పవన్కుమార్, మహ్మద్ కరీం, పింగిళి రమేశ్ రెడ్డి, తోట శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంహసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్ట్ కింద పెంబర్తి గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారంపరిశీలించారు. మండల పరిధిలో ఉంటే తహసీల్దార్, పక్క మండలంలో ఉంటే ఆర్డీఓ ద్వారా ఇసుక కూపన్లు అందజేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్షాపును కలెక్టర్ తనిఖీ చేసి, సన్న బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ కర్ణాకర్ రెడ్డి, హౌజింగ్ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్ధార్థ నాయక్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హౌజింగ్ ఏఈ నరేందర్ రాజ్, మాజీ సర్పంచ్ పూల, కారోబార్ సదానందం పాల్గొన్నారు. ఆసరా మార్ట్ ప్రారంభం హసన్పర్తి మండలం వంగపహాడ్లో మహిళా సంఘం సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆసరా మార్ట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. మహిళలు మార్ట్ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ నవీన్కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు, డీడబ్ల్యూఓ జయంతి, ఓమిని మార్ట్ ఎండీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య -
బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం..
ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
‘ఎండాకాలం’ అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేసవికి సంబంధించిన ఆయా శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్ల ఏర్పాటు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు పాఠశాలలు, పని ప్రదేశాల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ తరగతి గది వద్ద నీటి కుండను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి 87126 99150, హనుమకొండ ఫైర్ స్టేషన్ 87126 99304, పరకాల ఫైర్ స్టేషన్ 87126 99306 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuహన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావా ణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావా ణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 12, తహసీల్దార్ హసన్పర్తి 7, డబుల్ బెడ్రూం నోడల్ ఆఫీసర్ 6, ఆర్డీఓ హనుమకొండ 6తో పాటు వివిధ శాఖల సంబంధించి మొత్తం 106 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వేసవి నేపథ్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, జలాశయాల వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజవాణిలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. వీలైతే జలాశయాల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటుతో పాటు గ్రామాల్లో చిన్న పిల్లలు, పెద్దలు సంరక్షకులు లేకుండా బావులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లవద్దని డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని రాజేందర్, సీతారామారావు, తాడూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలి.. ధర్మసాగర్ మండలం ముప్పారంలో రైతుల నుంచి అక్రమంగా ఫారెస్ట్ అధికారులు తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్తో రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. అటవీ శాఖ అధికారులు మాత్రం రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్యన్యూస్రీల్ -
వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్యజిల్లాలోని అన్ని మండలాల పరిధి 150 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్ను తయారు చేసి వెంటనే అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతా వాటిని కూడా వారంలోగా ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు సంచులు సరిపడా నిల్వ ఉంచాలని, ధాన్యం కాంటాలు సరిగ్గా ఉన్నాయా లేదా? అని ముందే చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమశాతం లేకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద తేమశాతాన్ని కొలిచే మాయిశ్చరైజర్ మిషన్, టార్ఫాలిన్లు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో పేమెంట్స్ జరగాలన్నారు. క్రమపద్ధతిలో రైతులకు కూపన్లు అందజేయాలని, వాటి ప్రకారంగానే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమురయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్సింగ్, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, 2 బీహెచ్కే ఇళ్ల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక కూపన్లు అధికారులు అందజేయాలన్నారు. వారంలో మూడు రోజులు అధికారులు పర్యవేక్షించాలని, బేస్మెంట్ వరకు వచ్చిన వాటిని బిల్లుల చెల్లింపునకు పంపాలన్నారు. లబ్ధిదారులుగా ఉన్న పురుషుల కుటుంబాలకు చెందిన వాటిలో రేషన్కార్డులోని మహి ళల పేరును ఖరారు చేస్తూ జాబితా సమర్పించాలన్నారు. అదేవిధంగా యూడీఐడీ కార్డులు, చేయూత పెన్షన్లపై అధికారులతో చర్చించారు. -
ఒంటిమామిడిపల్లి పాఠశాల సందర్శన
పాఠశాల అభివృద్ధిపై ఆరా తీసిన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఆరుట్ల పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఒకప్పడు పాఠశాల మూతబడి.. తర్వాత మళ్లీ ఎలా పునఃప్రారంభమైందనే అంశాలను తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? విద్యా కమిటీ పాఠశాల అభివృద్ధి కోసం దశల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంది? తదితర అంశాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. పీఎంశ్రీ, వివిధ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో తరగతి గదిలో ముఖాముఖి మాట్లాడి డిజిటల్ తరగతులు ఎలా నడుస్తున్నాయని అడిగారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. అదేవిదంగా విద్యార్థులు ఉపయోగిస్తున్న టాయిలెట్లను పరిశీలించి సరిగ్గా నిర్వహించాలని హెచ్ఎంను ఆదేశించారు. ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ పాఠశాల సమస్యలను విద్యా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు తరగతుల నిర్మాణం కావాలని, పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయినప్పటికీ ఎస్జీటీ, ఎస్ఏలు మాత్రమే ఉన్నారని పీజీ హెచ్ఎం అలాట్ కాలేదన్నారు. అదేవిదంగా పీఈటీ పోస్ట్ మంజూరు చేయించాలని కోరారు. అదేవిదంగా మన ఊరు మన పాఠశాల ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చించి పనులు చేయగా.. ఇంకా సుమారు రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాలని మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు పాఠశాల విద్యా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆ గ్రామ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పులి ఆనందం, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఏఏపీసీ చైర్పర్సన్ సకీనాబీ, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఒకరి మెప్పు.. ప్రజలకు ముప్పు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని బస్టాండ్ మూలమలుపు హనుమాన్ టెంపుల్ నుంచి అలంకార్ వరకు చేపట్టిన స్మార్ట్సిటీ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరవాసులకు ప్రయోజనకరంగా ఉండాల్సిన అభివృద్ధి పనులను కొందరు ప్రైవేట్ వ్యక్తుల మెప్పు కోసం నిర్మాణాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోటి పనుల్లో ఇష్టారాజ్యం.. స్మార్ట్సిటీ పథకం ద్వారా రూ.కోటి నిధులతో 7, 10 డివిజన్ల పరిధి హనుమకొండ కొత్తబస్టాండ్కు వెళ్లే దారిలో మూలమలుపు నుంచి అలంకార్ వరకు దాదాపు 60 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. నెల క్రితం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదించిన విధంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ దారి మళ్లింపు.. బస్టాండ్ మూలమలుపులో పనులు ప్రారంభమైన మారెమ్మ చెట్టు వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి బడా షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నాడు. ఏడాది క్రితం ప్రారంభించిన ఈకాంప్లెక్స్ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. కాంప్లెక్స్ ప్రధాన గేట్ ఎదుట నుంచి డ్రెయినేజీ ఉండగా.. ప్రస్తుతం దాన్ని పూర్తిగా మూసేశారు. అందుకోసం వేసిన సీసీ రో డ్డును రెండు రోజులకే తవ్వి కొత్తగా డ్రెయినేజీ కో సం కల్వర్టును నిర్మించారు. మచిలీబజార్ నుంచి మారెమ్మ చెట్టు ముందు భాగం, పింజర్ల వీధి మీదుగా చౌరస్తా పెద్ద నాలాలో కలవాల్సిన నీరు, ఇ ప్పుడు వంకర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పొంచి ఉన్న ముంపు కాంట్రాక్టర్ చేపట్టిన అశాసీ్త్రయ పనులతో వర్షాకాలంలో వరద ముంపు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీని అడ్డంగా నిర్మించడం వల్ల మచిలీబజార్, రాజ్పుత్ వాడ, అగ్గలయ్య గుట్ట నుంచి వచ్చే వరద నీరు సాఫీగా వెల్ల కుండా మారెమ్మ చెట్టు వద్ద నిలిచిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
