West Godavari District News
-
పలకాలి అందరి నోట
అమాతృభాష.. ఇఈఆఏలూరు (ఆర్ఆర్పేట): మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విదేశాల్లో కొలువుల కోసం ఇంగ్లిష్పై పట్టు తప్పనిసరిగా మారింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే ఇంగ్లిష్కే పరిమితం చేస్తుండగా మాతృభాషకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువత తెలుగుకు దూరమవుతున్నారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లక్ష్యంగా ఇంగ్లిష్, హిందీ నైపుణ్యాలను పెంచుకుంటూ తెలుగును మరిచేపోయే పరిస్థితికి వస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమంలా భాషా పరిరక్షణ మాతృభాష పరిరక్షణకు జిల్లాలో ఇప్పటికే తెలుగు భాషా సంఘాలు, రచయితల సంఘాలు పూనుకున్నాయి. కరపత్రాల పంపిణీ, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, తెలుగుభాషపై పోటీలు నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు తెలుగు సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, పుస్తక పరిచయాలు వంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి. నండూరి.. బుచ్చిబాబు.. మరెందరో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు భాషకు పట్టు గొమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మాండలికాలు వేరుగా ఉన్నా ‘పశ్చిమ’ యాస ప్రత్యేకతను సంతరించుకుంది. పత్రికలు, పుస్తకాలు, నవలలు, సినిమాల్లో ఈ యాస ఎక్కువగా కనిపిస్తుంది. జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ రచనల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎంకి, నాయుడు బావ పాటల సృష్టికర్త నండూరి వెంకట సుబ్బారావు ఈ జిల్లాకు చెందిన వారే. ఆయనతో పాటు బుచ్చిబాబు, కావలి సోదరులు, బొడ్డు బాపిరాజు, తిరుపతి వేంకట కవులు, కొనకళ్ల వెంకటరత్నం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వంటి రచయితలు తెలుగు భాషను శిఖరాగ్రాన నిలిపారు.‘తెలుగు భాష తియ్యదనం.. తెలుగు భాష గొప్పతనం.. తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం.. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. కాని నీ భాషలో నువ్వు సంభాషించు..’ అంటూ మాతృభాష ఔన్నత్యాన్ని ఓ సినీ కవి ఎంతో గొప్పగా అభివర్ణించారు. పాశ్చాత్య ధోరణులతో మాతృభాషను విస్మరించవద్దని భాషాభిమానులు గొంతెత్తి చాటుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ఖ్యాతి గడించిన తెలుగుపై అభిమానం యువతలో సన్నగిల్లుతోంది. కార్పొరేట్ కొలువులే లక్ష్యంగా ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటూ తెలుగును విస్మరించడం తగదని భాషా నిపుణులు సూచిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మానసిక పరిపక్వతకు.. మాతృభాషలో విద్యాబోధనతోనే విద్యార్థి మానసిక ఎదుగుదల, పరిపక్వత సాధ్యమవుతాయని పరిశోధ నలు స్పష్టం చేశాయి. 26 అక్షరాల (ఇంగ్లిష్) వెంటపడుతూ 56 అక్షరాల సంపదను మనం విస్మరించడం బాధాకరం. శక్తివంతమైన భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే గొప్ప భాష తెలుగు. తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని భావితరాలకు అందించాలి. –డాక్టర్ కొండా రవి, తెలుగు అధ్యాపకుడు, నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుర్తింపే ప్రశ్నార్థకంగా.. మాతృభాష అంటే ప్రతిఒక్కరికీ మమకారం పెరగాలి. ముఖ్యంగా తెలుగు ప్రజల్లో అదే లోపిస్తోందనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు మాట్లాడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి నేటితరం వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. తెలుగు ప్రజల గుర్తింపే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడతాం. – గురు శర్మ, తెలుగు రచయిత పరభాషల కోసం యువత పాకులాట ఇంగ్లిష్ మోజులో తెలుగును విస్మరిస్తున్న వైనం మాతృభాష మాధుర్యాన్ని మరుస్తున్న నేటితరం తెలుగు గొప్పతనాన్ని గుర్తించాలంటున్న భాషాభిమానులు నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -
విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు
తాడేపల్లిగూడెం రూరల్: ‘మీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని మరోసారి రుజువు చేశారు..’ అంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాన్ని గురువారం కొట్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో రూ.22.44 కోట్ల అంచనాతో పలు పనులకు శ్రీకారం చుడుతూ పంచాయతీరాజ్ శాఖ శిలాఫలకాన్ని నిర్మించిందని, దీనిని చూసి ఓర్వలేక కూల్చివేశారని విమర్శించారు. కూల్చివేతకు సంబంధించి ముగ్గురు, నలుగురు పేర్లు తన దృష్టికి వచ్చాయని, పంచాయతీరాజ్, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే కలెక్టర్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని విమర్శించారు. దీనిపై కోర్టు ద్వారా సంబంధిత శాఖ అధికారులకు నోటీసులిచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. గతంలో కూడా కేఎస్ఎన్ కాలనీ వాసులు ఇక్కడ ఆర్చి నిర్మిస్తే దానిని టీడీపీ హయాంలోనే కూల్చివేశారని గుర్తుచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని శిలాఫలకాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ పాలన : రాష్ట్రవ్యాప్తంగా రెడ్బుక్ పాలన సాగుతోందని మాజీ మంత్రి కొట్టు విమర్శించారు. గూడెం నియోజకవర్గానికి ఉపాధి హామీ నిధులు తక్కువ మంజూరయ్యాయన్నారు. మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. బెల్టుషాపులు, పేకాట క్లబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, 365 రోజులూ కోడిపందేలు జరుగుతున్నాయని, మద్యం షాపుల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయ న్నారు. జిల్లా కలెక్టర్కు ఇవేమీ పట్టడం లేదని మండిపడ్డారు. గంజాయికి తాడేపల్లిగూడెం అడ్డాగా మారిందన్నారు. బెల్టు షాపుల రద్దు ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతోనే ఇప్పటివరకు పనులు జరిగాయన్నారు. కూటమి పాలనలో ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు, షో రూం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కర్రి భాస్కరరావు, ముప్పిడి సంపత్కుమార్, కనుపూరి ఉదయ్ భాస్కర్, గార్లపాటి వీరకుమార్, కారింకి వీర్రాజు, గంగారావు, బండి గణపతి, పాలూరి శివ పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
కొరుటూరులో చిరుత సంచారం
పోలవరం రూరల్: గోదావరి నదీ పరీవాహకంలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్య మృగాలు సంచరిస్తున్నాయి. పోలవరం మండలం కొరుటూరు సమీపంలో చిరుత సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో దీనిని గుర్తించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 గిరిజన గ్రామాలు ఖాళీ అయ్యాయి. దీంతో జనసంచారం ఉండటం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నీటి కోసం పలురకాల జంతువులు గోదావరి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. జనసంచారం లేకపోవడంతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. -
వేగంగా మౌలిక వసతుల కల్పన
భీమవరం(ప్రకాశంచౌక్): ఎస్సీ బాలికల వసతి గృహంలో టాయిలెట్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, గడువులోపు పను లు పూర్తికాకుంటే చెల్లింపులు నిలిపివేస్తారని కలెక్టర్ చదలవాడ నాగరాణి కాంట్రాక్టర్ను హెచ్చరించారు. పట్టణంలోని ఎస్సీ బాలికలు, ఎస్టీ బాలుర హాస్టళ్లలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రైతు బజార్ సమీపంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎస్సీ కాలేజీ విద్యార్థుల వసతి గృహం, ఎస్సీ చిన్నపిల్లల వసతి గృహం, బీసీ విద్యార్థుల వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. హాస్టళ్లలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ కేటాయించామని పనులు సకాలంలో పూర్తికావాలన్నా రు. విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, ఇన్వర్టర్ కోసం విద్యార్థులు కలెక్టర్ను కోరారు. అనంతరం గునుపూడి ఎస్టీ బాలుర హాస్టల్ను ఆమె పరిశీలించారు. భోజనం నాణ్యతపై ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ వై.హరిహరనాథ్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి బి.రామాంజనేయరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,800
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు కోసం ఫారం–12 సమర్పణకు గురువారం తుది గడువుగా విధించారు. ఈ క్రమంలో ఆరు జిల్లాల్లో కలిపి కేవలం 220 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తంగా 440 పోలింగ్ కేంద్రాల్లో సుమారు పోలీస్ సిబ్బందితో సహా 2,800 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలీస్ శాఖ, ఇతర ప్రధాన విభాగాల నుంచి మరికొందరి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రావాల్సి ఉంది. 3.15 లక్షల మంది ఓటర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఈనెల 27న ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీరరాఘవులుతో పాటు 33 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 25న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ ఇలా ఐదుగురు ఉద్యోగులను నియమించారు. అలాగే ప్రతి చోటా ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 62, పశ్చిమగోదావరిలో 93, తూర్పుగోదావరిలో 82, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 92, కాకినాడ జిల్లాలో 96, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల విధుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్కు దర ఖాస్తు చేసుకోవాలి. 40 శాతం స్లిప్పుల పంపిణీ పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం–12 దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ను ఏలూరు కలెక్టరేట్ నుంచి రిజిస్టర్ పోస్టు చేయనున్నారు. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న క్రమంలో 2న సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించే అవకాశం కల్పించారు. మరోవైపు ఆరు జిల్లాల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 40 శాతం స్లిప్పల పంపిణీ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పా ల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ పి.ధాత్రిరెడ్డి తెలి పారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పోస్టల్ బ్యా లెట్ పత్రాల పంపిణీని ఆమె పరిశీలించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ స్లిప్పుల పంపిణీ రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల జారీ ప్రక్రియ ఆరు జిల్లాల్లో 440 పోలింగ్ కేంద్రాలు 27న పోలింగ్.. 3న కౌంటింగ్ -
బయో సెక్యూరిటీ విధానాన్ని పాటించాలి
తణుకు అర్బన్: కోళ్ల ఫారాల్లో పూర్తిస్థాయి బయోసెక్యూరిటీ విధానాన్ని పాటిస్తే బర్డ్ఫ్లూ వైరస్ కారణంగా కోళ్ల ఉత్పత్తులపై విధించిన నిబంధనలను త్వరగా తొలగించే పరిస్థితి ఉంటుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్జీ బొంబేలే అన్నారు. గురువారం తణుకు చిట్టూరి హెరిటేజ్లో పౌల్ట్రీ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్జోన్ ప్రాంతాన్ని గతంలో 3 కిలోమీటర్ల పరిధి నిబంధన ఉండేదని రైతుల ఇబ్బందుల దృష్ట్యా కిలోమీటరుకు తగ్గించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఫారాల్లోని కోళ్లకు వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ చేపట్టనున్నామన్నా రు. నెక్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ బర్డ్ఫ్లూ వైరస్ కన్నా ప్రభుత్వం విధించిన నిబంధనలపై మీడియా చేసిన ప్రచారం కారణంగా ప్రజల్లో అపోహలు పెరిగిపోయి పౌల్ట్రీ రైతులు నష్టపోయారని అన్నారు. పౌల్ట్రీ రంగం కోళ్ల ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్లు జీఎస్టీ రూపంలో చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. అనంతరం వేల్పూరు రెడ్జో న్లోని కోళ్ల ఫారాలను, ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర ఎస్ఆర్డీడీఎల్ జేడీ డాక్టర్ రవీంద్ర హెడ్గే, ఐసీఏఆర్ సీనియర్ సైంటిస్ట్లు ఎండీ మద్సార్ చాంద్, డాక్టర్ మనోజ్కుమార్, వెటర్నరీ యూనివర్సిటీ మైక్రో బయోలజీ ప్రొఫెసర్ కేవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ జేడీ దామోదర్ నాయుడు, జిల్లా జేడీ మురళీకృష్ణ, డీడీ వాకాని ప్రసాద్, తణుకు మండల పశు వైద్యాధికారి శంకర్ భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల నిరసన తాడేపల్లిగూడెం (టీఓసీ): భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో 3, 4 తరగతుల ఉద్యోగుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘానికి గు ర్తింపు ఇవ్వాలని కోరుతూ గురువారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద భోజన విరామానికి ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగుల సంఘ కార్యదర్శి సొలస సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల నియామకం, సంఘ గుర్తింపు కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు తోట పద్మారావు, విద్యాసాగర్, రమేష్, సాయిరాం, జయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో ఇంటి దొంగలు
శురకవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సొమ్ములు బొక్కేస్తున్నారు ● రిసీప్ట్స్ హెడ్ నిధులను స్వాహా చేస్తున్న సిబ్బంది ● రాయలంలో రూ.2.33 కోట్లు కాజేసినట్టు నిర్ధారణ ● పలు పంచాయతీలపైనా ఫిర్యాదులు ● రాజకీయ ఒత్తిళ్లతో ముందుకు సాగని విచారణలు ● పారదర్శకంగా విచారిస్తే వెలుగులోకి మరిన్ని అక్రమాలు భీమవరం రూరల్ రాయలం పంచాయతీకి షాపుల అద్దెలు, వేలం పాటలు, లెసెన్స్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్స్ తదితర రూపాల్లో వచ్చిన రూ.2.33 కోట్ల ఆదాయాన్ని పంచాయతీ ట్రెజరీలోని అకౌంట్లో జమచేయకుండా సిబ్బంది తమ సొంతానికి వాడేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక కార్యదర్శి రూ.1,99,50,956, మరో కార్యదర్శి రూ.14,94,224, జూనియర్ అసిస్టెంట్ రూ.15,98,455 దుర్వినియోగం చేసినట్టు తేలింది. ఆడిట్లో సైతం అక్రమాలు బయటపడకుండా వీరికి కొందరు అధికారులు సహకరించినట్టు గుర్తించారు. పక్కనే ఉన్న చినఅమిరం పంచాయతీలో సైతం ఇదే తరహాలో సొమ్ములను స్వాహా చేశారు. కేవలం రెండు పంచాయతీల్లో జరిపిన విచారణలో వెలుగు చూసిన అక్రమాలివి. సాక్షి, భీమవరం: జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇంటి పన్నులకు సంబంధించి 3,11,954 అసెస్మెంట్లు ఉండగా ఆస్తి పన్ను డిమాండ్ రూ.30.98 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా రిసీప్ట్స్ హెడ్ కింద లైసెన్స్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్స్, సాల్వెన్సీ సర్టిఫికెట్లు, సీనరేజీ, స్టాంప్ డ్యూటీ, పంచాయతీ షాపులు, ఆశీల వసూళ్లు, చేపల చెరువులు, కొబ్బరిచెట్లు, పచ్చగడ్డి తదితర వేలం పాటలు, పర్ కాపిటా గ్రాంట్ తదితర నాన్ టాక్స్ రూపంలో మరిన్ని నిధులు సమకూరుతుంటాయి. జిల్లా కేంద్రం, పట్టణ సమీప పంచాయతీలకు టాక్స్, నాన్టాక్స్ రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు చెల్లించే సొమ్ములను ఎప్పటికప్పుడు సిబ్బంది ట్రెజరీలోని పంచాయతీ పీడీ అకౌంట్లో జమచేయాలి. అత్యవసర నిల్వగా చిన్న పంచాయతీల్లో రూ.500, పెద్ద పంచాయతీల్లో రూ.5,000 వరకు నిల్వగా ఉంచుకోవచ్చు. అదీ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంచి తర్వాత ట్రెజరీలో జమచేయాలి. దారిమళ్లుతున్న సొమ్ములు : సాధారణంగా పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిలైట్లు తదితర పనులు చేపట్టేందుకు పంచా యతీ తీర్మానంతో అంచనాలు రూపొందించి, పనికి సంబంధించిన వివరాలను ఎంబుక్లో రికార్డు చేసి నిధులు డ్రా చేయాలి. అత్యవసర సమయాల్లో ఆయా పనుల నిమిత్తం ర్యాటిఫై చేయడం ద్వారా నిధులు ఖర్చుచేయవచ్చు. చాలా పంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్ములను వెంటనే ట్రెజరీల్లో జమచేయకుండా అత్యవసర పనుల కోసమని తమ వద్దనే ఉంచేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కార్యదర్శుల నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు సిబ్బంది ప్రజల సొమ్ములను దారి మళ్లించి తమ సొంత అవసరాలకు సర్దుబాటు చేసుకుంటున్నారు. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం ఆస్తిపన్ను లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారే తప్ప నాన్ ట్యాక్స్ పరిధిలోని రిసీప్ట్స్ హెడ్ నిధులపై అంతగా అజమాయిషీ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. అక్రమాలు బయటపడకుండా ఆడిట్ అధికారులు సైతం పంచాయతీ సిబ్బందికి సహకరిస్తున్నట్టు విచారణల్లో బయటపడింది. రాయలం, చినఅమిరంలో అక్రమాలపై దర్యాప్తు చేయించిన కలెక్టర్ సీహెచ్ నాగరాణి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. న్యూస్రీల్మరిన్ని పంచాయతీల్లో... జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి చేరువగా ఉన్న భీమవరం రూరల్, పాలకోడేరు, వీరవాసరం, ఉండి మండలాలు అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణ సమీపంలోని పలు పంచాయతీల్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పది వరకు పంచాయతీలపై ఫిర్యాదులు రాగా డీఎల్పీఓ స్థాయి అధికారులు విచారణలు జరుపుతున్నారు. తమ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా పై అధికారుల ఒత్తిడి తీసుకురావడం, ప్రలోభాలకు గురిచేయడంలో కొందరు సిబ్బంది ఆరితేరినట్టు తెలు స్తోంది. పంచాయతీల్లో కేవలం ఆస్తి పన్ను వసూలు లక్ష్యానికే పరిమితం కాకుండా రిసీప్ట్స్ హెడ్ నిధులు ఎంత మేర వసూలయ్యాయి? ఎంత వరకు ట్రెజరీల్లో చెల్లింపులు చేశారనే విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని పంచాయతీల్లో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.విచారణలు జరిపిస్తున్నాం: డీపీఓ పంచాయతీల్లో అవకతవకలపై డీపీఓ అరుణశ్రీని సంప్రదించగా పలు పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు అందిన ఫిర్యాదులపై అధికారులతో విచారణలు జరిపిస్తున్నామని చెప్పారు. త్వరలో నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. -
ఏజెన్సీలో అందని వైద్యం
కుక్కునూరు: ఏజెన్సీలో ఆదివాసీలకు వైద్యం అందని ద్రాక్షలా తయారైందని సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి విమర్శించారు. గురువారం కుక్కునూరు మండలంలోని బండారిగూడెం గ్రామానికి చెందిన ముచికి దేవమ్మ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాజమ్రండి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిందని ఆయన తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో తానే చొరవ తీసుకోని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసినట్లు మైపాక్షి చెప్పారు. వెంకటాపురం నుంచి బండారిగూడెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీలో 3 కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. గిరిజనులు ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ భీమవరం: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. గురువారం భీమవరంలో నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్పై అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా మేధావుల సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎల్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారని ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం అభినందనీయమన్నారు. బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కాగిత వెంకటరమణ, తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యూట్రన్, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. డ్రెయినేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం తాడేపల్లిగూడెం అర్బన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని డ్రెయినేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. డ్రెయినేజీలో మృతదేహం ఉండడాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డ్రెయినేజీలోని మృతదేహాన్ని వెలుపలకు తీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం చొక్కా,, నల్లఫ్యాంటు ధరించాడని, వివరాలు తెలిసిన వారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. -
వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు
పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు కై కలూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో ఏలూరు జిల్లాకు చెందిన పలువురి పార్టీ నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు అందాయి. నియామకాల్లో పార్టీ రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీలుగా గంటా సంధ్య, కూసనపూడి కనకదుర్గారాణి (బుజ్జమ్మ), రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీగా సయ్యపురాజు గుర్రాజు, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీగా ఐనాల బ్రహ్మా జీ, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీలుగా పరసా చిన్నారావు, కిలారపు శ్రీనివాసరావు(బుజ్జి), బలే నాగరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా కోటగిరి రాజా నాయన, పెద్దిరెడి శ్రీరామ దుర్గాప్రసాద్ ఉన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎంపికైన నాయకులు చెప్పారు. రాష్ట్ర స్థాయి పదవులు అందించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కమిటీలో చింతలపూడి నేతలు చింతలపూడి: వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా కమిటీలో పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ఏడుగురు చోటు సంపాదించారు. జిల్లా వైఎస్ ప్రెసిడెంట్గా జగ్గవరపు జానకిరెడ్డి, జనరల్ సెక్రటరీగా మోరంపూడి జగన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ముప్పిడి శ్రీను, రాయంకు సత్యనారాయణ, యాక్టివ్ సెక్రటరీగా వామిశెట్టి హరిబాబు, అయినాల వెంకటరమణ మూర్తి, అధికారిక ప్రతినిధిగా రాఘవరాజు ఆదివిష్ణు నియమితులయ్యారు. వీరిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు అభినందించారు. ఏలూరు నుంచి రాజేష్ ఏలూరు టౌన్: ఏలూరుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పాతినవలస రాజేష్ (కరుణ)ను పార్టీ ఏలూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించారు. రాజేష్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్టీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఏలూరు టౌన్: బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ డీ.శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని ఎఫ్సీఐ గోడౌన్ వద్ద 290 బస్తాల బియ్యంతో ఉన్న లారీని గత నెల 29వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. లారీకి ఉన్న జీపీఎస్ ట్రాకర్ను పడేసి ఈ చోరీ చేశారు. బియ్యం విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుంది. దీనిపై లారీ యజమాని ఫిర్యాదు చేయగా ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాధునిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో కేసును పోలీసులు విచారణ చేశారు. గురువారం ఏలూరు రూరల్ పరిధిలో లారీలో ఉన్న బియ్యాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ బియ్యంతో సహా లారీని, నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన జన్యవుల సుధాకర్గా గుర్తించగా పెరవలికి చెందిన దూడల ధనరాజు, కొల్లేపుర మణికంఠ అతడికి సహకరించినట్లు డీఎస్పీ తెలిపారు. సుధాకర్పై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయని, షీట్ తెరిచేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు వన్టౌన్ పోలీసులను అభినందించారు. సమావేశంలో ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, సీసీఎస్ ఏఎస్సై ఎండి రుహుల్ల, శేషు కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతి వేగం
ఒకరు మృతి.. మరొకరికి స్వల్ప గాయాలు దేవరపల్లి : అతివేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. ఆగి ఉన్న వ్యాన్ను మోటార్సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కల్లూరి విజయ్కుమార్ (30), ఏలూరులోని వినాయకనగర్కు చెందిన ఏలేటి గోవింద్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరూ కలసి గురువారం ఉదయం విశాఖపట్టణంలో బంధువుల వివాహానికి బయలుదేరారు. విజయ్కుమార్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, గోవింద్ వెనుక కూర్చున్నాడు. దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్దకు వచ్చే సరికి హైవేపై ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో విజయ్కుమార్ తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం 108 అంబులెన్స్లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవింద్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. విజయ్కుమార్కు హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమాలకు అడ్డాగా గూడెం !
తాడేపల్లిగూడెం: గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న గూడెం పట్టణం మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారుతోంది. పాతికేళ్ల క్రితం పట్టణం పేకాట బ్యాచ్, దొంగనోట్లకు అడ్డా. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గడిచిన ఐదేళ్ల కాలంలో అసాంఘిక శక్తుల బెండు తీశారు. దొంగనోట్ల ముఠాలు, రౌడీ షీటర్లు పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యినట్టు కనిపిస్తోంది. పట్టణంలో వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా జూదశాలలు పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్నట్టు సమాచారం. ఇక్కడ పార్టీలు, కూటములతో సంబంధం లేకుండా జూదాలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బ్లేడ్ బ్యాచ్లు కాస్తా, గంజాయి బ్యాచ్లుగా రూపాంతరం చెందారు. నెల రోజుల క్రితం వరకు పట్టణంలో గంజాయి వాసన కనిపించగా అరకొర దాడులు, కేసులు నమోదుతో ఆగినట్టుగా కనిపిస్తోంది. అన్ని వైపులా జూదశాలలున్నాయా! పట్టణంలో మూడు దిక్కుల్లో జూదశాలలు రహస్యంగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. కడకట్ల, టూటౌన్ తణుకు మార్గంలో ఒక ప్రాంతంలో ఇవి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటి నిర్వహణకు ఆమోద ముద్ర ఎవరు వేశారన్నది బహిరంగ రహస్యమేనని చెబుతున్నారు. రిమోట్ మాత్రం కడకట్ల ప్రాంతంలో ఉన్నట్టుగా జూదరులు బాహాటంగా అంటున్నారు. గతంలో పట్టణంలో ఆమోదిత జూదశాలలు ఉండేవి. ఆఫీసర్స్ క్లబ్, ఎన్జీఓస్ హోం వంటి చోట నిర్ధేశిత సమయాల్లో సీక్వెన్స్ ఆడుకొనే వెసులుబాటు ఉండేది. అలాంటి సమయంలో పోలీసుల దయాదాక్షిణ్యాలతో కొందరు పేకాటలను రహస్య ప్రాంతాల్లో నిర్వహించేవారు. క్లబ్లను అప్పట్లో ప్రభుత్వమే మూసివేసియడంతో పేకాటలపై పోలీసులు దాడులు పరిపాటిగా మారింది. తాజాగా జూద సంస్కృతి మళ్లీ తెరమీదకు వచ్చింది. పాత బ్యాచ్లు జూలు విదిల్చామనే సంకేతాలను వీటి నిర్వహణ ద్వారా ఇస్తున్నట్టు తెలుస్తోంది. దొంగనోట్ల ముఠాలూ వచ్చాయా! ఒకప్పుడు పట్టణం దొంగనోట్ల ముఠాలకు అడ్డా. నకిలీ కరెన్సీని బ్యాంకుల్లో కూడా జమచేసే కేటుగాళ్లు ఇక్కడ ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దొంగనోట్ల ముఠా ఎక్కడ దొరికినా మూలాలు ఇక్కడే ఉండేవి. జెకోస్లోవేకియా నకిలీ నోట్లను ఇక్కడ మార్చే ముఠాలు ఉండేవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. తాజాగా మద్యం దుకాణాలలో, రద్దీగా ఉన్న వ్యాపార సముదాయాల్లో కొందరు యువకులు దొంగనోట్లు మారుస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై గూడెం పట్టణం, రూరల్, తణుకు సర్కిళ్ల పరిధిలో ఉన్న అధికారులు కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. సుమారు 15 సెల్ఫోన్లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ముఠా ఆనవాళ్లు తదితర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి నిందితులను కటకటాల వెనక్కి పంపించనున్నారని తెలుస్తోంది. వ్యాపార కేంద్రం నుంచి విద్యా కేంద్రంగా మారి అభివృద్ధి పథంలో వెళుతున్న పట్టణంలోని తిరిగి పాత జాడ్యాల వాసనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రశాంతంగా పట్టణం ప్రస్తుతం సీన్ రివర్స్ జూదాలు, గంజాయి, దొంగనోట్ల బ్యాచ్లకు అడ్డాగా మారుతున్న వైనం భయాందోళన చెందుతున్న ప్రజలు -
మామిడి.. తగ్గనున్న దిగుబడి
నూజివీడు/చింతలపూడి: పండ్లలో రారాజు.. మామిడి. కానీ మామిడిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం ఏటా దారుణంగా తయారవుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు, పురుగుల బెడద కారణంగా ఆదాయం రాకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. నూజివీడు డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా భాసిల్లుతోంది. నూజివీడు రసాలు.. బంగినపల్లి ఖండాంతరాల్లో ఎంతో ఖ్యాతినార్జించింది. అలాంటి మామిడి పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. గతేడాది కాపులేకపోవడంతో ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నట్టేట ముంచింది. ఆశలు ఆవిరి నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో ఉన్న మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు గణనీయంగా రావడంతో రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. డివిజన్లోని మొత్తం విస్తీర్ణంలో 80 నుంచి 90 శాతంకు పైగా తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. అయితే జనవరి రెండో వారం నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడంతో వచ్చిన పూతంతా నిలువునా మాడిపోయింది. తామర పురుగుకు బూడిద తెగులు తోడవ్వడంతో మామిడి రైతుల పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైంది. ఒక్కొక్క రైతు మామిడి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులను పిచికారీ చేసినప్పటికీ తామర పురుగును నియంత్రించలేకపోవడం గమనార్హం. దీంతో మామిడిపై రైతుల ఆశలన్నీ అడియాశలైపోయాయి. డివిజన్లోని 40వేల ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి దయనీయంగా మారింది. పూత దశలోనే.. నష్టాల ఊబిలో చింతలపూడి నియోజకవర్గంలో సైతం మామిడి రైతులకు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పూత దశలోనే మామిడి రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా మామిడి తోటలు ఈ సంవత్సరం పూత పూసినప్పటికీ మంచు వల్ల పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. 30 ఏళ్ల క్రితం దాదాపు 60 వేల ఎకరాల్లో ఉండే మామిడి..ఏటా వివిధ కారణాలతో మామిడి రైతులు నష్టపోతుండడంతో ఇప్పుడు కేవలం 7 వేల ఎకరాలకు పడిపోయింది. రైతులు మామిడి తోటలు నరికివేసి ప్రత్యామ్నాయంగా పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. నియోజకవర్గంలో ఏటా 90 శాతం బంగినపల్లి, 10 శాతం కలెక్టర్ (తూతాపురి) దిగుబడి ఉంటుంది. ప్రభుత్వం నుంచి మామిడి పంటకు సరైన ప్రోత్సాహం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి తోటలపై తామర పురుగు దాడి నిలువునా మాడిపోయిన పూత పెట్టుబడులు రాక నష్టాల ఊబిలో రైతాంగం రెండేళ్లుగా మామిడి రైతులకు నష్టాలు -
ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పట్టిసం ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పట్టిసంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ లక్షమందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారనే అంచనాతో అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. పంచాయతీ చేపట్టే పనులు ఈ ఏడాది కొంత ఆలస్యమయ్యాయి. గత నాలుగేళ్లుగా పనులు చేపట్టిన టెండర్దారులకు రూ.28 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, అందువల్ల టెండర్దారులు ముందుకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫెర్రీ టిక్కెట్ రేటును ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.10 పెంచి రూ.40 వసూలు చేసేందుకు నిర్ణయించారు. భక్తులు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి రావాల్సిందే. పంచాయతీ చేపట్టే పనులకు సంబంధించి కొంత సొమ్ము దేవస్థానం అధికారులు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే శివక్షేత్రం వద్ద భక్తులు దైవ దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చేపట్టే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. అలాగే దర్శనానికి వెళ్లే భక్తులు నది దాటి వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ఫారాలు, పంట్లు, టిక్కెట్ కౌంటర్లు, చలువ పందిళ్లు తదితర పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇంకా చేపట్టాల్సిన పనులు ఇసుక తిన్నెలపై చేపట్టే ఇంకా కొన్ని పనులు ప్రారంభమే కాలేదు. స్నానఘట్టాలతో పాటు, మహిళలు దుస్తులు మార్చుకునే తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. వెదురు కర్రలు, తడికలతో వీటిని ఏర్పాటు చేస్తారు. తాగునీటికి పైప్లైన్, చేతిపంపు నిర్మించాల్సి ఉంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఐ పట్టిసం రేవులో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పోలవరం సీఐ సురేష్బాబు, ఎస్సై పవన్కుమార్ పరిశీలించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు తదితర పనులను పరిశీలించి ఫెర్రీ కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో పోలీసుల అనుమతి లేకుండా పట్టిసీమ, గూటాల, పోలవరం తదితర ప్రాంతాల్లో ప్రయాణికులతో పడవలను నడపరాదని హెచ్చరించారు. -
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ మునిసిపల్ కార్మికులు తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అప్కాస్ రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్కాస్ రద్దు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించాలని, సిబ్బంది సంఖ్యను, వాహనాల సంఖ్యను పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం అందజేయాలని నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, నాయకులు తాడికొండ శ్రీనివాస్, అల్లం కుమార్స్వామి, కార్మికులు పాల్గొన్నారు. -
కాలుష్యం పేరుతో పేదలపై కుట్ర
భీమవరం: అభివృద్ధి ముసుగులో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పేదల ఇళ్లను తొలగించే బుల్డోజర్ రాజకీయాలను తక్షణం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాలుష్యమంటూ ఎన్నో ఏళ్లుగా కాలువలు, పంట బోదుల పక్కన నివసిస్తున్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం ఐ.భీమవరం నుంచి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్ వరకు కాలుష్యం పేరుతో పేదల ఇళ్ళను కూల్చివేసి పేదలకు నిలువ నీడలేకుండా చేస్తున్నారని గోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం చేసే పనులను సమర్ధిస్తామని అయితే అభివృద్ధి పేరుతో పేదలను రోడ్లపాలు చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో భూస్వాముల పక్కనే పేదల ఇళ్లు ఉండడమే తొలగింపునకు అసలు కారణమన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములను భూస్వాములు, పెత్తందారులకు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనకు విరుద్ధంగా నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న ఉప్పునీటి బోర్లు రఘురామ కృష్ణంరాజుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, సేశపు ఆశ్రియ్య పాల్గొన్నారు. -
లంచావతార ఉద్యోగి తొలగింపు?