11న పోలింగ్.. అనంతరం ఫలితాలు వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల స్వీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే... వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానా నికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్/కల్చరల్కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్కుమార్, జాయింట్ సెక్రెటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి నాగభూషణం, పి.ప్రవీణ్కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. హనుమకొండలో.. హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి టి.కృష్ణమూర్తి, ఎ.మార్కండేయ, టి.నరేందర్, ఎం.రంజిత్, పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి స్థానానికి వి.నరేందర్, పి.నవీన్కుమార్, కె.రవి, బి.శంకర్ బరిలో నిలిచినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కె.రమేశ్బాబు తెలిపారు. ఉపాధ్యక్ష స్థానానికి ఎస్.రాజన్బాబు, సీహెచ్ రమేశ్, కార్యవర్గ సభ్యులుగా పి.కమలాకర్, సీహెచ్ నిఖిల్కుమార్, కె.ప్రదీప్, ఆర్.ప్రవీణ్కుమార్, బి.శివకుమార్ యాదవ్, బి.సునీల్కుమార్ బరిలో నిలిచారు. కాగా.. జాయింట్ సెక్రటరీగా ఎంకే భీంరావ్జీ అంబేద్కర్, జాయింట్ సెక్రటరీ (మహిళా) ఆర్.నాగేంద్ర, 30 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.రాజేశ్వర్, 20 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.ఆశీర్వాదం, సీనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా ఇందిరా వేదకుమారి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 11వ తేదీ (శుక్రవారం) ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువరించనున్నట్లు ఎన్నికల అధికారుల పేర్కొన్నారు. -
పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట
మేయర్ గుండు సుధారాణి హసన్పర్తి: కాంగ్రెస్ సర్కార్ పద్మశాలీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. చింతగట్టు క్యాంప్ సమీపంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న పద్మశాలీ కమ్యూనిటీ భవనానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మేయర్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి జీవం పోసిందన్నారు. కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈనిధులతో కమ్యూనిటీ హాల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కార్పొరేటర్ అరుణకుమారి, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఝాన్సీరాణి, అఖిల భారత పద్మశాలీ సంఽఘం జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గోరంటా రాజు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు గడ్డం భాస్కర్, కేశవమూర్తి, సతీష్, వేముల సదానందం, దీకొండ భిక్షపతి, మాజీ సర్పంచ్ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పోషణ పక్షం’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం–25 ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోషణ్ అభియాన్లో భాగంగా జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవిద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ శిక్షణ కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 17 నాటికి 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సుల్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆయా దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు మే 1 నుంచి జూన్ 11 వరకు 42 రోజుల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. రేపు జెడ్పీలో పాత వాహనాల వేలంహన్మకొండ: జిల్లా ప్రజాపరిషత్లో తుప్పు పట్టిపోతున్న పాత వాహనాల్ని వేలం వేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో ఫిబ్రవరి 25న ప్రచురితమైన ‘మట్టిలో కలవాల్సిందేనా’ ఫొటో ఫీచర్కు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. తుప్పు పడుతున్న 10 పాత వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈనెల 9న ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ ఎం. విద్యాలత కోరారు. శిక్షణ సంస్థలనుంచి దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: నిరుద్యోగ క్రిస్టియన్ మైనార్టీ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి టి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్డీసీ, టాస్క్, ఈజీఎంఎం, మెప్మా, ఎంఎస్ఎంఈ, అనుసంధానం కలిగిన అర్హత ఉన్న శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థలు పూర్తి వివరాలతో హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12లోగా గడువు ఉందని పేర్కొన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడాలివరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, తిరుమల్, ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కౌన్సెలింగ్ పూర్తిఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. -
ప్రజాపాలనలో సంక్షోభం
ఎల్కతుర్తి: కాంగ్రెస్ కొనసాగిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం సంక్షోభమైంది.. అభివృద్ధి అరాచకమైందని ఎమ్మెల్సీ మధుసుదనాచారి విమర్శించారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 12వందల ఏకరాల్లో ఈనెల 27న బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సత్యసాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చారిత్రాత్మకమైన బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగబోతుందన్నారు. తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగిస్తోందన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టి స్వరాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్ధిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో గడిచిన పదేళ్లలో 4 లక్షల 15 వేల కోట్లు అప్పు తెస్తే.. 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 1లక్షా 60 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంపదను సృష్టించడానికి నిధులు ఖర్చు చేసిందని.. మారుమూల గ్రామానికి సైతం విద్యుత్ సమస్య లేకుండా చేసి తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ బహిరంగ సభకు తరలివచ్చే 10 లక్షల మందికి సరిపడా నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ నిర్వహించేందుకు 12 వందల ఎకరాల స్థలం కేటాయించి ఇచ్చిన రైతులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభ పర్మిషన్ త్వరలోనే రానున్నట్లు వెల్లడించారు. ఈసభ ఒక కుంభమేళా మాదిరిగా జరుగబోతుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నాయకులు పిట్టల మహేందర్, శ్రీపతి రవీందర్గౌడ్, గొల్లె మహేందర్, కడారి రాజు, ఎల్తూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మధుసుదనాచారి బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలి పరిశీలన -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సహకార శాఖ, ఐకేపీ, రెవెన్యూ, వ్య వసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో 2024–25 సంవత్సరానికి సుమారు 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 30 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సహకార శాఖ 107, ఐకేపీ ఆధ్వర్యంలో 60, మెప్మా ఆధ్వర్యంలో 2, ఎఫ్పీఓ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్య దేవి, డీసీఎస్ఓ కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా అధికారులు నీరజ, రేణుక తదితరులు పాల్గొన్నారు. మద్యం దుకాణాలపై ఫిర్యాదు జిల్లాలోని గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగనన్డాడీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన అక్రమ మద్యం దుకాణాలపై ఫిర్యాదులు వచ్చాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో పెండింగ్ పనులపై ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై పూర్తి వివరాలతో ఎంబీలు సమర్పించాలని ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి
● సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అడవి బాట పట్టిన మావోయిస్టులు హింసను వది లి జనంలోకి రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందుకొని వారి కుటుంబాలతో ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – 8లోu● ఈ ఫొటోలోని దివ్యాంగుడు ఖిలావరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన పెద్ద వెంకటయ్య. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరేళ్ల క్రితం వెంకటయ్యకు యాక్సిడెంట్ కావడంతో ఎడమకాలు పోయింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడు రామ్ తనకు సపర్యలు చేస్తున్నాడు. పెద్ద కుమారుడు అన్ని సేవలు చేస్తుండటంతో 10 గుంటల భూమి అదనంగా ఇస్తానంటే చిన్న కుమారుడు లక్ష్మణ్ ఇబ్బందులు పెడుతున్నాడని, పోలీస్గా పనిచేస్తున్నందున భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పెద్ద కుమారుడే అన్ని విధాలుగా చూసుకుంటున్నాడని, ఉన్నతాధికారులు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. న్యూస్రీల్ -
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
● డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గీసుకొండ/సంగెం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతుందని, అంబేడ్కర్ బోధనలు, వారు చూపిన మార్గాలను గ్రామాల్లో ప్రచారం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపునిచ్చారు. సోమవారం గీసుకొండ, సంగెం మండలాల్లో చేపట్టిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ పేరిట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సత్యం, అహింస మార్గాల్లో నడుస్తామని, సమసమాజ స్థాపనకు పాటుపడతామని ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య, కార్యక్రమ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూచన రవళి, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మాదవరెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, కిశోర్, కట్ట య్య, రుద్రప్రసాద్, రమేశ్, రవీందర్, సాంబరె డ్డి, రాజు, రవికుమార్, జగన్నాథచారి, సంద్య, పాష, కవిత, తదితరులు పాల్గొన్నారు. 41 రోజులపాటు హోమం గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల సమీపంలో గల ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో 41 రోజుల పాటు హో మం నిర్వహిస్తున్నారు. మార్చి 30న హనుమాన్ 41 రోజుల మండల దీక్షలు ప్రారంమై న రోజు నుంచి ముగిసే వరకు హోమం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తలు సీతా ఆనంద్ సా, కుమార్సా సోదరులు సోమవారం తెలిపా రు. ప్రతీరోజు ఉదయం గణపతి, నవగ్రహ, రుద్ర పూజలు నిర్వహిస్తామని, చివరి రోజు పూర్ణాహుతితో హోమం ముగుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి అయ్యప్పశర్మ, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ● 11న పోలింగ్.. అనంతరం ఫలితాలు వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26ల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల సీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే... వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రెటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ స్పోర్ట్స్/కల్చరల్కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్కుమార్, జాయింట్ సెక్రెటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి జి.నాగభూషణం, పి.ప్రవీణ్కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఎంఎల్హెచ్పీ పోస్టులకు కౌన్సెలింగ్ పూర్తి ఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈకౌన్సెలింగ్లో డీడీ సోషల్ వెల్ఫేర్ శ్రీలత, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహాన్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కె.రాజేశ్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ ఫాతిమా పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
నర్సంపేట:జేసీబీ సాయంతో విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న పోలీసులు, విద్యుత్ సిబ్బందినర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా సోమవారం రాత్రి ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచి న గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిపోయింది. నర్సంపేట పీఎస్ పరిధి లోని మహేశ్వరం, లక్నేపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, సీఐ రమణమూర్తి, ఎస్ఐ అరుణ్, సిబ్బంది కలిసి కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట వ్యర్ధాలను తగులబె ట్టి ఇంటికి వెళ్లాడు. అకస్మాత్తుగా మంటలు రగులుకుని చుట్టు పక్కలకు విస్తరించాయి. దీంతో నాచినపల్లి గ్రామానికి చెందిన ఇజ్జగిరి సదయ్య కు చెందిన ఎకరాల మొక్కజొన్న చేను మంటల్లో దగ్ధమైంది. ఆయనతో పాటు చుట్టూ పక్కల రైతుల చేనులకు మంటలు వ్యాపించాయి. తొగర్రాయిలో ప్రారంభమైన మంటలు కొమ్మాల దేవస్థానం వరకు వ్యాపించాయి. రైతులకు పెద్ద ఎత్తున నష్టం సంభవించడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్లే దారిలో చెట్లు నేలకూలడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
నర్సంపేట: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన మహిళలకు రూ.11కోట్ల వడ్డీ లేని రుణాలు సోమవారం అందజేశారు. జిల్లాకు తొమ్మిది ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన ఆరు బస్సులు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30లక్షల సబ్సిడీ చెక్కును అందించారు. చెన్నారావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి, ఖానాపురం భారతీయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30లక్షలు ఒక్కో సంఘానికి రూ.15లక్షల చెక్కును సంఘాల బాధ్యులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ 2004లో పావలా వడ్డీ రుణాలు మహిళలకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంఓ దయాకర్, సరిత, అనిత, తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం భోజనం భేష్ ఖానాపురం: రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబి య్యంతో వండిన భోజనం భేషుగ్గా ఉందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మైనార్టీ సెల్ నాయకుడు ముస్తఫా నివాసంలో సన్నబియ్యంతో వండిన భోజ నాన్ని సోమవారం అధికారులతో కలిసి ఎమ్మె ల్యే ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులందరూ సన్నబియ్యం, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
నర్సంపేట: విద్యార్థులు రాబోయే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం పరీక్షలు–విద్యార్థుల సన్నద్ధత అనే అంశంపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివితే విజ యం సాధించవచ్చన్నారు. ములుగు ప్రిన్సిపల్ కె.మల్లేషం మాట్లాడుతూ టీజీపీఎస్సీ జాబ్ క్యా లెండర్ ప్రకారం గ్రూప్స్, పోలీసు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని, ఆయా పోటీ పరీక్షలలో విద్యార్థులు అనుసరించాల్సిన ప్రణాళికలను వివరించారు. విశిష్ట అతిథి గ్రూప్–2 మహిళా టా పర్ బిళ్ల శ్రావణి మాట్లాడుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సులభమవుతుందని, తద్వారా గ్రూప్ పరీక్షలలో విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సోమయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, ఎంఎంకె.రహీమోద్దీన్, ఎస్.కమలాకర్, బి.గాయత్రి, రాంబాబు, భద్రు, రుద్రాణి, రజిత, సంధ్య, పూర్ణచందర్, వీరన్న, గణేష్, రమేష్, ఏఓ అనిత, మాధవి, నిజాం, భార్గవి, ఆనందరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానవాటికకు హద్దులు ఏర్పాటు చేయాలి