నిడమర్రు: ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అంటూ సాక్షిలో ఈనెల 14న వచ్చిన కథనంపై జిల్లా ఫారెస్టు అధికారులు స్పందించారు. లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నబిగారి శ్రీనివాసబాబును విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. శ్రీనివాసబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారించిన ఏలూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి రైతులను విచారించారు. అనంతరం నివేదికను జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించారు. నివేదికలోని అంశాలు బహిర్గతం కాకపోయినప్పటికీ అనధికారికంగా అందిన సమాచారం మేరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీనివాసబాబును విధులనుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. -
ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న సుబ్బారావు అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా రూ.187 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్గో లాజిస్టిక్స్ ద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 రీజియన్లలో పశ్చిమగోదావరి జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఆథరైజ్డ్ ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ సెంటర్కు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలతో ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ కౌంటర్ను ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవు
ఏలూరు(మెట్రో): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలు పోలింగుకు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు/సంస్థలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించారన్నారు. ఓట్ల లెక్కింపునకు పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోని సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, మార్చి 3న కాలేజీలో స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి, భీమవరం: వాతావరణ మార్పులు జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ఎండ మండిపోతుంటే, రాత్రిళ్లు చలి వణికిస్తోంది. మంచు ప్రభావంతో వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. గొంతు నొప్పి, జలుబు తదితర లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి తర్వాత నుంచి చలి తీవ్రత తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. మునుపెన్నడూ లేని విధంగా ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండ తీవ్రత పెరిగింది. వేసవిని తలపిస్తూ సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. కొద్ది రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతీవ్రతకు ఉక్కపోత తోడై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న 11 గంటల నుంచి రోడ్డుపై తిరగాలంటే భయమేస్తోంది. జిల్లాలోని వినియోగదారులతో రద్దీగా ఉండే భీమవరంలోని జువ్వలపాలెం, సండే మార్కెట్ రోడ్లు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్, తాలుకా ఆఫీస్ రోడ్డు మధ్యాహ్నం అయ్యే సరికి జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. గతంలో లేని విధంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పగటి పరిస్థితి ఇలా ఉంటే.. చీకటిపడే సరికి వాతావరణం మారిపోతోంది. పొగమంచు కమ్మేసి చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 18 డిగ్రీలకు తగ్గిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల సమయం వరకు కూడా మంచు ప్రభావం ఉంటుండంతో పగటిపూట వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పొంచిఉన్న వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జలుబు, దగ్గు, గొంతునొప్పి, తదితర లక్షణాలతో బాదపడుతున్నారు. ఆయా లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజువారి ఓపీలో సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువగానే ఉంటున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ప్రస్తుతం వ్యాధుల తీవ్రత లేకున్నా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నాం. నిల్వ ఆహారం తీసుకోకూడదు. ప్రయాణించేటప్పుడు ఎండ, మంచు నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – భానునాయక్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి న్యూస్రీల్ వాతావరణ మార్పులతో ప్రజలు బెంబేలు వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు పట్టణం గరిష్టం కనిష్టం భీమవరం 36 20 తణుకు 36 21 తాడేపల్లిగూడెం 37 20 పాలకొల్లు 33 19 నరసాపురం 38 20 ఈ జాగ్రత్తలు పాటించాలి మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలింగ్ వాటర్ తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే భుజించాలి. నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు. గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. డ్రైనేజీల సమీపంలో నివసించే వారు దోమల బెడద లేకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి. -
ప్రశాంతంగా సర్టిఫికెట్ కోర్సు పరీక్ష
భీమవరం: భీమవరంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్) పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూలు పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 70 మందికి 52 మంది, హయ్యర్ పరీక్షకు 29 మందికి 24 మంది హాజరయ్యారు. టైలరింగ్, ఎంబ్రాడయిరీ లోయర్ పరీక్షకు 29 మందికి 21 మంది, హయ్యర్ పరీక్షకు 12 మందికి 10 మంది హాజరయ్యారు. భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ రూ.11,400 కోట్లు అమలు చేసేందుకు విధి విధానాలు వేగవంతం చేశామని, స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్లో సమస్యలు పరిష్కరించి 7.3 మిలియన్ల స్టీల్ ఉత్పత్తి లక్ష్యం చేరుకుంటామన్నారు. స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు చేస్తున్నామని ఇంతవరకు 1, 613 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా 1,141 మంది అర్హులుగా గుర్తించారన్నారు. మార్చి 31 నాటికి వీఆర్ఎస్ స్కీం అమలు పూర్తి చేయాలని నిర్ణయించగా తొలి విడతగా దరఖాస్తు చేసుకున్న 150 మందికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతునట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఛత్రపతి శివాజీకి నివాళులు భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో భూముల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీసర్వేపై సీసీఎల్ఏ జి.జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి నివేదికలు పంపాలన్నారు. రీసర్వే రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని.. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలన్నారు. రీ సర్వే వేగవంతంగా, నిర్వహించి నివేదికలు సమర్పించాలని అన్నారు. -
గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
భీమవరం(ప్రకాశం చౌక్): బిడ్డకి జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, వారి ఆరోగ్య అవసరాలపై సీ్త్ర శిశు సంక్షేమం, వైద్య శాఖల నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్యశాఖ సీ్త్ర శిశు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ సీ్త్రల నమోదు, టీకాలు వేయించడం, పోషకాహార లోపంతో ఎంతమంది పిల్లల ఉన్నారో గుర్తించడం, ఏ లోపాలు ఉన్నాయో పరీక్షలు నిర్వహించడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందితో ఇప్పటికే నాలుగు పర్యాయాలు సమీక్షించామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాల నియంత్రణ లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డా.బి.భానునాయక్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఐఓ డా.డి.దేవసుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం నిషేధించాలని, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల రాకను వ్యతిరేకించాలని, ఢిల్లీ యూనివర్శిటీలో సస్పెన్షన్కు గురైన 17 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని నన్నయ యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్ధులతో కలిసి ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విశ్వ విద్యాలయాలలో వీసీ నియామకాలలో రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బి.సౌజన్య, డి.దేవి, ఎం.మానస, జ్ఞానేంద్ర, ఎ.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజాసమస్యల పరిష్కార వేదిక అంటూ కూటమి సర్కారు పేరు మార్చిందే తప్ప సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వేలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలం గడుపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతీ సోమవారం సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసి సంబంధిత శాఖలకు వచ్చిన ఫిర్యాదులను బదిలీ చేస్తున్నారు. అయితే వందలాది ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వచ్చిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఫిర్యాదిదారులు మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సీఎం డాష్ బోర్డులో సైతం స్పష్టంగా ఫిర్యాదులు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతున్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు జిల్లాలో 35 శాతం ఫిర్యాదులు పెండింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1845 ఫిర్యాదులు రాగా, 712 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. 1125 ఫిర్యాదులను పరిష్కరించినట్లు సీఎం డాష్బోర్డులో అంకెలు స్పష్టం చేస్తున్నాయి. 8 ఫిర్యాదులు రీ ఓపెన్లో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1149 ఫిర్యాదులు రాగా, 335 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉండగా, 805 ఫిర్యాదులు పరిష్కరించారు. 9 ఫిర్యాదులను రీ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లాతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా ఫిర్యాదుల పరిష్కారంలో ముందు వరుసలోనే ఉంది. సుమారు 70 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించగా, ఏలూరు జిల్లాలో 65 శాతం ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాలకు పేర్లు మార్చడంలో చూపించిన శ్రద్ధ ఫిర్యాదులను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో సచివాలయాల్లోనే పరిష్కారం గతంలో ప్రతీ వారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు ప్రభుత్వం పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు జారీ చేసేది. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ఫిర్యాదులు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సచివాలయాల పరిధిలోనే చర్యలు తీసుకునేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ప్రజా ఫిర్యాదులపై మాత్రం స్పందన అరకొరగా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగానికి పైగా ఫిర్యాదులు పెండింగ్లో ఫిర్యాదులపై పర్యవేక్షణ కరువు ఏలూరు కంటే మెరుగ్గా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,845కు 712 ఫిర్యాదులు పెండింగ్ -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెయ్యేరు అలేఖ్య కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలుకు చెందిన మమ్మిడివరపు రాంబాబు, సంతోషిణి(26) దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పెయ్యేరులో కొంతకాలంగా నివాసముంటున్నారు. రాంబాబు చేపల చెరువుపై గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. బుధవారం ఉదయమే రాంబాబు విధుల నిమిత్తం బయటకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సంతోషిణి ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతుండడం పిల్లలు గమనించి కేకలు వేశారు. స్థానికులు వచ్చి పరిశీలించి ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జేఎస్ సుభానీ, ఎస్సై వీరభద్రరరావు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంతోషిణి బంధువు సింహాద్రి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంతోషిణి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
జీవితంపై విరక్తితో నిరుద్యోగి ఆత్మహత్య
ఉంగుటూరు: జీవితంపై విరక్తితో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంసాలిపాలెంలో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం యర్రమిల్లిపాడుకు చెందిన దాసరి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కల్లుగీత వృత్తి చేసుకునే ఈ కుటుంబం కంసాలిగుంటలో నివసిస్తోంది. సత్యనారాయణ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు పృధ్వీ చందు హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్నాడు. తక్కెళ్లపాదులోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పృధ్వీ చందు హైదరాబాద్ నుంచి ఈనెల 11న వచ్చాడు. ఫంక్షన్ అనంతరం ఈనెల 17న ఒక కుమార్తెను గోపాలపురంలో అత్తారింటి వద్ద దింపేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ వెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఏమైందో గానీ పృధ్వీ చందు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కగదిలో ఉన్న మరో సోదరి ఎంతసేపు తలుపుకొట్టినా చందు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తీసీ చందుని భీమడోలులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీ చందు మృతి చెందాడు. హైదరాబాదులో ఇంటర్న్షిప్ చేసే ఉద్యోగాన్ని వదిలేసి, మరొక కంపెనీకి ప్రయత్నం చేస్తుండగా రాకపోవడంతో విరక్తి చెంది పృధ్వీ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పృధ్వీ చందు మృతితో ఆ కుటుంబం శోకసంద్రమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేయగా మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
హత్య కేసులో నిందితుల అరెస్టు
గణపవరం: నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగిన యువకుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వతేదీ రాత్రి బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసు(25) అనే వ్యక్తిని చంపివేసి చేయినరికి కాల్వలో పడవేసినట్లు కేసు నమోదైంది. ఈహత్య కేసును ఛేదించేందుకు ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గణపవరం సీఐ ఎంవీ సుభాష్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు ఎస్సైలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్ల నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, హత్యలో భాగస్వాములైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. వివాహేతర సంబంధమే కారణం ఈ కేసులో మొదటి ముద్దాయి పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసుకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ హత్యకు ప్రేరణ అన్నారు. మృతుడు తరచూ ముద్దాయి భార్యతో మాట్లాడటం, సెల్ఫోన్ మెసేజీలు పెడుతున్నాడన్న అనుమానంతో గతంలో కులపెద్దల సమక్షంలో తగవు పెట్టినా మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిని హతమార్చేందుకు పిల్లి ఏసుబాబు, అతని తండ్రి అన్నవరం, కోలమూరు గ్రామానికి చెందిన గెడ్డాడ శ్రీనివాసరావు పథకం రచించారు. ఈనెల 15వ తేదీన పిల్లి ఏసుబాబు తన భార్య ఫోన్లో ఆమె పెట్టినట్లుగా మజ్జి ఏసుకు ఫోన్లో మెసేజ్ పెట్టాడు. తాను ఉండి మండలం మహదేవపట్నంలో తన పుట్టింట్లో ఉన్నానని, రావాలని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన మజ్జి ఏసు మోటార్సైకిల్పై మహదేవపట్నం చేరుకుని, ఆమె ఇంటి డాబాపైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ముద్దాయిలు మజ్జి ఏసును పట్టుకుని దారుణంగా చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక మజ్జి ఏసు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆరా తీశారు. దీనితో మా గ్రామంలో కులపెద్దల సమక్షంలో తేల్చుకుంటామని చెప్పి మజ్జి ఏసును పిల్లి ఏసురాజు, గెద్దాడ శ్రీనివాసరావు మోటార్సైకిల్పై ఎక్కించుకుని బావాయిపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బావాయిపాలెం శివారు కొత్తకోడుపుంత వద్ద ఆగారు. అప్పటికే అక్కడ కొబ్బరి గెలలుకోసే కత్తితో సిద్ధంగా ఉన్న పిల్లి ఏసుబాబు తండ్రి పిల్లి అన్నవరంతో కలిసి మజ్జి ఏసు కుడిచేతిని నరికివేశారు. చెయ్యిని కాలువలో పడేసి, బావాయిపాలెం శివారు పశువుల రేవు వద్ద మజ్జి ఏసును వదిలేసి వెళ్లిపోయారు. అధికరక్త స్రావంతో మజ్జి ఏసు కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారు ఉపయోగించిన కత్తిని, మూడు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్కుమార్ -