వరంగల్ దేశాయిపేట గ్రామశివారులోని సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిలో ది పెంతెకోస్తు మిషన్ చర్చి దళిత క్రైస్తవులకు సంబంధించిన (సమాధుల స్థలం) శ్మశానవాటికకు హద్దులు పెట్టాలి. 1.35 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 17 గుంటలు మాత్రమే మిగిలింది. స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. హద్దులు పెట్టాలని రెండేళ్ల క్రితం ల్యాండ్ సర్వే అధికారులకు ఆదేశాలు జారీ అయినా ఇప్పటి వరకు హద్దులు ఏర్పాటు చేయలేదు. – పెంతేకొస్తు చర్చి కమిటీ, దేశాయిపేట ● -
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuహనుమకొండ రెవెన్యూకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు, తాళి బొట్టు చూపిస్తున్న పూజారి కల్యాణ వైభోగమే..గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం రామనామం మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ, ఆంజనేయ సమేత సీతారాములను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఆలయాల్లో వడపప్పు, మిర్యాల పానకం ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ ఆవరణల్లో అన్నదానాలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. – సాక్షి, నెట్వర్క్– మరిన్ని చిత్రాలు 9లోu -
మొక్కజొన్న పంట దగ్ధం
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నిప్పుపెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూటికె వీరన్న–కమలమ్మ దంపతులు తమకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రెండు ఎకరాల్లోని పంట పూర్తిగా దగ్ధమైంది. చేతికందిన పంట కాలిపోవడంతో రూ.రెండు లక్షలు నష్టపోయామని వీరన్న–కమలమ్మ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. పిండి రవి, మూటికె కట్టయ్య, మూటికె శ్రీనివాస్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు నానబోయిన రాజారాం, వైనాల వీరస్వామి, బత్తిని మల్లయ్య, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మోటురి హరీశ్, వైనాల మధు తదితరులు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిచిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, మొదటి పీఆర్సీ గడు వు 2023తోనే ముగిసినందున నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఉద్యోగ విరమణ పొందినవారికి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎస్.సుభాషిని, డి.రమేశ్, కార్యదర్శి ఎన్.భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు జి.ఉప్పలయ్య, ఎం.సారంగపాణి, గంగాధర్ పాల్గొన్నారు. -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
● భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
గీసుకొండ: పేదల సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ఽ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ హితం, సుస్థిరత, అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కుసుమ సతీశ్, గట్టికొప్పుల రాంబాబు, వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, కపిల్కుమార్, కనుకుంట్ల రంజిత్కుమార్, 16వ డివిజన్ అధ్యక్షురాలు జాలిగపు ప్రసన్న రాంప్రసాద్ పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజావాణి వరంగల్: కలెక్టరేట్లో సోమవారం(నేడు) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది. -
నైతిక విలువలకు బీజేపీ ప్రాధాన్యం
హన్మకొండ: నైతిక విలువలకు బీజేపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి.. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ ఇతర పార్లమెంట్ సభ్యులు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఆ మద్దతు నిరాకరిస్తూ ప్రభుత్వం దిగిపోయేందుకు నిర్ణయించుకున్నారని, బీజేపీ విలువలకు ప్రాధాన్యమివ్వడమంటే ఇదేనన్నారు. జాతీయ భావజాలం, దేశం కోసం పార్టీ పని చేస్తోందన్నారు. ఉత్తమ విలువలతో పని చేసే పార్టీ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు, విదేశీ దౌత్యనీతి, వక్ఫ్ బిల్లు వంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అవీనితికి తావు లేని సమర్థ పాలన అందిస్తున్న బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, తోపుచెర్ల మధుసూదన్ రావు, ఆకుల శ్రీకాంత్, నర్మెట్ట శ్రీనివాస్, రాజ్కుమార్, కందగట్ల సత్యనారాయణ, సంపత్రెడ్డి, సండ్ర మధు, ముత్యాల శ్రీనివాస్, మాలోతు నాను నాయక్, కళ్యాణ్, శ్రీకాంత్, ప్రసాద్, సతీశ్, జైపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, అరణ్య రెడ్డి, జన్ను మధు, అనురాధ, సారంగపాణి, మల్లికార్జున్, రాము, అనిల్, అభిషేక్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
ప్రభుత్వ వైఫల్యంతోనే జాప్యం
నగరాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్మార్ట్సిటీ నిధులు సగానికి పైగా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయంటే పాలకుల అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలేమి కారణంగా అనేక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ స్మార్ట్సిటీ పనులను వేగవంతం చేయాలి. అప్పుడే మరిన్ని నిధులు నగరానికి మంజూరయ్యే అవకాశం ఉంటుంది. – డాక్టర్ కంజర్ల మనోజ్, పెద్దమ్మగడ్డ, హనుమకొండ -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సన్న బియ్యం ప్రారంభోత్సవంలో నిరసన వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది. నేడు వరంగల్ ప్రజావాణివరంగల్: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం(నేడు)ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లీకేజీల గుర్తింపు ● టన్నెల్లోకి దిగిన ఇంజినీర్లు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయ్యింది. పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి డీ వాటరింగ్ చేశారు. ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కు ని పరిశీలించారు. బీజేపీతోనే దేశాభివృద్ధిఖిలా వరంగల్/హన్మకొండ: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోశ్రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కార్యాలయాలతో పాటు శివనగర్, రంగశాయిపేటలో వేర్వేరుగా బీజేపీ జెండాలు ఆవి ష్కరించి మాట్లాడారు. దేశానికి పునర్వైభవం తెచ్చే దిశగా మోదీ పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురా లు రావు పద్మ, పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్రెడ్డి, కొల్లూరి యోగానంద్, రాణాప్రతాప్, కపిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫ రా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యే క యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకు న్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తాడు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరలా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండ ఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
నేడు రాములోరి కల్యాణం
నేడు (ఆదివారం) జరగనున్న సీతారాముల కల్యాణానికి నగరంలోని పలు రామాలయాలు, హనుమాన్ మందిరాలు ముస్తాబయ్యాయి. ఎండాకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామీయానాలు, పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయం, ఎల్లంబజార్లోని శ్రీసీతారామచంద్రస్వామి అలయం, హనుమకొండ రెవెన్యూ కాలనీలోని రామాలయం, వేయిస్తంభాల దేవాలయంతోపాటు పలు దేవస్థానాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వేయిస్తంభాల ఆలయంలో శనివారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రాభిషేం చేశారు. రాములవారిని అయోధ్య రాముడిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ద్వజారోహణం నిర్వహించారు. యాగశాలలో సుదర్శన హోమం జరిపారు. సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని గంగు ఉపేంద్రశర్మ కోరారు. – హన్మకొండ కల్చరల్ -
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటినుంచి నెల రోజులపాటు అమలు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి -
గ్రీన్ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత
దామెర: మండలంలోని పసరగొండలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల్ని శనివారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురు రైతులకు సంబంధించిన పొలాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తోందని కాంట్రాక్టర్ మార్కింగ్ చేస్తూ.. సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా బాధిత రైతులు ఘటనా స్థలికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన పరిహారం ఇంకా తమకు రాలేదని, డబ్బులు రానిదే పనులు నిర్వహించరాదని ఆందోళనకు దిగారు. రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో తప్పులున్నాయని, అధికారులు వాటిని సరిచేసి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వెనుదిగారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. -
జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణాభివృద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్బీఐ వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు స్టెప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాస్క్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని, దీంతో పాటు పరకాలలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీలత, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, బాబు జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కొంగర జగన్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్రం వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ తమదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి.. కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన సన్నబియ్యం పంపిణీ -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. ఇందులో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞాన తీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను అర్కిటెక్టులు, ఇంజినీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏంటంటే.. పూర్వం ఓ కాకి.. నదిలో స్నానం చేసి హంసలా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్కు కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. -
చామంతులతో లక్షపుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పసుపురంగు చామంతులతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం జరిపారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పసుపు రంగు చామంతిపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనకు కరీంనగర్కు చెందిన బాలజనని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నేడు హజ్ యాత్రికులకు శిక్షణన్యూశాయంపేట: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం (నేడు) హజ్ యాత్రికులకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ శనివారం తెలిపారు. వరంగల్ ఇస్లామియా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులు సకాలంలో వచ్చి శిక్షణలో పాల్గొనాలని కోరారు. డీఈఈసెట్కు దరఖాస్తు చేసుకోవాలివిద్యారణ్యపురి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) డీఈఈసెట్– 2025కు నోటిఫికేషన్ విడుదలైందని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ అబ్దుల్హై శనివారం ఒక ప్రకటనలో కోరారు. మే 15వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష మే 25న ఉంటుందని తెలి పారు. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించినవారు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మా ర్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలికాజీపేట అర్బన్: ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులు వేసవిలో తప్పకుండా జాగ్రత్తలు పాటించి పనులు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. కాజీపేట మండల పరిధి కడిపికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి గ్రామ శివార్లలో ఇటుకబట్టీల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సందర్శించి పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కవి రామా చంద్రమౌళికి సాహిత్య పురస్కారంహన్మకొండ కల్చరల్: హైదరాబాద్ వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రదానం చేయనున్న డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారానికి వరంగల్కు చెందిన కవి, రచయిత రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. ఈమేరకు ఉగాది సంబరాల్లో భాగంగా ఏప్రిల్ 12, 13 తేదీల్లో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో రామాచంద్రమౌళికి ఈపురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేతనాలు పెంచాలి.. గీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్హెచ్ఎం కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తోందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరారు. -
భూముల కబ్జా!
ఆగని ఎస్సారెస్పీహసన్పర్తి: ఎస్సారెస్పీ భూముల్లో రోజురోజుకూ కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కబ్జాదారులు దర్జాగా ఎస్సారెస్పీ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్నాసాగరం నుంచి మొదలుకుని పైడిపల్లి వరకు వందలాది నిర్మాణాలు వెలిశాయి. సుమారు 360 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆరేళ్ల క్రితమే అప్పటి అధికారులు సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక మేరకు అప్పటి కమిషనర్, కలెక్టర్లు అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్జాగా షెడ్లు.. తాజాగా ఓ క్వారీ నిర్వాహకుడు హసన్పర్తి–జయగిరి మార్గమధ్యలోని ఎస్సారెస్పీ భూమిని కబ్జా చేశాడు. దర్జాగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కబ్జా చేసుకున్న భూమి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈవ్యవహారం జరిగినప్పటికీ ఎస్సారెస్పీ అధికారుల మౌనంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా ఇక్కడ షెడ్లు కంటైనర్లు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంపై రాజకీయ ఒత్తిడే కారణమా లేక మామూళ్లు అందుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపునకు చర్యలు ఎస్సారెస్పీ భూములు ఆక్రమించుకుని షెడ్, కంటైనర్లు ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటిని తొలగించాలని క్వారీ నిర్వాహకుడికి సూచించాం. లేకపోతే సదరు కబ్జాదారులపైచర్యలు తీసుకుంటాం. – రవీందర్, డీఈఈ -
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్ర వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో సన్న బియ్యం పంపిణీ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభం కాగా.. వరంగల్ తూర్పులో మాత్రం శనివారం నుంచి ప్రారంభమైంది. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ వరంగల్ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద శనివారం ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎరబ్రెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. అన్ని రేషన్ షాపుల వద్ద మోదీ పొటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ కార్యకర్తలే ఏర్పాటు చేస్తారని అల్టిమేటం జారీ చేయడంతో తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజ కీయం వేడెక్కినట్లయ్యింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ మాదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో క్రెడిట్ మాదంటే మాదని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి.. నియోజకవర్గంలో బీజేపీ నాయకుల డిమాండ్ కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన సన్న బియ్యం పంపిణీ -
బాబూ జగ్జీవన్రామ్కు ఘన నివాళి
రామన్నపేట: మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను వరంగల్ ఎల్బీ కళాశాలలోని జయసేన మెమోరియల్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెన్యువల్ చేస్తేనే విధుల్లో కొనసాగిస్తాం ..
ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన రెన్యువల్ మార్చి 31లోగా ముగిసి పోయింది. దీనిపై ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. కానీ, డీఎంఈలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు మాకు రాలేదు. ఆసిబ్బంది రెన్యువల్ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు కూడా రాకపోవడంతో ఎలా పనిచేయించుకోవాలి, ఎవరు జీతాలు అందించాలి అనే ప్రశ్నలు తలెత్తాయి. రెన్యువల్ చేస్తున్నట్లు అయినా, డీఎంఈలోకి తీసుకున్నట్లు అయినా లేఖ తెస్తేనే విధుల్లోకి తీసుకోవడం సాధ్యమవుతుందని సిబ్బందికి తెలిపాం. – డాక్టర్ మోహన్దాస్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
● నేటి నుంచి నెల రోజులపాటు అమలు ● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారంనుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుష్ ఉద్యోగుల వేతనాలు పెంచాలిగీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తుందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, 2014 లోపు నియమితులైన వారిని రెగ్యులర్ చేయాలని, డిప్యూటేషన్లను రద్దుచేసి నియామకమైన చోటే పనిచేసేలా చూడాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు 8వ స్థానంగీసుకొండ: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో శనివారం రాష్ట్ర జట్టు 8వ స్థానం సాధించిందని టీం శిక్షణ ఇన్చార్జ్ కోట రాంబాబు తెలిపారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, త్వరలో మేఘాలయలో జరిగే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర జట్టు అర్హత సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాములోరి పెళ్లికి గోటి తలంబ్రాలుదుగ్గొండి: మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈసారి ‘మన ఊరి రాముడికి మన తలంబ్రాలు’ పేరుతో బైరెడ్డి నిరంజనాదేవి ఇంట్లో మహిళలు గోటి తలంబ్రాలు తయారు చేశారు. శనివారం సాయంత్రం వరకు 11 కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేసినట్లు నిరంజనాదేవి తెలిపారు. ఆదివారం తలంబ్రాలను ఆలయానికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పుచ్చకాయల అరుణ, అండృ సఽంధ్యారాణి, బొమ్మినేని రమాదేవి, బైరెడ్డి కళావతి, రావుల కవిత, శైలజ, రిత్విక తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి●
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి: రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్నారంషరీఫ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి, గాంధీజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుకెళ్లేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతం భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి రమేశ్ ఇంటిలో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, ఇన్చార్జ్ కోఆర్డినేటర్ దూపాకి సంతోష్, మహిళా మండలి నాయకురాలు మాసాని సువార్త తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన రావూరు గ్రామస్తులు పాదయాత్రలో భాగంగా రావూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజును తండావాసులు ప్రశ్నలతో ముంచెత్తారు. ఆరు గ్యారంటీల అమలుపై మహిళలు నిలదీశారు. ఆకేరు వాగు నీటిని పంటలకు అందించడంలో విఫమయ్యారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావును వారు హెచ్చరించారు. -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారాంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. పుష్కరఘాట్కు కాకి, హంస, మకరం చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ -
సీతారాముల కల్యాణం చూతము రారండి..
సాక్షి, నెట్వర్క్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు, బాసింగాలు, జీలకర బెల్లం సిద్ధం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయంలో సుమారు 10 వేల మంది భక్తులు వీక్షించేలా పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీల బాధ్యులు కోరుతున్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రెన్యువల్ చేయక.. రామప్ప వైభవాన్ని చాటిచెప్పాలి మిస్ వరల్డ్ టీమ్ అబ్బురపడేలా రామప్ప కళావైభవం చాటిచెప్పాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. – 8లోuనర్సంపేట రూరల్: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేటలో సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేసింది. ఆస్పత్రికి కావాల్సిన రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 21 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు రక్తనిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిని టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) నుంచి డీఎంఈలో విలీనం చేశారు. మిగిలిన 15 మంది చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. వీరి కాంట్రాక్టు మార్చి 31తో ముగిసింది. సీహెచ్సీని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసి, వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈక్రమంలో టీవీవీపీ నుంచి ఆస్పత్రిని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి మార్చారు. టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగిన ఏజెన్సీలు డీఎంఈ పరిధిలోకి రాకపోవడంతో మరో టీవీవీపీ ఆస్పత్రిలో ఈ సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంది. జిల్లాలోనే వర్ధన్నపేట సీహెచ్సీ టీవీవీ పరిధిలో ఉంది. ఆ ఆస్పత్రిలో 15 మందికి సంబంధించిన పోస్టులు ఖాళీలు లేవు. రక్తనిధిలో పనిచేస్తున్న వారితో 15 మందిని డీఎంఈలో విలీనం చేస్తే అయిపోయేది. అలా చేయకపోవడంతో వారికి రెన్యువల్ చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కార్మికుల ప్రదక్షిణ.. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి పూర్తి బాధ్యతలను సూపరింటెండెంట్ నర్సింహస్వామి.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, సూపరింటెండెంట్ కిషన్కు అప్పగించి డిప్యుటేషన్పై వర్ధన్నపేటకు వెళ్లిపోయారు. కానీ, 15 మంది సిబ్బంది పరిస్థితి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. వారి బాధ్యత డీఎంఈ అధికారులే చూసుకోవాలని టీవీవీపీ అధికారులు చెబుతున్నారు. టీవీవీపీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ అయిపోయిందని డీఎంఈ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఔట్సోర్సింగ్ కార్మికులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని ఆయన నివాసంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిసి సమస్య విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కాగా, ఆస్పత్రిలో 180 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత మీకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారిని విధుల్లోకి తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు హామీ ఇచ్చారు. కానీ, ఆ పోస్టుల భర్తీలో అవకతవకలు జరగడంతో ఏజెన్సీనే ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ నియామకాలు ఆగిపోయాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను రెన్యువల్ చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో మాట్లాడుతున్న కార్మికులు (ఫైల్)న్యూస్రీల్అయోమయంలో ఔట్ సోర్సింగ్ కార్మికులు అరకొర వేతనాలతో 15 ఏళ్లుగా నర్సంపేట సీహెచ్సీలో విధులు విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