చిత్రకారుడు వెంపటాపునకు జాతీయ అవార్డులు
తణుకు అర్బన్: ఉత్తరప్రదేశ్ బరెల్లికి చెందిన కళారత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్, కాంపిటీషన్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీ, ఎగ్జిబిషన్లో వివిధ దేశాల నుంచి వచ్చిన చిత్రకారులు తమ చిత్రకళా రూపాలను ప్రదర్శించారని, ఈ పోటీలో తనకు ఒకేసారి కళా రత్నం, ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందని వెంపటాపు అన్నారు. ఈ సందర్భంగా వెంపటాపును పలువురు అభినందించారు. విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం జర్మనీ దేశ ప్రతినిధి బృందం ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు. -
బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలోని శ్రీరామ లింగేశ్వరాలయం. పూర్వపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ, ప్రాచీన తూర్పు వేంగీ చాళుక్యుల రాజధాని వేంగీ పురం(నేటి పెదవేగి)కి అతి సమీపాన కృష్ణా జిల్లా, ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరు ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించేందుకు ఏటా రెండు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్ ప్రత్యేకాధికారిగా, తహసీల్దార్ కె.రాజ్కుమార్ నోడల్ అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో తమ్మిలేరుపై ప్రారంభమైన చెక్డ్యామ్ కమ్ హైలెవెల్ బ్రిడ్జి, స్నానఘట్టాల నిర్మాణం పూర్తి కావడంతో విశాల ప్రాంగణంగా రూపుదిద్దుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాట్లు ప్రారంభించగా, తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే మిఠాయిల దుకాణాలు, వినోద సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. బలివే చేరాలంటే బస్సురూట్లు ఇలా రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామ లింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా మొత్తం నాలుగు భాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. ● నూజివీడు నుంచి బలివే ఉత్సవ ప్రాంగణం వరకు ● ఏలూరు నుంచి వేల్పుచర్ల మీదుగా ● ఏలూరు నుంచి విజయరాయి మీదుగా ● సత్తుపల్లి, చింతలపూడిల నుంచి బలివే వరకు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి అజయ్కుమార్ బాబు (27) ఈ నెల 16వ తేదీన రాత్రి తన తల్లి ఇంటి డాబాపైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మెట్లపై నుంచి కిందకు పడిపోయాడు. దీంతో అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 17న తాడేపల్లిగూడెం ట్రినిటీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై అజయ్కుమార్ బాబు భార్య లావణ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యసనాలకు బానిసై చోరీలు
భీమవరం: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని భీమవరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టూటౌన్పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆర్జీ జయసూర్య వివరాలు వెల్లడించారు. రాయలం గ్రామ పరిధిలో అడ్డాల శ్రీనివాసరావు 2013 ఆగస్టు 16వ తేదీన రూ.10 లక్షలు మోటారుసైకిల్ డిక్కీలోపెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు నగదును ఇద్దరు వ్యక్తులు అపహరించారు. దీనిపై టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీఐ జి కాళీచరణ్, ఎస్సై ఇశ్రాయేల్, కానిస్టేబుళ్లు టి శరత్, ఎన్ గోపి, ఆర్ నరేంద్ర దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడైన నెల్లూరు జిల్లా భోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామానికి చెందిన పీట్ల మహేష్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.3.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయసూర్య వివరించారు. నిందితుడు మహేష్ వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనాలు ప్రారంభించాడని, అతడిపై పలు జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో ఒక సస్పెక్టివ్, రౌడీ షీట్ నెల్లూరు జిల్లా బిట్రగుంట పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. రాయలం వద్ద జరిగిన చోరీ కేసులో మరో నిందితుడు బెంజిమెన్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ కె మానస, సీఐ కాళీచరణ్ పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్.. రూ.3.50 లక్షలు స్వాధీనం -
లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ
ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు గతేడాది నవంబర్లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా జరిగిన విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, గుండె మాణిక్యాల నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. -
బెస్ట్ ఫిజిక్మెన్ టోర్నమెంట్లో విద్యార్థికి రజత పతకం
భీమవరం: చీరాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజీయట్ బెస్ట్ ఫిజిక్మెన్ టోర్నమెంట్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి తోట షణ్ముఖశ్రీనివాస్ సిల్వర్ మెడల్ సాధించినట్లు కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు చెప్పారు. ఈనెల 17న జేఎన్టీయూకే అంతర్ కళాశాలల టోర్నమెంట్లో 60 కేజీల వెయిట్ విభాగంలో షణ్ముఖ శ్రీనివాస్ రజత పతకం సాధించాడన్నారు. బుధవారం విద్యార్థిని కళాశాలలో ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు తదితరులు అభినందించారు. రైలులో పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీ భీమవరం: రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.75 వేల విలువ చేసే సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు భీమవరం రైల్వే ఎస్సై పీవీటీ రమణ చెప్పారు. బుధవారం బాధితులకు సెల్ఫోన్లు అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై మాట్లాడుతూ రైలులో ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు వారి వస్తువులు, సెల్ఫోన్లు భద్రంగా చూసుకోవాలన్నారు. మోటారుసైకిల్ అదుపు తప్పి.. ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. అయితే బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. -
పైడిపర్రులో టెర్రర్
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే.. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పైడిపర్రులో శాంతి భద్రతలు క్షీణించాయని, నోరెత్తితే దాడిచేసే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు, జూదాలకుతోడు రౌడీ మూకలు పేట్రేగిపోతుండగా, యువత, చిన్న పిల్లలకు సైతం గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసే పరిస్థితి పైడిపర్రులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పైడిపర్రు స్పార్క్ హోటల్లో భారీ కోతాటను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైడిపర్రులో పేకాటను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతనెల 31వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో వీఆర్లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో పోలీసు యంత్రాంగం కుదేలైంది. ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నాం ఈ ఘటనలపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్ను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ దొంగతనాల వ్యవహారంపై పోలీసులు బృందాలుగా విచారణ చేస్తున్నారని, అనుమానితులను గుర్తిస్తున్నామని చెప్పారు. పేకాటలపై సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తణుకు అర్బన్: పైడిపర్రు గ్రామంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. దొంగల స్వైరవిహారం.. రౌడీ మూకల బెదిరింపులు.. జూదానికి కేరాఫ్ అడ్రస్గా ఈ ప్రాంతం మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో పైడిపర్రువాసులు హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సయయంలో 1 గంట నుంచి 5 గంటలలోపు పైడిపర్రు ప్రాంతంలో దొంగలు స్వైరవిహారం చేశారు. ఒక మహిళ మెడలో 3 కాసుల బంగారు గొలుసు గుంజుకుని పారిపోగా.. మరో ఇంటి మందు పార్కింగ్ చేసిన మోటార్సైకిల్ను అపహరించారు. గణేశుల సూర్యనారాయణ, ఆరేటి సతీష్, పంగం శంకరం, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఇళ్లలో తలుపులు పగులగొట్టి, తాళాలు విరగ్గొట్టి, కిటికీ చువ్వలు విరిచేసి, తలుపుల గెడలు వంచేసి ఇలా విధ్వంసం సృష్టించారు. దొంగలు చేసిన శబ్దాలకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించారు. ఒక దొంగ నిక్కరుతో ఉన్నాడని, మరో దొంగ ఫ్యాంటు ధరించి ఉన్నారని బాధితులు చెబుతుండడంతో ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దొంగతనాలన్ని రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరగడం విశేషం. పైడిపర్రు ప్రాంతం మునిసిపాలిటీలో 4 వార్డులుగా కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా గ్రామస్థాయి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. 15వేల జనాభా ఉన్న ఈ పైడిపర్రులో 2500 పైగా ఇళ్లు ఉన్నాయి. ఆందోళనలో పైడిపర్రువాసులు ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రౌడీ మూకలు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరచడం, అలాగే ఒక ఇంట్లో పేకాట నిర్వహించడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈనెల 16వ తేదీన శ్రీబాల వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గ్రామపెద్దలు సమావేశమై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే రాత్రి దొంగలు స్వైరవిహారం చేయడం విశేషం. గ్రామంలో గాడితప్పిన లా అండ్ ఆర్డర్ ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీకి యత్నం గృహాల్లోనే పేకాట శిబిరాలు ఇటీవల చాకుతో యువకుడిపై దాడిచేసిన పేకాట బ్యాచ్ ఎస్సై ఆత్మహత్యతో కొరవడిన పోలీసు నిఘా బంగారు తాడు గుంజుకుపోయాడు 17వ తేదీ తెల్లవారుజాము 5 గంటల సమయంలో మొదటి అంతస్తు భవనంలో గుమ్మం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి నా మెడలోని 3 కాసుల బంగారు తాడును గుంజుకుని పారిపోయాడు. నా భర్త గత కొంతకాలంగా వేరొక మహిళతో ఉంటుండగా దొంగ వెళ్తూవెళ్తూ ఆవిడ పేరు ప్రస్తావిస్తూ ఆమె జోలికొస్తే చంపేస్తానని హెచ్చరించి పారిపోయాడు. –దేవ లక్ష్మి నవదుర్గ భయాందోళన సృష్టించారు మా ఇంటి ముందు పెట్టిన మోటార్సైకిల్ 17వ తేదీన తెల్లవారిన తరువాత చూస్తే కనిపించలేదు. అదే రోజు రాత్రి నా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా దొంగలు హల్చల్ చేశారు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లు మాత్రమే దోచుకునే దొంగలు ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్న ఇళ్లలోకి సైతం ప్రవేశించారు. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. –చల్లా పెద్దిరాజు -
ఉద్యాన పంటలకు ఉపాధి నిధులు
పాలకొల్లు అర్బన్: ఉపాధి హామీ పథకం నిధులతో నూరు శాతం సబ్సిడీ అందించి ఉద్యాన పంటలు పెంచుకోవడానికి రైతులను గుర్తించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలిచ్చారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పట్టణం, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల అధికారులతో మంగళవారం సమీక్షా నిర్వహించారు. నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచే దిశగా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని రైతులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో నూరుశాతం సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఒక్కొక్క రైతుకు నూరుశాతం సబ్సిడీ అందజేస్తారన్నారు. మూడేళ్ల కాలానికి అత్యల్పంగా మునగ సాగుకు రూ.27,515, దానిమ్మ సాగుకు ఎకరానికి రూ.2,16,417 అందజేస్తారన్నారు. ఉద్యాన పంటల సాగుకు రైతులను గుర్తించి జాబితాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్.దేవేంద్రకుమార్, మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సంబంధిత అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి మంచి ప్రగతి సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో సూర్య ఘర్ యోజన పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,202 దరఖాస్తులు రిజిస్టర్ కాగా కేవలం 633 గృహాలకు మాత్రమే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఈ పథకం అమలు సంతప్తికరంగా లేదన్నారు. సోలార్ ప్యానల్ ఏర్పాటుపై అవగాహన కల్పిస్తే పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ఏర్పాటుకు సంసిద్ధంగా ఉంటారన్నారు. పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో వెనుకబాటు కనిపిస్తుందన్నారు. -
రైతులను విచారించిన అధికారులు
తాబేళ్ల రక్షణకు చర్యలు తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. నరసాపురం మండలంలోని తాబేళ్ల గుడ్ల సేకరణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8లో uనిడమర్రు: ఎఫ్ఎస్వో శ్రీనివాస్బాబుపై రైతులు చేస్తున్న లంచాల ఆరోపణలపై నిడమర్రు సచివాలయం కార్యాలయంలో మంగళవారం అటవీ శాఖ రేంజర్ పి.మోహినీ విజయలక్ష్మి విచారణ నిర్వహించారు. ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అనే శీర్షికన ఈ నెల 14న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. డీఎఫ్వో స్పందించి విచారణకు రేంజర్ను నియమించారు. విచారణలో జాప్యంతో విచారణ పక్కదారి పడుతోందంటూ నిడమర్రు రైతులు సాక్షిని ఆశ్రయించడంతో ‘లంచాల బాగోతంపై మీనమేషాలు’ అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణాధికారి నిడమర్రు వస్తున్నట్లు ఫిర్యాదుదారుడు మండా పోలయ్యకు సమాచారం అందించారు. జి రాయితీ భూముల్లో సాగు చేసుకునేందుకు ఎఫ్ఎస్వో తన దగ్గర రూ. 40 వేలు లంచం తీసుకున్నాడని, ఇంకా డిమాండ్ చేయడంతో వీడియోలు తీసి ఫిర్యాదు చేసినట్లు పోలయ్య లిఖిత పూర్వకంగా రేంజర్కు వివరాలు అందించారు. గ్రామంలో విచారణ పూర్తయ్యిందని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. -
ఇళ్ల తొలగింపుల్లో ఉద్రిక్తత
పాలకోడేరు: పాలకోడేరు శివారు ఏఎస్ఆర్ నగర్లో 21 కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో మంగళవారం ఉదయం నుంచి వారంతా మెయిన్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. చివకు పోలీసు, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. 21 మందికి ప్రత్యామ్నాయం చూపినట్లుగా నోటీసులు ఇచ్చి విద్యుత్తు కనెక్షన్లు కట్ చేయడం సరైన కాదని ఆరుగురు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారని మిగిలిన వారందరికీ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలన్నారు. ఇల్లు నిర్మించుకున్న ఆరుగురు ఈ రోజే వెళ్ళిపోతారని తెలిపారు. రెండు నెలల్లో అందరికీ ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ కనెక్షన్లన్నీ ఈరోజే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. -
నిరుద్యోగ భృతి కల్పించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెల నెల ఇస్తానన్న భృతిని వెంటనే చెల్లించాలి, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – తంగెళ్ల రాధాకృష్ణ. తూర్పుతాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించడమే కాక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు. – సాకా సుబ్రహ్మణ్యం దేవ, బీఎస్సీ బీఈడీ హామీ నెరవేర్చలేకపోయారు నేను ఎంఏ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిన ఇంతవరకు ఆ ఊసే లేదు. ఎన్నికల హామీల అమలులో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. – అంబేడ్కర్, వేల్పూరు జాబ్ లేక వ్యవసాయం.. ఎంఏ సోషల్ చేసి జాబ్ లేక వ్యవసాయం చేస్తున్నాను. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ ఇస్తామన్నారు, ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క దానికి ప్రభుత్వం కట్టుబడి లేదు. – పడవల నాని, బాలేపల్లి, ఎంఏ సోషల్ ● -
బలివే తీర్థానికి తమ్మిలేరు నీరు విడుదల