గంజాయి కేసుల్లో నేరస్తులను అరెస్ట్ చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులతోపాటు వారికి సరుకు అందజేసే.. స్వీకరించే వ్యక్తులను అరెస్ట్ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పిలిపించడమే కాకుండా అధికారులు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని పరిసరాల్లో ఉండే వారి నుంచి రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యే నిందితుల సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈనేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్స్టేషన్ అధికారులు కూడా నిర్వహించాలని తెలిపారు. స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై అధికారులు తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, ఏఎస్పీలు చైతన్య, మనాన్భట్, అదనపు డీసీపీలు రవి, సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఖానాపురం: వైద్య సేవలందించడంలో రాష్ట్రంలో జిల్లా మధ్య స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,775 పల్లె దవాఖానలు, సబ్సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో అసంపూర్తిగా 30 ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు అలసత్వం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు. వేసవిలో ప్రజలు 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లొద్దని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, క్యాపులు ధరించాలని సూచించారు. డీహెచ్ వెంట డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ఎన్సీడీపీఓ రవీందర్, టీబీ, మలేరియా ప్రోగ్రాం అధికారి ఆచార్య, ఆమ్ పీఓ విజయ్కుమార్, ఎన్సీడీ సూపర్వైజర్ ప్రకాశ్రెడ్డి, వైద్యులు జ్యోతి, అరుణ్కుమార్, సిబ్బంది రాంప్రసాద్రెడ్డి, భాస్కర్ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్నాయక్ ఖానాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ -
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : కోర్టు ప్రాంగణంలో ప్రమాదకర మందుపాతరలు ఏర్పాటు చేశాం.. మధ్యాహ్నం 2 గంటలకు పేలే ప్రమాదం ఉందని శుక్రవారం ఉదయం 7.11 గంటలకు జిల్లా కోర్టు అధికార మెయిల్కు ఓ సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు, హైకోర్టుకు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ యంత్రాంగం డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్ల ద్వారా తనిఖీలు చేపట్టారు. విషయం తెలిసి న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులకు సంబంధించి కోర్టుకు వచ్చిన కక్షిదారులను పంపించారు. తమిళనాడు లిబరేషన్ ఆర్మీ(టీఎన్ఎల్ఏ) ఎస్.మారన్– వింగ్ ద్వారా ఈ మెయిల్ వచ్చినట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. సల్ఫర్ ఆక్సిడైజ్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్(ఐఈడీఎస్) పేలుడు పదార్థాలు ఏర్పాటు చేసినట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకి చెందిన జర్నలిస్టు సువుక్కు శంకర్పై అమానవీయంగా ప్రవర్తించిన తీరు, అలాగే ఇటీవల రిమోట్ కంట్రోల్ సిస్టంను దుర్వినియోగం చేసి నివేత పేతురాజ్, ఉదయనిధి స్టాలిన్ల విషయాలను లీకేజీ చేసిన ఘటనలో డీఎంకే ప్రభుత్వంపై ప్రతీకారంగా ఈ పేలుడుకు పాల్పడుతున్నట్లు మెయిల్లో వివరించారు. టీఎన్ఎల్ఏ ఎస్.మారన్ వింగ్ ద్వారా మెయిల్ బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ల తనిఖీ -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ధర్నా హన్మకొండ: దశాబ్దాల కాలంగా రక్తం చెమటగా మార్చి పనిచేసి జీవితాన్ని ధారబోసి ఉద్యోగ విరమణ చేసిన తమపై యాజమాన్యం, ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదదని.. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన హనుమకొండ, వరంగల్–2 డిపోల ఎదుట ధర్నా చేశారు. కార్మికులు మాట్లాడుతూ వయస్సులో ఉన్నప్పుడు సంస్థకు సేవ చేసిన తమకు కనీస పెన్షన్ లేదని, జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించలేదు.. గ్రాట్యుటీ ఇవ్వడం లేదు.. డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదని వాపోయారు. 2022 ఏప్రిల్ నుంచి టెర్నినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్పీఎస్ 2017 ఎరియర్స్, ఈపీఎస్కు పీఎఫ్ హయ్యర్ పెన్షన్, 2021 వేతన ఒప్పందం చేసి ఎరియర్స్ చెల్లించాలన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి, స్పౌజ్కు సూపర్ లగ్జరీ బస్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రిటైర్డ్ కార్మికులు కేఎస్.నారాయణ, ఎస్.ఎస్.చారి, ఎస్.వై.గిరి, టి.సునీత, యాదగిరి, సీహెచ్ సోమయ్య, బీయూ.చారి, వై.శ్రీనివాస్, సాజీద్, వై.గిరి. సమ్మయ్య పాల్గొన్నారు. -
ముల్యాంకనంలో నిబంధనలు పాటించాలి
వరంగల్: ఇంటర్ మూల్యాంకనంలో బోర్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, వరంగల్ క్యాంపు అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్తో కలిసి శుక్రవారం వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ హాజరు ఉన్నందున సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఈఏడాది నుంచి రీ వెరిఫికేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. వరంగల్తోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూల్యాంకనంలో టోటలింగ్, బబ్లింగ్ తదితర లోపాలు తలెత్తకుండా ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో పూర్తిచేయడానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయనిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి -
సీహెచ్ఓను తొలగించాలి
నర్సంపేట: ఆశ వర్కర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)ను విధుల నుంచి తొలగించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాతే ఆశవర్కర్ల నియామకాలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా సదరు అధికారి 20 మందిని ఎలా నియమించారని ఆయన ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
పడిపోతున్న భూగర్భ జలం
హన్మకొండ: హనుమకొండ జిల్లా భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు.. నవంబర్ నుంచి క్రమేణా అడుగంటుతున్నాయి. హనుమకొండ జిల్లాలో డిసెంబర్ మాసాంతానికి 4.81 మీటర్లకు, జనవరి మాసాంతానికి 5.93 మీటర్ల లోతుకు, ఫిబ్రవరి మాసాంతానికి 6.30 మీటర్లకు, మార్చి మాసాంతానికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, నవంబర్ నుంచి యాసంగి పనులు మొదలు కావడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం 1,77,700 ఎకరాల్లో సాగు చేశారు. వరి, మొక్కజొన్నతోపాటు ఇతర మెట్ట పంటలకు సాగునీటి వినియోగం పెరిగింది. ఐనవోలులో 22.64 మీటర్ల లోతు.. హనుమకొండ జిల్లాలో మార్చి చివరి నాటికి అత్యధికంగా ఐనవోలులో 22.64 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 13.21 మీటర్లకు జలమట్టం పడిపోయింది. బోరుబావులు తవ్వించి 25 ఫీజో మీటర్లు, వరంగల్ జిల్లాలో 26 ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫీజో మీటర్లు భూగర్భజల మట్టాన్ని రికార్డు చేస్తాయి. వీటి నుంచి భూగర్భ జలశాఖ అధికారులు నీటిమట్టం రికార్డును సేకరిస్తారు. గట్లనర్సింగాపూర్లో 6.53 మీటర్ల లోతు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో 6.53 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్లో 10.24, కొత్తపల్లిలో 9.23, వంగరలో 10.31, ధర్మసాగర్ మండలం ధర్మాపూర్లో 4.68, ధర్మసాగర్లో 3.65, పెద్దపెండ్యాలలో 9.68, నారాయణగిరిలో 4.61, ఎల్కతుర్తిలో 8.53, హనుమకొండలో 7.06, హసన్పర్తి మండలం నాగారంలో 8.49, సీతంపేటలో 4.56, ఎల్లాపూర్లో 3.68, ఐనవోలు మండలం పున్నేలులో 4.72, పంథినిలో 5.19, ఐనవోలులో 22.64, కమలాపూర్ మండలం శనిగరంలో 7.18, వేలేరు మండలం పీచరలో 10.43, వేలేరులో 3.48, ఆత్మకూరులో 3.17, దామెరలో 4.19, నడికూడ మండలం చర్లపల్లిలో 13,21, నడికూడలో 3.46, పరకాలలో 4.57, శాయంపేట మండలం పత్తిపాకలో 5.61 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జిల్లాలో సగటున 7.16 మీటర్లు.. 1,77,700 ఎకరాల్లో పంటల సాగు -