చింతలపూడి: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని బలివే తీర్థానికి తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తమ్మిలేరు ఇరిగేషన్ డీఈ సీతారామ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ద్వారా ప్రయాణించి నడిపల్లి చెరువులోనికి చేరుతుందని చెప్పారు. అక్కడి నుంచి బలివేకు భక్తుల కోసం నీటిని వంతుల వారీగా తరలిస్తామన్నారు. బలివేకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. మొత్తం తీర్థానికి 500 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నట్లు తెలిపారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ద్వారకాతిరుమల: గురుకులంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ీస్వీకరిస్తున్నట్టు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ బి.రాణి తెలిపారు. మార్చి 6తో ఈ గడువు ముగుస్తుందన్నారు. అర్హులైన విద్యార్థినులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులు జారీ, అదే నెల 6న ఉదయం 10 గంటల నుంచి 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్ధి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు కలిగిన ధ్రువీకరణ పత్రం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు 2012 సెప్టెంబర్ 1 నుంచి, 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలన్నారు. జూనియర్ ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదన్నారు. నరసాపురం ఆసుపత్రిలో దివ్యాంగుల పాట్లు నరసాపురం: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దూరప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు నానా ఇబ్బందులు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రికి పిలిపించి గంటల సేపు నిలబెట్టారు. దీంతో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో గత 15 రోజుల నుంచి సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు మండల పరిధిలో గతంలో సదరం సర్టిఫికెట్లు పొందిన వారిలో ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించడం కోసమని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా దివ్యాంగులను ఆసుపత్రికి పిలుస్తున్నారు. వారికి టైం స్లాట్ల సౌకర్యం, వెలుసుబాటు కల్పించకపోవడంతో ఉదయం 9 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 5 గంటల వరకూ వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారు. -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి
ఆకివీడు: విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపిన వివరాలివి. మంగళవారం స్థానిక గుంటూరు సెంటర్లోని ఖాళీ ప్రదేశంలో ఓ టెంట్ వద్ద సత్తినీనీనీడి ధనరాజు, మణికంఠ, తోట అయ్యప్ప గుమికూడి ఉన్నారు. దీనిపై 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ శివ అక్కడికి వెళ్లి వారిని వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం శివ మరో కానిస్టేబుల్ కోటేశ్వరరావుతో సాయంత్రం డ్యూటీకి వెళుతుండగా అదే ప్రాంతంలోని బ్రాందీ షాపు వద్ద కాపు కాసి కానిస్టేబుల్ శివపై మణికంఠ, ధనరాజు, అయ్యప్ప దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకుని గొడవను నిలుపుదల చేశారు. కానిస్టేబుల్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
బర్డ్ఫ్లూ పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ విజృంభన కొనసాగుతోంది. బర్డ్ఫ్లూతో ఇప్పటికే లక్షల సంఖ్యలో చనిపోయాయి. దాదాపు 19 ఏళ్ళ తరువాత జిల్లాలో బర్డ్ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంక్రాంతి ముందు నుంచే వైరస్ లక్షణాలతో కోళ్ళు చనిపోతుండగా శీతల ప్రభావమంటూ అధికారులు కొట్టిపడేశారు. ఒక్కసారిగా గత వారం పది రోజుల నుంచి బర్డ్ఫ్లూ పంజా విసరడంతో సుమారు 15 లక్షల వరకు లేయర్ కోళ్ళు, 50 వేల వరకు బ్రాయి లర్ కోళ్ళు చనిపోయినట్టు అంచనా. కోళ్ళ మేత, గుడ్లు, అన్నింటి విలువ కలుపుకొని సుమారు రూ. 70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగం గణనీయంగా విస్తరించింది. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో 2.20 కోట్ల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సగటున ప్రతిరోజూ 1.30 కోట్ల కోళ్ల ద్వారా 1.10 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు 70 శాతం గుడ్ల ఎగుమతులు జరుగుతుండగా, మిగిలిన 30 శాతం గుడ్లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. 2006లో రూ.50 పైసలకు పడిపోయిన గుడ్డు 2006లో జిల్లాలో మొట్టమొదటిసారిగా పౌల్ట్రీల్లో బర్డ్ఫ్లూను గుర్తించారు. అప్పట్లో జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. రూ.1.90 ఉన్న గుడ్డు ధర రూ.50 పైసలకు పడిపోవడంతో పౌల్ట్రీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లు, ఇతర జాగ్రత్తల ద్వారా వైరస్లను అధిగమిస్తూ రెండేళ్ళలోనే పౌల్ట్రీల వ్యవస్థను గాడిలో పెట్టారు. 19 ఏళ్ళ తరువాత జిల్లాలో వైరస్ను గుర్తించడం, అది కూడా లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాక గుర్తించడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందనేది పౌల్ట్రీ వర్గాల భావన. జిల్లాలో ఉంగుటూరు, బాదంపూడి, తణుకు రూరల్, వేల్పూరు, పెరవలి, తాడేపల్లిగూడెంతో పాటు అనేక ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలున్నాయి. 11న జిల్లాలో వైరస్ గుర్తింపు ఈ నెల 11న జిల్లాలో వైరస్ను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో బాదంపూడిలోని పౌల్ట్రీలో రోజుకు 3 నుంచి 4 వేల కోళ్లు చనిపోవడం గుర్తించారు. అధికార యంత్రాంగం వారం రోజుల తరువాత అలెర్ట్ అయింది. వాస్తవానికి ప్రతి రోజూ పౌల్ట్రీల్లో సాధారణ పరిస్థితులను బట్టి లక్షల కోళ్ళు ఉన్నచోట 30 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. బాదంపూడి, వేల్పూరు, తణుకు రూరల్లో ఎక్కువగా కోళ్లు చనిపోవడంతో వాటిని ల్యాబ్కు పంపగా ఏమియాన్ ఇన్ఫ్లుయాంజ్ (హెచ్ 5ఎన్–1) వైరస్గా గుర్తించారు. లక్షల కోళ్లు, గుడ్లు పూడ్చివేత జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఫారం కోళ్లు, 50 వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్తో చనిపోయాయని పౌల్ట్రీ వర్గాల అంచనా. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖాధికారులు వైరస్ గుర్తించిన పౌల్ట్రీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు అలెర్ట్ జోన్లుగా ప్రకటించి చికెన్, గుడ్ల విక్రయాలను నిషేధించారు. వైరస్ ఉన్న కోళ్ళ ఫారాల ప్రాంతాలను ఇన్ఫెక్షన్ జోన్లుగా ప్రకటించి వెటర్నరీ వైద్యులతో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లాలో 1.24 లక్షల కోళ్ళు, 1.85 లక్షల కోళ్ళ మేతలు, లక్షకు పైగా గుడ్లను భూమిలో పూడ్చివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2 పౌల్ట్రీల్లో 22 వేల కోళ్ళు, 24,660 గుడ్లు, 20 కిలోల మేతను పూడ్చివేశారు. ఇంతవరకు 15 లక్షల లేయర్ కోళ్ల మృత్యువాత సుమారు రూ.70 కోట్లకు పైగా పౌల్ట్రీలకు నష్టం జిల్లా వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ జోన్ల గుర్తింపు రెడ్ జోన్ పరిధిలోని పౌల్ట్రీలు మూడు నెలల పాటు మూసివేత మూడు రోజులుగా కొనసాగుతున్న శానిటేషన్ ప్రక్రియ -
పోక్సో కేసులో 8 ఏళ్ల జైలు
ఇరగవరం: పోక్సో కేసులో ముద్దాయికి 8 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం భీమవరం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఎసై జానా సతీష్ తెలిపిన వివరాలివి. గొల్లమాలపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన తోట నరేష్ (27) లైంగికంగా వేధించేవాడు. అడ్డుపడిన వారిని సైతం చంపుతానని బెదిరించడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2022 జనవరి 27వ ఎసై జానా సతీష్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో ముద్దాయి నరేష్కు భీమవరం పోక్సో కోర్టు జడ్జి బి లక్ష్మీనారాయణ ఎనిమిదేళ్ల జైలు, రూ.60 వేలు జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బ్రహ్మయ్య వాదనలు వినిపించగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరించారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్షనూజివీడు: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన మల్లవల్లి ప్రవీణ్కుమార్ 2020 ఆగస్టు 2న జంగారెడ్డిగూడెంకు చెందిన ఎర్నెస్ట్ కుమార్కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ తీర్చమని అడుగగా ఎర్నెస్ట్ కుమార్ 2020 డిసెంబర్ 27న ప్రవీణ్కుమార్కు ఒకొక్కటి రూ.5లక్షలు చొప్పున రెండు చెక్కులను ఇచ్చారు. ఆ చెక్కులను నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా ఖాతాలో నగదు లేదని వెనక్కు తిరిగి వచ్చాయి. దీంతో ప్రవీణ్కుమార్ కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం ఎర్నెస్ట్ కుమార్కు న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు. -
తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు
నరసాపురం రూరల్: సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన చినమైనవానిలంక గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని జేసీ రాహుల్కుమార్రెడ్డితో కలసి ఆమె పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్రజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గత నెలలో పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోయి సముద్రతీర ప్రాంతానికి కొట్టుకురావడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై సంబందిత అధికారులతో సమావేశమై తాబేళ్లు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్టుమార్టం చేయించామన్నారు. ఆ నివేదక ఇంకా అందాల్సి ఉందన్నారు. తదుపరి చర్యల్లో బాగంగా అటవీశాఖ పర్యవేక్షణలో తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టే ప్రాంతాలను గుర్తించి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకూ తాబేళ్లు సముద్రపు ఒడ్డున అనువైన ప్రాంతంలో గుడ్లు పెట్టే సమయం అని, అనంతరం ఆ గుడ్లనుంచి పిల్లలు బయటకు వస్తాయన్నారు. ఆలీవ్రెడ్లీ జాతి తాబేళ్లు పెట్టిన సుమారు 4,400 గుడ్లను హేచరీలో ఉంచామని, రానున్న రెండు నెలల కాలంలో మరో 25 వేల గుడ్లు పెట్టే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన అనంతరం వాటిని సముద్రంలోని విడచి పెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. తద్వారా సముద్ర జీవుల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేందుకు అనువుగా సముద్రం అంచున వలలను అడ్డంకిగా లేకుండా చూడాలని మత్స్యకారులకు సూచించారు. మానవ మనుగడకు సముద్ర వాతావరణం సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మడ అడవులను నరికితే చర్యలు చినమైనవానిలంకలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ నాగరాణి దర్బరేవు, రాజల్లంక ప్రాంతాల్లోని మడ అడవులను బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా మడ అడవులు రక్షణగా నిలుస్తాయన్నారు. ఇప్పటికే సముద్రం పెదమైనవానిలంక, చినమైనవానిలంక ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన విషయం తెలిసిందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంక గ్రామంలో ఒక కిలోమీటర్ మేర నిర్మించనున్న సముద్ర రక్షణ గోడకు రూ.35 కోట్లు వ్యయం అవుతుందని ఈ నిధులను మంత్రి కేటాయించారన్నారు. పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. వాస్తవంగా ఏడు కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడను నిర్మించాల్సి ఉందని ప్రస్తుతం ఒక కిలోమీటరు మాత్రమే ఈ గోడను నిర్మిస్తారన్నారు. చినమైనవానిలంకలోని నల్లీక్రీక్పై వంతెనను ఆర్అండ్బీ అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. వంతెన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి ఆశాకిరణ్, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తాబేళ్ల గుడ్ల సంరక్షణకు హేచరీ ఏర్పాటు మడ అడవులను పరిశీలించిన పశ్చిమ కలెక్టర్ తీరప్రాంత గ్రామాల్లో కలెక్టర్ నాగరాణి పర్యటన -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు: బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో... బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది. పథకం ప్రకారం హత్య నిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కొలిక్కివచ్చిన మజ్జి ఏసు హత్య కేసు పోలీసుల అదుపులో నిందితులు! హత్యకు సహకరించిన మరోవ్యక్తి కోసం పోలీసుల గాలింపు -
నిరుద్యోగుల్లో నిరుత్సాహం
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి, భీమవరం: డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం ఇంటి వద్ద, జిల్లాలో, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుని కుటుంబ ఆర్ధిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. పత్తాలేని హామీలు కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశామని చెప్పారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. అంతవరకూ నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలైనా వాటి ఊసెత్తకపోవడం ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరోపక్క తొలి సంతకం పేరిట 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు ఉన్న పోస్టులకు కోత పెట్టేందుకు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఎత్తుగడ వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5.17 లక్షలు, ఏలూరు జిల్లాలో ఐదు లక్షల కుటుంబాలు ఎన్నికల వాగ్దానాల అమలుకోసం ఎదురుచూస్తున్నారు. పెల్లుబుకుతున్న అసంతృప్తి నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉందంటూ సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన విషయం విదితమే. నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలదీ అదే దారి. సామాజిక మాద్యమాల ద్వారా ఇప్పటికే వివిధ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుత తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో కొత్త పశ్చిమగోదావరి జిల్లాలో 64,327 మంది, ఏలూరు జిల్లాలో 43,692 మంది ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూటమి నేతలు ఆపసోపాలు పడుతున్నారు. 2024 జూన్ నుంచే హామీలు అమలని చెప్పి ముఖం చాటేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూటమి నేతల మాటలను ఎన్నికల జిమ్మిక్కుగానే కొట్టిపారేస్తున్నారు. న్యూస్రీల్రాసిపెట్టుకోండి తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటిగా 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. – జిల్లాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏపీలోని యువతను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలిస్తాం. హైటెక్ టవర్లు నిర్మించి వర్క్ఫ్రం హోమ్ తెస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. – పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సభల్లో చంద్రబాబు జాడలేని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి మెగా డీఎస్సీపై నోరు మెదపని సర్కారు హామీల అమలు కోసం నిరుద్యోగుల ఎదురుచూపు పట్టభద్రుల ఓట్లు వేటలో కూటమి నేతల అంతర్మథనం ఉమ్మడి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు నిరుద్యోగులకుప్రతి నెలా రూ.3 వేల భృతితొమ్మిది నెలలైంది. హామీల అమలు ఎప్పుడు ?మెగా డీఎస్సీ -
● దివ్యం.. శేష సాయి దర్శనం
● సాయిబాబాపై ‘సర్పం’ దర్శనం స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము బాబా శిరస్సుపై ఉండటం ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, పాము నెమ్మదిగా బాబా విగ్రహం నుంచి ఫొటో మీదకు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. – ద్వారకాతిరుమలద్వారకాతిరుమల: స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము తొలుత బాబా శిరస్సుపై ఉండటం భక్తులకు, ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. అయితే విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, ఆ అలజడికి పాము నెమ్మదిగా బాబా విగ్రహం పైనుంచి, పక్కనే ఉన్న బాబా ఫొటో మీదకు వెళ్లి, కొద్దిసేపు అక్కడే ఉంది. చివరకు నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది. -
స్నేహితుల సహకారం మరువను
రక్తం అందక నిండు గర్భిణీ మరణం నన్ను కలచివేసింది. సమాజానికి మేలు చేయాలని అప్పుడే భావించాను. నాకు స్నేహితులందరూ అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి మేము ఉన్నాం.. అనే చిన్న భరోసా కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇప్పుడు ఇంత మంది తోడుగా రావడం సంతోషం. మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తాం. – అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్, ఆడిటర్, హైదరాబాద్ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం సేవే పరమార్థంగా అందరం పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యులందరూ సకాలంలో స్పందిస్తున్నారు. శనివారం భీమవరంలో మహిళకు రక్తం అవసరమయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి ఆమెకు రక్తదానం చేశాను. ఇలా అందరూ సభ్యులు చేస్తున్నారు. అపోహలు విడనాడి అందరూ రక్తదానానికి ముందుకు రావాలి. – ఉండి రాజశేఖరరెడ్డి, సభ్యుడు, మూలలంక, కలిదిండి మండలం -
కుటుంబ కలహాలే కారణమా!
● గోస్తనీ కాలువలో దూకి ఆదివారం మహిళ ఆత్మహత్య● సోమవారం కాలువలో లభ్యమైన మృతదేహం● విలపిస్తున్న కుటుంబసభ్యులుతణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలో నివసించే గుమ్మళ్ల శాంతి (48) మంగళవారం ఆంధ్రాసుగర్స్ ప్రాంతంలోని కాలువలో శవమై తేలింది. ఆమె ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఇంటి నుంచి బయటకు రావడం, సోమవారం ఉదయం గోస్తనీ కాలువ జాతీయరహదారి వంతెనపై ఆమె బూట్లు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని నిర్థారణకు రావడంతో పోలీసులు, అగ్నిమాపక అధికారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె మృతదేహం ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలో లభ్యమైంది. ఇటీవల కుటుంబ కలహాలతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.కుటుంబమంతా వెల్నెస్పైనే ఉపాధిశాంతి కుటుంబమంతా వెల్నెస్ సెంటర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వృద్ధులైన తన తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కుమారులతో సజ్జాపురం పార్కు ప్రాంతంలో శాంతి నివసిస్తోంది. పెద్దకుమారుడు దుర్గాప్రసాద్ వివాహానంతరం కాకినాడలో వెల్నెస్ సెంటర్ నడుపుతూ అక్కడే నివసిస్తుండగా, చిన్న కుమారుడు పవన్ తణుకు బొమ్మల వీధిలో వెల్నెస్ సెంటర్ కోచ్గా ఉన్నారు. అయితే గతంలో స్థూలకాయంతో ఉండే శాంతి వెల్నెస్ సెంటర్లో వాడిన మందులతో సన్నబడి ఎంతో హుషారుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తను మారిన విధానాన్ని అందరికీ తెలిసేలా ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారని, తన కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా గడిపేవారని, కుమారులిద్దరితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసేవారని అటువంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందోనని స్థానిక ప్రజానీకం చర్చించుకుంటున్నారు. గోస్తనీ కాలువలో ఆమె శవమై తేలడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
ఉపాధి కూలీలను ఢీకొన్న ట్రాక్టర్
కొయ్యలగూడెం: ఉపాధి పనుల కోసం వెళుతున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొన్న ఘటన కుంతలగూడెం సమీపంలో మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం కుంతలగూడెంకు చెందిన కొందరు కూలీలు మంగళవారం ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో చిన్నాయగూడెం వైపు వెళుతున్న ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి కూలీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో అల్లె భాగ్యవతి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో పాటుగా మరో ముగ్గురు కూలీలు రాపాక నాగమణి, చాపల ఇమ్మెలియా, బాసుబోయిన పోసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెరుగైన వైద్యం నిమిత్తం తరలించినట్లు ఏపీవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇమ్మెలియా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు 108 టెక్నీషియన్ బద్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం సంభవించిందని కూలీలు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి ఎస్సై వి.చంద్రశేఖర్ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు -
రక్తదానమే లక్ష్యంగా.. హోప్ పయనం
కై కలూరు: నిండు ప్రాణాలను కాపాడటంలో కలిగే సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా రాదు. ఇదే నినాదంతో 2022లో ఏర్పాటైన హోప్ చారిటబుల్ ట్రస్ట్ సేవలందిస్తోంది. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ స్నేహితులతో కలసి ఓ వాట్సాప్ గ్రూఫ్ను క్రియేట్ చేశాడు. ఒక్క అడుగుతో మొదలైన సేవా ప్రస్థానం ఇప్పుడు ఏకంగా 200 మంది సభ్యులకు చేరింది. రక్తదానమే పరమావధిగా సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 ప్రముఖ బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని అందించే స్థాయికి చేరింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, క్యాన్సర్ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా 16,700 యూనిట్ల రక్తదానం సభ్యులు చేశారు. సేవే పరమార్థంగా పనిచేస్తున్న సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తలసేమియా చిన్నారులకు దేవుళ్లు తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తమార్పిడి జరగాలి. వీరి ఇబ్బందులను గుర్తించిన సంస్థ సభ్యులు భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో జల్లిడ పట్టి మొత్తం 52 మంది చిన్నారులను గుర్తించారు. వీరి కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆనంద్ బ్లడ్ బ్యాంకులో వివిధ గ్రూఫుల రక్తాన్ని నిల్వ చేస్తున్నారు. చిన్నారులకు అమృత హాస్పటల్లో రూ.1000 ఖరీదు కలిగిన రక్తం ఎక్కించే ఫిల్టర్లను సైతం వీరే అందిస్తున్నారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల వర్ధంతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజులు ఇలా పలు సందర్భాల్లో రక్తదానం సేకరించి ప్రమాదంలో ప్రజలకు సంస్థ సభ్యులు సేవ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో 25 బ్లడ్ బ్యాంకులకు రక్తదానం వాట్సాప్లో 200 మంది సభ్యుల చేరిక 52 మంది తలసేమియా చిన్నారులకు ప్రతినెలా రక్తదానం రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 వేల మందికి రక్తదానం -
పెద్దింట్లమ్మ జాతరను విజయవంతం చేద్దాం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీవో, జాతర నిర్వాహణ చైర్మన్ డాక్టర్ అచ్యుత అంబరీష్ చెప్పారు. మార్చి 1 నుంచి 13 వరకు జరిగే జాతర(తీర్థం) నిమిత్తం కొల్లేటికోట దేవస్థానం వద్ద రెండో విడత వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరూ పనిచేయాలన్నారు. జాతర అన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. ముందుగా జాతర గోడపత్రి, బుక్లెట్, కరపత్రాలను అవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దారు ఎండీ.ఇబ్రహీం, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆర్.రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ బహిష్కరణపై ఫిర్యాదు
మండవల్లి: తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని ఓ గొర్రెల పెంపకందారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడలంక గ్రామవాసి త్రిమూర్తులు గొర్రెల పెంపకందారుడు. గొర్రెల పెంపకం వలన గ్రామ వాతావరణం కాలుష్యమౌతుందంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని సర్పంచ్తోపాటు స్థానిక పెద్దలు గ్రామ సభ ద్వారా హెచ్చరికలు జారీ చేశారని త్రిమూర్తులు మంగళవారం మండవల్లిలో పేర్కొన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసి, గొర్రెలను స్వాధీనం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని గ్రామ చావడి మైక్ ద్వారా తెలియజేశారన్నాడు. తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఐటీఐలో ఉచిత కంప్యూటర్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో ఏపీ ఎస్ఎస్డీసీ వారి ఆధ్వర్యంలో 45 రోజుల కంప్యూటర్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ వీ శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. పదో తరగతి ఆపైన పాస్ అయ్యి ఉండాలని, 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్తోపాటు ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. వివరాలకు 94928 85556, 08816 297093 నంబర్లలో సంప్రదించాలన్నారు. యువతి ఆత్మహత్య నరసాపురం రూరల్: కొప్పర్రు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పంటకాలువ సమీపంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న ఎరిచర్ల సిరి అనే యువతి సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు చందు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై పోలీసులను సంప్రందించగా వారు స్పందించలేదు. బంగారు, వెండి ఆభరణాలతో నవ వధువు పరారీ ఏలూరు (టూటౌన్): నవ వధువు బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుని పరారైన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు గజ్జల వారి చెరువు సమీపంలో వి.శివ నాగ సాయి కృష్ణ జ్యూస్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గత నెల 31వ తేదీన అతనికి విశాఖపట్టణం కంచరపాలెం ప్రాంతానికి చెందిన బోడేపు చంద్రహాసినితో వివాహమైంది. అత్తవారింటి నుంచి ఏడు రోజుల క్రితం ఏలూరు నగరానికి చేరుకున్న కొత్తజంట కొత్త కాపురాన్ని బిట్టుబారు సమీపంలో ఉన్న అద్దె ఇంట్లో మొదలుపెట్టారు. అయితే ఈ నెల 16వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు నిద్రకు ఉపక్రమించగా, 17వ తేదీన శివ నిద్రలేచి చూసేసరికి నవవధువు ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించాడు. ఆమె వెళ్తూవెళ్తూ నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు సెల్ఫోన్తో పరారైనట్లు శివ గుర్తించాడు. ఆమె ఆచూకీ కోసం ఆమె తండ్రితో కలిసి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
క్షేత్రస్థాయి పర్యటనకు నిధుల విడుదల
భీమవరం: జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల రాష్ట్ర పర్యటనకు జిల్లాలోని 82 పాఠశాల ఎంపికచేయగా ఒక్కొకరికి రూ.200 చొప్పున రూ.16,400 కేటాయించిందని, రాష్ట్రేతర పర్యటనకు 82 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి రూ.1.64 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో 20 మంది బాలురు, 40 మంది బాలికలు, 20 మంది టీచర్లు, 125 మంది గైడ్ టీచర్లు, ఏఎంఓ, డీఎస్వోతో సహా మొత్తం 207 మంది రాష్ట్ర పర్యటనకు రూ.4.14 లక్షలు, రాష్ట్రేతర పర్యటనకు రూ.4.14 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. -
వైరస్ కోళ్లు ఖననం
తాడేపల్లిగూడెం రూరల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మండలంలోని పెదతాడేపల్లి పౌల్ట్రీ ఫారంలోని కోళ్లను సోమవారం వెటర్నరీ అధికారులు ఖననం చేశారు. వెటర్నరీ సిబ్బంది పీపీ కిట్లు ధరించి సుమారు 23 వేల కోళ్లను దశల వారీగా గోతుల్లో వేసి పూడ్చారు. వెటర్నరీ జేడీ మురళీకృష్ణ, డీడీ డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, వెటర్నరీ ఏడీ డాక్టర్ అనిల్కుమార్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ ధర్నా భీమవరం: భీమవరంలోని కోర్టు పక్కన నివాసితుల ఇళ్లు తొలగించవద్దంటూ గణపతినగర్ పేదలు మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో బడాబాబులు ఆక్రమించిన స్థలాలు, కాల్వలను వదిలి పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. గణపతినగర్లో చంటిపిల్లలు, వృద్ధులతో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించడంతో చెట్టు కింద ఉండాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.త్రిమూర్తులు, ఎం.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 19 నుంచి టెక్నికల్ పరీక్షలు భీమవరం: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 131 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 19 నుంచి 22 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు 19 నుంచి 20 వరకు నిర్వహిస్తామన్నారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి భీమవరం: వివిధ రకాల సమస్యలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారి సమస్యలను పూర్తిస్థాయిలో విచారణ చేసి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యలను చట్ట ప్రకారం విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులతో గౌరవంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని అనంతరం వాటిపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అంగన్వాడీ పిల్లల నమోదుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 21, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 99 ఆధార్ కేంద్రాలలో క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
కొత్త ‘మోడల్’తో బడికి మూత
తణుకు రూరల్ మండపాక ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాల–3కు 95 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యావేత్తలు, ఉద్యోగులు, ప్రముఖులు ఓనమాలు దిద్దింది ఇక్కడే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఎంపీఎస్) కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో ఈ పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సుమారు రెండు కి.మీ దూరంలోని పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇక్కడ 1, 2 తరగతులకు చెందిన కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మిగులుతారు. వారి కోసం ఈ పాఠశాలను కొనసాగిస్తారా? లేక.. విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో భవిష్యత్తులో మూసివేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ●విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది మండపాక ఎంపీపీ–3 పాఠశాలకు 95 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంపీఎస్ పేరిట ఇక్కడి 3, 4, 5 తరగతులను రెండు కి.మీ దూరంలోని వేరే పాఠశాలలో విలీనం చేయడం సరికాదు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. – జంగం సురేష్ బాబు, ప్రైవేట్ టీచర్, మండపాక మూసేయాలని చూస్తే ఉపేక్షించం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే నిర్ణయాలను స్వాగతిస్తాం. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు పేరిట కొన్ని పాఠశాలలను మూసేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. విద్యార్థులకు న్యాయం జరిగేలా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – ఎల్.సాయి శ్రీనివాస్, ఎస్టీయూ, రాష్ట్ర అధ్యక్షుడు, భీమవరం సాక్షి, భీమవరం: మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట బడుల సంఖ్యను తగ్గించే దిశగా కూటమి సర్కారు ఎత్తుగడలు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 409 పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని 143 వార్డుల పరిధిలో మొత్తం 1,436 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1, 2 తరగతులు కలిగిన ఫౌండేషన్ స్కూళ్లు(ఎఫ్ఎస్) 96 ఉండగా, 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్లు(ఎఫ్పీఎస్) 1025 ఉన్నాయి. 1 నుంచి 7, 8వ తరగతి వరకు ప్రైమరీ హైస్కూళ్లు (పీహెచ్ఎస్) 43 ఉండగా, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్ఎస్) 43, 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్ఎస్)144 ఉన్నాయి. జూనియర్ ఇంటర్ కలిగిన హైస్కూళ్లు (హెచ్ఎస్ ఫ్లస్) 20, ఎయిడెడ్/సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 36 ఉన్నాయి. మోడల్ స్కూళ్లకు ప్రతిపాదనలు రానున్న విద్యాసంవత్సరం నుంచి గ్రామాల్లో కిలోమీటరు పరిధిలోని ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్ల పాఠశాలలను విలీనం చేసి ఎంపీఎస్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మోడరన్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు 60 మంది విద్యార్థులు ఉండాలి. ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు గతంలోనే మార్గదర్శకాలిచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తారు. ఈ మేరకు గత డిసెంబరు 31 తేదీ నాటికి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. విలీనమయ్యాక ఎఫ్పీఎస్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కేవలం 1, 2 విద్యార్థులకు సంబంధించిన ఫౌండేషన్ స్కూళ్లుగా అవి మారుతాయి. విద్యార్థుల సంఖ్య సరిపడనంత ఉన్న మిగిలిన పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూల్స్ (బీపీఎస్)గా గుర్తిస్తారు. జిల్లాలో 311 మోడల్ స్కూళ్లు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే జిల్లాలో విలీన ప్రతిపాదిత పాఠశాలలను గుర్తించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం జిల్లాలో 12 పాఠశాలలను యూపీఎస్లుగా కొనసాగించనుండగా, 311 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (1–5వ తరగతి) ఏర్పాటు కానున్నాయి. 424 బీపీఎస్లు(1–5వ తరగతి), 424 ఎఫ్ఎస్ (1–2వ తరగతి), 230 హెచ్ఎస్లు (6–10వ తరగతి)లు ఏర్పాటుకానుండగా సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు యథావిధిగా ఉంటాయి. తాజా నిర్ణయం వలన కొన్ని ఫౌండేషన్, బీపీఎస్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనిని సాకుగా చూపించి కూటమి ప్రభుత్వం ఆయా పాఠశాలలను ఎత్తివేసే ఆలోచన చేయవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో ఉపాధ్యాయులు మిగలడం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్లో ఖాళీ పోస్టులు తగ్గవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇవి ప్రాథమిక అంచనా మాత్రమేనని తుది నివేదిక సిద్ధం కావాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మండపాకలోని ఎంపీపీ పాఠశాల ప్రభుత్వ బడులను తగ్గించే ఎత్తుగడ వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విద్యా శాఖ జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే అవకాశంనాడు.. నాడు–నేడుతో మహర్దశ పేదల విద్యకు పెద్దపీట వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారు. మన బడి నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరిలూదారు. రూ. 369.11 కోట్ల వ్యయంతో డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్ షెడ్లు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో తల్లికి వందనంకు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఇప్పుడు మోడల్ స్కూళ్ల పేరిట ప్రభుత్వం బడులను ఎత్తివేసే ఆలోచన చేస్తుందన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
పెళ్లి బృందాలను తరలిస్తున్న బస్సుల సీజ్
భీమవరం(ప్రకాశం చౌక్) : పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు అడ్డుకుని సీజ్ చేసి, జరిమానా విఽధించారు. భీమవరం నుంచి గణపవరం వెళుతున్న రెండు బస్సులు, ఆకివీడు వెళుతున్న ఒక బస్సును సీజ్ చేసి మూడు బస్సులకు కలిపి రూ.1,85,540 జరిమానా విధించినట్టు జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గురజాడ విద్యానికేతన్ (గణపవరం), ఇండియన్ డిజిటల్ స్కూలు(గణపవరం), భారతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆకివీడు)కు చెందిన బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు స్కూల్ బస్సులను వినియోగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. -
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