డబ్బులు తీసుకోం.. బంగారమే ఇవ్వాలి
రాయపర్తి: డబ్బులు తీసుకోం.. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలి.. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఖాతా దారులు మండిపడ్డారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట వారు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. బ్యాంకు అధికారులను బయటకు పంపించి గేటుకు రెండు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ 2024 నవంబర్ 19న ఎస్బీఐ నుంచి 19 కిలోల బంగారాన్ని దొంగులు దోచుకెళ్లారని తెలిపారు. నెల క్రితం బ్యాంకుకు వస్తే న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఉన్నతాధికారులు వచ్చారని తెలియడంతో బ్యాంకుకు వచ్చామని పేర్కొన్నారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహంతో బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన చేసినట్లు ఖాతాదారులు వివరించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే మెయిన్ బ్రాంచ్కు వెళ్లి తాళాలు వేస్తామని హెచ్చరించారు. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలని, తులం బంగారానికి రూ.77,710 ఇస్తామని అధికారులు బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బంగారం చోరీకి గురైందని చెప్పారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఖాతాదారులు ఇళ్లకు వెళ్లిపోయారు. రాయపర్తిలో ఎస్బీఐ ఖాతాదారుల డిమాండ్ బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన90 తులాల బంగారం పోయింది.. 12 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సుమారు 90 తులాల బంగారం పోవడంతో ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. హైదరాబాద్లో ఉంటూ అక్కడే కుదువపెట్టుకోకుండా మా గ్రామం పక్కనే ఉన్న ఎస్బీఐలో రూ.24 లక్షలకు బ్యాంకులో కుదువపెట్టుకున్నం. బ్యాంకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికై నా మా బంగారం మాకే ఇవ్వాలి. డబ్బులు కట్టిస్తామంటే ఊరుకునేదిలేదు. –శిరీష, మైలారం గ్రామం బంగారం ఇస్తామన్నారు.. నేను బ్యాంకులో 13 తులాల బంగారం తాకట్టు పెట్టిన. బంగారం పోయి ఐదు నెలలు కావొస్తున్నా బ్యాంకు అధికారులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. గురిజంత బంగారం కూడా పోదు. బంగారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా మా బంగారాన్ని ఇప్పించాలి. – గిర్క సాయిరెడ్డి, మహబూబ్నగర్ గ్రామం -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఖానాపురం: వైద్య సేవలందించడంలో రాష్ట్రంలో జిల్లా మధ్య స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,775 పల్లె దవాఖానలు, సబ్సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో అసంపూర్తిగా 30 ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు అలసత్వం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు. వేసవిలో ప్రజలు 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లొద్దని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, క్యాపులు ధరించాలని సూచించారు. డీహెచ్ వెంట డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ఎన్సీడీపీఓ రవీందర్, టీబీ, మలేరియా ప్రోగ్రాం అధికారి ఆచార్య, ఆమ్ పీఓ విజయ్కుమార్, ఎన్సీడీ సూపర్వైజర్ ప్రకాశ్రెడ్డి, వైద్యులు జ్యోతి, అరుణ్కుమార్, సిబ్బంది రాంప్రసాద్రెడ్డి, భాస్కర్ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్నాయక్ ఖానాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ -
నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శాయంపేట : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అవసరం.. ఇందుకు గ్రామాల్లో పెట్రోలింగ్ నిరంతరం చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సీఐ రంజిత్రావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, పరకాల ఏసీపీ సతీశ్బాబు, ఎస్సై జక్కుల పరమేశ్ ఉన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ధర్నా హన్మకొండ: దశాబ్దాల కాలంగా రక్తం చెమటగా మార్చి పనిచేసి జీవితాన్ని ధారబోసి ఉద్యోగ విరమణ చేసిన తమపై యాజమాన్యం, ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదదని.. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన హనుమకొండ, వరంగల్–2 డిపోల ఎదుట ధర్నా చేశారు. కార్మికులు మాట్లాడుతూ వయస్సులో ఉన్నప్పుడు సంస్థకు సేవ చేసిన తమకు కనీస పెన్షన్ లేదని, జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించలేదు.. గ్రాట్యుటీ ఇవ్వడం లేదు.. డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదని వాపోయారు. 2022 ఏప్రిల్ నుంచి టెర్నినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్పీఎస్ 2017 ఎరియర్స్, ఈపీఎస్కు పీఎఫ్ హయ్యర్ పెన్షన్, 2021 వేతన ఒప్పందం చేసి ఎరియర్స్ చెల్లించాలన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి, స్పౌజ్కు సూపర్ లగ్జరీ బస్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రిటైర్డ్ కార్మికులు కేఎస్.నారాయణ, ఎస్.ఎస్.చారి, ఎస్.వై.గిరి, టి.సునీత, యాదగిరి, సీహెచ్ సోమయ్య, బీయూ.చారి, వై.శ్రీనివాస్, సాజీద్, వై.గిరి. సమ్మయ్య పాల్గొన్నారు. -
నగదు అపహరించిన దొంగ అరెస్ట్
వర్ధన్నపేట: వృద్ధురాలి నుంచి నగదు అపహరించిన దొంగను అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేటకు చెందిన వృద్ధురాలు నందనం భారతమ్మ ఈ నెల రెండున వర్ధన్నపేట ఎస్బీఐ నుంచి రూ. మూడు లక్షలు డ్రా చేసింది. ఆమె డబ్బులు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఆటో కోసం వేచి చూస్తుండగా మండలంలోని కడారిగూడేనికి చెందిన బత్తిని విజయ్కుమార్ వచ్చాడు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఆమెను స్కూటీపై ఎక్కించుకున్నాడు. ఇంటి సమీపంలో స్కూటీ ఆపకుండా ఫిరంగిగడ్డ వరకు తీసుకెళ్లి కోనాపురం రోడ్డు వద్ద దింపాడు. ఆమె దగ్గర ఉన్న రూ.మూడు లక్షల నగదు, సెల్ఫోన్, బ్యాంకు పాసుబుక్ ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కట్య్రాల గ్రామ సమీపంలో నిందితుడు విజయ్కుమార్ను అరెస్టు చేసి, రూ.మూడు లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. వెస్ట్జోన్ డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సై బి.చందర్, పోలీస్ సిబ్బంది కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వారిని అభినందించారు. వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య