భీమవరం అర్బన్: ఓ మహిళ ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూట్లపాడు గ్రామానికి చెందిన ఆకుల శ్రీరామ్మూర్తికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందిపువారిపాలెంకు చెందిన ఆకుల దేవి సాయి రామ నాగలక్ష్మి (29)కి 2018లో వివాహమైంది. అప్పట్లో పసుపు కుంకుమల కింద 50 సెంట్లు భూమి, రూ. 3 లక్షలు, ఆడపొడుచలు లాంఛనంగా రూ.లక్షా 50 వేలు, 5 కాసులు బంగారం ముట్టజెప్పారు. కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. గత కొంతకాలంగా రామ నాగలక్ష్మిని భర్త శ్రీరామ్మూర్తి, అత్త వరలక్ష్మి, మామ ఆదినారాయణమూర్తి, ఆడపొడుచులు ముత్యాల పష్పవతి, మేడ్చర్ల లక్ష్మి, సీహెచ్ సత్యవాణి వేధిస్తున్నారు. భీమవరంలో నివసిస్తున్న శ్రీరామ్మూర్తి తన కుటుంబంతో కలిసి ఈ నెల 15న సొంతూరు గూట్లపాడు గ్రామానికి వచ్చాడు. 16వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే సోమవారం ఏమైందో తెలియదు కాని రామ నాగలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన అక్క మృతి చెందిందని దేవి సాయి రామ నాగలక్ష్మి సోదరుడు నందిపు వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని సోదరుడి ఫిర్యాదు -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: మాతా, శిశు సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని దీనికి కేంద్ర బడ్జెట్ నిదర్శనమని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. వేతనాల పెంపు కోసం, రాజకీయ వేధింపులు ఆపాలని, పని ఒత్తిడి తగ్గించాలనే డిమాండ్తో అంగన్వాడీలు మరోసాఇ ఆందోళనకు సిద్ధం కాక తప్పదని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలు, చాలీచాలని వేతనాలు, వివిధరకాల పేర్లతో ఆన్లైన్ సేవలప్పగించడం వంటి సమస్యలు అంగన్వాడీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్వాస్థ్య కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం: 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు వచ్చే లోపాలు, వ్యాధులు గుర్తించడం, ఉచిత చికిత్స, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయడానికి రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూల్లో సోమవారం ఆర్బీఎస్కే వాహనాన్ని ప్రారంభి విద్యార్థులతో మాట్లాడారు. చికిత్స అవసరమైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వాహనం ద్వారా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం(డిఇఐసి)లో చికిత్సలు చేస్తారన్నారు. డీఇఐసీ కేంద్రంలో ప్రత్యేకంగా పిల్లల వైద్యులు, మెడికల్ అధికారి, డెంటల్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోలాజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తోమీటరిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టాప్ నర్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అంగన్వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1,98,895 పిల్లలకు పరీక్షలు నిర్వహించగా 1,043 మంది పిల్లల్లో సమస్యలు గుర్తించి తణుకులోని వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భానునాయక్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ బి.భావన, డీఈవో ఇ.నారాయణ, డీఎన్నార్ విద్యాసంస్థల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయయణరాజు పాల్గొన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా అధికారులు, పంచాయతీ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దోమల నివారణ, పారిశుద్ధ్యం, వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సమీక్షించారు. రాజమండ్రి నుంచి జూమ్ కాన్ఫరెనన్స్లో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ సీహెచ్.నాగ నరసింహం జిల్లాలో దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజు, రోజుకు పెరిగిపోతున్న దోమలను నిర్మూలించేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ బయో ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు గుడ్డ సంచి, లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలన్నారు. పారిశుద్ధ్యం పర్యవేక్షణకు ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని, నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్లో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణ శ్రీ, మెప్మా అధికారి గ్రంధి పార్వతి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నాగరాణి -
బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
బలివే(ముసునూరు) : భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్ అన్నారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్కుమార్ అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పంచాయతీరాజ్, పోలీస్శాఖల ఆధ్వర్యంలో భక్తుల స్నానాలు, దైవ దర్శనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూజివీడు, ఏలూరు రహదారుల మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు లేకుండా ఆ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. -
చేపలు, మటన్కు క్యూ
భీమవరం(ప్రకాశం చౌక్): బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూతపడగా.. మిగిలిన ప్రాంతాల్లో చికెన్ కొనేవారు లేక కొనుగోళ్లు పడిపోయాయి. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. మాంసాహారం తినేవారు చికెన్కు ప్రత్యామ్నాయంగా చేపలు, రొయ్యలు, మటన్ వినియోగంపై దృష్టిపెట్టారు. ఫంక్షన్లలో చికెన్కి బదులు చేపలు, మటన్, రొయ్య, పీతలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరిగేవి. రెస్టారెంట్లలో అధికంగా చికెన్ వాడేవారు. ఆదివారం చికెన్ వినియోగం మరింత ఎక్కువ. ప్రస్తుతం బర్డ్ప్లూ కారణంగా రోజుకు కనీసం 500 నుంచి 1000 కిలోలు కూడా అమ్మకాలు జరగడం లేదు. చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల ధరలు భారీగా పెరిగాయి. ఆయా రకం బట్టి కిలో రూ.150 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు చేపలు కిలో రూ.120 నుంచి రూ.140 వరకు పలికేవి. సముద్ర ఉత్పత్తులైన చేపలు, పీతల ధరలు కూడా పెరుగుతున్నాయి. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పెంచి విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు రొయ్యలు కిలో రూ.400 లోపు ఉండేవి. పీతలు నెల ముందు వరకు కిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.1000 ధర పలుకుతున్నాయి. మటన్ మరింత ప్రియం చికెన్ అమ్మకాలు లేకపోవడంతో మటన్ ధరలు దారుణంగా పెంచారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్కు ముందువరకు కిలో మటన్ రూ.800 నుంచి రూ.900 వరకు విక్రయించేవారు. ఇప్పుడు ఏకంగా రూ.1000 నుంచి రూ.1100కి పెంచి అమ్మతున్నారు. బర్డ్ఫ్లూతో తగ్గిన చికెన్ అమ్మకాలు చేపలు కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు పెంపు మటన్ కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంపు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ప్రస్తుత ధర నెలల క్రితం (రూ.లలో) ధర(రూ.లలో) మటన్ 800 1,100 చేప 150 200 రొయ్య 150 – 190 220 – 260 చికెన్ (బాయిలర్) 240 180 చికెన్ (ఫారం కోడి) 180 50 ఏలూరు జిల్లాలో.. మటన్ రూ.800 మార్పు లేదు చికెన్ రూ.240 రూ.150మేకలకు, గొర్రెలకు డిమాండ్ చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో మటన్ అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో మేకలు, గొర్రెలకు డిమాండ్ పెరిగింది. మటన్ వ్యాపారులు, ఫంక్షన్ల కోసం తాడేపల్లిగూడెం మార్కెట్కు వెళ్లి మేకలు, గొర్రెలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లో మేకలు, గొర్రెలకు మంచి డిమాండ్ ఉంది. – ఎస్కే హుస్సేన్, మటన్ వ్యాపారి -
ఆర్డీఓ కార్యాలయం తనిఖీ
తాడేపల్లిగూడెం: రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభల్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను సోమవారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు జేసీ మండలంలోని నవాబుపాలెంలో రీ సర్వే పనులను పరిశీలించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే పనులను నిర్వహించాలన్నారు. గ్రామంలో రికార్డుల ప్రకారం జరుగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలు నివృత్తి చేశారు. రీ సర్వేకు సంబంధించి ముందుగా నోటీసులు అందిస్తున్నారా అని రైతులను అడిగారు. ఆర్డీఓ, జిల్లా రెవిన్యూ అఽధికారి తదితరులు పాల్గొన్నారు. -
గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతు
తణుకు అర్బన్: గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతైన ఘటన తణుకు సజ్జాపురం ప్రాంతంలోని జాతీయరహదారి వంతెన ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం సజ్జాపురంలో నివసిస్తున్న గుమ్మళ్ల శాంతి (48) ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రావడం.. ఆపై కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు సోమవారం ఉదయం నుంచి వెతుకులాట చేపట్టారు. ఈ క్రమంలో ఆమె కాళ్లకు వేసుకునే బూట్లు గోస్తనీ కాలువ వంతెనపై భాగంలోని జాతీయరహదారిపై ఉండడంతో రాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని కుటుంబసభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో గజ ఈతగాళ్లు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ కాలువలో దూకారనే వార్త తెలిసిన సజ్జాపురవాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వంతెన ప్రాంతంలో భారీగా చేరుకుని గుమిగూడారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్ కోచ్గా శాంతి సజ్జాపురం పార్కు ప్రాంతంలో తన ఇద్దరు కుమారులతో కలిసి శాంతి నివసిస్తోంది. భర్త లేకపోవడంతో తన నివాసంలోనే వెల్నెస్ సెంటర్ కోచ్గా ఆమె ఉపాధి పొందుతోంది. శాంతి అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావమని, సామాజిక మాధ్యమాల్లో సైతం రీల్స్ చేస్తూ హుషారుగా ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుమారులిద్దరిలో ఒకరికి వివాహం కూడా అయినట్లు బంధువులు వివరిస్తున్నారు. శాంతి కాలువలో దూకినట్లుగా ఎవరూ చూడకపోవడంతో గోస్తనీ కాలువ వంతెనపై ఉన్న బూట్లు ఆధారంగా మాత్రమే కాలువలో దూకినట్లు అంచనా వేస్తున్నారు. వంతెనపై ఉన్న ఆమె బూట్ల ఆధారంగా గోస్తనీ కాలువలో గాలింపు -
నకిలీ నగలతో ముత్తూట్లో రుణం
సంస్థలో పనిచేసే ఇద్దరిపై కేసు నమోదు ఏలూరు టౌన్: ప్రైవేట్ ఫైనాన్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే నకిలీ నగలు తాకట్టుపెట్టి భారీగా డబ్బులు కాజేశారు. ఈ మోసం బయటపడడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పవర్పేటలో ముత్తూట్ ఫైనాన్స్ పేరుతో బంగారు నగల తాకట్టు దుకాణం ఉంది. ఈ బ్రాంచ్లో ఏలూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరు కొంతకాలం క్రితం ముత్తూట్ ఫైనాన్స్లో నకిలీ నగలను తాకట్టుపెట్టి రూ.12,31,600 రుణంగా తీసుకున్నారు. బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బంది కావడంతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండానే రుణం మంజూరు చేశారు. రెండు రోజుల క్రితం మూత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ ఏలూరులోని పవర్పేట బ్రాంచ్కు వచ్చారు. ఆయన బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు నగలను తనికీ చేశారు. ఈ తనికీల్లో తాకట్టులోని నగలు నకిలీగా నిర్థారించారు. ఈ నగలను తాకట్టు పెట్టిన వ్యక్తుల వివరాలు ఆరా తీయగా బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. దీనిపై రీజనల్ మేనేజర్ రాజేష్ ఏలూరు టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగకళ్యాణి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిచ్చికుక్క దాడి.. 8 మందికి గాయాలు కొయ్యలగూడెం: కన్నాపురంలో పిచ్చికుక్క స్వైర విహారంతో 8 మంది గాయాలపాలయ్యారు. దీంతో గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను వెంటాడి హతమార్చారు. పిచ్చికుక్క మరికొన్ని కుక్కలపై దాడి చేసిందని, ఈ నేపథ్యంలో మిగిలిన కుక్కల పరిస్థితి పట్ల అప్రమత్తతతో ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సూరీడు.. అప్పుడే సుర్రుమంటున్నాడు
నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. సూరీడు సుర్రుమంటూ రానున్న రోజుల్లో తన ప్రతాపం ఎలా ఉండబోతుందోననే హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి మాసం ద్వితీయార్థంలో ఉన్నాము. సాధారణంగా మార్చి చివరివారం నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తాలూకూ ప్రభావం కనిపిస్తోంది. మొన్నటి వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కూడా జిల్లాల్లో మంచు ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ, ఉదయం పూట ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగాయి. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత పెద్దస్థాయిలో ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో ఉండే తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉక్కబోత ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది. తగ్గుతున్న తేమశాతం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా పగటి పూటల్లో గాలిలో తేమశాతం 50 శాతం పైనే నమోదవుతుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతంగా గత 10 రోజులుగా నమోదవుతోంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా ఉమ్మడి పశ్చిమలో అత్యధికంగా 38 నుంచి 41 డిగ్రీలు, అత్యల్పంగా 32 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, ఈ సంవత్సరం వేసవి మొత్తం భానుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు మొన్నటి వరకూ శీతాకాలం. ఇప్పుడు చలిగాలులు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగాలకు మందులు తీసుకుంటున్న వారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవి ప్రారంభంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్న ఎండలు ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల చేరువలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు తేమశాతంలో భారీ హెచ్చుతగ్గులు ఉక్కబోతలు కూడా ప్రారంభం -
రాష్ట్రస్థాయి నెట్బాల్ విజేత ‘పశ్చిమ’
పాలకోడేరు: రాష్ట్రస్థాయి అండర్ 19 బాలబాలికల నెట్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు విజేతగా నిలవగా జిల్లా బాలుర జట్టు తృతీయస్థానం సాధించిందని జిల్లా నెట్ బాల్ సంఘ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్ బాస్కో హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్ 19 బాల బాలికల నెట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. విజేతలకు తూర్పుగోదావరి జిల్లా నెట్ బాల్ సంఘ అధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి, డాన్ బాస్కో హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఐ.బల్కదర్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ పి.దావూద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను పలువురు అభినందించారు. -
ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం. అందులోనూ కాలానుగుణంగా లభించే ఇప్ప పవ్వు అతి ప్రధానమైనది. వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వును గిరిజనులు సేకరిస్తారు. చెట్లపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్ననికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్ప చెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్ప చెట్లు విరగ పూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. ఔషధాల తయారీ గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్ప పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఈ పువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతోపాటు దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధులకు ఔషదంగా పనిచేస్తుంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ఇప్ప పువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఆయుర్వేదంలోనూ మధుక వృక్షం అని పేరుపొందింది. గిరిజన ప్రాంతంలోని ప్రజలు ఈ ఇప్పచెట్లను మాతృమూర్తిగా భావిస్తారు. ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు అడవిలో లభించే ఇప్ప పువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాసీ్త్రయంగా నిరూపించబడింది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్ప పువ్వుల నుంచి పంచదారను తయారు చేసి దీనితో జామ్, కేక్లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. కొందరు గిరిజనులు ఇప్పపువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు. ధరలేక ఇప్ప పువ్వు సేకరణపై తగ్గిన ఆసక్తి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్ప చెట్లు దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్ప చెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్ప పువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుంచి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే సరైన ధర లభించకపోవడంతో కాలక్రమేపీ గిరిజనులు కూడా ఇప్ప పువ్వు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. అలాగే పలుచోట్ల ఇప్ప పువ్వు చెట్లను కూడా నరికివేస్తున్నట్లు సమాచారం. పోషకాలు పుష్కలం.. వైద్య శాస్త్రంలోనూ ప్రాధాన్యత వేసవి నుంచి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి గిట్టుబాటు ధర లేక.. తగ్గుతున్న పువ్వుల సేకరణ జీసీసీ ద్వారా ఇప్ప పువ్వుకొనుగోలు చేయాలని డిమాండ్ సరైన ధర లేక.. సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఇప్ప పువ్వుల సేకరణకు ఆసక్తి చూపడంలేదు. రానురానూ చెట్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను పెంచడంతోపాటు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకులు, అలివేరు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో ఇప్ప పువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్ప పువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా ఇప్ప పువ్వు కొనుగోలు చేయాలి. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, మోదేలు -
వర్గీకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సిద్ధం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ దేశ వ్యాప్తంగా చేయాలి తప్పా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల పరిధిలో చేస్తే ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రావడానికి మాలలే ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మాలలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంద కృష్ణకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. మందకృష్ణ మాత్రం మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ఇతర పక్షాలు గుర్తించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య, ఏపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పాంజలి, మహానంది, శేషు పాల్గొన్నారు. గ్యాస్ లీకై వ్యక్తికి తీవ్ర గాయాలు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కనకాపురంలో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంగారయ్య వంట కోసం గ్యాస్ స్టౌను వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారయ్యను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా గ్యాస్ సిలిండర్ కావడంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్సై నవీన్కుమార్ అక్కడికి చేరుకుని ఆ మంటలను ఆర్పించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం రూరల్: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలివి. ముత్యాలంబాపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు (64) సోమవారం తన మోటారు సైకిల్పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడేపల్లి జాతీయ రహదారిపై ఏపీ 28 టిడి 5445 నెంబరు గల లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడ్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సంజీవరావు కుమారుడు అశోక్ కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సారా తయారీదారుల అరెస్ట్ చాట్రాయి: సారా తయారీదారులను అరెస్ట్ చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఎస్సై మస్తానరావు తెలిపారు. మండలంలోని పోతనపల్లి తండాలో సారా నేరాలకు పాల్పడుతున్న హసావతు బాలరాజు, వడిత్యా బిక్షాలు, ధారావతు శ్రీరాములును అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తిరువూరు కోర్టుకు తరలించినట్లు సోమవారం ఆయన చెప్పారు. -
వెలగలేరులో చోరీ
పెనుమంట్ర: వెలగలేరు శివాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పడాల సూర్యకుమారి వారం రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి వైజాగ్లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానిక బంధువులు సమాచారాన్ని ఆమెకు తెలియజేయడంతో వైజాగ్ నుంచి వచ్చిన ఆమె పెనుమంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీలో ఇరవై మూడున్నర కాసుల బంగారం, రూ.1.80 లక్షల నగదును దొంగలు దోచుకుపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. పెనుమంట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే!
నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ఎంతో కొంత మెరుగ్గా ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోధనేతర ఉద్యోగి వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రానురాను అతని తీరు ట్రిపుల్ ఐటీ అధికారులను సైతం ఇబ్బంది పెట్టేలా పరిణమించడం గమనార్హం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు చెప్పాలని, నేను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలంటూ డైరెక్టర్, ఏవోలకు సైతం హుకుం జారీ చేస్తుండటంతో మిగిలిన ఉద్యోగులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తొలగించాలో కూడా తానే చెప్తానంటూ తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తనకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఇవ్వాలని, సెంట్రల్ డీన్ హోదా ఇవ్వాలని, తన డిజిగ్నేషన్ మార్చాలని, జీతం పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా తనకు లోకేష్ తెలుసని, లోకేష్ టీం తెలుసంటూ ట్రిపుల్ ఐటీలోని అధికారులను బెదిరిస్తూ కర్రపెత్తనం చేస్తుండటం, తనకు నచ్చని వారికి అదనపు బాధ్యతలు ఇస్తే వారిని ఆ బాధ్యతల నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేయడం నిత్యకృత్యంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపైనా వేధింపులు ఒకవైపు అధికారులపై కర్ర పెత్తనం చేస్తుండటంతో పాటు తమకు నచ్చని విద్యార్థులపైనా వేధింపులు చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు తమకు నచ్చిన హీరో ఫొటోనో, నాయకుడి ఫొటోనో ఫోన్లస్టాటస్గా పెట్టుకుంటే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తుండటంపై ట్రిపుల్ ఐటీలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ట్రిపుల్ ఐటీలను స్థాపించి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పలువురు వాపోతున్నారు. ఈ ఉద్యోగితో పాటు కొందరు ప్రభుత్వ అనుకూల వర్గంగా ఏర్పడి తమకు అనుకూలంగా లేని ఉద్యోగులపై ఫిర్యాదులు సైతం చేస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బయటి నుంచి కనబడే శత్రువు కంటే మనలోని కనబడని శత్రువు నుంచే ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటూ ఒక అధికారి పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇంతకీ ఆ బోధనేతర ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి కావడం కొసమెరుపు. కర్ర పెత్తనం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి లోకేష్ టీం పేరుతో బెదిరింపులు ట్రిపుల్ ఐటీలో అధికారులపై ఒత్తిడి విద్యార్థులపై లేనిపోని ఫిర్యాదులు వివాదాస్పదంగా బోధనేతర ఉద్యోగి తీరు -
23 నుంచి శివయ్య కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివయ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 1 వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 10 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 26న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు లింగోధ్భవకాల అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణోత్సవం, ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. వచ్చేనెల 1న ఆలయంలో జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 26న రాత్రి స్వామివారి కల్యాణం -
రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలి. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎంసీఎంసీ కమిటీని నియమించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఈసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎంసీఎంసీ సెల్ను ఏలూరు కలెక్టరేట్లో ఏర్పాటుచేశారు. -
సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
భీమవరం: ఎన్టీపీసీ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంయపియన్షిప్ పోటీల్లో భీమవరం భారతీయ విద్యా భవన్స్ విద్యార్థిని ఎం.సూర్యహంసిని ప్రతిభ చూపిందని కోచ్ కమల్ కిషోర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో హంసిని ఢిల్లీకి చెందిన కుమిత్ సనానిపై గెలిచి బంగారు పతకం సాధించిందన్నారు. హంసినిని స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు అభినందించారు. శ్రీవారి పథకాలకు రూ.7.21 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి పథకాలకు ఒక భక్తుడు ఆదివారం రాత్రి రూ.7.21 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన బొప్పరపు వెంకట లోహిత్ ముందుగా కుటుంబసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.5 లక్షలు, గోసంరక్షణ పథకానికి రూ.2,21,000 వెరసి రూ.7,21,000 జమచేశారు. పెద్దింట్లమ్మా.. కోర్కెలు తీర్చమ్మా కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ భక్తుల కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మకు నైవేద్యాలు, పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, భక్తుల విరాళాలు, వాహన పూజలు ఇలా అన్ని కలిపి రూ.52,396 ఆదాయం వచ్చిందని తెలిపారు. పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం కైకలూరు: గుర్తుతెలియని మృతదేహం శ్యామలాంబపురం శ్మశాన వాటిక సమీప పంట కాల్వలో ఆదివారం కొట్టుకువచ్చింది. వీఆర్వో బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫిర్యాదు మేరకు కై కలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మాట్లాడుతూ మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని చెప్పారు. వివరాలు తెలిస్తే 9440796434, 9440796433 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
మూడు నెలలుగా జీతాల్లేవ్
ఆకివీడు: తమకు మూడు నెలలుగా జీతాలు లే వని పెదకాపవరం పంచాయతీ సిబ్బంది డీపీఓ అరుణశ్రీ వద్ద వాపోయారు. పెదకాపవరంలో పన్ను వసూళ్లపై డీపీఓ ఆదివారం సమీక్షించారు. గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో రూ.20 లక్షలకు పైగా పన్ను బకాయిలు ఉండటంపై సిబ్బందిని నిలదీశారు. వసూళ్లను వేగిరపర్చాలని సూచించారు. ఇటీవల సుమారు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు సర్పంచ్ ఊసల బేబీ స్నేతు డీపీఓకు వివరించారు. ముందుగా డీపీఓ గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఇతర ప్రాంతాల్లో పర్యటించగా తాగునీటి సమస్యను స్థాని కులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. 15 రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని డీపీఓ చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి సోమవారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. డీఎల్పీఓ బాలాజీ ఉన్నారు. -
మామిడి.. తడబడి
కొన్నేళ్లుగా గడ్డుకాలం కొన్నేళ్లుగా మామిడికి గడ్డుకాలం నెలకొంది. పూత వచ్చినా దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడి ఉన్నా మార్కెట్లో సరైన ధర లభించకపోవడం తదితర కారణాలతో రైతులు నష్టపోతున్నారు. తోటల దుక్కి, ఎరువులు, పురుగు మందులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. అలాగే ముదురు తోటలు కావడంతో ఎంత పెట్టుబడి పెట్టినా కాయకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. దీంతో భూములున్నా ఆదాయం లేక అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదికి 4 వేల ఎకరాలు కనుమరుగు ఏడాదికి నూజివీడు డివిజన్లో కనీసం 4 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలను నరికివేస్తున్నారు. పేపర్ తయారీకి మామిడి కలపను వినియోగిస్తుండటంతో ఈ ప్రాంతంలోని ముదురు మామిడి తోటలకు గిరాకీ పెరిగింది. నరికిన తోటల్లో సగం తోటల వరకు మామిడి మొక్కలు వేస్తుండగా, మిగిలిన సగం మాత్రం ఆయిల్పామ్, ఇతర పంటలు సాగుచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. నూజివీడు: మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన నూజివీడు డివిజన్లో ఏటేటా తోటల విస్తీర్ణం తగ్గిపోతోంది. పురుగులు, తెగుళ్లు బెడద ఎక్కువవ్వడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెరసి మామిడి రైతులు ప్రతి ఏటా నష్టాల బాటలోనే పయనిస్తున్నాడు. మామిడి తోట ల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో వాటిని నరికివేస్తున్నారు. ఈ భూముల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటుతున్నారు. మరికొందరు మొక్కజొన్న, పత్తి, మిరప,పొగాకు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసి గ్యారంటీ ఆదాయం పొందుతున్నారు. ఆయిల్పామ్ మొక్క లు నాటినా ఐదేళ్ల వరకు అంతర పంటలుగా మొక్కజొన్న, కూరగాయలు, పుచ్చ, మిర్చి, పత్తి తదితర పంటలను సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మామిడిపై వచ్చే ఆదాయం క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణం వల్ల పూతలు రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, వచ్చిన పూతలను రక్షించుకునేందుకు 12 నుంచి 15 సార్లు రసాయన మందులు పిచికారీ చేయడం, రెండేళ్లుగా నల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువ కావడం, పూర్తిగా మామిడి దిగుబడి పడిపోవడం తదితర కారణాలతో రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రాంతంలో శతాబ్దాల తరబడి సాగులో ఉన్న మామిడి తోటలను తొలగించడానికి ఇష్టం లేకున్నా ఆదాయం రాకపోవడంతో చేసేదేమీ లేక తోటలను నరికి వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పెరిగిన విస్తీర్ణం ఒకప్పుడు మామిడి అంటే నూజివీడు ప్రాంతమే కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు పక్కనే ఉన్న తెలంగాణలో సైతం మామిడి తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో వ్యాపారస్తులు, హైదరాబాద్, గుజరాత్, బరోడా వంటి ప్రాంతాలకు చెందిన మామిడి సేట్లు కాయలను కొనుగోలు చేసేందుకు నూజివీడుకు కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఒకప్పుడు మామిడి మార్కెట్లలోని కమీషన్ వ్యాపారస్తులే మామిడి వ్యాపారస్తులకు పెట్టుబడులు ఇచ్చి తోటలను కొనుగోలు చేయించేవారు. వారి వద్ద నుంచి కమీషన్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతేనే.. నూజివీడు ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలను రైతులు సాగుచేస్తారు. వీటిలో అగ్రభాగం బంగినపల్లి రకం కాగా ఆ తర్వాత తోతాపురి ఉంటుంది. మామిడి తోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో ఉన్నా మామిడి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ లేవు. చిత్తూరు జిల్లాలో దాదాపు 60 వరకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలోని దిగుబడితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా తోతాపురి రకం కా యలు అక్కడి జ్యూస్ ఫ్యాక్టరీలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తారు. మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత కరువు కాగా ఒకప్పుడు మామిడికి పేరెన్నికగన్న నూజివీడు ప్రాంతం ప్రాధాన్యతను కోల్పోతోంది. చేయూత కరువై.. సాగు భారమై.. మామిడి తోటలను నరికివేస్తున్న రైతులు తగ్గుతోన్న తోటల విస్తీర్ణం ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి తోట తొలగించి ఆయిల్పామ్ మొక్కలు వేశా.. మామిడి తోటలు కాపు కాసినా ధర లేక పెట్టుబడులు రాకపోవడం, గాలిదుమ్ములు వచ్చినప్పుడు కాయలు రాలిపోయి నష్టాలు రావడం, పూత వచ్చినా పురుగులు, తెగుళ్ల వల్ల పిందె ఏర్పడకపోవడం వంటి కారణాలతో నష్టాలు వచ్చాయి. దీంతో నాలుగెకరాల్లో మామిడి తోట నరికి వేయించి ఆయిల్పామ్ మొక్కలు వేశా. ఐదేళ్ల వరకూ అందులో అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. – పల్లె రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు మండలం -
విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవాటు చేయాలి
తణుకు అర్బన్: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని అలవాటుచేయాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఆదివారం తణుకు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చిన్ననాటి నుంచే మంచి నడవడిక, పెద్దలతో గౌరవంగా మెలగడం, పోటీతత్వాన్ని అనుకరించేలా చేస్తే భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్) నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందని, ఆ ఒత్తిడిని తట్టుకుని మన పిల్లలు నిలవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్స్తో గడుపుతున్నారని అది ఎంతో నష్టమన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే ప్రముఖ పాత్ర అని, తల్లిదండ్రులనురోల్ మోడల్గా తీసుకుని వారిని అనుకరిస్తారని చెప్పారు. సదస్సుల్లో అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తణుకు కాలేజ్ ప్రిన్సిపాల్ కె.దుర్గాప్రసాద్, తణుకు స్కూలు ఇన్చార్జ్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
చోరీ చేసిన బైక్ల స్వాధీనం
ఏలూరు (టూటౌన్): బైక్ల దొంగతనం కేసును భీమడోలు పోలీసులు ఛేదించారు. డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్ర రావు భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో పొలం కౌలుకు చేస్తున్నాడు. పొలం షెడ్డులో ఉన్న అతని బైక్ చోరీకి గురైంది. దీనిపై భీమడోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ యుజె.విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్, సిబ్బంది ఈ కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు వంగాయగూడెంకు చెందిన వాసే రాజు అలియాస్ సంసోను, భీమడోలుకు చెందిన యర్రంశెట్టి పవన్ కుమార్ను అరెస్టు చేశారు. ముద్దాయిలు ఈ నెల 6న ఏలూరు గంగానమ్మ గుడి సమీపంలో వృద్ధురాలి మెడలోని బంగారు తాడును తెంపుకుపోయారు. వాసే రాజుపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వారి నుంచి మూడు బైక్లు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
గల్లీ నుంచి ఢిల్లీకి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కేఆర్పురం ఐటీడీఏ వద్ద గిరిజన మహిళలు తయారు చేస్తున్న చిరుధాన్యాల మిల్లెట్ బిస్కెట్లు ఢిల్లీలో ఆదిమహోత్సవ్ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో తయారీ చేసిననీ బిస్కెట్లు ఢిల్లీలో విక్రయించే అవకాశం రావడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు గిరిజన మహిళలు ఐటీడీఏ అధికారుల సహకారంతో చిరుధాన్యాలతో గిరి వనిత పేరుతో మిల్లెట్ బిస్కెట్లు తయారీ చేసి కేఆర్పురంలోనే విక్రయాలు ప్రారంభించారు. రాగులు, సజ్జలు, సోయా, పెసలు, అలసందలు, మినుములు, ఓట్స్, బెల్లంతో బిస్కెట్లు తయారు చేయడంతో అందరూ వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. అనతి కాలంలోనే ఈ బిస్కెట్లకు గిరాకీ పెరగడంతో క్రమంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో ఈ బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో కూడా బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్ కంపెనీ ముంబయిలో నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారికి ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ (2025) కార్యక్రమంలో కూడా గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంతో మిల్లెట్ బిస్కెట్ల తయారు చేసే పొట్టోడి బుల్లమ్మకు అక్కడ విక్రయించే అవకాశం లభించింది. జీలుగుమిల్లి మండలంలో ఉన్న నిర్వాసిత గ్రామం కొరుటూరు నుంచి మరో ఇద్దరు ఐటీడీఏ ద్వారా ఢిల్లీలో స్టాల్స్ను ఏర్పాటు చేసి వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఐటీడీఏల పరిధిలో ఎంపిక చేసిన వస్తువులు ఈ స్టాల్స్లో విక్రయిస్తున్నారు. ఆదిమహోత్సవ్లో కేఆర్ పురం ఐటీడీఏ మిల్లెట్ బిస్కెట్ల స్టాల్ -
పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి
కైకలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పిలిచే ఆటపాక పక్షుల విహార కేంద్రం పర్యాటకులతో ఆదివారం సందడిగా మారింది. శీతాకాలపు వలస పక్షుల కేరింతలను ఆస్వాదించడానికి ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు విచ్చేశారు. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టోక్ పక్షుల అందాలను వీక్షించారు. అనంతరం ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను సందర్శించారు. దీని సమీపంలోని చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు వివిధ ఆటలు ఆడుకున్నారు. కోడి పందేలపై దాడి ఉండి: మండలంలోని కలిసిపూడిలో నిర్వహిస్తున్న కోడి పందేలపై ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1600 నగదు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.